Good results
-
పందిరి సాగు.. ఫలితాలు బాగు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని వరి సాగు చేస్తే సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధర అందడం లేదని ఆందోళన చెందుతున్న రైతులు తమ ఆలోచను మార్చుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు బదులుగా ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తమకున్న కొద్దిపాటి సాగు భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే సాగును లాభాల బాటలో నడిపించొచ్చని నిరూపిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 90 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.పందిరి సాగుతో మేలురైతులు వారి భూముల్లో పందిరి వేసి, ఉద్యాన పంటను సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఎకరా భూమిలో పందిరి సాగు అమలు చేసే రైతులు ఉద్యానశాఖ ద్వారా రూ. లక్ష సాయం అందిస్తుండగా, ఇందులో రూ. 50 వేలు సబ్సిడీ వస్తుంది. మిగితా సగాన్ని రైతులు భరించాల్సి వస్తుంది. అధికారులే పందిరి సిద్ధం చేసి ఇస్తారు. సుమారు నాలుగేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీగజాతి కూరగాయలు పండించుకోవచ్చు. కాకర, బీర, దొండ, సోరకాయ పండిస్తూ ఆదాయం పొందవచ్చు. పందిరి కింది బాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో టమాట, వంకాయ, బెండ వంటి అంతర పంటలు సాగు చేయవచ్చు.దిగుబడి బాగుందిపందిరి సాగు విధానంతో దిగుబడులు బాగున్నాయి. ఈ విధానం ద్వారా కలుపు తక్కువగా ఉండి కూలీల అవసరం ఉండదు. కూరగాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. చీడ పీడలు ఎక్కువగా ఆశించవు. పంటలు సాఫీగా వస్తాయి. మార్కెట్ల మంచి ధర పలుకుతుంది. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)–నాగర్తి తిరుపతిరెడ్డి, రైతు మాచాపూర్ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు పైగా దూసుకెళ్లి రూ. 16,135 కోట్లకు చేరింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ.2,876 కోట్లు ఆర్జించింది. ఇండస్ టవర్స్ బిజినెస్ కన్సాలిడేషన్ కారణంగా రూ. 14,323 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 1,194 కోట్ల విదేశీ మారక లాభం అందుకుంది. మరోపక్క రూ. 128 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించింది. మొత్తం ఆదాయం సైతం 19% ఎగసి రూ. 45,129 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,900 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 233 నుంచి రూ. 245కు బలపడింది. ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ దేశీ బిజినెస్ 25%జంప్చేసి రూ. 34,654 కోట్లను తాకింది. దాదాపు రూ. 7,546 కోట్ల అనూహ్య లాభాలు ఆర్జించింది.ఫలితాల నేపథ్యంలో షేరు 2.5% క్షీణించి రూ. 1,620 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం హైజంప్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2024–25,క్యూ3)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ నికర లాభం 84% దూసుకెళ్లి రూ. 16,891 కోట్లను తాకింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో రూ. 9,164 కోట్లు ఆర్జించింది. పెన్షన్ చెల్లింపులకు రూ. 7,100 కోట్ల మేర ప్రొవిజన్ చేపట్టడం ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లో ఎస్బీఐ రూ. 18,331 కోట్ల లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,18,193 కోట్ల నుంచి రూ. 1,28,467 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 4% పుంజుకుని రూ. 41,446 కోట్లకు చేరింది. రుణాల్లో 14% వృద్ధి నమోదైనప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.19% నీరసించి 3.15%కి పరిమితమయ్యాయి. కాసాకు బదులు కస్టమర్లు అధిక రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైనట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఎన్పీఏలు తగ్గాయ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ కన్సాలిడేటెడ్ నికర లాభం 70 శాతం జంప్చేసి రూ. 18,853 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 11,064 కోట్ల లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,53,072 కోట్ల నుంచి రూ. 1,67,854 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.42 శాతం నుంచి 2.07 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.64 శాతం నుంచి 0.53 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు 1.8% క్షీణించి రూ. 752 వద్ద క్లోజైంది. -
రిలయన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతంపైగా వృద్ధితో రూ. 18,540 కోట్లను తాకింది. ప్రధానంగా టెలికం, రిటైల్ విభాగాలకుతోడు చమురు, పెట్రోకెమ్ బిజినెస్ నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,265 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ2)లో ఆర్జించిన రూ. 16,563 కోట్లతో పోలి్చనా నికర లాభం బలపడింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం అధికంగా రూ. 2.67 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 8 శాతం పుంజుకుని రూ.48,003 కోట్లకు చేరుకుంది. రిటైల్, ఆయిల్ గుడ్... రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ. 3,458 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 90,333 కోట్లయ్యింది. కొత్తగా 779 స్టోర్లను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 19,102కు చేరింది. జామ్నగర్ రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్లాంట్లతోకూడిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ ఇబిటా 2 శాతం పుంజుకుని రూ. 14,402 కోట్లను తాకింది. ఇంధన రిటైల్ విభాగం జియో–బీపీ రికార్డ్ అమ్మకాలు(పెట్రోల్, డీజిల్) సాధించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. కేజీ డీ6 బ్లాకు నుంచి తగ్గిన గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఇబిటా 4 శాతం నీరసించి రూ. 5,565 కోట్లకు పరిమితమైంది. సగటున గ్యాస్ ఉత్పత్తి రోజుకి 28.04 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లుకాగా.. 21,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తిని సాధించింది. యూఎస్ లగ్జరీ స్టోర్లు: ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా యూఎస్ లగ్జరీ రిటైలర్ ‘శాక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ’ స్టోర్లకు దేశీయంగా తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. వెరసి అమెరికన్ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లను దేశీయంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా మదర్కేర్ పీఎల్సీతో జేవీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. తద్వారా తల్లిదండ్రులు, పిల్లల ఉత్పత్తులందించే మదర్కేర్ బ్రాండును దేశీయంగా పరిచయం చేయనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు 2% లాభంతో రూ. 1,275 వద్ద ముగిసింది.జియో దూకుడు ఆర్ఐఎల్ టెలికం విభాగం రిలయన్స్ జియో ఈ ఏడాది క్యూ3లో రూ. 6,477 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో సాధించిన రూ. 5,208 కోట్లతో పోలిస్తే 24 శాతం ఎగసింది. ప్రధానంగా టారిఫ్ల పెంపు ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,368 కోట్ల నుంచి రూ. 29,307 కోట్లకు జంప్ చేసింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 47.88 కోట్ల నుంచి 48.21 కోట్లకు బలపడగా.. ఒక్కో యూజర్పై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 195.1 నుంచి రూ. 203.3కు ఎగసింది. టెలికం, డిజిటల్ విభాగాల జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 26 శాతం జంప్చేసి రూ. 6,861 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 19% అధికమై రూ. 38,750 కోట్లకు చేరింది. -
ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్స్ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్బోర్డింగ్ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 325 కోట్లను తాకింది. ట్రెజరీ, ఫారెక్స్ ఆర్జన రెట్టింపై రూ. 106 కోట్లకు చేరుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 275 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,485 కోట్ల నుంచి రూ. 2,804 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ.2,129 కోట్ల నుంచి రూ. 2,355 కోట్లకు మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 882 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 4.4 శాతానికి, నికర ఎన్పీఏలు 1.7 శాతం నుంచి 1.31 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 116 కోట్లను తాకాయి. కనీస మూలధన నిష్పత్తి 18.04 శాతాన్ని తాకింది. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6.5 శాతం జంప్చేసి రూ. 25.5 వద్ద ముగిసింది. -
క్రిసిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఈ ఏడాది(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 172 కోట్లకు చేరింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ. 152 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 772 కోట్ల నుంచి రూ. 833 కోట్లకు బలపడింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 15 చొప్పున మూడో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ షేరు బీఎస్ఈలో 2% లాభంతో రూ. 4,790 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం ప్లస్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 19,325 కోట్లను తాకింది. అధిక ప్రొవిజన్లు, వడ్డీ ఆదాయం మందగించడం లాభాలపై ప్రభావం చూపింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత నెమ్మదించి 1 శాతం వృద్ధితో రూ. 17,035 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంలో సాధారణంగా బలహీన ఫలితాలు వెలువడుతుంటాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఇకపై వృద్ధి పుంజుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వెరసి ఈ ఏడాదిలో రూ. లక్ష కోట్ల నికర లాభం అందుకోగలమని ధీమాగా చెప్పారు. వడ్డీ ఆదాయం ఓకే ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 6 శాతం మెరుగుపడి రూ. 41,125 కోట్లకు చేరింది. ఇందుకు 15 శాతం రుణ విడుదల దోహదపడగా.. నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.35 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 12,063 కోట్ల నుంచి రూ. 11,162 కోట్లకు తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ బుక్ను నిబంధనలకు అనుగుణంగా సవరించడం ఇందుకు కారణమైనట్లు ఖారా తెలియజేశారు. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి నమోదైంది. తాజా స్లిప్పేజీలు రూ. 7,900 కోట్లను తాకాయి. వీటిలో రూ. 3,000 కోట్లు గృహ, వ్యక్తిగత రుణాల నుంచి నమోదైంది. స్థూల మొండిబకాయిలు 2.24 శాతం నుంచి 2.21 శాతానికి స్వల్పంగా తగ్గాయి. రుణ నష్టాల ప్రొవిజన్లు 70 శాతం పెరిగి రూ. 4,580 కోట్లయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 13.86 శాతంగా నమోదైంది.షేరు ప్రతిఫలించడంలేదుగత నాలుగేళ్లలో ఎస్బీఐ ఆర్జించిన లాభాలు అంతక్రితం 64 ఏళ్లలో సాధించిన లాభాలకంటే అధికమైనప్పటికీ షేరు ధరలో ఇది ప్రతిఫలించడంలేదని దినేష్ ఖారా అభిప్రాయపడ్డారు. 22,000కుపైగా బ్రాంచీలు, భారీ రిజర్వులు, విభిన్న ప్రొడక్టులు కలిగిన బ్యాంక్కు సరైన విలువ లభించడంలేదని వ్యాఖ్యానించారు. గత 4ఏళ్లలో రూ. 1.63 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించగా.. అంతక్రితం 64 ఏళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమే ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెలాఖరున ఖారా పదవీకాలం ముగియనుంది. బాధ్యతలు స్వీకరించేటప్పటికి బ్యాంక్ వార్షిక లాభం రూ. 14,000 కోట్లుకాగా.. ప్రస్తుతం ఒక త్రైమాసికంలోనే రూ. 17,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్య సైతం ఆరు రెట్లు ఎగసి 30 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ అంశాలేవీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలేదంటూ ఖారా విచారం వ్యక్తం చేశారు. ప్రొవిజన్ల విషయంగా కొత్త చైర్మన్కు కుదుపులు ఉండవని, ఎండీలంతా కలసి బ్యాలన్స్ïÙట్ను రూపొందించారని వివరించారు. కాగా.. గత ఐదేళ్లలో ఎస్బీఐ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 0.84 లక్షల కోట్ల నుంచి రూ. 1.92 లక్షల కోట్లకు ఎగసింది. అయినప్పటికీ ఇది తగిన విలువకాదంటూ ఖారా పేర్కొన్నారు. ఎఫ్అండ్వోపై రిటైల్ ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తూ సెబీ తీసుకుంటున్న నియంత్రణలతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు మళ్లే వీలున్నట్లు ఖారా అభిప్రాయపడ్డారు. -
టాటా మోటార్స్ లాభం జంప్
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024–25, క్యూ1)లో బంపర్ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 74 శాతం జంప్ చేసి రూ. 5,566 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,204 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా దేశీ వాహన వ్యాపారంతో పాటు జాగ్వార్ ల్యాండ్రోవర్ (జేఎల్ఆర్) పటిష్టమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,03,597 కోట్ల నుంచి రూ. 1,09,623 కోట్లకు వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన (దేశీ కార్యకలాపాలు) క్యూ1లో కంపెనీ రూ. 2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 64 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 16,132 కోట్ల నుంచి రూ. 18,851 కోట్లకు పెరిగింది. ఇక జూన్ క్వార్టర్లో జేఎల్ఆర్ ఆదాయం కొత్త రికార్డులను తాకింది. 5 శాతం వృద్ధితో 7.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది. టాటా మోటార్స్ షేరు ధర 1 శాతం లాభపడి రూ.1,145 వద్ద ముగిసింది. కంపెనీ విభజనకు బోర్డు ఓకే... టాటా మోటార్స్ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడగొట్టే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం, టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) నుంచి వాణిజ్య వాహన వ్యాపారాన్ని టాటా మోటార్స్ సీవీగా విభజిస్తారు. ప్రస్తుత పీవీ వ్యాపారం టీఎంఎల్లో విలీనం అవుతుంది. విభజన తర్వాత టీఎంఎల్సీవీ, టీఎంఎల్ పేర్ల మార్పుతో పాటు రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 12–15 నెలలు పట్టొచ్చని వెల్లడించింది. -
క్యూ1లో విప్రో ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు. 12,000 మందికి చాన్స్ ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది. షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 906 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 903 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెన్షన్ ప్రొవిజన్లు కారణమయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 15 శాతం ఎగసి రూ. 2,195 కోట్లను తాకింది. 20 శాతం రుణ వృద్ధి ఇందుకు సహకరించగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.36 శాతం నుంచి 3.21 శాతానికి నీరసించాయి. పెన్షన్లకు రూ. 162 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. ఇక పూర్తి ఏడాదికి బ్యాంక్ రూ. 3,720 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022–23లో రూ. 3,010 కోట్లు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది(2024–25) 18 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా స్లిప్పేజీలు రూ. 436 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 2.13 శాతానికి చేరగా.. కనీస మూలధన నిష్పత్తి 16.13 శాతంగా నమోదైంది. ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ సెప్టెంబర్లో బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అభ్యర్ధుల జాబితాలను కొద్ది వారాలలో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం బలపడి రూ. 168 వద్ద ముగిసింది. -
Q4 results: బజాజ్ ఆటో లాభం హైజంప్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. వాహన విక్రయాలు జూమ్ క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది. బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్ చేసింది. రూ. 7,969 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర(1 శాతం) వృద్ధితో రూ. 37,923 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,441 కోట్ల టర్నోవర్ నమోదైంది. తయారీ రంగ సేవలు నెమ్మదించగా.. 20.1 శాతం నిర్వహణ మార్జిన్లను అందుకుంది. క్యూ4లో 84.8 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ ఫ్లో సాధించింది. గత 11 త్రైమాసికాలలోనే ఇది అత్యధికం. 1–3 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఇన్ఫోసిస్ ఆదాయంలో 1–3 శాతం వృద్ధిని అంచనా(గైడెన్స్) వేసింది. 20–22 శాతం నిర్వహణ లాభ మార్జిన్లను ఆశిస్తోంది. అయితే గతేడాది ప్రకటించిన 4–7 శాతం వృద్ధితో పోలిస్తే తాజాగా బలహీన గైడెన్స్ను వెలువరించింది. గతేడాది సాధించిన ఫలితాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు(గైడెన్స్) అధికమేనని సీఈవో పరేఖ్ పేర్కొన్నారు. విభాగాలవారీగా చూస్తే గతేడాదికంటే రానున్న 12 నెలల్లో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో ఉత్తమ పనితీరు చూపేందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. విచక్షణా వ్యయాల తీరు, కన్సాలిడేషన్, వ్యయ నియంత్రణపై దృష్టి ద్వారా గైడెన్స్ను ప్రకటించినట్లు వెల్లడించారు. కాగా.. మార్చితో ముగిసిన గతేడాదికి 20.7 శాతం నిర్వహణ మార్జిన్లు సాధించింది. ఈ కాలంలో నికర లాభం 9% ఎగసి రూ. 26,233 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4.7% బలపడి రూ. 1,53,670 కోట్లయ్యింది. 2022–23లో రూ. 24,095 కోట్ల నికర లాభం, రూ. 1,46,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల కేటాయింపుల విధానాన్ని బోర్డు సమీక్షించడంతోపాటు, అనుమతించినట్లు సీఎఫ్వో జయే‹Ù.ఎస్ పేర్కొన్నారు. ఈ కాలంలో వాటాదారులకు వార్షికంగా డివిడెండ్ను పెంచడం ద్వారా 85 శాతం కేటాయింపుల(రిటర్నులు)కు వీలున్నట్లు అంచనా వేశారు. ఇతర విశేషాలు.. ► పూర్తి ఏడాది(2023–24)కి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 17.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 52 శాతం కొత్త ఆర్డర్లు. ► షేరుకి రూ. 28 తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ► పూర్తి ఏడాదిలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో 2001 తదుపరి మొత్తం ఉద్యోగుల సంఖ్య(7.5%) క్షీణించింది. 3,17,240కు పరిమితమైంది. 2022–23లో సిబ్బంది సంఖ్య 3,43,234గా నమోదైంది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 12.6% గా నమోదైంది. రూ. 4,000 కోట్లతో.. జర్మనీ సంస్థ ఇన్టెక్లో 100 శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందుకు 45 కోట్ల యూరోలు(రూ. 4,000 కోట్లు) వెచి్చంచనుంది. ఈమొబిలిటీ, కనెక్టెడ్, అటానమస్ డ్రైవింగ్, ఈవీలు, ఆఫ్రోడ్ వాహనాల విభాగంలో కంపెనీ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కొనుగోలుతో జర్మన్ ఓఈఎం క్లయింట్లను పొందడంతోపాటు 2,200 మంది సుశిక్షిత సిబ్బందిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తికాగలదని అంచనా వేస్తోంది. డీల్స్లో రికార్డ్ గతేడాది భారీ డీల్స్లో కొత్త రికార్డు సాధించాం. ఇది కంపెనీపట్ల క్లయింట్లకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. జనరేటివ్ ఏఐలో సిబ్బంది సామర్థ్యాల విస్తరణ కొనసాగుతుంది. క్లయింట్ల ప్రోగ్రామ్లు, విభిన్న లాంగ్వేజీలపై పనిచేయడం, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ వినిమయం తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – సలీల్ పరేఖ్, ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
