Indian companies
-
భారత ఫార్మాకు కొత్త అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న భారతీయ కంపెనీలకు 2025–26లో మరిన్ని కొత్త అవకాశాలు అందనున్నాయి. భారీ అమ్మకాలను నమోదు చేస్తున్న సుమారు 25 ఔషధాల పేటెంట్ల గడువు ముగియనుండడమే ఇందుకు కారణం. భారతీయ సంస్థలకు మరింత సరసమైన ప్రత్యామ్నాయాలను అంతర్జాతీయంగా పరిచయం చేయడానికి ఇదొక పెద్ద అవకాశం కానుంది. ప్రపంచ జెనెరిక్ ఔషధ మార్కెట్లో తయారీ, ఎగుమతుల పరిమాణం పరంగా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన భారత్ 20 శాతంపైగా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. భారత్ బలమైన స్థానాన్ని కైవసం చేసుకుని తన హవాను కొనసాగిస్తోంది. వచ్చే 14 నెలల్లో పేటెంట్ల కాల పరిమితి ముగిసే ఔషధాలు భారత్ పాత్రను మరింత మెరుగుపర్చనున్నాయి. ఏటా రూ. 25.80 వేల కోట్లకుపైగా.. క్యాన్సర్ ఇమ్యునోథెరపీ కోసం యూఎస్ ఫార్మా దిగ్గజం మెర్క్ అభివృద్ధి చేసిన కీట్రూడా, అలాగే మధుమేహం, స్థూలకాయం చికిత్సకై డెన్మార్క్ కంపెనీ నోవో నార్డిస్క్ ఉత్పత్తి చేసిన ఓజెంపిక్ వంటి కీలక ఔషధాల పేటెంట్లు 2025–26లో ముగుస్తాయి. కీట్రూడా ఒక్కటే 2024లో రూ.2,15,000 కోట్లకుపైగా అమ్మకాలను ఆర్జించింది. బ్రిస్టల్–మేయర్స్ స్క్విబ్ తయారీ బ్లడ్ థిన్నర్ అయిన ఎలిక్విస్, నోవారి్టస్ ఉత్పత్తి చేసిన ఇమ్యునాలజీ డ్రగ్ కోసెంటిక్స్ వంటి ఇతర ముఖ్య ఔషధాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 2023–2029 మధ్య క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక వ్యవస్థకు వచ్చే రుగ్మతల చికిత్సలో ఉపయోగించే 100 కంటే ఎక్కువ క్లిష్ట ఔషధాల పేటెంట్ల గడువు ముగుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వార్షిక అమ్మకాలు రూ.25,80,000 కోట్లకు పైమాటే. ఇది జెనెరిక్స్, బయోసిమిలర్ల తయారీలో ఉన్న దేశీయ కంపెనీలకు అదనపు అవకాశాలను సృష్టించనుందని అనడంలో అతిశయోక్తి కాదు. వార్షిక వృద్ధి 7 శాతంపైగా.. యూరోపియన్ ఫార్మాస్యూటికల్ రివ్యూ ప్రకారం ప్రధానంగా ఈ పేటెంట్ల గడువు ముగియడంతో జెనెరిక్స్ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా సగటు వార్షిక వృద్ధి 7 శాతంపైగా నమోదవుతుందని అంచనా. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోకాన్, అరబిందో, హెటిరో, లీ ఫార్మా వంటి భారతీయ సంస్థలు దీని నుండి లాభపడతాయి. బయోసిమిలర్ల విభాగంలోనూ దేశీయ కంపెనీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీలు చవక జెనెరిక్స్ తయారీదారుల నుండి ముఖ్యంగా చైనాలో ఉన్న సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ వంటి మార్కెట్లలో ధరల ఒత్తిడి, ఫార్మసీల నుండి గణనీయ తగ్గింపుల కోసం డిమాండ్లు కంపెనీల లాభాలను ప్రభావితం చేయవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్లో రూ.21,183 కోట్లు.. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులు 2024 డిసెంబర్లో రూ.21,183 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 2.69 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–డిసెంబర్లో ఎగుమతులు 7.85% దూసుకెళ్లి రూ.1,82,021.36 కోట్లకు చేరాయి. ఫార్మా దిగుమతులు డిసెంబర్లో 12.85 % పెరిగి రూ.7,033 కోట్లను తాకాయి. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో ఇవి 7.94% ఎగసి రూ. 55,551.4 కోట్లు నమోదు చేశాయి. దేశం నుంచి 2023–24లో సుమారు రూ.2,36,300 కోట్ల విలు వైన ఔషధాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. జెనెరిక్ మెడిసిన్ అంటే.. బ్రాండెడ్ మెడిసిన్ అనేది పేటెంట్ పొందిన, బ్రాండ్ పేరుతో విక్రయించే ఒక కొత్త ఔషధం. నూతన ఔషధాన్ని నిరీ్ణత వ్యవధిలో తయారు చేయడానికి, అలాగే విక్రయించడానికి ప్రత్యేక హక్కును చట్టపరంగా కల్పించడమే పేటెంట్. పేటెంట్ పొందిన ఔషధం యొక్క కాపీయే జెనెరిక్ మెడిసిన్. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత నియంత్రణ సంస్థల అనుమతితో జెనెరిక్స్ ఔషధాలు తయారు చేసి విక్రయించవచ్చు. భారతీయ ఔషధ కంపెనీలకు యూఎస్, యూకే, రష్యా, దక్షిణాఫ్రికా ప్రధాన మార్కెట్లు. -
కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి
న్యూఢిల్లీ: కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి పెరిగిపోయింది. గడిచిన 24 నెలల్లో తాము ఆర్థిక మోసాల బారిన పడినట్టు 59 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ సర్వే 2024’ రూపంలో ఈ వివరాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 2,446 సంస్థల సీఈవోలు, ఎండీలు, బోర్డు సభ్యుల అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. భారత్ నుంచి 91 కంపెనీలు సర్వేలో పాల్గొన్నాయి. ‘‘సర్వేలో పాలు పంచుకున్న భారత కంపెనీల్లో 59 శాతం గత రెండేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు చెప్పాయి. అంతర్జాతీయ సగటు 41 శాతంతో పోలి్చతే 18 శాతం ఎక్కువ. 2022 ఎడిషన్ సర్వే ప్రకారం చూసినా భారత్లో 7 శాతం పెరుగుదల కనిపిస్తోంది’’అని ఈ సర్వే తెలిపింది. ప్రధానంగా కంపెనీల్లో ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్లు) విభాగంలో ఈ మోసాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు పీడబ్ల్యూసీ సర్వే తెలిపింది. తమకు ఇదొక ప్రధాన సమస్యగా 50 శాతం భారత కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సగటుతో పోల్చి చూస్తే 21 శాతం ఎక్కువ. ఇక 47 శాతం కంపెనీలకు కస్టమర్ల మోసాలు ఆందోళనకరంగా పరిణమించాయి. సైబర్ నేరాలు తమకు ప్రధాన సమస్య అని అంతర్జాతీయంగా 44 శాతం కంపెనీలు వెల్లడించాయి. ఎప్పటి నుంచో ఉన్నవే.. ‘‘చారిత్రకంగా చూస్తే ప్రొక్యూర్మెంట్ మోసాలు అన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే. ఆర్థిక ప్రయోజనం పొందేందుకు కొనుగోళ్లలో (ప్రొక్యూర్మెంట్) అవకతవకలకు పాల్పడడం. ఈ ఏడాది మా సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల ప్రతినిధుల్లో సగం మంది ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు’’అని పీడబ్ల్యూసీ ఇండియా ఫోరెన్సిక్ సరీ్వసెస్ పార్ట్నర్ పునీత్ గర్ఖేల్ తెలిపారు. ప్రొక్యూర్మెంట్ మోసాలను నివారించేందుకు భారత కంపెనీలు డేటా అనలైటిక్స్ను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. 33 శాతం ఆర్థిక నేరాలు అవినీతి, లంచాలకు సంబంధించినవేనని, గత రెండేళ్లలో టాప్–3 ప్రధాన ఆర్థిక నేరాల్లో ఇవి కూడా ఉన్నట్టు 26 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. -
కొలువుల్లోనూ విభిన్న ‘ప్రతిభావంతులు’
సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ ప్రపంచంలో పోటీ తట్టుకుని నిలబడాలన్నా, నిలిచి గెలవాలన్నా విభిన్న ప్రతిభావంతులకు ఒకింత కష్టం. దీంతో సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు సైతం అన్ని అవయవాలూ బాగున్నవారిని ఉద్యోగంలో చేర్చుకుంటే ఉత్పాదకత బాగుంటుందని భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు కొలువుల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక విభాగాల్లోని పోస్టుల్లో వారి నియామకాన్ని వేగవంతం చేయడమే కాకుండా సాధికారత సాధించేలా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాయి. దేశంలోని 155 భారతీయ కంపెనీలపై అవతార్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ ఇన్క్లూజివ్ కంపెనీస్ ఇండెక్స్(ఎంఐసీఐ) సర్వే నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విభిన్న ప్రతిభావంతులకు అవకాశాలు ఇస్తున్న కంపెనీలు 2019లో 58శాతం ఉండగా తాజాగా 98శాతానికి పెరిగాయి. వీరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో మిడ్–క్యాప్ ఐటీ సేవల సంస్థ ఎంఫాసిస్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్(ఎన్సీపీఈడీపీ) అనే జాతీయ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగ నియామకాల్లో తన వంతు చొరవ చూపిస్తోంది. ఈ సంస్థ ‘ది మిస్సింగ్ మిలియన్’ ప్రాజెక్ట్లో దేశంలోని విభిన్న ప్రతిభావంతుల సంఖ్య, వారికి ఉన్న వైకల్య రకాలు, అవసరమైన నైపుణ్యం, అందించాల్సిన సహకారం వంటి వివరాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది.దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అన్ని రకాల వైకల్యాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా సర్వే నిర్వహిస్తే 10 కోట్లకుపైగా ఉంటారని అంచనా. వీరికి తగిన విద్యను అందించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగం..నైపుణ్యంయువతతో పోటీపడి విభిన్న ప్రతిభావంతులు రాణించాలంటే వారు చదువు ద్వారా సాధించిన ఉద్యోగానికి తోడు సరైన నైపుణ్య శిక్షణ కూడా అవసరమని అనేక కంపెనీలు గుర్తించి ఆదిశగా దృష్టిపెట్టాయి. వారి విద్యకు తగిన ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఏ విధమైన శిక్షణ అవసరమో గుర్తించి అందిస్తున్నామని స్పార్కిల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్–కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీపా నాగరాజ్ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఐటీసీ సంస్థ బెంగళూరులో విభిన్న ప్రతిభావంతులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కోల్కతా, హౌరాల్లో నిర్వహించింది. ఇక్కడ సాంకేతిక నైపుణ్యంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నిర్వహణ, నైపుణ్య శిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు వంటి వాటిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పనిచేస్తున్న సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ సంస్థ గతేడాది గురుగ్రామ్లో గ్లోబల్ రిసోర్స్ సెంటర్(జీఆర్సీ)ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన సాయం, ఉద్యోగ అవకాశాలను అందించేలా తోడ్పడుతోంది. వినికిడిలోపం, దృష్టిలోపం, లోకోమోటర్ వైకల్యాలు ఉన్న వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి చూపేలా దృష్టి సారించింది. డ్రోన్ ఆపరేషన్లో శిక్షణ గరుడ ఏరోస్పేస్ డ్రోన్ తయారీ కంపెనీ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈక్వాలిటీ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇటీవల చెన్నైలో పది రోజులపాటు వారికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించింది. అంధ సంఘాల నుంచి సేకరించిన సమాచారంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టిలోపం ఉన్న వారికి బ్రెయిలీ బీమా పాలసీని ప్రారంభించింది.విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారు నిలదొక్కుకునేలా నైపుణ్య శిక్షణ అందించడం సామాజిక బాధ్యతగా కంపెనీలు భావిస్తున్నాయి. – సౌందర్య రాజేష్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ఐటీసీ హోటల్స్తో పాటు అనుబంధ సంస్థల్లో 390 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చాం. వారికి తగిన శిక్షణ ఇస్తున్నాం, బ్రెయిలీ సంకేతాలు, సులభంగా వెళ్లి వచ్చేందుకు అనుకూలమైన ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. – అమిత్ ముఖర్జీ, ఐటీసీ హెచ్ఆర్ హెడ్ -
భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. జాగ్రత్తగా అధిగమించాలి
న్యూఢిల్లీ: రష్యాకు రక్షణ సామాగ్రిని సరఫరా చేస్తున్నాయనే నెపంతో భారత్కు చెందిన 19 కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. భారత కంపెనీలు సహా మొత్తం 400 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ 30న అమెరికా విదేశాంగ శాఖ, ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారీన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.ఉక్రెయిన్పై రష్యా సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయంటూ కంపెనీలపై అమెరికా ఏకపక్ష చర్యలకు దిగింది. దీంతో ఈ దిశగా భారత్ చేపట్టాల్సిన చర్యలను జీటీఆర్ఐ సూచించింది. ఆయా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా అమెరికాతో, అంతర్జాతీయ సంస్థలతో భారత్ సంప్రదింపులు చేపట్టడం ద్వారా పరిష్కారాలు గుర్తించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఆంక్షలను నివారించేందుకు వీలుగా ఎగుమతులకు సంబంధించి కఠిన నియంత్రణలు, స్పష్టమైన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరింది.‘‘యూఎస్ ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా భారత్ మాదిరి దేశాలు ఈ ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించడమే వాస్తవిక కార్యాచరణ అవుతుంది. అమెరికా చర్యలు భారత వ్యాపార ప్రయోజనాలకు హానికలించినా లేదా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఐ) దృష్టికి భారత్ తీసుకెళ్లాలి’’అని జీటీఆర్ఐ తన తాజా నివేదికలో సూచించింది. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి.. భారత వ్యాపార సంస్థలు సున్నితమైన ఉత్పత్తుల (పౌర, సైనిక వినియోగం) ఎగుమతుల విషయంలో స్థానిక చట్టాలనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరాన్ని అమెరికా ఆంక్షలు గుర్తు చేస్తున్నాయని జీటీఆర్ఐ పేర్కొంది. ఆంక్షలు విధించిన దేశాలు, సంస్థలకు మద్దతు విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న భారత కంపెనీలు అటు సైనిక, ఇటు పౌర అవసరాల కోసం ఉద్దేశించినవి ఎగుమతి చేస్తున్నట్టు తెలిపింది. వీటిల్లో కొన్ని అమెరికాలో తయారైనవే కాకుండా, స్థానికంగా తయారు చేసినవీ రష్యా సైనిక అవసరాలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.అమెరికా ఆంక్షలు ఆ దేశ తయారీ ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలించే కంపెనీలకూ వర్తిస్తాయంటూ.. భారత ఎగుమతిదారులపై పరిశీలన మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితికి వెలుపల ఏకపక్ష చర్యలకు భారత్ మద్దతు ఇవ్వరాదని.. అమెరికా ఆంక్షల విధానం కేవలం ఇరాన్, ఉత్తరకొరియా వంటి దేశాలకే పరిమితం కావాలని పేర్కొంది. భారత కంపెనీలు తమ ఉత్పత్తుల సరఫరా చైన్ను తప్పకుండా పరిశీలించాలని సూచించింది. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి భారత సిమెంట్ పరిశ్రమ 2027 మార్చి నాటికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి చేయనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 130 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం తోడవుతోందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంలో 20 శాతానికి సమానం అని వివరించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆరోగ్యకర డిమాండ్ దృక్పథం, మార్కెట్ వాటా కోసం పోటీ ఈ పెట్టుబడులను నడిపిస్తాయి. తక్కువ మూలధన వ్యయాలు, బలమైన బ్యాలెన్స్ షీట్లు కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్ను స్థిరంగా ఉంచుతాయి. అంచనా వేసిన పెట్టుబడులు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో చేసిన క్యాపెక్స్ కంటే 1.8 రెట్లు ఉంటుంది. అయినప్పటికీ తయారీదారుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్లు స్థిరంగా ఉంటాయి. దశాబ్దంలో గరిష్టంగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో సిమెంట్ డిమాండ్లో ఆరోగ్యకరంగా 10 శాతం వార్షిక పెరుగుదల.. సామర్థ్యం జోడింపును మించిన వృద్ధిని సాధించింది. 2023–24లో వినియోగ స్థాయి ఈ దశాబ్దంలో గరిష్టంగా 70 శాతానికి చేర్చింది. ఇది సిమెంట్ తయారీదారులను ‘క్యాపెక్స్ పెడల్ను నొక్కడానికి‘ ప్రేరేపించింది. 2024 మార్చి 31 నాటికి పరిశ్రమ స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యంలో 80 శాతానికి పైగా కైవసం చేసుకున్న 20 సిమెంట్ తయారీ సంస్థల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది. డిమాండ్ ఔట్లుక్.. సిమెంట్ పరిశ్రమ మూలధన వ్యయాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలలో 0.7–0.9 శ్రేణిలో ఉండొచ్చు. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఉంది. 2025–2029 ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో సిమెంట్ డిమాండ్ ఔట్లుక్ ఆరోగ్యంగా ఉంది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్యాపెక్స్లో వృద్ధి ప్రధానంగా పెరుగుతున్న డిమాండ్తోపాటు.. దేశవ్యాప్తంగా ఉనికిని మెరుగుపరుచుకోవాలనే సిమెంట్ తయారీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ప్రకారం దేశంలో స్థాపిత సిమెంట్ సామర్థ్యం 670 మిలియన్ టన్నులు. -
వరల్డ్ టాప్ 100 బ్రాండ్లలో ఇండియన్ కంపెనీలు
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఇండియా నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది.ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 46వ ర్యాంక్ పొందగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 47 ర్యాంక్ పొందింది. టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో 73 ర్యాంక్ సొంతం చేసుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 74 ర్యాంక్ కైవసం చేసుకుంది.ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ సంస్థ స్థానం పొందటం ఇది వరుసగా మూడోసారి. బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్గా ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ పొందింది.ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఇన్ఫోసిస్ టాప్ 6 శాతంలో ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ డేటా వెల్లడించింది. రెండు మార్కెట్లలో ఇన్ఫోసిస్ విశ్వసనీయ భాగస్వామిగా దాని స్థానాన్ని సుస్థిరం చేయడం ద్వారా దాని వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ అధిపతి మార్టిన్ గెరియేరియా అన్నారు.Infosys featured as a Top 100 global brand by Kantar! Thank you to every Infoscion, for making this happen for the 3rd consecutive year! https://t.co/MSaxBOIy1x#NavigateYourNext #KantarBrandzTop100 #InfyNews pic.twitter.com/zGe99AWfeI— Infosys (@Infosys) June 12, 2024 -
యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో భారత్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్ సరఫరా చేశాయి. 50 శాతంపైగా మన కంపెనీలవే.. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్టెన్షన్ 60 శాతం, లిపిడ్ రెగ్యులేటర్స్ 58, యాంటీ అల్సర్స్ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్ 56 శాతం, కొరియా 18, యూరప్ 11 శాతం బయోసిమిలర్స్ సరఫరా చేశాయి. మరో 1.3 ట్రిలియన్ డాలర్లు..భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్ మందుల కారణంగా 2022లో యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా. భారత్–యూఎస్ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ చైనా నుంచి భారత్కు దిగుమతి అవుతున్నాయి. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
అంకురాలకు తగ్గుతున్న ఆదరణ.. కానీ..
ముంబై: అంకురాలు పెట్టుబడుల సమీకరణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ.. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో ఈ సమస్య ఎదురవుతోంది. వృద్ధి దశలోని అంకురాలకు నిధులు అందడం కష్టంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై మాత్రం ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు. దేశీ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం క్షీణించాయి. ఇప్పటివరకు 27.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ స్వల్పంగా పెరిగి 19.34 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రైవేట్ పెట్టుబడులను విశ్లేషించే వెంచర్ ఇంటెలిజెన్స్, పరిశ్రమ సమాఖ్య ఐవీసీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023 డిసెంబర్ 30 నాటికి పీఈ, వీసీ సంస్థలు 697 లావాదేవీల ద్వారా 27.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది (2022లో) 1,364 డీల్స్ ద్వారా 47.62 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే గతేడాది 233 లావాదేవీల ద్వారా 18.45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా ఈసారి లావాదేవీల సంఖ్య 248కి, పరిమాణం 19.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, నిధుల ప్రవాహం మందగించడం తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో మరింత భారీగా పెట్టుబడులు రాగలవని ఐవీసీఏ (ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రజత్ టాండన్ తెలిపారు. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య తగ్గినా భారీ స్థాయి పెట్టుబడులు రావడమనేది గణనీయమైన విలువను, స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడాన్ని సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. టాప్ 5 పెట్టుబడులను చూస్తే.. ఏప్రిల్లో మణిపాల్ హాస్పిటల్లో టీపీజీ క్యాపిటల్, టెమాసెక్ 2.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. తదుపరి జూన్లో హెచ్డీఎఫ్సీ క్రెడిలాను బేరింగ్ ఏషియా, క్రిస్క్యాపిటల్ 1.35 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నాయి. ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏప్రిల్లో అవాడా వెంచర్స్లో బ్రూక్ఫీల్డ్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జూలైలో ఫెర్టిలిటీ క్లినిక్ల సంస్థ ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్స్కి బేరింగ్ ఏషియా 732 మిలియన్ డాలర్లు అందించింది. ► రంగాలవారీగా పరిశీలించినప్పుడు హెల్త్కేర్.. లైఫ్ సైన్సెస్లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 30.2 శాతం పెరిగాయి. అలాగే ఇంధన (14.5 శాతం), రిటైల్ (98.8 శాతం), అడ్వర్టైజింగ్.. మార్కెటింగ్లో (199.8 శాతం) ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. ► ఐటీ..ఐటీఈఎస్ రంగంలో పెట్టుబడులు 64.5 శాతం క్షీణించాయి. అలాగే బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా)లోకి 47.6 శాతం, తయారీలోకి 43 శాతం, ఇంజినీరింగ్.. నిర్మాణ రంగాల్లోకి 64 శాతం మేర ఇన్వెస్ట్మెంట్లు పడిపోయాయి. షిప్పింగ్ .. లాజిస్టిక్స్లోకి 60.6 శాతం, విద్యా రంగంలోకి 78.4 శాతం, ఎఫ్ఎంసీజీలో 48.5 శాతం, అగ్రి బిజినెస్లోకి 81 శాతం, ఫుడ్ అండ్ బెవరేజెస్లోకి 70 శాతం, టెలికంలోకి 84 శాతం పెట్టుబడులు క్షీణించాయి. ఇదీ చదవండి: 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. ► టాప్ పీఈ నిష్క్రమణలను చూస్తే.. టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా.. ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో తమ వాటాలను వాల్మార్ట్కు 1.78 బిలియన్ డాలర్లకు విక్రయించాయి. లెన్స్కార్ట్లో ఇన్వెస్టర్లు షిరాటే వెంచర్స్, ప్రేమ్జీఇన్వెస్ట్, యునీలేజర్ వెంచర్స్, స్టెడ్వ్యూ క్యాపిటల్, టీఆర్ క్యాపిటల్, క్రిస్ గోపాలకృష్ణన్, ఎపిక్ క్యాపిటల్ తమ వాటాలను అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి 410 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ ఇన్వెస్టర్లు సోఫినా, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్, ఫైర్సైడ్ వెంచర్స్, షార్ప్ వెంచర్స్ .. పబ్లిక్ ఇష్యూలో తమ వాటాలను విక్రయించి 133 మిలియన్ డాలర్లు సమీకరించాయి. -
ManpowerGroup Employment Outlook Survey: నియామకాలపై భారత్లో బుల్లిష్ ధోరణి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే మూడు నెలల (2024 జనవరి–మార్చి) కాలానికి నియామకాల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్వపర్ గ్రూప్ ఇండియా సర్వే వెల్లడించింది. నియామకాల ఆశావాదం భారత్లోనే ఎక్కువగా నమోదైంది. రానున్న మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని 37 శాతం కంపెనీలు చెప్పాయి. మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయింట్మెంట్ అవుట్లుక్ సర్వే ప్రపంచవ్యాప్తంగా 3,100 కంపెనీలను ప్రశ్నించి ఈ వివరాలను విడుదల చేసింది. 2023 ప్రథమ త్రైమాసికంతో పోలిస్తే భారత్లో నియామకాల ధోరణి 5 శాతం ఎక్కువగా కనిపించింది. ‘‘దేశీయ డిమాండ్ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. నిరంతరాయ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం భారత్ను లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సాయపడుతున్నాయి’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. భారత్లోనే అధికం.. జనవరి–మార్చి త్రైమాసికానికి నియామకాల పరంగా ఎక్కువ ఆశావాదం భారత్, నెదర్లాండ్స్లోనే కనిపించింది. ఈ రెండు దేశాల్లోనూ 37 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలత కనబరిచాయి. ఆ తర్వాత కోస్టారికా, అమెరికాలో ఇది 35 శాతంగా ఉంది. 34 శాతంతో మెక్సికో నియామకాల ఆశావాదంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా సగటున చూస్తే ఇది రానున్న త్రైమాసికానికి 26 శాతంగా ఉంది. ఈ రంగాల్లో సానుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో నియామకాల సానుకూల త ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఐటీ, కన్జ్యూ మర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల ధోరణి వ్యక్తమైంది. మార్చి త్రైమాసికంలో నియామకాలు పెంచుకుంటామని ఫైనాన్షియల్స్, రియల్ ఎస్టేట్ రంగంలో 45 శాతం కంపెనీలు చెప్పాయి. ఐటీ రంగంలో 44 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగంలో 42% కంపెనీలు ఇదే విధమైన దృక్పథంతో ఉన్నాయి. అతి తక్కువగా 28% మేర నియామకాల సానుకూలత ఇంధనం, యుటిలిటీ రంగాల్లో కనిపించింది. మన దేశంలో పశ్చిమ భారత్లో ఎక్కువగా 39 శాతం మేర నియామకాల పట్ల కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో 38 శాతం సానకూలత కనిపించింది. నిపుణుల కొరత భారత్, జపాన్లో నిపుణులైన మానవ వనరుల కొరత అధికంగా ఉంది. భారత్లో 81 శాతం సంస్థలు నైపుణ్య మానవ వనరులను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పాయి. 2023 సంవత్సరం ఇదే కాలంలోని ఫలితాలతో పోలి్చచూసినప్పుడు ఒక శాతం పెరిగింది. తమకు కావాల్సిన నిపుణులను గుర్తించడం కష్టంగా ఉందని 85 శాతం జపాన్ కంపెనీలు చెప్పాయి. ఆ తర్వాత గ్రీస్, ఇజ్రాయెల్లోనూ 82 శాతం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. నిపుణులను గుర్తించి, వారిని నియమించుకుని, అట్టి పెట్టుకునేందుకు కంపెనీలు సౌకర్యవంతమైన పని విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఐటీ, డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్, హెచ్ఆర్ నిపుణులకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. -
విదేశాల్లో డైరెక్ట్ లిస్టింగ్కు గ్రీన్ సిగ్నల్..
