England County Cricket
-
కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 33 ఏళ్ల శార్దూల్ 2025-26 కౌంటీ సీజన్ తొలి అర్ద భాగం కోసం ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎసెక్స్తో డీల్లో శార్దూల్ ఏడు మ్యాచ్లు ఆడనున్నాడు. శార్దూల్ కౌంటీల్లో ఆడటం ఇదే తొలిసారి. ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై శార్దూల్ ఆనందం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో ఆడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు.2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శార్దూల్.. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి కారణంగా తరుచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. శార్దూల్ చివరిగా 2023 బాక్సింగ్ డే టెస్ట్లో (సౌతాఫ్రికాతో) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలికాలంలో శార్దూల్ దేశవాలీ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్లో రాణిస్తుండటంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాట్తోనూ సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో శార్దూల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 33 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో పలు అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో ముంబై సెమీస్కు చేరడంలో శార్దూల్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శార్దూల్ విదర్భతో జరుగుతున్న సెమీస్లో పాల్గొంటున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ ఓ వికెట్ తీసి, 37 పరుగులు చేశాడు.కష్టాల్లో ముంబైవిదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (67 నాటౌట్), తనుశ్ కోటియన్ (5) ముంబైను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విదర్భ యువ స్పిన్నర్ పార్థ్ రేఖడే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ షోరే (74), దనిశ్ మలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీతో రాణించారు. శివమ్ దూబే ఐదు వికెట్లతో మెరిశాడు. -
కౌంటీల్లో ఆడనున్న కేన్ మామ
లండన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కౌంటీ జట్టు మిడిలెసెక్స్తో జతకట్టాడు. ఇంగ్లండ్ దేశవాళీ టి20 కౌంటీ చాంపియన్షిప్ ఆడేందుకు రెండేళ్ల పాటు మిడిలెసెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ ‘ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్కు కివీస్ దిగ్గజం సారథ్యం వహిస్తున్నాడు. గతంలో టి20 కౌంటీ చాంపియన్షిప్లో గ్లూసెస్టర్షైర్ (2011–12), యార్క్షైర్ (2013–2018)కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా సీజన్లో బ్లాస్ట్ గ్రూప్లో మిడిలెసెక్స్ తరఫున కనీసం పది మ్యాచ్లు ఆడనున్నాడు. అనంతరం మరో ఐదు కౌంటీ చాంపియన్షిప్ మ్యాచ్ల్లోనూ విలియమ్సన్ బరిలోకి దిగుతాడు.‘గతంలో అడపాదడపా కౌంటీలు ఆడాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సీజన్కు అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. ఈ వెటరన్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 18,000 పైచిలుకు పరుగులు చేశాడు. 47 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 54.88, వన్డేల్లో 49.65, టి20ల్లో 33.44 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్లో సన్రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్ కరీబియన్ లీగ్లో బార్బడోస్ ట్రిడెంట్స్, ఎస్ఏ–20 (సఫారీ లీగ్)లో డర్బన్ సూపర్జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్ జట్టుతో జతకట్టిన కేన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ ఆడనున్నాడు. -
విరాట్ కోహ్లి కీలక నిర్ణయం.. తొలిసారిగా!?
ఫామ్ లేమితో సతమతవుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి తన కెరీర్లో మొదటిసారిగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని కౌంటీల్లో ఆడేందుకు విరాట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అక్కడ పరిస్థితులకు అలావాటు పడేందుకు ముందుగానే కోహ్లి ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కౌంటీల్లో కోహ్లి భాగం కానున్నట్లు పలురిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లికి కౌంటీల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఒకే ఒక సెంచరీ..కాగా కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్సైడ్ బంతులను వెంటాడి తన వికెట్ను కోహ్లి కోల్పోయాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి వన్డే.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లికోహ్లి 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ కోహ్లి మాత్రం తన రిథమ్ను తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతకుతోడు భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రతీ ఒక్క ప్లేయరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా టెస్టు జట్టులో ప్లేయర్లందరూ వీలైతే కచ్చితంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆడాలని సూచించాడు.ఈ క్రమంలోనే కోహ్లి 13 ఏళ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. అతడు చివరగా 2012లో ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా చేజార్చుకుంది. బీజీటీ సిరీస్ భారత్ కోల్పోవడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
ఇంగ్లండ్ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్షైర్ క్లబ్లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుదీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్షైర్ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్ గ్రూప్... వచ్చే రెండేళ్లలో హాంప్షైర్ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్షైర్ క్లబ్కు జీఎంఆర్ గ్రూప్ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు‘హాంప్షైర్ క్లబ్ యజమాని, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్ గ్రూప్కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్షైర్ క్లబ్ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్షైర్ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తెలిపారు.మా లక్ష్యం అదే‘భారత్తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్ ప్రపంచ చాంపియన్లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్ కుమార్ అన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్ గ్రూప్నకు ఐఎల్టి20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లోనూ జీఎంఆర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? -
భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యం: చాహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్షైర్ ప్రాతినిథ్యం వహించిన చాహల్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవలం 4 మ్యాచ్లు మాత్రడే ఆడిన చాహల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. భారత తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాలని చాహల్ భావిస్తున్నాడు.కౌంటీ క్రికెట్ ఆడటం చాలా కష్టం. నా స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం నాకు మంచి అవకాశం లభించింది. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లండ్లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్బాల్తో నా సత్తా ఎంటో సెలక్టర్లకు తెలియజేయాలనకున్నాను. నాకు కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్కి ధన్యవాదాలు. ఆపై రాజస్తాన్ రాయల్స్ కోచ్లు సైతం నాకు ఎంతో సహాయం చేశారు. భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్కు సై!
ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్ (డివిజన్ 2)లో భారత లెగ్స్పిన్నర్ యుజువేంద్ర చహల్ సత్తా చాటాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో నార్తాంప్టన్ జట్టుకు ఆడుతున్న అతడు.. వరుసగా రెండో మ్యాచ్లోనూ అతను 9 వికెట్లతో చెలరేగడం విశేషం. చహల్ అద్భుత ప్రదర్శన కారణంగా మూడు రోజుల మ్యాచ్లో నార్తాంప్టన్ 9 వికెట్ల తేడాతో లీసెస్టర్షైర్ను చిత్తు చేసింది.చహల్ @9కాగా రెండో ఇన్నింగ్స్లో లీసెస్టర్ 316 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో చహల్ 5 వికెట్ల పడగొట్టి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. అంతకు ముందు... తొలి ఇన్నింగ్స్లో అతడు 4 వికెట్లతో మెరిశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన నార్తాంప్టన్ ముందు.. లీసెస్టర్షైర్ 137 పరుగుల లక్ష్యం విధించింది. ఈ క్రమంలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి నార్తాంప్టన్ ఈ స్కోరును ఛేదించింది. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్లో విఫలమైన మరో భారత ఆటగాడు పృథ్వీ షాకు ఈ మ్యాచ్లో నార్తాంప్టన్ తుది జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ గడ్డపై చహల్ జోరుఅంతకు ముందు డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లోనూ చహల్ తొమ్మిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా... ఇంగ్లండ్ వన్డే కప్లోనూ చహల్ తనదైన ముద్ర వేశాడు. నార్తంప్టన్షైర్ తరఫున ఆడిన తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.జట్టును వీడిన చహల్నార్తాంప్టన్ తరఫున నాలుగు కౌంటీ మ్యాచ్లు ఆడిన చహల్ మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 18 వికెట్లు ఆఖరి రెండు మ్యాచ్లలో తీయడం విశేషం. తదుపరి అతడు బంగ్లాదేశ్తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్లో పాల్గొనే అవకాశం ఉంది.చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి100 | Five for Yuzi Chahal! 5️⃣Scott Currie's magnificent innings ends on 120 as he feathers behind to McManus.Leicestershire 303/9, leading by 123.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/OM8MMYY0O3— Northamptonshire CCC (@NorthantsCCC) September 19, 2024 -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్లో..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్లో చహల్ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. లీసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్కు ముందు డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు) మెరిశాడు.అంతకుముందు ఇంగ్లండ్ వన్డే కప్లోనూ చహల్ చెలరేగాడు. నార్తంప్టన్షైర్ తరఫున తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్ రాకతో నార్తంప్టన్షైర్ ఫేట్ మారిపోయింది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్ నార్తంప్టన్షైర్ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 మ్యాచ్ల్లో భాగంగా లీసస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో నార్తంప్టన్షైర్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్తో పాటు రాబ్ కియోగ్ (3/20), జాక్ వైట్ (2/16), సాండర్సన్ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 203 పరుగులకు ఆలౌటైంది. లీసెస్టర్ ఇన్నింగ్స్లో బుడింగర్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్ (32), రెహాన్ అహ్మద్ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్షైర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: భారత్పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు! -
ఒకే ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్
కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్ రెచ్చిపోయాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1 పోటీల్లో భాగంగా లాంకాషైర్తో జరిగిన మ్యాచ్లో డర్హమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్స్ ఒకే ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పాట్స్ చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్లో డర్హమ్ ఇన్నింగ్స్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో పాట్స్ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 9) పడగొట్టాడు. 25 ఏళ్ల పాట్స్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 8 టెస్ట్ల్లో 28 వికెట్లు.. 4 వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హర్స్ట్ 90 పరుగులతో రాణించాడు. డర్హమ్ బౌలర్లలో బెన్ రెయిన్ 5, మాథ్యూ పాట్స్ 3, బాస్ డి లీడ్ ఓ వికెట్ పడగొట్టారు.బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీడేవిడ్ బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీతో (279), అకెర్మన్ (186) భారీ సెంచరీతో చెలరేగడంతో డర్హమ్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. లాంకాషైర్ బౌలర్లలో వెల్స్ 4, ఫిలిప్ 2, బెయిలీ, థామస్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు.తొమ్మిది వికెట్లు పడగొట్టిన పాట్స్345 పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లాంకాషైర్.. మాథ్యూ పాట్స్ తొమ్మిది వికెట్లతో చెలరేగడంతో ఈ ఇన్నింగ్స్లోనూ తక్కువ స్కోర్కే ఆలౌటైంది. పాట్స్ ధాటికి లాంకాషైర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 282 పరుగులకు చాపచుట్టేసింది.చదవండి: తొమ్మిది వికెట్లు తీసిన చహల్ -
తొమ్మిది వికెట్లు తీసిన చహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో నార్తంప్టన్షైర్కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్.. డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్షైర్ డెర్బీషైర్పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బీషైర్.. చహల్ (5/45), రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్షైర్54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్షైర్ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్ కియోగ్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్, జాక్ మార్లీ చెరో 3, హ్యారీ మూర్ 2, జాక్ చాపెల్, థాంప్సన్ తలో వికెట్ పడగొట్టారు.టార్గెట్ 266266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్ను రాబ్ కియోగ్ (5/44), చహల్ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో వేన్ మాడ్సన్ (48 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన పృథ్వీ షాఈ మ్యాచ్లో నార్తంప్టన్షైర్ ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్లో రెండు పరుగులకు ఔటయ్యాడు.చదవండి: ఐదేసిన చహల్ -
ఐదేసిన చహల్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా డెర్బీషైర్తో జరుగుతున్న మ్యాచ్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఐదు వికెట్ల ఘనతతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో చహల్ ఈ ఫీట్ను సాధించాడు. చహల్తో పాటు రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) వికెట్లు తీయడంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.FIVE-WICKET HAUL FOR YUZI CHAHAL...!!!! 👌Chahal took 5 wickets for 45 runs in County against Derbyshire, What a spell by the Champion of India. pic.twitter.com/1IzH2xow0W— Johns. (@CricCrazyJohns) September 10, 2024అంతకుముందు నార్తంప్టన్షైర్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రెండు ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ అయిన పృథ్వీ షాఈ మ్యాచ్లో నార్తంప్టన్షైర్ ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్లో రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆట రెండో రోజు రెండో సెషన్ సమయానికి నార్తంప్టన్షైర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. షా, ప్రాక్టర్ (2) ఔట్ కాగా.. గస్ మిల్లర్ (15), జేమ్స్ సేల్స్ (7) క్రీజ్లో ఉన్నారు.అరంగేట్రంలోనూ ఐదేసిన చహల్చహల్ గత నెలలో జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్షైర్ తరఫున తన తొలి మ్యాచ్లో కెంట్పై ఈ ఫీట్ను సాధించాడు. ఆ మ్యాచ్లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తన జట్టు కెంట్పై ఘన విజయం సాధించింది. చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. -