మరోసారి టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవ లకు దేశంలో నంబర్ వన్.. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. మార్చితో ముగిసిన గతేడాది (2023–24)తోపాటు చివరి త్రైమాసికంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేట్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో రూ. 12,434 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో సాధించిన రూ. 11,392 కోట్లతో పోలిస్తే 9 శాతం అధికం. త్రైమాసిక ప్రాతిపదికన(రూ. 11,058 కోట్లు) సైతం 12 శాతంపైగా వృద్ధి నమోదైంది. ఇందుకు మెరుగుపడిన మార్జిన్లు, దేశీ బిజినెస్లో వృద్ధి దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 61,237 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 59,162 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ బోర్డు షేరుకి రూ. 28 చొప్పున వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదిలో.. గత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 9 శాతం అధికంగా రూ. 45,908 కోట్ల నికర లాభం ప్రకటించింది. నిర్వ హణ లాభ మార్జిన్లు 1.5 శాతం బలపడి 26 శాతాన్ని తాకా యి. మొత్తం ఆదాయం 7% వృద్ధితో రూ. 2,40,893 కోట్లయ్యింది. టర్నోవర్లో అతిపెద్ద మార్కెట్ ఉత్తర అమెరికా వాటా 2.3% తగ్గి 50 శాతానికి పరిమితమైంది. 24.6% నిర్వహణ మార్జిన్లు సాధించింది. దేశీ బిజినెస్ 38% ఎగసింది. దీంతో మొత్తం ఆదాయంలో దేశీ వాటా 5% నుంచి 6.7 శాతానికి బలపడింది. 40ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. అయితే కొత్త సీవోవోగా ఎవరినీ ఎంపిక చేయబోమని, సీనియర్లకు బాధ్యతలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఉద్యోగు లకు 4.7% వార్షిక వేతన పెంపును చేపట్టనున్నట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అత్యుత్తమ పనితీరు చూపినవారికి రెండంకెలలో పెంపు ఉంటుందని తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ 0.5% పెరిగి రూ. 4,005 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు ► క్యూ4లో కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందింది. ► పూర్తి ఏడాదికి 42.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► క్యూ4లో యూకే బీమా దిగ్గజం అవైవాతో 15 ఏళ్ల కాలానికి మెగా డీల్ను సాధించింది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతం నుంచి 12.5 శాతానికి దిగివచి్చంది. ► క్యూ4లో సుమారు 2,000 మంది తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కు చేరింది. ► వరుసగా మూడు త్రైమాసికాలలో మొత్తం 13,249 మంది సిబ్బంది తగ్గారు. ► 2004లో టీసీఎస్ లిస్టింగ్ తదుపరి గతేడాదిలోనే తొలిసారి ఉద్యోగుల సంఖ్యలో కోతపడింది. అనిశ్చితిలోనూ లాభాల మార్జిన్, ఆర్డర్ బుక్ సమర్ధవంత ఎగ్జిక్యూషన్, పటిష్ట బిజినెస్ మోడల్ కంపెనీ విలువను తెలియజేస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితిలోనూ కీలకమైన, ప్రాధాన్యతగల అంశాలలో మెరుగైన సేవలను అందించాం. విభిన్న ఆఫరింగ్స్, కొత్తతరహా సామర్థ్యాలు, నాయకత్వ సలహాల ద్వారా కస్టమర్లకు మద్దతిచ్చాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
ఈజీ ట్రిప్ ప్లానర్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సరీ్వసుల కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 46 కోట్లకు చేరింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. ఈజ్మైట్రిప్ బ్రాండుతో సరీ్వసులందించే కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 136 కోట్ల నుంచి 161 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 83 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు పెరిగాయి. ఎయిర్ టికెటింగ్ బిజినెస్కుతోడు హోటళ్లు, హాలిడేస్, ట్రాన్స్పోర్టేషన్ తదితర విభాగాలలోనూ సేవలను విస్తరిస్తున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో నిశాంత్ పిట్టి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఈజీ ట్రిప్ షేరు బీఎస్ఈలో 3 శాతం పతనమై రూ. 51 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం స్పీడ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3) లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ. 3,207 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,406 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 33,513 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 29,251 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో 8 శాతం అధికంగా 5,01,207 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీ అమ్మకాలు 4,29,422 యూనిట్లుకాగా.. 71,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఇవి ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గత క్యూ3లో దేశీయంగా 4,03,929, విదేశాలలో 61,982 యూనిట్ల చొప్పున విక్రయించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) మారుతీ సుజుకీ 7 శాతం వృద్ధితో మొత్తం 15,51,292 వాహనాలను విక్రయించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆదాయం, నికర లాభాల్లోనూ రికార్డులు నమోదయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 1,03,387 కోట్లను తాకగా.. నికర లాభం 9,536 కోట్లు ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 2.3 శాతం బలపడి రూ. 10,183 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 2,524 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,166 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,241 కోట్ల నుంచి రూ. 12,381 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 8,943 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8.5 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. గ్లోబల్ స్పెషాలిటీసహా విస్తారిత వృద్ధిని సాధించినందుకు సంతోíÙస్తున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. రానున్న నెలల్లో నైడెల్జీ ఈఎంఏ ఫైలింగ్పై దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. మెలనోమాతోపాటు, మెలనోమాయేతర చర్మ కేన్సర్ల చికిత్సలో వినియోగించే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది. విభాగాలవారీగా ప్రస్తుత సమీక్షా కాలంలో దేశీయంగా సన్ ఫార్మా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతంపైగా పుంజుకుని రూ. 3,779 కోట్లకు చేరాయి. టారోసహా యూఎస్ విక్రయాలు 13 శాతం ఎగసి 47.7 కోట్ల డాలర్లను తాకాయి. వర్ధమాన మార్కెట్లలో ఇవి 2 శాతం నీరసించి 25.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి 13 శాతం అధికంగా 21.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. ఏపీఐ విక్రయాలు 10 శాతం క్షీణించి రూ. 466 కోట్లకు చేరాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధిపై రూ. 825 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. గత క్యూ3లో ఇవి రూ. 670 కోట్లు మాత్రమే. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 3.5 శాతం లాభపడి రూ. 1,419 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం రూ. 5,401 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది. సిగరెట్లుసహా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్గా ప్రకటించింది. కాగా.. నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లైఫ్ లాభం అప్
ముంబై: ప్రయివేట్ రంగ జీవిత బీమా దిగ్గజం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1,083 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం, మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వ్యక్తిగత కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం జంప్చేసి రూ. 17,762 కోట్లను తాకింది. వార్షిక ప్రీమియం పాలసీల ఆదాయం(ఏపీఈ) 17 శాతం పుంజుకుని రూ. 14,389 కోట్లయ్యింది. కొత్త బిజినెస్ విలువ(వీఎన్బీ) 11 శాతం బలపడి రూ. 4,038 కోట్లకు చేరింది. వీఎన్బీ మార్జిన్ 28.1 శాతంగా నమోదైంది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ. 21,512 కోట్ల నుంచి రూ. 26,000 కోట్లకు పురోగమించింది. రక్షణ సంబంధ కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం అధికమై రూ. 2,972 కోట్లుగా నమోదైంది. యాన్యుటీ, పెన్షన్ కొత్త బిజినెస్ 12 శాతం వృద్ధితో రూ. 6,787 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,381 వద్ద ముగిసింది. -
కొటక్ మహీంద్రా క్యూ3 గుడ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 4,265 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 2,792 కోట్ల నుంచి రూ. 3,005 కోట్లకు బలపడింది. డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వడ్డీ ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 6,554 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 5.47 శాతం నుంచి 5.22 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం రూ. 1,948 కోట్ల నుంచి రూ. 2,2,97 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 149 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగాయి. ఫలితంగా లాభాల్లో వృద్ధి పరిమితమైనట్లు వెల్లడించింది. బ్యాంక్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్లు)లో పెట్టుబడులకు రూ. 190 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొంది. అన్సెక్యూర్డ్ రుణాల కారణంగా తాజా స్లిప్పేజీలు రూ. 748 కోట్ల నుంచి రూ. 1,177 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ పటిష్టస్థితిలో ఉన్నట్లు ఎండీ, సీఈవోగా కొత్తగా ఎంపికైన అశోక్ వాస్వాని స్పష్టం చేశారు. కనీస మూలధన నిష్పత్తి 20 శాతం నుంచి 19 శాతానికి వెనకడుగు వేసింది. వారాంతాన బీఎస్ఈలో కొటక్ మహీంద్రా షేరు 2.3 % బలపడి రూ. 1,806 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 26 శాతం జంప్చేసి రూ. 11,053 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 24 శాతం ఎగసి రూ. 10,272 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 18,678 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.65 శాతం నుంచి 4.43 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం 20 శాతం పురోగమించి రూ. 5,975 కోట్లయ్యింది. ఏఐఎఫ్ల ఎఫెక్ట్ ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మదింపుచేస్తే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్లు)లో పెట్టుబడులకు రూ. 627 కోట్లమేర దెబ్బతగిలినప్పటికీ ప్రొవిజన్లు రూ. 2,257 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. మొత్తం ఏఐఎఫ్లకు కేటాయింపులు చేపట్టినట్లు తెలియజేశారు. నిజానికి గతేడాది చేపట్టిన కంటింజెన్సీ ప్రొవిజన్లు, అవలంబించిన ప్రొవిజన్ విధానాలు కేటాయింపుల తగ్గింపునకు దోహదపడినట్లు తెలియజేశారు. కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం నికర లాభం రూ. 227 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. సాధారణ బీమా నికర లాభం 22 శాతం జంప్చేసి రూ. 431 కోట్లను తాకగా.. అసెట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి 30 శాతం అధికంగా రూ. 546 కోట్లు ఆర్జించింది. బ్రోకరేజీ బిజినెస్ నికర లాభం 66 శాతం దూసుకెళ్లి రూ. 466 కోట్లయ్యింది. వారాంతాన బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1 శాతం బలపడి రూ. 1,008 వద్ద ముగిసింది. -
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టైటన్ లాభం అప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 916 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 835 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 25 శాతం జంప్చేసి రూ. 10,708 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 8,567 కోట్ల అమ్మకాలు సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 11,402 కోట్లకు చేరాయి. ఇక మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 12,653 కోట్లయ్యింది. దీనిలో జ్యువెలరీ విభాగం ఆదాయం 39 శాతం జంప్చేసి రూ. 11,081 కోట్లను తాకగా.. వాచీలు తదితర బిజినెస్ 32 శాతం వృద్ధితో రూ. 1,092 కోట్లకు చేరింది. వెరసి వాచీలు, వేరబుల్స్ విభాగం తొలిసారి రూ. 1,000 కోట్ల టర్నోవర్ను అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకేర్ ఆదాయం 13 శాతం బలపడి రూ. 189 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 10 టైటన్ వరల్డ్ స్టోర్లతోపాటు, హీలియోస్ 5, ఫాస్ట్ట్రాక్ 5 చొప్పున స్టోర్లను ఏర్పాటు చేసింది. ఫలితాల నేపథ్యంలో టైటన్ షేరు బీఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 3,273 వద్ద ముగిసింది. -
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మెరుగైన పనితీరు
గురుగ్రామ్: సప్లయ్ చైన్, లాజిస్టిక్స్ సేవల్లోని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.912 కోట్లకు చేరింది. పన్ను అనంతరం లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 57 కోట్లతో పోలిస్తే 17 శాతం వరకు వృద్ధి చెంది రూ.67 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్ 11.9 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి)గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 6 శాతం పెరిగి రూ.1963 కోట్లుగా నమోదైంది. లాభం 13 శాతం వరకు పెరిగి రూ.171 కోట్లుగా ఉంది. -
యూనియన్ బ్యాంక్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్తో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు రెట్టింపై రూ.3,511 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,848 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం రూ.22,958 కోట్ల నుంచి రూ.28,282 కోట్లకు దూసుకుపోయింది. నిర్వహణ లాభం సైతం రూ.6,577 కోట్ల నుంచి రూ.7,221 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.19,682 కోట్ల నుంచి రూ.24,587 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.9,126 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.15 శాతం నుంచి 3.18 శాతానికి పెరిగింది. బ్యాంకు ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 6.38 శాతానికి క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 8.45 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 1.30 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 2.64 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 16.69 శాతానికి మెరుగుపడింది. కాసా రేషియో (కరెంట్, సేవింగ్స్ ఖాతాలు) 35.64 శాతం నుంచి 34.66 శాతానికి తగ్గింది. సెపె్టంబర్ క్వార్టర్లో అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించినట్టు బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వం వాటా 83.49 శాతం నుంచి 76.99 శాతానికి తగ్గింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 62 శాతం జంప్చేసి రూ. 1,988 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,225 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 10,710 కోట్ల నుంచి రూ. 13,743 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.3 శాతం నుంచి రూ. 4.97 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలహీనపడి రూ. 400 వద్ద ముగిసింది. -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది (2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24% జంప్చేసి రూ. 4,423 కోట్లను తాకింది. వడ్డీ ఆదా యం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 2,581 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% వృద్ధితో రూ. 6,297 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 5.22 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 1,832 కోట్ల నుంచి రూ. 2,314 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.08% నుంచి రూ. 1.72%కి తగ్గాయి. అశోక్ వాశ్వానికి సై: కొటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా బయటి వ్యక్తి అశోక్ వాస్వాని ఎంపికకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ నాలుగు నెలల ముందుగానే ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో అశోక్ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది. -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 2,667 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,649 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22,516 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,540 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఐదు అనుబంధ సంస్థలను కంపెనీలో విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. వీటిలో విప్రో హెచ్ఆర్, ఓవర్సీస్ ఐటీ, టెక్నాలజీ ప్రొడక్టు సరీ్వసులు, వీఎల్ఎస్ఐ డిజైన్ సరీ్వసులు, విప్రో ట్రేడ్మార్క్ హోల్డింగ్ ఉన్నాయి. గైడెన్స్ వీక్.. ప్రస్తుత త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.5–1.5 శాతం మధ్య క్షీణించవచ్చంటూ విప్రో తాజా అంచనాల(గైడెన్స్)ను ప్రకటించింది. వెరసి కరెన్సీ నిలకడ ప్రాతిపదికన 261.7–267.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఊహిస్తోంది. అంటే రూ. 21,643–22,097 కోట్ల మధ్య టర్నోవర్ను అంచనా కట్టింది. ప్రస్తుత బలహీన ప్రపంచ ఆర్థిక ఔట్లుక్ నేపథ్యంలో తాజా గైడెన్స్ను ప్రకటించింది. ఇతర విశేషాలు ► నిర్వహణ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 16.1 శాతానికి చేరాయి. ► 3.78 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► క్యూ2కల్లా సిబ్బంది సంఖ్య 7 శాతం తగ్గి 2,44,707కు చేరింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 త్రైమాసికాల్లోనే తక్కువగా 15.5%కి పరిమితమైంది. అనిశి్చతులు ఉన్నాయ్... బిజినెస్ వాతావరణం అనిశి్చతిగా ఉన్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలలో కొనసాగుతున్నాయని, పెట్టుబడులపట్ల క్లయింట్లు మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పెట్టుబడుల గరిష్ట వినియోగంపై దృష్టి పెడుతూనే కొత్త పెట్టుబడులపై వేగవంత రిటర్నులను ఆశిస్తున్నట్లు వివరించారు. విచక్షణా వ్యయాలు, ఆర్డర్లు నెమ్మదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్జిన్లు నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 408 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫలితాలు బాగున్నాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2023–24 రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ2 లో నికర లాభం 72% జంప్చేసి రూ. 920 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నిర్వహణ లాభం 31% బలపడి రూ. 1,920 కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎండీ ఏఎస్ రాజీవ్ పేర్కొన్నారు. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,317 కోట్ల నుంచి రూ. 5,796 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు 3.4% నుంచి 2.19%కి తగ్గాయి. -