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు విదేశీ ఎక్స్చెంజీలలో నేరుగా లిస్టయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీల చట్టంలో సంబంధిత సెక్షన్ 5ని నోటిఫై చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట తరగతులకు చెందిన పబ్లిక్ కంపెనీలు .. ఆమోదయోగ్యమైన కొన్ని విదేశీ స్టాక్ ఎక్స్చెంజీలలో తమ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్కు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది. విదేశాల్లో లిస్టింగ్ కోసం విదేశీ మారక నిర్వహణ చట్టం మొదలైన వాటిని కూడా సవరించాల్సి ఉంటుందని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్ట్నర్ యష్ అషర్ తెలిపారు. తాజా పరిణామంతో పెట్టుబడుల సమీకరణకు దేశీ కంపెనీలకు మరో మాధ్యమం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే, వ్యాల్యుయేషన్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు లెక్కగట్టే విధానం, విదేశాల్లో లిస్టింగ్ వల్ల వాణిజ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటినీ కంపెనీలు మదింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశీ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్టవుతున్నాయి. 2020 మే నెలలో కోవిడ్ ఉపశమన ప్యాకేజీలో భాగంగా భారతీయ సంస్థలు విదేశాల్లో నేరుగా లిస్టయ్యేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. సదరు సంస్థలు ప్రపంచ మార్కెట్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకునేందుకు తోడ్పా టు అందించేలా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జూలై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన మనీలాండరింగ్ నిబంధనలు అమలయ్యే ఎన్వైఎస్ఈ, నాస్డాక్, ఎల్ఎస్ఈ మొదలైన పది ఎక్సే్చంజీలను పరిశీలించవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. -
విదేశాల నుంచి ఉద్యోగులు.. కంపెనీలకు జీఎస్టీ నోటీసులు
దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది. భారత్కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్కు డిప్యూటేషన్పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. బయటి దేశాల నుంచి డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్పై వచ్చినవారిని సెకెండెడ్ ఎంప్లాయీస్ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్ చేసే వీరి జీతాలపై సర్వీస్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. -
దేశీ సంస్థల్లో ఏఐ జోరు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగం మిగతా అన్ని విభాగాల కన్నా ముందుంటున్నాయి. కోవిడ్ తర్వాత శకంలో ఏఐ ప్రభావం అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో భారత మార్కెట్లో నిర్వహించిన సర్వేకు కొనసాగింపుగా 2022–23లో 220 పైచిలుకు చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్వో), నిర్ణయాధికారాలు ఉన్న ఉన్నతోద్యోగులతో మాట్లాడి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం గత రెండేళ్లుగా పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్) వినియోగం అత్యధికంగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వాటిలో ఈ రంగాలకు చెందిన 64 శాతం సంస్థలు తాము ప్రస్తుతం ఏఐకు మారే క్రమంలో తొలి దశలో ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏఐని వినియోగించడం ద్వారా పెట్టుబడులపై అధిక రాబడులను అందుకునే విషయంలో ట్రావెల్, ఆతిథ్య పరిశ్రమ ఒక మోస్తరు సంతృప్త స్థాయికి చేరింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, హెల్త్కేర్, ఫార్మా తదితర రంగాలు ఏఐ వినియోగంలో స్థిరంగా ముందుకెడుతున్నప్పటికీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ► మిగతా రంగాలతో పోలిస్తే రిటైల్, కన్జూమర్ మార్కెట్లలో ఏఐ వినియోగం తగ్గింది. మార్కెట్ శక్తులు, వినియోగదారుల పోకడలు మారిపోతున్న నేపథ్యంలో ఏఐని ఏయే అంశాల్లో వినియోగించవచ్చనేది గుర్తించడం సంక్లిష్టంగా మారడమే ఇందుకు కారణం. ► గత రెండేళ్లుగా, 2020 మధ్య నుంచి 2022–23 వ్యవధిలో పారిశ్రామికోత్పత్తులు.. తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ సొల్యూ,న్స్ వినియోగం అత్యధికంగా 20 శాతం పెరిగింది. -
ఫ్లాట్గా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు జూన్ క్వార్టర్లో 8 బిలియన్ డాలర్ల వీసీ నిధులను సంపాదించాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్తబ్దుగానే ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. టాప్ డీల్స్లో బైజూస్ 700 మిలియన్ డాలర్లు, లెన్స్కార్ట్ 600 మిలియన్ డాలర్లు, ట్రూబ్యాలన్స్ 168 మిలియన్ డాలర్ల సమీకరణ ఉన్నాయి. ఫిన్టెక్, ఎడ్యుటెక్, గేమింగ్ కంపెనీలు దేశంలో ఎక్కువ వీసీ నిధులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రిటెక్ కూడా వీసీ ఇన్వెస్టర్ల ప్రాధాన్య క్రమంలో ఉంది. ఈ వివరాలను కేపీఎంజీ సంస్థ ‘వెంచర్పల్స్ క్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి 77.4 బిలియన్ డాలర్లుగా (రూ.6.34 లక్షల కోట్లు) ఉన్నాయి. మొత్తం 7,783 డీల్స్ నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల్లోనూ భారీ డీల్స్కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్ట్రైప్ 6.8 బిలియన్ డాలర్లను జూన్ త్రైమాసికంలో సంపాదించింది. సింగపూర్కు చెందిన షీన్ 2 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను సొంతం చేసుకున్నాయి. కొత్త నిధుల సమీకరణ విషయంలో ప్రముఖ వీసీ సంస్థలు కొంత వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండడంతో సవాళ్లు ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్లు.. రిలయన్స్కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు), విదేశాల్లో లిస్టింగ్పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
భారీగా తగ్గిన ఐటీ ఉద్యోగులు! టాప్ 10 దిగ్గజ కంపెనీల్లో..
భారతదేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటి 'ఐటీ' అని అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం లెక్కకు మించిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఐటీ రంగం ఇప్పుడు రిక్రూట్మెంట్స్ జరపకపోగా.. ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశంలోని టాప్ 10 దిగ్గజ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 21,327కి పడిపోయినట్లు సమాచారం. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కంపెనీలలోని ఉద్యోగుల సంఖ్య 69,634 కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఎంతమంది తగ్గారో స్పష్టంగా తెలుస్తోంది. టాప్ 10 కంపెనీలలో ఆరు కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గింది, కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS), పెర్సిస్టెంట్, కోపోర్ట్ వంటి నాలుగు కంపెనీలు మాత్రం కొంతవరకు నియామకాలను చేపట్టి ఉద్యోగుల సంఖ్యను పెంచింది. మొత్తం మీద చాలా కంపెనీలు కొత్త వారిని చేర్చుకోవడం కంటే కూడా ఉన్న వారి నైపుణ్యాలనే మెరుగుపరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?) కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభించినప్పటి నుంచి ఉద్యోగుల జీవితాలు తలకిందులైపోయాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందించగా.. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులనే తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా చాలా వరకు ఉద్యోగుల మీద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: సీఏ చదివి ఈ పని చేస్తావా? అని చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) తొలగింపు & నియామకాలు అలా ఉంచితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగుల పాలిట మరో గండంగా మారింది. ఇప్పటికే చాలా కంపెనీలు కృత్రిమ మేధను ఉపయోగిస్తూ.. ఎంప్లాయిస్ సంఖ్యను తగ్గిస్తోంది. భవిష్యత్తులో కూడా క్రమంగా ఇదే జరిగితే ఉద్యోగుల సంఖ్య భారీగా క్షిణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది. అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం. -
ఆ విషయంలో ముందున్న ఇండియన్ కంపెనీలు.. అమెరికా కూడా మన తర్వాతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న కంపెనీల్లో భారతీయ సంస్థలే ముందంజలో ఉన్నాయని సీబీఆర్ఈ ఇండియా నివేదిక వెల్లడింంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో 2023 జనవరి - మార్చిలో స్థల లీజింగ్లో అమెరికా కంపెనీలను ఇక్కడి సంస్థలు వెనక్కి నెట్టాయని తెలిపింది. దాదాపు డిసెంబర్ త్రైవసికం మాదిరిగానే జనవరి - మార్చిలో మొత్తం డిమాండ్లో భారతీయ సంస్థల వాటా ఏకంగా 50 శాతం ఉంది. 2022లో తొలిసారిగా అమెరికన్ కంపెనీలను మించి భారతీయ సంస్థలు ఎక్కువ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో స్థల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 9 శాతం ఎగసి 1.26 కోట్ల చదరపు అడుగులు నవెదైంది. నగరాల వారీగా ఇలా.. స్థల ఆఫీస్ స్థల లీజింగ్లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నైల వాటా 62 శాతం ఉంది. హైదరాబాద్ స్థిరంగా 14 లక్షల చదరపు అడుగుల డిమాండ్ను చూసింది. ఢిల్లీ ఎన్సీఆర్ స్వల్పంగా పెరిగి 24 లక్షలు, ముంబై రెండింతలై 16 లక్షలు, చెన్నై స్వ ల్పంగా అధికమై 20 లక్షలు, పుణే కొద్దిగా పెరిగి 12 లక్షల చదరపు అడుగులు నమోదైంది. బెంగళూరు స్వల్పంగా తగ్గి 35 లక్షల చదరపు అడుగులుగా ఉంది. 2022లో స్థల ఆఫీస్ లీజింగ్ 40 శాతం అధికమై 5.66 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ఇందులో దేశీయ కంపెనీల వాటా 2.77 కోట్ల చదరపు అడుగులు కాగా, అమెరికా కంపెనీలు 2 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నాయి. భిన్న పరిస్థితులు.. అంతకు ముందు త్రైమాసికాల్లో సాంకేతిక రంగ కంపెనీలే ముందు వరుసలో ఉండేవి. అందుకు భిన్నంగా జనవరి–మార్చిలో బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీలు చెరి 22 శాతం వాటాతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు 20 శాతం, ఇంజనీరింగ్, తయారీ 11, పరిశోధన, కన్సల్టింగ్, అనలిటిక్స్ కంపెనీలు 10 శాతం వాటాకు పరిమితం అయ్యాయి. మధ్య, భారీ స్థాయి డీల్స్లో బీఎఫ్ఎస్ఐ కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, భారతీయ బ్యాంకులు, ఫ్లెక్స్ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ కంపెనీల వాటా డిసెంబర్ క్వార్టర్లో 20 శాతం ఉంటే, మార్చిలో ఇది 44 శాతానికి ఎగబాకింది. రెండవ భాగంలో.. ద్రవ్య నియంత్రణ, ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెంది న దేశాలలో మందగమన అవకాశాలు, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా ఏర్పడే స్వల్పకాలిక స్థల ఆర్థిక ఒత్తిడి 2023లో కంపెనీల విస్తరణ ప్రణాళికలు, నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు. అయితే బహుళజాతి సంస్థల లీజింగ్ నిర్ణయాలపై ఈ పరిస్థితుల ప్రభావం ఇంకా గుర్తించలేదని సీబీఆర్ఈ తెలిపింది. లీజింగ్ కార్యకలాపాలు ముఖ్యంగా ఈ ఏడాది రెండవ భాగంలో పుంజుకోవచ్చు, ఎందుకంటే భారతదేశం అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభకు ఆకర్షణీయ, సరసమైన మూలంగా కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలను నిలదొక్కుకోవడం కోసం కా ర్పొరేట్లు దేశం వైపు చసేలా చేస్తుందని సీబీఆర్ ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. -
సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా?
జైపూర్: ఒకవైపు సైబర్ దాడులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలు దేశంలో చాలా కంపెనీలకు లేవన్న విషయాన్ని సైబర్ సెక్యూరిటీపై సిస్కో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అధునాతన సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యాలు కేవలం 24 శాతం కంపెనీలకే ఉన్నట్టు సిస్కో ప్రకటించింది. ఇదీ చదవండి: స్టార్బక్స్ సీఈవోగా నరసింహన్.. బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు వచ్చే మూడేళ్లలో భారత్లో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. వచ్చే 12–24 నెలల్లో తమ వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్ దాడులు జరగొచ్చని భావిస్తున్నట్టు సిస్కో సర్వేలో 90 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ సన్నద్ధత సగటున కేవలం 15 శాతంగానే ఉందని, ఈ విధంగా చూస్తే భారత్ మెరుగ్గా ఉన్నట్టు సిస్కో తెలిపింది. భారత్లోని 38 శాతం కంపెనీలు ఆరంభ, ఏర్పాటు స్థాయిలో ఉన్నవేనని పేర్కొంది. స్వతంత్ర థర్డ్ పార్టీతో సిస్కో ఈ సర్వే చేయించింది. 27 మార్కెట్ల నుంచి 6,700 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు సర్వేలో పాల్గొన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సొల్యూషన్లను కంపెనీలు ఏర్పాటు చేశాయి, అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! చిన్న కంపెనీలకు ముప్పు అధికం.. ఇందులో ఆరంభ, స్టార్టప్, పురోగతి, పూర్తి స్థాయి కంపెనీలు అని సిస్కో సర్వే వర్గీకరించింది. ఆరంభ దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను ఏర్పాటు చేసే దశలో ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువే స్కోర్ లభించింది. ఏర్పాటు దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అమలు చేసే దశలో ఉన్నాయి. వీటికి స్కోర్ 11–44 మధ్య ఉంది. సైబర్ భద్రతా సన్నద్ధత విషయంలో ఇవి సగటు కంటే తక్కువ పనితీరు చూపిన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. పురోగతి దశలోని కంపెనీలు సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా సగటు కంటే ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయికి చేరిన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లలో చాలా ముందంజలో ఉండడమే కాకుండా, రిస్క్లను ఎదుర్కొనే సామర్థ్యాలతో ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో తాము సైబర్ దాడిని ఎదుర్కొన్నామని, వీటి కారణంగా తమకు రూ.4–5 కోట్ల స్థాయిలో నష్టం ఎదురైనట్టు 53 శాతం మంది సర్వేలో చెప్పారు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ‘‘సైబర్ సెక్యూరిటీకి వ్యాపార సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అవి తమ డిజిటైజేషన్ ప్రయాణాన్ని కొనసాగించగలవు. హైబ్రిడ్ పని విధానం ప్రముఖంగా మారడం, సేవలు అప్లికేషన్ ఆధారితం కావడంతో.. సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా ఉన్న అంతరాలను తగ్గించుకోవడం కంపెనీలకు కీలకం’’ అని సిస్కో ఇండియా సెక్యూరిటీ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్ సమీర్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
CBRE India: ఆఫీసు లీజింగ్లో భారత కంపెనీల పైచేయి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. -
మార్చి క్వార్టర్లో ఆచితూచి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–మార్చిలో భారతీయ కంపెనీలు ఆచితూచి నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే వెల్లడించింది. 3,030 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘మాంద్యం అంచనాలు, ప్రపంచ మందగమనం ఇందుకు కారణం. ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చని 48 శాతం కంపెనీలు తెలిపాయి. తగ్గవచ్చని 16 శాతం, మార్పు ఉండకపోవచ్చని 34 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 17 శాతం, 2022 తొలి క్వార్టర్తో చూస్తే 22 శాతం తగ్గవచ్చు. ఐటీ, ఫైనాన్స్, రియల్టీ, కంజ్యూమర్ గూడ్స్, సర్వీసెస్ విభాగాల్లో డిమాండ్ ఉంటుంది. నిపుణుల కొరత నియామకాలకు అడ్డంకిగా పరిణమించింది. కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు సంయుక్త ప్రయత్నాల ద్వారా దీనిని పరిష్కరించే వరకు ఉపాధి రేటులో వృద్ధి సింగిల్ డిజిట్లో ఉంటుంది’ అని నివేదిక వివరించింది. -
బలహీన రూపాయితో భారత్ కంపెనీలు బేఫికర్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్ తాజా నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్ కరెంట్ అకౌంట్ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతుంది. ► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్లను కలిగి ఉన్నాయి. ► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలమే. అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన నిధుల విషయంలో డాలర్ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ► చాలా రేటెడ్ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి. ► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు. ► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. ► భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా అంశాలు దేశంపై రేటింగ్కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. భారత్కు మూడీస్ రేటింగ్ ఇలా... మూడీస్ గత ఏడాది అక్టోబర్లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్లుక్ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. -
ఏం జరిగింది?.. విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు డౌన్
ముంబై: భారత కంపెనీలు విదేశాల్లోని తమ వెంచర్లలో చేసే పెట్టుబడులు ఆగస్ట్ నెలలో 59 శాతం తగ్గి 1.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో భారత కంపెనీలు విదేశాల్లో చేసిన పెట్టుబడులు 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి పెట్టుబడులు చూసినా, 1.12 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. లెన్స్కార్ట్ సొల్యూషన్స్.. సింగపూర్లోని తన సబ్సిడరీలో 319 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ స్విట్జర్లాండ్లోని సబ్సిడరీలో 100 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. (క్లిక్: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట) -
జోరుగా.. హుషారుగా..నియామకాలు!