సెంచరీతో కదంతొక్కిన రహానే
ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే సెంచరీతో (192 బంతుల్లో 102; 13 ఫోర్లు, సిక్స్) కదంతొక్కాడు. ఈ టోర్నీలో లీసెస్టర్షైర్కు ఆడుతున్న రహానే.. గ్లామోర్గన్తో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో తన జట్టు కష్టాల్లో (73/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన రహానే.. సహచరుడు పీటర్ హ్యాండ్స్కోంబ్తో (126 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. రహానే, హ్యాండ్స్కోంబ్ సెంచరీలతో కదంతొక్కడంతో లీసెస్టర్షైర్ 6 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.40వ శతకంఈ మ్యాచ్లో రహానే చేసిన సెంచరీ అతనికి ఫస్ట్ కెరీర్లో 40వది. రహానే ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 40 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీల సాయంతో 13,387 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రహానే 1600 ఫస్ట్ క్లాస్ బౌండరీల మార్కును కూడా అందుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లోనూ రాణించిన రహానే ఈ మ్యాచ్లో రహానే తొలి ఇన్నింగ్స్లోనూ రాణించాడు. 67 బంతుల్లో 6 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. రహానేతో పాటు హ్యాండ్స్కోంబ్ కూడా ఓ మోస్తరు స్కోర్ (46) చేయడంతో లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులు చేసింది.ఇంగ్రామ్ భారీ డబుల్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గ్లామోర్గన్.. కొలిన్ ఇంగ్రామ్ భారీ డబుల్ సెంచరీతో (257 నాటౌట్) విరుచుకుపడటంతో 9 వికెట్ల నష్టానికి 550 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.కాగా, నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి లీసెస్టర్షైర్ 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యాండ్స్కోంబ్, లియామ్ ట్రెవస్కిస్ (8) క్రీజ్లో ఉన్నారు. లీసెస్టర్షైర్ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. -
చహల్ మాయాజాలం.. తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. ఈ కౌంటీ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కెంట్తో ఇవాళ (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్లో చహల్ ఈ ఘనత సాధించాడు. చహల్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. చహల్ 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. చహల్తో పాటు జస్టిన్ బ్రాడ్ (6.1-1-16-3), లూక్ ప్రోక్టర్ (10-2-25-2) కూడా రాణించడంతో కెంట్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున జేడెన్ డెన్లీ (22), ఏకాంశ్ సింగ్ (10), మ్యాట్ పార్కిన్సన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. YUZI CHAHAL SHOW: 10-5-14-5. ⭐ pic.twitter.com/byxSVc404X— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024అనంతర 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ 14 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పృథ్వీ షా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. జేమ్స్ సేల్స్ 33, జార్జ్ బార్లెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. బేయర్స్ స్వేన్పోయెల్కు పృథ్వీ షా వికెట్ దక్కింది. కాగా, చహల్ ఈ మ్యాచ్తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు ఆడేందుకు నార్తంప్టన్షైర్తో ఒప్పందం చేసుకున్నాడు. నార్తంప్టన్షైర్ ఈ మ్యాచ్లో గెలిచినా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించలేదు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్లో గ్రూప్ దశ మ్యాచ్లు ఇవాల్టితో ముగుస్తాయి. ఆగస్ట్ 16న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, సెప్టెంబర్ 22న ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. -
కౌంటీల్లో ఆడనున్న చహల్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తంప్టన్షైర్ కౌంటీ యుజీతో ఓ వన్డే కప్ మ్యాచ్, ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ల కోసం ఒప్పందం చేసుకుంది. త్వరలో యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్ హెడ్ కోచ్ జాన్ సాడ్లర్ తెలిపాడు. చహల్ గత సీజన్లో కూడా కౌంటీల్లో ఆడాడు. 2023 సీజన్లో అతను కెంట్కు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో చహల్ కౌంటీల్లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. చహల్ తదుపరి భారత్ ఆడబోయే బంగ్లాదేశ్ సిరీస్కు అందుబాటులో ఉంటాడు. ఈ గ్యాప్లో మాత్రమే అతను కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు.Northamptonshire has signed Indian leg-spinner Yuzvendra Chahal for the remainder of the 2024 County Championship and One Day Cup season. pic.twitter.com/XQUcyv02sN— CricTracker (@Cricketracker) August 14, 2024ఇదిలా ఉంటే, చహల్కు గత కొంతకాలంగా ఏ ఫార్మాట్లోనూ అవకాశాలు రాని విషయం తెలిసిందే. కుల్దీప్, అక్షర్, రవి భిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఛాన్స్లు కొట్టేస్తున్నారు. వీరందరికీ బ్యాట్తోనూ సత్తా చాటే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లు వీరివైపు మొగ్గు చూపుతున్నారు. చహల్ ప్రస్తుతం ఐపీఎల్కు మాత్రమే పరిమితమయ్యాడు. 34 ఏళ్ల చహల్ ఐపీఎల్లో 160 మ్యాచ్ల్లో 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. చహల్ ఈ ఏడాడంతా ఒక్క వన్డే కానీ టీ20 కానీ ఆడలేదు. చహల్ ఇప్పటివరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడి 217 వికెట్లు పడగొట్టాడు. త్వరలో బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్లో కూడా చహల్కు అవకాశం దక్కడం అనుమానమే. దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటితే తప్ప సెలెక్టర్లు ఇతనివైపు చూసే అవకాశం లేదు. -
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
ఇంగ్లండ్ దేశీవాళీ వన్డే కప్-2024లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాడ్లెట్ క్రికెట్ క్లబ్ వేదికగా మిడిలెక్స్తో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన పృథ్వీ షా.. మిడిలెక్స్తో మ్యాచ్లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 58 బంతులు ఎదుర్కొన్న షా.. 12 ఫోర్లు, ఒక సిక్స్తో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పృథ్వీతో పాటు గాస్ మిల్లర్(73), జైబ్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పృథ్వీ షా విషయానికి వస్తే.. దాదాపుగా మూడేళ్ల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యల కారణంగా భారత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశీవాళీ క్రికెట్లో కూడా తన మార్క్ను చూపించడంలో షా విఫలమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ తరపున షా 8 ఇన్నింగ్స్లలో 198 పరుగులు మాత్రమే చేశాడు. 10.5 | That's 50 for Prithvi Shaw! 👏The opener brings up his half-century off 33 balls.Steelbacks 75/2.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/JlIYPxjAjl— Northamptonshire Steelbacks (@NorthantsCCC) July 29, 2024 -
వెంకటేశ్ అయ్యర్ కీలక నిర్ణయం
టీమిండియా ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంకాషైర్ జట్టుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటిఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2021లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన వెంకీ.. గత నాలుగు సీజన్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన ఈ ఇండోర్ క్రికెటర్.. ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటాడు.సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఈ మ్యాచ్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్ను చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు.. కానీఐపీఎల్లో సత్తా చాటుతున్న సమయంలో(2021)నే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు వెంకీ. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.టీమిండియా తరఫున ఇంత వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో వెంకీకి అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా అతడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.రీఎంట్రీపై దృష్టిఐపీఎల్-2024లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. రీఎంట్రీపై కన్నేశాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో(ఫస్ట్క్లాస్)నూ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదువారాల పాటు లంకాషైర్తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అనంతరం భారత్కు తిరిగి వచ్చి దులిప్ ట్రోఫీలో భాగం కానున్నాడు.కౌంటీల్లో ఆడటం గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘లంకాషైర్ గొప్ప చరిత్ర ఉన్న జట్టు. ఫారూఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్కు ఆడారు. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలో చేరబోతున్నా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్గా మారిన హార్దిక్ పాండ్యా -
కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్.. ఒక్క బంతి, ఒక్క పరుగు, ఒక్క వికెట్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో భాగంగా గ్లామోర్గన్, గ్లోసెస్టర్షైర్ మధ్య జరిగిన మ్యాచ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్గా నిలిచిపోనుంది. ఈ మ్యాచ్లో గ్లామోర్గన్ గెలుపుకు చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. ఇలాంటి ఉత్కంఠ సందర్భంలో వికెట్కీపర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది.MATCH OF THE COUNTY HISTORY.- Glamorgan needs 1 run to win.- One wicket left. - One ball left. Then the wicket-keeper took a Blinder without gloves and the match ended in a tie. 🥶🔥 pic.twitter.com/YtKIDsU00F— Johns. (@CricCrazyJohns) July 3, 2024వివరాల్లోకి వెళితే.. గ్లోసెస్టర్షైర్ నిర్ధేశించిన 593 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 592 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా.. అజిత్ డేల్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమ్స్ బ్రేసీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేమీ మెకిల్రాయ్ ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లోసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 610 పరుగులు చేయగా.. గ్లామోర్గన్ తొలి ఇన్నింగ్స్లో 197, రెండో ఇన్నింగ్స్లో 592 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో మార్నస్ లబూషేన్ (119), సామ్ నార్త్ఈస్ట్ (187) అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి గ్లామోర్గన్ను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చారు. అయితే వికెట్కీపర్ జేమ్స్ బ్రేసీ నమ్మశక్యం కానీ రీతిలో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని గ్లామోర్గన్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది.ఈ మ్యాచ్లో గ్లామోర్గన్ గెలిచి ఉంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఛేదనగా రికార్డుల్లోకెక్కేది. ఛేదనలో గ్లామోర్గన్ చేసిన 592 పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాలుగో ఇన్నింగ్స్లో మూడో అత్యధిక స్కోర్గా రికార్డైంది. -
7 వికెట్లతో చెలరేగిన అండర్సన్.. ఇక విండీస్కు చుక్కలే!
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలకనున్నాడు. అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్షిప్లో లాంక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్హమ్షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆండర్సన్కు వరల్డ్క్రికెట్లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్గా 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. -
ఆల్ టైమ్ రికార్డు.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 20 ఫోర్లు, 21 సిక్సర్లతో..!
కౌంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా ససెక్స్తో జరిగిన మ్యాచ్లో లీసెస్టర్షైర్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం 100 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. గతంలో (2016) ఈ రికార్డు గ్లామోర్గన్ ఆటగాడు అనెరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది. డొనాల్డ్ డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా డొనాల్డ్ రికార్డును కింబర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కింబర్ 127 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు.ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ..ససెక్స్పై కింబర్ చేసిన డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. ఈ ఫార్మాట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీగుల్లా పేరిట ఉంది. షఫీగుల్లా 2018లో కాబుల్ రీజియన్ తరఫున ఆడుతూ బూస్ట్ రీజియన్పై కేవలం 89 బంతుల్లోనే డబుల్ బాదాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టాప్-5 వేగవంతమైన డబుల్ సెంచరీలు..షఫీగుల్లా - 89 బంతులు, కాబూల్ రీజియన్ vs బూస్ట్ రీజియన్, 2018లూయిస్ కింబర్ - 100 బంతులు, లీసెస్టర్షైర్ vs ససెక్స్, 2024తన్మయ్ అగర్వాల్ - 119 బంతులు, హైదరాబాద్ vs అరుణాచల్, 2024రవిశాస్త్రి - 123 బంతులు, బాంబే vs బరోడా, 1985అనెరిన్ డోనాల్డ్ - 123 బంతులు, గ్లామోర్గాన్ vs డెర్బీషైర్, 2016ఈ మ్యాచ్లో కింబర్ మరో ఆల్ టైమ్ కౌంటీ క్రికెట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కింబర్ కొట్టిన సిక్సర్లు (21) కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా రికార్డయ్యాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (17 సిక్సర్లు) పేరిట ఉంది.కౌంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు సాధించిన టాప్-4 ఆటగాళ్లు..21 - లూయిస్ కింబర్ vs ససెక్స్, 202417 - బెన్ స్టోక్స్ vs వోర్సెస్టర్షైర్, 202216 - ఆండ్రూ సైమండ్స్ vs గ్లామోర్గాన్, 199516 - గ్రాహం నేపియర్ vs సర్రే, 2011ఈ మ్యాచ్లో మరో ఆల్టైమ్ కౌంటీ రికార్డు కూడా నమోదైంది. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఆల్టైమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రాబిన్సన్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-3 బౌలర్లు...ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 2024అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 1998షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024ఈ మ్యాచ్లో కింబర్ మెరుపు డబుల్ సెంచరీతో విరుచుకుపడినా అతని జట్టు లిసెస్టర్షైర్ ఓటమిపాలవడం కొసమెరుపు. 464 పరుగుల లక్ష్య ఛేదనలో లీసెస్టర్షైర్ 446 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!
ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్షిప్ 134 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు.కాగా కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా లీసస్టర్షైర్- ససెక్స్ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ బుధవారంతో ముగిసింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా రాబిన్సన్ బౌలింగ్లో లీసస్టర్షైర్ వికెట్ కీపర్ బ్యాటర్ లూయీస్ కింబర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1బ్రిగ్టన్లోని హోవ్ గ్రౌండ్లో ఓలీ రాబిన్సన్ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకుని బ్యాట్తో అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 43 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1 రన్స్ స్కోరు చేశాడు.ఈ ఓవర్లో రెండో బంతి నో బాల్ కాగా.. తదుపరి మూడు డెలివరీల్లో 4, 6, 4 పరుగులు రాబట్టిన లూయీస్ కింబర్.. ఐదో బంతి మళ్లీ నోబాల్గా పడగా.. ఆ తర్వాతి డెలివరీని మళ్లీ ఫోర్గా మలిచాడు. ఆ తర్వాత మళ్లీ నో బాల్ పడటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్స్ కొట్టాడు.అయితే, చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. అలా ఒకే ఓవర్లో మొత్తంగా 43 రన్స్ రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో కింబర్ 127 బంతుల్లోనే 243 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. అయితే, లీసస్టర్షైర్ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ససెక్స్ 18 పరుగుల తేడాతో గెలిచింది. కాగా రాబిన్సన్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 20 టెస్టులాడి 76 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు1. ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 20242. అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 19983. షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024.LOUIS KIMBER HAS TAKEN 43 OFF AN OVER pic.twitter.com/kQ4cLUhKN9— Vitality County Championship (@CountyChamp) June 26, 2024 -
ఒకే ఓవర్లో 38 పరుగులు
ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కౌంటీ క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్లో వార్సెస్టర్షైర్కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.బషీర్ వేసిన ఇన్నింగ్స్ 128వ ఓవర్లో సర్రే బ్యాటర్ డాన్ లార్సెన్ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్లో 38 పరుగులు వచ్చాయి. కౌంటీ చరిత్రలో ఓ సింగిల్ ఓవర్లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్లో అలెక్స్ ట్యూడర్ కూడా ఓ ఓవర్లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్ బౌలింగ్లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 34 పరుగులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వార్సెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్ చేసింది. డాన్ లారెన్స్ (175) భారీ సెంచరీతో.. డామినిక్ సిబ్లీ (76), జేమీ స్మిత్ (86), బెన్ ఫోక్స్ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్లో 490 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్సెస్టర్షైర్ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్ లిబ్బీ (61), బెన్ అల్లీసన్ (19) క్రీజ్లో ఉన్నారు. -
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ ప్రస్తుత సీజన్లో ససెక్స్ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్గా 65వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్షిన్ డివిజన్-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.పుజారాతో పాటు కెప్టెన్ జాన్ సింప్సన్ (167) శతక్కొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్లో టామ్ హెయిన్స్ (40), డానీ లాంబ్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్సెక్స్ బౌలర్లలో బాంబర్ 3, బ్రూక్స్, హోల్మన్ తలో 2, ర్యాన్ హిగ్గిన్స్, నాథన్ ఫెర్నాండెజ్ చెరో వికెట్ పడగొట్టారు. PUJARA SMASHED HIS 65th FIRST-CLASS HUNDRED 🤯 💥- An all time legend, Puj. pic.twitter.com/dXSbmUDvJb— Johns. (@CricCrazyJohns) May 25, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిడిల్సెక్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సామ్ రాబ్సన్ (40), మ్యాక్స్ హోల్డన్ (18) క్రీజ్లో ఉండగా.. మార్క్ స్టోన్మన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్సెక్స్ ససెక్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది. -
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
సన్రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 10 నుంచి గ్లోసెస్టర్షైర్తో జరుగబోయే మ్యాచ్లో సిద్దార్థ్ నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్ను నార్తంప్టన్షైర్ ఎంపిక చేసుకుంది. 33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గత సీజన్లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో కేకేఆర్కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్డెవిల్స్కు.. 2016-2021 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. సన్రైజర్స్కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్లో పంజాబ్కు ఆడే సిద్దార్థ్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్లో 55 మ్యాచ్లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. -
శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి, భారత్ తరఫున సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడి కనుమరుగైపోయిన కరుణ్ నాయర్.. ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో ఇరగదీస్తున్నాడు. భారత దేశవాలీ క్రికెట్లో సొంత జట్టు కర్ణాటక కాదనుకుంటే విదర్భకు వలస వెళ్లి, అక్కడ కెరీర్ పునఃప్రారంభించిన నాయర్.. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను కాదనుకున్న వారికి బ్యాట్తో సమాధానం చెప్పాడు. HUNDRED FOR KARUN NAIR....!!! Northamptonshire under big trouble with 151 for 6, against an attack led by Roach - Karun smashed a brilliant hundred in his 2nd match of the season. pic.twitter.com/JcJKDxu9bb — Johns. (@CricCrazyJohns) September 20, 2023 ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్షిప్లో నార్తంప్టన్షైర్కు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న నాయర్.. తానాడిన తొలి మ్యాచ్లో (వార్విక్షైర్) అర్ధసెంచరీ (78), రెండో మ్యాచ్లో ఏకంగా అజేయ సెంచరీ (144 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శనతో అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న నాయర్.. తన మనసులోని మాటను ఇటీవలే ట్విటర్ వేదికగా బహిర్గతం చేశాడు. డియర్ క్రికెట్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ నాయర్ తనలోని అంతర్మథనానికి వెల్లగక్కాడు. ప్రస్తుత కౌంటీ సీజన్లో నార్తంప్టన్షైర్ తరఫున కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్న నాయర్.. తాజాగా ప్రదర్శనతో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. A fantastic century by Karun Nair in the County Championship. pic.twitter.com/JwtbAkSOHX — Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 టెస్ట్ల్లో టీమిండియాను మిడిలార్డర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నాయర్ ప్రదర్శనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి. నాయర్.. సుదీర్ఘ ఫార్మాట్తో పాటు పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన కర్ణాటక టీ20 టోర్నీలో (మహారాజా ట్రోఫీ) అతను 12 మ్యాచ్ల్లో 162.69 స్ట్రయిక్రేట్తో ఏకంగా 532 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. గుల్భర్గా మిస్టిక్స్తో జరిగిన మ్యాచ్లో 40 బంతుల్లో అతను చేసిన సెంచరీ టోర్నీ మొత్తానికే హైలైట్గా నిలిచింది. భారత్ తరఫున 6 టెస్ట్లు, 2 వన్డేలు ఆడిన నాయర్.. మొత్తంగా 420 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. 31 ఏళ్ల నాయర్ తన అంతర్జాతీయ కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) కావడం విశేషం. -
బ్యాట్తో విజృంభించిన ఉమేశ్ యాదవ్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో బంతితో కాకుండా బ్యాటింగ్లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 ఉమేశ్తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఎసెక్స్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
పుజారాపై సస్పెన్షన్ వేటు
భారత టెస్ట్ ఆటగాడు, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం జట్టు కెప్టెన్ అయిన పుజారాపై పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్షిప్ అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్లో ఓ జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్లో ససెక్స్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది. టోర్నీ తొలి లెగ్లో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో మరో రెండు పెనాల్టీలను పొంది, మొత్తంగా 12 డీమెరిట్ పాయింట్లను పొందింది. పుజారాపై సస్పెన్షన్ను ససెక్స్ అధికారులు ఎలాంటి వాదనలు లేకుండా స్వీకరించారు. ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ససెక్స్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో కెప్టెన్ పుజారా బాధ్యుడయ్యాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్ హెయిన్స్, జాక్ కార్సన్లపై ససెక్స్ అధికారులు తదుపరి మ్యాచ్కు వేటు వేశారు. విచారణ అనంతరం కార్వెలాస్పై కూడా చర్యలు ఉంటాయని వారు తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్షిప్లో ససెక్స్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కౌంటీ డివిజన్ 2 పోటీల్లో భాగంగా ససెక్స్ సెప్టెంబర్ 19-22 వరకు డెర్బీషైర్తో తలపడాల్సి ఉంది. అనంతరం సెప్టెంబర్ 26న గ్లోసెస్టర్షైర్ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లతో ప్రస్తుత సీజన్ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డర్హమ్ లీడింగ్లో ఉంది. ఆ జట్టు 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్లో ససెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్షైర్ ఇన్నింగ్స్లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి కీలక నిర్ణయం.. ఇకపై ఇంగ్లండ్లో
టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్ల్లో నార్తాంప్టన్షైర్కు కరుణ్ నాయర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్మన్ స్థానంలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్షైర్ జట్టుతో నాయర్ చేరాడు. ఆదివారం వార్విక్షైర్తో జరిగే మ్యాచ్తో నాయర్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి.. 2016లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన నాయర్.. అరంగేట్ర సిరీస్లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్-2023లో హ్యాంప్షైర్ జట్టు ఫైనల్కు చేరుకుంది. వార్విక్షైర్తో ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళే జరుగుతున్న మరో సెమీఫైనల్లో గ్లోసెస్టర్షైర్-లీసెస్టర్షైర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో విజేత సెప్టెంబర్ 16న జరిగే ఫైనల్లో హ్యాంప్షైర్తో తలపడుతుంది. చెలరేగిన లియామ్ డాసన్.. వార్విక్షైర్తో జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్షైర్ బౌలింగ్ ఆల్రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. డాసన్ తన స్పిన్ మాయాజాలంతో వార్విక్షైర్ను కుప్పకూల్చాడు. డాసన్ తాను వేసిన తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో అతను 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి, హ్యాంప్షైర్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనికి పేసర్ కీత్ బార్కర్ (7-1-28-3) తోడవ్వడంతో వార్విక్షైర్ కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది.వార్విక్షైర్ ఇన్నింగ్స్లో బర్నార్డ్ (26), సామ్ హెయిన్ (33 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. వార్విక్షైర్ ఇన్నింగ్స్లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. వీరితో ముగ్గురిని డాసన్ ఔట్ చేశాడు. రాణించిన మిడిల్టన్.. 94 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్షైర్.. కేవలం 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్ ఫ్లెచా మిడిల్టన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్ ప్రెస్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ నిక్ గబ్బన్స్ 9 పరుగులు చేసి లింటాట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హ్యాంప్షైర్ గిబ్బన్స్ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, 33 లియామ్ ఏళ్ల డాసన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడి 18 వికెట్లు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్లో. మరోవైపు ఇంగ్లండ్లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
భీకర ఫామ్లో ఉన్న పృథ్వీ షాకు గాయం.. అర్ధాంతరంగా నిష్క్రమణ
టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్షైర్ స్టార్ ఆటగాడు పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా నిష్క్రమించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు సుడిగాలి సెంచరీ చేసి భీకర ఫామ్లో ఉండిన షా.. డర్హమ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ముందుగా అనుకున్న దాని కంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు. నార్తంప్టన్ యాజమాన్యం షాను అయిష్టంగా జట్టును నుంచి రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది నిజంగా బాధాకరం.. రాయల్ లండన్ వన్డే కప్ తదుపరి మ్యాచ్లకు పృథ్వీ షా అందుబాటులో ఉండడు. డర్హమ్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ షా గాయపడ్డాడు. ఈ టోర్నీలో లిడింగ్ రన్ స్కోరర్ (4 మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ సాయంతో 429 పరుగులు) అయిన షా జట్టులో లేకపోవడం పూరించలేని లోటు. స్కాన్ రిపోర్ట్ల్లో షాకు తగిలిన గాయం చాలా తీవ్రమైందని తెలిసింది. షా త్వరలో లండన్లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్ను కలుస్తారు. అతి తక్కువ వ్యవధిలో షా నార్తంప్టన్షైర్పై తీవ్ర ప్రభావం చూపాడు అంటూ ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ ట్వీట్లో రాసుకొచ్చాడు. This one hurts. 😢 Prithvi Shaw has been ruled out of the remainder of his Steelbacks stint. 😔 pic.twitter.com/8XWLfrlxAY — Northamptonshire CCC (@NorthantsCCC) August 16, 2023 ఇదిలా ఉంటే, రాయల్ లండన్ వన్డే కప్-2023తో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. నార్తంప్టన్షైర్ తరఫున అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడి నుంచి షా సుడి తిరిగింది. ఆగస్ట్ 9న సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఆతర్వాత ఆగస్ట్ 13న డర్హమ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. భీకర ఫామ్లో ఉండిన షా ఈ టోర్నీలో మరిన్న అద్భుతాలు చేస్తాడనుకున్న తరుణంలో అనూహ్యంగా గాయపడటంతో నార్తంప్టన్ యాజమాన్యంతోపాటు షా అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రదర్శనలతో షా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంగా గాయం షా కెరీర్ను మరో నాలుగు మెట్లు వెనక్కు వేసేలా చేసింది. ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు షాను ఆసియా కప్కు కాని, వన్డే వరల్డ్కప్కు కాని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. డబుల్ సెంచరీ మరువక ముందే సుడిగాలి శతకం
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా మరో సెంచరీ బాదాడు. నాలుగు రోజు కిందట (ఆగస్ట్ 9) సోమర్సెట్పై విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఇవాళ (ఆగస్ట్ 13) డర్హమ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. నార్తంప్టన్షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. Prithvi Shaw is in red-hot form in the One-Day Cup tournament in England. pic.twitter.com/pVIQwbOewJ — CricTracker (@Cricketracker) August 13, 2023 చెలరేగిన లూక్ ప్రాక్టర్.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ లూక్ ప్రాక్టర్ (9-0-34-4) ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. ప్రాక్టర్తో పాటు జేమ్స్ సేల్స్ (8-1-31-2), కియోగ్ (5.2-0-35-2), జాక్ వైట్ (10-0-49-1), కెర్రిగన్ (4-0-22-1) కూడా రాణించడంతో డర్హమ్ జట్టు పేకమేడలా కూలింది. డర్హమ్ ఇన్నింగ్స్లో ట్రెవాస్కిస్ (37), అలెక్స్ లీస్ (34), బుష్నెల్ (32), బోర్త్విక్ (20), ప్రిటోరియస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. PRITHVI SHOW in One-day cup🔥 @PrithviShaw pic.twitter.com/GxY9uyrlUl — CricTracker (@Cricketracker) August 13, 2023 విధ్వంసకర డబుల్ సెంచరీని మరువక ముందే.. 199 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ను ఓపెనర్ పృథ్వీ షా మెరుపు శతకం బాది ఒంటిచేత్తో గెలిపించాడు. సోమర్సెట్పై చేసిన ద్విశతకాన్ని మరువక ముందే షా మరో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. షాకు రాబ్ కియోగ్ (42) సహకరించగా.. ఎమిలియో గే (17), సామ్ వైట్మన్ (4), లూక్ ప్రాక్టర్ (3) విఫలమయ్యారు. డర్హమ్ బౌలర్లలో జార్జ్ డ్రిస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. బుష్నెల్ ఓ వికెట్ తీశాడు. -
వన్డే ఫార్మాట్లో మరో డబుల్ సెంచరీ.. ఈసారి..!
