Jeevitha Rajasekhar
-
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
రజనీకాంత్ 'లాల్ సలాం' ట్రైలర్ విడుదల
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లాల్ సలాం'. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్లో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఫిబ్రవరి 9న లాల్ సలాం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల స్పీడ్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమళ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రజనీ పాత్ర ఎంతో పవర్ ఫుల్గా కనిపిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరణ్ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి 'లాల్ సలామ్' చిత్రంలో వినిపించారు. 'తిమిరి ఎళుడా..' అనే ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 'లాల్ సలాం'లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్
టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్ట్లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్ టాక్. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో ఒక్క డైలాగ్తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. (చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు. -
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్దేవ్తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్స్టార్తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
'లాల్ సలాం' టీజర్ రిలీజ్.. మొయిద్దీన్ భాయ్గా మెప్పించిన రజినీకాంత్
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా లాల్ సలాం టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. జైలర్తో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ చిత్రంలో ముస్లిం నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెట్తో మొదలైన గొడవలు సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎందుకు మారాయి..? అనేది కథాంశం. టీజర్లో రజనీ సీరియస్ లుక్లో కనిపించగా.. విష్ణు విశాల్ ఏదో గొడవలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే పాత్రలో రజనీకాంత్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి లాల్ సలాం విడుదల కానుంది. -
'లాల్ సలాం' హార్డ్ డిస్క్లు మాయం.. రజనీ కాంత్కు సినిమాకు బ్రేకులు
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' చిత్రం చివరి దశకు చేరుకుంటుండగా.. రజనీకాంత్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్లో కనిపించకుండా పోయాయని ప్రచారం జరుగుతుంది. జైలర్తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. హిందీ చిత్రం 'కై పో చే'కి (Kai Po Che) రీమేక్ అని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో రజనీ మొయిదీన్ భాయ్గా ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'లాల్ సలామ్' చిత్రీకరణ పూర్తయి చివరి దశకు చేరుకుంటుండగా.. సినిమాలో రజనీకాంత్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్ నుంచి మాయమైనట్లు సమాచారం. ఎంతో కష్టపడి రజనీ మీద చిత్రీకరించిన దృశ్యాలు ఎక్కడా హార్డ్ డిస్క్లలో కనిపించడం లేదట. ఆ దృశ్యాలను వెలికి తీసేందుకు విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2024 సంక్రాంతి రేసు నుంచి ‘లాల్ సలామ్ ’ సినిమా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పొంగల్కు ఇప్పటికే ప్రకటించినట్లుగా, శివకార్తికేయన్ నటించిన అయాలన్, జయం రవి నటించిన సైరన్ మాత్రమే కోలీవుడ్ విడుదల కానున్నాయి. ‘లాల్ సలాం’లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయిందంటే చాలు అందులో నటించిన హీరోహీరోయిన్ల పెయిర్ బాగుందని మెచ్చుకుంటారంతా! వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడుతారు అభిమానులు. అయితే ఆన్స్క్రీన్పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్స్క్రీన్లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే! చాలామటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్లో ప్రేమలో పడి నెక్స్ట్ సినిమాకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలామందే ఉన్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రేమపెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను పారాయణం చేద్దాం.. కృష్ణ-విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ అందగాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికి ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. దీంతో శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవిత-రాజశేఖర్ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ప్రేమ, పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకనిర్మాతలు రాజశేఖర్కు షాకిస్తూ అతడినే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నాగార్జున- అమల తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేశ్ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు. మహేశ్బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేశ్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గానూ నటించారు. 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. నయనతార- విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్ 2022, జూన్ 7న విఘ్నేశ్తో ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కొన్ని ప్రేమకథలు గొడవలతో మొదలువతాయంటారు కదా! ఆ జాబితాలోకే వీరి లవ్ స్టోరీ కూడా వస్తుంది. ఆది-నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా! షూటింగ్ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న మూడుముళ్ల బంధంతో ఆఫ్స్క్రీన్ జంటగా స్థిరపడిపోయారు. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సాయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్ అలీ ఖాన్, దీపికా- రణ్వీర్ దంపతులు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలే! ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: కోలీవుడ్ నుంచి పిలుపు, నో చెప్పిన శ్రీలీల -
జీవిత.. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నాతోనే ఉంటానంది: రాజశేఖర్
జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత.. వీరిద్దరినీ వేర్వేరుగా చూడలేం. అంతలా ముడిపడిపోయిన ఈ జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్లో ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీరి ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాలోలాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్టులున్నాయి. అసలు పరిచయమే ఒక వింత అనుభవంతో జరిగింది. రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జీవితతో ఓ సినిమా చేయాల్సింది. అయితే హీరోయిన్ బాలేదు, మార్చేయండి అని చెప్పాడట. కట్ చేస్తే నిర్మాతలు రాజశేఖర్ స్థానంలో మరో హీరోను పెట్టి సినిమా చేశారు. అలా విచిత్ర సంఘటనతో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారడంతో 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరి కూతుర్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ సినీరంగంలో ప్రవేశించి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ లవ్స్టోరీని వెల్లడించారు. ఒకసారి రాజశేఖర్ నా వద్దకు వచ్చి మీరు నాపై ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. ఆయనలో ఆ ఫ్రాంక్నెస్ బాగా నచ్చిందని చెప్పింది జీవిత. అయితే రాజశేఖర్ను ఒప్పించేందుకు, ఆయనను పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టపడిందట. ఈ విషయం తెలిసిన రాఘవేంద్రరావు.. రాజశేఖర్ విలన్లా ఉన్నాడు, నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చాడని తెలిపాడు రాజశేఖర్. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అయినా సరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నలతో ఓకే చెప్పించింది అని తెలిపాడు. ఈ క్రమంలో జీవిత ఓ సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనలైంది. 'రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఫీలయ్యాను. ఆయనకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని చెప్తూ ఎమోషనలైంది. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది, ఆ ప్రేమే నచ్చిందన్నాడు రాజశేఖర్. -
30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్కు చెల్లిగా..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు నటి జీవిత రాజశేఖర్. నిర్మాతగా, దర్శకురాలిగా మారి భర్త, పిల్లల సినిమాల బాధ్యత తీసుకున్న ఆమె ఇప్పుడు నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 1991లో నటుడు రాజశేఖర్తో వివాహం ఆనంతరం ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత జీవిత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా పలు చిత్రాలు తెరకెక్కించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్టార్ హీరోకు సోదరిగా నటించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న రజనీ తన నెక్ట్స్ చిత్రం కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మార్చి 7న ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చదవండి: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్కు ఇలా! ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన పాత్రలకు చిత్ర బృందం స్వాగతం పలుకుతూ ఓ ట్వీట్ చేసింది. ఇందులో రజనీకాంత్, నటుడు విష్ణు విశాల్తో పాటు నటి జీవిత రాజశేఖర్ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్కు సోదరిగా నటించబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. అయితే లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. #LalSalaam - Shoot to start on March 7 in Chennai - @TheVishnuVishal and @vikranth_offl to play majority of CCL games before joining shoot - Jeevitha Rajasekhar to play Superstar Rajinikanth's sister in the film, an important role pic.twitter.com/C5URzbfFSI — Siddarth Srinivas (@sidhuwrites) February 28, 2023 -
ఆ విషయం ఇప్పటిదాకా అమ్మానాన్నలకు తెలియదు : శివానీ రాజశేఖర్
శివాని రాజశేఖర్.. సినీ జంట డాక్టర్ రాజశేఖర్, జీవితల తనయ. ఆ ఐడెంటిటీ కొంచెం ప్లస్ అయినా నటిగా నిలదొక్కుకోవడానికి మాత్రం అభినయాన్నే నమ్ముకుంది. చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అని చూసుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం ముఖ్యమని భావించింది. అనుసరిస్తోంది. స్టార్గా వెబ్ తెరను ఏలుతోంది. తండ్రి లాగే ఎమ్బీబీస్ పూర్తిచేసి యాక్టర్ అయిన డాక్టర్ శివాని.. చెల్లి శివాత్మిక కంటే కొంచెం లేట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రపంచం గురించి పూర్తి అవగాహన ఉండటంతో మొదట నిర్మాతగా మారి తెలుగులో ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘ కల్కి’ సినిమాలు నిర్మించింది. మోడల్గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ ఫైనలిస్ట్గా నిలిచింది. తర్వాత ‘అద్భుతం’సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘టూ స్టేట్స్’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తన సినిమాలు అన్నీ ఓటీటీలోనే విడుదలయినప్పటికీ వెండితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్తో వినోదాన్ని పంచుతోంది. చిన్నప్పుడు బొంగరాలు కొట్టేసేదాన్ని. ఇంటికి తెచ్చి ఎవరికీ తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనందపడిపోయేదాన్ని. ఈ విషయం ఇప్పటిదాకా అమ్మనాన్నలకు తెలియదు. – శివాని రాజశేఖర్ -
నా కూతుళ్లు ఆ రంగంలోకి వెళ్తామంటే చాలా టెన్షన్ పడ్డాం : జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
జియో పేరిట జీవితా రాజశేఖర్కు టోకరా.. నిందితుడి అరెస్ట్
సినీ నటి జీవితా రాజశేఖర్ను టార్గెట్ చేసుకుని, ఆమె మేనేజర్ను మోసం చేసిన కేసులో చెన్నైవాసి నరేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ అతడు నటీనటులతో పాటు నిర్మాతలను మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా జీవితకు కొన్నాళ్లక్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. తనను ఫారూఖ్గా పరిచయం చేసుకున్న వ్యక్తి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అంటూ మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత తన మేనేజర్తో మాట్లాడమని సూచించింది. దీంతో అతడు జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.1.25 లక్షలకే వస్తున్నట్లు తెలిపాడు. ఇది నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలు అతడికి ఆన్లైన్లో పంపారు. తర్వాత అటువైపు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. చదవండి: మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. పవిత్ర లోకేశ్ ఫిర్యాదు అమ్మాయిల పిచ్చి రూమర్పై కాంతారావు కూతురు స్పందన -
జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా
-
కోవిడ్లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సిటీ నటి జీవితను టార్గెట్ చేసి, ఆమె మేనేజర్ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్ సీజన్లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా పని చేశాడు. కోవిడ్–19 వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకున్నాడు. ఇతగాడు తొలుత తాను టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్ను ఇలానే టార్గెట్ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు. -
సినీ నటి జీవిత టార్గెట్గా.. జియో పేరుతో టోకరా!
