HS Prannoy
-
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్కు ఫ్రాన్స్లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
Paris Olympics 2024: ప్రణయ్పై గెలుపు.. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో లక్ష్యసేన్.. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో లక్ష్యసేన్ ప్రణయ్పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. -
Olympics 2024: సంచలనం.. ప్రి క్వార్టర్స్లో ఆకుల శ్రీజ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఐదోరోజు భారత్కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరగా.. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.మూడో సీడ్ పై లక్ష్య గెలుపుబుధవారం నాటి మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్, మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్ ప్రి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్లో అన్సీడెడ్ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్కు ఇవే తొలి ఒలింపిక్స్. Lakshya Sen 2️⃣ - 0️⃣ Jonatan ChristieSensational Sen has defeated World No.3 Christie 🇮🇩 in straight sets 21-18, 21-12Lakshya qualifies for Pre-QF, Well Done 🇮🇳♥️#Badminton #Paris2024 pic.twitter.com/q6klX0L0AY— The Khel India (@TheKhelIndia) July 31, 2024 ఆకుల శ్రీజ సంచలన విజయంమరోవైపు.. వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్ చేరిన ప్లేయర్గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్లో వరల్డ్ నంబర్ 16 శ్రీజ.. సింగపూర్కు చెందిన జియాన్ జెంగ్తో తలపడింది.తొలి గేమ్లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.ఫైనల్లో స్వప్నిల్ కుసాలే50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్ఈవెంట్కు అర్హత సాధించాడు.ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు. చదవండి: ‘పిస్టల్’తో పంట పండించాడు! -
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
-
పారిస్ ఒలింపిక్స్కు ఏడుగురు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్లు అధికారికంగా ఖరారవుతాయి.ర్యాంకులు ఇలా..ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్లో ఉంది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్కు అర్హత పొందారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది. -
భారత జట్ల శుభారంభం
చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్లో భాగంగా గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల టీమ్ 4–1 తేడాతో థాయిలాండ్పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్పై కున్లావట్ వితిద్సన్ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. తీరారట్సకుల్ పై లక్ష్యసేన్, సరన్జమ్శ్రీపై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. తొలి డబుల్స్లో సుక్ఫున్ – తీరారట్సకుల్ జంటపై సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టి జోడి... పన్పనిచ్ – సొథోన్పై ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల గెలిచారు. ఉబెర్ కప్లో తొలి సింగిల్స్లో మిచెల్ లిపై అస్మిత చాలిహ, కేథరీన్ – జెస్లీన్పై ప్రియ – శృతి, వెన్ జాంగ్పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్లో జాకీ డెంట్ – క్రిస్టల్ లాయ్ చేతిలో సిమ్రన్ సింఘీ – రితిక ఠాకర్ ఓడిపోగా... చివరి మ్యాచ్లో ఎలియానా జాంగ్పై అన్మోల్ ఖర్బ్ విజయం సాధించింది. -
ఏడో ర్యాంక్కు ఎగబాకిన ప్రణయ్.. టాప్-100లో భారత్ నుంచి ఏకంగా..!
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఏడో ర్యాంక్కు చేరుకొని భారత నంబర్వన్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్ష్య సేన్ (20), శ్రీకాంత్ (24), ప్రియాన్షు (28), కిరణ్ జార్జి (36), సతీశ్ కుమార్ (49), మిథున్ మంజునాథ్ (63), శంకర్ ముత్తుస్వామి (70), సమీర్ వర్మ (77), సాయిప్రణీత్ (91), మెరాబా లువాంగ్ మైస్నమ్ (93), చిరాగ్ సేన్ (99) ఉన్నారు. -
పోరాడి ఓడిన ప్రణయ్
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. -
చైనా ఓపెన్లో భారత షట్లర్లకు చుక్కెదురు.. తొలి రౌండ్లోనే ముగ్గురు ఇంటిముఖం
చైనా ఓపెన్లో భారత షట్లర్లకు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఏకంగా ముగ్గురు ఇంటిముఖం పట్టారు. వీరిలో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ఉన్నారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ప్రణయ్కు మలేసియా ఆటగాడు, వరల్డ్ నంబర్ 22 ప్లేయర్ జీ యంగ్ చేతిలో పరాభవం (21-12, 13-21, 21-18) ఎదురవగా.. లక్ష్యసేన్ను డెన్మార్క్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 10 షట్లర్ ఆండర్స్ ఆంటన్సన్ 23-21, 16-21, 21-9 తేడాతో ఓడించాడు. గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం సాధించి జోరు మీదున్న ప్రణయ్ను జీ యంగ్ 66 నిమిషాల్లో ఓడించగా.. లక్ష్యసేన్ను ఆంటన్సన్ 78 నిమిషాల్లో మట్టికరిపించాడు. అంతకుముందు ప్రియాన్షు రజావత్ను ఇండొనేసియాకు చెందిన షెసర్ హిరెన్ వరుస సెట్లలో (21-13, 26-24) ఓడించాడు. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొంటున్న ఏకైక భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కూడా ఇంటీబాట పట్టారు. ఈ జోడీ చైనా టాప్ సీడ్ పెయిర్ చెన్ కింగ్ చెన్-జియా ఇ ఫాన్ చేతిలో 18-21, 11-21 వరుస సెట్లలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్-దృవ్ కపిల (భారత్) జోడీ.. జపాన్ ద్వయం కెయ్చిరో మట్సుయ్-యోషినోరి టెకుచీ చేతిలో పోరాడి ఓడింది (23-21, 21-19). కాగా, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిన్ననే నిష్క్రమించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన హెచ్ఎస్ ప్రణయ్
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న అతను కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా (ఆగస్ట్ 29) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ప్రణయ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. 72437 పాయింట్లు సాధించిన అతను.. మూడు స్థానాలు ఎగబాకి, ఆరో ప్లేస్కు చేరుకున్నాడు. ప్రణయ్ గతేడాది డిసెంబర్ నుంచి టాప్-10లో కొనసాగుతున్న ఏకైక భారత షట్లర్గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ తర్వాత లక్ష్యసేన్ (12) భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ దక్కించుకున్నాడు. ఇతని తర్వాత కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. కాగా, ప్రణయ్ ఇటీవల ముగిసిన వరల్డ్ బ్యాడింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని, సూపర్-500 మలేసియా మాస్టర్స్ టైటిల్ను, ఆస్ట్రేలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. సింధుకు 14వ ర్యాంక్.. మహిళల విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజా ర్యాంకింగ్స్లో 14వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీ జంట రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్కు చేరింది. -
అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్... ఆనాటి అనుభూతి మళ్లీ ఇప్పుడు: గావస్కర్
మరో పది, పదిహేనేళ్లలో దేశం క్రీడా భారత్గా ఎదుగుతుందని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. చెస్లో ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్లో ప్రణయ్, అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా ప్రపంచ వేదికల్లో పతకాలతో మెరిశారు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘గతంలో కొన్ని క్రీడలే భారత్లో వెలుగొందేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు కవరేజీ, ప్రేక్షకాదరణ బాగా పెరిగాయి’’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్స్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ నడుస్తోంది. నేను ఇంగ్లండ్ నుంచే నీరజ్ ఆటను చూశాను.. మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే అని పాడుకునేంతలా అతడు నన్ను ఆకట్టుకున్నాడు. ఆదివారం నాటి జావెలిన్ త్రో ఫైనల్స్ సందర్భంగానూ అచ్చంగా అదే అనుభూతిని పొందాను. రెండేళ్ల క్రితం నీరజ్ ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచాడు. గతేడాది వరల్డ్ అథ్లెటిక్స్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే, ఈసారి తన అద్భుతమైన త్రోతో స్వర్ణం సాధించాడు’’ అని గావస్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నాడని గావస్కర్ ప్రశంసించాడు. చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడా దేశాలుగా భావిస్తారని.. రానున్న 10- 15 ఏళ్లలో భారత్ కూడా స్పోర్టింగ్ కంట్రీగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. -
సూపర్ ప్రణయ్..