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే మరో డబుల్ సెంచరీ నమోదైంది. సోమర్సెట్తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ కెప్టెన్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. బ్రేసీతో పాటు మరో ఓపెనర్ క్రిస్ డెంట్ (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్ ప్రైస్ (83 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో గ్రేమ్ వాన్ బుర్రెన్ (12 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో లాంగ్రిడ్జ్, జార్జ్ థామస్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్సెటే కావడం విశేషం. నార్తంప్టన్షైర్తో మ్యాచ్లో పృథ్వీ షా, గ్లోసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో జేమ్స్ బ్రేసీ సోమర్సెట్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్లో సోమర్సెట్ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్రిడ్జ్ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్ ఊచకోత కోశారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏడో అత్యధిక స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్ నమోదైంది. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్ 498 పరుగులు స్కోర్ చేసింది. పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదైంది. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ ఆటగాడు జేమ్స్ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధవన్ (248),పృథ్వీ షా (244), మార్టిన్ గప్తిల్ (237), ట్రవిస్ హెడ్ (230), డంక్ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. -
సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో ససెక్స్ క్రికెట్ క్లబ్కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 113 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో పుజారాకు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. పుజారా అద్భుత సెంచరీ ఫలితంగా.. ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ససెక్స్ విజయం సాధించింది. 319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ 48.1 ఓవర్లలోనే ఛేదించింది. పుజారాతో పాటు టామ్ ఆల్సోప్(60) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. సోమర్సెట్ బ్యాటర్లలో ఉమీద్, కర్టిస్ కాంఫర్ సెంచరీలతో మెరిశారు. సెలక్టర్లకు వార్నింగ్.. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విఫలమకావడంతో పుజారాపై భారత సెలక్టర్లు వేటు వేశారు. దీంతో వెస్టిండీస్తో టెస్టులకు అతడిని ఎంపికచేయలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని పుజారా లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో కూడా పుజారాను జట్టు నుంచి సెలక్టర్లు ఊద్వసన పలికారు. దీతో ఈ కౌంటీల్లోనే అదరగొట్టి.. మళ్లీ భారత జట్టులోకి అతడు పునరాగమనం చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం పుజారా మాట్లాడుతూ.. "నేను ఎక్కడ ఆడినా నా వంతు 100 శాతం ఎఫక్ట్ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. భారత్కు మరో మూడు నెలల పాటు ఎటువంటి టెస్టు మ్యాచ్లు లేవు. డిసెంబర్లో మళ్లీ దక్షిణాఫ్రికాతో ఆడనున్నాం. అంతకంటే ముందు నేను ఫస్ట్క్లాస్ మ్యాచ్పై దృష్టిపెడతాను. అక్కడ రాణించి మళ్లీ జట్టులోకి రావడమే నా లక్ష్యమని" పుజారా పేర్కొన్నాడు. రాయల్ లండన్ వన్డే కప్-2023లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన పుజారా 302 పరుగులు చేశాడు. చదవండి: IND vs WI: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. హెడ్కోచ్ లేకుండానే! టీమిండియా ఎలా మరి? A superstar indeed, @tregs140 🌟 Cheteshwar Pujara is just inevitable.#MBODC23 pic.twitter.com/lG7Tfxx8gg — Metro Bank One Day Cup (@onedaycup) August 11, 2023 -
పేట్రేగిపోయిన పృథ్వీ షా.. భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్సెట్తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 ఓపెనర్గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. 🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు.. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్లో తన మూడో అప్పియరెన్స్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది. లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నార్తంప్టన్షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లిస్ట్-ఏ క్రికెట్లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2) 100 on the shirt, 100 on the scoreboard 💯 Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH — Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023 Prithvi Shaw in 2023: Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy. Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk — Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023 -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్షైర్తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్తో జరిగిన తన రెండో మ్యాచ్లోనూ తక్కువ స్కోర్కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్తో మ్యాచ్లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Viral Video: వింత పద్ధతిలో ఔటయ్యాడు.. సిక్స్ కొట్టి..!
కౌంటీ ఛాంపియన్షిప్ 2023 డివిజన్ వన్ పోటీల్లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జులై 25) మొదలైన మ్యాచ్లో మిడిల్సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. What do we make of this one then? Toby Roland-Jones won't want to see that dismissal again 🫣pic.twitter.com/xdaESl3EB0 — Wisden (@WisdenCricket) July 25, 2023 ఈ ఇన్నింగ్స్లో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న టోబీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. అనంతరం అతని జట్టు తొలి ఇన్నింగ్స్లో 199 పరుగులకు ఆలౌటైంది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్లో ర్యాన్ హిగ్గిన్స్ (53) టాప్ స్కోరర్గా నిలువగా.. వార్విక్ బౌలర్లు డాల్బీ, హమ్జా, బర్నార్డ్ తలో 3 వికెట్లు, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్విక్షైర్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (0), విల్ రోడ్స్ (19) ఔట్ కాగా.. రాబర్ట్ యేట్స్ (26), సామ్ హెయిన్ (6) క్రీజ్లో ఉన్నారు. హెల్మ్, బాంబర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. బాంబర్ (5/20), కెప్టెన్ టోబీ జోన్స్ (3/27), ర్యాన్ హిగ్గిన్స్ (2/5) ధాటికి 22.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులు చేసిన బర్నార్డ్ వార్విక్షైర్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. బర్నార్డ్తో పాటు మైఖేల్ బుర్గెస్ (12), రాబర్ట్ యేట్స్ (10), డాల్బీ (10) మాత్రమే వార్విక్షైర్ ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్లు చేశారు. -
ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్పాడు. హైదర్ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీబీజీగా ఉన్నాడు. కౌంటీల్లో డెర్బీషైర్ క్రికెట్ క్లబ్కు హైదర్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో భాగంగా డర్హామ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదర్ ఊహించని రీతిలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? డెర్బీషైర్ ఇన్నింగ్స్ 77 ఓవర్ వేసిన స్కాట్ బోర్త్విక్ బౌలింగ్లో రెండో బంతిని హైదర్ అలీ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ప్యాడ్కు తాకి వెనుక్కి వెళ్లింది. దీంతో వికెట్ కీపర్తో పాటు బౌలర్ కూడా ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అని తల ఊపాడు. అయితే హైదర్ అలీ మాత్రం కనీసం బంతి ఎక్కడ ఉందో చూసుకోకుండా రన్ కోసం ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ రాబిన్సన్ వెంటనే స్టంప్స్ను పడగొట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్అంపైర్ థర్ఢ్ అంపైర్కు రీఫర్ చేశారు. పలు కోణాల్లో రీప్లేను పరిశీలించిన థర్ఢ్ అంపైర్ స్టంపౌట్గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో నెటిజన్లు పలు విధాలగా స్పందిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే.. కొంచెం కూడా తెలివుండదు అని కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హైదర్ అలీ 38 పరుగులు చేశాడు.! చదవండి: Dravid- Kohli: విండీస్తో ప్రత్యేక మ్యాచ్.. కోహ్లిపై ద్రవిడ్ ప్రశంసల జల్లు! ఆ మూడు గుణాల వల్లే.. Not a dismissal Haider Ali will want to see again any time soon 😬 #CountyCricket2023pic.twitter.com/gFgvMXx8Wj — Wisden (@WisdenCricket) July 19, 2023 -
భారత సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా కీలక నిర్ణయం
టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారిలో పృథ్వీ షా ఒకరు. 23 ఏళ్ల ఈ ముంబై ఓపెనర్ చాలా రోజులుగా భారత జట్టులో చోటు దక్కక నిరాశగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్కు సెలెక్టర్లు ఇతన్ని ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. తదనంతరం జరిగిన ఐపీఎల్-2023లో ఘోర వైఫల్యం చెందడం, అదే సమయంలో అతని సమకాలీకులు ఓపెనర్లుగా రాణించడంతో షా టీమిండియాకు ఆడే ఆశలను దాదాపుగా వదులుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతనికి తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం దొరికింది. నాటింగ్హమ్షైర్.. షాతో ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. దులీప్ ట్రోఫీ 2023 ముగిసాక షా నాలుగు రోజుల కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు ఆడతాడని, తదనంతరం రాయల్ లండన్ వన్డే కప్ (50 ఓవర్ల టోర్నీ) ఆడతాడని తెలుస్తుంది. దీనికి ముందు షా.. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒకవేళ సెమీస్లో సెంట్రల్ జోన్ గెలిస్తే జులై 12-16 మధ్యలో జరిగే ఫైనల్లో కూడా ఆడతాడు. 2021లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన షా.. ఆతర్వాత ఫామ్ లేమి, వివాదాలు, సరైన అవకాశాలు రాక ఖాళీగా ఉన్నాడు. పృథ్వీ షా తన కెరీర్లో 5 టెస్ట్లు, 6 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. వన్డేల్లో, టీ20ల్లో పెద్దగా రాణించని షా.. టెస్ట్ల్లో పర్వాలేదనిపించాడు. 9 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించే షా.. గడిచిన సీజన్లో 8 మ్యాచ్ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు చేశాడు. -
ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న రహానే.. విండీస్ నుంచి నేరుగా
టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. . కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ టూలో లీసెస్టర్షైర్ క్రికెట్ క్లబ్కు రహానే ప్రాతినిధ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ అనంతరం ఇంగ్లండ్కు రహానే పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన రహానే.. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఏడాది జనవరిలోనే లీసెస్టర్షైర్ క్రికెట్ క్లబ్తో రహానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, రాయల్ లండన్ వన్డే కప్ మొత్తం రహానే ఆడనున్నాడు. కాగా అంతకుముందు 2019 కౌంటీ సీజన్లో హాంప్షైర్ తరపున రహానే ఆడాడు. ఇక ఇప్పటికే భారత్ నుంచి ఛతేశ్వర్ పుజారా, పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి వికెట్ పడగొట్టిన అర్ష్దీప్.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌంటీల్లో తన తొలి వికెట్ను అర్ష్దీప్ సాధించాడు. కాంటర్బరీ వేదికగా సర్రేతో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 మ్యాచ్లో బెన్ ఫోక్స్ను అవుట్ చేసిన అర్ష్దీప్.. మొదటి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్రే ఇన్నింగ్స్ 22 ఓవర్లో అర్ష్దీప్ వేసిన ఆఖరి బంతికి బెన్ ఫోక్స్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకీ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ అని వేలుపైకెత్తాడు. ఇక ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 14. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్దీప్.. 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ తొలి వికెట్కు సంబంధించిన వీడియోను కెంట్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న అర్ష్దీప్.. టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాడు. అర్ష్దీప్ తిరిగి వెస్టిండీస్తో సిరీస్కు భారత జట్టులో వచ్చే అవకాశం ఉంది. చదవండి: #KLRahul: పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు Arshdeep Singh has his first #LVCountyChamp wicket! The @KentCricket bowler gets one to nip back and dismisses Ben Foakes pic.twitter.com/RS4TTfAjut — LV= Insurance County Championship (@CountyChamp) June 12, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్ల్లో 2 సెంచరీలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు భారత టెస్ట్ జట్టు సభ్యుడు, నయా వాల్ చతేశ్వర్ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న పుజారా.. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు బాది ఆసీస్ బౌలర్లు తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్లోసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా తొలి ఇన్నింగ్స్లో 238 పరుగులు ఎదుర్కొని 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. అంతకుముందు డర్హమ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లోనూ (115) పుజారా సెంచరీతో కదంతొక్కాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2, 2023లో ప్రస్తుతం పుజారా లీడింగ్ రన్ స్కోరర్గా (5 ఇన్నింగ్స్ల్లో 332) కొనసాగుతున్నాడు. తాజా శతకంతో పుజారా ఓ మైలురాయిని అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి (58 సెంచరీలు) ఎగబాకాడు. ఈ క్రమంలో అతను వసీం జాఫర్ (57)ను ఓవర్టేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ చెరి 81 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆతర్వాత రాహుల్ ద్రవిడ్ 68 సెంచరీలతో రెండో ప్లేస్లో.. విజయ్ హజారే మూడో స్థానంలో నిలిచారు. కాగా, లండన్లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పుజారా కీలక సభ్యుడు. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు (24 మ్యాచ్ల్లో 50.82 సగటున 203 పరుగులు) కలిగిన పుజారా.. ఇదివరకే తాను చాలాసార్లు సత్తా చాటిన ఓవల్ మైదానంలో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ససెక్స్ తొలి ఇన్నింగ్స్- 455/5 డిక్లేర్ గ్లోసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్-198/9 (మూడో రోజు ఆట ముగిసే సమయానికి) -