సాక్షి, హైదరాబాద్: సినీ నటి జీవితను టార్గెట్గా చేసుకుని, ఆమె మేనేజర్ను మోసం చేసిన చెన్నై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫారూఖ్ అంటూ పరిచయం చేసుకున్న అతగాడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అని మొదలెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత అదే విషయం చెప్పి తన మేనేజర్తో మాట్లాడమని సూచించారు. దీంతో అతడితో మాట్లాడిన దుండగుడు తనకు పదోన్నతి వచ్చిన నేపథ్యంలో ఓ బంపర్ ఆఫర్ విషయం చెప్తున్నానన్నాడు. జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వాటిలో రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ. 1.25 లక్షలే వస్తున్నట్లు ఉంది. నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలను ఫారూఖ్గా చెప్పుకున్న వ్యక్తిని ఆన్లైన్లో పంపారు. ఆపై అతడి నుంచి స్పందన లేకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. చదవండి: (ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య) నిందితుడు వాడిన ఫోన్ నెంబర్, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు తదితరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే నిందితుడని గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి మంగళవారం సిటీకి తరలించింది. ఇతడు నేరచరితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఫోన్లు చేసి ఆఫర్ల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు. సినీ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచీ డబ్బులు వసూలు చేశాడు. నగరంతో పాటు సైబరాబాద్లోనూ కేసులు నమోదు కావడంతో గతంలోనూ జైలుకు వెళ్లాడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గానూ పని చేశాడు. -
ఉద్యామానికి ముందు నీ ఆస్తులెంత, ఇప్పుడెంత: జీవిత
-
చెక్బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన జీవితా రాజశేఖర్
చెక్బౌన్స్ కేసులో ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ గురువారం తిరుపతి జిల్లాలోని నగరి కోర్టుకు హాజరైంది. గరుడవేగ సినిమా నిర్మాతలు హేమ, కోటేశ్వరరావులకు ఆమె రూ.26 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఆమె బకాయిలు చెల్లించలేదు. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. దీంతో గరుడవేగ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. చెక్ బౌన్స్ కేసు విచారణలో భాగంగా జీవితా రాజశేఖర్ కోర్టుకు హాజరైంది. చదవండి: ఆ హీరోయిన్తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో సీతారామం సక్సెస్ మీట్కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో -
చెక్బౌన్స్ కేసులో నగరి కోర్టుకు హాజరైన సినీనటి జీవిత రాజశేఖర్
-
శేఖర్ మూవీ కోసం రూ.15 కోట్లు పెట్టాను, ఎవరిస్తారు?: నిర్మాత
జీవిత దర్శకత్వంలో ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న సమయంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేయాలని తాము చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో నిర్మాత సుధాకర్ రెడ్డి మంగళవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను శేఖర్ సినిమా నిర్మించాను. నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్ ప్రొవైడర్స్కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను, కానీ వాళ్లు శేఖర్ సినిమాను చంపేశారు. ఏడెనిమిది సినిమాలకు నిర్మాతగా పని చేశాను, ఫైనాన్స్ కూడా ఇచ్చాను. ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి లేదు. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. సినిమాలో శివానీ, శివాత్మికల పేపర్లు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే మా సినిమా ఆగిపోయింది. అసలు శేఖర్ సినిమాను ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓలపై న్యాయపోరాటం చేస్తాం. రేపు కోర్టులో తుది తీర్పు వచ్చాక పరందామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం. నిజానికి నాకు ఆ పరందామరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. నాకు కలిగిన నష్టాన్ని పరందామరెడ్డి ఇస్తారా? డిజిటల్ ప్రొవైడర్స్ ఇస్తారా? ఇది రాజశేఖర్ సినిమా కాదు, రాజశేఖర్ నటించిన సినిమా మాత్రమే! అలాగే జీవిత సినిమా కూడా కాదు, కేవలం జీవిత దర్శకత్వం చేసిన మూవీ. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ నా పేరు మీదే ఉంది. శేఖర్ సినిమాకు నేను రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాను. జీవిత వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి 👇 విజయ్, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదు.. నీ బాంచన్, జర ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వరాదే.. -
'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో శేఖర్ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం(మే 24న) విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే తాజాగా దీనిపై రాజశేఖర్ కూడా ట్వీట్ చేశాడు. ఆసత్య ప్రచారం వల్ల తమ సినిమాను నిలిపివేశారని, శేఖర్ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ సినిమాకు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి #Shekar Thanking our audience for constantly standing by us! pic.twitter.com/9nTE5ulig9 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 23, 2022 -
మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత
రాజశేఖర్ హీరోగా, శివానీ రాజశేఖర్, ఆత్మీయా రాజన్, ముస్కాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నిర్మాత బొగ్గరం శ్రీనివాస్తో నాకు ఉన్న పరిచయం వల్ల ‘కార్తికేయ’ సినిమాకు తనతో ఇన్వెస్టర్గా చేరాను.ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మించాను. ఇక ‘శేఖర్’ విషయానికి వస్తే.. రాజశేఖర్గారు నా ఫేవరెట్ హీరో. అందుకే ఆయన చేసిన ‘గరుడవేగ’ సినిమాతో ట్రావెల్ చేశాను. మలయాళ ‘జోసెఫ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని జీవితగారు చెప్పడంతో నేనూ ‘జోసెఫ్’ చూశాను. నచ్చి ‘శేఖర్’ సినిమాకు నిర్మాతగా ఉన్నాను. రాజశేఖర్గారు అద్భుతంగా నటించారు. జీవితగారు బాగా తీశారు. దాదాపు 300 థియేటర్స్లో రిలీజ్ చేశాం. సినిమా బాగుందని, మంచి సందేశం ఇచ్చారని ప్రేక్షకులు అభినందిస్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
‘శేఖర్’ మూవీ రివ్యూ
టైటిల్ : శేఖర్ నటీనటులు : రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్, శివాణి, సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్ తదితరులు నిర్మాతలు: బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాణి రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ దర్శకురాలు: జీవిత రాజశేఖర్ సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫి:మల్లికార్జున్ నారగాని విడుదల తేది:మే 20, 2022 యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత ఆయన చిత్రాలకు పెద్ద ఆదరణ దక్కలేదు. ఇక రాజశేఖర్ పని అయిపోతుదన్న సమయంలో గరుడవేగ, కల్కీ చిత్రాలతో మళ్లీ పుంజుకున్నాడు. ఆ చిత్రాలు విజయవంతం కావడంతో..అదే కిక్తో ‘శేఖర్’చిత్రంలో నటించారు. మలయాళం మూవీ జోసెఫ్ చిత్రం రీమేక్ ఇది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిపెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘శేఖర్’చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘శేఖర్’ అందకున్నాడా? లేదా?, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శేఖర్(రాజశేఖర్)..ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో దిట్ట. నేరస్తులను ఎవరైనా సరే..ఇట్టే కనిపెట్టేస్తాడు. ఓ మర్డర్ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. అదే సమయంలో అతని భార్య ఇందు(ఆత్మీయ రాజన్) నుంచి విడిపోయిన జ్ఞాపకాలు శేఖర్ని వెంటాడుతుంటాయి. ఓ రోజు ఇందు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలియడంతో శేఖర్ ఆస్పత్రికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఇందు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందుతుంది. ఈ కేసుపై శేఖర్కి అనుమానం రావడంతో వెంటనే విచారణ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్లో ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో హత్య చేశారని తెలుస్తుంది.అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును శేఖర్ ఎలా ఛేదించాడు? ఇందు నుంచి శేఖర్ విడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే.. థియేటర్స్లో ‘శేఖర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్ చిత్రాలు ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘శేఖర్’లో ఆ ఉత్కంఠత కాస్త తగ్గింది. 2018లో వచ్చిన మలయాళ చిత్రం జోసెఫ్..అప్పట్లో సూపర్ హిట్. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం.. క్రైమ్ థ్రిల్లర్తో పాటు అన్ని రకాల జానర్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉండడంతో, ఆ చిత్రానికి రీమేక్గా వచ్చిన ‘శేఖర్’ కథ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి అందించడం కాస్త కష్టమే. అయితే దర్శకురాలు జీవిత మాత్రం.. కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్గా సాగుతుంది. తండ్రి,కూతుళ్లు(రాజశేఖర్, శివాణి) మధ్య వచ్చే సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. అలాగే భార్యతో విడిపోవడానికి దారితీసిన కారణాలు, ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్పై క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్లోనే మొదలవుతుంది. అయితే..హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త సినిమాటిక్గా అనిపిస్తుంది. వ్యవస్థలో ‘ఆర్గనైజ్డ్ మెడకల్ క్రైమ్’ ఎలా జరుగుతుందో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. వైద్యరంగంలో ఇలాంటి స్కామ్లు కూడా ఉంటాయా? అని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. స్కామ్ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే సంచలన నిర్ణయం కాస్త సినిమాటిక్గా అనిపించినా.. క్లైమాక్స్లో ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. అయితే సెకండాఫ్లో కథనం కాస్త నెమ్మది సాగడం, ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్గా ఉండడం ఈ సినిమాకు మైనస్. మలయాళం మూవీ జోసెఫ్ చూడకుండా, ఈ చిత్రాన్ని చూసే మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటనలో ఇప్పటికి జోష్ తగ్గలేదు. రిటైర్డ్ కానిస్టేబుల్ శేఖర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్బ్యాక్ సీన్స్లో తెరపై యంగ్గా, స్టైలీష్గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్ని చూస్తారు. ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్ న్యాయం చేశారు. శేఖర్ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్, ప్రియురాలు కిన్నెరగా ముస్కాన్ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంది. చిన్ని చిన్ని ప్రాణం.. కిన్నెర పాటలతో మిగిలిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ పాటలన్నీ కథతో సాగుతాయే తప్ప..తెచ్చిపెట్టినట్లు ఉండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్పై ఇంకాస్త దృష్టిం పెడితే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్స్ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
జీవిత రాజశేఖర్ మహానటి, నోరు అదుపులో పెట్టుకో: నిర్మాతలు
సాక్షి, తిరుపతి: గరుడ వేగ సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జీవిత రాజశేఖర్ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారు సాక్షితో మాట్లాడుతూ.. 'జీవిత రాజశేఖర్ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు. మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు. మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము. జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్, సామాన్యులకు ఒక లైఫ్ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం' అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు. చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? -
అది జరగపోతే అప్పుల పాలవుతాం: రాజశేఖర్
కోవిడ్ టైమ్లో చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను .ఇక జీవితం అయిపోయింది..సినిమాలను చేయలేను అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ‘శేఖర్’ చిత్రంలో నటించాను . ఈ చిత్రం నాకు చాలా స్పెషల్’అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. మీ కెరీర్లో ఎప్పుడులేనంతగా.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మా సినిమాను బతికించండి అని ప్రేక్షకులను వేడుకున్నారు.ఎందుకు? ఇంతవరకు మా వెనక ప్రాపర్టీ ఉంది. కాబట్టి సినిమాలు ఆడినా ఆడకపోయినా..పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్ సినిమా సక్సెస్ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఓ ఢిపరెంట్ సినిమా ఎంచుకొని వచ్చాం. సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్స్ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్ కారణంగానే మనసులోనుంచి ఆటోమేటిగ్గా ఈ సినిమాను బతికించండి అని వచ్చింది. మీ గత సినిమాలతో పోలిస్తే.. శేఖర్లో కొత్తగా ఏం ఫీలయ్యారు? ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. శేఖర్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్, బాధను చూపించడానికి బాగా చేశాను. ఈ చిత్రంలో మీ పాత్ర మేకోవర్ గురించి? 55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్ నాది. ఈ క్యారెక్టర్కి కొత్త లుక్ ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి.. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్లో వచ్చాం. ఆ గెటప్ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ఇటీవల ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. జీవిత దర్శకత్వం గురించి? షూటింగ్కి వెళ్తే మేమిద్దరం ఒక డైరెక్టర్, ఆర్టిస్టుగానే ఉంటాం. కానీ ప్రతి విషయంపై ఇద్దరం చర్చింకుంటాం. ఆమె గొప్ప దర్శకురాలు. అందరి నుంచి కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది. మలయాళం మూవీ జోసెఫ్ మూవీని రీమేక్గా ఎంచుకోవడానికి కారణం? నా గత సినిమాలు ఒక్కసారి తలంబ్రాలు, అంకుశం,ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి.. ఇవన్నీ రీమేక్ సినిమాలే. అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకే జోసెఫ్ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో పెద్ద సక్సెస్ అయిన సినిమా అది. నేను గతంలో చాలా మళయాల మూవీలను రీమేక్ చేసి హిట్ కొట్టాను. రీమేక్లకు సక్సెస్ గ్యారెంటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జోసెఫ్ని సెలెక్ట్ చేశాం. ఈ చిత్రంలో మీ కూతరు శివాణి నటించారు. ఆమె నటన గురించి? మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాణి, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదంటే..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటదని చెప్పింది. నేను ఓకే అన్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే..ఇద్దరు చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది(నవ్వుతూ..) మీ పాత్రలకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లు ఉన్నారు కదా? మధ్యలో 10 ఏళ్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదు. గత పదేళ్లుగా శ్రీనివాస్ మూర్తి నా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఎవరు డబ్బింగ్ చెప్పారో ఆడియన్స్ కూడా గుర్తుపట్టకుండా ఇద్దరు బాగా చెప్పారు. శేఖర్ చిత్రానికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. 37 ఏళ్ల నా సినీ కెరీర్లో 27 ఏళ్లు సాయికుమార్, 10 ఏళ్లు శ్రీనివాస్ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. కోవిడ్ టైమ్లో చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ని ఫేస్ చేశారు కదా? అవును. చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను. మళ్లీ కోలుకుంటానని అనుకోలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి అక్కడ టీవీ పెట్టారు. సినిమాలో హీరోలు చేస్తున్న ఫైట్స్, డాన్స్లు చూసి.. నేను కూడా ఇలా ఉండేవాడిని.. ఇప్పుడిలా అయిపోయిందే అని బాధపడేవాడిని. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక సినిమాలు చేయలేనని అనుకొని జోసెఫ్ రీమేక్ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పాను. కానీ జీవితతో పాటు అందరూ.. నువ్వు కోలుకుంటావని భరోసా ఇచ్చారు. సినిమాపై ఉన్న కసితో ఒక్కొక్కటిగా మళ్లీ నేర్చుకొని ‘శేఖర్’ మూవీ చేశాను. నా కెరీర్లో చేసిన సినిమాలన్నింటిలో ‘శేఖర్’మూవీ చాలా స్పెషల్. ఇంత ఎనర్జిటిక్ పాత్రను మళ్లీ చేయలేను అనుకుంటా. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ‘శేఖర్’లో ఏమైనా మార్పులు చేశారా? పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా? లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిగ్ గురించి? ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్ తన మ్యూజిగ్తో ఈ సీన్స్ మ్యానేజ్ చేశారు. కోవిడ్ టైమ్లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది? నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్ టైమ్లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్ మహేందర్ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్ సత్తారు కూడా గరుడవేగ పార్ట్2లో ఇద్దరు కూతుళ్లను యాడ్ చేసే ప్లాన్లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. ప్రీరిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..) కొత్త సినిమాలు ఏం ఉన్నాయి? త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాం. -
తన కూతురు లేచిపోయిందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేశారు: జీవిత
-
Jeevitha Rajasekhar: తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ..