న్యూఢిల్లీ: రానున్న మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నాయి. మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించిన ‘ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే’ ఈ వివరాలను నివేదికగా విడుదల చేసింది. కార్మిక మార్కెట్ సెంటిమెంట్ రానున్న త్రైమాసికానికి బలంగా ఉన్నట్టు తెలిపింది. మ్యాన్పవర్ గ్రూపు భారత్ సహా 41 దేశాల్లో ఉపాధి మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. భారత్లో సర్వే ఫలితాలను గమనించినట్టయితే.. 64 శాతం కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవాలని అనుకుంటున్నాయి. 24 శాతం కంపెనీలు ఎలాంటి మార్పు ఉండదని చెప్పాయి. 10 శాతం కంపెనీల్లో నియామకాల ధోరణి తగ్గింది. దీని ప్రకారం సగటున 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఈ సర్వే తేల్చింది. బ్రెజిల్లో 56 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలలకు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆశావహంగా ఉంటే, ఆ తర్వాత భారత్ అత్యధిక రేటుతో రెండో స్థానంలో ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే.. మన దేశంలో నియామకాల సెంటిమెంట్లో 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. త్రైమాసికం వారీగా చూస్తే నియామకాల సెంటిమెంట్ 3% మెరుగుపడింది. భారత్కు ప్రయోజనం.. ‘‘భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా, బలంగా ఉన్నాయి. స్వల్పకాల ప్రతికూలతలు ఉన్నా కానీ, వృద్ధికి మద్దతునిచ్చే విధానాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు పెరగడం వల్ల మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ప్రతికూలతలను అధిగమిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వర్ధమాన దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ వృద్ధికి మద్దతునిస్తుంది. ఎగుమతులు పెంచుకుంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ మందగమనంపై వదంతులు నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో అప్రమత్త ధోరణి నెలకొంది’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. నియామకాల పట్ల సానుకూల ధోరణి బలంగానే ఉన్నా కానీ, తమకు కావాల్సిన నైపుణ్య మానవ వనరులు లభించడం లేదని 85 శాతం కంపెనీలు చెప్పడం ఆందోళనకరం. ఇక భారత్లో ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాది, ఉత్తరాదిన వచ్చే మూడు నెలల్లో ఉద్యోగులను నియమించుకోవాలని 56 శాతం కంపెనీలు అనుకుంటుంటే.. పశ్చిమాదిన 53 శాతం, తూర్పున 47 శాతంగానే ఉంది. -
వేతనాలు 10 శాతం పెంచే చాన్స్
ముంబై: భారత్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అధికం అని వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో జీతాలు 9.5% అధికం అయ్యాయని వివరించింది. ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10–10.4 శాతం పెరగనున్నాయి. ఈ రంగాల్లో 2022లో ఇప్పటికే గణనీయంగా సాలరీలు పెరిగాయి. పెంపు 2023లోనూ ఇదే తరహాలో ఉండనుంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోని కంపెనీల యజమానుల్లో 58 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక జీతాల పెంపుదల కోసం బడ్జెట్ను కేటాయించారు. 24.4% ఎటువంటి మార్పు చేయలేదు. 5.4% మంది తగ్గించారు. వచ్చే 12 నెలలు ఆదాయం మెరుగ్గా ఉంటుందని 42 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. తిరోగమనం ఉండొచ్చని 7.2 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి’ అని నివేదిక వెల్లడించింది. డిజిటల్ నిపుణుల కోసం.. ‘తదుపరి 12 నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్ రంగాల్లో నియామకాలు ఉంటాయి. డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారి కోసం డిమాండ్ ఉండడం వేతనాల పెంపునకు కారణం అవుతోంది. హాంకాంగ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారత్లో స్వచ్ఛంద అట్రిషన్ అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగుతోంది’ అని నివేదిక వివరించింది. గత సంవత్సరం బడ్జెట్ల కంటే వాస్తవ జీతాల పెంపుదల ఎక్కువగా ఉంది. ఊహించిన దాని కంటే మెరుగైన వ్యాపార పనితీరు, ప్రతిభను నిలుపుకోవాల్సిన అవసరం కారణంగా వేతన సవరణ జరిగిందని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సల్టింగ్ ప్రతినిధి రాజుల్ మాథుర్ తెలిపారు. ఇక చైనా 6 శాతం, హాంగ్కాంగ్ 4, సింగపూర్ 4 శాతం వేతనాలు పెంచే చాన్స్ ఉంది. 2022 ఏప్రిల్–మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిగింది. భారత్ నుంచి 590 కంపెనీలు పాలుపంచుకున్నాయి. -
ఆర్థిక ఇబ్బందులతో దేశీ స్టార్టప్ కంపెనీలు సతమతం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న కొత్త మంత్రం స్టార్టప్.. స్టార్టప్.. వినూత్నమైన ఉత్పత్తులు, సేవలతో సరికొత్త వ్యాపారాలను సృష్టించి భారత యువత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. వందల వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్ కంపెనీల్లోకి ప్రవహిస్తూ ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నట్లే ప్రస్తుత మన స్టార్టప్ కంపెనీలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు... దేశంలో ఇప్పటివరకు దాదాపు 72 వేల స్టార్టప్లు ఏర్పాట య్యాయి. ఈ ఏడాది జూన్ వరకూ భారత స్టార్టప్ కంపెనీలు ఆకర్షించిన పెట్టుబడులు సుమారు రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కేవలం 891 ఒప్పందాల ద్వారా ఈ స్థాయి పెట్టుబడులు రావడమన్నది చెప్పుకోదగ్గ విషయమే. ఈ సమయంలోనే సుమారు 18 స్టార్టప్ కంపెనీలు 100 కోట్ల డాలర్ల విలువైనవిగా (యూనికార్న్)గా మారిపోయాయి. గతేడాదితో పోలిస్తే వచ్చిన పెట్టుబడులు, యూనికార్న్లుగా ఎదిగిన కంపెనీల సంఖ్య రెండూ ఎక్కువే. సరిపెట్టుకుంటున్న స్టార్టప్లు.. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలు కూడా అందుకు తగ్గట్లుగా సర్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్ వ్యవహారాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. భారం తగ్గించుకొనే క్రమంలో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలకు పైనే. ఈ పరిస్థితి ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉనికిలోకి రాగా విద్యకు సంబంధించిన స్టార్టప్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వీడియో గేమింగ్ పరిస్థితి కూడా ఇదే. అయితే కోవిడ్ సద్దుమణుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు నిధుల కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా రంగాల్లోని స్టార్టప్లు గత రెండేళ్లుగా నిధులు సేకరించలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే సమీప భవిష్యత్తులో మళ్లీ స్టార్టప్లు నిలదొక్కుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడితే నిధులు వస్తాయని, కాకపోతే వచ్చే ఈ నిధులను కొంచెం ఆచితూచి తగిన వ్యాపార ప్రణాళికతో ఖర్చు చేస్తే మేలన్నది వారి అభిప్రాయం. మే నెలలో మందగమనం.. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పెట్టుబడుల మొత్తం రూ. 1.36 లక్షల కోట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఫలితంగా ఏప్రిల్ నుంచే మందగమనం మొదలైంది. మే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ. 14 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ గతంలో కుది రిన ఒప్పందాల కారణంగా వచ్చినవే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, సరుకు రవాణా ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి భారత స్టార్టప్ వ్యవస్థపైనా ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందు కు ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటలిస్టులైన సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్లు మే నెలలోనే 2022 సంవత్సరానికిగాను నష్టాలను ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రతి త్రైమాసి కానికి 1,000–1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా మే–జూన్ త్రైమాసికంలో అది 40% దాకా తగ్గిపోయి 600–700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ( పాపం.. ఓలా అంచనా తల్లకిందులైందే!) నిపుణుల మాట ఇదీ.. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలిగినవి మాత్రమే భవిష్యత్తులో దేశంలోని దిగ్గజ కంపెనీల జాబితాలోకి చేరిపోతాయి. 2021ని స్టార్టప్లకు ఊపిరి పోసిన ఏడాదిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కగలిగితే వాటి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. – ఆశిష్ శర్మ, ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ భారత స్టార్టప్ వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఉత్పత్తులన్నీ యథాతథంగా కొనసాగుతాయనేది నా నమ్మకం. కంపెనీల వ్యాల్యుయేషన్లో తగ్గుదల ఉన్నా మొత్తమ్మీద పరిస్థితి బాగుంది. – సి.విజయ్ కుమార్, సీఈవో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత 2 నెలల్లో స్టార్టప్ వ్యవస్థకు సమస్యల ముసురు పట్టుకుంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపె నీల వ్యాపార ప్రణాళికలు వెనుకంజ వేస్తుండగా కొత్త వాటికి నిధులు గగనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సమస్యలు ఇలాగే ఉంటే వాటి భవిష్యత్తు ఏమవుతుంది? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి. – కేశవ్ ఆర్. మురుగేష్, నాస్కామ్ మాజీ చైర్మన్ స్టార్టప్ కంపెనీలు మౌలికాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెంచర్ క్యాపిటలిస్టులు లేదా పెట్టు బడిదారులు గతంలో మాదిరిగా సులువుగా పెట్టుబ డులు పెట్టడం లేదు. ఉత్పత్తి లేదా సేవ ఆదాయాన్ని ఇవ్వగలదా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటివరకూ చాలా వరకూ స్టార్టప్లు తమ ఉత్పత్తులు/సేవలను రాయితీ ధరలతో అమ్మే ప్రయత్నం చేశాయి. ఇలా కాకుండా వాస్తవ అవసరాలను గుర్తించి చేసే వ్యాపారం లాభదాయకమా కాదా? అని ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది. – మురళి బుక్కపట్నం, టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు స్టార్టప్లకు అకస్మాత్తుగా నిధులు మందగించడం ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో భాగమే. దీనిపై ఆందోళన అవ సరం లేదు. అయితే కేవలం వ్యాల్యుయేషన్పైనే ఆధార పడి కొంతకాలంగా స్టార్టప్ కంపెనీలు పనిచేస్తుండటం ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. ఆదాయాన్ని సృష్టించగలమా? లాభాలు వస్తాయా అనే ఆలోచన లేకుండా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి వస్తున్న నిధులను ఖర్చు చేయడమే ఆందోళన కలిగించే విషయం. – ఇటీవలి నివేదికలో ఆర్బీఐ -
పన్ను ఉపశమనం కల్పించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులలో మార్పులు చేయాలని, భారత కంపెనీలు విదేశాల్లో లిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని, టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కేపీఎంజీ సూచించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీలు అందించిన కోవిడ్ టీకాలు, వైద్య సరఫరాలపై పన్నుల్లేకపోవడంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. 2022–23 బడ్జెట్కు ముందు కీలక సూచనలు చేసింది. ఆర్థిక శాఖకు కేపీఎంజీ సూచనలు ► కరోనా చికిత్సలకు భారీ మొత్తం ఖర్చయినందున ప్రత్యేక పన్ను మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ► భారత కంపెనీలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు లేదా స్పెషల్ పర్పస్ యాక్విజిషన్ కంపెనీ మార్గంలో లిస్ట్ అయ్యేందుకు, పన్ను మినహాయింపులకు సంబంధించి నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించాలి. ► విదేశీ కంపెనీలకు, విదేశీ బ్యాంకు శాఖలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలి. దేశీ కంపెనీలకు మాదిరే రేట్లను అమలు చేయాలి. ► టీడీఎస్, టీసీఎస్కు సంబంధించి నిబంధనలను సరళీకరించాలి. అన్ని రకాల సెక్యూరిటీలను (డెరివేటివ్స్ సైతం) టీడీఎస్/టీసీఎస్ నుంచి మినహాయించాలి. ► బ్యాంకుల మాదిరే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) కంపెనీలకు నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించాలి. ముఖ్యంగా ఎన్పీఏలకు సంబంధించి మినహాయింపును పెంచాలి. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలి. ► దేశంలో నూతన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. ముఖ్యంగా ఫార్మా, హెల్త్కేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) కంపెనీలు చేసే వ్యయాలకు వెయిటెడ్ డిడక్షన్ ఇవ్వాలి. ► జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడాన్ని పరిశీలించాలి. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు వినియోగించిన ఉత్పత్తులు, సేవలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలి. -
గట్టి కంపెనీలుగా గూగుల్, టెస్లా
IMD Research On Future Readiness Companies: భవిష్యత్లో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలతో సన్నద్ధంగా ఉన్న కంపెనీల జాబితాలో టెస్లా, లులులెమన్, మాస్టర్కార్డ్, గూగుల్ అగ్రస్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్కి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) రూపొందించిన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఫ్యాషన్..రిటైల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, టెక్నాలజీ అనే నాలుగు రంగాల్లో అ త్యధికంగా ఆదాయాలు ఆర్జిస్తున్న 86 లిస్టెడ్ కంపెనీలను వాటి పోటీ కంపెనీలతో పోల్చి, భవిష్యత్ను ఎదుర్కొనేందుకు అవి ఎంత సంసి ద్ధంగా ఉన్నాయి, వాటి నిలదొక్కుకునే సామర్థ్యా లేమిటి తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం దశాబ్ద కాలం (2010–2021) పైగా డేటాను పరిశీలించారు. ఈ జాబితాలో 40 అమెరికన్ కంపెనీలు, చైనా.. జర్మనీ నుంచి చెరి ఏడు, ఫ్రాన్స్.. జపాన్ నుంచి చెరి ఆరు కంపెనీలకు చోటు దక్కింది. నివేదిక ప్ర కారం ఫ్యాషన్.. రిటైల్లో లులులెమన్, నైకీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆటోమోటివ్ సెగ్మెంట్లో టెస్లా, టయోటా టాప్ 2 స్థానాల్లో నిల్చా యి. ఆర్థిక సేవల విభాగంలో మాస్టర్కార్డ్, వీసా తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నాయి. టెక్నాలజీ లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ టాప్ 3లో నిలిచినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. భారత్ కంపెనీలు ఎందుకు లేవంటే.. ఐఎండీ లిస్టులో భారత కంపెనీలేవీ చోటు దక్కించుకోలేకపోయాయి. ఇందుకు భారత్లో మౌలిక సదుపాయాలపరమైన సమస్యలే కారణమని నివేదికను రూపొందించిన ప్రొఫెసర్ హోవార్డ్ యు తెలిపారు. ‘ఆటోమోటివ్ రంగంలోని టాప్ కంపెనీల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేవు. అలాగని టాటా, మహీంద్రా వంటి దిగ్గజాలు కొత్తవి ఆవిష్కరించలేవని కాదు. అవి చేయగలవు. కానీ రేపటితరం స్మార్ట్ వాహనాలన్నీ నగరంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానించే సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్పై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు పుంజుకోవాలన్నా సూపర్చార్జర్ల విస్తృత నెట్వర్క్ అవసరమవుతుంది. చైనాలోని ఎన్ఐవో, బీవైడీ వంటి ఆటోమోటివ్ సంస్థలు తమ సొంత నెట్వర్క్తో పాటు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వల్ల కూడా ప్రయోజనం పొందుతుంటాయి. ప్రభుత్వ స్థాయిలో మద్దతు లేకుండా ఎన్ఐవో సొంతంగా బ్యాటరీ మార్పిడి స్టేషన్లను అభివృద్ధి చేయడం అసాధ్యం. కాబట్టి భారత్లోనూ అదే తరహాలో మౌలిక సదుపాయాల కల్పనల సమస్యల పరిష్కారంపై రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా దృష్టి పెట్టాలి‘ అని హొవార్డ్ పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి భారత్కి ఇంకా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అయితే, యూనికార్న్ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు) సంఖ్యాపరంగా భారత్, ఈ ఏడాది చైనాను అధిగమించిందని హొవార్డ్ తెలిపారు. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఓలా వంటి వంటివి దేశీ స్టార్టప్ వ్యవస్థలో పెను సంచలనాలు సృష్టించాయని పేర్కొన్నారు. చదవండి: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎలన్ మస్క్ -
భారత్ కార్పొరేట్ అవుట్లుక్... పాజిటివ్
న్యూఢిల్లీ: భారత్ కంపెనీల అవుట్లుక్ పాజిటివ్గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో నెలకొన్న పటిష్ట డిమాండ్, విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ ఇందుకు దోహదపడుతున్న అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, అధిక ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండడం కూడా కంపెనీల సానుకూల అవుట్లుక్కు కారణమని పేర్కొంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటుందని అంచనా. ఆ తర్వాత 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ► స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా భారత కంపెనీలకు క్రెడిట్ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉన్నాయి. పటిష్ట వినియోగదారుల డిమాండ్, అధిక కమోడిటీ ధరల కారణంగా రేటెడ్ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ► వ్యాక్సినేషన్ విస్తృతి, స్థిరమైన వినియోగదారుల విశ్వాసం, తక్కువ వడ్డీ రేట్లు, అధిక ప్రభుత్వ వ్యయం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సానుకూల క్రెడిట్ ఫండమెంటల్స్ బలాన్ని అందిస్తున్నాయి. ► ఆయా అంశాలు భారతదేశ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత వినియోగదారుల డిమాండ్, వ్యయం, తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. అధిక కమోడిటీ ధరలతోసహా ఈ పోకడలు రాబోయే 12–18 నెలల్లో రేటెడ్ కంపెనీల స్థూల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని పెంచుతాయి. ► మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్లను పెంచుతుంది. మరోవైపు పెరుగుతున్న వినియోగం, దేశీయ తయారీ పురోగతికి కేంద్రం తోడ్పాడు, నిధుల లభ్యత సజావుగా ఉండడానికి చర్యలు కొత్త పెట్టుబడులకు తగిన పరిస్థితులను సృష్టిస్తాయి. మూడవవేవ్ వస్తే మాత్రం కష్టమే... ఎకానమీకి మూడవ వేవ్ సవాళ్లూ ఉన్నాయి. ఇదే జరిగితే తాజా లాక్డౌన్ల ప్రకటనలు జరుగుతాయి. ఇది వినియోగ సెంటిమెంట్ పతనానికి దారితీస్తుంది. ఇలాంటి వాతావరణం ఆర్థిక క్రియాశీలతను, వినియోగ డిమాండ్ను పడగొడుతుంది. కంపెనీల స్ళూల ఆదాయాలూ పడిపోతాయి. కరోనా మూడవ వేవ్ పరిస్థితుల్లో– స్థూల ఆదాయాలు వచ్చే 12 నుంచి 18 నెలల్లో 15 నుంచి 20 శాతం పతనం అయ్యే వీలుంది. దీనికితోడు ప్రభుత్వ వ్యయంలో జాప్యం, పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించే తరహాలో చోటుచేసుకునే ఇంధన కొరత, ధరా భారం, డిమాండ్ పెంపునకు వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాలు కంపెనీల ఆదాయాలను తగ్గిస్తాయి. ద్రవ్యోల్బణం సవాళ్లు... ప్రస్తుతం దేశ తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిధుల సమీకరణ వ్యయాలను తగ్గిస్తున్నాయి. డిమాండ్ పెరిగేకొద్దీ కొత్త మూలధన పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం కనిపిస్తోంది. ఇది వడ్డీ రేటల్లో ఊహించిన దానికంటే వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇలాంటి ధోరణి వ్యాపార పెట్టుబడులపై అధిక భారాన్ని మోపుతుంది. -
క్యూ2లో ఆదాయాలు 20% అప్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో దేశీ కంపెనీల ఆదాయం సగటున 18–20 శాతం స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా అంచనా వేసింది. గతేడాది క్యూ2(జులై–సెపె్టంబర్)తో పోలిస్తే ప్రధానంగా అమ్మకాల పరిమాణం పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడింది. అంతేకాకుండా అధిక కమోడిటీ ధరలు సైతం మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అయితే ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా నిర్వహణ లాభ మార్జిన్లకు చెక్ పడనున్నట్లు తెలియజేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన కంపెనీలు కష్టకాలంలోనూ నెగ్గుకురానున్నట్లు పేర్కొంది. వేతనాల్లో కోతలు తదితర చర్యల ద్వారా వ్యయ నియంత్రణలను పాటించడంతో డిమాండ్ క్షీణించినప్పటికీ బిజినెస్లను రక్షించుకోగలగినట్లు వివరించింది. రంగాలవారీగా.. కోవిడ్–19 ప్రభావంతో గతేడాది(2020–21) క్యూ2లో పలు కంపెనీల అమ్మకాలు తిరోగమించిన సంగతి తెలిసిందే. స్థానిక లాక్డౌన్లు, నెమ్మదించిన ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంకాగా.. లోబేస్ రీత్యా ఈ ఏడాది క్యూ2లో వివిధ రంగాల కంపెనీలు ఆదాయాల్లో వృద్ధిని చూపగలవని క్రిసిల్ తెలియజేసింది. ఫైనాన్షియల్ సరీ్వసులు, చమురును మినహాయించి 40 రంగాలకు చెందిన 300 కంపెనీలను క్రిసిల్ అంచనాలకు తీసుకుంది. వీటిలో 24 కంపెనీలు 20 శాతంపైగా వృద్ధిని సాధించగలవని అంచనా వేసింది. అయితే స్టీల్ ప్రొడక్టులు, అల్యూమినియం తదితర కమోడిటీ సంబంధిత రంగ కంపెనీలు మాత్రం 15–17 శాతం వృద్ధిని అందుకోగలవని పేర్కొంది. త్రైమాసికవారీగా క్రిసిల్ నివేదిక ప్రకారం త్రైమాసిక ప్రాతిపదికన అంటే ఈ క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో ఆదాయాల్లో 8–10 శాతం పురోగతి నమోదుకానుంది. క్యూ1లో కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో కంపెనీల ఆదాయం 30–32% జంప్చేసి, మొత్తం రూ. 15.8 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. రంగాల వారీగా.. రంగాలవారీగా చూస్తే అత్యవసరంకాని వినియోగ వస్తువులు అత్యధిక వృద్ధిని సాధించనుండగా.. టెలికం సైతం ఇదే బాటలో నడవనుంది. కాగా.. కేవలం అల్యూమినియం తయారీ కంపెనీలు 45–50 శాతం అధిక ఆదాయాన్ని సముపార్జించే వీలుంది. ఇందుకు ప్రధానంగా దేశీయంగా ధరలు 40 శాతం జంప్చేయడం, అమ్మకాల పరిమాణం 5–7 శాతం చొప్పున పుంజుకోవడం కారణంకానున్నాయి. ఇదే విధంగా స్టీల్ తయారీ కంపెనీలు సైతం 40 శాతం పురోగతిని సాధించే అవకాశముంది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు రెండంకెల వృద్ధిని అందుకోవచ్చు. చిప్స్ కొరత నెలకొనడంతో ఆటో పరిశ్రమలో ఆదాయాలు 4–6 శాతానికి పరిమితకానున్నాయి. -
నియామకాలపై బుల్లిష్
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల విషయంలో బుల్లిష్ (చాలా సానుకూలం)గా ఉన్నట్టు ‘హెచ్ఎస్బీసీ ఫారŠూచ్యన్ వర్క్ సర్వే’ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి వ్యాపారాలను తిరిగి పటిష్టం చేసుకునేందుకు వీలుగా మానవ వనరులపై పెట్టబుడులు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయంగా 2,130 మంది వ్యాపార అధినేతల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భారత్ నుంచి 219 మంది పాల్గొన్నారు. ఆర్థిక రికవరీలో నియామకాలు కీలక పాత్ర పోషించనున్నట్టు సర్వే పేర్కొంది. ‘‘భారతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున నియామకాలు ఉండనున్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 80 శాతం వచ్చే 12 నెలల్లో పూర్తి స్థాయి ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపాయి’’ అని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఉద్యోగులకు సంస్థ ఇచ్చే ప్రయోజనాలపై కరోనా ప్రభావం చూపించినట్టు పేర్కొంది. కరోనా సమయంలో సౌకర్యవంతమైన పనివేళలను అమలు చేసినట్టు 52 శాతం సంస్థలు చెప్పగా.. హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అందించినట్టు 49 శాతం సంస్థలు తెలిపాయి. ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన, వనరుల గురించి తెలిపినట్టు 49 శాతం సంస్థలు వెల్లడించాయి. ‘‘కరోనా మమహ్మారి ప్రభావం తగ్గుతుండడంతో ఆర్థిక రికవరీకి అవకాశం ఏర్పడింది. వ్యాపార సంస్థలు వృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. సానుకూల సెంటిమెంట్ అండతో కంపెనీలు నియిమకాలు, నైపుణ్యాలపై పెట్టుబడులను పెంచుతున్నాయి’’ అని హెచ్ఎస్బీసీ ఇండియా కమర్షియల్ బ్యాంకింగ్ హెడ్ రజత్వర్మ తెలిపారు. -
ఒక్క నిమిషానికి ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?!