కెప్టెన్గా అదుర్స్.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు. హోవ్ వేదికగా డర్హామ్తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్లో బ్రైడన్ కార్స్ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజరా.. తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 134 బంతుల్లో పుజరా శతకం సాధించాడు. టామ్ క్లార్క్తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పుజరా నమోదు చేశాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో 163 బంతులు ఎదుర్కొన్న 13 ఫోర్లు, ఒక సిక్సర్తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజరా టాప్ స్కోరర్గా నిలవగా.. ఓలివర్ కార్టర్(41) పరుగులతో పర్వాలేదనపించాడు.అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. చదవండి: IPL 2023 CSK vs MI: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! -
కెప్టెన్గా చతేశ్వర్ పుజారా
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా కెప్టెన్ అయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2లో అతను ససెక్స్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో ససెక్స్కు సారథ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది.. లెట్స్ గో అంటూ ట్వీట్కు క్యాప్షన్ జోడించాడు. Thrilled to lead @sussexccc in the County Championship! Let's go 💪🏻 pic.twitter.com/iW4Ihstk1p — Cheteshwar Pujara (@cheteshwar1) April 5, 2023 ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ గత సీజన్ సందర్భంగా గాయపడటంతో ఆ జట్టు మేనేజ్మెంట్ నాటి నుంచి పుజారాను తాత్కాలిక కెప్టెన్గా కొనసాగిస్తుంది. కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2 సీజన్లో భాగంగా ససెక్స్ ప్రస్థానం ఇవాల్టి (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతోంది. ససెక్స్.. ఇవాళ డర్హమ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా, ఇంగ్లండ్ ఫస్ట్క్లాస్ టోర్నీల్లో పుజారాకు ఇది వరుసగా రెండో సీజన్. 2022లో అతను ససెక్స్ తరఫున 13 ఇన్నింగ్స్ల్లో 109.40 సగటున 1094 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పుజారా గతేడాది రాయల్ లండన్ వన్డే కప్లో కూడా ఆడాడు. అందులోనూ నయా వాల్ సత్తా చాటాడు. పుజారా చివరిసారిగా టీమిండియా తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఈ సిరీస్లో అతను 6 ఇన్నింగ్స్ల్లో 28 సగటున కేవలం 140 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇదే సిరీస్లోనే పుజారా తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
కౌంటీల్లో ఆడనున్న అర్షదీప్ సింగ్.. టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా..!
కెంట్: భారత లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ వచ్చే సీజన్లో ఐదు మ్యాచ్లలో ‘కెంట్’ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అర్షదీప్ భారత్ తరపున 3 వన్డేలు, 26 టి20ల్లో ఆడాడు. భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో అవకాశాల కోసం ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని, కౌంటీలు ఆడితే ప్రదర్శన మెరుగవుతుందని కోచ్ ద్రవిడ్ చేసిన సూచనతో అతను కౌంటీ క్రికెట్ వైపు వెళుతున్నాడు. అర్షదీప్.. కెంట్ తరఫున ఆడనున్న నాలుగో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. -
టీ20 బ్లాస్ట్లో దుమ్మురేపనున్న మ్యాక్స్వెల్.. ఏ జట్టుకు అంటే..?
ఆసీస్ స్టార్ ఆల్రౌండర్, ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. టీ20 బ్లాస్ట్-2023 కోసం వార్విక్షైర్ మ్యాక్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాక్స్వెల్ రాబోయే సీజన్లో వార్విక్షైర్ తరఫున ఆడనున్న రెండో ఫారిన్ ప్లేయర్ కానున్నాడు. కొద్ది రోజుల కిందటే వార్విక్షైర్ పాక్ పేసర్ హసన్ అలీతో డీల్ ఓకే చేసుకుంది. మ్యాక్స్వెల్తో ఒప్పందాన్ని ధృవీకరిస్తూ వార్విక్షైర్ క్లబ్ నిన్న (ఫిబ్రవరి 14) ఓ ప్రకటనను విడుదల చేసింది. మ్యాక్సీ ఎంపికపై వార్విక్షైర్ హెడ్ కోచ్ మార్క్ రాబిన్సన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న హార్డ్ హిట్టర్స్లో ఒకరైన మ్యాక్స్వెల్తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా అనందాన్ని కలిగిస్తుందని అని అన్నాడు. టీ20ల్లో మ్యాక్సీ ఓ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని కొనియాడాడు. అతని పవర్ హిట్టింగ్, వైవిధ్యమైన ఆటతీరు తమ క్లబ్ అభిమానులను తప్పక ఎంటర్టైన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాక్సీ ఆడే షాట్లకు ప్రత్యర్ధి జట్లు ఫీల్డింగ్ సెట్ చేయలేక నానా కష్టాలు పడతారని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు మ్యాక్సీ ఫీల్డింగ్ సామర్థ్యం తమ క్లబ్కు అదనపు బలంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే మ్యాక్స్వెల్ తమతో కలుస్తాడని పేర్కొన్నాడు. ఈ డీల్పై మ్యాక్స్వెల్ కూడా స్పందించాడు. వార్విక్షైర్ బేర్స్ తరఫున కొత్త ఛాలెంజ్ స్వీకరించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. టీ20 క్రికెట్ ఆడేందుకు ఎడ్జ్బాస్టన్ ఓ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకొచ్చాడు. కాగా, కాలు ఫ్రాక్చర్ కారణంగా గత 3 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ఆడలేదు. ఐపీఎల్కు ముందు అతను జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు ఉంటాయి. 34 ఏళ్ల మ్యాక్స్వెల్ తన టీ20 కెరీర్లో 350కి పైగా మ్యాచ్ల్లో 150కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్లో మ్యాక్సీ ఓ విధ్వంసకర బ్యాటర్గా చలామణి అవుతున్నాడు. జాతీయ జట్టుతో పాటు పలు విదేశీ లీగ్ల్లో పాల్గొనే మ్యాక్స్వెల్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో అతను ఇంగ్లండ్ కౌంటీల్లో హ్యాంప్షైర్, సర్రే, యార్క్షైర్, లాంకాషైర్ క్లబ్ల తరఫున ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున మ్యాక్సీ.. 7 టెస్ట్లు, 127 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో అతను వివిధ జట్ల తరఫున 110 మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. -
'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి'
టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా గిల్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. కౌంటీ చాంఫియన్ షిప్-2022లో గ్లామోర్గాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. తన తొలి కౌంటీ క్రికెట్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ససెక్స్ క్రికెట్ క్లబ్పై గిల్ మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో అతడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఈ క్రమంలో గిల్పై మాజీలు, క్రికెట్ నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ చేరాడు. గిల్ను "ఆల్ ఫార్మాట్ ప్లేయర్" రోహన్ అభివర్ణించాడు. గిల్ 'ఆల్ ఫార్మాట్ ప్లేయర్' "అమోల్ మజుందార్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్గా పనిచేస్తున్నప్పుడు.. తొలి సారి గిల్ను చూశాడు. అప్పుడే మజుందార్ నాతో చెప్పాడు. రోహన్ నేను ఒక అద్భుతమైన ఆటగాడిని ఎన్సిఎలో చూశాను అని మజుందార్ చెప్పాడు. గిల్ చాలా ప్రతిభాంతుడైన ఆటగాడు. అతడు కచ్చితంగా మూడు ఫార్మాటల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గిల్కు మూడు ఫార్మాటల్లో రాణించే సత్తా ఉంది. అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్. టెస్టుల్లో ఇప్పటికే తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్లో తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. అతడి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు భవిష్యత్తులో భారత సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది" అని స్పోర్ట్స్ 18తో గవాస్కర్ పేర్కొన్నాడు. టెస్టు, వన్డేల్లో ఆకట్టుకున్న గిల్ గిల్ ఇప్పటివరకు టెస్టు, వన్డే క్రికెట్లో మాత్రమే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన గిల్ 579 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్లో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. అదే విధంగా ఇప్పటివరకు 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్కు గిల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
County Championship: శుబ్మన్ గిల్ ర్యాంప్ షాట్.. వీడియో వైరల్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022లో గ్లామోర్గాన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్.. తన తొలి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ససెక్స్తో జరుగుతోన్న మ్యాచ్లో గిల్ సెంచరీకి చేరువయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి గిల్ 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కాగా అతడి ఇన్నింగ్స్ను వన్డే మ్యాచ్ను తలపించేలా సాగింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో గిల్ ఆడిన ఓ షాట్ తొలి రోజు ఆటకే హైలట్గా నిలిచింది. గ్లామోర్గాన్ ఇన్నింగ్స్లో ఫహీమ్ అష్రాఫ్ వేసిన ఓ బౌన్సర్ బంతిని గిల్ అద్భుతమైన ర్యాంప్ షాట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి బౌండరీ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను గ్లామోర్గాన్ క్రికెట్ ట్విటర్ షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం గిల్ స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఆక్టోబర్ 6 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు గిల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. Shubman Gill, that is 𝗼𝘂𝘁𝗿𝗮𝗴𝗲𝗼𝘂𝘀 🤯 Glamorgan 217/3 𝗪𝗮𝘁𝗰𝗵 𝗹𝗶𝘃𝗲: https://t.co/7M8MBwgNG2#SUSvGLAM | #GoGlam pic.twitter.com/FtMX1c7cue — Glamorgan Cricket 🏏 (@GlamCricket) September 26, 2022 చదవండి: Ind Vs Aus- Viral: వద్దంటున్నా ట్రోఫీ డీకే చేతిలోనే ఎందుకు పెట్టారు?! మరి అందరికంటే.. -
County Championship: సెంచరీ దిశగా శుబ్మన్ గిల్..
హోవ్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్ శుబ్మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ససెక్స్ జట్టుతో సోమవారం మొదలైన డివిజన్–2 నాలుగు రోజుల మ్యాచ్లో గ్లామోర్గన్ జట్టుకు ఆడుతున్న శుబ్మన్ గిల్ (102 బంతుల్లో 91 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీకి చేరువయ్యాడు. మరో తొమ్మిది పరుగులు సాధిస్తే గిల్ శతకం పూర్తవుతుంది. వెలుతురు మందగించి తొలి రోజు ఆటను నిలిపివేసే సమయానికి గ్లామోర్గన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 41.2 ఓవర్లలో మూడు వికెట్లకు 221 పరుగులు సాధించింది. ఓపెనర్ డేవిడ్ లాయిడ్ (64 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం గిల్తోపాటు బిల్లీ రూట్ (17 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. హార్దిక్ దూరం.. యువ ఆల్రౌండర్కు చోటు! -
గిల్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్కు పయనం కానున్న భారత ఓపెనర్!
టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందకు సిద్దమయ్యాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022లో గ్లామోర్గాన్ తరపున గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్కు వెళ్లేందుకు గిల్కు ఇంకా వీసా మంజూ కాలేదు. అయితే, వీసా సమస్య క్లియర్ అయిన వెంటనే గిల్ ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవలం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో గిల్ దుమ్ము రేపాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో గిల్ 245 పరుగులు సాధించాడు. మూడో వన్డేలో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేసి సత్తా చాటాడు. ఆరో భారత ఆటగాడిగా! ఒకవేళ గిల్ ఇంగ్లండ్కు పయనమైనట్లైతే.. ప్రస్తుత సీజన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఛతేశ్వర్ పుజారా (ససెక్స్), వాషింగ్టన్ సుందర్ (లంకాషైర్), మహ్మద్ సిరాజ్ (వార్విక్షైర్), ఉమేష్ యాదవ్ (మిడిల్సెక్స్), నవదీప్ సైనీ (కెంట్) ఆయా జట్లకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఇక ఇంగ్లండ్ కౌంటీల్లో గ్లామోర్గాన్ జట్టుకు ఆడే మూడో భారత ఆటగాడిగా గిల్ నిలిచే అవకాశం ఉంది. అంతకుముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (1987-91) కాలంలో గ్లామోర్గాన్కు ప్రాతినిధ్యం వహించగా.. 2005లో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2005లో ఇదే క్లబ్ తరపున ఆడాడు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! -
విధ్వంసం సృష్టించిన పుజారా.. 20 ఫోర్లు, 2 సిక్స్లతో!
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ క్రికెట్ క్లబ్కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం మిడిల్సెక్స్తో మ్యాచ్లో పూజారా అద్భుతమైన సెంచరీతో చేలరేగాడు. ఈ మ్యాచ్లో 90 బంతులు ఎదుర్కొన్న పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు సాధించాడు. కాగా టెస్టు స్పెషలిస్టు పేరొందిన పుజారా తన సెంచరీ మార్క్ను కేవలం 75 బంతుల్లోనే అందుకోవడం గమానార్హం. ఇక ఓవరాల్గా ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడికి ఇది మూడో సెంచరీ. అంతకుముందు వార్విక్షైర్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో కూడా 73 బంతుల్లోనే మెరుపు శతకంతో చేలరేగాడు. అదేవిధంగా సుర్రేతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 174 పరుగులు చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇక రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్ను దాటిన రెండో బ్యాటర్గా పుజారా నిలిచాడు. A century from just 75 balls for @cheteshwar1. 🤩 💯 Just phemeomenal. 💫 pic.twitter.com/z6vrKyqDfp — Sussex Cricket (@SussexCCC) August 23, 2022 చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్కు చుక్కలు చూపించేది అతడే' -
ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న మహ్మద్ సిరాజ్..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022 సీజన్లోని చివరి మూడు మ్యాచ్లకు వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సిరాజ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మీడియా సమావేశంలో గురువారం వెల్లడించింది. "కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్లోని అఖరి మూడు మ్యాచ్లకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో ఒప్పందం చేసుకున్నాము. ఎడ్జ్బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 12న సోమర్సెట్తో మ్యాచ్కు సిరాజ్ జట్టుతో కలవనున్నాడు" అని వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే విషయం పై సిరాజ్ మాట్లాడుతూ.. :"కౌంటీ క్రికెట్లో ఆడేందుకు ఆనుమతి ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటున్నాను. వార్విక్షైర్ వంటి ప్రతిష్టాత్మక క్లబ్లో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్లో ఆడడానన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. వార్విక్షైర్ జట్టులో చేరేందుకు చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ గడ్డపై సిరాజ్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగిన రీ షెడ్యూల్ ఐదో టెస్టులో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs ZIM: వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన! -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్లా డైవ్ చేస్తూ!
ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా రాయల్ లండన్ వన్డే కప్లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన మ్యాచ్లో రెన్ షా సంచలన క్యాచ్తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సర్రే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన ఆల్డ్రిడ్జ్ బౌలింగ్లో.. బ్యాటర్ ర్యాన్ పటేల్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రెన్ షా డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో బ్యాటర్తో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్కు గురియ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో సర్రే 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన సర్రే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. సర్రే బ్యాటర్లు నికో రైఫర్(70),షెరిడాన్ గంబ్స్(66) పరుగులతో రాణించారు. అనంతరం 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ నిలిపోయే సమయానికి సోమర్సెట్12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో సర్రేను విజేతగా నిర్ణయించారు. One of the greatest catches you will see in a long time... LIVE STREAM ➡️ https://t.co/dF6GhNA901 #SURvSOM#WeAreSomerset https://t.co/hEzrqhCsx8 pic.twitter.com/cIGNGmLhhX — Somerset Cricket 🏏 (@SomersetCCC) August 17, 2022 చదవండి: IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ -
సెంచరీతో చెలరేగిన పుజారా.. నాలుగేళ్ల కుమార్తె ఏం చేసిందంటే! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ‘రాయల్ లండన్ వన్డే కప్’లో సెంచరీల మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం(ఆగస్టు12) వార్విక్షైర్తో జరగిన మ్యాచ్లో మెరుపు శతకం (79 బంతుల్లో 107 పరుగులు) సాధించిన పుజారా.. ఆదివారం సర్రేతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 131 బంతుల్లో 174 పరుగులు సాధించి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ను వీక్షించడానికి వచ్చిన పుజారా నాలుగేళ్ల కుమార్తె అదితి మ్యాచ్ను తెగ ఎంజాయ్ చేసింది. పుజారా 174 పరుగులు సాధించి ఔటైన తర్వాత డగౌట్కు తిరిగి వస్తుండగా ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. ఇదే సమయంలో అదితి కూడా తన తండ్రిని అభినందిస్తూ డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) చదవండి: Ms Dhoni: సరిగ్గా ఇదే రోజు.. అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ గుడ్బై! ఐసీసీ స్పెషల్ వీడియో -
క్రికెట్కు గుడ్బై చెప్పిన సోమర్సెట్ లెజెండ్!
వెటరన్ ఇంగ్లీష్ బ్యాటర్, సోమర్సెట్ లెజెండ్ జేమ్స్ హిల్డ్రెత్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 కౌంటీ సీజన్తో తన కాంట్రాక్ట్ గడువు ముగియనుండడంతో హిల్డ్రెత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల హిల్డ్రెత్ 2003లో సోమర్సెట్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 16 ఏళ్ల వయస్సులోనే హిల్డ్రెత్ సోమర్సెట్ క్లబ్లో చేరాడు. అతడు దాదాపు 20 ఏళ్ల పాటు సోమర్సెట్ క్రికెట్కు తన సేవలు అందించాడు. తన కెరీర్లో సోమర్సెట్ తరపున 713 మ్యాచ్లు ఆడిన హిల్డ్రెత్.. 27000 పైగా పరుగులు సాధించాడు. టీ20 బ్లాస్ట్-2005 టోర్నీను సోమర్సెట్ కైవసం చేసుకోవడంలో హిల్డ్రెత్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా 2019 రాయల్ లండన్ వన్డే ప్రపంచకప్ను కూడా సోమర్సెట్ సొంతం చేసుకోవడంలోనూ హిల్డ్రెత్ తన వంతు కృషి చేశాడు. అయితే అతడు కెరీర్లో ఇప్పటి వరకు సోమర్సెట్ కౌంటీ ఛాంపియన్షిప్ టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పటి వరకు సోమర్సెట్ తరపున దేశీవాళీ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా హిల్డ్రెత్ నిలిచాడు. చదవండి: ముంబై జట్టుకు గుడ్బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్! -
తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..!
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్-2022లో లంకషైర్ తరపున ఆడుతోన్న భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు. నార్తాంప్టన్షైర్తో జరుగుతోన్న మ్యాచ్లో తొలి రోజు నాలగు వికెట్లు సుందర్ పడగొట్టి తన జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. నార్తాంప్టన్షైర్ ఓపెనర్ విల్ యంగ్ను ఔట్ చేయడంతో సుందర్ తొలి కౌంటీ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. మరోవైపు భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. That is ridiculous, @luke_wells07! 🤯 A third for @Sundarwashi5 👏 🌹 #RedRoseTogether https://t.co/b8kJigt3ZI pic.twitter.com/vGVxeh86pe — Lancashire Cricket (@lancscricket) July 19, 2022 చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
కెప్టెన్గా పుజారా.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు..!
టీమిండియా వెటరన్ ఆటగాడు, ససెక్స్ స్టాండింగ్ కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ టూ-2022లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మిడిల్సెక్స్తో జరుగుతోన్న మ్యాచ్లో పుజారా శతకాన్ని నమోదు చేశాడు. కాగా అతడికి కౌంటీ చాంపియన్షిప్-2022లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. ఇక 182 బంతుల్లో 115 పరుగులు చేసిన పుజారా ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 10 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పుజారా తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజారాతో పాటు టామ్ ఆల్సోప్ 135 పరుగులతో రాణించాడు. చదవండి: Cheteshwar Pujara: పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్గా ఛాన్స్! అతడిపై నమ్మకం ఉంది! Pujara doing what he does best, scoring runs. 💯@cheteshwar1 👏 pic.twitter.com/NiKOkV6dct — Sussex Cricket (@SussexCCC) July 19, 2022 -
‘కెంట్’ తరఫున కౌంటీల్లో నవదీప్ సైనీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో మరో భారత పేస్ బౌలర్కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
ఉమేశ్ యాదవ్కు బంపరాఫర్.. స్టార్ పేసర్ స్థానంలో ఇంగ్లండ్కు పయనం
Umesh Yadav: టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్కు బంపర్ ఆఫర్ లభించింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది స్థానంలో ఇంగ్లండ్ కౌంటీ టీమ్ మిడిల్సెక్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత అఫ్రిది జట్టును వీడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిడిల్సెక్స్ యాజమాన్యం సోమవారం (జులై 11) ప్రకటించింది. ఉమేశ్.. 2022 డొమెస్టిక్ సీజన్తో పాటు కౌంటీ ఛాంపియన్షిప్, వన్డే కప్లకు అందుబాటులో ఉంటాడని మిడిల్సెక్స్ పేర్కొంది. ఓవర్సీస్ బౌలర్ కోటాలో ఉమేశ్ లాంటి బౌలర్ కోసమే తాము ఎదురుచూశామని, ఎట్టకేలకు తమకు సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడే దొరికాడని తెలిపింది. పేస్తో పాటు వైవిధ్యం కలిగిన ఉమేశ్ చేరడం తమకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, టీమిండియాలో యువ పేసర్ల హవా పెరగడంతో గత కొంతకాలంగా ఉమేశ్కు అవకాశాలు రావడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో (కేకేఆర్) అంచనాలకు మించి రాణించినా అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు. ఉమేశ్.. తన సహచరుడు పుజారాలా కౌంటీల్లో సత్తా చాటి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. టీమిండియా తరఫున 52 టెస్ట్లు, 77 వన్డేలు, 7 టీ20 ఆడిన ఉమేశ్.. ఓవరాల్గా 273 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం -
ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్లో అలా కాదు! అయినా!
ఇంగ్లండ్ క్లబ్ క్రికెటర్లకు ఉన్న సౌకర్యాల్లో 30 శాతం కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు లేవని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా అన్నాడు. కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, అయితే తాను వచ్చిన ప్రదేశంలో క్రికెట్ గ్రౌండ్ కూడా లేదని షా తెలిపాడు. కాగా నసీమ్ షా ప్రస్తుతం జరుగుతోన్న టీ20 బ్లాస్ట్లో గ్లౌసెస్టర్షైర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. “ఇంగ్లండ్లో క్లబ్ క్రికెటర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలలో 30 శాతం కూడా మా దేశ ఆటగాళ్లకు లేవు. నేను ఏ స్థాయి నుంచి వచ్చానో నాకు బాగా తెలుసు. నేను టేప్ బాల్తో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. కానీ ఇంగ్లండ్లో క్రికెటర్ల పరిస్థితి మాకంటే పూర్తి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ క్రికెటర్లు చాలా అదృష్టవంతులు. వారికి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు కనీస మౌలిక వసతులు లేని ప్రాంతాల నుంచి వచ్చారు. లాహోర్, కరాచీ వంటి నగరాల్లో అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. కానీ నేను ఉన్న చోట కనీసం క్రికెట్ గ్రౌండ్ కూడా లేదు. అయితే కనీస సౌకర్యాలు లేనప్పటికీ, మా దేశం నుంచి చాలా మంది అద్భుతమైన క్రికెటర్లు వస్తున్నారు" అని నసీమ్ షా పేర్కొన్నాడు. నసీమ్ షా పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్లోని లోయర్ డిర్ ప్రాంతానికి చెందిన ఆటగాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో నసీమ్ షా పాకిస్తాన్ తరపున 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన నసీమ్ షా 26 వికెట్లు పడగొట్టాడు. చదవండి: AUS Vs SL 5th ODI: చివరి వన్డేలో ఆసీస్ విజయం.. ఆస్ట్రేలియాకు లంక ఫ్యాన్స్ కృతజ్ఞతలు -
వాషింగ్టన్ సుందర్కు బంపరాఫర్.. దిగ్గజాల తర్వాత తాను సైతం!