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా చేప్టటిన ఓ ఈవెంట్లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది. అదే సమయంలో తమ కుటుంబం గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది జీవిత. గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 'నా మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్లమీద బహుశా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్ఫ్రెండ్తో దుబాయ్కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారు. తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ శీర్షికకు, లోపల రాసున్నదానికి సంబంధమే ఉండదు. మా ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్కు వెళ్లాం. దానికే ప్రియుడితో దుబాయ్కు లేచిపోయారని వార్తలు రాశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉంది. కోర్టులో తేలకముందే ఏదేదో చెబుతున్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరమూ కాదనం. కానీ తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయకండి' అని సూచించింది. చదవండి 👇 హీరోయిన్తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత
టాలీవుడ్లో యాంగ్రీ ఎంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా నటించింది. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా మే 20న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో డైరెక్టర్ జీవిత రాజశేఖర్ ముచ్చటించారు. 'కొన్ని పరిస్థితుల వల్ల దర్శకురాలిగా మారాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయలానే ఆసక్తి ఎప్పుడూ లేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ శేషు మూవీని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా కథను మార్చకుండా తీయాలని అనుకున్నాం. అలా చేసేందుకు ఏ డైరెక్టర్ ముందుకు రాలేదు. దీంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం. మలయాళంలో హిట్ సాధించిన జోసెఫ్ సినిమాను శేఖర్ పేరుతో తెరకెక్కించాం. 'పలాస' డైరెక్టర్ కరుణ కుమార్, నీలకంఠను కలిశాం. వారు బిజీగా ఉండటంతో నేనే డైరెక్షన్ చేశాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో 'శేఖర్' ఉంటాడు అనేలా ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ.. యూట్యూబ్ వారే థంబ్నేయిల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.' అని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ 'వన్ వీక్లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియస్ కావడంతో తను బతుకుతాడా.. లేదా అనే పరిస్థితి ఏర్పడింది. అందరి ఆశీర్వాదంతో తను రికవరీ అయి ఈ సినిమా చేశారు. ఇందులో డాటర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివానినే కూతురిగా చేయిస్తే బాగుంటుందని చేయించాం. అందరూ రాజశేఖర్ నెగెటివ్ రోల్స్ చేస్తారా.. అని అడుగుతున్నారు. మొదట్లో తన జర్నీ విలన్ గానే మొదలైంది. బారతి రాజా దర్శకత్వంలో విలన్గా నటించారు. తర్వాత హీరోగా చేయడంతో బిజీ అయ్యారు. అయితే రామ్ చరణ్ సినిమా "ధ్రువ" లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తారు. అలాగే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారు. అలాగే నన్ను కూడా సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.' అని పేర్కొన్నారు. -
ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం : రాజశేఖర్ ఎమోషనల్
‘‘శేఖర్’ సినిమా స్టార్టింగ్లో కరోనా బారిన పడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకుల ప్రార్థనలు నన్ను బతికించింది ఈ సినిమా కోసమేనేమో! మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం’’ అన్నారు రాజశేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్లో జరిగింది. హీరో అడివి శేష్ ‘శేఖర్’ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసి, మాట్లాడుతూ – ‘‘రాజశేఖర్గారి ‘మగాడు’ చిత్రం నా ఫేవరెట్. ‘శేఖర్’ సినిమా ట్రైలర్ బాగుంది. మంచి కంటెంట్తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించినందు వల్ల ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. మహిళలు ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువమంది ప్రోత్సహించరు. ‘శేఖర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమాయే ‘శేఖర్’. నేను మిస్ ఇండియా పోటీకి అర్హత సాధించడానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంటే తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వగా, నేను తమిళనాడు కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్రెస్టింగ్గా రాజ'శేఖర్' ట్రైలర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్' .ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స ఆకటుకుంటున్నాయి. మే20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. మర్డర్ మిస్టరీని తన స్టైల్లో విచారణ జరపడం వంటివి ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్గా నటించింది. Very happy to launch the #ShekarTrailer My best wishes to@ActorRajasekhar garu on this new look film. Seems like an interesting #ShekarOnMay20 in Theaters. Kudos & luck to #JeevithaRajashekar garu, @Rshivani_1, @ShivathmikaR & team #Shekarhttps://t.co/m0Z304OyAT pic.twitter.com/1LrfXq94GX — Adivi Sesh (@AdiviSesh) May 5, 2022 -
అరెస్ట్ వారెంట్పై స్పందించిన జీవితా రాజశేఖర్
సినీ నటి, దర్శకురాలు జీవితపై నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుంచి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఆరోపణలపై జీవిత వివరణ ఇచ్చారు. శనివారం జరిగిన శేఖర్ మూవీ ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు జీవిత.. తనకు సమన్లు వచ్చిన విషయం నిజమే అన్నారు. కానీ తాను అరెస్ట్ కాలేదన్నారు. రెండు నెలలకుపైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు వారు మీడియా ముందుకు ఎందుకు వచ్చారో తెలియదని, ఇంతకు ముందు కూడా తనపై వారెంట్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ కేసు తానే గెలిచినట్లు జీవిత తెలిపారు. రూ. 26 కోట్లు మోసం చేశారని జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వర్రావు అంటున్నారని, అవి ఏ కోట్లో అర్థం కావడం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అవన్ని తప్పుడు ఆరోపణలని ఆమె స్పష్టం చేశారు. అలాగే కోటేశ్వరావు వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారని జీవిత ఆరోపించారు. -
Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్
నగరి: సినీ నటి, దర్శకురాలు జీవితకు నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్పై జీవిత రీకాల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. జీవిత ప్రత్యక్షంగా కోర్టుకు రావా ల్సిందేనంటూ ప్రత్యర్థి న్యాయవాది మురళీధర్ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే నెల 8న విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజ గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారు. దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారు. తాకట్టు ఉంచిన స్థలాన్ని జీవిత మరొకరికి అమ్మేశారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారు స్థలంలో పనులు మొదలుపెట్టిన విషయం హేమ రాజకు తెలిసింది. ఈ విషయమై ఆమె జీవితను ప్రశ్నించగా మంచి ధర రావడంతో అమ్మేశానని, డబ్బును సెటిల్ చేస్తానని చెప్పి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో నగరి కోర్టులో రూ.13 కోట్లకు, తిరువళ్లూరు కోర్టులో రూ.13 కోట్లకు హేమరాజ కేసు వేశారు. నగరి కోర్టు నుంచి జారీ అయిన 4 వారెంట్లకు హాజరు కాకపోవడంతో ఎన్ఐ యాక్ట్ కింద కోర్టు రెండు నెలల క్రితం అరెస్ట్ వారెంట్ జారీచేసినట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ వారెంట్పై ఆమె రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: (ఏది నిజం?: విద్యుత్ వెలుగులపై చీకటి రాతలు) -
మహిళలకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుతారు: జీవితా రాజశేఖర్
-
వైరల్గా శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు
యాగ్రీ మ్యాన్, హీరో రాజశేఖర్, జీవితల తనయగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు ప్రస్తుతం వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ, బ్రహ్మనందం, కలర్స్ స్వాతి పంచతంత్రం చిత్రాల్లో నటిస్తుంది. ఇవేకాక శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. గతేడాది ‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గౌతమ్ కార్తిక్కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. ఇదిలా ఉంటే హీరోయిన్గా బిజీ ఉంటునే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన హాట్హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పొగొడుతోంది ఈ యంగ్ హీరోయిన్. ఈనేపథ్యంలో తాజాగా చూడిదారుతో దిగిన అందమైన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఎల్లో కలర్ చుడిదార్లో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ శివాత్మిక మరోసారి కుర్రకారు కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఆ మూవీ నుంచి రాజశేఖర్ను తప్పించారా? జీవిత వల్లే ఆయనకు ఆఫర్ పోయిందట!
Rajasekhar Removed From Sriwass and Gopichand Movie: ఫ్యామిలీ హీరోలుగా మెప్పించిన నటుడు జగపతి బాబు, శ్రీకాంత్లు విలన్స్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విలనిజంలో జగపతి బాబుకు వందకు వందశాతం మార్కులు కొట్టెసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అఖండతో శ్రీకాంత్ కూడా ప్రతి కథనాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక వీరి జాబితాల్లోకి యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా చేరాలనుకున్నాడు. మంచి అవకాశం వస్తే తాను విలన్గా చేసేందుకు సిద్ధం అంటూ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు! ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న రాజశేఖర్కు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్లో అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్గా రాజశేఖర్ ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్ను మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ స్థానంలో జగపతి బాబును రీప్లేస్ చేసినట్లు సమాచారం. చదవండి: వైరల్గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? అయితే గోపిచంద్ సినిమా నుంచి రాజశేఖర్ను తప్పించడానికి కారణమేంటో తెలియదు కానీ, ఆయనకు ఈ ఆఫర్ పోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటూ కొందరూ అంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. ఈ విషయంలో ఆమె ప్రమేయం నిర్మాతలకు చికాకు తెప్పించిదట. దీంతో గోపించంద్-శ్రీవాస్ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్ను తీసేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై చిత్ర బృందం కానీ, జీవిత రాజశేఖర్లు స్పందించే వరకు వేచి చూడాలి. అయితే ఇది విన్న పలువురు విలన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రాజశేఖర్ ఆశలకు జీవిత విలన్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
చనిపోతా.. రేపో, ఎల్లుండో చితికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ ఎమోషనల్
గత మూడున్నర దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించాడు కానీ.. ఒకప్పుడు రాజశేఖర్ సినిమా అంటే.. మినిమమ్ గ్యారెంటీ ఉండేది. అంతేకాదు 90ల్లో స్టార్ హీరోగా వెలుగొందాడు. అప్పట్లో రాజశేఖర్ ఖాతాలో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ యాంగ్రీ స్టార్ ‘శేఖర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్నా రాజశేఖర్.. తన జీవితంలో అనుభవించిన అత్యంత గడ్డు కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. గతేడాది కరోనా బారిన రాజశేఖర్.. నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కరోనా సోకినప్పుడు నాకు చాలా సీరియస్ అయింది. ఇక నేను చనిపోతాననుకున్నా. రేపో ఎల్లుండో నా చితికి మంట పెడతారనే ఆలోచనలు వచ్చాయి. జీవిత, పిల్లలకు ధైర్యంగా ఉండాలని చెప్పా. ప్రేక్షకుల ప్రార్థనల వల్లే బతికాను. ఇంటికి వచ్చిన తర్వాత నా కాళ్లు, చేతులు పనిచేయలేదు. ఇక నేను నటించలేనేమో అనే భయం కలిగింది. నాపై నాకే నమ్మకం లేకపోవడంతో..‘శేఖర్’చిత్రాన్ని వేరేవాళ్లతో చేయమని చెప్పా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే అవన్నీ గుర్తొస్తాయి’ అంటూ జీవిత,రాజశేఖర్ దంపతులుఎమోషనల్ అయ్యారు. ఇక సినిమాల్లోకి ఎలా వచ్చారో చెబుతూ... ‘నాకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలని కోరిక ఉండేది. కానీ నాకు నత్తి ఉంది. ఒకవేళ నాకు సినిమా చాన్స్ వచ్చినా.. నత్తి ఉందని తీసేస్తారేమోననే భయం ఉండేది. అసలు నాకు నటన వచ్చో..రాదో తెలుసుకోవడానికి యాక్టింగ్ స్కూల్లో చేరా. అప్పడు నమ్మకం కలిగి.. నటించడం మొదలుపెట్టా’అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. -
శేఖర్ : జీవితా రాజశేఖర్ దర్శకత్వం.. శివానీ కీలక పాత్ర
Shekar: Shivani Shares Screen Space With Her Father Rajasekhar: రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్ని చిత్రబృందం విడుదల చేసింది. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ హీరోగా నటించిన 91వ సినిమా ‘శేఖర్’. ఇందులో రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించింది శివాని. తండ్రి, కుమార్తె వెండితెరపై కలిసి కనిపించనున్న తొలి చిత్రం ఇదే. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. -
‘బ్యాక్ డోర్’ కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించింది చిత్ర బృందం. కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, అడిషన్ ఎస్పీ కె.జి.వి. సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈట్ సినిమా... డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమాగా’అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు ‘బ్యాక్ డోర్’వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో ‘బ్యాక్ డోర్’ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ భయంలో నుంచి పుట్టిన కథే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈ చిత్రం’
‘‘కేవీ గుహన్గారివంటి అద్భుతమైన టెక్నీషియన్తో నా కుమార్తె శివానీ వర్క్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివానీకి కరోనా సోకింది. ఆ తర్వాత నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. తన వల్ల నాకు కరోనా వచ్చిందని శివానీ ఏడ్చింది. తను హీరోయిన్గా నటించిన ‘అద్భుతం’ సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో..ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాకు అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ అన్నారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు.. ఎక్కడ.. ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవి ప్రసాద్రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుహన్గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. సినిమా చూశాను. పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘పూర్తిగా వెబ్క్యామ్తో సినిమా తీశాం. కరోనా సమయంలో అసలు బతుకుతామో లేదో అనే భయంకలిగింది. ఈ భయంలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. అదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యాను. శివానీ అమాయకత్వం నచ్చింది. యాక్ట్రస్గా నిరూపించుకోవాలనే కసి ఆమెలో కనిపించింది’’ అన్నారు కెవీ గుహన్. ‘‘నిర్మాత సురేష్బాబుగారు ప్రోత్సహిస్తున్నారు. మరో నిర్మాత ‘దిల్’ రాజు మా సినిమాను చూసి మెచ్చుకున్నారు’’ అన్నారు రవి. ‘‘ఇది నా 17వ సినిమా. నా కెరీర్ కొంచెం తగ్గినప్పుడు రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ నాకు బూస్ట్ ఇచ్చింది.’’ అన్నారు అదిత్. ‘‘ఈ ప్రాజెక్ట్ నాకు అదిత్ వల్లే వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కేవీ గుహన్గారికి ధన్యవాదాలు’’ అన్నారు శివానీ. ఈ కార్య క్రమంలో సంగీత దర్శకుడు సైమన్ కింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ సమయంలో శివానీ బాగా ఏడ్చేసింది.. ఎప్పుడూ మర్చిపోను : రాజ శేఖర్
‘నాకు కరోనా సోకినప్పుడు భయపడలేదు. కానీ నా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’మూవీ టీమ్ నుంచే శివానికి కోవిడ్ సోకింది. ఆమె నుంచి నాకు వచ్చింది. ఆ సమయంలో శివాని చాలా బాధపడింది. నా వల్లే డానీకి కరోనా సోకిందని ఏడ్చేసింది. ఆ జీవితాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను’అన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్లో స్ట్రీమింగ్ కానుంది. తోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ వండర్ ఫుల్ టెక్నీషియన్. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్లా తిరిగాం. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్లకు వచ్చేవారు. రాజశేఖర్ అవుట్ డోర్కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు. శివానీ కూడా కష్టపడి చేసింది. గుహన్ గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు. -
‘శేఖర్’ ఫస్ట్ గ్లింప్స్.. రాజశేఖర్ లుక్ అదిరిందిగా!
రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. ఆయన సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ని గురువారం విడుదల చేశారు. ‘అరకు బోసుగూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు’ అంటూ ఓ మహిళ వాయిస్ ఓవర్తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అంటూ రాజశేఖర్ చేసిన శేఖర్ పాత్ర పరిచయానికి సంబంధించిన సంభాషణలు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తాయి. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన వస్తోంది. 2022 జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్. -
మా కుమార్తెలు మేం గర్వపడేలా చేశారు: రాజశేఖర్, జీవిత
‘‘శివానీ హీరోయిన్గా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. నేనే నిర్మాతగా శివానీతో ఓ సినిమా చేయాలనుకున్నాను. వీలుపడలేదు. కానీ ఇప్పుడు ‘అద్భుతం’ లాంటి మంచి సినిమాతో శివానీ హీరోయిన్గా పరిచయం అయింది. శివానీ నటనను మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్కాల్స్, మెసేజ్లు వచ్చాయి. ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక మేం గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. తేజా సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘అద్భుతం’. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్ను కొనలేం. కష్టపడి సాధించుకోవాలి. ‘అద్భుతం’లాంటి సినిమాతో శివానీకి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘నేను హీరోయిన్గా అంగీకరించిన సినిమాలు ఏదో కారణం చేత ఆగిపోతూనే ఉన్నాయి. ‘అద్భుతం’ సినిమాతో నా కల నిజమైంది. నా తొలి సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు శివానీ. ఈ కార్యక్రమంలో శివాత్మిక, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, లక్ష్మీభూపాల్, సృజన్లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నా, కానీ!: రాజశేఖర్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ సారి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు, ఫిర్యాదులతో పాటు వ్యక్తిగత దూషణలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఈ సారి లోకల్-నాన్ లోకల్ అనే అంశం కూడా ఎన్నికల్లో వినిపిస్తోంది. దీంతో చివరికి మా అధ్యక్షు పీఠం ఎవరికి దగ్గనుందనేది ఆసక్తిగా మారింది. ఇక మా ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నటుడు జీవిత రాజశేఖర్ తొలిసారిగా మా ఎన్నికలపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా ఆయన భార్య జీవిత, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అందుకే ప్రకాశ్ రాజ్ మేనిఫెస్టో విడుదల చేయలేదు: జీవిత ఈ క్రమంలో ప్రకాశ్ ప్యానల్ నిర్వహించి ప్రెస్మీట్లో రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట తాను ఏ ప్యానల్కు సపోర్టు చేయకూడదని, ‘మా’ ఎన్నికల విషయంలో న్యూట్రల్గా ఉండాలనుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం ‘తెలుగు సినీ ఇండస్ట్రీ మరింత కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలంటే మా అసోసియేషన్కు తగిన అధ్యక్షుడు కావాలి. అసోసియేషన్ అధ్యక్ష పీఠం పెత్తనం కోసం కాదు.. అదొక బాధ్యత. సభ్యుల సంక్షేమం, మా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడే పదవి. అందుకే నేను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. కానీ అదే సమయంలోనే ప్రకాశ్ రాజ్ మా ఇంటికి వచ్చారు. చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే ‘మా’ అసోసియేషన్ సంక్షేమం కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారో వివరించారు. ప్రకాశ్ రాజ్ ఆలోచనలు విన్న తర్వాత నా మనసు మార్చుకున్న. ‘మా’ అధ్యక్ష పదవికి ఆయనే తగిన వాడని అనిపించింది. అందుకే ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాను. ‘మా’ అసోసియేషన్ అభివృద్ధికి చాలా డబ్బులు అవసరం. అందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకాశ్ రాజ్కు వివిధ సినిమా ఇండస్ట్రీలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఫండ్ రైజింగ్ కోసం ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహించగలరు. అందుకే ప్రకాశ్ రాజ్కు మద్దతు ప్రకటిస్తున్నాను. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీ చేస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. -
అందుకే ప్రకాశ్ రాజ్ మేనిఫెస్టో విడుదల చేయలేదు: జీవిత
మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. అయిన ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తమ మేనిఫేస్టోని ప్రకటించకపోవడం గమనార్హం. గతంలో తమ మేనిఫెస్టో చూస్తే మోహన్ బాబు నేరుగా వచ్చి ఓటు వేస్తారని చెప్పిన ఆయన ఇంతవరకు తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికలు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రుకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రెటరీ పదవి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ తాజాగా సాక్షితో టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడంపై ఆమె వివరణ ఇచ్చారు. చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే ఈ మేరకు జీవిత.. మేనిఫేస్టో విడుదల చేయడంపై ప్రకాశ్ రాజ్ గారితో తాను మాట్లాడానని చెప్పారు. దీనికి ఆయన ఇప్పటికే మనం టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ చానల్లో, ‘మా’ సభ్యులతో తరచూ కలిసి మన మ్యానిఫెస్టో గురించి మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎజెండా ఎంటన్నది క్రిస్టల్ క్లియర్గా వివరించామని, ఇక దీనినే మనం పేపర్లో పెట్టి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పడం అంతా సెన్సిబుల్ అనిపించడం లేదని అన్నట్లు ఆమె తెలిపారు. ఇక విష్ణు రూ. 10 వేలు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడని మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్, ఓట్లు కొనుగోలు అంశంపై జీవిత స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదన్నారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే నాగబాబు గారు మాట్లాడరనేది నిజమే కానీ ఆయనకు ఏం ఫీలర్ వచ్చిందో తనకు తెలియదన్నారు. ఇలాంటి వార్తలు ఎన్నో పుట్టుకోస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్పై కూడా పలు రూమర్స్ వచ్చాయన్నారు. దీనిపైనే ఆయన మాట్లాడి ఉంటారని, ఏం జరుగుతుందన్నది సభ్యులు తెలుసుకుంటారని, అలాంటిది ఏమైన జరుగుతుంటేర్స్ సరైనదో కాదో మెంబర్స్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని జీవిత అన్నారు. అయితే ఒక ఎవిడెన్స్, ఫ్రూఫ్ లేకుండా మాత్రం సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారనేది చెప్పలేమని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
'మా' ఎన్నికలు: ఎన్టీఆర్ ఓటుపై జీవిత ఆసక్తికర వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గపరపడుతున్న కొద్ది ఇరు ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్దం తీవ్రమవుతుంది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘మా’ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మంచు విష్ణు టాలీవుడ్ పెద్దలను కలుస్తూ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కృష్ణంరాజులను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు. ప్రకాశ్ రాజు మాత్రం తనకు తనకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదని మీడియా ముందే చేప్పేశారు. కానీ, మెగా ఫ్యామిలీ మాత్రం పరోక్షంగా ప్రకాశ్ రాజుకు మద్దతు ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. (చదవండి: మంచు విష్ణు ప్యానెల్పై ప్రకాశ్రాజ్ ఫిర్యాదు) ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ ‘మా’ఎన్నికలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అక్టోబర్ 10న జరగబోయే ఎన్నికలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిప్రాయం ఏంటో ఆమె బహిర్గతం చేసింది. ఇటీవల ఓ పార్టీలో ఎన్టీఆర్ను కలిశానని చెప్పిన జీవిత... ‘మా’ ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం చెప్పి ఓటు వేయాలని అభ్యర్థించగా, ప్రస్తుత పరిస్థితులపై ఆయన అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని అన్నారని, ఓటు వేసేందుకు రానని ఆయన తేల్చి చెప్పారని జీవిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ చెప్పినట్లు ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ‘మా’ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందకు తీసుకువస్తున్నారని ఆమె ప్రశ్నించారు. -
మంచు విష్ణు ప్యానెల్పై ప్రకాశ్రాజ్ ఫిర్యాదు
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం మరింత ముదురుతుంది. మంచు విష్ణు ప్యానెల్పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు తన ప్యానెల్ సభ్యులు శ్రీకాంత్, జీవితలతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.చదవండి: Prakash Raj: 'పెద్దల ఆశీర్వాదం నొకొద్దు.. సత్తా ఉన్నవాడే గెలవాలి' 'మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్కు అర్హులు ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. 60మందితో పోస్టల్ బ్యాలెట్లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారు. కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి' అంటూ ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: 'మా' ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు -
నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?: జీవితా రాజశేఖర్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 'మా' ఎన్నికల్లో నరేష్ మాటల్ని నమ్మి తప్పుచేశాం అని, ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదని పేర్కొన్నారు. తప్పులు చేయడం సహజమని, వాటిని సరిదిద్దుకున్నామన్నారు. ఎవరు ఏ ప్యానెల్లో ఉంటారన్నది వాళ్ల ఇష్టమన్న జీవిత.. మా ఎన్నికలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలన్నారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మద్దతుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు 'బండ్ల గణేష్ నాపై ఆరోపణలు చేశారు కాబట్టే ఆయన గురించి మాట్లాడాను. పృథ్వీ కూడా నాపై ఆరోపణలు చేశారు. ఎందుకు జీవితా రాజశేఖర్ను టార్గెట్ చేశారు?పృథ్వీ చేసిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నరేష్ అందరిని కలుపుకొని ముందుకు పోనందుకే విబేధాలు వచ్చాయి. నరేష్తో ఎందుకు విభేదాలు వచ్చాయో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను' అని జీవిత పేర్కొన్నారు. చదవండి: మా ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు -
జీవితపై చర్యలు తీసుకోవాలంటూ పృథ్వీ ఫిర్యాదు
-
'మా' ఎన్నికల్లో మరో వివాదం..జీవితపై పృథ్వీ కంప్లయింట్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో వివాదం చోటుచేసుకుంది. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. జీవిత తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్కు ఆయన లేఖ రాశారు. పృథ్వి ప్రస్తుతం మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి : MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్ మద్దతు MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ ఇదే -
చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్
Uttej Wife Padmavati Died: ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, బ్రహ్మాజితో పాటు పలువురు సినీ ప్రముఖులు బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: Actor Uttej: నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత ఇన్నాళ్లు ప్రతి పనిలో తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య మరణాన్ని తట్టుకోలేని ఉత్తేజ్.. చిరంజీవిని చూడగానే కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి కాళ్లమీద పడి ఉత్తేజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో చిరు, ప్రకాశ్ రాజ్లు సైతం భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన కూతురు చేతన, ఉత్తేజ్.. చిరుని పట్టుకుని ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇక కూతురు చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా పద్మావతి.. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. అంతేగాక ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. చదవండి: మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోరు మారుతోంది
-
ఇండిపెండెంట్గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్రాజ్
-
MAA Elections 2021: బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై స్పందించిన జీవిత
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకుసున్నాడు. తాను ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని స్పష్టం చేశాడు. అంతేకాదు ప్రకాశ్రాజ్ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ వెల్లడించాడు. (చదవండి: జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా..నేనెంటో చూపిస్తా: బండ్ల గణేష్) బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. తాజాగా ఆమె ఓ చానల్తో మాట్లాడుతూ..బండ్ల గణేశ్తో తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు. . ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు. బండ్ల గణేశ్ కూడా ‘మా’అభివృద్ది కోసం పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నానని, అంతేకాని తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జీవితా రాజశేఖర్, హేమ
MAA Elections 2021: మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నటి హేమ, జీవితా రాజశేఖర్లు ఈ సారి పోటీలో నిలబడతారని అందరూ భావించారు. అయితే వారు పోటీ చేయడం లేదని, తమ ప్యానల్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఆయన శుక్రవారం ‘సిని ‘మా’ బిడ్డల’ పేరుతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యుల కొత్త జాబితాతో పాటు, మెయిన్ సభ్యుల వివరాలు ప్రకటించారు. ఇందులో హేమ, జీవిత రాజశేఖరులు ఉండటం గమనార్హం. చదవండి: MAA Elections: ప్రకాశ్ రాజ్ ప్యానల్లో జీవితా రాజశేఖర్, హేమ ఈ మేరకు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని, తమకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తామన్నారు. ‘గతంతో నా ప్యానల్ సభ్యులను పరిచయం చేశాను. కానీ వారిలో కొందరూ మా ప్యానల్ సభ్యులు కాదు. ఈ సారి నా శ్రేయోభిలాషులు మాత్రమే’ అంటూ ప్రస్తుత ప్యానల్ సభ్యుల పేర్లను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సారి మహిళలకు సమాన అవకాశం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో హేమ, జీవిత రాజశేఖర్లు అధ్యక్ష బరిలో ఉండబోతున్నారని అందరూ భావించారని, ఈ విషయమై తను హేమగారితో మాట్లాడానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మనందరం కలిస ఉండాలి మీరేమంటారు అని ఆమెను అడగడంతో ప్రెసిడెంట్గా పోటీ చేయనని హేమ చెప్పినట్లు తెలిపారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ఆఫీసులో బిగ్బాస్ సభ్యులకు నైట్ పార్టీ! ‘‘మీ ఆలోచనలు నాకు నచ్చాయి. మీ ప్యానల్ నుంచి పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని హేమ అన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం హేమ చాలా ధైర్యవంతురాలని, గతంలో తనకు పనిచేసిన అనుభవం ఉన్నందువల్ల తమ ప్యానల్లోకి ఆమెను తీసుకున్నామన్నారు. ఇక జీవితా రాజశేఖర్ గారిని కూడా కలిసి రెండు గంటలకు పైగా మాట్లాడానని కూడా చెప్పారు. అంతేగాక తమ మా కార్యచరణను తన ముందు ఉంచానని, ఆ విషయాలన్ని జీవితా గారికి నచ్చాయన్నారు. దీంతో మా ప్యానల్లో పోటీ చేయడానికి ఆమె ఒప్పుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు రాజశేఖర్గారు కూడా మద్దతు ఇస్తానని చెప్పినట్లు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. -
MAA Elections 2021: మాలో మాకు పడదా?