నీ నెల జీతం.. నా ఒక్క గంట సంపాదనరా.. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చాలా విన్నాం.. కానీ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు మన భారతీయ కంపెనీలు ఒక్క నిమిషానికి లేదా ఒక్క గంటకు ఎంత సంపాదిస్తున్నాయి అని.. స్క్రీనర్.ఇన్ వెబ్సైట్ వాడికి వచ్చింది. దాంతో 2021 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్లోని టాప్–20 కంపెనీలు(నిమిషానికి సంపాదిస్తున్న లాభం ఆధారంగా) వివరాలు తీసుకుని.. ఈ లెక్కలేసింది. అందరూ ఊహించినట్లే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇందులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ వివరాలు ఇవిగో.. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
ఎంఎస్ఎంఈలు కోలుకుంటేనే గ్రామీణ ఉపాధికి జోరు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు.. కరోనా మహమ్మారి దెబ్బ నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కోలుకోవాల్సి ఉంటుందని దేశంలోని మెజారిటీ కంపెనీలు (57 శాతం) అభిప్రాయపడుతున్నాయి. జీనియస్ కన్సల్టెంట్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ‘గ్రామీణ నిరుద్యోగం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది?’ అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతినడం అన్ని రంగాలపైనా ప్రభావం పడేలా చేసిందని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ ప్రభావాన్ని చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడమే నిరుద్యోగం పెరిగేందుకు కారణమని ఈ సంస్థ సర్వేలో ఎక్కువ మంది చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 10 మధ్య 1,100 కంపెనీల అధిపతుల అభిప్రాయాలను సమీకరించింది. గ్రామీణ నిరుద్యోగం పెరగడానికి లాక్డౌన్ ఆంక్షలు కారణమని 14.3 శాతం మంది చెప్పగా.. కరోనా కేసులు పెరగడం కారణమని మరో 14.3 శాతం మంది పేర్కొన్నారు. మిగిలిన వారు ఈ కారణాలన్నీ నిరుద్యోగం పెరగడానికి దారితీసినట్టు చెప్పారు. -
గ్లోబల్ ర్యాంకింగ్స్లో దేశీ దిగ్గజాలు డీలా..రిలయన్స్తో పాటు
ముంబై: ప్రయివేట్ రంగంలోని టాప్–500 గ్లోబల్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు వెనకడుగు వేశాయి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ర్యాంకులు నీరసించాయి. జూలై 15 కటాఫ్గా పరిగణిస్తూ హురున్ గ్లోబల్ రూపొందించిన టాప్–500 తాజా జాబితాలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్సహా.. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్, ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం, టెలికం బ్లూచిప్ భారతీ ఎయిర్టెల్ డీలా పడ్డాయి.అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా రూపొందించే ఈ జాబితాలో గతేడాది 11 దేశీ కంపెనీలకు మాత్రమే జాబితాలో చోటు లభించగా తాజాగా 12కు చేరింది. వివరాలు ఇవీ.. విలువ పెరిగినా..: ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 11 శాతం బలపడి 188 బిలియన్ డాలర్లను తాకినప్పటికీ కంపెనీ ర్యాంకు మూడంచెలు తగ్గి 57కు చేరింది. ఈ బాటలో 164 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 75 నుంచి 74వ ర్యాంకుకు నీరసించగా.. 113 బిలియన్ డాలర్ల విలువ గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 19 పొజిషన్లు క్షీణించి 124వ స్థానానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ 52 అంచెలు జారి 301వ ర్యాంకును తాకింది. అయితే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 1 శాతం పుంజుకుని 56.7 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ 8% తగ్గి 46.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. 96 ప్లేస్లు క్షీణించి 380వ ర్యాంకుకు చేరింది. కాగా.. బ్యాంకింగ్ బ్లూచిప్ ఐసీఐసీఐ విలువ 36 శాతం జంప్చేసి 62 బిలియన్ డాలర్లను అందుకోవడంతో 48 స్థానాలు మెరుగుపడి 268వ ర్యాంకుకు ఎగసింది. కొత్తగా 3 కంపెనీలు గ్లోబల్ టాప్–500 జాబితాలో కొత్తగా దేశీ దిగ్గజాలు విప్రో(457వ ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477), హెచ్సీఎల్ టెక్నాలజీస్(498)కు చోటు లభించింది. దేశీయంగా స్టార్టప్ల జోరు కొనసాగుతుండటంతో ఇకపై జాబితాలోకి మరిన్ని కంపెనీలు చేరే వీలున్నట్లు హురున్ నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ మార్కెట్ విలువ 15 శాతం పురోగమించి 2.4 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్) తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. జాబితాలో 243 కంపెనీలతో యూఎస్ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. చైనా(47), జపాన్(30), యూకే(24) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
భారతీయుల ‘స్విస్’ సంపద మూడింతలు
న్యూఢిల్లీ/జూరిచ్: భారతీయలు, భారత కంపెనీల సంపద స్విస్ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది. 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,625 కోట్లు). రెండు సంవత్సరాల దిగువముఖం తరువాత 2020లో తిరిగి ఇండియన్ క్లైంట్స్ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బాండ్లు, తత్సంబంధ ఇన్స్ట్రుమెంట్లలో (పథకాలు) ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో పడిపోయాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా భారతీయులు, భారత్ కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు. 2011, 2013, 2017సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో ఈ పరిమాణాలు డౌన్ ట్రెండ్లోనే నడిచాయి. ► 2020లో కస్టమర్ అకౌంట్ డిపాజిట్లు 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.4,000 కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్స్. ► గణాంకాల ప్రకారం, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి. నల్లధనంపై లేని సమాచారం స్విట్జర్లాండ్లో భారతీయులు ఉంచినట్లు పేర్కొంటున్న తీవ్ర చర్చనీయాంశం ‘నల్లధనం’ గురించి గణాంకాల్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. పైగా భారతీయులు స్విట్జర్లాండ్లో ఉంచిన నిధులను ‘నల్లధనం’గా పరిగణించబోమని ఆ దేశం తరచూ పేర్కొంటోంది. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్కు మద్దుతు, సహకారం ఇస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య 2018 నుంచీ ఒక అవగాహనా ఒప్పందం కూడా అమల్లో ఉంది. ఈ మేరకు తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్లో మొట్టమొదటిసారి అందజేసింది. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్లకు చేరాయి. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్తో బ్రిటన్ ముందు నిలిచింది. ఇందుకు సంబంధించి 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్ ఫ్రాంక్స్ పైన నిలిచిన దేశాలు ఈ రెండే కావడం గమనార్హం. -
వైర్లెస్ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో దేశీ కంపెనీలు అధునాతన వైర్లెస్ టెక్నాలజీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. ఈ తరహా పెట్టుబడుల ప్రణాళికలకు సంబంధించి జపాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 71 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్లు.. మహమ్మారి కారణంగా వైర్లెస్ నెట్వర్కింగ్పై తమ తమ కంపెనీలు మరింతగా ఇన్వెస్ట్ చేస్తాయని విశ్వసిస్తున్నారు. 5జీ టెక్నాలజీ గానీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆఫీసుల్లో కమ్యూనికేషన్, మెషీన్లను రిమోట్గా పర్యవేక్షించడం, కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడం మొదలైనవి మరింత సులభతరం కాగలవని ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నారు. 5జీ,వైఫై-6 వంటి కొత్త తరం వైర్లెస్ టెక్నాలజీలతో భద్రత, విశ్వసనీయత మొదలైన అంశాలకు సంబంధించి సర్వీసుల ప్రమాణాలు మెరుగుపడగలవని, వ్యాపార సంస్థలను విజయపథంలో నడపగలవని సర్వే తెలిపింది. -
బ్రిటన్లో భారత సంస్థల హవా
లండన్: బ్రెగ్జిట్, కరోనా వైరస్ విజృంభణ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ యునైటెడ్ కింగ్డమ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ఆయా సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు కూడా భారీగా పెరిగాయి. ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దీన్ని రూపొందించాయి. బ్రిటన్ ఎకానమీ వృద్ధిలో భారత సంస్థల పాత్రను మదింపు చేసేందుకు ఉద్దేశించిన ఈ నివేదిక ప్రకారం 2020లో బ్రిటన్లో 842 భారతీయ సంస్థలు ఉండగా 2021లో ఇది 850కి చేరింది. అలాగే, వీటిలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 1,10,793 నుంచి 1,16,046కి పెరిగింది. ఈ కంపెనీల మొత్తం టర్నోవరు 41.2 బిలియన్ పౌండ్ల నుంచి 50.8 బిలియన్ పౌండ్లకు చేరింది. ఇక గతేడాది బోర్డులో కనీసం ఒక్క మహిళా డైరెక్టరయినా ఉన్న సంస్థలు 20 శాతంగా ఉండగా తాజాగా ఇది 47 శాతానికి పెరిగింది. భారతీయ ‘ఇన్వెస్టర్లకు బ్రిటన్ ఆకర్షణీయమైన కేంద్రంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ సంస్థలు ఇటు ఉద్యోగాలు కల్పించడంతో పాటు బోర్డు స్థాయిలో మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తుండటం హర్షణీయం’ అని వర్చువల్గా నివేదికను విడుదల చేసిన సందర్భంగా బ్రిటన్ పెట్టుబడుల శాఖ మంత్రి లార్డ్ గెరీ గ్రిమ్స్టోన్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాలు సానుకూలంగానే కొనసాగడం స్వాగతించతగ్గ పరిణామం అని బ్రిటన్లో భారత హై కమిషనర్ గెయిట్రీ ఇసార్ కుమార్ తెలిపారు. లెక్క ఇలా.. బ్రిటన్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ సంస్థలను ఈ నివేదిక ట్రాక్ చేస్తుంది. 5 మిలియన్ పౌండ్ల పైగా టర్నోవరు, వార్షికంగా కనీసం 10 శాతం వృద్ధి రేటు, కనీసం రెండేళ్ల పాటు బ్రిటన్లో కార్యకలాపాలు ఉన్న సంస్థలను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఏడాది 49 కంపెనీలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా నిల్చాయి. సగటున 40 శాతం ఆదాయ వృద్ధి రేటు కనపర్చాయి. ఈ ట్రాకర్ ప్రారంభించినప్పట్నుంచీ గత ఎనిమిదేళ్లుగా లిస్టులో టెక్నాలజీ, టెలికం సంస్థల సంఖ్య భారీగా ఉంటోంది. ఈ ఏడాది ఫార్మా, కెమికల్స్ కంపెనీల సంఖ్య 15 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్ ఎకానమీ వృద్ధిలోను, ఉద్యోగాల కల్పనలోనూ భారతీయ సంస్థలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. -
క్యూ4 ఫలితాలు బాగుంటాయ్!
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో దేశీ కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలవని రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదిక అంచనా వేసింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15–17 శాతం స్థాయిలో పుంజుకోగలదని పేర్కొంది. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 55–60 శాతం వాటాను ఆక్రమిస్తున్న ప్రధాన కంపెనీలపై క్రిసిల్ నివేదికను రూపొందించింది. క్యూ4లో వీటి ఆదాయం రూ. 6.9 లక్షల కోట్లకు చేరవచ్చని తెలియజేసింది. గత 8 త్రైమాసికాలుగా క్షీణత లేదా స్వల్ప పురోగతి చూపుతున్న కంపెనీలు తిరిగి రెండంకెల వృద్ధిని అందుకునే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు ప్రధానంగా అంతక్రితం(2019–20) క్యూ4లో తక్కువ వృద్ధి(లో బేస్) నమోదుకావడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులకు మెరుగైన ధరలు లభించడం కూడా దోహదం చేయనున్నట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ సర్వీసులు, చమురు కంపెనీలను మినహాయించి ఎన్ఎస్ఈలోని టాప్– 300 కంపెనీల క్యూ4 ఫలితాలపై రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదికలోని ఇతర అంశాలు.. రికవరీ దన్ను..: గతేడాది ద్వితీయార్థంలో కనిపించిన రికవరీ కారణంగా అంతక్రితం ఏడాది(2020)లో నమోదైన ఆదాయంతో పోలిస్తే 2021లో 300 కంపెనీల టర్నోవర్ 0.5 శాతం మాత్రమే తక్కువగా నమోదయ్యే వీలుంది. అయితే నిర్వహణ లాభం 28–30 స్థాయిలో జంప్ చేయనుంది. 2020 క్యూ4లో మందగమనం కారణంగా లాభాల్లో అధిక వృద్ధికి అవకాశముంది. 2021 చివరి త్రైమాసికంలో కమోడిటీల ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ వ్యయాలు, ధరలు మెరుగుపడటం కంపెనీలకు లాభించనుంది. రికవరీలో ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసులు, నిర్మాణ రంగం 50 శాతం వాటాను ఆక్రమించనున్నట్లు క్రిసిల్ నివేదికను రూపొందించిన టీమ్ లీడ్ హెటల్ గాంధీ పేర్కొన్నారు. 2020–21లో 300 కంపెనీల ఆదాయం రూ. 23.8 లక్షల కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. స్టీల్, సిమెంట్ జోరు నివేదిక ప్రకారం గతేడాది 17–18 శాతం ఆదాయ వృద్ధిలో నిర్మాణ రంగ సంబంధ స్టీల్, సిమెంట్ తదితరాలు 45–50 శాతం పురోగతిని సాధించనున్నాయి. అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. దేశీయంగా ఫ్లాట్ స్టీల్, సిమెంట్ ధరలు వరుసగా 32 శాతం, 2 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే అన్ని విభాగాలలోనూ ఇదే తరహా జోరుకు ఆస్కారంలేదు. విచక్షణ ఆధార వినియోగ విభాగాలైన ఎయిర్లైన్స్ తదితర రంగాలు 30 శాతం క్షీణతను చవిచూడనున్నాయి. కోవిడ్–19తో సామాజిక దూరం, ప్రయాణాల రద్దు వంటి అంశాలు దెబ్బతీయనున్నాయి. ఆటో స్పీడ్... లో బేస్ కారణంగా ఆటోమొబైల్ అమ్మకాలు 45–47 శాతం జంప్చేయనున్నాయి. భారత్–6 నిబంధల అమలుతో ధరలు మెరుగుపడ్డాయి. దీంతో ఆటో విడిభాగాల కంపెనీల ఆదాయం 26–28 శాతం స్థాయిలో పుంజుకోనుంది. ఐటీ సర్వీసులు, ఫార్మా 6 శాతం పురోగతిని సాధించనుండగా.. నిర్మాణ రంగం 10 శాతం క్షీణతను చవిచూడనుంది. ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పటికీ తొలి అర్ధభాగంలో నమోదైన క్షీణత దెబ్బతీయనుంది. స్వచ్ఛంద వినియోగ ఆధారిత ప్రొడక్టులు, సర్వీసుల విభాగాలు సైతం 10–12 శాతం తిరోగమించనున్నాయి. టెలికం సర్వీసులు స్వల్పంగా 2 శాతం వెనకడుగు వేయవచ్చు. ముడిచమురు పెరుగుదలతో పెట్రోకెమికల్ కంపెనీల ఆదాయం 40–45 శాతం జంప్చేయనుంది. అల్యూమినియం రంగం 15 శాతం వృద్ధిని సాధించనుంది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, విద్యుదుత్పాదన 7–5 శాతం మధ్య బలపడే అవకాశముంది. అయితే కమోడిటీల ధరలు పెరగడంతో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని కిసిల్ అసోసియేట్ డైరెక్టర్ మయూర్ పాటిల్ తెలియజేశారు. స్టీల్, సహజరబ్బర్, ముడిచమురు తదితరాల ధరలు 2020 మార్చితో పోలిస్తే రెండంకెల్లో పెరిగాయి. -
ఈ ఏడాది వేతనాలు పెరగనున్నాయ్
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ నివేదిక తెలిపింది. అంచనాలను మించి ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపారాలు తిరిగి పుంజుకోవడం, వినియోగదార్ల విశ్వాసం ఇందుకు కారణమని వివరించింది. ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020లో సగటు వేతన పెంపు 4.4 శాతముంటే, 2019లో ఇది 8.6 శాతముందని వెల్లడించింది. జీతాలు పెంచే యోచనలో ఉన్నట్టు సర్వేలో పాలుపంచుకున్న 92 శాతం కంపెనీలు తెలిపాయి. గతేడాది 60 శాతం కంపెనీలే వేతన పెంపునకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 2021లో రెండంకెల స్థాయిలో జీతాలు పెంపునకు 20 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయి. గతేడాది ఇంక్రిమెంట్ ఇవ్వలేకపోయిన కొన్ని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలను పెంచడం లేదా బోనస్ అందించాలని యోచిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. -
‘క్యూ2’ కిక్!
కరోనా కల్లోలం నుంచి భారత కంపెనీలు కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు దీనికి స్పష్టమైన సంకేతాలిచ్చాయి. చాలా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. రానున్న త్రైమాసికాల్లోనూ ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విస్తృతస్థాయి రికవరీతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అందించిన ప్యాకేజీల దన్ను దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు. కరోనా కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్తో చరిత్రలో మునుపెన్నడూ చూడనంత దారుణమైన స్థాయిలో క్యూ1 ఫలితాలను కంపెనీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోలం కారణంగా పలు కంపెనీలు పటిష్టమైన వ్యయ నియంత్రణ చర్యలు తీసుకున్నాయి. ఈ చర్యలకు కొన్ని కంపెనీల ‘లో బేస్ ఎఫెక్ట్’ కూడా తోడవడంతో ఈ క్యూ2లో 2,371 కంపెనీల నికరలాభం రెండున్నర రెట్లు పెరిగింది. నికర అమ్మకాలు మాత్రం 4.5 శాతం తగ్గాయి. అమ్మకాలు తగ్గడం ఇది వరుసగా మూడో త్రైమాసికం అయినప్పటికీ, అంతకు ముందటి రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఒకింత మెరుగుపడ్డాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో కంపెనీల ఆదాయాలు 26 శాతం, నికర లాభం 67 శాతం చొప్పున క్షీణించాయి. డౌన్గ్రేడ్ రేటింగ్లకు బ్రేక్... కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ అనలిస్ట్ గౌతమ్ దుగ్గడ్ పేర్కొన్నారు. ఈ క్యూ2లో నిఫ్టీ కంపెనీల ఆదాయాలు 6 శాతం, నికర లాభాలు 2 శాతం మేర తగ్గుతాయని అంచనా వేశామని తెలిపారు. కానీ ఈ క్యూ2లో నిఫ్టీ కంపెనీల ఆదాయాలు 7 శాతం తగ్గగా, నికర లాభాలు మాత్రం 22 శాతం మేర పెరిగాయని వివరించారు. మూడేళ్లుగా రాజ్యం చేస్తున్న డౌన్గ్రేడ్ల రేటింగ్కు ఈ క్యూ2 ఫలితాలు అడ్డుకట్ట వేశాయని వ్యాఖ్యానించారు. అదరగొట్టిన ఎఫ్ఎమ్సీజీ, హెల్త్కేర్... వినియోగం ప్రధానంగా వ్యాపారాలు చేసే కంపెనీల ఫలితాలు అంచనాలను మించాయి. ముఖ్యంగా ఎఫ్ఎమ్సీజీ, హెల్త్కేర్ రంగ కంపెనీలు అదరగొట్టాయి. బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్), సిమెంట్, ఫార్మా, టెక్నాలజీ, కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు ఓ మోస్తరుగా రాణించాయి. వాహన, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగ కంపెనీలు అంతంత మాత్రం పనితీరును కనబరిచాయి. బ్యాంకులకు క్యూ3 ఫలితాలు కీలకం..! మారటోరియం రుణాల కచ్చితమైన ప్రభావం కనబడే డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసు రంగాల కంపెనీలకు కీలకం కానునున్నాయి. అలాగే క్యూ1, క్యూ2ల్లో పతనాన్ని చవిచూసిన పర్యాటక, వినోద, రిటైల్, రెస్టారెంట్ల షేర్లు డిసెంబర్ క్వార్టర్లో ఒకింత మెరుగుపడవచ్చని అంచనాలున్నాయి. క్యూ3, క్యూ4ల్లో మరింత జోరుగా! డిసెంబర్ క్వార్టర్లో కంపెనీల పనితీరు మరింత మెరుగుపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక నాలుగో క్వార్టర్లో మరింత జోరుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి మరో దఫా ఉద్దీపన ప్యాకేజీ లభించే అవకాశాలుండటం, ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా రికవరీ అవుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో కంపెనీల ఆదాయాలు క్రమంగా మెరుగవుతాయని హెచ్డీఎఫ్సీ అనలిస్ట్ దేవర్‡్ష వకీల్ పేర్కొన్నారు. నిఫ్టీ 50 కంపెనీల షేర్వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.456గా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.651గా నమోదుకావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఆల్–టైమ్ హైకి కంపెనీల లాభాలు రూ. 1.60 లక్షల కోట్లకు నిర్వహణ లాభం క్రిసిల్ రిపోర్ట్ కంపెనీల నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 15 శాతం పెరిగి జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గి మార్జిన్లు పెరగడం, ఉత్పాదకత స్థాయిలు మరింతగా మెరుగుపడటం దీనికి కారణాలని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఎన్ఎస్ఈలో లిస్టైన 800 కంపెనీల(బ్యాంక్, ఆర్థిక, ఆయిల్, గ్యాస్ కంపెనీలను మినహాయించి) ఆర్థిక ఫలితాలను విశ్లేíÙంచి ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే... ► ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీల నిర్వహణ లాభం ఈ సెప్టెంబర్ క్వార్టర్లో రూ.1.60 లక్షల కోట్లకు పెరిగింది. ► కరోనా కల్లోలం కారణంగా ఆర్థిక వృద్ధి తిరోగమనంలో ఉన్నా కంపెనీల లాభాలు పెరగడం విశేషం. పెరుగుతున్న అసమానతలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ► ఈ క్యూ2లో ముడి పదార్థాల ధరలు పెరిగినప్పటికీ, నిర్వహణ లాభ మార్జిన్లు 1 శాతం మేర పెరిగాయి. ► ఉద్యోగుల వ్యయాలు తయారీ రంగ కంపెనీల్లో 4 శాతం తగ్గగా, సేవల రంగ కంపెనీల్లో ఓ మోస్తరుగా పెరిగాయి. ► నికర లాభాలు పెరిగినా, ఆదాయాల్లో మాత్రం పెరుగుదల లేదు. అయితే ఈ క్యూ1లో కంపెనీల ఆదాయాలు 29 శాతం మేర తగ్గగా, ఈ క్యూ2లో మాత్రం ఒకింత నిలకడగా ఉన్నాయి. ► ఆదాయాల పరంగా చూస్తే, పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీలపైనే అధికంగా ప్రభావం పడింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో టాప్ వంద కంపెనీల్లో 35% కంపెనీల ఆదాయం పెరిగింది. ఇదే కాలంలో 400 చిన్న కంపెనీల్లో 20% కంపెనీల ఆదాయం తగ్గింది. ► వినియోగం, కమోడిటీ ఆధారిత రంగాల్లోని పెద్ద కంపెనీలు అంతంత మాత్రం వృద్ధిని సాధించాయి. ఈ రంగాల్లోని చిన్న కంపెనీలు క్షీణతను నమోదు చేశాయి. ► చిన్న టెక్స్టైల్స్ వ్యాపార సంస్థలు, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ కంపెనీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. ► ఐటీ రంగంలోని చిన్నా, పెద్ద కంపెనీలు మాత్రం సీక్వెన్షియల్గా మంచి వృద్ధిని సాధించాయి. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
సాక్షి, ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... (జనవరి నుంచి కార్ల ధరలు మోతే!) మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్లో 137 కోట్ల డాలర్లు, మారిషస్లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్డీఐలను ఆకర్షించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... ► మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ► ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్లో 137 కోట్ల డాలర్లు, మారిషస్లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. ► ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. ► 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్డీఐలను ఆకర్షించాయి. ► గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
కరోనా అంతానికిది ఆరంభం
న్యూఢిల్లీ: భారత్లో తయారవనున్న రెండు కరోనా టీకాలు ‘కొవాక్సిన్’, ‘జైకొవ్– డీ’లకు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు అనుమతించడంతో కరోనా అంతం ప్రారంభమైనట్లయిందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కరోనా టీకాలు ప్రయోగదశలో ఉన్నాయని, అందులో 11 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని పేర్కొంది. భారత్లో కరోనా టీకాను రూపొందించేందుకు ఆరు సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపింది. వాటిలో కొవాక్సిన్, జైకొవ్–డీలకు మాత్రం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. ప్రముఖ ఆస్ట్రాజెనెకా(బ్రిటన్), మోడెర్నా(అమెరికా) ఫార్మా కంపెనీలతోనూ భారత కంపెనీలు ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయితే, అవి రూపొందించిన టీకాలు సురక్షితం, సమర్ధవంతమని రుజువు కావాల్సి ఉందని వివరించింది. కరోనా వైరస్కు టీకా ఆగస్ట్ 15 నాటికి సిద్ధమవుతుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ను సిద్ధం చేయడం సాధ్యం కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ‘కొవాక్సిన్’ను రూపొందించే పనిలో ఉంది. అలాగే, ‘జైకొవ్–డీ’ని రూపొందించేందుకు జైడస్ క్యాడిలా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటికి ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రయోగాలకు అనుమతి లభించింది. కొవాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ ముగిసేందుకే కనీసం 28 రోజులు పడుతుంది. ఆ తరువాత ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ ఎలా సిద్ధమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
దేశీ యాప్లపై దృష్టి