థామస్ కప్... ప్రపంచ బ్యాడ్మింటన్లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఒకటి.. టీమ్ ఈవెంట్గా ఈ మెగా టోర్నీకి ఉన్న ప్రత్యేకతే వేరు! 1949 నుంచి 2020 వరకు 31 సార్లు టోర్నమెంట్ జరిగితే భారత జట్టు కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కేవలం ఐదు దేశాలు చైనా, ఇండోనేసియా, మలేసియా, జపాన్, డెన్మార్క్ మాత్రమే వాటిని అందుకోగలిగాయి. కానీ ఏడాది క్రితం భారత జట్టు ఈ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ తొలిసారి విజేతగా నిలిచింది. ఈ ఘనతలో అందరికంటే కీలక పాత్ర పోషించిన షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. సరిగ్గా చెప్పాలంటే అతను లేకపోతే ఈ టోర్నీలో విజయమే లేదు! సుదీర్ఘ కాలంగా ఎన్నో సంచలన ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రణయ్ ఇప్పుడు మరిన్ని పెద్ద విజయాలపై దృష్టిసారించాడు. మాజీ చాంపియన్ మలేసియాతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్.. బలాబలాలు చూస్తే భారత్దే పైచేయిగా అనిపించింది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్లో అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో లెక్క మారిపోయింది. మూడు వరుస విజయాలు సరిపోతాయి అనుకుంటే రెండో డబుల్స్లో కూడా ఓటమి ఎదురైంది. దాంతో స్కోరు 2–2 వద్ద నిలిచింది. ఈ స్థితిలో చివరి సింగిల్స్లో ప్రణయ్ బరిలోకి దిగాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్లలో మ్యాచ్ను ముగించాడు. దాంతో జట్టు సెమీస్కి చేరింది. సెమీ ఫైనల్లో మరో మాజీ ప్రత్యర్థి డెన్మార్క్ ఎదురైంది. మళ్లీ అదే పరిస్థితి. లక్ష్య సేన్తో పాటు పురుషుల రెండో డబుల్స్ మ్యాచ్లో ఓటమి. స్కోరు 2–2తో సమం. మరోసారి ప్రణయ్పైనే భారం.. అతను ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. కానీ తొలిగేమ్లోనే షాక్! రిటర్న్ షాట్ ఆడబోయి కోర్టులో ముందుకు పడిపోవడంతో చీలమండలానికి తీవ్ర గాయం. తట్టుకోలేనంత నొప్పి. తొలి గేమ్ కోల్పోయాడు కూడా. ఇక తప్పుకోవడమే మిగిలింది. భారత్కు ఓటమి ఖాయమనిపించింది. కానీ ప్రణయ్ ఒప్పుకోలేదు. చివరి వరకు పోరాడేందుకు సిద్ధమయ్యాడు. కొంత బ్రేక్ తీసుకొని పెయిన్ కిల్లర్లతో ఆటకు సై అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం తీవ్రమవుతుందా లేక ఇంకా పెద్ద సమస్యగా మారుతుందా అనేది ఆలోచించలేదు. ఎదురుగా టీమ్ గ్యాలరీలో తనపై ఆశలు పెట్టుకున్న సహచరులు కనిపిస్తుండగా బరిలోకి దిగాడు. తన శక్తియుక్తులను పూర్తిగా కేంద్రీకరించి ప్రత్యర్థిపై చెలరేగాడు. ఫలితంగా తర్వాతి రెండు గేమ్లలో విజయం! టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్కి చేరింది. ప్రణయ్ సాగించిన ఈ సమరం బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్లలో ఒకటిగా నిలిచిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాతో ఫైనల్ మ్యాచ్. ఇక ఈసారి తన వరకు వస్తే మళ్లీ అంతే పట్టుదల కనబరచాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇతర భారత షట్లర్లు అలాంటి పరిస్థితి రానీయలేదు. అందరూ సత్తా చాటి 3–0తో మ్యాచ్ని ముగించి టీమ్ని చాంపియన్గా నిలిపారు. తండ్రి ప్రోత్సాహంతో.. తల్లిదండ్రుల పేర్లు హసీనా .. సునీల్ (హెచ్ఎస్) కలగలిపి ప్రణయ్ తన పేరుకు ముందు చేర్చుకున్నాడు. అతని స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. తండ్రి సునీల్కి బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అధికారిగా పనిచేసిన ఆయన తన టీమ్కి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. అదే ప్రణయ్నీ ఆట వైపు మళ్లించింది. తండ్రి వద్దే అతను ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే మొదట్లో జూనియర్ స్థాయిలో ఆశించిన విధంగా ప్రణయ్ కెరీర్ సాగలేదు. చురుకుదనం ఎక్కువగా లేదంటూ అతనికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. దాంతో సింగిల్స్ నుంచి డబుల్స్కీ మారి చూశాడు. అయితే కేరళలో తగిన కోచింగ్ సౌకర్యాలు కూడా లేకపోవడం అతనికి సమస్యగా మారింది. అదే మలుపు.. ప్రణయ్ కెరీర్లో కీలక మలుపు 15 ఏళ్ల వయసులో వచ్చింది. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటైన పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరడమే అతను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. అప్పటి వరకు అద్భుత విజయాలేమీ లేకున్నా ప్రణయ్లోని ప్రతిభను గోపీచంద్ గుర్తించాడు. అతనికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించి తన బృందంలో చేర్చకున్నాడు. అప్పటినుంచి అతని ఆట మారింది. షాట్లలో పదును పెరిగింది. స్మాష్లు, ర్యాలీలు.. ఇలా అన్ని రకాలుగా అతను మెరుగయ్యాడు. ఇక ఫలితాలు రావడమే తరువాయి అనిపించింది. నిజంగానే ప్రణయ్ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వరుస విజయాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ మొదలు.. 2010లో సింగపూర్లో యూత్ ఒలింపిక్స్ జరిగాయి. బాలుర బ్యాడ్మింటన్లో సత్తా చాటుతూ ప్రణయ్ ఫైనల్కి దూసుకెళ్లాడు. అక్కడ ఓటమి ఎదురైనా రజత పతకం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నెల రోజులలోపే మెక్సికోలో జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ అతనికి దక్కిన మరో మంచి అవకాశం. బాలుర సింగిల్స్లో ఇక్కడా కాంస్యం గెలవడంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అతనికి కొంత గుర్తింపు దక్కింది. 2014లో ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలవడంతో జాతీయ స్థాయిలో అతను అగ్రశ్రేణి ఆటగాడయ్యాడు. చాలెంజర్ టోర్నీలతో మొదలై.. కెరీర్లో సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ విజయాలు సాధించాల్సిన మలుపు వద్ద ప్రణయ్ నిలిచాడు. 22 ఏళ్ల వయసులో టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ గెలవడంతో అతని ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) చాలెంజర్ టోర్నీ చేరింది. తర్వాత ఇదే తరహాలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్లోనూ అతను రన్నరప్గా నిలిచాడు. అనంతరం మూడు ప్రతిష్ఠాత్మక గ్రాండ్ప్రి టోర్నీలు ఇండోనేసియన్ మాస్టర్స్, స్విస్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను గెలుచుకొని ప్రణయ్ దూసుకుపోయాడు. శాఫ్ క్రీడల్లో రజతం, ఆసియన్ చాంపియన్షిప్లో కాంస్యం వీటికి అదనం. అయితే ఒక్కసారిగా వచ్చిన అనూహ్య గాయాలు ప్రణయ్ కెరీర్ను దెబ్బ తీశాయి. అత్యుత్తమంగా ఆడుతున్న వేర్వేరు దశల్లో గాయాల కారణంగా అతని జోరుకు బ్రేక్ పడింది. ఒకసారి కోలుకొని మళ్లీ దారిలో పడే సమయానికి మరో గాయం అతడిని ఇబ్బంది పెట్టింది. దాంతో వరుస పరాజయాలు అతన్ని పోటీలో వెనక్కి తోశాయి. బలమైన ప్రత్యర్థులపై.. ప్రణయ్ కెరీర్లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బలమైన ప్రత్యర్థులతో తలపడి వారిని చిత్తు చేశాడు. అతని జోరు ముందు తలవంచిన కొందరు స్టార్ ఆటగాళ్లలో ఆల్టైమ్ గ్రేట్ లిన్ డాన్, చెన్ లాంగ్, విక్టర్ అక్సెల్సన్, తౌఫీక్ హిదాయత్, టామీ సుగియార్తో, కెంటో మొమొటా, లీ చోంగ్వీ, కిడాంబి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కానీ ఈ విజయాలు అతడిని చాలా సందర్భాల్లో టైటిల్ వరకు తీసుకుపోలేదు. దాంతో ఈ ఫలితాలకు తగినంత గుర్తింపు దక్కలేదు. అయితే పోరాటతత్వం, చివరి వరకు ఓటమిని అంగీకరించని శైలి అతను మళ్లీ కొత్తగా సిద్ధమయ్యేందుకు కావాల్సిన ప్రేరణను అందించాయి. మారిన ఆటతో దూసుకుపోతూ.. దాదాపు సంవత్సర క్రితం ప్రణయ్ కెరీర్ మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ ఇంకా ఏదో లోపం, మరింత సాధించాలనే తపన మాత్రం వదల్లేదు. అప్పుడు కోచ్ గోపీచంద్తో అతను చర్చించాడు. ఇంకా ఎంతో ఎదిగే అవకాశం ఉన్నా ఎక్కడో లోపం ఉంటోందని తేలింది. దాంతో కొత్తగా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు. ముఖ్యంగా ఫిట్నెస్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. గాయాల గేయాలు వినిపించకుండా ప్రత్యేక ట్రైనింగ్తో తన ఫిట్నెస్ను మెరుగుపరచుకున్నాడు. ఆటలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్న చిన్న లోపాలను సరిదిద్దుకున్నాడు. కోర్టులో చురుకుదనం, స్మాష్లలో దూకుడు పెరిగింది. ప్రత్యర్థి ఎవరైనా ఆధిపత్యం ప్రదర్శించడం మొదలైంది. సర్క్యూట్లో బలమైన ఆటగాడిగా నిలబడ్డాడు. ఇందులో మొదటి ఫలితం థామస్ కప్ రూపంలో వచ్చింది. 2022లో ఈ మెగా టోర్నీతో పాటు స్విస్ ఓపెన్ అతని ఖాతాలో చేరింది. ఈ ఏడాదైతే మలేసియా మాస్టర్స్ సూపర్ 500 కెరీర్లో ప్రణయ్ చాంపియన్గా నిలిచాడు. ఇదే అతని కెరీర్లో అతి పెద్ద విజయం కావడం విశేషం. వారాల వ్యవధిలో ఇదే స్థాయి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో రన్నరప్గానూ నిలిచాడు. వరల్డ్ ర్యాంకింగ్లో అత్యుత్తమంగా 7కు చేరుకున్నాడు. ఇప్పడు ప్రణయ్ భారత్ తరఫున నంబర్వన్. ఫామ్ పరంగా, ఆటపరంగా కూడా అత్యుత్తమ ఆటగాడు. దాంతో అతనిపై అన్ని వైపుల నుంచీ అంచనాలు పెరిగాయి. రాబోయే వరల్డ్ చాంపియన్షిప్లో టైటిల్ గెలవడం మొదటి లక్ష్యం కాగా, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ పతకమే అతని అసలైన మజిలీ. ప్రణయ్ ఆటను చూస్తే ఈ రెండూ కూడా సాధ్యమే అనిపిస్తోంది. -
ప్రణయ్ అద్భుత పోరాటం.. టాప్ సీడ్ షట్లర్కు షాక్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ సెమీస్కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ప్రణయ్.. టాప్ సీడ్ ఆంథోని సినిసుకను, యువ షట్లర్ ప్రియాన్షు.. మాజీ వరల్డ్ నంబర్ 1, భారత్కే చెందిన కిదాంబి శ్రీకాంత్ను మట్టికరిపించారు. ఇటీవలి కాలంలో సూపర్ టచ్లో ఉన్న వరల్డ్ నంబర్ 9 ప్లేయర్ ప్రణయ్.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్లో ఓర్లీయాన్స్ మాస్టర్స్ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్, ప్రియాన్షులు సెమీస్లో ఎదురెదురుపడనున్నారు. ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్ షట్లర్ బెయివెన్ జాంగ్తో జరిగిన మ్యాచ్లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. జాంగ్ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి. -
క్వార్టర్స్లో పీవీ సింధు.. ఫామ్లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు క్వార్టర్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించిన సింధు క్వార్టర్స్లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్కు చేరుకోవడంతో ఫామ్లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్స్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఇక భారత్కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్లో కిడాంబి శ్రీకాంత్తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం చేసిన భారత షట్లర్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్లో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు మొదటి రౌండ్లో విజయం సాధించారు. జపాన్ ఓపెన్లో విఫలమైన ప్రణయ్ హాంకాంగ్కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్లలో జోరుగా ఆడిన భారత షట్లర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్లో 19వ ర్యాంకర్ శ్రీకాంత్ జపాన్ ఆటగాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవలీలగా గెలుపొందాడు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్కు చేరింది. 47వ ర్యాంకర్ అష్మితా చాలిహపై 21-18, 21-13తో సింధు విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లో ఆమె భారత్కే చెందిన ఆకర్షి కష్యప్ను ఢీ కొట్టనుంది. -
తొమ్మిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 17వ ర్యాంక్లో, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ జంట మూడు ఏస్లు సంధించింది. -
సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి
భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్కు దగ్గరయ్యాడు.జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన లోకల్ ప్లేయర్ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. Lakshya Sen enters semifinals of Japan Open, Satwik-Chirag out READ: https://t.co/XMwjavlFmc#LakshyaSen #Badminton #JapanOpen pic.twitter.com/oRgSxUuxR3 — TOI Sports (@toisports) July 28, 2023 వరల్డ్ నెంబర్ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. డెన్మార్క్కు చెందిన ప్రపంచ నెంబర్వన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్ను 21-19తో గెలిచి రెండో గేమ్లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్ కోల్పోయిన ప్రణయ్.. మూడో గేమ్లో పూర్తిగా చేతులెత్తేశాడు. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి భారత డబుల్స్ టాప్ షట్లర్స్ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్- వాంగ్ చీ-లాన్ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు. చదవండి: రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్కు వచ్చాడంటే? Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ -
క్వార్టర్స్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్లో పరాజయం పాలైంది. జపాన్కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
తొలి రౌండ్లోనే ఓడిన సింధు, కిడాంబి శ్రీకాంత్