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలుపు పక్కా
న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచి్చతంగా విజయం సాధిస్తుందన్న రాహుల్.. తెలంగాణలో నెగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక రాజస్థాన్లో రెండు పారీ్టల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పారీ్టయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ ఆఫ్ అసోమ్ సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రాహుల్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్య పోరాటం చేస్తాయని, ఆ ఎన్నికల్లో బీజేపీని నివ్వెరపరిచే ఫలితాలు వస్తాయని అన్నారు. ఆయన ఇంకా ఏం అన్నారంటే.. ‘ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న పాట పాడుతోంది. కులగణన వంటి అంశాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మరో ఎంపీ దాని‹Ùపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రజా అంశాలను పక్కదారి పట్టించడానికే. ఆదాయ అసమానతలు, కొందరి చేతుల్లోనే సంపద పోగుపడిపోవడం, నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చడం, వెనుకబడిన కులాలు, ఓబీసీలు, ఆదివాసీల పట్ల చిన్నచూపు, అధిక ధరలు వంటి సమస్యలు దేశాన్ని బాధిస్తున్నాయి. ఈ అంశాలపై దృష్టి సారించలేని బీజేపీ వాటిని పక్కదారి పట్టించే మార్గంలో నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కచి్చతంగా గెలుస్తాం. రాజస్తాన్లో గట్టి పోటీ ఉంది. కానీ కాంగ్రెస్ పారీ్టయే గెలుస్తుంది. ఇది మా పార్టీ అంచనా కాదు. బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలింది’ అని రాహుల్ గాంధీ వివరించారు. జిమ్ అంటేనే ఇష్టం విలేకరులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకూ రాహుల్ హుషారుగా బదులిచ్చారు. తీరిక సమయాల్లో నెట్ఫ్లిక్స్ చూస్తారా, జిమ్ చేస్తారా అని ప్రశ్నిస్తే జిమ్ చేయడమంటేనే తనకు ఇష్టమని చెప్పారు. గెడ్డంతో ఉండడం ఇష్టమా, లేకపోతే ఇష్టమా అని అడిగితే కాంగ్రెస్ పారీ్టలో ఉన్నాను కాబట్టి వేసుకునే వీటిని పట్టించుకోవడం లేదని, ఎలా ఉన్నా ఫర్వాలేదని నవ్వారు. రాజకీయ నేత కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అని ప్రశ్నించగా ‘ఏదైనా అయి ఉండేవాడిని. నా మేనల్లుడు, వాడి స్నేహితుల్ని కలిసినప్పుడు టీచర్గా మారతా. వంటగదిలోకి అడుగు పెడితే చెఫ్ అయిపోతా. ఇలా నేను బహుముఖ పాత్రలు పోషిస్తుంటా’ అని రాహుల్ చెప్పారు. ‘క్రికెట్ కంటే ఫుట్బాల్ అంటే ఇష్టం. క్రీడాకారుడు మెస్సి రొనాల్డో అంటేఇష్టమన్నారు. గాడ్ఫాదర్, డార్క్నైట్ వీటిల్లో ఏ సినిమా అంటే ఇష్టం అని అడగ్గా.. రెండూ నాకు ఇష్టమే’ అని చెప్పారు. ఇండియా, భారత్లో దేశానికి ఏ పేరు ఉండాలని ప్రశ్నించగా ఇండియా అంటేనే భారత్ అని రాహుల్ చెప్పారు. -
ఐటీసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 16% ఎగసి రూ. 5,180 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,462 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 19,831 కోట్ల నుంచి రూ. 18,639 కోట్లకు తగ్గింది. ఇది 6% క్షీణతకాగా.. మొత్తం వ్యయాలు సైతం 13% తగ్గి రూ. 12,422 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక మొత్తం టర్నోవర్ 4% నీరసించి రూ. 19,362 కోట్లుగా నమోదైంది. విభాగాలవారీగా..: తాజా క్యూ1లో ఐటీసీ.. ఎఫ్ఎంసీజీ విభాగం 13 శాతంపైగా వృద్ధితో రూ. 13,528 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దీనిలో సిగరెట్ల బిజినెస్ నుంచి 12 శాతం అధికంగా రూ. 8,356 కోట్లు అందుకుంది. హోటళ్ల బిజినెస్ 8% బలపడి రూ. 625 కోట్ల ఆదాయం అందుకుంది. ‘హోటల్’ షేర్ల జారీ తీరిదీ..: ఐటీసీ హోటల్స్ పేరుతో ఆతిథ్య రంగ బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా ఐటీసీ విడదీస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల జారీకి ఆమోదముద్ర వేసినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు ఐటీసీలోగల ప్రతీ 10 షేర్లకుగాను 1 ఐటీసీ హోటల్ షేరును కేటాయించనుంది. షేర్ల జారీ తదుపరి ఐటీసీ హోటల్స్లో 60% వాటాను ఐటీసీ వాటాదారులు పొందనుండగా.. ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. హోటల్ షేర్లు త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్కానున్నాయి. ఐటీసీ హోటల్స్ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు సుమారు 15 నెలలు పట్టవచ్చని ఐటీసీ తాజాగా అంచనాలు ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 449 వద్ద ముగిసింది. -
ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 17 శాతం అప్
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) ఆగస్టు 10వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.5.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 32 శాతానికి సమానం. ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం, స్థూల వసూళ్లు 15.73 శాతం పురోగతితో రూ.6.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రిఫండ్స్ రూ.69,000 కోట్లు. ఒక్క రిఫండ్స్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 3.73 శాతం అధికం. 2023–24లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23తో పోల్చితే (రూ.16.61 లక్షల కోట్లు) ఈ పరిమాణం 9.75 శాతం అధికం. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి. -
ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 44 శాతం జంప్చేసి రూ. 10,636 కోట్లను తాకింది. స్టాండెలోన్ లాభం సైతం 40 శాతం ఎగసి రూ. 9,648 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం(స్టాండెలోన్) రూ. 28,337 కోట్ల నుంచి రూ. 38,763 కోట్లకు పురోగమించింది. నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 18,227 కోట్లను తాకింది. రుణాల్లో 18 శాతం వృద్ధి సాధించగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.78 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 5,183 కోట్లయ్యింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.81 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 4,297 కోట్ల నుంచి రూ. 5,318 కోట్లకు పెరిగాయి. వీటిలో రిటైల్ విభాగం వాటా రూ. 5,012 కోట్లుకాగా.. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.9 శాతానికి చేరడంతో పెట్టుబడుల సమీకరణ అవసరంలేనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ1 భేష్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్ మాతృ సంస్థ, మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ ఆదాయం అప్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతాన్ని తాకింది. ఇతర విశేషాలు... ► జూన్కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది. ► అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్ చేసింది. ► హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది. ► బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. ► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ క్యాప్ రికార్డ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్ విలువరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసింది. ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ ర్యాంక్ బ్యాంక్ పేరు మార్కెట్ క్యాప్ 1. జేపీ మోర్గాన్ 438 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా 232 3. ఐసీబీసీ(చైనా) 224 4. అగ్రికల్చరల్ బ్యాంక్(చైనా) 171 5. వెల్స్ ఫార్గో 163 6. హెచ్ఎస్బీసీ 160 7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 154 (విలువ బిలియన్ డాలర్లలో– విదేశీ బ్యాంకులు శుక్రవారం(14న) ధరల్లో) -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14 శాతంపైగా వృద్ధితో రూ. 4,566 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 34 శాతం జంప్చేసి రూ. 3,496 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ. 8,573 కోట్ల నుంచి రూ. 10,939 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం బలపడి రూ. 6,103 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.75 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం 30 శాతం పుంజుకుని రూ. 2,186 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.34 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 21.80 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో అనుబంధ సంస్థలలో కొటక్ ప్రైమ్ నికర లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు వెనకడుగు వేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. అకౌంటింగ్ విధానాలలో మార్పు ఇందుకు కారణమైనట్లు పేర్కొంది. ఆటుపోట్ల మార్కెట్ కారణంగా క్యాపిటల్ మార్కెట్ ఆధారిత అనుబంధ సంస్థ అసెట్ మేనేజ్మెంట్ లాభం మాత్రం రూ. 192 కోట్లకు మెరుగుపడినట్లు తెలియజేసింది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 134 శాతం జంప్చేసి రూ. 803 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 343 కోట్లు ఆర్జించింది. నిర్వహణ లాభంలో 61 శాతం వృద్ధి(రూ. 1,342 కోట్లు) ఇందుకు దోహదం చేసింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం బ్యాంక్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,437 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 145 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదికి సంస్థ చరిత్రలోనే రికార్డు లాభాలను ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం మెరుగుపడి రూ. 3,597 కోట్లను తాకగా.. పూర్తి ఏడాదికి రూ. 9,706 కోట్ల నుంచి రూ. 12,635 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.7 శాతం నుంచి 2.51 శాతానికి, నికర ఎన్పీఏలు 1.53 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.82 శాతంగా నమోదైంది. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ, డిజిటల్ సర్వీసుల దిగ్గజం జియో ప్లాట్ఫామ్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం బలపడి రూ. 4,984 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 4,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 25,465 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,261 కోట్ల ఆదాయం నమోదైంది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 6.7 శాతం మెరుగై రూ. 178.8కు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 23 శాతం జంప్చేసి రూ. 19,124 కోట్లయ్యింది. 2021–22లో రూ. 15,487 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం ఎగసి రూ. 1,15,099 కోట్లకు చేరింది. క్యూ4లో 2.9 కోట్లమంది జత కలవడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 43.93 కోట్లను తాకింది. -
టీసీఎస్.. భేష్.. క్యూ4 నికర లాభం రూ. 11,392 కోట్లు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల నంబర్వన్ దేశీ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 11,392 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,959 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం బలపడి రూ. 59,162 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 50,591 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 41,440 కోట్ల ఫ్రీ క్యాష్ఫ్లోను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి టీసీఎస్ 10 శాతం అధికంగా రూ. 42,147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 2,25,458 కోట్లను తాకింది. కాగా.. కొత్త సీఈవో, ఎండీగా ఎంపికైన కె.కృతివాసన్ ప్రస్తుత సీఈవో రాజేష్ గోపీనాథన్ నుంచి జూన్1న బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఆర్డర్ బుక్ జోరు గతేడాది ఆర్డర్బుక్ 34.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. క్యూ4లో 10 బిలియన్ డాలర్లు జమైనట్లు తెలియజేసింది. చరిత్రాత్మక స్థాయిలో భారీ డీల్స్ సాధించినట్లు పేర్కొంది. 10 కోట్లకుపైగా డాలర్ల క్లయింట్ల సంఖ్య 60కు చేరింది. బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర అమెరికా నుంచి 15 శాతంపైగా వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఇతర హైలైట్స్ ► షేరుకి రూ. 24 తుది డివిడెండ్ ప్రకటించింది. ► నిర్వహణ లాభ మార్జిన్లు 24.1 శాతం నుంచి 24.5 శాతానికి బలపడ్డాయి. ► నికర మార్జిన్లు సైతం 18.7 శాతం నుంచి 19.3 శాతానికి మెరుగుపడ్డాయి. ► క్యూ4లో నికరంగా 821మందిని, పూర్తిఏడాదిలో 22,600 మందిని జమ చేసుకుంది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 6,14,795ను తాకింది. దీనిలో మహిళల వాటా 35.7 శాతం. ► ఉద్యోగ వలసల రేటు 20.1%గా నమోదైంది. ► ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 40,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనుంది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,246 వద్ద ముగిసింది. మరోసారి పటిష్ట ఫలితాలు ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నాం. మా సర్వీసులకున్న డిమాండును ఆర్డర్బుక్ ప్రతిఫలిస్తోంది. రిటైల్, కన్జూమర్, లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ విభాగాలు 13–12 శాతం వృద్ధిని సాధించాయి. బీఎఫ్ఎస్ఐ 9 శాతంపైగా పుంజుకుంది. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్ -
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
లాభాల్లోకి అదానీ ఎంటర్ప్రైజెస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 820 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 42 శాతం జంప్చేసి రూ. 26,612 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 26,171 కోట్లను దాటాయి. కంపెనీకి ప్రధానమైన ఇంటిగ్రేటెడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగం పన్నుకుముందు లాభం 370 శాతం దూసుకెళ్లి రూ. 669 కోట్లను తాకింది. ఈ బాటలో మైనింగ్, న్యూఎనర్జీ లాభాలు 3 రెట్లు ఎగసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,750 వద్ద ముగిసింది. -
ఐషర్ మోటార్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 741 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,973 కోట్ల నుంచి రూ. 3,913 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,416 కోట్ల నుంచి రూ. 3,006 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాణిజ్య వాహన భాగస్వామ్య సంస్థ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ 13 శాతం వృద్ధితో 18,162 యూనిట్లను విక్రయించినట్లు ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు సైతం 31 శాతం జంప్చేశాయి. 2,19,898 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత కొద్ది నెలలుగా ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు హంటర్ 350, సూపర్ మీటియోర్ 650కు అంతర్జాతీయంగా డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఎండీ సిద్ధార్థ లాల్ తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం నీరసించి రూ. 3,180 వద్ద ముగిసింది. -
టాటా పవర్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 1,052 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్ర మే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,019 కోట్ల నుంచి రూ. 14,402 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో హరిత ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ తదితర విభిన్న బిజినెస్లలో ప్రస్తావించదగ్గస్థాయిలో అడుగులు వేసినట్లు కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. పునరుత్పాదకాలు, ఒడిషా వి ద్యుత్ పంపిణీలలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. రూఫ్టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ విభాగాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ రూ. 15,440 కోట్ల విలువైన 3.9 గిగావాట్ల థర్డ్పార్టీ ప్రాజెక్టులతో కలిపి ఆర్డర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
ఏయూ స్మాల్ బ్యాంక్ లాభం రూ.393 కోట్లు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 6.3 శాతంగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగు మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్గా బ్యాంక్ తెలిపింది. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్మార్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 590 కోట్లకు చేరింది. డీమార్ట్ స్టోర్ల కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 553 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 11,569 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 8,494 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో ఈకామర్స్ బిజినెస్(డీమార్ట్ రెడీ)ను మరో 4 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోనా పేర్కొన్నారు. వెరసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నగరాలలో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్కేర్ అండ్ రిటైల్ ద్వారా షాప్ ఇన్ షాప్కింద పరిశీలనాత్మకంగా ఒక స్టోర్ లో ఫార్మసీని ప్రారంభించినట్లు వెల్లడించారు. డి సెంబర్కల్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా 306 డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో డీమార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 3,680 వద్ద ముగిసింది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 54 శాతం దూసుకెళ్లి రూ. 804 కోట్లను తాకింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 522 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,927 కోట్ల నుంచి రూ. 4,967 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పుంజుకుని రూ. 1,957 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.22 శాతం మెరుగై 3.49 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.06 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఈ బాటలో నికర ఎన్పీఏలు 1.24 శాతం నుంచి 0.73 శాతానికి నీరసించాయి. బాసెల్–3 నిబంధనల ప్రకారం కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) స్వల్ప వెనకడుగుతో 13.35 శాతంగా నమోదైంది. తొలి 9 నెలల్లో 60 బ్రాంచీలను జత చేసుకోగా క్యూ4లో మరో 20 ప్రారంభించనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 140 వద్ద ముగిసింది. -
ఆనంద్ రాఠీ వెల్త్ లాభం జూమ్
న్యూఢిల్లీ: నాన్బ్యాంక్ వెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 35 శాతం జంప్చేసి రూ. 43 కోట్లను అధిగమించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం ఎగసి రూ. 140 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 109 కోట్ల టర్నోవర్ నమోదైంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూ ఎం) 20 శాతం వృద్ధితో రూ. 38,517 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ, ఫై నాన్షియల్ ప్రొడక్టుల విక్రయం తదితర ఫైనాన్షియల్ సర్వీసులను కంపెనీ అందిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఆనంద్ రాఠీ వెల్త్ షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం జంప్చేసి రూ. 773 వద్ద ముగిసింది. తొలుత రూ. 780 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. -
కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతంగా!
కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఇస్తున్నప్పుడు... దాని ప్రభావం నేపథ్యంలో ఇతర చికిత్సలు అంత ప్రభావవంతంగా ఉండవేమోనంటూ అప్పట్లో చాలామంది డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చాక చేసిన నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ అనే ఒక రకం గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చినట్లు డాక్టర్లు, పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ చికిత్స మరింత బాగా జరిగేందుకు ఈ వ్యాక్సిన్ డోసులు దోహదం చేసినట్లు గ్రహించారు. వాస్తవానికి నేసోఫ్యారింజియల్ క్యాన్సర్కు యాంటీ పీడీ–1 థెరపీ అనే చికిత్స అందిస్తుంటారు. ఇది పీడీ–1 రిసెప్టార్స్ అనే జీవాణువులను అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం ద్వారా మందు ఇమ్యూన్ కణాలకు స్వేచ్ఛనిస్తుంది. దాంతో ఆ ఇమ్యూన్ కణాలు స్వేచ్ఛగా క్యాన్సర్ గడ్డకు కారణమయ్యే అంశాలపై యుద్ధం చేస్తాయి. ఇలా యాంటీ పీడీ–1 చికిత్స పనిచేస్తుంది. మనకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు... అది మన దేహంలో ఇమ్యూన్ ప్రతిస్పందనలు వచ్చే మార్గాల్లోని (పాత్ వేస్లోని) సిగ్నల్స్ను మరింతగా ప్రేరేపిస్తుంది. అలాంటప్పుడు ఆ సిగ్నల్స్ చురుగ్గా పనిచేస్తున్న కారణంగా క్యాన్సర్ చికిత్సకు ఇచ్చే మందులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయోనని డాక్టర్లు తొలుత ఆందోళన చెందారు. ‘‘యాంటీ పీడీ–1 థెరపీకి ఈ వ్యాక్సిన్ అడ్డంకిగా మారవచ్చేమోనని తొలుత మేం భయపడ్డాం. ఎందుకంటే ఈ నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ ఏ భాగాన్నైతో ప్రభావితం చేస్తుందో... కరోనా (సార్స్–సీవోవీ–2) కూడా అక్కడే ప్రభావం చూపుతుంది’’ అంటూ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్కు చెందిన బయోఇన్ఫర్మాటిక్స్ సైంటిస్ట్ జియాన్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అయితే వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే... వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో యాంటీ పీడీ–1 ఔషధాలు మరింత సమర్థంగా పనిచేయడం మమ్మల్ని అబ్బురపరచింది’’ అంటూ అదే యూనివర్సిటీకి చెందిన ఇమ్యూనాలజిస్ట్ క్రిస్టియన్ కర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిశోధక బృందం... నేసోఫ్యారింజియల్ క్యాన్సర్తో అక్కడి 23 ఆసుపత్రుల్లోని 1,537 మంది బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 373 మంది బాధితులకు క్యాన్సర్ చికిత్సకు ముందు ‘సైనో–వ్యాక్’’ అనే కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో క్యాన్సర్ మందు చాలా సమర్థంగా పనిచేసింది. అంతేకాదు... వారిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. ‘‘ఇది ఎలా జరిగిందో ఇప్పటికైతే మాకు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. బహుశా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... వారికి అందించిన మందుల వల్ల బాధితుల్లోని ఇమ్యూన్ వ్యవస్థ మరింత ప్రేరేపితమై ఉండవచ్చు. దాంతో ఈ ఫలితాలు వచ్చి ఉండవచ్చు’’ అని చైనాలోని శాంగ్జీ యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన క్యాన్సర్ పరిశోధకుడు క్వీ మెయ్ అభిప్రాయపడుతున్నారు. యూఎస్, యూకేలలో నేసో ఫేరింజియల్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువ. అయితే చైనా వంటి ఆసియా దేశాలతో ఇది ఎక్కువ. ఇక తైవాన్లో దీనివల్ల మరణాలూ మరింత ఎక్కువ. ఇప్పటివరకు కేవలం ఒక రకం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన బాధితులపైనే ఈ పరిశోధన జరిగింది. ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరిగి, అసలు ఈ మెకానిజమ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘యానల్స్ ఆఫ్ ఆంకాలజీ’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
పీటీసీ ఇండియా లాభం హైజంప్
న్యూఢిల్లీ: విద్యుత్ ట్రేడింగ్ సొల్యూషన్ల కంపెనీ పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 157 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 50 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5.80 చొప్పున డివిడెండును ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,926 కోట్ల నుంచి రూ. 3,107 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,793 కోట్ల నుంచి రూ. 2,891 కోట్లకు తగ్గాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 458 కోట్ల నుంచి రూ. 552 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం ఆదాయం రూ. 18,374 కోట్ల నుంచి రూ. 16,880 కోట్లకు నీరసించింది. కాగా.. గతేడాది మధ్యలోనే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. వెరసి మొత్తం రూ. 7.80 డివిడెండు చెల్లించినట్లయ్యింది. కంపెనీ ఈ ఏడాది(2022–23) జూన్ త్రైమాసిక ఫలితాలను సైతం ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు 1.1 శాతం లాభపడి రూ. 85 వద్ద ముగిసింది. -
మొండి బకాయిల కట్టడి చర్యలు ఫలితాలిస్తున్నాయ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకృత నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. ► రెండవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నికర లాభం భారీగా 74 శాతం ఎగసి రూ.13,265 కోట్లుగా నమోదయ్యింది. ► కెనరా బ్యాంక్ లాభం 89 శాతం వృద్ధితో రూ.2,525 కోట్లుగా నమోదయ్యింది. ► కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ లాభం 145% పెరిగి రూ.504 కోట్లుగా ఉంది. ► బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో లాభం 59 శాతం పెరిగి రూ.3,312.42 కోట్లుగా ఉంది. ► కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాల్లో ఉన్నా, ఇవి 9–63 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే మొండిబకాయిలకు అధిక కేటాయింపులు (ప్రొవిజినింగ్) దీనికి నేపథ్యం. పీఎన్బీ ప్రొవిజనింగ్స్ భారీగా రూ.2,693 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు చేరాయి. ఇక బీఓఐ విషయంలో ఈ కేటాయింపులు రూ.894 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు ఎగశాయి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 13 నుంచి 145 శాతం శ్రేణిలో ఉన్నాయి. యుకో బ్యాంక్ అత్యధికంగా 145 శాతం పెరిగితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 103 శాతం పెరిగింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికం ఇలా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. మొదటి త్రైమాసికంలో కూడా పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, సమీక్షా కాలంలో (2022 ఏప్రిల్–జూలై) రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
అక్టోబర్లో ‘సేవలు’ బాగున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం అక్టోబర్లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్లో 55.1కు ఎగసింది. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదిక సేవల సూచీ వృద్ధి బాటన ఉండడం ఇది వరుసగా 15వ నెల. తమ సర్వే ప్రకారం అక్టోబర్లో వరుసగా ఐదవనెల సేవల రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. గడచిన మూడు సంవత్సరాల్లో సేవల రంగం ఈ స్థాయి స్పీడ్ ఇది రెండవసారని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అక్టోబర్లో సేవల రంగం పురోగతికి దేశీయ మార్కెట్ ప్రధాన వనరని కూడా లిమా తెలిపారు. ఇక విదేశీ అమ్మకాలు మాత్రం వరుసగా మూడవ త్రైమాసికంలో దిగువబాటన నడిచాయని అన్నారు. -
ఐజీఎల్ ఆదాయం రూ.3,922 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 416 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,01 కోట్లు ఆర్జించింది. సహజవాయు ధరలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 3,922 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,016 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు 100 శాతం పెరిగిపోయినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో నేచురల్ గ్యాస్ కొనుగోలు వ్యయాలు రూ. 930 కోట్ల నుంచి రూ. 2,610 కోట్లకు ఎగశాయి. అయితే గ్యాస్ రోజువారీ సగటు అమ్మకాలు 7.24 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల నుంచి 8.09 ఎంఎంఎస్సీఎండీకి బలపడినట్లు వెల్లడించింది. సీఎన్జీ అమ్మకాలలో 15 శాతం, పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) విక్రయాలలో 3 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,213 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 1,182 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,444 కోట్ల నుంచి రూ. 11,758 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం 5.5 శాతం పురోగమించి రూ. 10,154 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,605 కోట్లకు పరిమితమైంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,559 కోట్ల నుంచి రూ. 2,219 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 9.69 8 శాతం నుంచి 8.13 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.47 శాతం నుంచి 2.12 శాతానికి బలహీనపడ్డాయి. కనీ స మూలధన నిష్పత్తి 16.51 శాతంగా నమోదైంది. -
రైతుల ఆదాయం పెరుగుతోంది
హిమ్మత్నగర్: రైతుల ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వివిధ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో పెట్రోల్లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్లు మాత్రమే కాగా, ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు. మొట్టమొదటి సారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ రూ.1లక్ష కోట్ల మార్కు దాటిందన్నారు. ఈ పరిశ్రమల్లో కోటిన్నర మందికి ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు. సబర్కాంత జిల్లా హిమ్మత్నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు పెట్రోల్లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్ను పెట్రోల్తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుందని ఆయన చెప్పారు. -
లాభాల్లోకి గోద్రెజ్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 423 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 92 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,611 కోట్ల నుంచి రూ. 4,445 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,814 కోట్ల నుంచి రూ. 4,202 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి గోద్రెజ్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ. 391 కోట్ల నుంచి రూ. 992 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 51 శాతం జంప్చేసి రూ. 14,130 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 9,334 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. నాదిర్ గోద్రెజ్ను మరో మూడేళ్లపాటు అంటే 2026 మార్చి 31వరకూ చైర్మన్, ఎండీగా బోర్డు తిరిగి ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ షేరు 9% జంప్చేసి రూ. 477 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 46 శాతం జంప్చేసి రూ. 6,693 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 4,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,700 కోట్ల నుంచి రూ. 32,707 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 21,516 కోట్ల నుంచి రూ. 25,161 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 203.4 మిలియన్ టన్నుల నుంచి 209 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు 165 ఎంటీ నుంచి 180 ఎంటీకి ఎగశాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఉత్పత్తి 596.22 ఎంటీ నుంచి 622.63 ఎంటీకి పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు 1% క్షీణించి రూ. 181 వద్ద ముగిసింది. -
ఉత్తమ్ గాల్వాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్స్ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 26 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇ దే కాలంలో రూ. 68 కోట్ల నికర నష్టం నమోదైంది. క్యూ4లో కోల్డ్ రోల్డ్, గాల్వనైజ్డ్ స్టీల్ తయారీకి కంపెనీ ఆదాయం సైతం రూ. 197 కోట్ల నుంచి రూ. 252 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు రూ. 264 కోట్ల నుంచి రూ. 278 కోట్లకు పెరిగాయి. -
యోగాతో కోవిడ్ పేషెంట్లలో సత్ఫలితాలు!