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్లో పాల్గొనాలని ప్రధాని మోదీ స్టార్టప్లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు. భారత్ తయారీ యాప్లు ప్రపంచ స్థాయిలో రాణించగలవని నిరూపించాలని ఆయన కోరారు. ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న భారతీయ యాప్లలో ఉత్తమమైన వాటిని గుర్తించి, ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం 59 చైనీస్ యాప్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రారంభించడం గమనార్హం. ఈ చాలెంజ్ ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టమ్ను రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ‘ఎవరికి తెలుసు?, మీరు రూపొందించిన ఈ యాప్లను నేను కూడా ఉపయోగించవచ్చునేమో’అని ఆయన లింక్డ్ ఇన్లో వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి ‘మేడ్ ఇన్ ఇండియా యాప్స్’ తయారు చేయాలని ఐటీ, స్టార్టప్ రంగాల వారిలో అపారమైన ఉత్సాహం ఉందని తెలిపారు. వీరి ఆలోచనలు, ఉత్పాదనలకు సరైన వేదిక కల్పించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ప్రారంభించాయన్నారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వారు గానీ, అలాంటి ఉత్పత్తులను సృష్టించే దృష్టి, నైపుణ్యం ఉన్న వారికి ఇది సాయపడుతుందని చెప్పారు. టెక్ రంగానికి చెందిన వారంతా ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. కోవిడ్ సృష్టించిన అనేక సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు ప్రధాని మోదీ.. వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ, విద్య రంగాలపై అధికారులతో సమీక్ష జరిపారు. బీజేపీ శ్రేణులకు ప్రశంస లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రధాని మోదీ అతిపెద్ద సేవా యజ్ఞంగా పేర్కొన్నారు. శనివారం ఆయన ఏడు రాష్ట్రాల బీజేపీ శాఖల నేతలతో ఆన్లైన్ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ కార్యక్రమంలో మాట్లాడారు. బుద్ధుని బోధనలు..నేటి సవాళ్లకు పరిష్కారాలు బుద్ధ భగవానుని బోధనలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఆషాఢ పూర్ణిమ నాడు పాటించే ధమ్మ చక్ర దినం సందర్భంగా ప్రధాని వర్చువల్ ప్రసంగం చేశారు. ఆశ, ప్రయోజన పూర్వక జీవితమే మానవ దుఃఖాలను దూరం చేసే మార్గమని బుద్ధ భగవానుడు సారనాథ్లో తన మొదటి సందేశంలోనే చెప్పారన్నారు. తోటి వారిలో జీవితం పట్ల ఆశను ప్రేరేపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్లో శుక్రవారం పర్యటన సందర్భంగా సింధు నది ఒడ్డున చేసిన సింధుపూజ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. -
155 కంపెనీలు.. 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: పెట్టుబడులు, భారీగా ఉపాధి కల్పన రూపంలో భారతీయ సంస్థలు అమెరికా ఎకానమీ వృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. భారత మూలాలున్న దాదాపు 155 కంపెనీలు అమెరికాలో 22 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. 1.25 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి. ’అమెరికా నేల, భారతీయ మూలాలు 2020’ పేరిట రూపొందించిన ఓ సర్వే నివేదికలో భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ అంశాలు వెల్లడించింది. అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా భారతీయ కంపెనీల పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాలు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చింది. అత్యధిక కంపెనీలు న్యూజెర్సీలో..: భారతీయ కంపెనీలు అత్యధికంగా న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, జార్జియా రాష్ట్రాల్లో ఉన్నాయి. పెట్టుబడుల పరంగా చూస్తే అత్యధికంగా టెక్సాస్ (9.5 బిలియన్ డాలర్లు), న్యూజెర్సీ (2.4 బిలియన్ డాలర్లు), న్యూయార్క్ (1.8 బిలియన్ డాలర్లు), ఫ్లోరిడా (915 మిలియన్ డాలర్లు), మసాచుసెట్స్ (873 మిలియన్ డాలర్లు)లో ఇన్వెస్ట్ చేశాయి. ఉపాధి కల్పన సంగతి తీసుకుంటే అత్యధికంగా టెక్సాస్లో 17,578 ఉద్యోగాలు, కాలిఫోర్నియా (8,271), న్యూజెర్సీ (8,057), న్యూయార్క్ (6,175), ఫ్లోరిడాలో 5,454 ఉద్యోగాలు కల్పించాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 77% కంపెనీలు వచ్చే అయిదేళ్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో, 83 శాతం కంపెనీలు మరింత మంది స్థానికులను రిక్రూట్ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. -
ఇవ్వడంలో మనదే పైచేయి
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం అమెరికా వెళ్లినా.. అక్కడే కంపెనీలు స్థాపించినా.. తమదే పైచేయని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యేగాని, తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సర్వీసెస్(నాస్కామ్) నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ, వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. ‘విన్ అండ్ విన్’జోడీ అయిన భారత్, అమెరికాలు వీసాల జారీతోపాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు. వాళ్లకు ఇస్తున్న జీతాలే ఎక్కువ భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే.. భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే... భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం 94,800 డాలర్లు. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం 96,300 డాలర్లు. ఈ లెక్కన, భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి 1,500 డాలర్లు ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అమెరికాలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ 52 కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అమెరికాకు చెందిన ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ వెల్లడించింది. 2018లో భారతీయ కంపెనీలు అమెరికన్లకు ప్రత్యక్షంగా 1.80 లక్షలు, పరోక్షంగా 3.40 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. అంటే 5.20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాదు, అమెరికాలో 2016లో 2.60 శాతం, 2018లో 3.80 శాతం ఉద్యోగాలు కల్పించాయి. వీసాల జారీలో మాత్రం చిన్నచూపు అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఇంతగా దోహపడుతున్నప్పటికీ భారతీయులకు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్–1బీ వీసాల జారీ మరింత కఠినతరంగా మారింది. ఇప్పటికే భారతీయుకలు ఎక్కువగా వీసాలు ఇస్తున్నామన్న అమెరికా వాదన అహేతుకమని నిపుణులు చెబుతున్నారు. 2016లో హెచ్–1బీ వీసాల కోసం అందిన భారతీయుల దరఖాస్తుల్లో 5 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2018లో దాదాపు 50 శాతం దరఖాస్తులను తిరస్కరించడం, 2020 జనవరి నాటికి 2 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా ‘జీడీపీ’కీ వెన్నుదన్ను అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2017లో అమెరికా జీడీపీకి అక్కడి భారతీయ కంపెనీలు 57.20 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. అమెరికా జీడీపీకి ఆ దేశంలోని ఆరు రాష్ట్రాలు సమకూర్చినదాని కంటే భారతీయ కంపెనీలే ఎక్కువ సమకూర్చ డం అసాధారణమని ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ పేర్కొంది. వీసాల జారీలో సమతుల్యత ఉండాలి భారతీయ కంపెనీలకు తగినన్ని వీసాలు జారీ చేయడం లేదు. అమెరికా వీసాల జారీలో భారత కంపెనీలు, బహుళ జాతి కంపెనీల మధ్య సమతుల్యత ఉండాలి. సమాన అవకాశాలు కల్పిస్తేనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. – కేశవ్ మురుగేశ్, నాస్కామ్ చైర్మన్ విరివిగా వీసాల జారీ.. ప్రయోజనకరం ‘భారతీయులు 50 ఏళ్లుగా అమెరికాలో సంపద సృష్టికర్తలుగా గుర్తింపు పొందారు. ఐటీ ఉద్యోగి నుంచి సీఈవో వరకు భారతీయులు నిరుపమాన సేవలు అందిస్తున్నారు. భారతీయులకు ఎంత విరివిగా వీసాలు జారీ చేసి ప్రోత్సహిస్తే మన దేశంతోపాటు అమెరికా కూడా అంతగా పురోభివృద్ధి సాధిస్తుంది. భారతీయుల వీసాల జారీకి కనీస వేతనాలకు బదులు వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రొ. పీవీజీడీ ప్రసాద్రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ -
ఫోర్బ్స్ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్ బెస్ట్ రిగార్డెడ్ కంపెనీస్’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలి్చతే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్ (105), ఎల్ అండ్ టీ(115), మహీంద్రా అండ్ మహీంద్రా (117), హెచ్డీఎఫ్సీ (135), బజాజ్ ఫిన్సర్వ్ (143), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (149), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (153) ), హెచ్సీఎల్ టెక్ (155), హిందాల్కో (157), విప్రో (168), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (204), సన్ ఫార్మా (217), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (224), ఐటీసీ (231), ఏషియన్ పెయింట్స్ (248) స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అత్యధిక స్థానాలను అమెరికా కైవసం చేసుకుంది. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా, ఇందులో 59 యూఎస్ కంపెనీలే. ఇక అంతర్జాతీయ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా టాప్లో.. ఇటాలియన్ కార్ల దిగ్గజం ఫెరారీ రెండవ స్థానంలో నిలిచాయి. -
జోరుగా కార్పొరేట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రాజకీయాంశాలపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి భారతీయ కంపెనీలు మరింతగా పెట్టుబడులు పెట్టడంపై ఆశావహంగా ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో దేశీ కార్పొరేట్ సంస్థలు 10 శాతం మేర అధికంగా ఇన్వెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నాయి. 100 మంది పైగా చీఫ్ స్థాయి అధికారులతో నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడైనట్లు అంతర్జాతీయ న్యాయ నిపుణుల ఏజెన్సీ బేకర్ మెకెంజీ వెల్లడించింది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో స్థిరమైన పాలన, దివాలా చట్టం.. స్థూల వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి తేవడం తదితర అంశాలు సానుకూల ధోరణులకు తోడ్పడుతున్నాయని తెలిపింది. ‘భారత్లో ఇన్వెస్ట్ చేయడంపై పలు అంతర్జాతీయ దిగ్గజాలు బులిష్గా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు భారత్, చైనాలను కీలక మార్కెట్లుగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు‘ అని బేకర్ మెకెంజీ ఇండియా ప్రాక్టీస్ విభాగం గ్లోబల్ హెడ్ అశోక్ లాల్వానీ తెలిపారు. ‘గడిచిన నాలుగైదేళ్లుగా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి నెలకొనడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలన, వ్యాపారాల సులభతర నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు జీఎస్టీ, దివాలా చట్టం అమలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇక మిగతా మార్కెట్లతో పోలిస్తే భారత్ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుండటం కూడా సానుకూలాంశం‘ అని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడులపైనా బులిష్గా.. అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే విషయం లోనూ దేశీ సంస్థలు బులిష్గా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్స్లో మూడింట రెండొంతులమంది తమ విదేశీ పెట్టుబడులను 10% పైగా పెంచుకోవాలని భావిస్తుండగా, మూడో వంతు ఎగ్జిక్యూటివ్స్ 10% దాకా పెంచుకోవాలని యోచిస్తున్నారు. భౌగోళిక.. రాజకీయాంశాలపరమైన సవాళ్లు, కరెన్సీపరమైన ఒత్తిళ్ల పరిస్థితుల్లో ఇది చాలా సానుకూలాంశమని బేకర్ మెకెంజీ తెలిపింది. కంపెనీల కొనుగోళ్ల విషయంలో కార్పొరేట్లు ముందుగా దేశీ మార్కెట్కు, ఆ తర్వాత ఆగ్నేయాసియా మార్కెట్కు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. ఆసియా పరిధి దాటితే అమెరికన్ సంస్థల కొనుగోళ్లపై దేశీ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. -
దేశీ ఫార్మా.. చలో చైనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో కీలక ముడి పదార్థాల కోసం చైనా మార్కెట్పై ఆధారపడుతున్న భారత కంపెనీలు... దాన్ని ఎగుమతి మార్కెట్గానూ చూస్తున్నాయి. అమెరికాలో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో... భారత ఫార్మా కంపెనీలకు కొత్త ఎగుమతుల మార్కెట్గా చైనా అవతరిస్తోంది. ఇటీవలి ఇరు దేశాధినేతల సమావేశం దీనికి మరింత ఊతమిచ్చినట్లు ఫార్మా సంస్థలు భావిస్తున్నాయి. చైనాలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని వ్యాపార అవకాశంగా మలిచేందుకు ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) హైదరాబాద్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అగ్రశ్రేణి సంస్థల ఉన్నతాధికారులతో పలు సమావేశాలనూ నిర్వహించింది. ఈ నేపథ్యంలో త్వరలో పలు వ్యాపార భాగస్వామ్యాలు సాకారం కానున్నట్లు తెలియవచ్చింది. భారత ఫార్మా ఎగుమతుల్లో చైనాతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి అనూహ్య వృద్ధి సాధ్యమేనని ఫార్మెక్సిల్ కృతనిశ్చయంతో ఉంది. చైనా ఎందుకంటే.. బీఎంఐ నివేదిక ప్రకారం చైనా ఫార్మా మార్కెట్ విలువ రూ.10.2 లక్షల కోట్లు. 2018లో ఇది రూ.10.4 లక్షల కోట్లకు, 2027 నాటికి రూ.27.2 లక్షల కోట్లకు చేరనుంది. ఇక జనరిక్స్ వాటా గతేడాది రూ.5.57 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత సంవత్సరం ఇది రూ.6.61 లక్షల కోట్లకు, 2022 కల్లా రూ.9.12 లక్షల కోట్లకు చేరుతుంది. ఈ డిమాండ్ను ఊహించిన అక్కడి ప్రభుత్వం విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. భారత్తో పోలిస్తే యా క్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్ల తయారీ ఖర్చు చైనాలో ఎక్కువ. ఈ రంగంలో వేతనాలూ ఎక్కువే. వైద్య ఖర్చుల భారం ప్రభుత్వంపై, ప్రజలపై తగ్గించాలన్న ఆలోచనలో భాగంగా చాలా ఔషధాలపై సుంకాన్ని ఎత్తివేసింది. అంటే చైనాకు మందులు ఎగుమతి చేసే కంపెనీపై పన్ను భారం ఉండదన్న మాట. భారత్ నుంచి ఎగుమతులు ఇలా.. భారత్ నుంచి ఫార్మా ఎగుమతులు ఏప్రిల్–సెప్టెంబరు పీరియడ్లో 12.37 శాతం వృద్ధి కనబరిచాయి. ఎగుమతులు రూ.60,590 కోట్ల నుంచి రూ.68,094 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజికల్స్ 13.66 శాతం, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 11.53 శాతం వృద్ధి చెందాయి. ఏప్రిల్– సెప్టెంబరులో రీజియన్ పరంగా ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియాన్లు టాప్లో ఉన్నాయి. దేశాల పరంగా చూస్తే యూఎస్ఏ, యూకే, సౌత్ ఆఫ్రికా, రష్యా, బ్రెజిల్, జర్మనీ, నైజీరియా, కెనడా, బెల్జియం ఒకదాని వెంట ఒకటి ముందు వరుసలో ఉన్నాయి. అడ్డంకులు తొలగిస్తే.. చైనా పరిస్థితులు భారత్కు అనుకూలంగా మారుతున్నట్లు ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘2017–18 ఏప్రిల్–సెప్టెంబరులో భారత్ నుంచి చైనాకు రూ.700 కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 11.7 శాతం వృద్ధితో రూ.781 కోట్లకు చేరింది. ఏపీఐలు ఎగుమతి చేయాలంటే చైనా ఎఫ్డీఏ అనుమతి తప్పనిసరి. దీనికి మూడేళ్లు పడుతోంది. అనుమతులను వేగంగా ఇవ్వాలని ఫార్మెక్సిల్ తరఫున కోరాం. యూఎస్, ఈయూ, జపాన్ అనుమతి ఉంటే.. ఆ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్లాంట్లకు గ్రీన్ చానెల్ రూట్లో ఏడాదిలోపే పర్మిషన్లను చైనా మంజూరు చేస్తోంది. దీన్నే భారత్కూ అమలు చేయాలన్నది మా డిమాండ్. ఫెర్మెంటేషన్ టెక్నాలజీలో ఇక్కడి కంపెనీలకు చైనా సాయం చేయాలి. మన కంపెనీలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రతిపాదనలను ఆ ప్రభుత్వం ముందు ఉంచాం’ అని రవి వివరించారు. ఇటీవల చైనాలో అక్కడి ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ఫార్మెక్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చైనా నుంచి 100, భారత్ నుంచి 27 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. దీంతో త్వరలోనే కొన్ని డీల్స్ సాకారం కానున్నట్లు తెలిసింది. -
బిలియన్ డాలర్ ‘యాపా’రం
న్యూఢిల్లీ : వినూత్న ఆవిష్కరణలతో భారత స్టార్టప్లు దూసుకెళుతున్న తీరు అగ్రదేశాలను సైతం అబ్బురపరుస్తోంది. పెరుగుతున్న యువ జనాభా, విచ్చలవిడిగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల వాడకం, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఆదాయాలతో సంప్రదాయ వాణిజ్య పోకడలకు భిన్నంగా ఇంటిముంగిటే అందిస్తున్న ఆన్లైన్ యాప్ సేవలకు ఆదరణ పెరిగింది. అటు వ్యాపార సంస్ధలకు, ఇటు కస్టమర్లకూ వెసులుబాటు కల్పించే బిజినెస్ మోడల్స్తో స్టార్టప్లు వినూత్న సేవలతో ముందుకురావడంతో వాటి విజయానికి ఆకాశమే హద్దుగా మారింది. పలు భారతీయ యాప్ల వ్యాపారం ఇప్పటికే బిలియన్ డాలర్ స్ధాయికి ఎదగడం ఇన్వెస్టర్ల చూపు మనవైపు మళ్లేలా చేస్తోంది. బీమా ప్రీమియం రూపురేఖలు మార్చిన పాలసీబజార్ ఎంతగా పాపులర్ అయిందో అక్షయ్ కుమార్ యాడ్ చేస్తే ఇట్టే అర్ధమవుతుంది. బీమా తీసుకోనందుకు మంచానపడిన వ్యక్తిని యమధర్మరాజు తీసుకువెళుతున్నట్టు వచ్చే ప్రకటన పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బీమా ప్రీమియం వసూళ్లలో తాము పారదర్శకత తీసుకువచ్చామని పాలసీబజార్ సీఈవో యశీష్ దహియా చెబుతారు. అమెరికా, చైనాలోనూ పాలసీబజార్ దూసుకుపోతోంది. పాలసీబజార్లో సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ పెట్టుబడులు పెట్టడంతో బిలియన్ డాలర్ (రూ 7000 కోట్లు) కంపెనీగా ఎదిగింది. ఊబర్, అమెజాన్ల స్ఫూర్తితో.. భారత్లో తొలి తరం యాప్లు విదేశీ బిజినెస్ మోడళ్లను అనుసరించినా ఆ తర్వాత వినూత్న సేవలు, ఉత్పత్తులతో ఉరకలెత్తాయి. క్యాబ్ సేవలు అందించే ఊబర్ తరహాలో ఓలా వచ్చినా, స్నాప్డీల్, అమెజాన్ల తరహాలో ఆన్లైన్ రిటైలర్గా ఫ్లిప్కార్ట్ అవతరించింది. చైనా డిజిటల్ వాలెట్ దిగ్గజం అలీపేను అనుసరించి పేటీఎంకు మార్గం సుగమమైందని చెబుతారు. ఇక మెట్రో సిటీల్లో నివసించని, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేని కస్టమర్లను ఆకట్టుకునేందుకూ నవతరం స్టార్టప్లు విస్తరణ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎదిగేందుకు ఇంకా కొన్ని పరిమితులున్నా విద్య, రవాణా, ఇతర పరిశ్రమల్లో సేవలు అందిస్తున్న నాలుగు యాప్ స్టార్టప్లు గత ఏడాదిలోనే బిలియన్ డాలర్ స్ధాయికి చేరుకున్నాయని అనాలిసిస్ కంపెనీ గ్రేహౌండ్ రీసెర్చికి చెందిన సంచిత్ విర్ గొజియా వెల్లడించారు. అవసరాలను గుర్తిస్తే అవకాశాలే.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని యూజర్లకు అవసరమైన సేవలు అందిస్తే వాణిజ్యపరంగా విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ బైజూస్ వ్యవస్ధాపక, సీఈఓ బైజు రవీంద్రన్ చెబుతున్నారు. దేశంలో చాలా స్కూళ్లు ఉపాధ్యాయులను నియమించుకుని జీతాలు చెల్లించే పరిస్థితిలో లేని కారణంగా వీడియో లెర్నింగ్ను ముందుకుతెచ్చి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు బైజూస్ శ్రీకారం చుట్టింది. మూడేళ్ల కిందట తాము తీసుకువచ్చిన యాప్కు ప్రస్తుతం 17 లక్షల మంది సబ్స్ర్కైబర్లున్నారని రవీంద్రన్ చెప్పారు. యాప్లో ప్రతినెలా 1,30,000 మంది విద్యార్ధులు చేరుతుండటంతో సంస్థ ఆదాయాలు ఈ ఏడాది మూడింతలయ్యాయని మార్చిలోనే సంస్థ బిలియన్ డాలర్ ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు. ఇక భారత సప్లయిచైన్, రవాణా వ్యవస్థలు అసంఘటిత పోకడలతో ఉండటంతో దళారీలు ఇష్టానుసారంగా చెలరేగే ధోరణికి ఉడాన్ రాకతో అడ్డుకట్టపడింది. రెండేళ్ల కిందట మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మార్కెట్ప్లేస్ యాప్ మేకర్ ఆన్లైన్లో 1,50,000 మంది బయ్యర్లు, సెల్లర్లను కలుపుతూ దూసుకుపోతోంది. ఎలక్ర్టానిక్స, దుస్తులు, ఇతర ఉపకరణాల అమ్మకాల రూపురేఖలను సమూలంగా మార్చేసింది. కస్టమర్లు, వ్యాపారులకు మధ్య పలు భారతీయ భాషల్లో ఛాట్ ఫీచర్ను ఉడాన్ తమ యాప్లో పొందుపరిచింది. ఓయో సంచలనం.. ట్రావెల్ స్టార్టప్ ఓయో హోటల్స్ కొద్దికాలంలోనే ఏకంగా ఐదు బిలియన్ డాలర్ల కంపెనీగా ఆవిర్భవించి అందరి దృష్టినీ ఆకర్షించింది. దేశంలోని హోటళ్లకు తమ బ్రాండ్ను తగిలించి ఆయా హోటల్ రూమ్లను తన వెబ్సైట్లో లిస్ట్ చేస్తూ ఓయో హాట్ యాప్గా మన్ననలు పొందింది. ఐదేళ్ల కిందట ట్రావెల్ స్టార్టప్గా అడుగులు వేసిన ఓయో ప్రస్తుతం 1,25,000 రూమ్లను లిస్ట్ చేస్తోంది. భారత్లోని మొత్తం హోటల్ ఇన్వెంటరీలో ఇది 5 శాతం కావడం గమనార్హం. దేశాన్ని మరింత సమర్ధవంతగా మలిచేందుకు కలలు కనే వ్యాపారవేత్తలు భారత్లో ఎంతోమంది ఉన్నారని ఈ యాప్ సృష్టికర్త 24 సంవత్సరాల రితేష్ అగర్వాల్ చెబుతున్నారు. చైనా, బ్రిటన్, దుబాయ్ల్లోనూ తనదైన శైలితో దూసుకెళ్లేందుకు ఓయో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. భారత్కు అనువైన బిజినెస్ మోడల్స్ ఇతర దేశాల్లో ఎంతవరకూ ఆదరణ పొందుతాయనేది వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల వెల్లువ.. భారత్లో యాప్ల వ్యాపారం భారీ వృద్ధితో దూసుకుపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు, వెంచర్ ఫండింగ్ సంస్ధలు పెట్టుబడుల ప్రవాహం కొనసాగిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్లు స్విజ్జీ, జొమాటోలు వెంచర్ ఫండింగ్ ద్వారా 500 మిలియన్ డాలర్లు సేకరించి, మరిన్ని నిధుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్ సహా ఇతర యాప్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తికనబరుస్తున్నారు. భారత్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే నష్టపోతామనే ధోరణి ఇన్వెస్టర్లలో కపిపిస్తోందని ఏంజెల్ ఇన్వెస్టర్ రవి గురురాజ్ విశ్లేషించారు. -
జై మోదీ, ఆలివ్ హెల్త్కేర్లపై ప్రపంచ బ్యాంక్ వేటు
వాషింగ్టన్ : పలు భారతీయ కంపెనీలు, పౌరులపై ప్రపంచ బ్యాంక్ వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పలు ప్రాజెక్ట్లను ఆయా కంపెనీలు చేపట్టకుండా నిషేధం విధించింది. అవినీతి, మోసాలకు పాల్పడుతున్నందుకు గాను, మొత్తం 78 భారతీయ కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. . ఇకపై ఈ కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రపంచ బ్యాంకు తన వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. భారత్కు చెందిన ఆలివ్ హెల్త్కేర్, జై మోదీ కంపెనీలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వాటిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలు బంగ్లాదేశ్లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాయి. ఆలివ్ హెల్త్పై 10 ఏళ్ల ఆరు నెలలు నిషేధం విధించగా.. జై మోదీని ఏడేళ్ల ఆరు నెలలు డిబార్ చేసింది.. అదేవిధంగా భారత్కు చెందిన ఏంజెలిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్పై కూడా నాలుగేళ్ల ఆరు నెలలు నిషేధం విధించింది. ఈ కంపెనీ ఇథియోపియా, నేపాల్లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్లో పాల్గొంటుంది. ఫ్యామిలీ కేర్పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ అర్జెంటీనా, బంగ్లాదేశ్ దేశాల ప్రాజెక్ట్లో ఉంది. ఇక భారత్లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్పై రెండేళ్లు, ఆర్కేడీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏడాది ఆరు నెలల పాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. వీటితో పాటు తత్వే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మాక్లోడ్స్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్పై ఏడాది కంటే తక్కువ కాలం నిషేధం విధించింది. ఈ 78 కంపెనీలతో పాటు మరో ఐదు కంపెనీలపై కూడా ఆంక్షలతో కూడిన నిబంధనలు విధించింది. ప్రపంచ బ్యాంక్ ఫండ్ చేసే ప్రాజెక్ట్ల్లో ఈ కంపెనీలు అవినీతి, మోసం, కుట్రలు, అవరోధాలకు పాల్పడుతున్నాయని తన నివేదికలో వెల్లడించింది. -
ఫోర్బ్స్ జాబితాలో 12 ఉత్తమ భారత కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 250 ఉత్తమ కంపెనీల జాబితాను ఫోర్బ్స్ రూపొందించగా.. 12 భారత కంపెనీలు ఇందులో స్థానం సంపాదించుకున్నాయి. 2018 ఏడాదికి రూపొందించిన ఈ జాబితాలో ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 31 వ స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (35), టాటా మోటార్స్ (70), టాటా స్టీల్ (131), ఎల్ అండ్ టీ (135), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ (154), జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (156), మహీంద్ర అండ్ మహీంద్రా (164), ఏషియన్ పెయింట్స్ (203), స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా (227), ఐటిసి (239) స్థానాల్లో నిలిచాయి. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ నిలిచింది. ఈ జాబితాలో 61 అమెరికన్ కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఆ తరువాత స్థానంలో 32 కంపెనీలతో జపాన్ చోటుదక్కించుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 19 చైనా కంపెనీలు, 13 ఫ్రాన్స్, 11 జర్మనీ కంపెనీలు ఉన్నాయి. -
మన స్టెంట్లూ మంచివే!