మరోసారి రచ్చ మొదలైంది. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు మళ్ళీ ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్, ఇటు అంతకన్నా సీనియర్ నటుడైన మోహన్బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు, ఆ వెంటనే ఉన్నట్టుండి మరో నటి జీవితా రాజశేఖర్ ఒకరి తరువాత ఒకరు ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం ‘‘తోటివాళ్ళ ఒత్తిడితో’’ తానూ పోటీకి దిగుతున్నట్టు నటి హేమ ప్రకటించారు. దాంతో ఇప్పుడు సినీ‘మా’ నాలుగుస్తంభాలాట మొదలైంది. ‘మెగా’ మద్దతు ఎటువైపు? ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ రాజకీయ ప్రశ్నలు సంధించే ప్రకాశ్ రాజ్ పోటీ ప్రకటన నాటకీయంగానే సాగింది. ఆ మధ్య ఎన్నికల్లో పవన్కల్యాణ్ను విమర్శించిన ప్రకాశ్రాజ్, ఇటీవల ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో ‘మావి రాజకీయ సైద్ధాంతిక విభేదాలు మాత్రమే’ అంటూ ప్రశంసలు వర్షించారు. ఆ విమర్శలవేళ ప్రకాశ్రాజ్పై విరుచుకుపడ్డ మెగాబ్రదర్ నాగబాబు సైతం ఇప్పుడు ప్రకాశ్రాజ్ అభ్యర్థిత్వాన్ని బాహాటంగా సమర్థిస్తున్నారు. అంటే మెగాఫ్యామిలీ అండదండలు ప్రకాశ్రాజ్కు ఉన్నట్టే! నిజానికి, ఎన్నికల బరిలోకి దిగక ముందే చిరంజీవి మద్దతును ప్రకాశ్రాజ్ ముందుగా కోరారట. మెగాస్టార్ తమ పూర్తి మద్దతుంటుందని హామీ ఇచ్చారట. అన్న మాటకు తగ్గట్టే తమ్ముడు నాగబాబూ లైన్లోకి వచ్చి, ప్రకాశ్రాజ్ పోటీ చేస్తానని ప్రపంచానికి చెప్పీచెప్పగానే సమర్థించేశారు. ‘మెగా మద్దతు’ ఎటువైపు ఉందో సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇగో క్లాష్లు... ఎత్తుకు పైయెత్తులు... ఎవరికివారే గొప్పనుకొనే కళారంగంలో ఇగో క్లాష్లు కామనే! ఈ పోటాపోటీలోనూ అవి చాలా ఉన్నాయని ఖబర్. గతంలో ‘మా’ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన యువ హీరో మంచు విష్ణు, సీనియర్ ప్రకాశ్రాజ్కు ప్రత్యర్థిగా దిగడం వెనుక కారణాల్నీ పలువురు చర్చిస్తున్నారు. మోహన్బాబు తన పుత్రుడికి మద్దతు కోరి, చిరంజీవికి ఫోన్ చేశారట. అప్పటికే ప్రకాశ్రాజ్కు మద్దతు హామీ ఇచ్చేశాననీ, మాట తప్పలేననీ చిరంజీవి చెప్పారట. దాంతో మంచు కుటుంబం హర్ట్ అయ్యిందని కృష్ణానగర్ గుసగుస. అందుకే, తండ్రి ఆశీస్సులతో మంచు వారసుడు పోటీకి సై అంటే సై అన్నారని ఓ టాక్. జూన్ 20న మోహన్బాబు, విష్ణు స్వయంగా సీనియర్ నటుడు కృష్ణ ఇంటికి వెళ్ళి మద్దతు కోరారు. మరో సీనియర్ కృష్ణంరాజు ఆశీస్సులూ అందుకున్నారు. ఈ వ్యూహాత్మక ఎత్తుగడ సినీరంగంలో చీలిక, సామాజిక వర్గసమీకరణ అనే వాదనకు సోషల్ మీడియాలో తెర లేపింది. అలాగే, ‘మా’ సభ్యుడిగా పోటీకి అన్నివిధాలా అర్హుడైనప్పటికీ, ‘కన్నడిగుడైన ప్రకాశ్రాజ్కు తెలుగు నటుల సంఘానికి అధ్యక్షుడేమి’టనే ‘లోకల్– నాన్ లోకల్’ చర్చ తెలివిగా తెరపైకొచ్చింది. నిజానికి, బయటకు ‘టామ్ అండ్ జెర్రీ’ ఆటలా ఉన్నా, ఆంతరంగికంగా మెగా, మంచు పెద్దల మధ్య మంచి స్నేహం ఉంది. మరి తాజా పోటాపోటీ, ఇగో క్లాష్ల పర్యవసానం ఏమిటి? పోటీలోకి మరికొందరు! మరోపక్క ప్రస్తుత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి జీవిత, ఇప్పటికే ‘మా’లో వివిధ పదవులు నిర్వహించిన హేమ లాంటి తారలూ అధ్యక్షపదవి పోటీకి దిగడంతో కథ కొత్త మలుపు తిరిగింది. వీరిని ఎటో ఒకవైపు తిప్పుకొనే ప్రయత్నాలూ సాగుతున్నట్టు సమాచారం. ఇక, ఎన్నికల వేళ ఏవో పాత సమస్యలను లేవనెత్తుతూ... బరిలోకి దిగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండనే ఉంటారు. ఇప్పటికైతే పోటీలో ఇన్ని పేర్లు వినిపిస్తున్నా, పోలింగ్ తేదీ నాటికి ఇంతమందీ బరిలో ఉంటారా అన్నదీ అనుమానమే. 2015 ఎన్నికలలో సహా, అనేకసార్లు పెద్ద పోస్టులకు పోటీ దిగినవారు సైతం ఆఖరు నిమిషంలో బరిలో నుంచి తప్పుకున్నారు. ఈసారీ అలాంటివి జరగవచ్చు. ఎందుకింత మోజు... క్రేజు..? ‘మా’ అధ్యక్షపదవికి ఇంత పోటీ, మోజు ఉండడం ఆశ్చర్యమే! సభ్యుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం 1993 అక్టోబర్ 4న మొదలైన ‘మా’కు రెండేళ్ళకోసారి ఎన్నికలవుతాయి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్బాబు, నాగబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా తదితరులు ‘మా’ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. మురళీమోహన్ అత్యధికంగా 6సార్లు (12 ఏళ్ళు) అధ్యక్షపదవి నిర్వహించారు. అయితే, దాదాపు రూ. 3 కోట్ల చిల్లర కార్పస్ ఫండ్ మినహా ‘మా’కు ఆస్తులూ, అంతస్థులూ లేవు. నిధుల సమీకరణ కోసం ఒకçప్పటి బెనిఫిట్ షోలూ ఇటీవల లేవు. పెన్షన్, బీమా లాంటి సంక్షేమ చర్యల ఖర్చుతో ఆ నిధీ అంతకంతకూ తరిగిపోతోంది. ఎన్నికలొస్తే... గాలిలో సొంత మేడలు! ఇక గడచిన రెండు దశాబ్దాలుగా ఎప్పుడు ‘మా’ ఎన్నికలు జరిగినా వినిపించే హామీ– ‘మా’కు సొంత భవన నిర్మాణం! కానీ ఎంతమంది ప్రెసిడెంట్లు హామీ ఇచ్చినా – అది వట్టి ఎన్నికల హామీగానే మిగిలింది. ప్రతిసారీ ఎన్నికలప్పుడు మాత్రమే సొంత భవనం కల తెర మీదకొచ్చి, ఆ తరువాత అదృశ్యమవడం ఆనవాయితీ అయింది. రానున్న ఎన్నికలకూ అభ్యర్థులందరూ ఆ సొంత ఇంటి పాతపాటనే మళ్ళీ ఎత్తుకున్నారు. అంతా (అ)సమైక్య రాగమే! ఎన్ని వాదవివాదాలైనా ఎన్నికలైపోయాక మళ్ళీ ‘అందరం సినిమాతల్లి ముద్దుబిడ్డలం. మేమందరం ఒకటే. ‘మా’లో మాకు విభేదాలు లేవు’ అంటూ గ్రూప్ ఫోటోలు దిగడం కామన్. లోపల లుకలుకలు, ఇగోలున్నా పైకి మాత్రం ఇలా సమైక్యరాగం ఆలపిస్తుంటారని అందరికీ ఇట్టే అర్థమైపోతుంటుంది. 2015లో పాపులర్ ‘రాజేంద్రప్రసాద్ వర్సెస్ జయసుధ’ పోటాపోటీలో రాజేంద్రప్రసాద్ గెలిచిన తరువాత నుంచి ‘మా’ అనైక్యత తరచూ వీధికెక్కుతోంది. ప్రస్తుతం సీనియర్ నరేశ్ ప్రెసిడెంటైన కార్యవర్గంలోనైతే కుమ్ములాట తారస్థాయికి చేరింది. ప్రమాణ స్వీకారం రోజున తోటి నటి (హేమ) మైకు లాక్కోవడం దగ్గర నుంచి సాక్షాత్తూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (రాజశేఖర్) వేదికపై విభేదాలను ప్రస్తావించడం, రాజీనామా దాకా ఎన్నో పరిణామాలు – గడచిన రెండేళ్ళలో ‘మా’ను రచ్చకీడ్చాయి. ఒక దశలో నరేశ్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా మెజారిటీ కార్యవర్గ సభ్యులు కలిసి, కనివిని ఎరుగని రీతిలో ‘అభిశంసన తీర్మానం’తో, పదవి నుంచి తొలగించే ప్రయత్నమూ జరిగింది. చివరకు రాజీబాటలో కొన్నాళ్ళు నరేశ్ సెలవు మీద వెళ్ళి, మరో సీనియర్ నటుడు బెనర్జీ తాత్కాలికంగా అధ్యక్షబాధ్యత నిర్వహించాల్సొచ్చింది. ఇక తాజాగా మూడు నెలల తర్వాత జరగాల్సిన ఎన్నికలకు ఇప్పటి నుంచే మొదలైన పోటాపోటీ ఎటు దారితీస్తుందో చూడాలి. కరోనా కష్టకాలంలో ఆర్టిస్టుల కష్టాల కన్నా ఎన్నికల మీద అందరూ దృష్టి పెట్టడమే విచిత్రం! ‘మా’ ప్రతిష్ఠను మసకబార్చే ఈ పోటాపోటీ అసలే థియేటర్లు, సినిమాలు లేని కరోనా వేళ ఆడియన్స్కు అనవసర వీధి వినోదాన్ని అందించడమే విషాదం!! ఈసారైనా స్టార్లు వస్తారా? కేవలం 150 మంది సభ్యులతో మొదలైన ‘మా’లో దివంగతుల సంఖ్య పోగా, ఇప్పుడున్నది 828 మంది సభ్యులే! వీరందరూ ఓటర్లే. వీళ్ళలో అధికశాతం మంది చిన్నాచితకా ఆర్టిస్టులే. అందుకే, పోలింగ్ రోజున ఓటేసే యువ హీరో, హీరోయిన్లు తక్కువే. మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి నేటి టాప్ స్టార్లయితే కొన్నేళ్ళుగా వార్షిక సర్వసభ్య సమావేశాల్లో కానీ, పోలింగ్ లో కానీ కనపడనే లేదు. ఒక్క 2004, 2015లలో తప్ప మరెప్పుడూ ‘మా’ ఎన్నికలలో భారీగా ఓటింగూ జరగలేదు. సగటున ప్రతిసారీ పోలయ్యేది 400 ఓట్లే! అయితే, గ్లామర్ నిండిన సినీ సమరం కావడంతో ఈ మాత్రానికే ప్రచారం మాత్రం మీడియాలో హోరెత్తిపోతుంటుంది. – రెంటాల జయదేవ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మా’ అధ్యక్ష బరిలో జీవిత
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగనున్న ‘మా’ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రేసులో జీవితా రాజశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జీవిత. అధ్యక్ష పదవిలో ఉంటే ఇంకా ఎక్కువగా సేవలు చేసే వీలుంటుందనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగారని సమాచారం. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్, యంగ్ హీరో విష్ణు పోటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జీవిత పేరు కూడా చేరడంతో ‘మా’ ఎన్నికల గురించి వాడి వేడి చర్చలు మొదలయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడాలనుకుంటున్న విషయాన్ని మరో రెండు రోజుల్లో జీవిత అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. -
ఆస్పత్రి నుంచి రాజశేఖర్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్ : హీరో రాజశేఖర్ కరోనాను జయించారు. సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారంతా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఆయన భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక త్వరగా ఈ మహమ్మారి నుంచి బయట పడగా.. రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం కాస్త క్షీణించింది. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. (చదవండి : చిరంజీవికి కరోనా పాజిటివ్) గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. ఆయన ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా రాజశేఖర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నెగిటివ్ రావడంతో ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేసారు. ఈ విషయాన్నీ రాజశేఖర్ సతీమణి జీవిత తెలిపారు. మెదట్లో ఆయన ఆరోగ్యం చలా క్రిటికల్ స్టేజికి వెళ్లిందని, వైద్యులు తీవ్రంగా కృషి చేసి ఆయనను కాపాడరని జీవిత అన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. Jeevitha Rajasekhar thanked Doctors and medical staff of City Neuro Centre for their support during the treatment @ActorRajasekhar pic.twitter.com/Klkjj6CGJe — BARaju (@baraju_SuperHit) November 9, 2020 -
రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) -
నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చేరిన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని ప్రకటిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆసుపత్రిలోనే ఇంకా చికిత్స కొనసాగుతుందని, నిపుణలైన వైద్య బృందం నిరంతం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంటూ ఆయన కుమార్తె శివాని సైతం ట్వీట్ చేశారు. మీ అందరి ప్రార్థనలు, ఆశీస్తులకు కృతఙ్ఞతలు అని తెలిపింది. మరోవైపు రాజశేఖర సతీమణి జీవితకు కరోనా నెగిటివ్ రావడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇటీవలె నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. (రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ ) Team of doctors @CitiNeuro lead by Dr.Krishna garu have been taking the best care of my father . His condition is stable and he is responding to the medication! Thanks for all ur best wishes and prayers ..means a lot 🙏 — Shivani Rajashekar (@Rshivani_1) October 24, 2020 -
అవును.. మాకు కరోనా సోకింది
సాక్షి, హైదరాబాద్: నటుడు జీవితా రాజశేఖర్ కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనతో పాటు భార్య జీవిత, పిల్లలు శివానీ, శివాత్మికలకు కరోనా సోకిన విషయం నిజమేనని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ‘పిల్లలిద్దరూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత, తాను మాత్రం ఇంకా వైద్యుల సంరక్షణలోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మా ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు. హిందీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్లో శివానీ నటిస్తుండగా, విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలోనూ కథానాయికగా ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాతో హీరోయిన్గా శివానీ పరిచయం కానుంది. ఇక నూతన దర్శకుడు దుర్గానరేశ్ గుట్ట డైరెక్షన్లో ‘విధివిలాసం’ సినిమాలో శివాత్మిక నటిస్తుంది. ఈ సినిమాలో అరుణ్ అదిత్ జోడిగా ఆమె కనిపించనున్నారు. (ఇంటికి చేరుకున్న హీరోయిన్.. ఆత్మీయ స్వాగతం) The news is true that Jeevitha, Kids and I have tested positive for corona and are currently being treated in the hospital. Both the kids are completely out of it, Jeevitha and I are feeling much better and will be back home soon! Thank you ! — Dr.Rajasekhar (@ActorRajasekhar) October 17, 2020 -
కరోనా క్రైసిస్: శివాని, శివాత్మిక ఉదారత
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ లాక్డౌన్ కారణంగా రోజువారీ కార్మికులకు పనిలేకుండా పోయింది. రెక్కాడితేగాని డొక్కాడని పేద సిని కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. మనకోసం (కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం) ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో సిసిసికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటీనటులు జీవితా రాజశేఖర్ల ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మికలు పేద కార్మికుల కోసం తమ వంతుగా సాయం ప్రకటించారు. సిసిసికి శివాపి, శివాత్మికలు చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు జీవితా రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇప్పటికే రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించాము. ఈ కార్యక్రమం కరోనా క్రైసిస్ ఉన్నంతవరకు సాగుతుంది. అయితే పేద సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీలో మా కుటుంబం కూడా భాగం అయింది. మా ఇద్దరు కుమార్తెలు శివాణి, శివాత్మికలు తమ సంపాదన నుంచి చెరో లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి, కష్టాల్లో ఉన్న పేద కార్మికులకు సహాయం అందించడంలో మా కుటుంబం సహాయం ఎప్పుడూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల పంపిణీలో మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. Inspired by Nanna and Amma,@Rshivani_1 and I will be contributing rupees 1 lakh each from our earnings to the #coronacrisischarity Proud to see our industry come together during this crisis! Love you all Take care🤗 We'll make it through this🙏🙌 — Shivathmika Rajashekar (@ShivathmikaR) April 4, 2020 @Rshivani_1 & @ShivathmikaR Contributed 1 lakh rupees each from their earnings to the #coronacrisischarity Here's everything I want to say! 😊 pic.twitter.com/DZ7D4Qi7cp — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 4, 2020 చదవండి: ప్రధాని పిలుపుపై రామ్ చరణ్ ట్వీట్ పెద్ద మనసు చాటుకున్న నయనతార -
పేద కళాకారులకు అండగా జీవిత–రాజశేఖర్
కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏరోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’లో (మా) కొందరు ఉన్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్– జీవితా రాజశేఖర్ ప్రకటించారు. నిరుపేద కళాకారులు 90108 10140 నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందాలని కోరారు. -
జీవిత చేతుల మీదుగా ‘అమ్మ దీవెన’ ట్రైలర్..