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ పీవీ సింధు 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పాయ్ యుపో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తస్నీమ్, మాళవిక, ఆకర్షి, తాన్యా, అష్మిత కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 22–24, 17–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్కిది వరుసగా 12వ ఓటమి. భారత నంబర్వన్ ప్రణయ్ 21–13, 21–17తో జూలియన్ (బెల్జియం)పై, ప్రియాన్షు 21–15, 21–19తో చోయ్ జి హున్ (కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సిక్కి రెడ్డి జోడీ గెలుపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ 21–17, 21–17తో అలి్వన్ మోరాదా–అలీసా లియోన్ (ఫిలిప్పీన్స్)లపై గెలి చారు. సుమీత్ రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–23, 21–13, 12–21తో సాంగ్ హున్ చో–లీ జంగ్ హున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
సెమీస్లోనే నిష్క్రమించిన ప్రణయ్.. టైటిల్కు అడుగుదూరంలో సాత్విక్- చిరాగ్
ప్రపంచ చాంపియన్షిప్లో... ఆసియా చాంపియన్షిప్లో... కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో అతి గొప్ప టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–1000 స్థాయి టోర్నీలో ఈ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. జకార్తా: అంచనాలకు మించి రాణిస్తూ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 67 నిమిషాల్లో 17–21, 21–19, 21–18తో మిన్ హిక్ కాంగ్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్ జంట ఒక్కసారి కూడా గెలవలేదు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా సాత్విక్–చిరాగ్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే అవకాశముంది. ఫైనల్ మ్యాచ్లన్నీ స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముగిసిన ప్రణయ్ పోరాటం మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 15–21తో ఓడిపోయాడు. సెమీఫైనల్లో నిష్క్రమించిన ప్రణయ్కు 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 33 వేలు) ప్రైజ్మనీతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో గొప్ప ఫామ్లో ఉన్న సాత్విక్–చిరాగ్ మరోసారి మెరిశారు. కొరియా జోడీపై గతంలో రెండుసార్లు నెగ్గిన సాత్విక్–చిరాగ్కు ఈసారి గట్టిపోటీ లభించింది. తొలి గేమ్ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్లో నెమ్మదిగా తేరుకుంది. ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని గేమ్ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్కు హోరాహోరీగా పోరాడాయి. స్కోరు 5–5తో సమంగా ఉన్నపుడు సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 12–5తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే కొరియా జంట పట్టుదలతో ఆడి స్కోరును 16–16 వద్ద సమం చేసింది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పో యిన భారత జోడీ వెంటనే రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఎనిమిదోసారి కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలలో సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐదు టోర్నీలలో నెగ్గిన సాత్విక్–చిరాగ్, రెండు టోర్నీలలో రన్నరప్గా నిలిచారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్ఎస్ ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్ల ప్రణయ్కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు. వెంగ్ హంగ్ యాంగ్, హెచ్ ప్రణయ్ మధ్య మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో వెంగ్ హంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ప్రణయ్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి 9-9 తేడాతో స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత 15-12 తేడాతో 3 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 15-15 తేడాతో స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. అయితే వరుసగా రెండు పాయింట్లు సాధించి 17-16 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, మొదటి సెట్ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో ప్రణయ్ పూర్తిగా తేలిపోయాడు. ప్రణయ్ చేసిన తప్పిదాలతో 11-17 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దాన్ని కాపాడుకుంటూ 13-21 తేడాతో రెండో సెట్ సొంతం చేసుకుని, గేమ్ని 1-1 తేడాతో సమం చేశాడు.. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. మూడో సెట్లో 10-10 తేడాతో ఇద్దరు ప్లేయర్లు సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత దూకుడు చూపించిన హెచ్ఎస్ ప్రణయ్, వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా 3 పాయింట్లు సాధించి, సెట్తో పాటు మ్యాచ్ని కూడా కైవసం చేసుకున్నాడు.. మలేషియా మాస్టర్స్ ఉమెన్స్ సింగిల్స్లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలవగా.. పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలిచిన మొదటి భారత షట్లర్గా హెచ్ఎస్ ప్రణయ్ చరిత్రకెక్కాడు. WATCH: Moments when HS Prannoy won his first ever BWF World Tour Title! via Sports 18#Badminton #MalaysiaMasters2023 pic.twitter.com/qVuqwmYvWL — Sayak Dipta Dey (@sayakdd28) May 28, 2023 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡 🏆🏆🏆 HS Prannoy has done it!! 🫡😍 The WR 9 Indian beats Weng Hong Yang of China 21-19, 13-21, 21-18 in #MalaysiaMasters2023 men's singles final to win his maiden BWF World Tour title. 🇮🇳#MalaysiaMasters #HSPrannoy pic.twitter.com/Kc3YfHnFdu — Khel Now (@KhelNow) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్.. సింధు కథ ముగిసే
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మహిళల సింగిల్స్లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ షట్లర్ హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం. ఫామ్లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్తో అతడు తలపడనున్నాడు. sportsmanship 👏🏻 hopefully it’s nothing serious ;( have a good recovery cea! pic.twitter.com/sEVL2eP8Di— bobe (@bobeside) May 27, 2023 Former champion Pusarla V. Sindhu 🇮🇳 faces Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #MalaysiaMasters2023 pic.twitter.com/sbDIsKZ1lq— BWF (@bwfmedia) May 27, 2023 #BWF | Komentar dan pesan menyentuh dari Prannoy H.S. yang jadi saksi tumbangnya Christian Adinata karena cedera. Prannoy juga yang pertama datang untuk menenangkan CeA setelah terjatuh di lapangan. Respect Prannoy! Good luck for the final!! 🙏🏼❤️ pic.twitter.com/JP2LZSwVwo— SPOTV Indonesia (@SPOTV_Indonesia) May 27, 2023 చదవండి: 'త్వరలో మిమ్మల్ని కలుస్తా'.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ -
Malaysia Masters: సెమీస్లో సింధు, ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
కౌలాలంపూర్: తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సింధు 74 నిమిషాల్లో 21–16, 13–21, 22–20తో యి మన్ జాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రణయ్ 91 నిమిషాల్లో 25–23, 18–21, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు. అయితే భారత మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. 57 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 16–21, 11–21తో ప్రపంచ 57వ ర్యాంకర్ క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్స్లో గ్రెగోరియా టున్జంగ్ (ఇండోనేసియా)తో సింధు; అడినాటాతో ప్రణయ్ తలపడతారు. -
Malaysia Masters: ప్రపంచ ఐదో ర్యాంకర్కు షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్
కౌలాలంపూర్: వ్యక్తిగత విదేశీ కోచ్ను నియమించుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 5వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–19, 21–19తో అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకున్నాడు. కున్లావుత్పై శ్రీకాంత్కిదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో కున్లావుత్తో ఆడిన మూడుసార్లూ శ్రీకాంత్ వరుస గేముల్లో ఓడిపోవడం గమనార్హం. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్పై నెగ్గిన ప్రణయ్ భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ను ఓడించిన ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 11వ ర్యాంకర్ షి ఫెంగ్ లీని బోల్తా కొట్టించాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–16, 21–11తో షి ఫెంగ్ లీపై గెలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 7–5తో వద్ద ప్రణయ్ వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 16–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్కే చెందిన లక్ష్య సేన్ 14–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు వరుసగా 13వసారి... మహిళల సింగిల్స్లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ సింధు 21–16, 21–11తో ప్రపంచ 28వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. తొలి గేమ్లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్లోనూ ఆమెదే పైచేయిగా నిలిచింది. ఒహోరిపై సింధుకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో జాంగ్ యి మాన్ (చైనా)తో సింధు; నిషిమోటో (జపాన్)తో ప్రణయ్; క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతారు. -
Malaysia Masters: లక్ష్య సేన్, ప్రణయ్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ సంచలన విజయాలతో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 21–14, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై... ప్రపంచ 23వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–10, 16–21, 21–9తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత లో కీన్ యె (సింగపూర్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 21–16తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–13, 17–21, 21–18తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై కష్టపడి విజయం సాధించింది. భారత్కే చెందిన అషి్మత 17–21, 7–21తో యు హాన్ (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 12–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో, మాళవిక బన్సోద్ 11–21 13–21తో జి యి వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. -
Sudirman Cup 2023: విజయంతో ముగింపు... భారత్కు తప్పని నిరాశ
సుజౌ (చైనా): సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు విజయంతో ముగించింది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–1తో గెలుపొందింది. చైనీస్ తైపీ, మలేసియా జట్లతో జరిగిన తొలి రెండు లీగ్ మ్యాచ్ల్లో భారత్ ఓడిపోవడంతో నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. తొలి మ్యాచ్లో సాయిప్రతీక్–తనీషా క్రాస్టో 21– 17, 14–21, 18–21తో కెనెత్ చూ–గ్రోన్యా సోమర్విలె చేతిలో ఓడిపోయారు. అనంతరం రెండో మ్యాచ్లో ప్రణయ్ 21–8, 21–8తో జాక్ యుపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్లో అనుపమ 21–16, 21–18తో టిఫానీ హోపై, నాలుగో మ్యాచ్లో అర్జున్–ధ్రువ్ 21–11, 21–12తో టాంగ్–రేన్ వాంగ్లపై, ఐదో మ్యాచ్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–19, 21–13తో కైట్లిన్–ఎంజెలా యులపై విజయం సాధించారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో ప్రణయ్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో కేరళకు చెందిన ప్రణయ్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్కు చేరుకొని భారత నంబర్వన్గా నిలిచాడు. లక్ష్య సేన్ 22వ ర్యాంక్లో, కిడాంబి శ్రీకాంత్ 23వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఒక స్థానం పురోగతి సాధించి 11వ ర్యాంక్లో నిలిచింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్కు చేరుకోగా... పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం రెండు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్లో నిలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో మూడో పతకానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. హాన్ యువెపై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. 2014, 2022లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు నెగ్గిన సింధు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది. గతంలో ఆన్ సె యంగ్తో ఆడిన ఐదుసార్లూ సింధు ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 21–16, 5–21, 21–18తో చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)పై నెగ్గగా... కిడాంబి శ్రీకాంత్ 14–21, 22–20, 9–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్లో సియో సెయుంగ్ జే–చె యు జంగ్ (దక్షిణ కొరియా) జోడీ నుంచి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జంటకు వాకోవర్ లభించడంతో క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–11తో జిన్ యోంగ్–నా సంగ్ సెంగ్ (కొరియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట గాయం కారణంగా బరిలోకి దిగకుండా ప్రత్యర్థి జోడీకి వాకోవర్ ఇచ్చింది. చదవండి: IPL 2023: అందుకే ఆ పని పనిచేశా.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి: శాంసన్ -