న్యూఢిల్లీ: విదేశాల్లో తయారయ్యే ఖరీదైన కరొనరీ స్టెంట్లు బాగా పనిచేస్తాయని దేశంలోని చాలామంది వైద్యులు, రోగుల్లో ఒక నమ్మకం ఉంది. దీంతోపాటు దేశీయ కంపెనీలు తక్కువ ధరకే మార్కెట్లోకి తెచ్చే స్టెంట్లు సమర్ధంగా పనిచేయవనే అపోహ ఉంది. అయితే, సామర్ధ్యం, నాణ్యత విషయంలో ఖరీదైన విదేశీ స్టెంట్లతో పోటీ పడగలిగే స్థాయిలో దేశీయంగా తయారైన స్టెంట్లు ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో తాజాగా నిరూపితమయింది. న్యూఢిల్లీలోని బాత్రా హార్ట్ సెంటర్కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఉపేందర్ కౌల్, నెదర్లాండ్స్ ప్రొఫెసర్ పాట్రిక్ సెర్రుస్తో కలిసి ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చి ఆర్గనైజేషన్(సీఆర్వో) సాయంతో టాలెంట్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలను ఇటీవల అమెరికాలోని శాన్డియాగోలో జరిగిన నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్–టీసీటీ (ట్రాన్స్ క్యాథెటర్ ఇంటర్వెన్షన్స్)లో వెల్లడించారు. సర్వేలో భాగంగా యూరోపియన్ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థల స్టెంట్లు అమర్చిన 1,500 మంది రోగులను పరిశీలించారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే అబాట్ సంస్థ తయారీ ఎక్సియన్స్ స్టెంట్తో, భారత్లో ఎస్ఎంటీ సంస్థ రూపొందించే సుప్రాఫ్లెక్స్ స్టెంట్లను పోల్చి చూశారు. పనితనం, సురక్షితం విషయంలో ఎక్సియన్స్తో సుప్రాఫ్లెక్స్ ఏమాత్రం తీసిపోదని ధ్రువపరిచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టెంట్ల కంటే భారత్లో తయారైనవి అంత సురక్షితం, సమర్ధవంతం కావని వైద్యులు, రోగుల్లో ఉన్న అపోహ తప్పని తేల్చారు. దేశంలో తయారయ్యే స్టెంట్లు అంత సమర్ధవంతంగా పనిచేయవన్న అపోహలను తొలగించేందుకే అంతర్జాతీయంగా పేరున్న సంస్థలతో విదేశాల్లో సర్వే చేపట్టినట్లు డాక్టర్ కౌల్ వివరించారు. దేశీ, విదేశీ స్టెంట్లను వాడిన రోగులపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనంలో భాగంగా కార్డియాక్ డెత్, టార్గెట్ వెస్సల్ ఎంఐ వంటి అంశాలు కూడా సమానంగా ఉన్నట్లు తేలిందన్నారు. గత ఏడాది కేంద్రం విదేశీ తయారీ కరొనరీ స్టెంట్ల ధరలపై పరిమితి విధించింది. ఫలితంగా రూ.1.30లక్షల వరకు ఉన్న విదేశీ స్టెంట్ల ధర రూ.35 వేలకు తగ్గిపోయింది. అంతేకాకుండా దేశీయ కంపెనీలు తయారు చేసిన స్టెంట్ల వినియోగం బాగా పెరిగిందని డాక్టర్ కౌల్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు తయారు చేసే స్టెంట్ల ధర భారాన్ని మోయలేని దేశాల వారికి ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురితం కానున్నాయన్నారు. మిగతా భారతీయ కంపెనీలు కూడా ఇటువంటి అధ్యయనాలు చేపట్టి.. విదేశీ తయారీ స్టెంట్లతో పోలిస్తే తమ స్టెంట్లు తీసిపోవని నిరూపించుకోవాలని కోరారు. గుండెలో మూసుకుపోయిన కరోనరీ ధమనుల్లో స్టెంట్లను అమర్చి రక్త ప్రవాహం సజావుగా సాగేలా చేస్తారు. -
విదేశీ పురుగు మందుల దాడి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పురుగు మందుల తయారీలో ఉన్న భారతీయ కంపెనీలకు ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్లు– 2017’ రూపంలో కొత్త కష్టాలు వచ్చాయి. బహుళజాతి సంస్థల వ్యాపారానికి మరింత ఊతమిచ్చే ఈ బిల్లు అమలులోకి వస్తే దేశీ కంపెనీల మనుగడ కష్టమేనని పరిశ్రమ చెబుతోంది. విదేశీ కంపెనీల మార్కెటింగ్ వ్యూహం ధాటికి ఇప్పటికే భారతీయ కంపెనీలు పోటీలో వెనుకపడ్డాయి. ఇక్కడి మార్కెట్లో ఎమ్మెన్సీలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. కీలకాంశం ఏమంటే 2007 తర్వా త దేశంలో కొత్తగా ఏ ప్లాంటూ ఏర్పాటు కాలేదు. ఆ స్థా యిలో విదేశాల నుంచి నేరుగా పురుగు మందులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా భారత్లోకి వచ్చిపడుతున్నాయి. నమోదు కాకున్నా విక్రయం.. ఇన్సెక్టిసైడ్స్ యాక్టు–1968 ప్రకారం భారత్లో పురుగు మందులు విక్రయించాలంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీలో మాలిక్యూల్ (రసాయనం) నమోదు తప్పనిసరి. సెక్షన్ 9(3) కింద ఈ నమోదు జరుగుతుంది. ఇదే మాలిక్యూల్ను భారత కంపెనీ తయారు చేయాలంటే సెక్షన్ 9 (4) కింద దరఖాస్తు సమర్పించాలి. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సెక్షన్ 9(4) కట్టడి చేస్తోంది. భారతీయ కంపెనీలు అదే ఉత్పాదనను తయారు చేయడంతో పోటీ పెరిగి ధర తగ్గేందుకు ఈ సెక్షన్ దోహదం చేస్తోంది. అయితే 2007 నుంచి బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకుండానే విదేశీ కంపెనీలు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయిస్తున్నాయి. మార్కెటింగ్కు భారీగా ఖర్చు చేస్తూ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రయోగాలు లేకుండానే.. ఒక్కో మాలిక్యూల్ పనితీరును విశ్లేషించేందుకు ప్రతి కంపెనీ మూడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు సీజన్లు వివిధ పంటలపై ప్రయోగం చేయాలి. ఈ ఫలితాలనుబట్టి మాలిక్యూల్ విక్రయానికి బోర్డు అనుమతినిస్తుంది. విదేశాల్లో తయారై భారత్కు వస్తున్న ఉత్పాదనలకు ఇటువంటి విధానం అమలు కావడం లేదు. వాటి నాణ్యత ప్రశ్నార్థకమనేని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్మాల్, మీడియం పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజమహేందర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. పైపెచ్చు ప్రొడక్టు ధర ఉత్పాదననుబట్టి 10 రెట్ల దాకా ఎక్కువని, దీంతో రైతులపై భారం పడుతోందని వివరించారు. దేశీయ కంపెనీలకు అండగా ఉన్న ఇన్సెక్టిసైడ్స్ యాక్టులో ఉన్న నిబంధనలు బిల్లులోనూ పొందుపరచాలని డిమాండ్ చేశారు. కొత్త ప్లాంటు ఊసే లేదు.. భారత్లో 2007 తర్వాతి నుంచి కొత్తగా ఒక్క ప్లాంటూ ఏర్పాటు కాలేదు. 10 విదేశీ సంస్థలు ఇక్కడి తయారీ ప్లాంట్లను ఇతర కంపెనీలకు విక్రయించి కేవలం మార్కెటింగ్కు పరిమితమయ్యాయని పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్, ఫార్ములేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ దవే చెప్పారు. ఎమ్మెన్సీలు 127 తుది ఉత్పాదనలనే నేరుగా భారత్లో అమ్ముతున్నాయి. ఇవన్నీ కూడా కొత్త మాలిక్యూల్సే కావడం విశేషం. ప్రస్తుతం 170 వరకు మాలిక్యూల్స్ దేశంలో అమ్ముడవుతున్నాయి. ఇందులో సుమారు 25 మాలిక్యూల్స్ను భారత కంపెనీలు తయారు చేస్తున్నాయి. మిగిలినవి కూడా ఉత్పత్తి చేసే సత్తా ఉన్నా, ఎమ్మెన్సీలు ఇందుకు సహకారం అందించడం లేదు. ఇదీ భారత మార్కెట్.. పురుగు మందుల ఉత్పత్తిలో కీలక రసాయనం అయిన మాలిక్యూల్స్ తయారు చేసే కంపెనీలు భారత్లో సుమారు 80 ఉంటాయి. ఫార్ములేషన్స్ (తుది ఉత్పాదన) రూపొందించే కంపెనీలు 2,000 ఉన్నాయి. దేశీయంగా రూ.18,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. ఇందులో దిగుమతుల వాటా రూ.7,000 కోట్లు. ఎగుమతులు రూ.15,000 కోట్లు ఉంటాయి. పరిశ్రమ ఏటా 7–10% వృద్ధి చెందుతోంది. 50 లక్షల మంది ఈ రంగంలో నిమగ్నం అయ్యారు. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో తయారీ లేదు. ఎమ్మెన్సీలు పూర్తిగా తమ ఉత్పాదనలతో చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఈ దేశాల సరసన భారత్ చేరడం ఖాయమని ఇక్కడి కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్లో పురుగు మందుల ధర 40% దాకా అధికం. -
అటకెక్కిన 7.63 లక్షల కోట్ల ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దరిద్రంగా ఉంది. ఈ కారణంగా గతేడాదిలో అంటే 2017, ఏప్రిల్ నెల నుంచి 2018 మార్చి వరకు 12 నెలల కాలంలో 7.63 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను కంపెనీలు మూలన పడేశాయి. గత మూడు నెలల కాలంలోనే ఆ ప్రాజెక్టుల్లో 40 శాతం అంటే, 3.3 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు మూలనపడ్డాయి. ఇంతగా ప్రాజెక్టులు మూలన పడడం దేశ చరిత్రలతోనే ఇది మొదటి సారి. ఈ వివరాలను ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం వరకు పాలనాపరమైన అనుమతులు రావడంలో జాప్యం జరిగి ప్రాజెక్టులు మూలన పడితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దిగజారి డిమాండ్ పడిపోవడంతో కొత్త ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడం లేదని ఇండియా రేటింగ్ అండ్ రీసర్చ్కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న కంపెనీల్లో కూడా ఎక్కువ కంపెనీలు 71.8 శాతానికి మించిన సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఈ విషయం ఆర్బీఐ 2017, జూలై–సెప్టెంబర్ మధ్య నిర్వహించిన త్రైమాసిక అధ్యయనంలో వెల్లడైంది. విద్యుత్, ఉక్కు రంగాల్లో డిమాండ్కన్నా ఉత్పత్తి ఎక్కువగా ఉండడంలో ఆ రంగాలు కూడా ఆశించిన పురోగతిని సాధించలేకపోతున్నాయని, కొత్త ప్రాజెక్టులు నిలిచిపోయాయని మరో ఆర్థిక విశ్లేషకుడు తెలిపారు. విద్యుత్ రంగంలో మిగులు సరఫరా వల్ల విద్యుత్ పంపిణీ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. అలాగే ఖర్చు పెరగడం, డిమాండ్ పడిపోవడంతో ఉక్కు రంగం కూడా మందగమనంతో నడుస్తోందని, రానున్న నెలల్లో ఈ రెండు రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ఊపిరి పోసుకునే అవకాశాలు లేవని పేరు బహిర్గతం వెల్లడించడానికి ఇష్టపడని నిపుణుడు తెలిపారు. భారతీయ కంపెనీల ఆర్థికాభివద్ధి గతేడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 16.4 శాతం ఉండగా, అది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 13.9 శాతానికి పడిపోయిందని సీఎంఐఈ డేటా తెలియజేస్తోంది. కార్పొరేట్ అప్పులు కూడా గతేడాది మార్చి నెల నాటికి ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. -
భారీగా తగ్గించిన హెచ్-1బీ వీసా దరఖాస్తులు
వాషింగ్టన్ : భారత ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా దరఖాస్తులను భారీగా తగ్గించినట్టు తెలిసింది. కేవలం కంపెనీలు మాత్రమే కాక విదేశీయులు సైతం అమెరికా కంపెనీలపై తక్కువ ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడైంది. ట్రంప్ కార్యాలయం చేపడుతున్న యాంటీ-ఇమ్మిగ్రేషన్ సిస్టమ్తో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని టాప్ సిలికాన్ వ్యాలీ న్యూస్పేపర్ పేర్కొంది. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ విషయంలో ట్రంప్ కార్యాలయం చాలా కఠినతరమైన ప్రక్రియను చేపడుతుందని శాన్ఫ్రాన్సిస్కో క్రోనికల్ ఎడిటోరియల్ బోర్డు పేర్కొంది. ఇటు ఇది దరఖాస్తులపైనా, అటు కంపెనీలపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో భారత కన్సల్టింగ్ సంస్థలు భారీగా హెచ్-1బీ వీసా ఫైలింగ్లను తగ్గించేసేయని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బీ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన టెక్నాలజీ కంపెనీలు ప్రతేడాది వందల కొద్దీ ఉద్యోగులను భారత్, చైనా దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అయితే ట్రంప్ కార్యాలయం మాత్రం ఈసారి విదేశీ ఉద్యోగులను తగ్గించడానికి హెచ్-1బీ వీసా విషయంలో కఠినతరమైన నిబంధనలను అమలు చేసింది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాల ఫైలింగ్లు భారీగా తగ్గిపోయాయి. అంతేకాక ఈ నిబంధనల వల్ల 26 శాతం కంపెనీలు తమ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నాయని, అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్లో ప్రస్తుతం ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులతో ఉద్యోగులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్టు శాన్ఫ్రాన్సిస్కో క్రోనికల్ పేర్కొంది. అయితే విదేశాల్లో జన్మించిన వర్కర్లు అమెరికా ఆర్థికవ్యవస్థకు మంచే చేకూరుస్తారని తెలిపింది. మంచి నైపుణ్యమున్న ఉద్యోగులను కంపెనీలు నియమించుకుంటే, అన్ని పరిశ్రమల్లో పోటీతత్వం పెరుగుతుందని పేర్కొంది. హెచ్-1బీ వీసాలకు డిమాండ్ తగ్గిపోతుండంతో, టెక్నాలజీ రంగంలో కావాల్సి ఉన్న 5,48,000 టెక్ ఉద్యోగాల విషయంలో కార్పొరేషన్లు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చాలా ఉద్యోగాలున్నాయని, కానీ వాటిని పూరించడానికే ఉద్యోగులు లేరని తెలిపింది. -
భారతీయ కంపెనీలతో అమెరికాలో లక్ష ఉద్యోగాలు
వాషింగ్టన్ : ఇంతకాలం తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ పలువురు అమెరికన్ అతివాదులు ఇండియన్లపై విద్వేష దాడులకు పాల్పడ్డారు. ఇంకా పాల్పడుతూనే ఉన్నారు. భారతీయ కంపెనీలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా పలు ఆంక్షలు విధించారు. కానీ అవన్నీ అపోహలేనని తేలిపోయింది. భారతీయ కంపెనీలు అమెరికాలోనూ ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తున్నాయి. అక్కడ భారతీయ సంస్థలు 1,13,000 ఉద్యోగాలు కల్పించినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్’ పేరిట ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)’ గతేడాది కాలానికి సంబంధించి ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత సంస్థలు అమెరికాలో భారీగా ఉద్యోగాలు కల్పించడంతోపాటు, మొత్తంగా 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగే కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా 147 మిలియన్ డాలర్ల నిధుల్ని కూడా మన సంస్థలు అందించాయి. అంతేకాదు, పరిశోధనలు, అభివృద్ధి కోసం 588 మిలియన్ డాలర్లు వెచ్చించాయి. దాదాపు వందకు పైగా భారత కంపెనీలు అమెరికా, అక్కడి సరిహద్దుల్లోని ప్యుర్టొరికో దీవిలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. దాదాపు 87 శాతం భారత సంస్థలు రానున్న ఐదేళ్లలో మరింత మంది స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థల్లో ఇండియన్ కంపెనీలు ముందంజలో ఉన్నాయని క్రిస్ వ్యాన్ అనే సెనేటర్ తెలిపారు. -
ఉపాధిలో న్యూజెర్సీ.. పెట్టుబడుల్లో న్యూయార్క్
వాషింగ్టన్: అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు పొరుగునున్న కరీబియన్ దీవి ప్యూర్టోరికోతో కలిపి దాదాపు 100 భారతీయ కంపెనీలు సేవలందిస్తున్నట్లు సీఐఐ తెలియజేసింది. ఇవి 1,13,423 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాయని, ఇవన్నీ కలిసి అమెరికాలో దాదాపు 18 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయని సీఐఐ వెల్లడించింది. ‘అమెరికా నేలపై భారత మూలాలు’ పేరుతో సీఐఐ వాషింగ్టన్లో విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాలు తెలియజేసింది. అగ్రరాజ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత కంపెనీలు 147 మిలియన్ డాలర్ల నిధులను అందించాయని, పరిశోధన, అభివృద్ధిపై 588 మిలియన్ డాలర్లను వెచ్చించాయని నివేదిక వెల్లడించింది. భారత కంపెనీలు అత్యధికంగా ఉపాధి కల్పించిన రాష్ట్రాల్లో న్యూజెర్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 8,572 మందిని భారత కంపెనీలు నియమించుకున్నాయి. టెక్సాస్లో 7,271 మందికి, క్యాలిఫోర్నియాలో 6,749 మందికి, న్యూయార్క్లో 5,135 మందికి, జార్జియాలో 4,554 మందికి ఉపాధి కల్పించాయి. ఇక భారత కంపెనీలు అధికంగా పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాల్లో న్యూయార్క్ ముందుంది. ఇక్కడ భారత కంపెనీలు 1.57 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. న్యూజెర్సీలో 1.56 బిలియన్ డాలర్లు, మసాచుసెట్స్లో 931 మిలియన్ డాలర్లు, కాలిఫోర్నియాలో 542 మిలియన్ డాలర్ల చొప్పున భారత కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. 87 శాతం భారత కంపెనీలు వచ్చే ఐదేళ్లలో మరింత మంది స్థానికులను నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. -
భారతీయ కంపెనీల వీసాల్లో తగ్గుదల
గతేడాది టాప్–7 భారత కంపెనీల్లో 37 శాతం తగ్గిన వీసాలు వాషింగ్టన్: అమెరికాలో తొలి ఏడు భారతీయ కంపెనీల హెచ్1బీ వీసా దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 2016లో 37 శాతం తక్కువగా హెచ్1బీ వీసాలకు ఆమోదం లభించింది. వాషింగ్టన్కు చెందిన ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడు కంపెనీల నుంచి మొత్తంగా 5,436 దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. 2015లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 4,674 హెచ్1బీ వీసాలు సంపాదించగా 2016లో ఈ సంఖ్య 2040కు పడిపోయింది. అంటే ఏకంగా 56 శాతం తగ్గిపోయాయి. విప్రో సైతం 2015తో పోలిస్తే 2016లో 52 శాతం తక్కువ వీసాలు సాధించింది. విప్రో 2015లో 3,079 వీసాలు పొందగా 2016లో కేవలం 1,474 వీసాలే వచ్చాయి. ఇన్ఫోసిస్కు 16శాతం తక్కువగా వీసాలు దక్కాయి. ఇన్ఫోసిస్కు 2015లో 2,830 వీసాలు రాగా, 2016లో కేవలం 2,376 వీసాలే వచ్చాయి. ఈ ఏడాది భారతీయ కంపెనీల వీసాలు మరింతగా తగ్గే వీలుందని నివేదిక అంచనావేసింది. నిబంధనలు మారడంతో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి డిజిటల్ సేవల రంగాల్లో స్థానికులకు మరింతగా ఉపాధి కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది. -
ఏడు టెక్ దిగ్గజాలకు భారీగా తగ్గిన వీసాలు
అనుకున్నంత పన్నైంది. ఓ వైపు నుంచి ట్రంప్ ప్రభావం మరోవైపు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటితో అమెరికాకు వెళ్లాలనుకునేవారి కలలు కల్లలవుతున్నాయి. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఏడు దేశీయ ఐటీ దిగ్గజాలకు హెచ్-1బీ వీసాలు భారీగా తగ్గిపోయాయి. 2015తో పోలిస్తే 2016 ఈ కంపెనీలకు హెచ్-1బీ వీసాలు 37 శాతం పడిపోయినట్టు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ కంపెనీలు ముందటేడాదితో పోలిస్తే 2016లో ఆమోదం పొందిన పిటిషన్లు 5,436 కోల్పోయినట్టు వాషింగ్టన్ కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ రిపోర్టు చేసింది. ఏడు భారత ఐటీ దిగ్గజాలకు 2016 ఆర్థిక సంవత్సరంలో కేవలం 9,356 కొత్త హెచ్-1బీ పిటిషన్లు మాత్రమే ఆమోదం పొందినట్టు పేర్కొంది. అంటే అమెరికా లేబర్ ఫోర్స్ లో కేవలం 0.006 శాతమేనట. రిపోర్టు ప్రకారం దేశీయ టాప్ టెక్ దిగ్గజం టీసీఎస్ కు ఆమోదం పొందిన కొత్త అప్లికేషన్లు 56 శాతం పడిపోయినట్టు తెలిసింది. అంటే గతేడాది 4674 ఉంటే 2016లో 2634 పిటిషన్లు కోల్పోయి, 2040మాత్రమే ఆమోదం పొందాయి. విప్రో పిటిషన్లు కూడా 2016, 15 మధ్యకాలంలో 52 శాతం తగ్గిపోయినట్టు వెల్లడించింది. అంటే ఈ కంపెనీ కూడా 1605 పిటిషన్లను కోల్పోయింది. ఇన్ఫోసిస్ కు 16 శాతం తగ్గాయి. ప్రభుత్వ డేటా ఆధారంగా లాభాపేక్ష లేని ఈ కంపెనీ వీటి రీసెర్చ్ చేపట్టింది. దేశీయ ఐటీ కంపెనీలు పొందుతున్న కొత్త హెచ్-1బీ వీసాలు మరింత తగ్గిపోనున్నాయని ఈ రిపోర్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి డిజిటల్ సర్వీసుల్లోకి ఇండస్ట్రీ మరలుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు వెల్లడైంది. కంపెనీలు కూడా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాలో స్థానిక వర్క్ ఫోర్స్ ను పెంచుతున్నాయని రిపోర్టు నివేదించింది. అయితే ఈ హెచ్-1బీ వీసాలు పడిపోవడం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన్నప్పటి నుంచి కాదని, ముందు నుంచీ ఉందని చెబుతోంది. కొత్త హెచ్-1బీ వీసాలు పొందిన టాప్ కంపెనీల్లో అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అసెంచర్, విప్రో, ఐబీఎం, అమెజాన్, టెక్ మహింద్రా, క్యాప్జిమినీ, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్ అమెరికా, ఇంటెల్, డెలాయిట్, గూగుల్, లార్సెన్ అండ్ టర్బో, ఆపిల్, సింటెల్, ఫేస్ బుక్, ఒరాకిల్, సిస్కో, మైండ్ ట్రి, గోల్డ్ మాన్ సాచ్స్, యూఎస్టీ గ్లోబల్, జేపీ మోర్గాన్ ఛేస్, స్టాన్ ఫోర్డ్, కేపీఎంజీ, యాహులు ఉన్నాయి. -
1.7 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించాయ్
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వీసా ప్రొగ్రామ్స్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ దేశాలను ఆకట్టుకోవడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆసియా-పసిఫిక్ రీజన్ లో భారత కంపెనీలు భారీగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. తక్కువ మంది భారతీయులకు వర్క్ పర్మిట్స్ తో ఈ తొమ్మిది దేశాల్లో కనీసం 1.7 లక్షల మందికి భారతీయ కంపెనీలు ఉద్యోగాలు సృష్టించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) ఒప్పందం కింద ఇటీవలే ఈ అంశం తెరపైకి వచ్చింది. చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియన్ దేశాలు ఈ ఒప్పందంలో భాగమై ఉన్నాయి. కేవలం భారతీయ నిపుణులు తమ ఆర్థికవ్యవస్థలకు సహకరించడమే కాక, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ వంటి టెక్ కంపెనీలు కూడా వేలకొలదీ ఉద్యోగాలను కల్పిస్తున్నాయని పేర్కొంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ భారతీయ ఉద్యోగులకు షాకిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ నిపుణులను అనుమతించే విషయంలో సింగపూర్ తన కమిట్ మెంట్ ను మరిచిపోయిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆస్ట్రేలియా కూడా విదేశీయుల వీసాల్లో కఠినతరమైన రూల్స్ తీసుకొస్తోంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధానితో డైరెక్ట్ గా మన ప్రధాని నరేంద్రమోదీనే చర్చించారు. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఫిలిఫిన్స్ లో కార్యకలాపాలు నిర్వహించే దేశీయ ఐటీ సంస్థలు స్థానికంగా 60వేల ఉద్యోగాలు కల్పించినట్టు తెలిసింది. కానీ కేవలం 1500-2000 మందికే వర్క్ ఫర్మిట్స్ అవసరం పడినట్టు వెల్లడైంది. -