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్యలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర ట్రైలర్ను నటి, దర్శకనిర్మాత జీవిత రాజశేఖర్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘అమ్మ దీవెన డైరెక్టర్ శివ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్ర హీరోయిన్ ఆమని మంచి నటి. రాజశేఖర్తో అమ్మా కొడుకు మూవీలో నటించినప్పటి నుంచి ఆమని నాకు పరిచయం. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మేము ఆమని మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నాము, అలాగే ఆమని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత తాను మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి, మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీస్తున్నారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మదీవెన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరి ఆధర అభిమానాలు పొందాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ట్రైలర్ లాంచ్ చేసిన జీవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆమని గారికి కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగులుతుంది, సినిమా చాలా బాగా వచ్చింది. ఒక బాధ్యతలు లేని భర్తతో ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు పడింది. వారిని ఎలా ప్రయోజకుల్ని చేసింది అనేది కథాంశం’ అని నిర్మాత మారయ్య అన్నారు. పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, యశ్వంత్, నాని యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వెంకట్ అజ్మీర సంగీతమందిస్తున్నాడు. -
‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్పై..
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్పై చర్యలు తీసుకోవాలని 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్, జయలక్ష్మి, మహ్మద్ అలీ, ఎంవీ బెనర్జీ, రాజారవీంద్ర, ఉత్తేజ్లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్... తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. -
అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’
నూతన దర్శకుడు దుర్గానరేశ్ గుట్ట డైరెక్షన్లో రొమాంటిక్ హీరో అరుణ్ అదిత్, ‘దొరసాని’ ఫేమ్ శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విధివిలాసం’. శివదినేశ్ రాహుల్, అయ్యర్ నకరకంటితో పాటు ఎస్కేఎస్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్నగర్లోని ఓ ఆలయంలో పూజాకార్యక్రమాల అనంతరం ఈ సినిమాను ప్రారంభించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్కు స్క్రిప్ట్ను అందించగా.. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించాడు. తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, సత్య, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన శివాత్మిక.. తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్గా అంతగా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక 24 కిస్సెస్ చిత్రంతో అరుణ్ అదిత్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఓ రకంగా చెప్పాలంటే హీరోహీరోయిన్లుగా వీరిద్దరికి ఇది రెండో సినిమా. మరి ద్వితీయ విఘ్నాన్ని వీరు అధిగమిస్తారో లేదో చూడాలి. చదవండి: దొరసాని’ మూవీ రివ్యూ హృదయాలను గెలుచుకున్న పూజా -
నటుడు రాజశేఖర్ లైసెన్స్ రెన్యువల్కు నో..
బండిపై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపినా.. డ్రైవింగ్ లైసెన్స్పై వేటు పడుతుంది. సాధారణంగా చాలామంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు తమను గమనించడం లేదనే ఉద్దేశంతో సిగ్నల్ జంపింగ్, ఓవర్స్పీడ్, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ నిఘా కెమెరాలకుచిక్కుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల హ్యాండీ కెమెరాలు సైతం క్లిక్మనిపిస్తున్నాయి. ఇలా పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఏడాది కాలంలో 1,242 డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధిలో 531, అత్తాపూర్ ఆర్టీఏ పరిధిలో 699 ఉన్నాయి. షాద్నగర్ పరిధిలో మరో 12 ఉన్నాయి. వీటిలో డ్రంకన్ డ్రైవ్ కింద పట్టుబడిన వారు సైతం ఉన్నారు. సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పాయింట్ల పద్ధతిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 24 నెలల వ్యవధిలో 12 ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వివిధ ఉల్లంఘనలపై 3 నెలల నుంచి 6 నెలల వరకు సస్పెన్షన్ విధించారు. ఇలా మేడ్చల్ ఆర్టీఏ పరిధిలో ఒక లైసెన్స్ రద్దు కాగా, ఏడాది కాలంలో 1,120 మంది వాహనదారుల లైసెన్సులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక డ్రంకెన్ డ్రైవ్ కింద పట్టుబడి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొన్న మరో 122 మంది లైసెన్సులను సైతం 6 నెలల వరకు రవాణా అధికారులు సస్సెండ్ చేశారు. ఓవర్లోడ్ కేసులే ఎక్కువ.. రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లిన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్సులు ఎక్కువగా సస్సెండ్ అయ్యాయి. 338 మంది అలా తమ డ్రైవింగ్ లైసెన్సుల అర్హతను తాత్కాలికంగా కోల్పోయారు. ఇక సరుకు రవాణాకు వినియోగించే వాహనాల్లో ప్రయాణికులను తరలించిన మరో 17 మంది డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను సైతంఆర్టీఏ 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. సెల్ఫోన్లో మాట్లాడినా.. బండి నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడారో ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే కాదు. డ్రైవింగ్ లైసెన్సును సైతం కోల్పోవాల్సిఉంటుంది. అలా ఏడాదిలో 126 లైసెన్సులపై ఆర్టీఏ వేటు వేసింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే 3 పాయింట్లు నమోదవుతాయి. రెండేళ్లలో 12 పాయింట్ల వరకు నమోదైతేలైసెన్సుపై వేటు పడుతుంది. ఇలా 126 లైసెన్సులపై సస్పెన్షన్ విధించారు. ఓవర్స్పీడ్, రాష్ డ్రైవింగ్ వంటి కారణాలతో 9 లైసెన్సులను, సిగ్నల్ జంపింగ్పై 23 లైసెన్సులను ఆర్టీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. నటుడు రాజశేఖర్ లైసెన్స్ రెన్యువల్కు నో.. ఇటీవల రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సినీనటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయబోమని రవాణా అధికారులు స్పష్టం చేశారు. ఆయన వాహనం నడిపే సమయానికే డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిందని, దానిని రెన్యువల్ చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపారని జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ రమేష్ తెలిపారు. వివిధ రకాల ఉల్లంఘనల కింద 3 నెలల నుంచి 6 నెలల వరకు సస్పెండైన లైసెన్సులు ఆ తర్వాత చెల్లుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. -
‘మా’ లో రచ్చ.. స్పందించిన జీవితారాజశేఖర్
-
ప్రమాదంపై స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: తన భర్త పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ప్రముఖ నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రేమాభిమానాలతో కారు ప్రమాద ఘటన నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. రాజశేఖర్ కారు ప్రమాదంపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నమైన వార్తలు రావడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘కారు ప్రమాదంపై రకరకాల వార్తలు వస్తుండటంతో వాస్తవాలు వెల్లడించేందుకు మీ ముందుకు వచ్చాను. రాజశేఖర్ గారు మంగళవారం అర్ధరాత్రి ఘాటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా కారు టైరు పేలిపోవడంతో నియంత్రణ తప్పి డివైడర్ను ఢీకొని పక్కవైపు పడిపోయింది. ఎదురుగా వస్తున్న కారులో ఉన్నవారు ఆగి రాజశేఖర్ గారిని గుర్తించారు. వారి సహాయంతో కారులోంచి బయటకు వచ్చారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ల ఫోన్ నుంచి పోలీసులకు, మాకు ఫోన్ చేశారు. నేను వీళ్ల కారులోనే వస్తున్నాను మీరు ఎదురురండి అని మాతో చెప్పారు. మేము బయలుదేరి సగం దూరం వెళ్లి ఆయనను మా కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాం. పోలీసులకు విషయాన్ని వివరించాను. రాజశేఖర్ గారు క్షేమంగానే ఉన్నారు కదా అని ఒకటికి రెండుసార్లు అడిగారు. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి దెబ్బలు తగల్లేదని చెప్పారు. ఈ ఉదయం కూడా శంషాబాద్ సీఐ వెంకటేశ్ గారితో మాట్లాడాను. ప్రమాదం జరిగిన తీరుపై ఒకసారి స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. రాజశేఖర్ కోలుకున్నాక స్టేషన్కు రమ్మన్నారు. ఇది కచ్చితంగా పెద్ద ప్రమాదం. రాజశేఖర్ గారిని అభిమానించే అందరి ప్రేమాభిమానాలతో ఆయన క్షేమంగా బయటపడ్డార’ని జీవిత వివరించారు. (ప్రాథమిక వార్త: హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం) -
పెద్ద ప్రమాదమే: జీవితా రాజశేఖర్
-
ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్!
హైదరాబాద్ ఫిల్మ్చాంబర్లోని నిర్మాతల మండలి హాలులో ఆదివారం (20వ తేదీ) తెలుగు సినిమా నటీనటుల సంఘం ‘మా’ జనరల్ ఆత్మీయ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ కార్యదర్శి జీవితారాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆదివారం జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం.. ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన సమావేశ వివరాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. ఆదివారం 9గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సమావేశం జరిగింది. 28 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఆ సమావేశంలో ‘మా’ లాయర్ గోకుల్గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్గారు కూడా ఉన్నారు. ‘మా’లో ఉన్న 900 మందికిపైగా సభ్యుల్లో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే 21రోజుల్లోగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు వచ్చి సంతకాలతోనో, రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్ ద్వారానో, పోస్ట్ ద్వారానో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. -
‘మా’ సమావేశంపై జీవితా రాజశేఖర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అత్యవసర సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడు నరేశ్ లేకుండానే ఈ సమావేశం జరగడంతో ‘మా’లో మరోసారి వివాదాలు తలెత్తాయని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం అని సభ్యులు పేర్కొన్నప్పటికీ అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కార్యవర్గ సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. అయితే నిన్నటి సమావేశంపై ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ స్పందించారు. అసలు సమావేశం నిర్వహించడానికి గల కారణాలు, చర్చించిన అంశాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ‘ఆదివారం జరిగిన సమావేశం ఆత్మీయ సమ్మేళనం, అంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించాము. ముఖ్యంగా కొంతమంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే వాటిని పరిష్కరించలేకపోయాము. దానికి అనేక కారణాలున్నాయి. ఈ క్రమంలో సభ్యుల మధ్య వాదోపవాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే సమావేశం వాడివేడిగా జరిగిన ఉపయోగకరమైన మీటింగ్గా భావిస్తున్నాం. ఈ సమావేశంలోనే మెజారీటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టాలని కోరారు. అయితే 20 శాతం మంది ‘మా’ సభ్యులు ఆమోదం తెలపితేనే ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇది జరిగితేనే ‘మా’సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. 20 శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపిన 21 రోజుల్లోపు తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మీటింగ్ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. మీటింగ్ జరగాలని కోరుకునేవారు ‘మా’ కార్యాలయానికి వచ్చి సంతకాలతో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఫీసులకు వచ్చే వీలు లేనివారు లేఖలు, ఈమెయిల్స్తో మద్దతు తెలిపినా పరిగణలోకి తీసుకుంటాం’అంటూ జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. -
వివరాలు తర్వాత చెబుతాం: జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆత్మీయ సమావేశం ఎట్టకేలకు ముగిసింది. త్వరలోనే మరోసారి అందరూ సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. ‘మా’లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. సినీ పెద్దల సూచనలు, సలహాలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. కాగా సమావేశం ముగిసిన అనంతరం మా అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్, ఆయన భార్య జీవిత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, వివరాలు తర్వాత చెబుతామని తెలిపారు. కాగా నరేశ్ అధ్యక్షతన ఏర్పడిన మా కొత్త కార్యవర్గం సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కాకముందే రెండు వర్గాలుగా ఏర్పడటంతో విభేదాలు పొడచూపాయి. అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయని వార్తల నేపథ్యంలో.... ఆదివారం మా’ సభ్యుల సమావేశంఉందంటూ జీవితా రాజశేఖర్ మెస్సేజ్ ఇవ్వడం నరేశ్ కార్యవర్గానికి షాక్కు గురిచేసింది. అయితే కోర్డు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు: కరాటే కల్యాణి త్వరలోనే ‘మా’ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం కూడా జరుగుతుందని మా ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి తెలిపారు. ఆమె ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘ ఈ రోజు జరుగుతున్న సమావేశం ఆత్మీయ సమ్మేళనం మాత్రమే. అసోసియేషన్లో రెండు గ్రూలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అందరం ఒక్కటిగా కూర్చొని మా సమస్యలు పరిష్కరించుకుంటాం.’ అని అన్నారు. పెద్దలు జోక్యం చేసుకోవాలి.. సినీ నటుడు మాణిక్ మాట్లాడుతూ... మా అసోసియేషన్లో చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ల మధ్య చిన్న గొడవలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మరోసారి భేటీ అవుతాం. సినీ పెద్దలు చిరంజీవి, వెంకటేశ్, కృష్ణంరాజు, బాలకృష్ణ తదితరులు కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలి’ అని కోరారు. చదవండి: నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ ‘మా’లో మరో కొత్త వివాదం.. -
‘మా’లో మరో కొత్త వివాదం..