Badminton Asia Championships 2023: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత షట్లర్లు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. దుబాయ్లో నేడు మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 61 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్ మూడు కాంస్య పతకాలు (2010, 2016, 2018), పీవీ సింధు (2014, 2022) రెండు కాంస్య పతకాలు సాధించారు. అయితే ఈ ఏడాది సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు. -
Sudirman Cup 2023: భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ సుదిర్మన్ కప్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మే 14 నుంచి 21 వరకు చైనాలోని సుజౌలో ఈ టోర్నీ జరుగుతుంది. గ్రూప్ ‘సి’లో మలేసియా, చైనీస్ తైపీ, ఆస్ట్రేలియా జట్లతో భారత జట్టు ఆడుతుంది. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో ఒక్కో మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టు: ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), పీవీ సింధు, అనుపమ (మహిళల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల (పురుషుల డబుల్స్), పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్), తనీషా క్రాస్టో–సాయిప్రతీక్ (మిక్స్డ్ డబుల్స్). -
All England 2023: లక్ష్య సేన్, ప్రణయ్ శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ తొలి రౌండ్లో సంచలన విజయం సాధించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–19తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో చౌ తియెన్ చెన్తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ మూడో ప్రయత్నంలో మాత్రం పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ 21–19, 22–20తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
Badminton: క్వార్టర్ ఫైనల్లో భారత్
Asia Mixed Team Badminton Championships 2023: దుబాయ్లో జరుగుతున్న ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘బి’లో భారత జట్టు వరుసగా మూడో విజయం సాధించి క్వార్టర్స్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 4–1తో మలేసియాను భారత్ ఓడించింది. మహిళల సింగిల్స్లో సింధు 21–13, 21–17తో వాంగ్ లింగ్ చింగ్పై, పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 21–13, 25–23తో లీ జి జియాపై నెగ్గారు. పురుషుల డబుల్స్లో ధ్రువ్ కపిల–చిరాగ్ షెట్టి 16–21, 10–21తో అరోన్ చియా–సో వూయి యిక్ల చేతిలో ఓడగా, మహిళల డబుల్స్లో గాయత్రీ–ట్రెసా జాలీ 23–21, 21–15తో పియర్లీ టన్–తినా మురళీధరన్లపై, మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్–తనిషా క్రాస్టో 21–19, 19–21, 21–16తో చెన్ తంగ్ జి–తొ ఇ విపై గెలుపొందారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్తో భారత్ తలపడుతుంది. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
Asia Mixed Team Badminton Championship 2023: వచ్చే నెలలో దుబాయ్లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ భారత్కు ప్రాతినిథ్యం వహిస్తారు. అదే విధంగా.. ►మహిళల సింగిల్స్లో పీవీ సింధు, ఆకర్షి కశ్యప్ ►పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ జోడీలు... ►మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, శిఖా గౌతమ్–అశ్విని భట్ జోడీలు.... ►మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్కు బదులు అర్ష్దీప్! అక్కడ చెరో విజయం మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్ -
BWF Rankings: ఎనిమిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం
World Badminton Rankings 2022: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఎనిమిదో ర్యాంక్కు చేరుకున్నాడు. కొంత కాలంగా చక్కటి ఫామ్లో ఉన్న ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ఆడటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్లో ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది. ఇది కూడా చదవండి: అర్జున్కు మిశ్రమ ఫలితాలు ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఇరిగేశి అర్జున్ మంగళవారం జరిగిన నాలుగు రౌండ్లలో రెండు గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్లో ఓటమి పాలయ్యాడు. 9 రౌండ్లు ముగిసిన అనంతరం అర్జున్ 6.5 పాయింట్లతో మరో ఆరుగురి తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల ర్యాపిడ్ చెస్లో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి భారత క్రీడాకారిణి సవితశ్రీ (6.5) మరో ఇద్దరితో కలిసి ఆధిక్యంలో ఉంది. -
BWF World Tour Finals : మళ్లీ ఓడిన ప్రణయ్
బ్యాంకాక్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్లో హెచ్.ఎస్. ప్రణయ్ ఆటకు గ్రూప్ దశలోనే తెరపడింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోవడంతో 30 ఏళ్ల భారత స్టార్కు సెమీస్ చేరే అవకాశం చేజారింది. ఇక గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ ఆడి రావడమే మిగిలింది. గురువారం జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 21–23, 21–17, 19–21తో చైనాకు చెందిన లు గ్వాంగ్ జు చేతిలో పరాజయం పాలయ్యాడు. 84 నిమిషాల పాటు జరిగిన సమరంలో భారత ఆటగాడు చైనీస్ ప్రత్యరి్థతో హోరాహోరీగా తలపడ్డాడు. గ్రూపులో మిగిలిపోయిన నామమాత్రమైన ఆఖరి మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ ప్రణయ్... ఒలింపిక్ చాంపియన్, నంబర్వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో తలపడతాడు. శుక్రవారం ఈ మ్యాచ్ జరుగుతుంది. -
తొలి మ్యాచ్లో ప్రణయ్ పరాజయం
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ను భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమితో ప్రారంభించాడు. బ్యాంకాక్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ ప్రణయ్ 11–21, 21–9, 17–21తో 14వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో చైనా ప్లేయర్, ప్రపంచ 17వ ర్యాంకర్ లూ గ్వాంగ్ జుతో ప్రణయ్ తలపడతాడు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రణయ్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... -
HS Prannoy: ప్రణయ్ తొలిసారి... మొదటి మ్యాచ్లో నరోకాతో ‘ఢీ’
BWF World Tour Finals 2022: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మొదటిసారి అర్హత సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రణయ్ ఆడనున్నాడు. బ్యాంకాక్లో బుధవారం నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రణయ్తోపాటు ఒలింపిక్ చాంపియన్ అక్సెల్సన్ (డెన్మార్క్), లూ గ్వాంగ్ జు (చైనా), నరోకా ఉన్నారు. నరోకాతో ఈ ఏడాది సింగపూర్ ఓపెన్లో ఆడిన ప్రణయ్ మూడు గేముల్లో ఓడిపోయాడు. చదవండి: IND Vs BAN: బంగ్లాదేశ్తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? Virender Sehwags son: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయంపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సింగపూర్కు చెందిన ఏడో సీడ్ లో కీన్ యూ 21–13, 21–15 స్కోరుతో శ్రీకాంత్ను ఓడించాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఏపీ షట్లర్ శ్రీకాంత్ తగిన పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అయితే మరో భారత ప్లేయర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్లో లక్ష్య 21–9, 21–18 స్కోరుతో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్లలో ప్రణయ్ చేతిలో ఓడిన సేన్ ఈ సారి పదునైన ఆటతో చెలరేగి 39 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. గాయత్రి–ట్రెసా జోడి ఓటమి... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్లో ఈ భారత షట్లర్లు 21–14, 2–16తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ – బగాస్ మౌలానాలను ఓడించారు. అయితే మహిళల డబుల్స్లో భారత జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీకి చుక్కెదురైంది. థాయిలాండ్కు చెందిన జొంగొల్ఫాన్ కిటిథారకుల్ – రవీంద ప్రజొంగ్జాయ్ ద్వయం 23–21, 21–13 స్కోరుతో గాయత్రి–ట్రెసాపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ఇషాన్ భట్నాగర్ – తనీషా క్రాస్టో 16–21, 10–21 తేడాతో యుటా వతనబె – అరిసా హిగాషినో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: World Shooting Championship: భారత షూటర్ల జోరు -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీ తొలి గేమ్లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
పెళ్లి పీటలెక్కనున్న భారత స్టార్ షట్లర్.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు అదుర్స్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవలే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్లో టాప్ లేపిన (నంబర్ వన్ ర్యాంక్) ప్రణయ్.. తన గర్ల్ఫ్రెండ్ శ్వేతా గోమ్స్ని వివాహం చేసుకోబోతున్నట్లు ట్విటర్ వేదికగా అనౌన్స్ చేశాడు. ప్రణయ్ తన ట్వీట్లో ఫియాన్సీ శ్వేతా గోమ్స్తో దిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 30 ఏళ్ల ప్రణయ్ ఈ ఏడాది భీకర ఫామ్లో కొనసాగుతున్నాడు. మే నెలలో జరిగిన థామప్ కప్లో భారత్ స్వర్ణం సాధించడంలో ప్రణయ్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఇటీవలే జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, జపాన్ ఓపెన్లోనూ ప్రణయ్ సత్తా చాటాడు. ప్రణయ్ హైదరాబాద్లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుని రాటుదేలాడు. ప్రణయ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. All that you are is all that I will ever need ♥️ #3daystogo pic.twitter.com/SegXJdv5ES — PRANNOY HS (@PRANNOYHSPRI) September 10, 2022 -
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్కు 4,125 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జపాన్ ఓపెన్లో ముగిసిన ప్రణయ్ పోరాటం
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్లు పోరాటం ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా నిష్క్రమించగా.. చివరగా ఆశలు పెట్టుకున్న హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఇంటిబాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో 17-21, 21-15, 20-22 తేడాతో ప్రణయ్ ఓటమిపాలైయ్యాడు. కాగా ప్రణయ్ ప్రీక్వార్టర్స్లో సింగపూర్ ఆటగాడు కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) మట్టికరిపించి క్వార్టర్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు ఈ టోర్నీ తొలి రౌండ్లో లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా.. ఫ్రీ క్వార్టర్స్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు! -
ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం దాదాపుగా ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా ఇంటిముఖం పట్టగా.. గురువారం కిదాంబి శ్రీకాంత్ పోరాటం సైతం ముగిసింది. భారత్ తరఫున హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే ఈ టోర్నీ బరిలో మిగిలాడు. పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో శ్రీకాంత్.. జపాన్కు చెందిన కంటే సునేయమ చేతిలో 10-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. అంతకుముందు శ్రీకాంత్ తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ 4 ఆటగాడు లీ జీ జియాకు షాకిచ్చి ప్రీక్వార్టర్స్కు అర్హత సాధించాడు. ఇక టోర్నీ బరిలో నిలిచిన ఏకైక భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విషయానికొస్తే.. ఈ మాజీ వరల్డ్ నంబర్ 8 షట్లర్ ప్రీక్వార్టర్స్లో సింగపూర్ ఆటగాడు, మాజీ వరల్డ్ ఛాంపియన్ లో కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) ఖంగుతినిపించి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ప్రణయ్ తదుపరి రౌండ్లో తైపీ షట్లర్ చౌ టెన్ చెన్ను ఢీకొట్టాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీ బరిలో భారత తురుపు ముక్క పీవీ సింధు బరిలో దిగని విషయం తెలిసిందే. చదవండి: వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్ -
BWF 2022: ప్రణయ్ జోరుకు తెర
ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు విజేతగా నిలిచిన జపాన్ స్టార్, టైటిల్ ఫేవరెట్ కెంటో మొమోటాపై సంచలన విజయంతో పతకం ఆశలు రేపిన హెచ్.ఎస్.ప్రణయ్ ‘షో’కు క్వార్టర్ ఫైనల్లో తెరపడింది. పురుషుల సింగిల్స్లో చైనా ఆటగాడు జావో జన్ పెంగ్ 19–21, 21–6, 21–18తో ప్రణయ్ ఆశల్ని క్వార్టర్స్లోనే తుంచేశాడు. తొలి గేమ్ ఆరంభంలో బాగా ఆడిన ప్రణయ్ ఒక దశలో 19–13తో ఆధిక్యంలో ఉన్నాడు. కానీ అదే పనిగా చేసిన తప్పిదాలతో అనూహ్యంగా ప్రత్యర్థి 19–19తో పుంజుకున్నాడు. కానీ ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్లో భారత ఆటగాడు పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో చైనీస్ షట్లర్ 11–1తో దూసుకెళ్లాడు. అదే జోరుతో గేమ్ గెలిచాడు. మూడో గేమ్లో ప్రత్యర్థికి దీటుగా రాణించినప్పటికీ కీలక తరుణంలో పాయింట్లు చేసిన చైనా ఆటగాడు గేమ్తో పాటు మ్యాచ్ గెలిచి సెమీస్ చేరాడు. గతేడాది స్పెయిన్లో జరిగిన ఈవెంట్లోనూ ప్రణయ్ ఆట క్వార్టర్స్లోనే ముగిసింది. -
పతకాలకు విజయం దూరంలో...