సీనియర్ టెకీలపై వేటుకు భారీ కసరత్తు
బెంగళూరు: ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం మరింత వేగంగా దూసుకొస్తోంది. ఇండియాలో ఈ పరిస్థితి మరికాస్త తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం అటు ఉన్నతస్థానాల్లో, ఇటు దిగువస్థాయిలో ఉన్న వారందరినీ వెన్నాడుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్1 బి వీసా సంస్కరణల నేపథ్యంలో టాప్ ఐటీ సేవల సంస్థలు భారత్ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మరికొందరిని స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపిస్తోంది. ఊహించిన దానికంటేఎక్కువగా సుమారు 150 బిలియన్ డాలర్ల వృద్ధి మందగమనం తోపాటు, ట్రంప్ హైర్ అమెరికన్, బై అమెరికన్ నినాదం ఐటీ సంస్థలను ఈ వైపుగా కదిలిస్తున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కాగ్నిజెంట్ ఇటీవల ఆరువేల మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అగ్రశ్రేణి ఉద్యోగుల్లో 6వేలమంది ఉద్యోగాలను + లేదా దాని మొత్తం శ్రామిక శక్తిలో 2.3శాతం తగ్గించాలని భావిస్తోంది. ఇదే బాటలో మరో అతిపెద్ద సేవల సంస్థ ఇన్ఫోసిస్ కూడా కదులుతోంది. దాదాపు వెయ్యిమంది సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరనుందని మార్కెట్ వర్గాల అంచనా. వీరిలో గ్రూపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు , సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ స్థాయిల్లో డైరెక్టర్లు, మేనేజర్ల పనితీరు రిపోర్టును ఇన్ఫీ సమీక్షిస్తోంది. మూడు వారాల క్రితం విప్రో సీఈఓ అబిద్ ఆలీ నీమచ్వాల ఇంటర్నెల్ సమావేశాల్లో మాట్లాడుతూ ఆదాయాల వృద్ధి జరగకపోతే, సుమారు 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ సంస్థలోని ఇంజనీరింగ్ టీం పెద్ద ప్రమాదంలో పడినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో 1.81 లక్షల ఉద్యోగులను కలిగి ఉంది. ఫ్రెంచ్ ఐటీ సేవల సంస్థ కాప్ జెమిని కూడా సుమారు 9,000 మందిని, లేదా దాదాపు 5శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. వీటిలో ఎక్కువ భాగం 2015లో కాప్ జెమిని కొనుగోలు చేసిన ఐ గేట్ ఉద్యోగులు. అలాగే ముంబైలోని 35మంది వైస్ ప్రెసిడెంట్లు, ఇతర సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు మరియు సీనియర్ డైరెక్టర్లను దాదాపు 200 మంది రాజీనామా చేయాలని కాప్ జెమిని ఫిబ్రవరిలో కోరింది. మార్చి 31 నాటికి దీని మొత్తం ఉద్యోగులు 195,800 మంది. ప్రతి సంవత్సరం చేసే సమీక్షలో భాగంగా ఈ తొలగింపులనీ, 2017లో తమ ఉద్యోగుల్లోచాలామందికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణనిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నతీరుపై ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేశారు. అంతకంతకూ తీవ్రమవుతున్న ధోరణిపై వివిధ కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఐటి సేవలలో మందగమనం కారణంగా వివిధ ఐటి సంస్థలు ఆదాయాలను నష్టపోతున్నది వాస్తవం. ముఖ్యంగా కాగ్నిజెంట్ 20శాతం గ్రోత్లో ఈ సంవత్సరం 8-10శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. 2015-16లో 13.3 శాతంగా ఉన్న ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరగాలని ఆశిస్తోంది. టీసీఎస్ గత సంవత్సరం కేవలం 8.3శాతం మాత్రమే సాధించడం గమనార్హం. -
వచ్చే వాటికంటే పోయే ఉద్యోగాలే ఎక్కువ
న్యూఢిల్లీ: అమెరికా హెచ్ 1 బీ వీసాలను కఠినతరం చేయడం, ఆస్ట్రేలియా 457 వీసాలను రద్దు చేయడంతో ఉద్యోగాలు దొరికేదెట్లా అని భారతీయులు అప్పుడే ఆందోళన చెందుతున్నారు. ముందుంది అసలైన ముసుళ్ల పండగ అన్నట్లు ఉద్యోగాలు దొరక్క అలమటించే రోజులు, హాహాకారాలు చేసే రోజులు ముందున్నాయని పలు సర్వేలు, అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించడంలో కల్పతరువులాంటి ఐటీ రంగంలోనే గత రెండు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రమాద గట్టికలను మోగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేయగా, కొన్ని కంపెనీలు చాలా తక్కువ మందిని నియమించుకుంటున్నాయి. గతంతో పోలిస్తే మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తక్కువ సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. విప్రో మొదలుకొని లార్సన్ అండ్ టార్బో, హెచ్డీఎఫ్సీల వరకు కంపెనీల్లో లేఆఫ్లు సాధారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో స్టార్టప్ కంపెనీల శంకుస్థాపనలు వేల సంఖ్యలో పెరిగినా అవి కార్యరూపం దాల్చడం మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మనుగడలోవున్న కంపెనీల పెరుగుదల రెండు శాతం కూడా ఉండడం లేదు. అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా అక్కడి నుంచి భారత్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు పదింతలు పెరిగిందని ‘డిలైటీ టచే తోయిమస్త్సు ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న భారతీయుల్లో 60 శాతం ఉద్యోగులు భవిష్యత్తులో పనికి రాకుండాపోయే ప్రమాదం ఉందని ‘మ్యాక్కిన్సే అండ్ కంపెనీ’ వెల్లడించింది. అంటే కొత్త ఉద్యోగాలకంటే ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువన్న మాట. గతేడాది గణాంకాల ప్రకారం దేశంలో 1.70 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు 340 కోట్ల మంది ఉన్నారు. వారు రేపు పట్టాలు పుచ్చుకోగానే వారికి ఉద్యోగాలు కావాలి. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దేశంలో దాదాపు 26 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్కన 2028 వరకు దాదాపు 35 కోట్ల కొత్త ఉద్యోగాలు కావాలని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. అంటే రానున్న 11 ఏళ్లలో ఏడాదికి మూడు కోట్ల చొప్పున కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. 2016 సంవత్సరం లెక్కల ప్రకారం ఏడాదికి 1.40 కోట్ల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగావకాశాలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల సంఖ్య ఏడాదికి రెండింతలు పెరగాలంటే ఎంత కష్టమో ఊహించవచ్చు. ఈ అంశాలను దష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే భవిష్యత్ మీద దష్టి పెట్టి కార్యరంగంలోకి దిగితే తప్ప భవిష్యత్ భయానక పరిస్థితుల నుంచి బయటపడలేం. -
అన్నీ విద్వేష దాడులు కావు
- విదేశాల్లో భారతీయుల మృతిపై అప్రమత్తంగా ఉన్నాం - హెచ్1బీ వీసాలపై ఆంక్షలతో అమెరికాకు నష్టమే: సుష్మ న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై జరిగిన దాడులు, మరణాలన్నింటినీ విద్వేష చర్యలుగా పరిగణించకూడదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అమెరికాలో ఇటీవల భారతీయులపై వరుసదాడులపై రాజ్యసభలో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు సుష్మ సమాధానమిస్తూ.. విదేశాల్లో భారతీయుల మరణాలపై ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ప్రభుత్వం వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. దాడులపై అమెరికా అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని, విద్వేష కోణంలోనూ విచారణ కొనసాగుతుందన్నారు. కేసు పురో గతిపై అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని చెప్పారు. కాన్సస్లో శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై స్పందిస్తూ.. నిందితుడ్ని తర్వాతి రోజే పట్టుకున్నారని, అయితే కెంట్లో దీప్ రాయ్పై దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. దీప్ రాయ్ కేసు విద్వేష చర్యా? కాదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఆ కేసులో ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలిపారు. హర్నీష్ పటేల్ పై దాడిని అమెరికన్ పోలీసులు దోపిడీగా తేల్చారని సుష్మ పేర్కొన్నారు. మరో రెండు కేసుల వివరాల్ని వెల్లడిస్తూ.. ఒక కేసులో న్యూజెర్సీలో ఉన్న బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, అది విద్వేష చర్య కాదని వ్యక్తిగత, కుటుంబ అంశంమని వారు తెలిపారన్నారు. మరో కేసు కూడా విద్వేష చర్య కాదని అమెరికా అధికారులు తేల్చారని సుష్మ వెల్లడించారు. అమెరికాలో భారతీయుల హత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందన్న ప్రతిపక్షాల వాదనను ఖండించారు. విదేశాల్లో మరణించే ప్రతీ భారతీయుడి వివరాలు విదేశాంగ శాఖ వద్ద ఉన్నాయని, ఆయా వ్యక్తుల కుటుంబాలతో మాట్లాడుతున్నామని చెప్పారు. 1.5 లక్షల భారతీయులకు ఉద్యోగ వీసాలు 2016 నాటికి అమెరికాలో 1.5 లక్షల మంది భారతీయులకు ఉద్యోగ వీసాలు జారీచేశారని, అందులో 1.26 లక్షలు హెచ్1బీ వీసాలేనని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు చెప్పారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సమాచారం మేరకు దాదాపు 5.4 లక్షల మంది ఎన్నారైలకు గ్రీన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. గోయల్, సింధియా మధ్య వాగ్వాదం దేశంలో విద్యుత్ పరిస్థితిపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని సింధియా లేవనెత్తుతూ.. ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చినా ఇంతవరకూ 7 కోట్ల గృహాలకు విద్యుత్ సరఫరా లేదన్నారు. సింధియా ఆరోపణల్ని గోయల్ ఖండిస్తూ.. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరును సింధియా బయటపెట్టారని విమర్శించారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేశామని చెప్పారు. లక్షన్నర మందికి ఉపాధి హెచ్1బీ వీసాలపై ఆంక్షలు పెడితే భారత్కే కాకుండా అమెరికాకు నష్టమేనని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. హెచ్1బీ పరస్పర ప్రయోజన భాగస్వామ్యంగా ఆమె అభివర్ణించారు. భారత ఐటీ కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాల్ని కల్పించడమే కాకుండా ఆ దేశ ఆర్థిక రంగానికి సాయం చేస్తున్నారని చెప్పారు. అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారన్న వాదనలో వాస్తవం లేదని, భారతీయ కంపెనీలే అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని సభకు వెల్లడించారు. భారతీయ కంపెనీలు 1.56 లక్షల మంది అమెరికన్లకు ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతో పాటు, 4.11 లక్షల మందికి అనుబంధ ఉద్యోగావకాశాలు కల్పించాయని చెప్పారు. 2011 నుంచి 2015 మధ్యలో భారతీయ కంపెనీలు అమెరికాలో రూ. 13,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయని, అలాగే 1.32 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. సోషల్ సెక్యూరిటీ కోసం భారతీయ ఉద్యోగులు రూ. 45,500 కోట్లు చెల్లించారని చెప్పారు. భారత్లోని అమెరికన్ కంపెనీలు ఏటా 1.81 లక్షల కోట్ల ఆర్జిస్తున్నాయని వెల్లడించారు. -
దేశీయ కంపెనీలపై అది తగ్గిపోయింది!
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్న భారత్ లో వ్యాపార ఆశావాదం పడిపోతుంది. వ్యాపారా ఆశావాద విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో కెల్లా భారత్ కంపెనీలపైనే తక్కువ విశ్వసమున్నట్టు తెలిసింది. మార్కిట్ ఇండియా బిజినెస్ అవుట్ లుక్ నిర్వహించిన సర్వేలో గత నాలుగు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశీయ ప్రైవేట్ కంపెనీల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు వెల్లడైంది. 2016 అక్టోబర్ లో బిజినెస్ అవుట్ పుట్ పరంగా 25 శాతం కంపెనీలు ఆశావాదంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ శాతం 15గా ఉందని పేర్కొంది. గ్లోబల్ ట్రెండ్ లో విశ్వాసాన్ని పెంచుకోవడంలో కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి, కానీ బిజినెస్ సెంటిమెంట్ ఫిబ్రవరి నెలలో పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిస్ట్ పోలియన్న డి లిమా తెలిపారు. 12 దేశాల్లో భారత్ కంపెనీలే అతి తక్కువ స్థాయిలో నమోదైనట్టు పేర్కొన్నారు. తయారీరంగం, సర్వీసు సెక్టార్లలో రెండింటిలో వ్యాపార ఆశావాదం పడిపోతున్నట్టు సర్వే వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ విక్టరీ కంపెనీలపై విశ్వాసాన్ని పెంచుతాయని ఆశిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అంతేకాక ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేయడం ఇన్వెస్టర్లలో, కంపెనీల్లో సంస్కరణల ఆశలకు ఊతమిస్తుందని తెలిసింది. -
మనోళ్ల కొలువులకు పెనుగండం
సుమారు 88 వేల మంది ఐటీ ఉద్యోగాలపై కత్తి! హెచ్1బీ వీసాతో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు 3.5 లక్షలు ఇందులో 1.06 లక్షల మంది తెలుగువారే వీరిలో 83 శాతం మంది వేతనాలు 1.29 లక్షల డాలర్లలోపే సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ‘ట్రంప్’గండం వచ్చింది. హెచ్1బీ వీసాల నిబంధనల్లో అమెరికా అధ్యక్షుడు మార్పులు చేయడంతో లక్షలాది మంది భవిష్యత్తు అంధకారంలో పడింది. ఇప్పటికే అక్కడ ఉద్యోగం చేస్తున్న 1.06 లక్షల మంది తెలుగువారిలో ఏకంగా 83 శాతం మంది మెడపై కత్తి వేలాడుతోంది. అంటే దాదాపు 80 వేల మందికిపైగా స్వదేశానికి తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడనుంది. అమెరికాలో లక్షా 30 వేల డాలర్లు, ఆపైన వార్షిక వేతనం ఉంటేనే హెచ్1బీ వీసాపై ఉద్యోగం చేసుకోవడానికి అనుమతినిచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడంతో ఈ చిక్కు వచ్చిపడింది. అమెరికాలో ఈ వీసాపై మూడున్నర లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరే కాకుండా మూడేళ్లుగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ డిగ్రీ కోసం మరో మూడు లక్షల మంది వెళ్లారు. వీరందరి లక్ష్యం మాస్టర్ డిగ్రీ తర్వాత అక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం పొందడమే. ఇప్పుడు వీరంతా ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలే లక్ష్యం అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులు అక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలే లక్ష్యంగా వెళుతుంటారు. గతేడాది (2016)లో 1.65 లక్షల మంది, అంతకుముందు రెండేళ్ల (2014. 2015)లో కలిపి 1.35 లక్షల మంది భారత విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లారు. వారంతా ఇప్పుడు ఓపీటీపై వేర్వేరు కంపెనీల్లో 60 వేల డాలర్లు నుంచి 90 వేల డాలర్ల వరకు వేతనాలతో ఉద్యోగాలు చేస్తూ హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చట్టరూపం దాల్చగానే వీరంతా వెంటనే స్వదేశానికి బయలుదేరాల్సి ఉంటుంది. అర్హులు 13 శాతమే! అమెరికన్ కంపెనీలతోపాటు అక్కడి భారతీయ కంపెనీలల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 13 శాతం మాత్రమే 1.3 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్నారు. మిగతా 87 శాతం పరిస్థితి అగమ్య గోచరమే. ఇక ఉద్యోగాల్లేకుండా ఓపీటీపై ఉన్న వారు, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్న వారికి హెచ్1బీ వీసా పొందేందుకు కూడా అవకాశం ఉండదు. ప్రస్తుతం లాటరీ పద్ధతిన హెచ్1బీ వీసాలిచ్చే విధానాన్ని తొలగిస్తున్నారు. అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉండే 20 శాతం కోటా కూడా రద్దవుతుంది. అంటే 1.3 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ వేతనమున్న వారికి నేరుగా హెచ్1బీ వీసా లభిస్తుంది. అయితే మాస్టర్స్ డిగ్రీ చదివిన వారికి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 1.3 లక్షల డాలర్లు, ఆపై వార్షిక వేతనంతో ఉద్యోగం లభిస్తే వెంటనే వర్క్ వీసా లభిస్తుంది. పెద్ద కంపెనీ ఉద్యోగుల పరిస్థితి నయం ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. 1.3 లక్షల డాలర్లు, ఆపై వేతనం పొందుతున్న వారిలో 98 శాతం మంది ఈ కంపెనీల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. అక్కడి సాధారణ భారతీయ కంపెనీల్లో పనిచేయడానికి వెళ్లిన హెచ్1బీ, ఎల్1 వీసాదారుల్లో 98 శాతం మంది వేతనం 1.10 లక్షల డాలర్ల లోపే. అంటే ఈ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 2 శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగే అవకాశం ఉండనుంది. అమెరికా వర్సిటీలకు క్యూ కట్టిన భారత కంపెనీలు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్కడి భారతీయ ఐటీ కంపెనీలు స్థానికులను ఉద్యోగాల్లో చేర్చుకునే పనిలో పడ్డాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం వంటి కంపెనీలు డిసెంబర్ తొలి వారం నుంచే అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఎంపికకు టాలెంట్ హంట్లు నిర్వహిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను ఆ టాలెంట్ హంట్లకు హాజరుకానివ్వడం లేదు. అయితే అమెరికన్ విద్యార్థుల్లో సృజనాత్మకత అంతగా లేదని, అది తమకు ప్రతికూల అంశమని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. అక్కడి వారికి ఉద్యోగాలిస్తే ఇంత మొత్తంలో వేతనం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదు. అయితే ఎక్కువ వేతనం ఆఫర్ చేసినా కూడా అవసరమైన సామర్థ్యం, ప్రతిభ ఉన్న అమెరికన్లు్ల దొరకడం లేదని నాస్కాం ప్రతినిధి ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుత జఠిల పరిస్థితిని ఇక్కడి ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో బాలకృష్ణ మీడియాతో చెప్పారు. ఎవరికి లాభం? అమెరికా ప్రతిపాదిత వేతనం అమల్లోకి వస్తే 1.15 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్న భారతీయ ఉద్యోగులకు 1.30 లక్షల డాలర్ల వేతనం లభించే అవకాశాలున్నాయి. వారు ట్రంప్ ప్రతిపాదిం చిన వేతనానికి దగ్గరగా ఉండటంతో కంపెనీలు.. ఆ మేరకు వేతనాలు పెంచి, ఉద్యోగాలు కొనసాగించ వచ్చు. ఇదే జరిగితే మరో 15 శాతం మంది భారతీయ ఉద్యోగులు అక్కడే ఉండేందుకు వీలు కలుగుతుంది. కానీ అమెరికన్ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీల్లోనే ఈ అవకాశం ఉండనుంది. ఎందుకంటే అక్కడి భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈస్థాయి వేతనాలు ఇవ్వాలంటే కష్టమే! ఎవరెవరికి నష్టం? అమెరికాలోని ఐటీ కంపెనీల్లో దాదాపు 3.5 లక్షల మంది భారతీయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీలకు చెందినవారు 1.06 లక్షల మంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. మొత్తం భారతీయ ఉద్యోగుల్లో 13 శాతం అంటే సుమారు 50 వేల మంది మాత్రమే అక్కడ ఉం టారు. మిగతా మూడు లక్షల మంది స్వదేశం బాట పట్టాల్సి ఉం టుంది. ఇదే తెలుగువారి విషయానికి వస్తే 17 శాతం అంటే సుమారు 18 వేల మంది మాత్రమే 1.3 లక్షల డాలర్లు, ఆపై వేతనం పొందుతున్నారు. ఈ లెక్కన మిగతా 88 వేల మంది వరకు తిరుగుముఖం పట్టాల్సిందే! ఇందులో అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివి, ఉద్యోగాలు చేస్తున్న వారు 55 వేల మందికాగా.. మిగతావారు భారతీయ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారు. -
హెచ్-వన్ బీ వీసాలపై భారత క్రేజ్
వాషింగ్టన్ : అమెరికాలో హెచ్-వన్ బీ వీసాపై కఠినతరమైన చర్యలు అమలులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో పనిచేయడాకి అవకాశాలు కల్పించాలని కోరుతూ దాదాపు 2 లక్షల 50 వేల పిటిషన్లు భారత్ నుంచే వచ్చినట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది.వీటిలో చాలావరకూ భారత ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. గతేడాది ఈ పిటిషన్లు 2 లక్షల 30 వేలు ఉంటే, ఈ ఏడాది అవి 2 లక్షల 50లుగా నమోదైనట్టు బిల్ స్టాక్, ఇన్ కమింగ్ ప్రెసిడెంట్ ఆప్ అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తెలిపింది.కానీ ఈ పిటిషన్లలో కేవలం 85 వేల మందికే యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ హెచ్-వన్ బీ వీసాలను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. అమెరికన్ బిజినెస్, ఉద్యోగులను, ఆర్థిక వ్యవస్థను దష్టిలో ఉంచుకుని హెచ్-వన్ బీ వీసాలను సమీక్షించనున్నట్టు అధికారులు చెప్పారు. హెచ్-వన్ బీ వీసాల కేటగిరీలో కఠినమైన నిబంధనలు పెరుగుతున్న కొద్దీ భారత కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. చాలా భారత ఐటీ కంపెనీలు హెచ్-వన్ బీ వీసాలపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. ఉద్యోగులను ప్రాజెక్టు పనిపై ఇక్కడికి పంపిస్తున్నారు. పిటిషనర్లకు సంబంధించిన పిటిషన్ ఫీజులను కూడా కంపెనీలే భరిస్తున్నాయి. -
సైబర్ ఎటాక్ లో 72శాతం భారత కంపెనీలు
ముంబయి: భారత్ లో కంపెనీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సైబర్ ఎటాక్ లకు లోనవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. ఇప్పటి వరకు మొత్తం 72శాతం భారత కంపెనీలు సైబర్ ఎటాక్ కు గురయ్యానని, వాటి నుంచి బయటపడేందుకు అవి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఏపీఎంజీ సైబర్ క్రైం సర్వే నివేదిక-2015 తేల్చింది. ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ ఈ ఎటాక్ కు గురవుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 'ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 72శాతం కంపెనీలు సైబర్ దాడులకు గురయ్యాయి. తమ సంస్థలకు అతిపెద్ద ప్రమాదం సైబర్ దాడుల వల్లే వస్తుందని 94శాతం కంపెనీలు తెలియజేశాయి' అని సర్వే తెలిపింది. -
రానుంది.. కొలువుల జాతర!