Washington Sundar: టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్లు ఆడే ఛాన్స్ కొట్టేశాడు. ఈ మేరకు భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్తో ఒప్పందం చేసుకున్నట్లు లంకషైర్ జట్టు బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. స్వాగత్ హై సుందర్.. ఈ సందర్భంగా స్వాగత్ హై అంటూ సుందర్కు ఆహ్వానం పలుకుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ఇండియన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో లంకషైర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. జూలై, ఆగష్టులో జరిగే కౌంటీ చాంపియన్షిప్ రాయల్ లండన్కప్లో అతడు భాగం కానున్నాడు’’ అని పేర్కొంది. థాంక్స్ అంటూ భావోద్వేగం ఈ విషయంపై స్పందించిన వాషింగ్టన్ సుందర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన లంకషైర్ మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలికి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘లంకషైర్ జట్టుతో కలిసి ఆడటం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్ గడ్డ మీద ఆడటం నాకొక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా గాయపడిన సుందర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోగానే లంకషైర్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యువ తమిళ ఆటగాడు భారత్ తరఫున 39 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 6/87.టెస్ట్ ఎకానమీ 3.41. అదే విధంగా అతడు సాధించిన అత్యధిక స్కోరు 96 నాటౌట్. మొత్తం సాధించిన పరుగులు 369. ఇక లంకషైర్ విషయానికొస్తే ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అప్పట్లో వాళ్లు.. ఇప్పుడు ఈ యువ ప్లేయర్లు గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్ ఇంజనీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత శ్రేయస్ అయ్యర్కు ఈ అవకాశం రాగా.. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. 🇮🇳 Swagat Hai, @Sundarwashi5! 👏 🌹 #RedRoseTogether pic.twitter.com/iOnsoQrL8H — Lancashire Lightning (@lancscricket) June 22, 2022 -
ఐపీఎల్ హంగామా నడుస్తున్నా నేనున్నానని గుర్తు చేస్తున్న పుజారా..!
ఇంగ్లండ్ కౌంటీల్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు బాది కెరీర్ అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన గొప్ప ఆటగాళ్లెప్పుడూ పుజారాలా బ్యాట్తోనే సమాధానం చెబుతారని.. సెంచరీలు, డబుల్ సెంచరీలతోనే వారు సెలెక్టర్లకు సవాలు విసురుతారని అన్నాడు. ఓ పక్క ఐపీఎల్ హంగామా నడుస్తున్నా, పుజారా నేనున్నానని సెలెక్టర్లకు గుర్తు చేశాడని పేర్కొన్నాడు. What do great players do when out of India team? Knock the selectors' doors with 100s and 200s like Pujara. Away from IPL glamour, a simple 'forget me not' message. @cheteshwar1 — Mohammad Kaif (@MohammadKaif) May 8, 2022 కాగా, పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో నాలుగు శతకాలు (డెర్బీషైర్పై 201*, వోర్సెస్టర్షైర్పై 109, డర్హమ్పై 203, మిడిల్సెక్స్పై 170*) బాదాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. Make yourselves comfortable and watch every ball of Shaheen Afridi 🆚 Cheteshwar Pujara 🤩 #LVCountyChamp pic.twitter.com/E6uVJopBQr — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 తాజాగా మిడిల్సెక్స్తో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 197 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 170 పరుగులు సాధించిన పుజారా తన జట్టును మాత్రం ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పుజారా డబుల్ సెంచరీతో పాటు మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ససెక్స్ 335/4 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఫలితం అనుభవించింది. ససెక్స్ నిర్ధేశించిన 370 పరుగుల టార్గెట్ను మిడిల్సెక్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మిడిల్సెక్స్ ఓపెనర్ సామ్ రాబ్సన్ (149) సెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్ (79), మ్యాక్స్ హోల్డన్ (80 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకముందు ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 392 పరుగులకు ఆలౌట్ కాగా.. మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో పుజారా.. ప్రత్యర్ధి బౌలర్ (మిడిల్సెక్స్), పాక్ ఆటగాడు షాహీన్ అఫ్రిది మధ్య బ్యాటిల్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. పుజారా.. షాహిన్ అఫ్రిది బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది చుక్కలు చూపించాడు. చదవండి: IPL 2022: కోహ్లి గోల్డెన్ డక్.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్ -
రిజ్వాన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్..!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. రిజ్వాన్ ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డర్హామ్తో జరిగిన మ్యాచ్లో రిజ్వాన్ సంచలన క్యాచ్తో మెరిశాడు. డర్హామ్ రెండో ఇన్నింగ్స్లో ససెక్స్ స్పిన్నర్ రాలిన్స్ వేసిన బంతిని స్కాట్ బోర్త్విక్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్ ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Rinku Singh: తొమ్మిదో క్లాస్లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు! This catch from @iMRizwanPak. 🤯 👏 #GOSBTS pic.twitter.com/uOdy7JJ2nr — Sussex Cricket (@SussexCCC) May 1, 2022 -
140 కి.మీ స్పీడుతో యార్కర్..దెబ్బకు బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్!
పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్ ఇంగ్లండ్ కౌంటీల్లో యార్క్షైర్ తరపున ఆడుతోన్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే రౌఫ్ అదరగొట్టాడు. కెంట్తో జరుగుతోన్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రౌఫ్ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా ఈ మ్యాచ్లో రౌఫ్ అద్భుతమైన యార్కర్తో మెరిశాడు. కెంట్ తొలి ఇన్నింగ్స్ 85 ఓవర్లో రౌఫ్ వేసిన ఐదో బంతికి నాథన్ గిల్క్రిస్ట్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే 140 కి.మీ స్పీడుతో వేసిన యార్కర్కు కెంట్ బ్యాటర్ గిల్క్రిస్ట్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2022: ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే.. విజయం ఎవరిది..? ✨@HarisRauf14 claiming his fifth wicket 😍 What a way to start his first match in a Yorkshire shirt at HQ! 🎉#OneRose pic.twitter.com/0Kdc1Mc1E0 — Yorkshire CCC (@YorkshireCCC) April 29, 2022 -
మరో డబుల్ సాధించిన పుజారా.. 28 ఏళ్ల కిందటి రికార్డు సమం
పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో మూడంకెల స్కోర్ను అందుకున్నాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదన్న కసితో రగిలిపోతున్న పుజారా.. ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ససెక్స్కు ఆడుతున్న అతను.. 3 మ్యాచ్ల్లో రెండు డబుల్ సెంచరీలు (201*, 203), ఓ సెంచరీ (109) సాయంతో ఏకంగా 531 పరుగులు సాధించాడు. తాజాగా డర్హమ్తో జరుగుతున్న మ్యాచ్లో (తొలి ఇన్నింగ్స్) ద్విశతకం బాదిన పుజారా.. తన జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచాడు. ఈ క్రమంలో అతను 28 ఏళ్ల కిందటి ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. కౌంటీ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ తర్వాత రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కాగా, ససెక్స్తో జరుగుతున్న డివిజన్-2 మ్యాచ్లో టాస్ గెలిచిన డర్హమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ససెక్స్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుజారా (334 బంతుల్లో 203; 24 ఫోర్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 538 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఈ క్రమంలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన డర్హమ్.. నాలుగో రోజు (మే 1) తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 245 పరుగులు చేసింది. ఓపెనర్లు సీన్ డిక్సన్ (148 నాటౌట్), అలెక్స్ లీస్ (84 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. చదవండి: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్ -
పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్
Pujara Scores Century Followed By Double Ton: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజరా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ సీజన్లో ససెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న నయా వాల్ వరుస శతకాలతో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ (రెండో ఇన్నింగ్స్) సాధించిన అతను.. వార్సెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ బాదాడు. వరుస ఇన్నింగ్స్ల్లో మూడంకెల స్కోర్ను రీచైన పుజారా ఎట్టకేలకు పూర్వపు ఫామ్ను దొరకబుచ్చుకున్నాడు. డెర్బిషైర్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులకే ఔటైన పుజారా.. సెకెండ్ ఇన్నింగ్స్లో 201 పరుగులు చేశాడు. సూపర్ ఫామ్కు కొనసాగింపుగా వార్సెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో 206 బంతులను ఎదుర్కొన్న నయా వాల్.. 16 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. పుజారా ఒక్కడే సొగసైన సెంచరీతో రాణించడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులకు ఆలౌటైంది. ఇదే జట్టు తరఫున ఆడుతున్న పాక్ వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ తొలి బంతికే డకౌట్ కాగా, టామ్ క్లార్క్ (44) కాస్త పర్వాలేదనిపించాడు. అంతకుముందు వార్సెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 491 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ బ్రెట్ డిఒలివియెరా అజేయమైన 169 పరుగులతో సత్తా చాటగా, ఎడ్ పొలాక్ (77), బెర్నార్డ్ (75) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్లో తేలిపోయిన ససెక్స్ ఫాలో ఆన్ ఆడుతుంది. చదవండి: ధోనికో లెక్క.. పంత్కో లెక్కా..? నో బాల్ వివాదంపై ఆసక్తికర చర్చ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చతేశ్వర్ పుజారా అజేయ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా సస్సెక్స్ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే భారత ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్లో పుజారా (201 నాటౌట్; 23 ఫోర్లు), టామ్ హైన్స్ (243; 22 ఫోర్లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సస్సెక్స్ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. -
భారత జట్టు నుంచి ఔట్.. ఇంగ్లండ్లో ఆడనున్న పుజారా!
భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు ససెక్స్ జట్టకు పుజారా ప్రాతనిథ్యం వహించనున్నాడు. ఈ ఏడాది సీజన్కు దూరమైన ఆస్ట్ల్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ స్థానంలో పుజారాకు చోటు దక్కింది. పుజారా మొదటి కౌంటీ మ్యాచ్ నుంచి టోర్నమెంట్ ముగిసే వరకు ససెక్స్ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. “రాబోయే సీజన్లో చారిత్రాత్మక సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్లో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. నేను త్వరలో సస్సెక్స్ జట్టుతో చేరేందుకు ఎదురు చూస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. కానీ తొలి సారి సస్సెక్స్ ఆడడం సంతోషంగా ఉంది. అదే విధంగా క్లబ్ విజయానికి నావంతు కృషిచేస్తాను' అని ససెక్స్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నాడు. ఇక గత కొంత కాలంగా టెస్టుల్లో పుజారా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరగుతున్న టెస్టులకు పుజారాతో పాటు, రహానేలపై బీసీసీఐ వేటు వేసింది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న పుజారాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా 191 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! -
ఇంగ్లండ్లో ఆడనున్న పాక్ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. 2022 సీజన్కు గాను సస్సెక్స్ క్లబ్తో ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీల్లో ఆడడం రిజ్వాన్కి ఇదే తొలిసారి. అతడు వచ్చే సీజన్లో టీ20 బ్లస్ట్తో పాటు, కౌంటీ క్రికెట్ కూడా ఆడనున్నాడు.ఇక ఈ విషయంపై స్పందించిన రిజ్వాన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. "చరిత్రాత్మక సస్సెక్స్ క్లబ్లో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. సస్సెక్స్ క్లబ్ గురించి నేను చాలా విషయాలు విన్నాను. అటువంటి క్రికెట్ క్లబ్లో ఆడటం నా ఆదృష్టంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక సస్సెక్స్ కోచ్ సాలిస్బరీ మాట్లాడుతూ.. టీ20, టెస్ట్ల్లో అతడు సాధించిన రికార్డులను ప్రశంసించాడు. "అతడి ఫస్ట్ క్లాస్ రికార్డులు, టెస్ట్ రికార్డులు అతడు ఏంటో తెలుపుతున్నాయి. అటువంటి స్టార్ క్రికెటర్ సస్సెక్స్ క్లబ్ తరుపున ఆడడం చాలా సంతోషం" అని పేర్కొన్నాడు. ఇక టీ20 క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్ దుమ్ము రేపుతున్నాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో టి20 క్రికెట్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా మహ్మద్ రిజ్వాన్ రికార్డులకెక్కాడు. చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి -
10 మంది డకౌట్.. 2 పరుగులకే ఆలౌట్
లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ఓ వన్డే జట్టు అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేసి, క్రికెట్ చరిత్రలో అత్యంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. హంటింగ్డాన్షైర్ కౌంటీ లీగ్లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో బక్డెన్క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్తో కేవలం రెండంటేరెండు పరుగులు మాత్రమే నమోదు చేసి ఆలౌటైంది. బక్డెన్ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. పది మంది ప్లేయర్లు డకౌట్గా వెనుదిరిగారు. ప్రత్యర్ధి బౌలర్లు అమన్దీప్సింగ్, హైదర్ అలీ దెబ్బకు బక్డెన్ ప్లేయర్లు ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయారు. అమన్దీప్ నాలుగు ఓవర్లను మెయిడిన్ చేసి 6 వికెట్లు పడగొట్టగా, అలీ 4.3 ఓవర్లలో రెండు మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. స్కోర్ బోర్డుపై నమోదైన ఆ రెండు పరుగులు కూడా వైడ్, బై రూపంలో వచ్చినవే. వివరాల్లో వెళితే.. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఫహీమ్ సబీర్ భట్టి (65), మురాద్ అలీ (67) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 261 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బక్డెన్ జట్టు.. అమన్దీప్సింగ్(6/0), హైదర్ అలీ(2/0) ధాటికి 8.3 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.దీంతో ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హంటింగ్డాన్షైర్ కౌంటీ లీగ్లో భాగంగా జూన్ 19న జరిగిన ఈ మ్యాచ్ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ బోర్డు వైరల్గా మారింది.కాగా, ఈ మ్యాచ్లో దారుణ పరాభవం అనంతరం బక్డెడ్ జట్టు కెప్టెన్ జోయల్ మీడియాతో మాట్లాడాడు. జట్టులోని 15 మంది ప్రధాన ఆటగాళ్లు ఈ మ్యాచ్కు గైర్హాజయ్యారని, వ్యక్తిగత కారణాల వల్ల వారంతా మ్యాచ్లో ఆడలేకపోయారని, చేసేదేమీ లేక రెండో జట్టుతో బరిలోకి దిగామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల ముందు ఇదే ఫాల్కన్తో జరిగిన మ్యాచ్లో బక్డెన్ జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: పాక్ క్రికెట్లో ముసలం.. బాధ్యతల నుంచి తప్పుకున్న యూనిస్ ఖాన్ -
45 ఏళ్ల వయసులో ఏమా విధ్వంసం.. 15 ఫోర్లు, 15 సిక్సర్లు
లండన్: కౌంటీ క్రికెట్లో కెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ల ఇంగ్లీష్ ఆల్రౌండర్ డారెన్ స్టీవెన్స్ బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. టాలెంట్కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు. శుక్రవారం గ్లామోర్గన్తో జరిగిన మ్యాచ్లో 149 బంతుల్లో 15 బౌండరీలు, 15 సిక్సర్ల సాయంతో 128 స్ట్రయిక్ రేట్తో 190 పరుగులు సాధించాడు. లేటు వయసులో స్టీవెన్స్ చేసిన విధ్వంసాన్ని చూసిన యువ క్రికెటర్లు ముక్కున వేలేసుకున్నారు. Enjoy EVERY boundary from Darren Stevens' 190 😍 Watch him bowl LIVE: https://t.co/4ZkDAI69AU#LVCountyChamp pic.twitter.com/rgKdT0GtaT — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 ఇంతటితో ఆగని స్టీవెన్స్ బౌలింగ్లోనూ అదరగొట్టాడు. ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ను ఎల్బీడబ్యూ చేసి వయసు మీదపడినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, యువ బ్యాట్స్మెన్లకు సవాల్ విసిరాడు. ఇదిలా ఉంటే, 315 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన స్టీవెన్స్ 15940 పరుగులతో పాటు 565 వికెట్లు సాధించాడు. అతనికిది 36వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన కెంట్.. స్టీవెన్స్ అద్భుత ఇన్నింగ్స్ సహకారంతో 307 పరుగులు స్కోర్ చేయగలిగింది. Of course he's just dismissed Marnus Labuschagne for the second time this season Reminder: Darren Stevens is 45!!! 🤯 Watch Now: https://t.co/4ZkDAI69AU pic.twitter.com/Zab35CrmLb — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టీవెన్స్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్కు 36 పరుగులు, తొమ్మిదో వికెట్కు 166 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. అనంతరం బౌలింగ్లో లబూషేన్ను ఔట్ చేసి ప్రత్యర్ధిని కోలుకోలుని దెబ్బతీశాడు. రెండు రోజు ఆట ముగిసే సమయానికి గ్లామోర్గన్ 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. చదవండి: సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు -
లాంకషైర్ కౌంటీ జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్
మాంచెస్టర్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ అడుగు పెడుతున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ ‘రాయల్ లండన్ కప్’లో అతను లాంకషైర్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. జూలై 15న అయ్యర్ జట్టుతో చేరతాడు. ఈ వన్డే టోర్నీలో భాగంగా నెల రోజుల పాటు జరిగే గ్రూప్ దశ మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కౌంటీల్లో ఎంతో గుర్తింపు ఉన్న నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల కోసం కాకుండా అయ్యర్ ప్రత్యేకంగా వన్డేల కోసం మాత్రమే లాంకషైర్తో జత కట్టాడు. గతంలో భారత్ నుంచి ఫరూఖ్ ఇంజినీర్, లక్ష్మణ్, గంగూలీ ఈ కౌంటీ టీమ్కు ప్రాతినిధ్యం వహించారు. -
శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత.. భారత్ నుంచి ఆరో ఆటగాడిగా
లండన్: త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ, రాయల్ లండన్ కప్-2021 కోసం లంకషైర్ క్రికెట్ క్లబ్.. టీమిండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసాక ఈ టోర్నీ ప్రారంభంకానుంది. దీని కోసం అయ్యర్ జూలై 15న లండన్కు చేరుకొని, నెల రోజుల పాటు జరిగే లీగ్ మ్యాచ్లలో ఆడతాడు. ఈ విషయాన్ని లంకషైర్ యాజమాన్యం సోమవారం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. 50 ఓవర్ల టోర్నమెంట్లో భాగంగా లంకషైర్ జట్టు జూలై 20న ససెక్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా, గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్ ఇంజనీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత అయ్యర్కు మాత్రమే ఆ అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా తరఫున 21 వన్డేలు, 29టీ20లకు ప్రాతినిధ్యం వహించిన అయ్యర్ లంకషైర్ తరఫున బరిలో దిగబోతున్న ఆరో ఇండియన్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. -
ఇక కౌంటీ క్రికెట్లో...
కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లంతా చాలా వరకు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే టెస్టు జట్టు సభ్యుడు, ఆంధ్ర కెప్టెన్ గాదె హనుమ విహారి మాత్రం తన ఆటకు మరింత పదును పెట్టుకునే పనిలో పడ్డాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) నిర్వహిస్తున్న రాజా ఆఫ్ పాలయంపట్టి (ఫస్ట్ డివిజన్) టోర్నీలో అతను పాల్గొన్నాడు. తాను ఉద్యోగిగా పని చేస్తున్న నెల్సన్ ఎస్సీ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. బుధవారం చెన్నైలో ఆళ్వార్పేట్ సీసీతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన విహారి 285 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విపత్కర స్థితిలోనూ క్రికెట్పై అతనికి ఉన్న నిబద్ధతను ఇది చూపిస్తోంది. ఇక ముందూ దీనినే కొనసాగించాలని విహారి భావిస్తున్నాడు. హైదరాబాద్: భారత క్రికెటర్లు కౌంటీల్లో ఆడటం దశాబ్దాలుగా సాగుతోంది. నాటి సునీల్ గావస్కర్నుంచి నేటి విరాట్ కోహ్లి వరకు చాలా మంది ఏదో ఒక సందర్భంలో కౌంటీ క్రికెట్ ఆడినవారే. ఇంగ్లండ్లోని ప్రతికూల పరిస్థితుల్లో ఆడి తమ ఆటను తీర్చి దిద్దుకోవాలనుకునే ప్రయత్నం కొందరిదైతే... భారత జట్టుకు మ్యాచ్లు లేని ఆఫ్ సీజన్ వేసవిలో (ఐపీఎల్కు ముందు రోజుల్లో) కౌంటీల్లో మరికొందరు బిజీగా కనిపించేవారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత టెస్టు బ్యాట్స్మన్, ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి చేరుతున్నాడు. కౌంటీల్లో ఆడేందుకు అతను ఇప్పటికే ఒక జట్టుతో దాదాపుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా అతను ఇంగ్లండ్ వెళ్లడం ఆలస్యమైంది. ‘ఈ సీజన్లో నేను నాలుగు కౌంటీ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒక జట్టుతో ఒప్పందం దాదాపుగా ఖరారైంది. ఏ జట్టుకు ఆడబోతున్నానో పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా. ప్రస్తుతం కరోనా కారణంగానే అన్ని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత నేను ఆడగలనని నమ్ముతున్నా. కౌంటీల్లో ఆడటం నాకు ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తుంది’ అని విహారి అన్నాడు. తమిళనాడు లీగ్లో ఆడటం ద్వారా తన మ్యాచ్ ప్రాక్టీస్ కొనసాగించినట్లు అతను చెప్పాడు. 9 టెస్టుల కెరీర్లో ఒక మ్యాచ్ మినహా (వైజాగ్లో దక్షిణాఫ్రికాపై) అతను 8 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. ‘నా బ్యాటింగ్పై నాకు విశ్వాసముంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా విదేశాల్లో రాణించే టెక్నిక్ నాకు ఉందని నమ్ముతోంది. అందుకే ఈ అవకాశాలు వచ్చాయి. ఇంగ్లండ్ అయినా, న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ అయినా పరిస్థితులకు అనుగుణంగా మన ఆటను మార్చుకోవడం ముఖ్యం. జట్టు నాకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నెరవేర్చగలనని ఆత్మవిశ్వాసం నాకుంది’ అని ఈ ఆంధ్ర క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ఇటీవల న్యూజిలాండ్తో క్రైస్ట్చర్చ్లో జరిగిన రెండో టెస్టులో విహారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. హాగ్లీ ఓవల్ మైదానంలో బౌలింగ్కు బాగా అనుకూలించిన పిచ్పై 70 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అయితే ఇది తన అత్యుత్తమ ప్రదర్శనగా భావించడం లేదని విహారి విశ్లేషించాడు. ‘దీనిని నేను గొప్పగా చూడటం లేదు. నేను బాగానే ఆడాననేది వాస్తవం. అయితే అది జట్టును గెలిపించలేకపోయింది. కఠిన పరిస్థితుల్లో పరుగులు సాధించడం మంచిదే కానీ జట్టుకు విజయం లభించినప్పుడే దాని విలువ పెరుగుతుంది’ అని విహారి అభిప్రాయ పడ్డాడు. ఈ సీజన్ చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో మొత్తం తొమ్మిది టెస్టులు ఆడబోతోంది. ‘సొంతగడ్డపై కూడా నాకు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం రావడం ఖాయం. సాధన చేయడం, ఎలాంటి అవకాశాన్నైనా అందుకునేందుకు సిద్ధంగా ఉండటమే నా పని’ అని హనుమ స్పష్టం చేశాడు. కరోనా విరామంతో ఇకపై ఇంటికే పరిమితం అవుతుండటంతో భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ ఇచ్చిన వ్యక్తిగత ట్రైనింగ్ చార్ట్ను పాటించి ఫిట్నెస్ను కాపాడుకుంటానని అతను వెల్లడించాడు. -
అజింక్య రహానేతో హాంప్షైర్ ఒప్పందం
భారత క్రికెటర్ అజింక్య రహానేతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు హాంప్షైర్ ఒప్పందం చేసుకుంది. హాంప్షైర్ జట్టు తరఫున ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్గా రహానే గుర్తింపు పొందనున్నాడు. మే, జూన్, జూలైలలో జరిగే కౌంటీ చాంపియన్షిప్ మ్యాచ్ల్లో రహానే ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ స్థానంలో రహానేను తీసుకున్నారు. రాయల్ లండన్ వన్డే కప్ గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాక మార్క్రమ్ ప్రపంచకప్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టుతో చేరతాడు. 30 ఏళ్ల రహానే ఇప్పటివరకు భారత్ తరఫున 56 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు. -
ఎసెక్స్ లీగ్కు విహారి
హటన్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి తొలి సారి ఇంగ్లండ్ కౌంటీ లీగ్లలో ఆడనున్నాడు. ఎసెక్స్ కౌంటీ పరిధిలోని హటన్ క్రికెట్ క్లబ్కు అతను ప్రాతినిధ్యం వహిస్తాడు. మొత్తం 18 వారాల పాటు అతను ఈ లీగ్లలో పాల్గొంటాడు. ఇందులో భాగంగా ఫస్ట్ డివిజన్ స్థాయి గల 18 వన్డేల్లో విహారికి ఆడే అవకాశం దక్కుతుంది. ఇంగ్లండ్లోని స్వింగ్, సీమ్ వికెట్లపై మ్యాచ్లు ఆడటం ద్వారా మంచి అనుభవం దక్కుతుందని, ఇది భవిష్యత్తులో తన కెరీర్కు ఉపయోగపడుతుందని విహారి విశ్వాసం వ్యక్తం చేశాడు. శనివారం అతను ఇంగ్లండ్ బయల్దేరి వెళతాడు. 20 ఏళ్ల విహారి... 23 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.09 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 19 దేశవాళీ వన్డేల్లో 36.80 సగటుతో 552 పరుగులు సాధించాడు.