న్యూఢిల్లీ: ఐసోలేషన్ కాలంలో ఆన్లైన్ యోగా క్లాసులకు హాజరైన కోవిడ్ పేషెంట్లలో 92 శాతంమందికి సత్ఫలితాలు కనిపించాయని ఢిల్లీ ఫార్మాసైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది. కోవిడ్ లక్షణాల నుంచి వీరిలో అత్యధికులు తక్షణ మెరుగుదల చూపారని తెలిపింది. కోవిడ్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు ఢిల్లీ ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ యోగా క్లాసుల సదుపాయం కల్పిస్తోంది. వీరిలో 88.9 శాతం మంది తమకు శ్వాస సమస్యల నుంచి విముక్తి లభించినట్లు చెప్పారని నివేదిక తెలిపింది. ఐసోలేషన్లో తాము చేపట్టిన ఆన్లైన్ యోగా తరగతులు దాదాపు 4,600మంది పేషెంట్లకు ఉపకరించాయని ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పారు. మూలికా వ్యాక్సిన్ భేష్.. టొరెంటో: కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా మెడికాగో కంపెనీ రూపొందించిన మూలికాధార కోవిడ్ టీకా 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని క్లినికల్ గణాంకాలు వెల్లడించాయి. మొక్కల్లో ఉత్పత్తయ్యే కరోనా వైరస్ లాంటి రేణువు (సీవోవీఎల్పీ)లను ఎఎస్ఓ3 అనే సహాయ ఔషధంతో కలిపి ఈ టీకాను తయారు చేశారు. 24వేల మందిపై ఫేజ్3 ట్రయిల్స్ జరపగా 69.5 శాతం ప్రభావం చూపినట్లు తేలింది. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న వారిలో 74–78.8 శాతం ప్రభావం చూపింది. రోగుల్లో వైరల్ లోడు బాగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. టీకా సైడ్ ఎఫెక్టులు స్వల్పం నుంచి మోస్తరుగా ఉన్నట్లు తెలిపింది. -
క్యూ4లో వేదాంత దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,500 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 5,105 కోట్ల లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాల పరిమాణం, కమోడిటీల ధరలు, నిర్వహణా సామర్థ్యం సహకరించాయి. గత త్రైమాసికంలో రూ. 336 కోట్ల అనుకోని పద్దు నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధానంగా చమురు, గ్యాస్ విభాగంలో రూ. 2,697 కోట్ల ఇంపెయిర్మెంట్ రివర్సల్ ఆర్జనను కెయిర్న్ ఇంధన వెలికితీత వ్యయాల రైటాఫ్ కొంతమేర ప్రభావితం చేసినట్లు వివరించింది. వాటాదారులకు షేరుకి రూ. 31.5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇందుకు మే 9 రికార్డ్ డేట్కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 27,874 కోట్ల నుంచి రూ. 39,342 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో వ్యయాలు రూ. 22,549 కోట్ల నుంచి రూ. 29,901 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 51 శాతం వృద్ధితో రూ. 13,768 కోట్ల నిర్వహణా లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేసింది. పటిష్ట క్యాష్ ఫ్లో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంత నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 24,299 కోట్లను తాకింది. 2020–21లో రూ. 12,446 కోట్లు ఆర్జించింది. గతేడాది అత్యుత్తమ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 45,319 కోట్లు ఆర్జించింది. ఇక అనుకోని పద్దులు, పన్ను ఆర్జనకు ముందు నికర లాభం రూ. 24,299 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం, నిర్వహణా సామర్థ్యం, వ్యవస్థాగత ఇంటిగ్రేషన్, టెక్నాలజీ వినియోగం తదితరాలపై తాము పెట్టిన ప్రత్యేక దృష్టికి తాజా ఫలితాలు నిదర్శనమని వేదాంత సీఈవో సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. వెరసి రూ. 27,154 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. తద్వారా వృద్ధి అవకాశాలపై తిరిగి ఇన్వెస్ట్ చేయడం, బ్యాలెన్స్ షీట్ను మరింత పటిష్టపరచుకోవడం, వాటాదారులకు అధిక డివిడెండ్ల చెల్లింపు వంటివి చేపట్టేందుకు మరింత వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో వేదాంత షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 411 వద్ద ముగిసింది. -
హెచ్సీఎల్ టెక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల రంగ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 3,593 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,102 కోట్లు ఆర్జించింది. ఇందుకు వివిధ విభాగాలు, సర్వీసులకు నెలకొన్న భారీ డిమాండ్ సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.4 శాతం అధికంకాగా.. వార్షికంగా మొత్తం ఆదాయం 15 శాతం ఎగసి రూ. 22,957 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 575 కోట్లు వన్టైమ్ బోనస్, రూ. 1,222 కోట్లమేర వాయిదాపడిన పన్ను చెల్లింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రస్తావించింది. వీటిని పరిగణిస్తే ప్రస్తుత సమీక్షా కాలంలో నికర లాభం 24 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఇతర హైలైట్స్ ► స్థిర కరెన్సీ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో 12–14 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► గతేడాది 40,000 మంది ఫ్రెషర్స్ను నియమించుకుంది. సిబ్బంది సంఖ్య 2,08,877కు చేరింది. ► క్యూ4లో నికరంగా 11,100 మందికి ఉపాధిని కల్పించింది. ► మార్చికల్లా ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9 శాతంగా నమోదు. ► క్యూ4లో 226 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► పూర్తి ఏడాదికి నికర లాభం 11,145 కోట్ల నుంచి రూ. 13,499 కోట్లకు ఎగసింది. ► 2021–22లో మొత్తం ఆదాయం రూ. 75,379 కోట్ల నుంచి రూ. 85,651 కోట్లకు పెరిగింది. ప్రోత్సాహకరంగా.. మార్కెట్ వాతావరణం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. వివిధ విభాగాలు, సర్వీసులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వెరసి సర్వీసుల బిజినెస్లో మరోసారి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను సాధించాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో 17.5% వృద్ధిని అందుకున్నాం. – సి.విజయ్ కుమార్, సీఈవో, ఎండీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్. ఫలితాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ షేరు 1.2% బలపడి రూ. 1,102 వద్ద ముగిసింది. -
ఏపీలో సత్ఫలితాలిస్తోన్న మైనింగ్ సంస్కరణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనింగ్ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నూతన విధానాలకు రూపకల్పన చేశారు. పారదర్శకతతో అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఖనిజ ఆదాయంలో గనుల శాఖ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3765 కోట్ల ఆదాయం వచ్చింది. 60 శాతం వృద్ధి రేటుతో గత ఏడాది కన్నా అదనంగా రూ.1425 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీజు అనుమతులు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. తద్వారా లీజులు పొంది.. ఏళ్ల తరబడి క్వారింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానానికి స్వస్తి పలికారు. ముఖ్యంగా లీజుల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తుందని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పారు. -
ఎంఅండ్ఎం లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 1,353 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 531 కోట్లు ఆర్జించింది. శాంగ్యాంగ్ మోటార్ దివాలా కారణంగా రూ. 1,210 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టడం గతేడాది క్యూ3పై ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదా యం 8% వృద్ధితో రూ. 15,239 కోట్లకు చేరింది. ట్రాక్టర్ అమ్మకాలు డీలా... ప్రస్తుత సమీక్షా కాలంలో ఎంఅండ్ఎం 2 శాతం తక్కువగా 1,18,174 వాహనాలను విక్రయించింది. ట్రాక్టర్ల అమ్మకాలు 9% క్షీణించి 91,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. కాగా.. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,987 కోట్లకు జంప్చేయగా.. మొత్తం ఆదాయం రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,594 కోట్లకు పుంజుకుంది. ఈవీ విభాగంలో ఇప్పటికే త్రిచక్ర వాహనాలతో పట్టు సాధించగా.. ఫోర్వీలర్ మార్కెట్లోనూ నాయకత్వ స్థాయికి ఎదిగే వీలున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిష్ షా పేర్కొన్నారు. క్యూ3లో సెమీకండక్టర్ కొరతతో 20,000 యూనిట్ల ఉత్పత్తి నష్టం ఏర్పడినట్లు కంపెనీ ఆటో విభాగం సీఈవో వీజే నక్రా వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 1.5 శాతం నీరసించి రూ. 853 వద్ద ముగిసింది. -
జిందాల్ స్టెయిన్లెస్ జూమ్...
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం జిందాల్ స్టెయిన్లెస్(జేఎస్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసి రూ. 442 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 170 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,592 కోట్ల నుంచి రూ. 5,682 కోట్లకు జంప్ చేసింది. రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్ఎల్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 218 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ కార్డ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 84 శాతం జంప్ చేసి రూ. 386 కోట్లను తాకింది. ఇందుకు కార్డుల వినియోగం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం, ఇతర ఆదాయం పెరగడం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 210 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 3,140 కోట్లకు చేరింది. ప్రస్తుత సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.51 శాతం నుంచి 2.40 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.60 శాతం నుంచి 0.83 శాతానికి నీరసించాయి. అయితే ఫైనాన్స్ వ్యయాలు 6 శాతం అధికమై రూ. 277 కోట్లను తాకాయి. మొత్తం నిర్వహణ వ్యయాలు 28 శాతం పెరిగి రూ. 1,719 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 814 వద్ద ముగిసింది. -
సారేగామా... డివిడెండ్ రూ. 30
మ్యూజిక్ లేబుల్ కంపెనీ సారేగామా ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 38 శాతం ఎగసి దాదాపు రూ. 44 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 150 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. క్యూ3లో మొత్తం వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 100 కోట్లను దాటాయి. మ్యూజిక్ విభాగం ఆదాయం రూ. 133 కోట్లుకాగా.. ఫిల్మ్లు, టీవీ సీరియల్స్ నుంచి దాదాపు రూ. 16 కోట్లు లభించింది. ఈ కాలంలో కరణ్ జోహార్ రాఖీ రాణీకి ప్రేమ్ కహానీ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకుంది. విభిన్న భాషలలో 165 సినిమా పాటలను విడుదల చేసింది. షార్ట్ వీడియో యాప్ చింగారీతో గ్లోబల్ మ్యూజిక్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెస్లే, అమెజాన్, ఫోన్పే తదితర దిగ్గజాలు తమ బ్రాండ్ ప్రకటనలకు కంపెనీ పాటలను వినియోగించుకుంటున్నట్లు సారేగామా తాజాగా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సారేగామా షేరు బీఎస్ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 5,267 వద్ద ముగిసింది. -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భేష్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 9,096 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,703 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,438 కోట్ల నుంచి రూ. 41,436 కోట్లకు పుంజుకుంది. రుణాల విడుదల(అడ్వాన్స్లు) 14.7 శాతం పెరిగి రూ. 12,49,331 కోట్లకు చేరింది. స్టాండెలోన్ పద్ధతిలో నికర లాభం 17.6 శాతం మెరుగై రూ. 8,834 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా బలపడి రూ. 17,684 కోట్లయ్యింది. కేటాయింపులు ఇలా క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.17 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగాయి. మొండిరుణాలు, కంటింజెన్సీలకు రూ. 200 కోట్లు అధికంగా రూ. 3,925 కోట్లను కేటాయించింది. కరోనా మహమ్మారి భయాలకుతోడు.. సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా.. క్యూ2లో కనీస మూలధన నిష్పత్తి 19.1 శాతం నుంచి 20 శాతానికి మెరుగుపడింది. ఈ కాలంలో బాసెల్–3 ప్రమాణ అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా బిలియన్ డాలర్లు(రూ. 7,424 కోట్లు) సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. టర్న్అరౌండ్.. డిపాజిట్లు స్వీకరించని అనుబంధ ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ క్యూ2లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ. 85 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. తాజా సమీక్షా కాలంలో దాదాపు రూ. 192 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. బ్రోకింగ్ అనుబంధ కంపెనీ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సైతం 44 శాతం వృద్ధితో రూ. 240 కోట్ల నికర లాభం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 17% ఎగసి రూ. 16,564 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 70,523 కోట్ల నుంచి రూ. 75,526 కోట్లకు పురోగమించింది. -
విప్రో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేడెట్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 2,931 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,484 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 30 శాతం జంప్చేసి రూ. 19,667 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 15,115 ఆదాయం సాధించింది. వార్షిక ఆదాయ రన్రేటు 10 బిలియన్ డాలర్ల(రూ. 75,300 కోట్లు)ను అధిగమించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో వెల్లడించింది. దేశీయంగా వ్యాక్సినేషన్ పూర్తయిన సీనియర్ ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. అంచనాలు ఇవీ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం రూ. 19,500–19,889 కోట్ల మధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా వేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వార్షిక ఆర్డర్బుక్ 28 శాతం జంప్చేసింది. దీంతో మొత్తం ఆర్డర్బుక్ విలువ 19 శాతం బలపడి 27 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు)ను తాకింది. దీనిలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం వాటా 8 బిలియన్ డాలర్లు(రూ. 60,000 కోట్లు)గా విప్రో వెల్లడించింది. ఆదాయంలో అమెరికా, యూరప్ల వాటా అత్యధికంకాగా.. బీఎఫ్ఎస్ఐ విభాగం 35 శాతం పురోగమించింది. ఇతర హైలైట్స్ ► ఐటీ విభాగం ఆదాయం 29.5 శాతం జంప్చేసి రూ. 19,378 కోట్ల(258 కోట్ల డాలర్లు)ను తాకింది. ► క్యూ2లో 8,100 మంది ఫ్రెషర్స్ను ఉద్యోగాల్లోకితీసుకుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 25,000 మంది ఫ్రెషర్స్కు కొత్తగా ఉపాధి కల్పించనుంది. ► క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో త్రైమాసికవారీగా ఆదాయంలో 2–4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► కరెన్సీ నిలకడ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే ఇది 27–30 శాతం పురోగతికి సమానమని విప్రో పేర్కొంది. క్యూ2 ఫలితాల విడుదల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 672 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 656– 675 మధ్య ఊగిసలాడింది. వ్యూహాలు పనిచేస్తున్నాయ్ మా బిజినెస్ వ్యూహాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు క్యూ2 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. త్రైమాసికవారీగా చూస్తే వరుసగా రెండో క్వార్టర్లో 4.5 శాతం సొంత వృద్ధిని సాధిం చాం. వార్షిక ప్రాతిపదికన తొలి అర్ధభాగంలో 28 శాతం పురోగతిని చూపాం. ఈ సందర్భంగా మా కస్టమర్లు, భాగస్వాములు, సహోద్యోగులకు కృతజ్ఞతలు. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో -
సారేగామా లాభాల గానా