టోక్యో: ఈ ఏడాది థామస్ కప్లో భారత్ తొలిసారి చాంపియన్గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్కే చెందిన లక్ష్య సేన్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్తోపాటు పతకం కూడా లభించనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు. సైనాకు నిరాశ మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. -
BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం
తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తిస్తానని భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి నిరూపించాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. తరచూ గాయాల బారిన పడుతూ... ఆశించినన్ని విజయాలు అందుకోలేకపోయిన ఈ కేరళ ప్లేయర్ అడపాదడపా అద్భుత విజయాలతో అలరిస్తుంటాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ప్రణయ్ పెను సంచలనం సృష్టించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్లో ఒకడైన జపాన్ స్టార్ కెంటో మొమోటాను ప్రణయ్ వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్కే చెందిన యువతార లక్ష్య సేన్తో ప్రణయ్ తలపడతాడు. గత సంవత్సరం రజత పతకం నెగ్గిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. టోక్యో: అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)పై ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–16తో కెంటో మొమోటాను ఓడించాడు. గతంలో మొమోటాతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. మొమోటాతో 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రణయ్ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయిన ప్రణయ్ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–5తో ముందంజ వేశాడు. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్ తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో ప్రణయ్ 1–4తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ప్రణయ్ స్కోరును సమం చేశాడు. అనంతరం 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొమోటాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్య సేన్తో ప్రణయ్ తలపడతాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ లక్ష్య సేన్ 36 నిమిషాల్లో 21–17, 21–10తో లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ అవుట్... గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 17–21తో ఓడిపోయాడు. పోరాడి ఓడిన శిఖా–అశ్విని జోడీ మహిళల డబుల్స్లో భారత పోరాటం ముగిసింది. బుధవారం బరిలోకి దిగిన నాలుగు భారత జోడీలు రెండో రౌండ్లోనే నిష్క్రమించాయి. శిఖా గౌతమ్–అశ్విని భట్ 5–21, 21–18, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ కిమ్ సో యోంగ్–కాంగ్ హి యోంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 15–21, 10–21తో టాప్ సీడ్ చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ (చైనా) చేతిలో... దండు పూజ–సంజన 15–21, 7–21తో మూడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 8–21, 17–21తో పదో సీడ్ పియర్లీ తాన్–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. ధ్రువ్–అర్జున్ జోడీ అద్భుతం పురుషుల డబుల్స్లో భారత రెండు జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ ద్వయం 21–17, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–8, 21–10తో సోలిస్ జొనాథన్–అనిబెల్ మార్క్విన్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో జెప్ బే–లాసి మోల్డే (డెన్మార్క్)లతో సాత్విక్–చిరాగ్... హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ (సింగపూర్)లతో అర్జున్–ధ్రువ్ ఆడతారు. -
కిదాంబి శ్రీకాంత్కు షాక్.. క్వార్టర్స్కు సింధు, ప్రణయ్
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు ఇవాళ (జులై 14) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్కు భారత్కే చెందిన మరో షట్లర్ మిథున్ మంజునాథ్ షాకివ్వగా, హెచ్ఎస్ ప్రణయ్.. ప్రపంచ నెం.4 ఆటగాడు చో టెన్ చెన్పై సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ గండాన్ని అధిగమించి ప్రీక్వార్టర్స్కు అర్హత సాధించగా.. మరో మ్యాచ్లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ భారత్కే చెందిన మాళవిక బాన్సోద్పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మిథున్ మంజునాథ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి (17-21, 21-15, 18-21) ఓడగా.. మరో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్, చైనీస్ తైపీకి చెందిన చో టెన్ చెన్పై 14-21, 22-20, 21-18తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విషయానికొస్తే.. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించగా.. వెటరన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో మాళవిక బాన్సోద్పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అశ్మిత చాలిహా వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్ చేతిలో పరాజయం పాలైంది. చదవండి: World Cup 2022: అసలైన మ్యాచ్లలో చేతులెత్తేశారు! జపాన్తో పోరులో.. -
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ.. సెమీఫైనల్లో ప్రణయ్ ఓటమి
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ఓటమి చవిచూశాడు. సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 21–17, 9–21, 17–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్లో ఓడిన ప్రణయ్కు 5,220 డాలర్ల (రూ. 4 లక్షల 13 వేలు) ప్రైజ్మనీ లభించింది. చదవండి: World Games 2022: సురేఖ జంటకు కాంస్యం -
Malaysia Masters: అదరగొట్టిన సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్ జంగ్ యి మన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పురుషుల ఈవెంట్లో ప్రణయ్ 21–19, 21–16తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 14–21, 17–21తో లి షె ఫెంగ్ (చైనా) చేతిలో, కశ్యప్ 10–21, 15–21తో ఆరో సీడ్ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు... రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో, ప్రణయ్... జపాన్కు చెందిన సునెయామతో తలపడతారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
అన్నింటికంటే అదే గొప్ప విజయం.. ఇంకేం అవసరం లేదు!
దాదాపు ఐదేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయం అందుకోలేకపోయిన భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తనకు ఎలాంటి విచారం లేదని వ్యాఖ్యానించాడు. ఒక దశలో లీ చోంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్, అక్సెల్సన్లను ఓడించి ప్రపంచ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానానికి చేరాడు ప్రణయ్. కానీ.. ఈ కేరళ షట్లర్ ఇంతవరకు మాస్టర్స్ స్థాయి టోర్నీని గెలవలేకపోయాడు. అయితే తన కెరీర్లో థామస్ కప్ టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడమే గొప్ప క్షణమని, వ్యక్తిగత విజయాలు దక్కకపోయినా తాను బాధపడనని అతను అన్నాడు. కాగా 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో ఈ ఏడాది తొలిసారి భారత్ చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్లో, డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. గెలుపు వీరులు థామస్ కప్లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు -
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. సెమీస్కు దూసుకెళ్లిన సింధు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–10, 21–19తో ఐదో సీడ్ మిచెల్లి లీ (కెనడా)పై విజయం సాధించింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్లో ఆమెకు గట్టిపోటీ లభించింది. కీలకదశలో సింధు పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. ప్రణయ్ ముందంజ... పురుషుల సింగిల్స్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–16తో భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్ను ఓడించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 17–21, 14–21తో ఆంథోనీ సినిసుక జిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 20–22, 21–23తో వివియన్ హూ–లిమ్ చియు సియెన్ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. చదవండి: IPL 2022:క్రికెట్ పండగొచ్చింది.. కోల్కతా, చెన్నై సమరానికి సిద్దం -
ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు..