కంపెనీల సన్నాహాలు: సర్వే న్యూఢిల్లీ : భారతీయ కంపెనీలు అధిక మొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాయి. అలాగే కంపెనీలు ఉద్యోగుల వేతనాలను పెంచాలని భావిస్తున్నాయి. ఈ విషయాలు కెరీర్బిల్డర్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్న కాలంలో శాశ్వత ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు 73% కంపెనీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 60% కంపెనీలు తెలిపాయి. దాదాపు 46% మంది వర్కర్లు ఉద్యోగ బదిలీ వేటలో ఉన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఉద్యోగుల వేతనాలను పెంచాలని దాదాపు 86% కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల ప్రారంభ జీతాన్ని ఐదు శాతంపైగా పెంచాలనే ఉద్దేశంలో 57% కంపెనీలు ఉన్నాయి. రానున్న కాలంలో కస్టమర్ సర్వీసెస్, సేల్స్, మార్కెటింగ్, ఐటీ, తయారీ, ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో అధిక ఉద్యోగ నియామకాలు నమో దు కానున్నాయి. అలాగే మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి తదితర విభాగాల్లో కూడా నియామకాల జోరు కనిపించనుంది. -
ఓఎఫ్ఎస్ ద్వారా
రూ.77 వేల కోట్లు న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో భారీగా నిధులు సమీకరించాయి. 2012, ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 129 కంపెనీలు ఓఎఫ్ఎస్ విధానంలో రూ.77,023 కోట్ల నిధులు సమీకరించాయని ఒక నివేదిక వెల్లడించింది. దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా రూ.63,576 కోట్లు(82 శాతం)గా ఉంది. కేంద్రప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియకు బాగా ఉపయోగపడిన ఈ ఓఎఫ్ఎస్ విధానాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2012, ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది. -
నేపాల్ భూకంప ప్రభావం లేదు: భారత కంపెనీలు
న్యూఢిల్లీ: నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడలేదని భారతీయ కంపెనీలు పేర్కొన్నాయి. తమ ఫ్యాక్టరీ భవనానికి కొద్దిగా బీటలు వచ్చాయి తప్ప.. ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ వెల్లడించింది. భూకంపం తర్వాత తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోకకోలా ఇండియా తెలిపింది. ఐటీసీ వర్గాలు కూడా తమ ప్లాంట్లకు ఎలాంటి నష్టంవాటిల్లలేదని తెలిపాయి. -
పెరుగుతున్న బ్రాండ్ల ‘సోషల్’ ప్రచారం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే భారత కంపెనీల సంఖ్య పెరుగుతోంది.సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ప్రాధాన్యం, విస్తరణ పెరిగిపోతుండడమే దీనికి కారణమని ఎర్నస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇండియా ఇండియా ట్రెండ్స్ పేరుతో ఒక నివేదికను వెలువరించింది. 2013లో సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసిన కంపెనీల సంఖ్య 78 శాతంగా ఉందని, ఈ ఏడాది ఈ సంఖ్య 90 శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ కంపెనీలు తమ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్లో 15 శాతం వరకూ సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఖర్చు పెట్టనున్నాయని వివరించింది. -
9.5 లక్షల కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఉద్యోగార్ధులకు, ఉద్యోగులకు ఈ ఏడాది అద్బుతంగా ఉండనున్నదని వివిద హెచ్ఆర్ సంస్థలు అంటున్నాయి. భారత్లోని కంపెనీలు 9.5 లక్షల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నాయని, అలాగే మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు వేతనాల పెంపు 40 శాతం వరకూ ఉండొచ్చని ఈ సంస్థ అంటోంది. మైహైరింగ్క్లబ్డాట్కామ్, యాస్పైరింగ్ మైండ్స్, హే గ్రూప్, ఏఆన్ హెవిట్, గ్లోబల్ హంట్, ఆబ్సొల్యూట్ డేటా ఎనలిటిక్స్, పీపుల్ స్ట్రాంగ్ హెచ్ఆర్ సర్వీసెస్, టాల్వ్యూడాట్కామ్ తదితర సంస్థల అంచనాలు ఇలా... ఈ ఏడాది వివిధ రంగాల్లో 9.5 లక్షల వరకూ కొత్త ఉద్యోగాలు వస్తాయి. వీటిట్లో ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో వేతనాల సగటు పెరుగుదల 10-12 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇది 15-20 శాతంగా ఉండనున్నది. కొత్తగా వచ్చిన ఈ కామర్స్ వంటి రంగాల్లో మరింతగా వేతన పెరుగుదల ఉండొచ్చు. జీడీపీ 5.5 శాతానికి పెరగవచ్చన్న అంచనాలతో వివిధ వ్యాపారాలు వృద్ధి బాటన పడతాయి. దీంతో భారీగా ఉద్యోగాలు వస్తాయి. తాజా పట్టభద్రులకు గత మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఉద్యోగవకాశాలు ఈ ఏడాది రానున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ, ఐటీఈఎస్, రిటైల్ రంగాల్లో వీరికి మంచి ఉద్యోగవకాశాలు అధిక స్థాయిలో లభించనున్నాయి. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని చెబుతుండటంతో ఇంజినీరింగ్, కన్సల్టింగ్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక జీతాల పెంపు విషయానికొస్తే ప్రతిభ గల ఉద్యోగుల జీతాలు 20-40% వరకూ పెరగవచ్చు. భారత కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను సగటున 10-18 శాతం వరకూ పెంచే అవకాశాలున్నాయి. -
ఉందిలే ‘కొలువుల’ కాలం...
⇒కొత్త ఏడాదిలో 3-5 లక్షల కొత్త ఉద్యోగాలు ⇒వేతనాలూ బాగానే పెరుగుతాయి ⇒వివిధ హెచ్ఆర్ సంస్థల అంచనాలు న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో కొత్త కొలువులు కళకళలాడనున్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల వేతనాలను కూడా భారత కంపెనీలు సముచిత రీతిలో పెంచనున్నాయి. 2015 సంవత్సరంలో 3-5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని వివిధ మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు, జాబ్ కన్సల్టెన్సీ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ఏఆన్ హెవిట్, హే గ్రూప్, మెర్సర్ వంటి అంతర్జాతీయ సంస్థలు టీమ్లీజ్ సర్వీసెస్, మ్యాన్పవర్ గ్రూప్, స్టాఫింగ్ ఫెడరేషన్ వంటి ప్రముఖ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం... ⇒భారత కంపెనీలు వచ్చే ఏడాది తమ సిబ్బంది సంఖ్యను 15-20 శాతం వరకూ పెంచుకోనున్నాయి. ఈ ఏడాది ఇది 10-12% స్థాయిలో ఉంది. ⇒వచ్చే ఏడాది వేతనాలు సగటున 10-12% పెరగనున్నాయి. ఈ ఏడాది వేతనాల పెరుగుదల 8-10 శాతం రేంజ్లో ఉంది. ప్రతిభ గల ఉద్యోగులకు కొన్ని రంగాల్లో రెండంకెల వేతన వృద్ధిని(30 శాతం వరకూ కూడా) కంపెనీలు ఆఫర్ చేయనున్నాయి. ⇒కేంద్రంలో సుస్థిరమైన కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడింది. దీంతో కొలువుల విషయంలో ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది బాగా ఉండబోతోంది. ⇒ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సానుకూలమైన బిజినెస్ సెంటిమెంట్ కొనసాగుతోంది. ⇒మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుస్తామన్న వాగ్దానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిలుపుకుంటే పలు విదేశీ సంస్థలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. దీంతో మరిన్ని ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ⇒ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, తయారీ, ఇంజనీరింగ్, రిటైల్ రంగాల్లో అధిక సంఖ్యలో కొత్త కొలువులు రానున్నాయి. టెలికం, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవలు తదితర రంగాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో కొత్త ఉద్యోగాలొస్తాయి. ⇒ప్రతిభ గల ఉద్యోగులు తమను వదలిపోకుండా కంపెనీలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. వేతనాలు పెంచడమే కాకుండా, వైద్య, ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నాయి. ⇒ప్రతిభ గల ఉద్యోగులను తయారు చేసుకోవడానికి వివిధ కాలేజీ భాగస్వామ్యంతో కంపెనీలు టాలెంట్ పూల్ను ఏర్పాటు చేస్తున్నాయి. -
23% పెరగనున్న కొలువులు
ముంబై: భారత కంపెనీలు వచ్చే ఏడాది 23 శాతం అధికంగా ఉద్యోగాలనివ్వనున్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2015 వెల్లడించింది. అంతర్జాతీయ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వీబాక్స్, భారత హెచ్ఆర్ అవుట్సోర్సింగ్, రిక్రూట్మెంట్ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్, ప్రొఫెషనల్ ఆన్లైన్ నెట్వర్క్ లింకెడిన్, సీఐఐలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం..., వచ్చే ఏడాది ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అధికంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ రంగాల్లో 50 శాతం అధికంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు రంగాల తర్వాత బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రంగాలు అధికంగా ఉద్యోగాలు కల్పిస్తాయి. తయారీ, టెలికాం, ఫార్మా రంగాల్లో హైరింగ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. కార్యకలాపాలు నిర్వహించడానికి న్యూఢిల్లీ, ముంబై నగరాలు అనువైనవిగా పలు కంపెనీలు భావిస్తున్నాయి. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాధాన్యతా ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన విధానాల కోసం ఈ రెండు రాష్ట్రాలు సంస్కరణలు తెస్తున్నాయి. యువకులకే ఉద్యోగాలివ్వాలని 72 శాతానికి పైగా కంపెనీలు భావిస్తున్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది హైరింగ్లో పురుషులు, మహిళ ఉద్యోగుల వాటా 76:24 గా ఉండగా, ఈ ఏడాది 68:32 శాతంగా ఉంది. అయితే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, బీపీఓ, ఆతిధ్య రంగాల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2.7 లక్షల ఉద్యోగవకాశాలు ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ కొత్త కార్యాలయాల స్పేస్ లీజింగ్ 23 మిలియన్ చదరపుటడుగులుగా ఉందని ప్రోపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తెలిపింది. హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, కోల్కత, చెన్నై, బెంగళూరు, పుణేలో వచ్చిన ఈ కొత్త ఆఫీస్ స్పేస్ లీజింగ్ కారణంగా 2.7 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించింది. ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు అధికంగా కొత్త కార్యాలయాలను ప్రారంభించాయని ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, తయారీ, ఇంజినీరింగ్, కన్సల్టింగ్, రీసెర్చ్ రంగాలు ఉన్నాయని వివరించింది. బెంగళూరులో అధికంగా ఉద్యోగావకాశాలు వస్తాయని, ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్లు ఉంటాయని పేర్కొంది. -
రక్షణ రంగంలో ఎఫ్డీఐ పరిమితి 49%కి పెంపు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. మిలిటరీ హార్డ్వేర్ అవసరాల్లో 70 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఈ చర్య ఉద్దేశం. భారతీయుల యాజమాన్యం, అజమాయిషీలోని భారతీయ కంపెనీలు మాత్రమే 49 శాతంలోపు ఎఫ్డీఐకి అనుమతి కోరాలని కేంద్రం నిబంధన విధించింది. అంతకుమించిన ఎఫ్డీఐ ప్రతిపాదనలకు రక్షణపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ అనుమతి పొందాల్సి ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు అందుబాటులోకి తెచ్చే ఇలాంటి ప్రతిపాదనలను కేసుల వారీగా కమిటీ పరిశీలిస్తుందని పారిశ్రామిక విధానం, అభివృద్ధి విభాగం (డీఐపీపీ) ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా పెంచిన ఎఫ్డీఐ పరిమితిలో ఎఫ్ఐఐలు, ఎఫ్పీఐలు, ఎన్నారైలు, ఫారిన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులన్నీ కలిసే ఉంటాయి. -
భారత కంపెనీలు..వ్యాక్సిన్ హీరోలు
దావోస్: భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కంపెనీలు వ్యాక్సిన్లను తక్కువ ధరకు అందిస్తున్నాయని ప్రపంచ కుబేరుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఒక్క డోస్ వ్యాక్సిన్ను ఒక్క డాలర్లోపు ధరలకు అందించడం ద్వారా చిన్నారులను ప్రాణాంతక వ్యాధులనుంచి ఈ కంపెనీలు రక్షిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి వచ్చిన ఆయన డబ్ల్యూఈఎఫ్ బ్లాగ్లో ఈ విషయాలు వెల్లడించారు. గతంలో మనమెన్నడూ వినని కొన్ని కంపెనీలు- సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్, తదితర కంపెనీలు అంతర్జాతీయంగా ఆరోగ్యాన్ని పెంపొందించే తమ భాగస్వామ్య కంపెనీల్లో కొన్నని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం పట్ల గతంలో కంటే ఎక్కువ భరోసాని ఈ వ్యాక్సిన్ కంపెనీలు కల్పిస్తున్నాయని బిల్గేట్స్ పేర్కొన్నారు. అధిక నాణ్యత గల వ్యాక్సిన్లను చౌక ధరలకే ఈ కంపెనీలు అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. -
ఇక దిశ-దశ విదేశీయమే!
న్యూఢిల్లీ: దేశీయ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాల సీజన్ దాదాపు ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ అంశాలపైనే ఆధారపడనున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు ఈ వారం స్టాక్ మార్కెట్ల నడకను నిర్దేశించనున్నాయని పేర్కొన్నారు. అయితే రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఫలితాల అంచనాలు కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చునని వివరించారు. వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల అంచనా. నిఫ్టీకి 5,900 పాయింట్ల స్థాయి కీలకం ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి గరిష్ట శ్రేణిలో 5,900-6,000 పాయింట్లు కీలక మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ డెరైక్టర్ రజత్ రాజ్గారియా పేర్కొన్నారు. అయితే సమీప కాలానికి మార్కెట్లు స్వల్పస్థాయి కదలికలకే పరిమితం కావచ్చునని చెప్పారు. ఆర్థిక వృద్ధి గాడినపడుతున్న సంకేతాలు, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ట్రెండ్ను నిర్దేశించవచ్చునని అంచనా వేశారు. పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లకు ఎలాంటి ప్రోత్సాహాన్నివ్వలేదని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు నిధి సరస్వత్ అభిప్రాయపడ్డారు. దీంతో విదేశీ సంకేతాలు, కరెన్సీ కదలిక లే సమీప కాలానికి ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చునని చెప్పారు. మేలు చేసిన యెలెన్: సహాయక ప్యాకేజీలు కొనసాగుతాయంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్కు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న జానట్ యెలెన్ చేసిన వ్యాఖ్యలు వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రోత్సాహాన్నిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యెలెన్ను ఫెడ్ చైర్మన్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బెన్ బెర్నాంకీ స్థానంలో యెలెన్ బాధ్యతలను స్వీకరించనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకున్న బలమైన సంకేతాలు కనిపించేటంత వరకూ నెలకు 80 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలుతో చేపడుతున్న సహాయక ప్యాకేజీని కొనసాగిస్తామని యెలెన్ గురువారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రివ్వున ఎగశాయి. సెన్సెక్స్ 205 పాయింట్లు పుంజుకుని 20,399 వద్ద నిలవగా, నిఫ్టీ 67 పాయింట్లు జంప్చేసి 6,056 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ప్యాకేజీ ఉపసంహరణ ఆందోళనలతో వారం మొత్తంలో నికరంగా 267 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. కాగా, శుక్రవారం ట్రేడింగ్లో డాలరుతో మారకంలో రూపాయి కూడా కాస్త(0.3%) బలపడి 63.11 వద్ద ముగిసింది. కరెంట్ ఖాతా లోటు అంచనాలకంటే తక్కువగానే నమోదవుతుందంటూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ ఇచ్చిన హామీ ఇందుకు దోహదపడింది. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు ఈ నెలలోనూ రూ. 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయ్. ఈ నెలలో ఇప్పటి వరకూ నికరంగా రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలు, నెలకు 80 బిలియన్ డాలర్లతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఇకపై కూడా కొనసాగుతాయన్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ నెల 1-12 కాలంలో 64.5 కోట్ల డాలర్ల(రూ. 4,002 కోట్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ రూ. 28,700 కోట్ల పెట్టుబడులను స్టాక్స్ కొనుగోలుకు వెచ్చించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 92,936 కోట్లకు(16.8 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. అయితే మరోవైపు ఇదే కాలంలో డెట్ మార్కెట్ల నుంచి రూ.54,225 కోట్లను పసంహరించుకున్నారు. -
మోసాల నివారణ శైశవ దశలోనే...
న్యూఢిల్లీ: భారత కంపెనీల్లో మోసాలను అరికట్టే యంత్రాంగం ఆశించిన మేరకు పనిచేయడం లేదని ఎర్నస్ట్ అండ్ యంగ్ తో కలిసి ఆసోచామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలను వేరే మార్గాల ద్వారా ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. మరిన్ని వివరాలు..., కంపెనీకి ఆర్థికంగా నష్టాలు కలుగజేయడం, లేదా కంపెనీ పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయడం వంటివి -ఇలాంటి మోసాలే కంపెనీల్లో అధికంగా జరుగుతున్నాయి. ‘‘విజిల్ బ్లోయింగ్’’(అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం) విధానం భారత్లో ఇంకా శైశవదశలోనే ఉంది. ఈ విధానాన్ని భారత కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. అమెరికా తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని కంపెనీల బిల్లులో నిర్దేశించారు. గత డిసెంబర్లో లోక్సభ ఆమోదం పొందిన ఈ కంపెనీల బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఆమోదం పొందే అవకాశాలున్నాయి. వ్యయాలను అధికం చేసి చూపడం, కొనుగోలు ఆర్డర్లలో గోల్మాల్ చేయడం, ఇతర అవకతవకలను టెక్నాలజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఈ దిశగా భారత కంపెనీల ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.