న్యూఢిల్లీ: మ్యూజిక్ లేబుల్ దిగ్గజం సారేగామా ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి దాదాపు రూ. 34 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 29 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 34 శాతంపైగా జంప్చేసి రూ. 145 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో కేవలం రూ. 108 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్నకు చెందిన ఈ కంపెనీ వ్యయాలు సైతం క్యూ2లో 43 శాతం పెరిగి 105 కోట్లయ్యాయి. దేశీయంగా ఊపందుకున్న డిజిటైజేషన్, లాక్డౌన్ తదితర అంశాలు కంటెంట్ భారీ వినియోగానికి కారణమైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఫలితాల విడుదల నేపథ్యంలో సారేగామా ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 4,216 వద్ద ముగిసింది. -
మంచి ఫలితాలు చూపడమే కీలకం
టోక్యో ఒలింపిక్స్లో భారత్ తమదైన ప్రత్యేక ముద్ర వేయగలదని అంతా నమ్ముతున్నారు. ముఖ్యంగా వేర్వేరు క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం కూడా అందుకు కారణం. ఇప్పుడు క్రికెట్కు మాత్రమే కాకుండా ఇతర క్రీడలకూ గుర్తింపు లభిస్తుండటాన్ని మనం చూడవచ్చు. నాకు తెలిసి గత దశాబ్దకాలంలో భారత్లో వచ్చిన ప్రధాన మార్పు ఇది. ఇకపై మంచి ఫలితాలు సాధించి చూపడమే కీలకం. క్రీడాకారిణిగా ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి రావడంతో వ్యవస్థ పనితీరు గురించి మరో కోణంలో చూడలేకపోయాను. అయితే కొన్నేళ్లుగా సానుకూల మార్పులు వస్తున్నాయనేది నాకు అర్థమైంది. పోటీల కోసం విదేశాలకు వెళ్లేందుకు గతంలో ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాల్సిన పరిస్థితి ఉండగా... కొత్తగా ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకం ఎంతో మేలు చేసింది. గతంలో క్రీడా పరికరాలు కావాల్సిన ఉంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ‘టాప్స్’ నుంచి సహాయం పొందడం ఆటగాళ్లకు ఎంతో సులువుగా మారింది. ప్రతీ నెలా ఇస్తున్న పాకెట్ అలవెన్స్ కారణంగా క్రీడాకారులు మంచి సౌకర్యాలు పొందేందుకు అవకాశం కలిగింది. అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడే క్రమంలో నిరంతరం క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ వారు సరైన రీతిలో సన్నద్ధమయ్యేలా ప్రోత్సహిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నా దృష్టిలో ఈ వ్యవస్థ మరింత మెరుగవుతూ ఆటగాళ్లకు ఈ విషయంలో ఎలాంటి బెంగ లేకుండా చేస్తోంది. గత 10–15 ఏళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రావడం మన అదృష్టం. అయితే భారత బ్యాడ్మింటన్కు ‘మార్గదర్శి’గా నిలిచానని, ఆ తర్వాత మన స్థాయి పెరిగి ఎంతో మంది టాప్–50లోకి వచ్చారని నా గురించి చెప్పినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను అనాసక్తితోనే ఆటల్లోకి వచ్చాను. అసలు ఒలింపిక్స్ ప్రాధాన్యత ఏమిటో కూడా తెలీదు. అయితే 2008 బీజింగ్ ఒలింపిక్స్కు తొలిసారి ఎంపిౖకైనప్పుడే దాని విలువ తెలుసుకున్న నేను, టీనేజర్గానే భారత్కు ఏదైనా చేయగలనని భావించాను. అక్కడే నేను పతకం సాధించగలిగేదానిని. ఇండోనేసియాకు చెందిన మారియా యులియాంటితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మూడో గేమ్లో 11–3తో ఆధిక్యంలో ఉండి కూడా ఓడిపోయానంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నా. 2008లో నాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. అయితే 2012లో కాంస్యం గెలిచి పోడియం మీద నిలబడినప్పుడు భారత త్రివర్ణపతాకం ఎగురుతుంటే దాని విలువేమిటో అర్థమైంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు బాగున్నాయ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం రూ. 7,730 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 6,659 కోట్లు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం 14 శాతం బలపడి రూ. 7,922 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 8.6 శాతం పుంజుకుని రూ. 17,009 కోట్లయ్యింది. అడ్వాన్సులు 14 శాతంపైగా వృద్ధి చూపగా.. నికర వడ్డీ ఆదాయం 4.1 శాతంగా నమోదైంది. ఇతర ఆదాయం 54 శాతం ఎగసి రూ. 4,075 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా.. తాజా సమీక్షా కాలంలోనూ స్థానిక లాక్డౌన్లు అమలైనట్లు బ్యాంక్ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో కొంతమేర కార్యకలాపాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. ఎంపిక చేసిన రుణ నష్టాలకు ప్రొవిజన్లు 54 శాతం పెరిగి రూ. 4,219 కోట్లకు చేరాయి. పక్కనపెట్టిన రూ. 600 కోట్ల కంటింజెన్సీలతో కలిపి మొత్తం ప్రొవిజన్లు రూ. 4,831 కోట్లను తాకాయి. 1,23,473కు సిబ్బంది జూన్ చివరికల్లా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత క్యూ1తో పోలిస్తే 1.36 శాతం నుంచి 1.47 శాతానికి పెరిగాయి. రిటైల్ రుణాలు 9.3 శాతం, వాణిజ్య రుణాలు 25.1 శాతం, టోకు రుణాలు 10.2 శాతం చొప్పున ఎగశాయి. డిపాజిట్లు 13.2 శాతం వృద్ధి చూపాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.1 శాతం, టైర్–1 క్యాపిటల్ 17.9 శాతంగా నమోదయ్యాయి. ఉద్యోగుల సంఖ్య గత జూన్లో 1,15,822కాగా.. తాజాగా 1,23,473కు చేరినట్లు బ్యాంక్ తెలియజేసింది. 5,653 బ్రాంచీలు, 16,291 ఏటీఎంలతో నెట్వర్క్ విస్తరించినట్లు వెల్లడించింది. అనుబంధ సంస్థలలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 233 కోట్ల నుంచి రూ. 131 కోట్లకు క్షీణించింది. ఆర్బీఐ తుది నిర్ణయం ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా టెక్నాలజీని 85 శాతం మెరుగుపరచినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధరజగదీశన్ పేర్కొన్నారు. దీంతో కొత్త క్రెడిట్ కార్డుల జారీపై విధించిన నిషేధానికి సంబంధించి ఆర్బీఐ నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. టెక్నాలజీ ఆడిట్సైతం పూర్తయినట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్యల నేపథ్యంలో 2020 డిసెంబర్లో ఆర్బీఐ కొత్త కార్డుల జారీని నిలుపుదల చేయమంటూ ఆదేశించిన విషయం విదితమే. కాగా.. అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యూ1లో 67 శాతం అధికంగా రూ. 458 కోట్ల ఆదాయం సాధించినట్లు జగదీశన్ వెల్లడించారు. నికర లాభం 95 శాతం జంప్చేసి రూ. 261 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. డిస్కౌంట్ బ్రోకింగ్ బిజినెస్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లు చేపట్టే లావాదేవీలపై నామమాత్ర కమిషన్లు, ఫీజును తీసుకోవడం ద్వారా డిస్కౌంట్ బ్రోకరజీ బిజినెస్లు విస్తరిస్తున్నట్లు వివరించారు. దీంతో పలు సంస్థలు ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నట్లు తెలియజేశారు. -
విప్రో భళా..
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 2,968 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 2,456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 15,670 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయంలో ఐటీ సర్వీసులదే ప్రధాన పాత్ర. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండ్ చెల్లించనుంది. 3.9 శాతం వృద్ధికి చాన్స్ ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి–21)లో ఐటీ సర్వీసుల ఆదాయం 1.5–3.5 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు విప్రో తాజాగా గైడెన్స్ ప్రకటించింది. డాలర్ల రూపేణా 210.2–214.3 కోట్ల మధ్య ఆదాయం నమోదుకావచ్చని అభిప్రాయపడింది. త్రైమాసిక ప్రాతిపదికన వేసిన అంచనాలివి. కాగా.. ఇదే ప్రాతిపదికన క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.9 శాతం పెరిగి 207.1 కోట్ల డాలర్లకు చేరింది. వెరసి రెండో త్రైమాసికంలో వేసిన 1.5–3.5 శాతం వృద్ధి అంచనాలను అధిగమించింది. 202.2–206.2 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఊహించింది. అంతేకాకుండా గత 36 త్రైమాసికాలలో అత్యధిక వృద్ధిని సాధించింది. క్యూ3లో ఐటీ ప్రొడక్టుల ఆదాయం రూ. 160 కోట్లను(2.13 కోట్ల డాలర్లు) తాకింది. దేశీ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ రూ. 240 కోట్ల(3.28 కోట్ల డాలర్లు)కు చేరింది. క్యూ3లో విప్రో నిర్వహణ లాభ మార్జిన్లు 2.43 శాతం బలపడి 21.7 శాతానికి చేరాయి. డిమాండ్ గుడ్ వరుసగా రెండో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించినట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఐదు విభాగాలలో 4 శాతం పురోగతిని సాధించినట్లు తెలియజేశారు. క్యూ3లో మెట్రోనామ్ ద్వారా యూరప్ ఖండం నుంచి కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద డీల్ను పొందినట్లు ఫలితాల విడుదల సందర్భంగా ప్రస్తావించారు. 2020 డిసెంబర్కల్లా కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1.9 లక్షలను అధిగమించింది. మార్కెట్లు ముగిశాక విప్రో ఫలితాలు ప్రకటించింది. బీఎస్ఈలో విప్రో షేరు నామమాత్ర లాభంతో రూ. 459 సమీపంలో ముగిసింది. -
కరోనాను నిరోధిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా!
లండన్: కరోనాను అడ్డుకోవడంలో ఆక్స్ఫర్డ్ రూపొందించిన టీకా (ChAdOx1 nCoV&19) మంచి సత్ఫలితాలు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫేజ్3లో ఈ టీకా కోవిడ్ నిరోధకతలో మంచి ఫలితాలు చూపిందని, అత్యున్నత రక్షణను ఇస్తోందని తెలిపాయి. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ రూపొందిస్తున్న ఈ టీకాను ఫేజ్ 3 ప్రయోగాల్లో రెండు బ్యాచ్లకు ఇచ్చారు. తొలి బ్యాచ్లో టీకా 90 శాతం, రెండో బ్యాచ్లో 62 శాతం ప్రభావం చూపింది, సగటున వ్యాక్సిన్ 70.4 శాతం ప్రభావం చూపినట్లయింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గినట్లు గమనించారు. ‘‘ట్రయిల్స్ కోసం బ్రిటన్, బ్రెజిల్ నుంచి 20వేల మంది వాలంటీర్లను తీసుకున్నారు. వ్యాక్సిన్ను రెండు దశల్లో హై డోసుల్లో ఇచ్చినప్పుడు 62 శాతం ప్రభావమే కనిపించగా, తొలుత తక్కువ డోసు ఇచ్చి అనంతరం రెండోదఫా అధికడోసు ఇచ్చిన కేసుల్లో 90 శాతం ప్రభావం కనిపించిందని, ఎందుకు ఈ తేడా వచ్చిందో ఇంకా తెలియరాలేదని సంస్థ ప్రతినిధులు వివరించారు. తాజా ఫలితాలు కరోనాపై టీకాకు మరింత దగ్గరకు చేర్చాయని ఆక్స్ఫర్డ్ ప్రొఫిసర్ సారా గిల్బర్ట్ చెప్పారు. ఎప్పటికప్పుడు ఫలితాలను నియంత్రణా సంస్థలకు అందిస్తామన్నారు. టీకాపై ఇండియా తదితర దేశాల్లో ఇంకా ట్రయిల్స్ జరుపుతూనే ఉన్నారు. ఏడాది చివరకు దాదాపు 60 వేల మందిపై టీకా ప్రయోగించాలని భావిస్తున్న ట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. సాధారణ జలుబును కలిగించే వైరస్ను బలహీన పరిరచి దాన్ని జన్యుపరంగా మార్చి కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. -
కిక్కు తగ్గింది!
నూజెండ్ల మండలానికి చెందిన సుబ్బారావు (పేరు మార్చాం) కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు. కుమారుడు పదో తరగతి, కుమార్తె ఇంటరీ్మడియెట్ చదువుతున్నారు. కూలికి వెళ్లితే రోజుకు రూ.400 వస్తుంది. పది నెలల కిందట వరకూ రోజు వారీ వచ్చే కూలి డబ్బుల్లో రూ.300 తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక సుబ్బారావు మిగిలి్చన రూ.100తో పాటు అతని భార్య వ్యవసాయ కూలి పనులకు వెళ్లగా వచ్చే రూ.200తో సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఆర్థిక ఇబ్బందులతో కూతురు, కుమారుడిని కూడా బడి మాన్పించి అప్పుడప్పుడు పనులకు తీసుకువెళ్లేది. ఈ క్రమంలో ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపులు ఎత్తేయడం, మద్యం దుకాణాలు కుదించడంతో వారి గ్రామ పరిధిలో మద్యం సరిగా దొరకడంలేదు. తాగాలంటే మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు ధరలు బాగా పెరిగాయి. దీంతో సుబ్బారావు నెమ్మదిగా మద్యానికి దూరంగా జరగడం మొదలు పెట్టాడు. గత ఏడెనిమిది నెలల నుంచి పూర్తిగా మద్యం తాగడం మానేశాడు. కూలి డబ్బులు మొత్తం ఇంట్లోనే ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడి సంతోషంగా ఉంది. సాక్షి, గుంటూరు: ఇది ఒక సుబ్బారావు కుటుంబం సంతోషమే కాదు. మద్యం రక్కసి నుంచి బయటపడిన ఎందరో కుటుంబాల్లో వికసిస్తున్న ఆనందం. జిల్లాలో దశల వారీ మద్య నిషేధం సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గడం ఇందుకు నిదర్శనం. ♦గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 353 మద్యం షాపులు, 185 బార్లు ఉండేవి. మరో నాలుగు వేల వరకూ బెల్టుషాపులు గ్రామాల్లో అందుబాటులో ఉండేవి. ♦వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టగానే బెల్టు షాపులను రద్దు చేశారు. మద్యం షాపుల సంఖ్యను 20 శాతం కుదించారు. ♦ఈ ఏడాది జూన్ నుంచి మరో 13 శాతం దుకాణాలను రద్దు చేయడంతో ప్రస్తుతం జిల్లాలో మద్యం దుకాణాలు 239 మాత్రమే ఉన్నాయి. ♦దీనికి తోడు మద్యాన్ని ప్రజల నుంచి దూరం చేయడంలో భాగంగా మద్యం రేట్లను పెంచడం, మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గింది. ♦ప్రస్తుతం జిల్లాలో లిక్కర్ విక్రయాలు 52 శాతం, బీర్ల విక్రయాలు 81 శాతం మేర తగ్గాయి. ♦పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏటా 10 శాతం మేర మద్యం విక్రయాలు పెరుగుతాయనేది ఎక్సైజ్ శాఖ అంచనా. అయితే అందుకు విరుద్ధంగా మద్యం విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
‘లాక్డౌన్’తో సత్ఫలితాలు
న్యూఢిల్లీ: 30 రోజుల లాక్డౌన్ కాలంలో కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగామని, కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సమయాన్ని పెంచగలిగామని కేంద్రం తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచగలిగామని పేర్కొంది. లాక్డౌన్ సమయంలో గొంతు, ముక్కులో నుంచి సేకరించిన నమూనాల ద్వారా జరిపే ‘ఆర్టీ–పీసీఆర్’ పరీక్షా విధానాన్ని ఒక కీలక ఆయుధంగా ఉపయోగించామని కేంద్ర సాధికార బృందం–2 చైర్మన్ మిశ్రా చెప్పారు. ‘ఏప్రిల్ 22 నాటికి 5 లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం’ అన్నారు. భారత్లో వైరస్ వ్యాప్తి భారీగా లేదని, ఆ గ్రాఫ్లో పెరుగుదల నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అంటే, భారత్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లే భావించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘అమెరికాలో మార్చి 26 నాటికి 5 లక్షల పరీక్షలు జరపగా, అందులో 80 వేలు పాజిటివ్గా తేలాయి. భారత్లో ఏప్రిల్ 22 నాటికి 5 లక్షల పరీక్షలు జరపగా.. దాదాపు 20 వేల కేసులే నమోదయ్యాయి’ అని మిశ్రా వివరించారు. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి కొత్త కేసుల సంఖ్య 16 రెట్లు పెరగగా, నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం 24 రెట్లు పెరిగిందని వివరించారు. ఇప్పటివరకు 3,773 కోవిడ్–19 ప్రత్యేక ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయని, వాటిలో 1.94 లక్షల ఐసొలేషన్ బెడ్స్, 24,644 ఐసీయూ బెడ్స్, 12,371 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని మిశ్రా తెలిపారు. లాక్డౌన్ ప్రకటించిన సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్స్ దేశంలో 100 మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 325కి చేరిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవతెలిపారు. 14 రోజుల్లో 78 జిల్లాల్లో జీరో పాజిటివ్ 14 రోజుల్లో దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 28 రోజుల్లో 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కోలుకున్నవారి శాతం పదిరోజుల క్రితం 9.9గా ఉండగా, ఇప్పుడు 19.89కి చేరుకుందన్నారు. కాగా, పారిశ్రామిక వర్గాల నుంచి వారి సమస్యలపై సమాచారం తీసుకుని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. మనిహాయింపులతో పాటు కొత్తగా ప్రకటించిన కొన్ని నిబంధనలు పాటించడం ఆచరణసాధ్యంగా లేవని పలువురు పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మెరుగుదల కనిపిస్తోందన్నారు. 21,700 కేసులు.. 686 మరణాలు దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారానికి 21,700కి పెరిగింది. కోవిడ్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 686కి చేరింది. బుధవారం సాయంత్రం నుంచి 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు సంభవించాయి. మొత్తం 21,700 కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,689 అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 4,324 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇలా కోలుకున్నవారి శాతం 19.93 అని వివరించింది. బుధవారం నుంచి చోటు చేసుకున్న మరణాల్లో అత్యధికం మహారాష్ట్రలో సంభవించాయి. ఆ రాష్ట్రంలో 18 మంది, గుజరాత్లో 8 మంది మరణించారు. మొత్తం 686 మరణాల్లోనూ మహారాష్ట్రలో అత్యధికం చోటు చేసుకున్నాయి. -