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఈవ్జెనియా కొసెత్స్కయా రిటైర్డ్హర్ట్ కావడంతో సింధుకు బై లభించి ఫైనల్కు చేరుకుంది. కాగా తొలి సెట్ను సింధు సొంతం చేసుకుంది. అంతకముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో థాయిలాండ్కు చెందిన ఆరవ సీడ్ సుపనిద కతేథింగ్పై 11-21,21-12,21-17 తేడాతో ఓడించిన సింధు సెమీస్కు చేరింది. ఇక ఫైనల్లో పీవీ సింధు.. మరో భారత క్రీడాకారిణి మాలవిక భన్సోద్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణోయ్ క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన ఆర్నాడ్ మెర్కెల్తో జరిగిన మ్యాచ్లో 21-19,21-16 తేడాతో ప్రణోయ్ ఓటమి పాలయ్యాడు. కేవలం 59 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ ఇషాన్ భట్నాగర్–సాయి ప్రతీక్ (భారత్) జంటను ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం రష్యాకు చెందిన అనస్తాసియా అక్చురినా-ఓల్గా మొరోజోవా ద్వయంపై 24-22 21-10 తేడాతో గెలిచి సెమీస్లో అడుగపెట్టారు. -
Indian Open Super Series: సైనా, ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సైనా తొలి గేమ్ను 22–20తో గెల్చుకొని, రెండో గేమ్లో 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో తెలంగాణ ప్లేయర్లు కేయుర మోపాటి శుభారంభం చేయగా ... సామియా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. కేయుర 15–21, 21–19, 21–8తో స్మిత తోష్నివాల్ (భారత్)పై నెగ్గింది. సామియా 18–21, 9–21తో మాళవిక బన్సోద్ (భారత్) చేతిలో, సాయి ఉత్తేజిత 21–9, 12–21, 19–21తో తాన్యా (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రణయ్ 21–14, 21–7తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, లక్ష్య సేన్ 21–15, 21–7తో అధామ్ హతీమ్ ఎల్గామల్ (ఈజిప్ట్)పై గెలిచారు. ప్రిక్వార్టర్స్లో సిక్కి–అశ్విని జంట మహిళల డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–7, 19–21, 21–13తో జనని–దివ్య (భారత్) జోడీపై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్లో శ్రీవేద్య గురజాడ (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జంట 21–9, 21–7తో మేఘ–లీలా లక్ష్మి (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–10తో రవి–చిరాగ్ అరోరా (భారత్) జంటపై గెలిచింది. విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 16–21, 16–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ప్రణయ్ సంచలనం..
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–18, 21–19తో ప్రపంచ 9వ ర్యాంకర్ ఎన్జీకా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. అక్సెల్సన్కు షాక్ మరోవైపు ప్రపంచ నంబర్వన్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యెవ్ (సింగపూర్) 14–21, 21–9, 21–6తో రెండో సీడ్ అక్సెల్సన్ను ఓడించి రెండో రౌండ్కు చేరాడు. చదవండి: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది -
ఒలింపిక్ ఛాంపియన్కు షాకిచ్చిన భారత షట్లర్
బాలీ: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. టోర్నీ రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 14–21, 21–19, 21–16తో విక్టర్ అక్సెల్సన్పై గెలుపొందాడు. 71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయిన ప్రణయ్... రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అద్భుతమైన స్మాష్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు, మూడు గేమ్ల్లో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. విక్టర్ అక్సెల్సన్పై ప్రణయ్కిదే తొలి విజయం. గతంలో అతడితో ఆడిన ఐదు సార్లు కూడా ప్రణయ్ ఓడిపోయాడు. మరో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 13–21, 21–18, 21–15తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గగా... లక్ష్యసేన్ 13–21, 19–21తో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల పిక్వ్రార్టర్స్లో పీవీ సింధు 17–21, 21–7, 21–12 క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంటను ఓడించిన సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం పోరాటం ప్రిక్వార్టర్స్లో ముగిసింది. సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట 15–21, 23–21, 18–21తో జోమ్కో–సుపిసార (థాయ్లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 12–21తో కిటిట్హరకుల్–రవిండ ప్రజోంగ్జ (థాయలాండ్) జంట చేతిలో ఓడింది. -
ప్రణయ్ సంచలనం
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 28వ ర్యాంకర్ ప్రణయ్ 75 నిమిషాల్లో 18–21, 21–16, 23–21తో ఆసియా క్రీడల చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రణయ్ నిర్ణాయక మూడో గేమ్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. మరోవైపు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ టోర్నీ నుంచి వైదొలిగారు. సాయిప్రణీత్కు కరోనా పాజిటివ్ రావడంతో అతను బుధవారం ఆడాల్సిన తొలి రౌండ్ మ్యాచ్లో తన ప్రత్యర్థి డారెన్ లీకి వాకోవర్ ఇచ్చాడు. సాయిప్రణీత్తో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) 14–21, 21–18, 13–21తో హూ పాంగ్ రోన్–చెయి యి సీ (మలేసియా) చేతిలో... మహిళల డబుల్స్లో అశ్విని–సిక్కి రెడ్డి 11–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
కరోనా ఆడుకుంది!
గత సీజన్ను కరోనా ముంచేసింది. ఈ సీజన్నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సాయిప్రణీత్ కూడా ఆమెలాగే ఓడిపోయాడు. ఆట ఫలితాలు ఇలావుంటే మహమ్మారి ఫలితాలు మరో రకంగా ఆడుకున్నాయి. అగ్రశ్రేణి షట్లర్ సైనా, ప్రణయ్లను కోవిడ్ టెస్టులు కలవరపెట్టాయి. తీరా యాంటీబాడీ టెస్టులతో అవి గత అవశేషాలనీ తేలడంతో ఊపిరి పీల్చుకున్నారంతా! మరో భారత టాప్స్టార్ కిడాంబి శ్రీకాంత్కు చేసిన కరోనా టెస్టులైతే రక్తం చిందించేలా చేశాయి. ఓవరాల్గా బ్యాడ్మింటన్ సీజన్ పరేషాన్తో ప్రారంభమైంది. బ్యాంకాక్: ఆటకు ముందు నలుగురు ఆటగాళ్లకు నిర్వహించిన కోవిడ్ పీసీఆర్ పరీక్షల్లో ముగ్గురు బాధితులని రిపోర్టుల్లో వచ్చింది. ఆ ముగ్గురిలో ఇద్దరు మనవాళ్లే కావడంతో భారత జట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారినపడ్డారని ప్రకటించారు. దీంతో నిర్వాహకులు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకునే పనిలో భారత కోచ్ సహా అధికార వర్గాలను కోర్టు లోపలికి అనుమతించలేదు. బృంద సభ్యులు పాజిటివ్ కావడంతో అందులోని వారు మ్యాచ్ చూసేందుకు వస్తే మిగతావారికి సోకే ప్రమాదముందని భారత కోచ్, మేనేజర్లను హోటల్ గదులకే పరిమితం చేశారు. తదనంతరం నిర్వాహకులు సైనా, ప్రణయ్లతో పాటు మరో బాధితుడు జోన్స్ రాల్ఫి జాన్సన్ (జర్మనీ ప్లేయర్)లకు యాంటిబాడీ ఐజీజీ పరీక్షలు చేయించారు. ఆశ్చర్యకరంగా భారత ఆటగాళ్లిద్దరికీ పాజిటివ్ ఫలితాలొచ్చాయి. అంటే సైనా, ప్రణయ్లకు గతంలో ఎప్పుడో వచ్చివుం టుందని, అవి గతం తాలూకు అవశేషాలని గుర్తించింది. దీంతో వీరిద్దరికి ప్రస్తుతం వైరస్ సమస్య లేదని నిర్దారించుకున్న ఆర్గనైజింగ్ కమిటీ సైనా, ప్రణయ్లను ఆడేందుకు అనుమతించింది. వీళ్లతో మిగతావారికి ఎలాంటి ముప్పులేదని ప్రకటించింది. జర్మనీ ప్లేయర్ జాన్సన్కు యాంటిబాడీ ఐజీజీ టెస్టుల్లో ఇలాగే పాజిటివ్ రావడంతో అతడినీ ఆడేందుకు అనుమతించిన నిర్వాహకులు... హాతెమ్ ఎల్గమల్ (ఈజిప్ట్)కు నెగెటివ్ రావడంతో అతన్ని తాజా కరోనా బాధితుడిగా టోర్నీ నుంచి తప్పించింది. -
కరోనా బారిన కశ్యప్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. కశ్యప్తోపాటు భారత ఇతర షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ఆర్ఎంవీ గురుసాయిదత్, ప్రణవ్ చోప్రాలకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ‘ఈ నలుగురు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఈ నలుగురిలో ఒకరికి కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. కశ్యప్, గురుసాయిదత్, ప్రణవ్, ప్రణయ్లకు పాజిటివ్ రాగా... కశ్యప్ భార్య, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు నెగెటివ్ వచ్చింది. కొన్నిసార్లు తొలి పరీక్షలో ఫాల్స్ పాజిటివ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులు వేచి చూశాక మళ్లీ పరీక్షకు హాజరు కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సోమవారం వీరందరూ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు’ అని పుల్లెల గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 25న వివాహం చేసుకున్న గురుసాయిదత్ ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోగా... మిగతా ఆటగాళ్లు గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. -
‘అర్జున’కు ప్రణయ్ నామినేట్
చీఫ్ కోచ్ గోపీచంద్ ‘అర్జున’ అవార్డు కోసం హెచ్ఎస్ ప్రణయ్ని నామినేట్ చేశారు. ఈ నెల 2న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మలను ఆ అవార్డు కోసం సిఫార్సు చేయగా... తనను విస్మరించడంపై ప్రణయ్ బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజే (3న) గోపీచంద్ అతని పేరును క్రీడాశాఖకు ప్రతిపాదించారు. ‘రాజీవ్ ఖేల్రత్న’ అవార్డీ హోదాలో గోపీచంద్ ఈ సిఫార్సు చేశారని, చీఫ్ కోచ్ హోదాలో కాదని ‘బాయ్’ వర్గాలు తెలిపాయి. కాగా బహిరంగ విమర్శలపై ‘బాయ్’ ప్రణయ్కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
వైదొలిగిన సైనా
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నేటి నుంచి మొదలయ్యే చైనీస్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వెదొలిగింది. పురుషుల సింగిల్స్ నుంచి సౌరభ్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్లు కూడా తప్పుకున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు రియా ముఖర్జీ (భారత్) అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె 9–21, 21–16, 23–21తో సుపనిద కటెథొంగ్ (థాయ్లాండ్)పై అద్భుత విజయం సాధించి మెయిన్ ‘డ్రా’ లో ప్రవేశించింది. -
క్వార్టర్స్లో ప్రణీత్