-
‘మా’లో మొదలైన గోల..
సాక్షి, హైదరాబాద్: నరేశ్ అధ్యక్షతన ఏర్పడిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’కొత్త కార్యవర్గం సభ్యల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.. కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే కార్యవర్గ సభ్యుల మధ్య అంతరాలు పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య తీవ్రస్థాయిలో వివాదం నెలకొందని, అంతేకాకుండా నరేశ్కు షోకాజ్ నోటీసుల ఇవ్వాలని రాజశేఖర్ కార్యవర్గం సిద్దపడిందని అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ‘మా’ తీవ్రంగా ఖండించింది. అయితే ఆదివారం ‘మా’లో జరుగుతున్న నాటకీయ పరిణామాలను చూస్తే అధ్యక్షుడు నరేశ్కు రాజశేఖర్ కార్యవర్గం మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ‘మా’ సభ్యుల మీటింగ్ ఉందంటూ జీవితా రాజశేఖర్ మెస్సేజ్ ఇవ్వడం నరేశ్ కార్యవర్గానికి షాక్కు గురిచేసింది. అయితే కోర్డు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ తెలిపారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా పెడతారని నరేశ్ తరుపు లాయర్ ప్రశ్నిస్తున్నారు. దీంతో కాసేపట్లో మీటింగ్ ప్రారంభం కానుండటంతో అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఫండ్స్ కలెక్ట్ చేయలేదని, చాలా రోజుల నుంచి నరేశ్ మీటింగ్స్కు రావడం లేదని రాజశేఖర్ కార్యవర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా ‘మా’ కు రాజశేఖర్ భారీ విరాళం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఐదున్నర కోట్లు ఏమయ్యాయి? మా కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలల అవుతున్నా ఇప్పటివరకు ఫండ్స్ కలెక్ట్ చేయలేదని ఆధ్యక్షుడు నరేశ్పై రాజశేఖర్ కార్యవర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా మా లో ఉన్న మూల ధనం రూ. 5.5 కోట్లు ఏమయ్యాయని అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు. గతంలో మూల ధనాన్ని కదపకుండా ఈవెంట్స్ స్పాన్లర్ల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసిందని, కానీ నరేశ్ మూలధనం నుంచే ఖర్చులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు ‘మా’లో ఏర్పడిన పరిస్థితిక నరేశే కారణమంటూ జీవిత రాజశేఖర్ కార్యవర్గం మండిపడుతోంది. ‘మా’గౌరవాన్ని కాపాడుదాం కోర్డు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని ‘మా’ చీఫ్ అడ్వైజర్ కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా ఈ మీటింగ్కు వచ్చిన వారి చేత ఎలాంటి సంతకాలు పెట్టించమన్నారు. ఒకవేళ సంతకాలు పెట్టిదలచిన వారు పూర్తిగా విషయం గురించి చదివి సరియైనది అని భావిస్తేనే సంతకం పెట్టాలన్నారు. ఏ నిర్ణయమైనా అందరూ కలిసి చర్చించుకుని తీసుకోవాలన్నారు. 25 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ ఇప్పటివరకు అందరూ మెచ్చుకునేలా ఉందని, ఇకపై కూడా అలాగే గౌరవంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు. -
అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా: అనిల్ రావిపూడి
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. 'ఎయిర్ టెల్' మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్లు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, యంగ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ ఫంక్షన్ కి నేను అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చాను. సాయి కుమార్ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను అటెండ్ కావడం లేదు మన ఫ్యామిలీ మెంబర్గా నువ్వు వెళ్ళు అన్నారు. ఆది చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో అతడికి మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైటర్ గా అబ్బూరి రవి గారు తెలుసు. యాక్టర్ గా ఆయనేంటో ఈ సినిమాలో చూస్తాం. ఆయన మంచి ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకోవాలని... మళ్లీ మాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ’అని అన్నారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ‘టైటిల్ బాగుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ సినిమాను నిర్మించి, విడుదల చేస్తున్నప్పుడు... యూత్ ఎట్రాక్ట్ అవుతారు. మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అబ్బూరి రవి గారి గురించి జీవిత, అడవి శేష్ నాకు చెబుతూ ఉంటారు. ఆయన ఫేమస్ రైటర్. చేయి పెడితే గోల్డే. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అబ్బూరి రవి గారు నటించడం కస్టమన్నారు. కాదు... రాయడమే కష్టం. రైటర్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని నేను అనుకునేవాడిని. అయితే... 'ఎవడైతే నాకేంటి' కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు రైటర్ కష్టం తెలిసింది. అప్పుడు రైటర్స్ కి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని అనుకున్నా. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు’ అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘సాయి కుమార్, సురేఖ దంపతుల బదులు రాజశేఖర్ గారు, నేను వచ్చాం. వాళ్ళిద్దరికీ ఆది ఎంతో... మాకు అంతే. ఇప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు నటిస్తున్నారు. వాళ్ళ సినిమాలు విడుదలైతే నేను ఎంత టెన్షన్ పడతామో... ఆది సినిమా విడుదలైనా అలాగే ఫీల్ అవుతాం. ఇక్కడికి వచ్చాక ఈ సినిమా కథ గురించి తెలిసింది. సైనికుల త్యాగాల గురించి తెలుసుకున్నా. సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలనే ఆలోచనను ఇందులోని దేశభక్తి గీతం కలిగించింది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు అతడిని లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా చూశాం. కానీ, ఆర్మీ అధికారిగా చాలా బాగా చేశాడు’ అన్నారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘కశ్మీర్ ప్రతికూల పరిస్థితులు, వాతావరణం మధ్యలో కథలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. నీళ్లు కింద పోస్తే సెకన్లలో మంచులా మారేది. అటువంటి పరిస్థితుల్లో మేం షూటింగ్ చేశాం. నిజంగా... కశ్మీర్ కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. సాయి కిరణ్ గారు కథ చెప్పి... ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రకు నిన్ను అనుకుంటున్నానని చెప్తే నేను నమ్మలేదు. సూట్ అవుతానా? లేదా? అని డౌట్ పడ్డాను. నన్ను నేను నమ్మలేదు. కానీ సాయికిరణ్ నన్ను నమ్మారు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అక్టోబర్ 18న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నా కోసమో... ఎవరి కోసమో కాదు... సాయికిరణ్ అడివి కోసం. ఈమధ్య నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ వస్తుంది’ అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘మనం ఒక పని చేస్తే, ఆ పనికి విలువ ఉందని ప్రజలకు గుర్తుండి పోయేలా చేయడం చాలా కష్టమైన విషయం. మనకు క్రెడిబిలిటీ రావాలి. అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి. అక్టోబర్ 19న ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. నాతోపాటు ప్రేక్షకులందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ ‘కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. కశ్మీర్ ఇష్యూను టచ్ చేద్దామని అనుకున్నప్పుడు రచయిత అబ్బూరి రవి గారు చాలా పరిశోధన చేశారు. నేను, ఆయన కశ్మీర్ పండిట్లను కలిసి... ఏం జరిగింది? ఏంటి? అని పరిశోధన చేశాం. కశ్మీర్ పండిట్లకు జరిగినది బాధాకరమైన విషయమే. కానీ, జనాలకు తెలియని చేసిన ప్రయత్నం ఇది. అందరినీ భాగస్వామ్యులుగా చేసుకుని ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి అబ్బూరి రవి గారు. నువ్ డౌట్ పడకు సాయి. నిన్ను నువ్వు నమ్ము. నేను నమ్ముతాను. అందరూ నమ్ముతారు అని చెప్పి... నా వెన్నంటే ఉన్నారు. స్క్రిప్ట్ దగ్గరనుంచి ప్రతి విషయంలో ఎంతో సహాయం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ కి రావడానికి కారణం మెయిన్ బ్యాక్ బోన్ అబ్బూరి రవి గారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని నటించమని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది. మన పార్లమెంట్ మీద జరిగిన ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తీవ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచించి... అమిత్ షా గారి స్ఫూర్తితో మా సినిమాలో రావు రమేష్ గారి పాత్రను డిజైన్ చేశాను. 'వందేమాతరం' అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో... ఈ సినిమాకు థియేటర్లలో రియాక్షన్ అలా ఉంటుంది’ అన్నారు. -
థ్రిల్లర్కి సై
‘పీఎస్వీ గరుడవేగతో హిట్ ట్రాక్ ఎక్కిన రాజశేఖర్ ప్రస్తుతం ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మించనున్నారు. ఉత్తమ విమర్శకుడిగా, ఉత్తమ పుస్తక రచయితగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధనుంజయన్ సమంత నటించిన ‘యుటర్న్’ సినిమాతో పాటు విజయ్ ఆంటోని ‘కొలైకారన్’ వంటి చిత్రాలను తమిళంలో విడుదల చేశారు. ఇంకా ‘మిస్టర్ చంద్రమౌళి’, జ్యోతిక, లక్ష్మీ మంచుల ‘కాట్రిన్ మొళి’ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనితో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు ధనుంజయన్. తెలుగు హిట్ ‘క్షణం’ను ‘సత్య’గా తమిళంలో రీమేక్ చేయడంతో పాటు ‘బేతాళుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేసిన రాజశేఖర్కు కృతజ్ఞతలు’’ అని ధనుంజయన్ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.పి. శివప్రసాద్, సంగీతం: సైమన్.కె. కింగ్. -
ఫస్ట్ క్లాస్లో పాసయ్యాం!
‘‘ఈ వయసులో మనం చేయలేని యాక్షన్ సీన్స్ చేయగలుగుతున్నామే... అని హ్యాపీ ఫీలయ్యాను. చేయలేకేం కాదు. యాక్షన్ సీన్స్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. సినిమాలో ప్రస్తావించిన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను’’ అన్నారు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన ‘కల్కి’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర్తో పాటు ఆయన సతీమణి జీవిత చెప్పిన సంగతులు. నటన, లుక్స్, మేనరిజమ్.. ఇలా అన్ని అంశాల్లో ‘కల్కి’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్స్ పరంగా 60–70 శాతం మార్కులే వచ్చాయి. థియేటర్లో 100 పర్సెంట్ కలెక్షన్ లేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకోవాల్సి ఉంది. మొత్తంగా ‘కల్కి’ నేను అనుకున్న స్పీడ్ అందుకోలేదు. త్వరలో అందుకుంటాను. వదలను. మా సినిమాకు కొన్ని బ్యాడ్ రివ్యూస్ రాశారని తెలిసింది. మంచి సినిమాపై బ్యాడ్ రివ్యూస్ ప్రభావం చూపలేవు. స్క్రీన్ప్లే ఇంకా ఫాస్ట్ అండ్ గ్రిప్పింగ్గా ఉండి ఉంటే వంద మార్కులు సాధించి ఉండేవారమని నా అభిప్రాయం. సినిమాలో ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి’ అనే డైలాగ్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ చెప్పినప్పుడు బాగా రాశారన్నాను. ఈ విషయం జీవితతో చెబితే... ఈ డైలాగ్ మీదే కదా అని చెప్పింది. నాపై వేసిన కామెడీ డైలాగ్ నాదే అని కూడా తెలియకుండా నటించాను. ఆ తర్వాత ఏవో కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా (ఈ డైలాగ్ ఉన్న సినిమా) చూడలేదు. విలన్ పాత్రలు చేయాలని ఉంది. కానీ రొటీన్గా ఉండేవి చేయాలనుకోవడం లేదు. మా ఇద్దరు కూతుర్లు మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకుంటారనే మాటలు వినిపించడం హ్యాపీగా ఉంది. ఓ సందర్భంలో నేను, శివానీ కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. నేను, జీవిత, శివానీ, శివాత్మిక కలిసి భవిష్యత్లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇదే కాదు నా పిల్లలతో ఎన్ని సినిమాలు వచ్చినా చేస్తాను. కొడుకులే చేస్తారు? కూతుళ్లు అంతగా చేయలేరు? అనుకున్న నాకు నా కూతుళ్లు సర్ప్రైజ్ ఇచ్చారు. అంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ‘కల్కి 2’ ఉండొచ్చు కానీ ఎప్పుడన్న విషయం గురించి స్పష్టంగా చెప్పలేను. మరోవైపు ప్రవీణ్ సత్తారు ‘గరుడ వేగ 2’ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. జీవిత అవుట్లైన్ విన్నారు. అయితే నా నెక్ట్స్ సినిమా ఏంటీ అని ఇంకా అనుకోలేదు. ఇన్వాల్వ్మెంట్ కాదు... కేరింగ్ ‘‘కల్కి’ సినిమా డైరెక్షన్లో జీవిత లీనమయ్యారనే వార్త అక్కడక్కడా వినిపిస్తోంది. దీని గురించి జీవితా రాజశేఖర్లు ఈ విధంగా స్పందించారు. జీవిత: ఈ సినిమా బడ్జెట్ దాదాపు 23 కోట్లు అయ్యింది. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసేప్పుడు కరెక్ట్గా వస్తుందా? రాదా?.. అంటే యూనిట్లో మేం ఒక 10 మెంబర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉంటాం. ఈ పదిమందికి ముందు నచ్చాలి కదా. రిలీజ్ తరవాత పదికోట్లమందికి నచ్చుతుందా? లేదా అన్నది తర్వాతి విషయం. ప్రశాంత్ వర్మకు ఇది రెండో సినిమా. పెద్ద సినిమా చేస్తున్నాం. మనం షూట్ చేసిన రషెస్ పరిశీలించుకున్నప్పుడు అవసరమైతే టీమ్ అందరితో కలిసి చర్చించుకోవాలి కదా. అలా చేయడం ఇంటర్ఫియరెన్స్ అవుతుందా? లేక ప్రాజెక్ట్పై మేం తీసుకునే కేర్ అవుతుందా? రాజశేఖర్: డైరెక్షన్లో కాదు జీవిత డిస్కషన్స్లో పాల్గొన్నారు. ఈ కేర్ను ఇంటర్ఫియరెన్స్ అంటే బాధగా ఉంటుంది కదా. జీవిత: ఇటీవల ‘డిగ్రీ కాలేజీ’ సినిమా ప్రెస్మీట్లో టీజర్ అసభ్యకరంగా ఉందని నా అభిప్రాయం చెప్పాను. సినిమాలో అవసరమైన చోట రొమాన్స్ అవసరం. నేనూ నటించాను. మా కూతుళ్లూ నటిస్తున్నారు. ఒక కిస్సింగ్ సీనో... ఒక హగ్గింగ్ సీనో కథ డిమాండ్ చేస్తేనే పెట్టాలి. మణిరత్నంగారు ఎంతో రొమాన్స్ చూపిస్తారు. కానీ వల్గర్గా అనిపించదు. బాలచందర్గారు, విశ్వనాథ్గారు, బాపుగారి సినిమాల్లో రొమాన్స్ ఉంటుంది. కానీ చూపించాల్సిన విధానంలోనే ఉంటాయి. ఒక సెన్సార్ మెంబర్గా ఆర్సీ (రివైజింగ్ కమిటీ) నా దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలు చూస్తుంటే... ఏడవాలో నవ్వాలో తెలియదు. అదేదో ‘ఏడుచేపల కథ’ అని ఒక సినిమా ఉంది. అందులో అనవసరమైన రొమాన్స్ ఉన్నట్లు ఉంది. ఇలాంటివి వద్దు అని చెబుతున్నాను. వెంటనే జీవితగారు తన పాత సినిమాల్లో చేయలేదా? రేపు ఆమె కుమార్తెలు ఎవర్నీ ముట్టుకోరా? రాజశేఖర్గారు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదా? అంటే నేనిప్పుడు దాని గురించి మాట్లాడటంలేదు. రొమాన్స్, లవ్ సీన్స్ లేకుండా సినిమాలు తీయలేం. కానీ కావాలని అలాంటివి పెట్టొద్దన్నది నా అభిప్రాయం. ఇక ‘కల్కి’లో 30 శాతం అంశాలు కొందరికి నచ్చలేదు. వాటినే పట్టుకుని రాయొద్దని కోరుకుంటున్నాను. ఎఫ్డీసీ (ఫిల్మ్డెవలప్మెంట్ కార్పొరేషన్) చైర్మన్ పదవి నాకు ఇవ్వబోతున్నారన్న వార్తలు కేవలం పుకార్లే. వైఎస్ జగన్గారి కోసం మాకు దొరికిన తక్కువ సమయంలో చేయగలిగిన ప్రచారం చేశాం. ఆయన గెలిచినందుకు హ్యాపీగా ఉంది. ప్రజలకు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు నాకైతే ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ పోయినట్లు ఉంది. ఇంతకుముందు ఆంధ్ర, తెలంగాణ వేర్వేరు అనే ఫీలింగ్ ఉండేది సైకలాజికల్గా. ఇప్పుడు ఇద్దరు సీయంలు (ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్) మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు కనిపిస్తోంది. – జీవిత -
‘ఆ డైలాగ్ ఐడియా నాదే’
'అ!' చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. 'అ!' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి'. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా, మాస్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? దర్శకుడిగా నా తొలి సినిమా 'అ!' ఏ సెంటర్ సినిమా అయితే... 'కల్కి' బి, సి సెంటర్ సినిమా. సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ. రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని విమర్శ ఒకటి ఉంది! అటువంటిది ఏమీలేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... షూటింగ్ చకచకా పూర్తి చేయవచ్చు. హీరో రాకముందు కొన్ని సన్నివేశాలు కూడా తీయవచ్చు. ఆయన టైం కి రారు అనడం కంటే... సన్నివేశాలను మరింత బాగా తీయడానికి నాకు టైం ఇచ్చారు. రాజశేఖర్ గారు డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో. (చదవండి: ‘కల్కి’ మూవీ రివ్యూ) 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ పెట్టాలని ఐడియా ఎవరిది? నాదే. ఒక్కసారి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీయాలని డిసైడ్ అయిన తర్వాత... ఈ ఐడియా వచ్చింది. మన మీద మనమే సెటైర్ వేసుకుంటే బాగుంటుంది అని... రాజశేఖర్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసే టాపిక్ ఏంటని చూశాం. 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ ట్రోలింగ్ టాపిక్స్ లో ఒకటి. దీన్ని సినిమా లో పెడదామని రాజశేఖర్ గారికి చెప్పగానే ఒప్పుకున్నారు. నేను కొత్త దర్శకుడు అయినా ఏం అడిగితే అది చేశారు. తన కథను కాపీ చేశారని ఒక రచయిత మీడియా ముందుకు వచ్చినట్టున్నారు? అవును. అయితే... అతను ఆరోపించిన తర్వాత మా కథను రచయితల సంఘానికి చూపించాం. రెండిటి మధ్య ఎలాంటి సారూప్యతలు లేవని తేల్చారు. దాంతో వారు సినిమాలు కూడా చూడలేదు. సినిమా స్క్రీన్ ప్లేకి సుమారు పదిమంది వరకు వర్క్ చేసినట్టున్నారు తెరపై చాలా పేర్లు పడ్డాయి. వాళ్లందరూ మా స్క్రిప్ట్ విల్ టీమ్ మెంబెర్స్. కథ రాసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుందని చాలా వెర్షన్స్ రాస్తాం. అదంతా పూర్తయిన తర్వాత మా సిస్టర్ ఏది బాగుందో చెబుతుంది. దాన్ని ఫైనల్ చేస్తాం. స్క్రిప్ట్ విల్ టీమ్ లో నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, సినిమాలపై ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కథలపై వర్క్ చేస్తున్నాం. తొలుత ఈ కథను మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదట. స్క్రిప్ట్ వరకు ఇచ్చి, వేరే డైరెక్టర్ తో చేయాలని అనుకున్నారట. అవును. ఆరు నెలల్లో స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఈ కథలో డైరెక్ట్ చేయాలని ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆరు నెలలలో లో రాజశేఖర్, జీవిత, వాళ్ల ఫ్యామిలీ తో ట్రావెలింగ్ బాగుంది. వాళ్లు సెన్సిబుల్ పీపుల్. (నవ్వుతూ) వీళ్లను భరించొచ్చు అనిపించిన తర్వాత నేనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. జీవిత గారు సినిమా విషయంలో ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు? నా అనుభవం రెండు సినిమాలు మాత్రమే. రాజశేఖర్ గారు, జీవిత గారు ముప్పై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఏదైనా చెబితే వింటాను. నేను చెప్పిందే తీయాలనుకునే రకం కాదు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో కూడా ఎవరైనా నా సలహా ఇస్తే, నేను కన్విన్స్ అయితే తీసుకుంటాను. వాళ్లకు క్రెడిట్ ఇస్తా. సినిమాలో క్లైమాక్స్ కి మంచి పేరు వచ్చింది. మీరు క్లైమాక్స్ ముందు రాసుకుని తర్వాత కథ రాస్తారట? అవునండి. క్లైమాక్స్ యే కథ అని నేను నమ్ముతా. ఒక్కసారి క్లైమాక్స్ ఎలా చేస్తే బాగుంటుందనేది రాసుకున్న తర్వాత... స్క్రీన్ ప్లే రాస్తాను. క్లైమాక్స్ వరకు రెండు గంటలు ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చునేలా కథను రూపొందిస్తా. 'అ!', 'కల్కి'... రెండు చిత్రాల్లో అసలు కథేంటో క్లైమాక్స్ వరకు తెలియదు. ట్విస్టులతో సినిమాలు తీశారు. దర్శకుడిగా మీపై ఇటువంటి చిత్రాలు తీస్తారనే ముద్ర పడుతుందేమో? నా తదుపరి సినిమాగా మంచి ప్రేమ కథను తీస్తానేమో. ఒకే తరహా చిత్రాలు తీయడం నాకు నచ్చదు. డిఫరెంట్ జోనర్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఉంది. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అతను మీ ఫ్రెండ్. అందువల్లే మీకు బాగా చేశాడా? ఒక్కటి మాత్రం నిజం... తను నా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకు తీసుకున్నా. బీటెక్ లో నేను తీసిన కొన్ని వీడియోలను తన సంగీతంతో బాగా చూపించాడు. తనకు మంచి బ్రేక్ రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా సినిమాలో అందరి కంటే తనకు ఎక్కువ పేరు రావడం సంతోషంగా ఉంది. నెక్స్ట్ సినిమా ఏంటి? ఏమో... రెండు మూడు కథలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలోనూ ఉన్నాం. మీ తొలి సినిమా నిర్మాత నానితో టచ్ లో ఉన్నారా? ఉన్నానండి. ఇటీవలే ఆయనను కలిశా. ఒక కథ గురించి చర్చించుకున్నాం. సినిమా చేయాలంటే జాతకాలు అన్ని కలవాలి. -
శోక సంద్రంలో టాలీవుడ్
విజయ నిర్మల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన ఆమెను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కృష్ణ గారికి, నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. - పవన్ కల్యాణ్ మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. రీసెంట్గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. - జీవితా రాజశేఖర్ ‘11 సంవత్సరాలకే నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తన కుటుంబంగా చేసుకున్న మహానటి, గొప్ప దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం విని షాక్కి గురయ్యాను. తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే మహిళా దర్శకురాలుగా తన సత్తాచాటిన విజయ నిర్మల గారు చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతారు’. - మారుతి తెలగు సినిమా చరిత్రలో ఎందరో దర్శకులు వారి వారి సత్తా చాటుకున్నారు. కాని మహిళా దర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డుని సాధించిన దర్శకురాలు మాత్రం శ్రీమతి విజయనిర్మల గారు ఒక్కరే. సూపర్స్టార్ కృష్ణ గారిని, విజయనిర్మల గారిని చూస్తే కడుపు నిండిపోయేది అంత అందంగా వుండేది వారి జంట. అంత అందమైన నటి, నిర్మాత, దర్శకురాలు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారన్న వార్త నమ్మలకపోయాను. - నిర్మాత ఉషా మల్పూరి చిన్న వయసు నుండి మనందరం సినిమాలు చూసేవాళ్ళం కాని శ్రీమతి విజయనిర్మల గారు సినిమాలు చేయటం మొదలు పెట్టారు. విజయనిర్మల గారికి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. మహనటిగా, గొప్ప దర్శకురాలుగా, ఉత్తమ నిర్మాతగా తమిళ, తెలుగు, మళయాల భాషల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. - దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఐరా క్రియెషన్స్ ప్రోడక్షన్ నెం 1 గా నిర్మించిన ఛలో చిత్రంలో నరేష్ గారు కీలక పాత్రలో నటించారు. ఆ చిత్ర షూటింగ్లో నరేష్ గారు శ్రీమతి విజయనిర్మల గారి గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. విజయనిర్మల గారు పేద కళాకారులకి చేసే సహాయం.. సినిమా అంటే ఎంతో గౌరవం అని.. ముఖ్యంగా తన ఫ్యామిలీ హీరోల చిత్రాలు విజయాలు సాధిస్తే ఎలా సంతోష పడతారో.. మరో హీరో చిత్రాలు విజయం సాధిస్తే కూడా అంతకి మించి సంతోష పడతారు. తెలుగు సినిమా విజయాల బాట నడవాలని ఎప్పూడూ కొరుకుంటారని ఆయన మాతో చెప్పేవారు. - ఐరా క్రియేషన్స్ ఒక వ్యక్తి గురించి దశాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి చేసిన పని మాత్రమే కాదు వారి గుణం, స్వభావం కూడా అందుకు కారణం. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్కి తనవంతు సహాయన్ని ఇప్పటికీ శ్రీమతి విజయనిర్మల గారు అందిస్తున్నారనే వార్త నా హృదయంలో బాగా నాటుకు పోయింది. దర్శకురాలుగా సినిమాలు చేయటమే కాకుండా పేద కళాకారులకి సహయం చేసే గొప్ప లక్షణం ఆమె సొంతం. ఛలో చిత్రంలో నరేష్ గారితో నటించాను. విజయనిర్మల గారి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా ఇదే ప్రపంచంగా వుండేవారట.. ప్రతి వారం ఏ సినిమా విడుదలయ్యింది. వాటి ఫలితాలు ఎలా వున్నాయనే డిస్కషన్ శ్రీమతి విజయనిర్మల గారితో వుండేదట అంతలా సినిమాని ప్రేమించే వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అందర్ని ఇలా వదిలి వెళ్ళి పోవటం చాలా దురదృష్టకరం. - హీరో నాగశౌర్య ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి విజయనిర్మల గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి యూవీ కృష్ణంరాజు వీరితో పాటు నటులు అల్లరి నరేష్, నాని, కల్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, సుశాంత్, ఆది, కాజల్ అగర్వాల్, ఈషా రెబ్బా, నితిన్, మంచు విష్ణు, మంచు మనోజ్.. దర్శకులు వంశీ పైడిపల్లి, గుణశేఖర్, బీవీయస్ రవి, అనిల్ రావిపూడి.. నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, హారికా హాసిని క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. -
పవన్ కళ్యాణ్పై జాలేసింది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రక విజయం సాధించారని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని హీరో రాజశేఖర్ అన్నారు. తన భార్య జీవితతో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ మా పాత్ర ఉండటం ఆనందంగా ఉంది. జగన్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడే విజయ సంకేతాలు అందాయి. జగన్ గెలుస్తాడని ముందే తెలుసు. జగన్కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ‘మా’ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు మాకు ఎలాంటి విబేధాలు లేవు. ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్పై జాలి వేసింది, ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేద’ని రాజశేఖర్ అన్నారు. రోజా గెలవడం అదృష్టం: జీవిత వైఎస్ జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని జీవిత చెప్పారు. అంకితభావంతో కష్టపడిన జగన్కు ప్రజలు అవకాశం ఇచ్చారని, వచ్చే పదేళ్లు ఆయనదేనని వ్యాఖ్యానించారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నాగబాబుపై, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు తమకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. ‘ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్కు జగన్ ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోజా గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైఎస్సార్సీపీ అదృష్టం. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా’ని జీవిత అన్నారు.