25 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
న్యూఢిల్లీ: తొలుత కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలను కంటైన్మెంట్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆ 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాల్లో అధికార యంత్రాంగం కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ఇందులో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైతం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో భవిష్యత్తులోనూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద ఏప్రిల్ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా పేదలకు రూ.28,256 కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే పీఎం కిసాన్ యోజన కింద రైతులకు రూ.13,855 కోట్లు అందజేశామన్నారు. సామాజిక సాయం కింద వితంతువులు, వయో వృద్ధులు, దివ్యాంగులకు రూ.1,405 కోట్లు బదిలీ చేశామని తెలిపారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి పథకం కింద 27 రాష్ట్రాల్లో 78,373 స్వయం సహాయక బృందాల సభ్యులు 1.96 కోట్ల ఫేసు మాస్కులను తయారు చేశారని అన్నారు. ఆరు వారాల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 2,06,212 పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది. -
కోవిడ్ చికిత్సకు హెచ్సీక్యూ–ఐజీ
పారిస్: కోవిడ్–19 చికిత్సలో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్– అజిథ్రోమైసిన్’(హెచ్సీక్యూ–ఐజీ) కాంబినేషన్ ఎలాంటి సానుకూల ఫలితాలు సాధించిందనే వివరాలను వెల్లడించే అధ్యయనం ఒకటి ఫ్రాన్స్లో తాజాగా తెరపైకి వచ్చింది. మార్సిలీలోని ఐహెచ్యూ, మెడిటెరేన్ ఇన్ఫెక్షన్ కేంద్రంలో ఈ అధ్యయనాన్ని మార్చి– ఏప్రిల్ మధ్య నిర్వహించారు. 1061 కరోనా పాజిటివ్ పేషెంట్లకు కనీసం మూడు రోజుల పాటు ‘హెచ్సీక్యూ–ఐజీ’ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీరిలో 973(91.7%) మంది పది రోజుల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. 46(4.6%) మంది పేషెంట్లపై ఈ చికిత్స సరైన ఫలితాలనివ్వలేదు. 10 మంది పేషెంట్లను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. వారిలో ఐదుగురు(0.47%) మరణించారు. ఈ ఐదుగురు కూడా 74 నుంచి 95 ఏళ్ల మధ్య వయసువారే కావడం గమనార్హం. 32 మంది పేషెంట్లకు 10 రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ చికిత్స పొందిన వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. ఈ అధ్యయన ఫలితాలు కోవిడ్–19 చికిత్సలో హెచ్సీక్యూ–ఐజీ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. ‘హెచ్సీక్యూ–ఐజీ కాంబినేషన్ కోవిడ్–19కు సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్స. ఈ చికిత్సను కోవిడ్–19 నిర్ధారణ కాగానే, ఆలస్యం చేయకుండా, తక్షణమే ప్రారంభించాలి. ఈ చికిత్సలో మరణశాతం అత్య ల్పం గా 0.5%లోపే ఉంది. మరణించిన వారంతా వృద్ధులే కావడం గమనార్హం. చాలా కేసుల్లో వైరస్ వృద్ధిని ఈ కాంబినేషన్ సమర్థవంతంగా నిలువరించింది’ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. చాలామంది డాక్టర్లు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్– అజిత్రోమైసిన్ కాంబినేషన్ కోవిడ్–19పై సమర్థవంతంగా పనిచేస్తోందని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించే క్లినికల్ ట్రయల్ ఒకటి మాత్రమే జరిగింది. అదీ కూడా స్వల్ప శాంపిల్తో మాత్రమే. ఎక్కువ శాంపిల్స్తో ఫ్రాన్స్లో ఈ స్టడీ జరగడం విశేషం. అధ్యయనం వివరాలు ఈ స్టడీ వివరాలను మార్సిలీ(ఫ్రాన్స్)లోని ‘ఐహెచ్యూ, మెడిటెరేన్ ఇన్ఫెక్షన్’ సంస్థ వెల్లడించింది. ‘మార్చి 3– ఏప్రిల్ 9 మధ్య 38,617 మంది పేషెంట్ల నుంచి 59, 655 శాంపిల్స్ను పీసీఆర్ సేకరించింది. ఆ పేషెంట్లలో కరోనా పాజిటివ్గా తేలిన 3,185 మంది పేషెంట్లలో 1,061 మంది మా అధ్యయనానికి సరిపోయారు. వారి సగటు వయసు 43.6 ఏళ్లు. వారిలో పురుషులు 492 మంది. వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్– అజిథ్రోమైసిన్ కాంబినేషన్తో చికిత్స జరిపి, ఈ అధ్యయనాన్ని రూపొందించాం’ అని వివరించింది. -
నలుగురికి 499 మార్కులు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదవ తరగతి ఫలితాల్లో నలుగురు విద్యార్థులు 500కి అత్యధికంగా 499 మార్కులు సాధించారు. మంగళవారం వెలువడిన ఈ ఫలితాల్లో మొత్తంగా 86.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 85.32 శాతం, బాలికల్లో 88.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గుర్గావ్కు చెందిన ప్రాకార్ మిత్తల్, యూపీలోని బిజ్నూర్కు చెందిన రిమ్జిమ్ అగర్వాల్, షమ్లీకి చెందిన నందినీ గార్గ్, కొచ్చి అమ్మాయి శ్రీలక్ష్మిలు 500కి 499 మార్కులు సాధించారు. మరో ఏడుగురికి 498మార్కులు, 14 మందికి 497 మార్కులొచ్చాయి. ఉత్తీర్ణతా శాతం పరంగా చూస్తే తిరువనంతపురం (99.6 శాతం), చెన్నై (97.37 శాతం), అజ్మీర్ (91.86 శాతం) రీజియన్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. దేశం మొత్తం మీద 27,426 మంది విద్యార్థులు 95 శాతానికిపైగా మార్కులు తెచ్చుకున్నారు. అంగ వైకల్యం కలిగిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 92.55 కాగా, గుర్గావ్కు చెందిన అనుష్క పండా, ఘజియాబాద్కు చెందిన సాన్యా గాంధీలు 489 మార్కులు పొందారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని సీబీఎస్ఈ రద్దు చేశాక జరిగిన తొలి పరీక్షలివే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుభాకాంక్షలు చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మనో నిబ్బరంతో ఉండాలని కోరారు. 12వ తరగతి టాపర్లను కలిసిన కేజ్రీవాల్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలో టాపర్లుగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు విద్యార్థుల ఇళ్లలోనే కలిశారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన సిసోడియాతో కలసి కేజ్రీవాల్.. టాపర్లు భారతీ రాఘవ్, ప్రిన్స్ కుమార్, ప్రాచీ ప్రకాశ్, చిత్రా కౌశిక్ల ఇళ్లకు వెళ్లారు. అలాగే 12వ తరగతి వొకేషనల్ విద్య విభాగంలో టాపర్గా నిలిచిన షహనాజ్ను కలిసేందుకు దర్యాగంజ్ ప్రాంతంలో ఉన్న అనాధశ్రమాన్ని కూడా వారిరువురూ సందర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులను రెండింతలు చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అది డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం కాదనీ, పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని మంగళవారం అన్నారు. సీబీఎస్ఈకి లీకు వీరుల జాబితా సీబీఎస్ఈ పరీక్షల్లో 10వ తరగతి గణితం, 12వ తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్న పత్రాలు లీకయ్యి సంచలనం సృష్టించడం తెలిసిందే. అలా ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకుని పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను పోలీసులు సీబీఎస్ఈకి సమర్పించారు. లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ల్లో పోలీసులు కొందరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారి నుంచి వివరాలను రాబట్టి, ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకున్న విద్యార్థుల జాబితాను పోలీసులు సీబీఎస్ఈకి పంపారు. -
సత్ఫలితాలిస్తున్న ‘సీడ్ బాల్స్’
కెరమెరి : గతేడాది విత్తన బంతుల ద్వారా నూతన ప్ర యోగానికి శ్రీకారం చుట్టిన అటవీ అధికారులు ప్రణా ళిక విజయవంతమవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో స్టంపు పెట్టి వాటికి నీరు పోసి బతికించే దానికంటే మట్టితో వివిద రకాల వస్తువులు కలిపి తయారు చేసిన విత్తన బంతులు సీడ్ బాల్స్ తోనే అధిక ప్రయోజనం ఉం టుందని భావించిన అటవీ అధికారులు ఈ ఏడాది ప్రతి ష్టాత్మకంగా చేపట్టబోయే హరితహరంలో ఆ ప్రయోగాన్నే అధికంగా వాడనున్నారు. కెరమెరి అటవీ „ó క్షేత్రాధికారి పరిధిలో కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు ఉన్నాయి. కెరమెరిలో గతేడాది రేంజ్లోని కొప్పగూడలో 2 వేలు, గోయగాంలో 2 వేలు, సాంగ్వి లో 2 వేలు, ధోబోలిలో 2 వేలు, బిర్లఘాట్లో రెండు వే లు మొత్తం 10 వేల విత్తన బంతులు విసరగా 6 వేలు ప్రస్తుతం సజీవంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. రెండు వందల ఎకరాల్లో విత్తన బంతులు కెరమెరి రేంజ్ మొత్తం 60 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో విత్తన బంతులు గత సంవత్సరం 200 ఎకరాల్లో విసరారు. ఆ బంతులన్ని అటవీ ప్రాంతంలో విసరడం తో పాటు అధికారులు అటువైపుగా పశువులు మేపకుండా చర్యలు తీసుకోవడంతో ఆ మొక్కలు సజీ వంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అయితే ఈ సంవత్సరం 25 వేల విత్తన బంతులను వేయాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేంజ్లోని అన్ని మండలాల్లో నర్సరీ పనులు ప్రారంభమైయ్యాయి. లక్ష్యం 5 లక్షల మొక్కలు గతేడాది కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో అటవీ అధికారులకు మూడు లక్షల మొక్కలు నాటా రు. ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలను నాటాలని అధికారులు ఆదేశించారు.. అందులో మూడు మండలాల్లోని సాంగ్వి, కెరమెరి, దుబ్బగూడ, కోహినూర్, రాసిమొట్టల్లో 5 లక్ష్యల మొక్కలను నాటనున్నారు. ఒక్కో నర్సరీలో లక్ష మొక్కలను నాటనున్నారు. అయి తే అధికారుల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 25 మంది అటవీ సిబ్బంది ఉండాల్సి ఉండగా ఎప్ ఎస్వోలు ఐదుగురు, ఎఫ్బీవోలు ఐదుగురు మాత్రమే ఉన్నారు. పండ్ల మొక్కలకు ప్రాధాన్యం మా నర్సరీల్లో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల కు అధిక ప్రాధాన్యం ఇస్తాం. గతేడాది కూడా వివిద రకాల పూలు, పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచాం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. వివిద రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతాం. – సయ్యద్ మజరుద్దీన్, ఎఫ్ఆర్వో, కెరమెరి -
పోలీస్ వెబ్సైట్.. సర్వీస్ అదుర్స్
► సత్ఫలితాలిస్తున్నసీసీటీఎన్ఎస్ గో లైవ్.. ►6 నెలల్లో 1.68 లక్షల మందికి ఎఫ్ఐఆర్ ఎస్సెమ్మెస్ ►7,780 మంది బాధితులకు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేలా.. ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా అందుబా టులోకి తీసుకొచ్చిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ ద్వారా 1.68 లక్షల మంది ఎఫ్ఐఆర్ అక్నాల్డెజ్మెంట్ సందేశం స్వీకరించారు. పోలీస్ వెబ్సైట్ ద్వారా అదృశ్యమైన వ్యక్తుల వివరాలను 15,288 మంది తెలుసుకోగా, 83 మంది ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు, కేసు నమోదు తర్వాత అరెస్టయిన నిందితుల వివరాలను 10,288 మంది తెలుసుకోగా.. 1,011మంది పిటిషన్ పరిస్థితిని పరిశీలించుకు న్నారు. అలాగే గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు 7,780 మంది ఎఫ్ఐఆర్ డౌన్ లోడ్ చేసుకున్నారు. మరోవైపు పోలీస్ వెబ్సైట్ ను ఇప్పటివరకు 7.7 లక్షల మంది వీక్షించారు. నమస్కారం.. మీ ఫిర్యాదు వివరాలు.. ‘నమస్కారం.. మీరు దాఖలు చేసిన ఫిర్యాదు స్వీకరించాం. ఫిర్యాదు చేసిన అంశాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నంబర్.. ధన్యవాదాలు’ ఇలా 24 గంటల్లోపు పిటిషన్ నంబర్, తదితర వివరాలతో సంక్షిప్త సందేశం ఫిర్యాదుదారులకు అందుతోంది. అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ‘"www.tspolice.gov.in'’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. సంబంధిత జిల్లా, పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ నంబర్ లేదా ఎఫ్ఐఆర్ నమోదు తేదీని ధృవీకరించుకొని కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిటిషన్పై కేసు నమోదు చేయకపోతే.. పిటిషన్ ప్రస్తుత పరిస్థితిని వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేలా చర్యలు అదనపు డీజీపీ రవిగుప్తా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఫిర్యాదుదారులకు సంక్షిప్త సందేశం పంపిస్తున్నామని, కొన్నిసార్లు సమస్య లొచ్చినా క్షణాల్లో సిబ్బంది పరిష్కరిస్తు న్నారని పోలీస్ కంప్యూటర్ సర్వీస్ అదనపు డీజీపీ రవిగుప్తా చెప్పారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువయ్యేలా చర్యలు చేపడుతు న్నామని వెల్లడించారు. సీసీటీఎన్ఎస్ ద్వారా పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరుగుతుందని డీజీపీ అనురాగ్శర్మ అభిప్రాయపడ్డారు. -
సత్తా చాటిన విద్యార్థులు
పురుషుల విభాగం చాంపియన్గా ఆదిత్య మహిళల ఓవరాల్ చాంప్గా విజయనగరం ముగిసిన అథ్లెటిక్ పోటీలు భానుగుడి (కాకినాడ) : జేఎన్టీయూకేలో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర కళాశాల అథ్లెటిక్ పోటీలు ముగిశాయి. క్రీడాకారులకు ఆదివారం లాంగ్జంప్, షాట్పుట్, హైజంప్, రన్నింగ్, డిస్క్త్రో, రన్నింగ్ లకు సంబంధించి ఫైనల్ పోటీలు నిర్వహించారు. వ్యక్తిగత విభాగాలతో పాటు, ఓవరాల్ చాంపియ¯ŒS షిప్లలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జేఎ¯ŒSటీయూకే కళాశాల ప్రిన్సిపాల్ జీవీఆర్ ప్రసాదరాజు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి జి.శ్యామ్కుమార్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో జేఎ¯ŒSటీయూకే పరిధిలోని 230కు పైగా ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలల్లోని 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు వీరే మహిళల విభాగం : మహిళల 1500 మీటర్ల పరుగులో ఎం.సాయిచందన(జీఈసీ గుడ్ల వల్లేరు), 100 మీటర్ల పరుగులో కె.కీర్తి (కాకినాడ), డిస్క్త్రోలో కె.వసుధారెడ్డి (ఆదిత్య, సూరంపాలెం), 4+400 మీటర్ల పరుగులో ఎం.తులసి, ఎస్.నవ్యశ్రీ, ఎమ్.బాజీ, టి.రితిక (కైట్), లాంగ్ జంప్లో బి.భవానీయాదవ్ (ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ), జావెలి¯ŒS త్రోలో కె.వసుధారెడ్డి (ఆదిత్య, సూరంపాలెం), 400 మీటర్ల రన్నింగ్లో ఎస్కే.సబీనా, 800 మీటర్ల పరుగులో ఎల్.భార్గవి (కాకినాడ), ట్రిపుల్ జంప్లో బి.భవాని యాదవ్ (ఆంధ్ర లయో లా), 200 మీటర్లలో బి.భవాని యాదవ్, షాట్ఫుట్లో ఎం.ప్రతిభా నిఖిత(కాకినాడ), 100 మీటర్ల పరుగులో ఎల్.భార్గవి, ప్రవల్లిక, ఎస్.తనూష, జి.హారిక లక్ష్మి (కాకినాడ), ఓవరాల్ చాంపియ¯ŒSగా జేఎ¯ŒSటీయూకే విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల, రెండోస్థానంలో ఆంధ్ర లయోలా కాలేజీ విజయవాడ, బెస్ట్ అథ్లెట్గా బి.భవాని యాదవ్ నిలిచారు. పురుషుల విభాగం : 1500 మీటర్ల పరుగులో కె.శివ (కైట్), 100 మీటర్లలో వి.తిరుమలరావు (ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పరిటాల), ట్రిపుల్ జంప్లో బి.వినోద్కుమార్(స్వర్ణాంధ్ర), షాట్పుట్లో ఎం.పునీత్కుమార్ (ఆదిత్య, సూరంపాలెం), హైజంప్లో డి.వెంకటేశ్వరరావు (ఎంవీజీఆర్, విజయనగరం), 4+400 మీటర్ల పురుషుల విభాగం పరుగులో పి.కృష్ణచైతన్య, బి.రామకృష్ణ, ఏవీడీ మోహ¯ŒSయాదవ్, ఏడీ ఉదయచౌదరి (ఆదిత్య, సూరంపాలెం) విజేతలుగా నిలిచారు. 5000 మీటర్లలో కె.శివ (కైట్), 200 మీటర్ల పరుగులో ఎ.సత్యగణేష్ (విజ్ఞా¯ŒS, దువ్వాడ), జావ్లి¯ŒSత్రోలో ఎ¯ŒS.నవీ¯ŒSరాజ్, లాంగ్ జంప్లో డి.వెంకటేశ్వరరావు (ఎంవీజీఆర్), 100 మీటర్ల పరుగులో జి.స్వామి, ఎస్.కళ్యాణ్కుమార్, జి.సాయి కుమార్, ఆర్.శేషులు విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగం చాంపియ¯ŒSగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తొలి రెండు స్థానాలను గెలుచుకుంది. బెస్ట్ అథ్లెట్గా డి.వెంకటేశ్వరరావు (ఎంవీజీఆర్, విజయనగరం) నిలిచారు. -
సాఫ్ట్గా దూసుకెళుతున్నారు!