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సాయి ప్రణీత్ (భారత్) నిలకడగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో 16వ సీడ్ సాయి ప్రణీత్ 21–19, 21–13తో ఆరో సీడ్ ఆంథోని జిన్టింగ్ (ఇండోనేసియా)ను చిత్తుచేసి క్వార్టర్స్లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ప్రణీత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలతో, స్మాష్ షాట్లతో హోరెత్తించాడు. ఆరంభంలో తడబడినా... జిన్టింగ్ మ్యాచ్ను ధాటిగా ఆరంభిం చాడు. తొలి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న అతను 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వెంటనే తేరుకున్న ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 4–3తో ఆధిక్యంలోకొచ్చాడు. ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15–15తో సమానంగా నిలి చారు. కీలక సమయం లో ఒత్తిడిని జయించిన ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 21–17తో గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్వార్టర్స్ చేరడం ప్రణీత్కిది రెండోసారి. 2018లో కూడా అతను క్వార్టర్స్ చేరాడు. నేడు జరిగే క్వార్టర్స్లో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణీత్ తలపడతాడు. సింధు అలవోకగా... మహిళల విభాగంలో ఐదో సీడ్ పీవీ సింధు పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్స్ చేరింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించింది. కోర్టులో పాదరసంలా కదిలిన సింధు ప్రత్యర్థికి తన స్మాష్ షాట్లతో ముచ్చెమటలు పట్టించింది. నేడు జరిగే క్వార్టర్స్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది. మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో జరిగిన మరో ప్రి క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21–15, 25–27, 12–21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీకాంత్, ప్రణయ్ ఔట్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ల పోరాటం ముగిసింది. గురువారం 46 నిమిషాల పాటు జరిగిన పురుషుల ప్రిక్వార్టర్ మ్యాచ్లో ప్రణయ్ 19–21, 12–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్లో తీవ్రంగా ప్రతిఘటించిన ప్రణయ్ మ్యాచ్ ఓడినా ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్లో ఇరువురు 18–18తో సమంగా ఉన్న సమయంలో... ఆ తర్వాతి పాయింట్ కోసం ఆటగాళ్ల మధ్య ఏకంగా 57 షాట్ల పాటు సాగిన ర్యాలీ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. అయితే ఆ పాయింట్ను ప్రత్యర్థికి కోల్పోయిన ప్రణయ్ తర్వాత గేమ్నూ సమర్పించుకున్నాడు. రెండో గేమ్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన మొమోటా సునాయాసంగా గెలిచేశాడు. మరో ప్రిక్వార్టర్ మ్యాచ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో కాంతాపోన్ వాంగ్చరోయెన్ (థాయ్లాండ్) చేతిలో చిత్తయ్యాడు. -
ప్రణయ్ ప్రతాపం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అన్ని గొప్ప టోర్నమెంట్లలో టైటిల్స్ సాధించి దిగ్గజ క్రీడాకారుడి హోదా పొందిన చైనా సూపర్ స్టార్ ప్లేయర్ లిన్ డాన్కు ప్రపంచ చాంపియన్షిప్లో ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచి, రెండుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించి ఎందరో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఆరాధ్యుడిగా మారిన లిన్ డాన్కు భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ షాక్ ఇచ్చాడు. హోరాహోరీ పోరులో లిన్ డాన్ను ఓడించిన ప్రణయ్ ఈ క్రమంలో మూడుసార్లు చైనా స్టార్ను ఓడించిన తొలి భారతీయ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్కు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుంది. బాసెల్ (స్విట్జర్లాండ్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్నా... జాతీయ క్రీడా పురస్కారాల్లో హెచ్ఎస్ ప్రణయ్కు ఈసారీ మొండిచేయి లభించడంతో ఆ కసినంతా అతను ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తన ప్రదర్శనలో చూపిస్తున్నాడు. తొలి రౌండ్లో తనకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్ను ఓడించడానికి ఇబ్బంది పడ్డ ఈ కేరళ ఆటగాడు... రెండో రౌండ్లో మాత్రం జూలు విదిల్చాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 21–11, 13–21, 21–7తో గెలుపొంది సంచలనం సృష్టించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లిన్ డాన్తో ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డ ప్రణయ్ ముఖాముఖి రికార్డులో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్కంటే ముందు 2015 ఫ్రెంచ్ ఓపెన్లో, 2018 ఇండోనేసియా ఓపెన్లో లిన్ డాన్పై ప్రణయ్ గెలిచాడు. తద్వారా లిన్ డాన్ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ప్లేయర్గా ప్రణయ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో లిన్ డాన్పై పుల్లెల గోపీచంద్ రెండుసార్లు... ప్రస్తుత భారత నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ ఒకసారి గెలిచారు. 62 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ప్రణయ్ ఆద్యంతం దూకుడుగా ఆడాడు. లిన్ డాన్ స్థాయిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడిన ప్రణయ్ తొలి గేమ్లో 10–5, 19–11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్ను గెలిచాడు. రెండో గేమ్లో తడబడ్డ ప్రణయ్... నిర్ణాయక మూడో గేమ్లో రెచ్చిపోయాడు. స్కోరు 6–5తో ఉన్నదశలో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14–5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత చైనా ప్లేయర్కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. టోర్నీ తొలి రోజు సోమవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్, భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో లో కీన్ యెయి (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో సుమీత్–మనూ జంట డబుల్స్ విభాగంలోభారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటకు చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ తున్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి వాకోవర్ లభించింది. దండు పూజ–సంజన ద్వయం 15–21, 14–21తో సు యా చింగ్–హు లింగ్ ఫాంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి 21–13, 21–13తో థామ్ గికెల్–రోనన్ లేబర్ (ఫ్రాన్స్)లపై... ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 21–14, 21–16తో తొబియాస్ కుయెంజి–ఒలివర్ షాలెర్ (స్విట్జర్లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా 18–21, 11–21తో టకుటో ఇనుయు–యుకీ కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు. లిన్ డాన్తో తొలి గేమ్లో, చివరి గేమ్లో బాగా ఆడాను. అయితే రెండో గేమ్లో నా వ్యూహం బోల్తా కొట్టింది. దీంతో కోచ్ల సలహాలతో కీలకదశలో నా ఆటతీరు మార్చుకొని మంచి ఫలితం సాధించాను. సంయమనం కోల్పోకుండా సుదీర్ఘ సమయం ఆడాను. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటాతో తలపడనున్నాను. ఈ మ్యాచ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్లో నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను. –ప్రణయ్ -
లిన్ డాన్ను ఓడించిన ప్రణయ్
బసెల్(స్విట్జర్లాండ్): భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ రెండో రౌండ్లో ఐదుసార్లు విశ్వవిజేత, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్(చైనా)ను ఇంటిబాట పట్టించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ 21–11, 13–21, 21–7తో లిన్ డాన్ను చిత్తుచేశాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ప్రణయ్ తొలి సెట్ ఆరంభం లోనే 6–2తో ఆధిక్యంలో దూసుకెళ్లాడు. ఇదే ఊపులో 21–11తో సెట్ను కైవసం చేసుకున్నాడు. అయితే, రెండో సెట్లో లిన్ తన అసలైన ఆటతీరు ప్రదర్శించాడు. 5–5 వద్ద ప్రణయ్ని నిలువరించాడు. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లి 18–13 వద్ద వరుసగా మూడు పాయింట్లు సాధించి సెట్ను దక్కించు కున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రణయ్ తిరుగులేని ఆట ప్రదర్శించాడు. 21–7తో సెట్తోపాటు మ్యాచ్నూ గెలుచుకు న్నాడు. తర్వాతి రౌండ్లో వరల్డ్ నెం.1 కెంటో మొమోటా(జపాన్)తో ప్రణయ్ తలపడతాడు. కాగా, మరో మ్యాచ్లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ క్యూన్(కొరియా)పై నెగ్గగా, 14వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో ప్రపంచ 34వ ర్యాంకర్ లొహ్ ఈ కియాన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
శ్రమించి... శుభారంభం
పురుషుల సింగిల్స్లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణ తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలి రౌండ్ అడ్డంకిని శ్రమించి అధిగమించారు. శ్రీకాంత్, ప్రణయ్ ఒక్కో గేమ్ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకదశలో ఊహించని ఫలితం వస్తుందేమోననే అనుమానం కలిగినా... సరైన సమయంలో ఫామ్లోకి వచ్చిన భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలి రౌండ్ను విజయవంతంగా దాటారు. ప్రపంచ మాజీ నంబర్వన్, ప్రస్తుత పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా ఈవెంట్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై... సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్లాండ్)పై విజయం సాధించారు. గత ప్రపంచ చాంపియన్షిప్ తొలి రౌండ్లోనూ ఎన్హట్ ఎన్గుయెన్తోనే ఆడిన శ్రీకాంత్ నాడు రెండు గేముల్లో గెలుపొందగా... ఈసారి మాత్రం మూడు గేముల్లో గట్టెక్కాడు. తొలి గేమ్ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17–16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్లో కోచ్ పుల్లెల గోపీచంద్ తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడాలని శ్రీకాంత్కు సూచించాడు. తొలి పాయింట్ కోల్పోయాక... శ్రీకాంత్ తన జోరు పెంచాడు. స్మాష్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్), చైనా దిగ్గజం లిన్ డాన్, నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్ ఆంథోని జిన్టింగ్ (ఇండోనేసియా), ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా (భారత్) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. -
ప్రణీత్ ఒక్కడే క్వార్టర్స్కు
బ్యాంకాక్: టైటిల్ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్లాండ్ ఓపెన్లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్పైనే ఉన్నాయి. ఈ అన్సీడెడ్ షట్లర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి చుక్కెదురైంది. సాయి ప్రణీత్ అలవోక విజయం మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్తో సహచరుడు శుభాంకర్ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శుభాంకర్ ప్రతీ గేమ్లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్ ఫెప్రదబ్ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్ నిలువలేకపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ ఆటను జపాన్కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఆరోసీడ్ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్ని ఇంటిదారి పట్టించాడు. సైనా పోరాటం సరిపోలేదు మహిళల సింగిల్స్లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ విజయంతో టచ్లోకి వచ్చింది. తర్వాత గేమ్లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్ భారత స్టార్ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్ ఫజర్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్ఫియాన్–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్ తంగ్చన్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
ప్రణయ్ నిష్క్రమణ
ఆక్లాండ్: వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులెవరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమణతో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 15–21, 14–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కాంటా సుయెయామ (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ తొలి గేమ్ను గెల్చుకున్నా... ఆ తర్వాత తడబడ్డాడు. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 14–16 వద్ద ప్రణయ్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి గేమ్తోపాటు మ్యాచ్ను సమర్పించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్కు 900 డాలర్ల (రూ. 62 వేలు) ప్రైజ్మనీ లభించింది. గతవారం ఆసియా చాంపియన్షిప్లోనూ ఏ విభాగంలోనూ భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. -
హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం
నాన్జింగ్(చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ శుభారం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు ప్రణయ్ 21-12, 21-11 తేడాతో అభినవ్ మనోతా(న్యూజిలాండ్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి గేమ్ను సునాయాసంగా గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్లో కూడా అదే ఆటను పునరావృతం చేసి మ్యాచ్లో విజయం సాధించాడు. ఇక పురుషుల డబుల్స్ పోరులో మనూ అత్రి- సుమీత్ రెడ్ది జోడి 21-13, 21-18 తేడాతో నికోలోవ్-రుసెవ్ జంటపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి గేమ్లో పెద్దగా పోరాడకుండానే గెలిచిన మనూ అత్రి ద్వయం.. రెండో గేమ్లో మాత్రం శ్రమించి విజయం సాధించింది. -
ప్రిక్వార్టర్స్లో సింధు
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒలింపిక్ రజత పతక విజేత సింధు 21–8, 21–15తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో నాలుగో సీడ్ ప్రణయ్ 21–16, 21–19తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, పారుపల్లి కశ్యప్ 21–15, 21–17తో జేసన్ ఆంథోనీ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు. సమీర్ వర్మ 18–21, 16–21తో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్లో జక్కా వైష్ణవి రెడ్డి పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. వైష్ణవి 13–21, 17–21తో సయాకా సాటో (జపాన్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–18, 15–21, 21–17తో చెన్ హంగ్ లింగ్–వాంగ్ చీ లిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది. అర్జున్–రామచంద్రన్ శ్లోక్ జోడీ 18–21, 21–13, 16–21తో వహ్యూ నాయక ఆర్య పంగకర్యనిరా–యూసుఫ్ సంతోసో (ఇండోనేసియా) జంట చేతిలో; అనిల్ కుమార్ రాజు–వెంకట్ గౌరవ్ ప్రసాద్ ద్వయం 21–14, 12–21, 14–21తో చుంగ్ యొన్నీ–టామ్ చున్ హై (హాంకాంగ్) జోడీ చేతిలో; కోన తరుణ్–సౌరభ్ శర్మ జంట 6–21, 6–21తో లియో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (తైవాన్) ద్వయం చేతిలో ఓటమి పాలై తొలి రౌండ్లోనే వెనుదిరిగాయి. మహిళల డబుల్స్లో మేఘన–పూర్విషా రామ్ జంట 21–23, 8–21తో చెన్ సియో హుఆన్–హు లింగ్ ఫాంగ్ (తైవాన్) జోడీ చేతిలో; మిక్స్డ్ డబుల్స్లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ ద్వయం 19–21, 15–21తో మాక్ హీ చున్–యెంగ్ గా తింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలయ్యాయి. -
ముగిసిన సింధు, ప్రణయ్ పోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం పురుషుల, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, పీవీ సింధు ఓటమి పాలయ్యారు. ప్రపంచ ఏడో ర్యాంకర్ హీ బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో మూడో ర్యాంకర్ సింధు 14–21, 15–21తో పరాజయం పాలైంది. హీ బింగ్జియావోతో 11 సార్లు తలపడ్డ సింధుకు ఆరుసార్లు ఓటమి ఎదురైంది. షి యూకీతో జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 17–21, 18–21తో ఓడిపోయాడు. తొలి రౌండ్లో చైనా దిగ్గజం లిన్ డాన్ను ఓడించిన ప్రణయ్ ఈ మ్యాచ్లో మాత్రం చైనా యువ షట్లర్ ముందు నిలువలేకపోయాడు. క్వార్టర్స్లో ఓడిన సింధు, ప్రణయ్లకు 6,875 డాలర్ల (రూ. 4 లక్షల 73 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 6,600 పాయింట్లు లభించాయి. -
ఇండోనేషియా ఓపెన్: సింధు, ప్రణయ్ ఔట్
జకార్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్లు నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో తొలుత ప్రణయ్ చైనా షట్లర్ షీయుకీ చేతిలో పరాజయం కాగా.. సింధు సైతం చైనాకు చెందిన బింగ్జియా చేతిలోనే ఓటమిపాలైంది. సింధు మ్యాచ్ బింగ్జియాతో ఏకపక్షంగా సాగింది. ఎలాంటి పోటీ నివ్వకుండా సింధు 21-14, 21-15 తేడాతో వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇబ్బంది పడ్డ సింధు ఏదశలోను కోలుకోలేకపోయింది. అదే బాటలో ప్రణయ్.. షీ యుకీతో జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 17-21, 18-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్లో షీ యుకీని నిలవరించ లేక ప్రణయ్ ఓటమిని మూటగట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే కంగుతినగా.. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ సైతం తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, సింధులు ఓడిపోవడంతో ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. -
క్వార్టర్స్లో సింధు, ప్రణయ్
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్లో సింధు 21-17, 21-14 తేడాతో అయా ఒహొరి(జపాన్)పై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధూ ఒహొరిపై వరుసగా రెండు గేమ్స్ లో విజయం సాధించారు. క్వార్టర్స్లో సింధు..థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒన్గ్బారుంగ్ఫాన్తో కానీ చైనాకు చెందిన బింగ్జియాతో కానీ తలపడనుంది. కాగా, పురుషుల సింగిల్స్ లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్లో ప్రణయ్ 21-23, 21-15, 21-13 తేడాతో వాంగ్ జు వుయ్(చైనా)పై గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. తొలి గేమ్నును కోల్పోయిన ప్రణయ్.. రెండు, మూడు గేమ్లను సొంతం చేసుకుని మ్యాచ్ను గెలిచాడు. -
లిన్ డాన్కు ప్రణయ్ షాక్
జకార్తా: భారత షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ తన కెరీర్లో మరో అపూర్వ విజయాన్ని సాధించాడు. ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చైనా దిగ్గజం లిన్ డాన్ను కంగుతినిపించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 21–15–9–21, 21–14తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. లిన్ డాన్పై ప్రణయ్కిది రెండో విజయం. 2015 ఫ్రెంచ్ ఓపెన్లోనూ ప్రణయ్ తొలి రౌండ్లోనే లిన్ డాన్ను ఓడించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ ల్లో సమీర్ వర్మ 21–19, 12–21, 22–20తో రస్ముస్ గెమ్కె (డెన్మార్క్)పై నెగ్గగా... సాయిప్రణీత్ 10–21, 13–21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ 21–12, 21–12తో దినర్ ద్యా అయుస్టిన్ (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా జోడీ 11–21, 18–21తో అగత ఇమానుయెలా–సిటి ఫదియాసిల్వ (ఇండోనేసియా) జంట చేతిలో, పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 8–21, 15–21తో హిరొయుకి–యుత వతనబె (జపాన్) జంట చేతిలో ఓడిపోయాయి. -
హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 తేడాతో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ లిన్డాన్(చైనా)కు షాకిచ్చాడు. 59 నిమిషాల పోరులో ప్రణయ్ ఆద్యంత ఆకట్టుకుని తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. మొదటి గేమ్ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ను భారీ తేడాతో కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రణయ్ సత్తాచాటి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇది లిన్డాప్పై ప్రణయ్కు రెండో విజయం. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ మూడుసార్లు తలపడితే రెండు సందర్భాలో ప్రణయ్నే విజయం వరించింది. ప్రణయ్ రెండో రౌండ్లో వాంగ్ జు వియ్(చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు. -
శక్తికి మించి శ్రమించాల్సిందే
బ్యాంకాక్: ప్రపంచ ర్యాంకర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులేని భారత బ్యాడ్మింటన్ జట్లు థామస్–ఉబెర్ కప్ టీమ్ చాంపియన్షిప్ పోరాటానికి సిద్ధమయ్యాయి. టోర్నీ తొలి రోజు ఆదివారం ఫ్రాన్స్తో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. పురుషుల విభాగంలో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ థామస్ కప్లో జట్టును నడిపించనున్నాడు. అతనికి సాయిప్రణీత్, సమీర్ వర్మ, లక్ష్య సేన్ సింగిల్స్లో అందుబాటులో ఉన్నారు. డబుల్స్లో మను అత్రి–సుమిత్ రెడ్డిలతో పాటు అర్జున్–శ్లోక్ రామచంద్రన్లకు అంతర్జాతీయ అనుభవముంది. దీంతో థామస్ కప్లో భారత్ పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ మహిళల జట్టు పరిస్థితే దయనీయంగా ఉంది. ఇక్కడ పతకం కోసం కాదు... మ్యాచ్ మ్యాచ్లో విజయం కోసం శక్తికి మించి శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో ర్యాంకర్ సింధుతో పాటు, కామన్వెల్త్ గేమ్స్ కాంస్యపతక విజేత జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిలు కూడా గైర్హాజరీ అవుతున్నారు. దీంతో సైనా బృందంలో అనుభవంలేని 16 ఏళ్ల జక్కారెడ్డి వైష్ణవి, శ్రీకృష్ణప్రియ, అనుర, వైష్ణవి భాలేలు సింగిల్స్లో ప్రత్యర్థులని ఏమాత్రం ఎదుర్కొంటారో చూడాలి. -
కాంస్యంతోనే సరి..
వుహాన్(చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ పరాజయం చెందడంతో కాంస్యంతోనే వెనుదిరిగాల్సి వచ్చింది. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 25-27, 19-21 తేడాతో టాప్సీడ్ తైజు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా కడవరకూ పోరాడినా సెమీ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఇక పురుషుల సింగిల్స్ సెమీస్లో ప్రణయ్ 16-21, 18-21తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో పరాజయం చెందాడు. 52నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో చెన్ లాంగ్ పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. -
సెమీస్లో సైనా, ప్రణయ్
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మరోవైపు టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, మూడో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సైనా 21–15, 21–13తో లీ జాంగ్ మి (కొరియా)పై గెలుపొందగా... సింధు 19–21, 10–21తో సుంగ్ జీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆసియా చాంపియన్షిప్లో సైనా సెమీస్కు చేరుకోవడం ఇది మూడోసారి. 2010, 2016లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 23–21, 21–12తో ప్రపంచ రెండో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 2007లో అనూప్ శ్రీధర్ తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్కు చేరిన తొలి ప్లేయర్గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 12–21, 15–21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడతారు. ఈ మ్యాచ్లు ఉదయం 11.30 నుంచి డి స్పోర్ట్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
శ్రీకాంత్ పై ప్రణయ్ గెలుపు..
సాక్షి,నాగ్పూర్: పురుషుల జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకు కిడాంబి శ్రీకాంత్పై హెచ్ఎస్ ప్రణయ్ విజయం సాధించి టైటిల్ అందుకున్నాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ 21-15, 16-21, 21-7 లతేడాతో విజయం సాధించాడు. తొలి సెట్లో పైచేయి సాధించిన ప్రణయ్.. రెండో సెట్లో తడబడ్డాడు. ఇక మూడో సెట్లో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పై చేయి సాధించాడు. సెమీఫైనల్స్లో ప్రణయ్ 21–14, 21–17తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్)పై గెలుపొందారు. 2013లో శ్రీకాంత్ జాతీయ చాంపియన్గా నిలువగా... ప్రణయ్ తొలిసారి ఈ టైటిల్ను సాధించాడు.