సాఫ్ట్బాల్లో ప్రతిభ చూపుతున్న తూర్పు కిరణాలు జాతీయ స్థాయికి పలువురి క్రీడాకారులు సాఫ్ట్బాల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే తమ సత్తా చాటుతామని వారంటున్నారు. – రావులపాలెం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే జిల్లాస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు రావులపాలెం తదితర ప్రాంతాల విద్యార్థులు హాజరై జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా జిల్లా జట్లలో ఉన్నారు. ఈ విధంగా అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో 64 మందికి ఈ నెల 15వ తేదీ నుంచి రావులపాలెం జెడ్పీబాలుర హైస్కూల్ మైదానంలో ఎస్జీఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ, జాతీయ కోచ్ బండారు ప్రసాద్ పర్యవేక్షణలో శిక్షణ శిబిరం జరుగుతోంది. గతేడాది రాష్ట్ర జట్లకు ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. నేషనల్స్ ఆడాను స్కూల్ గేమ్స్లో భాగంగా 2014–15లో అండర్–14 బాలుర విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన నేషనల్స్ ఆడాను. అలాగే అనంతపురంలో 2014–15, 2015–16లో జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా తరఫున ఆడాను. ఈ ఏడాది కూడా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. టీమ్లో క్యాచర్గా వ్యవహరిస్తాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తాం. – డి.గంగరాజు, పగడాలపేట సొంత ఖర్చులతోనే పోటీలకు.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనా సొంత ఖర్చులు, దాతల సహకారంతో పోటీలకు వెళ్లాల్సి వస్తుంది. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఈ క్రీడపై ఆసక్తితో ముందుకు సాగుతున్నా. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్స్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. సాఫ్ట్బాల్ క్రీడలో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రోత్సాహం లేకపోయినా కష్టపడి పోటీలకు హాజరవుతున్నా. – పి.రూతు, దేవరపల్లి సాప్్టబాల్ సామగ్రికి ఖర్చు ఎక్కువ సాఫ్ట్బాల్ క్రీడకు సంబంధించిన సామగ్రి ఖర్చు ఎక్కువ. జట్టుకు కావాల్సిన కిట్టు కొనుగోలు చేయాలంటే రూ.లక్ష వెచ్చించాలి. స్లగ్గర్ ధర రూ.ఐదు వేల నుంచి∙రూ.35 వేల వరకూ ఉంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు కనీసం రూ.15 వేల స్లగ్గర్ అయినా ఉండాలి. అలాగే హె ల్మెట్ ధర రూ.రెండు వేలు, చెస్ట్మాస్క్ ధర రూ.1800, ప్యాడ్లు ధర రూ.2400, బాల్ ధర రూ.500, గ్లౌజ్ రూ.2400 వరకూ ఉంటాయి. ప్రభుత్వం క్రీడా సామగ్రి సమకూరిస్తే క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బండారు ప్రసాద్, కోచ్, ఎస్జీఎఫ్ జాయింట్ సెక్రటరీ పిచ్చింగ్, క్యాచింగ్ ముఖ్యం సాఫ్ట్బాల్ క్రీడలో విజయం సాధించాలంటే క్రీడాకారులు పిచ్చింగ్, క్యాచింగ్లలో ప్రావీణ్యం కనబర్చాలి. ఈ రెండు అంశాల్లో ఏ జట్టు ముందు ఉంటే వారిదే విజయం. ఈ అంశాల్లో ముమ్మర సాధన చేస్తున్నాం. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్స్లో అండర్–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున ఆడాను. మన జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ప్రసుత్తం అనంతపురం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు తరఫున శిక్షణ పొందుతున్నా. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ఆర్టీసీ, రైల్వే రాయితీలు కల్పిస్తే బాగుంటుంది. – కె.దేవి, జి.వేమవరం సాఫ్ట్బాల్కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ప్రభుత్వం సాఫ్ట్బాల్ క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేయాలి. 2015–16లో దిల్లీలో జరిగిన స్కూల్ గేమ్స్ నేషనల్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడాను. అండర్–14 బాలుర విభాగంలో పాల్గొన్నా. పాuý శాలల్లో సాఫ్ట్బాల్ క్రీడా సామగ్రిని ప్రభుత్వం అందుబాటులో ఉంచితే శిక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది. – కె.శ్యామ్ప్రసాద్, పగడాలపేట -
పీజీ ఎంట్రన్స్లో ఆచార్య ఎన్జీ రంగా విద్యార్థుల ప్రతిభ
కంబాలచెరువు : ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్టెస్ట్లో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలకు చెందిన కొవ్వూరి సరిత ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ప్రథమర్యాంకు, రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించింది. ఆ వివరాలను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.జయరామిరెడ్డి మంగళవారం తెలిపారు. పి.శ్రీదేవి రాష్ట్రస్థాయిలో ఎనిమిదో ర్యాంకు, బిన్సీథిమస్ 11వ ర్యాంకు, ఎం.దేవి 19వ ర్యాంకు సాధించారు. ఎస్టీ విభాగంలో సోమాల కార్తీక్ రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించాడు. అలాగే మొత్తం 40 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, 33 మంది అర్హత సాధించారన్నారు. వీరిలో 50 ర్యాంకుల్లోపు 12 మంది, 100 ర్యాంకుల్లో 18 మంది సాధించారు. ఉత్తమర్యాంకులు సా«ధించిన విద్యార్థులను అసోసియేట్ డీన్ జయరామిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. జాతీయస్థాయిలోనూ హవా రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన పీజీ ఎంట్రన్స్ పోటీల్లో ర్యాంకులు సాధించారని డీన్ జయరామిరెడ్డి తెలిపారు. సుమారు 12 మంది విద్యార్థులు గుజరాత్, అస్సాం, హిమాచల్ప్రదేశ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోగల వ్యవసాయ కళాశాలల్లో సీట్లు సాధించారన్నారు. -
పకడ్బందీగా పది
* ఫలితాల కోసం ప్రత్యేక కసరత్తు * విద్యార్థుల ప్రగతి అంచనా పనిలో విద్యాశాఖ * ప్రతి మండలానికి ఏడుగురు సభ్యుల కమిటీ * వెనుకబడిన వారిని గుర్తించేందుకు చర్యలు * ప్రత్యేక తరగతుల నిర్వహణకు సన్నాహాలు * అల్పాహారం కోసం ఉన్నతాధికారుల అనుమతి ఖమ్మం: పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం సిలబస్, పరీక్షా విధానం మారడంతో ఫలితాలు ఏలా ఉంటాయోనని పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే గతంకంటే ఎక్కువ కష్టపడాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల స్థాయిని గుర్తించి..దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రముఖులతో జిల్లా విద్యాశాఖాధికారి ఇటీవల సమావేశమై కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేశారు. మండలానికో ఏడుగురు సభ్యుల కమిటీ విద్యార్థుల స్థాయిని గుర్తించేందుకు మండలానికో ఏడుగురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేస్తారు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ను కమిటీ సభ్యులుగా తీసుకుంటారు. ఇలా ఏడుగురు సభ్యులు మండలంలోని హైస్కూల్స్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తారు. ప్రగతి అంచనా వేసేది ఇలా.. పదో తరగతిలో గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. రాష్ట్రంలో జిల్లాను ప్రథమంగా నిలపాలి అని జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు నూరుశాతం ఫలితాల సాధనకు ముందుగా విద్యార్థుల స్థాయిని అంచనా వేయాలని విద్యాశాఖాధికారులు భావించారు. ఈ ఏడుగురు సభ్యుల బృందం స్కూల్స్కు వెళ్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్, ప్రాజెక్టు వర్క్ వివరాలు, విద్యార్థి అవగాహన స్థాయి, సాధించిన ప్రగతి, ఇంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు సేకరిస్తుంది. ఈనెల చివరి వరకు ఈ బృందం సేకరించిన వివరాలతో ఓ నివేదిక తయారు చేస్తుంది. అనంతరం పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తారు. ఫిబ్రవరిలో ఇదంతా పూర్తి చేసి, మార్చిలో ఈ బృందం మళ్లీ పాఠశాలలకు వెళ్తుంది. విద్యార్థుల్లో వచ్చిన మార్పును గమనిస్తుంది. ఇంకా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక క్లాస్లు మళ్లీ నిర్వహిస్తుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. ఇందుకోసం పాఠశాల పనివేళల్లో కాకుండా ఉదయం, సాయంత్రం క్లాస్లు నిర్వహిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా సాయంత్రం వేళలో అల్పాహారం ఇస్తారు. దీనికోసం ఏజెన్సీలో ఐటీడీఏ, మైదాన ప్రాంతంలో జిల్లా పరిషత్ నుంచి అల్పాహారం తయారీకి నిధులు మంజూరు చేసేందుకు అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. అల్పాహారం కోసం విద్యాకమిటీ చైర్మన్లు, సేవా సంఘాలు, వ్యాపార ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారం కూడా తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇవన్నీ పక డ్బందీగా అమలైతే రాష్ట్రంలోనే జిల్లా ముందుంటుందనడంలో అనుమానం లేదు. ఇందుకు ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీలు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఏవిధంగా సహకరిస్తారనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. -
సేంద్రియ ఎరువులతో సత్ఫలితాలు
సేంద్రియ ఎరువుల్లో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, దశపత్రి ఎరువులను సుద్దాల రైతులు తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తున్నారు. ఘన జీవామృతం ఎరువు ద్వారా భూసారం పెరుగుతుంది. ఘన జీవామృతం తయారు చేయడానికి పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఒక డ్రమ్ములో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఘన జీవామృతం ఎరువు ఎకరానికి సరిపోతుంది. ఈ ఎరువును దుక్కి దున్నాక మాత్రమే చల్లుకోవాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా శత్రు పురుగులు నశించి, మిత్ర పురుగులు పెరుగుతాయి. పంట దిగుబడీ పెరుగుతుంది. ద్రవ జీవామృతం పంటలు వేసి మొలకలు వచ్చాక ద్రవ జీవామృతం ఎరువు చల్లుకోవాలి. పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్ట మట్టి లేదా చెట్టు కింది మట్టిని తీసుకొని డ్రమ్ములో వేసుకోవాలి. అందులో 200 లీటర్ల నీటిని పోసి ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి. 48 గంటల తర్వాత ఎకరానికి సరిపడా ద్రవజీవామృతం తయారు అవుతుంది. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని పంటలకు నీరందించే కాలువల్లో వేయాలి. ఇలా చేస్తే ఎరువు మొక్కల వేర్లకు పట్టుకొని బలంగా తయారవుతాయి. ఇలా 15 రోజులకోసారి చల్లుకుంటే పంటలకు చీడ, పీడలు ఆశించవు. దశపత్రి.. దశపత్రి ఎరువు తయారు చేయడానికి పది రకాల ఆకులు అవసరం. ఒక్కో రకం ఆకులు 2 కిలోలు.. ఇలా పది రకాల ఆకులు 20 కిలోలు తీసుకొని ఒక డ్రమ్ములో ఉంచాలి. ఆ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల ఆవు పేడ వేసి నలభై రోజులపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఎరువు 30 ఎకరాలకు సరిపోతుంది. దీనిని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దశపత్రి ఎరువును వినియోగించడం ద్వారా పంటలకు తెగుళ్లు ఆశించకుండా కాపాడుతుంది. ఉత్తమ దిగబడులూ సాధించొచ్చు. దశపత్రి ఎరువును నెల రోజులకోసారి పంటలపై పిచికారీ చేయాలి. ఈ మూడు ఎరువులను సుద్దాలకు చెందిన సుమారు 10 మంది రైతులు చేల వద్ద తయారు చేస్తూ పంటలకు వినియోగిస్తున్నారు. ఈ ఎరువుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడులూ పొందుతున్నామని వారంతా చెబుతున్నారు.