kanna lakshminarayana
-
తమ్ముళ్లు, అనుయాయులే ఎమ్మెల్యేలు
సాక్షి, నరసరావుపేట: వాళ్లు ఎంపీలో, ఎమ్మెల్యేలో కాదు.. కనీసం పంచాయతీ వార్డు మెంబర్లు కూడా కాదు. అయినా వారిదే ఆ నియోజకవర్గంలో పెత్తనం. మరి వారికున్న అర్హతలేమిటంటే.. సదరు ప్రజాప్రతినిధి వారసులు, సోదరులు, బంధువులు, ఆత్మీయులు కావడమే. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ప్రభుత్వ పథకాలు మొదలు.. పదవులు, కాంట్రాక్టులు అన్నింటిలోనూ జోక్యం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని దాచుకుంటున్నారు. ఈ పరిస్థితి పల్నాడు జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుమారులు కన్నా నాగరాజు, కన్నా ఫణీంద్రలు అంతా తామే అంటూ అధికారం చెలాయిస్తున్నారు. భూముల సెటిల్మెంట్లు, మద్యం దందా.. ఇలా అన్నింటికీ రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రతి పనికి కప్పం కట్టాల్సిందేనని లావాదేవీలు చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఎన్నికల సమయంలో ఆరి్థక వ్యవహారాలు చూసుకున్న కాంట్రాక్టర్ దరువూరి నాగేశ్వరరావు కూడా ఇప్పుడు అన్నీ తానై షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తమ్ముడు నవీన్ చిన్న ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ప్రవీణ్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటే నవీన్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడు. ఇసుక రీచ్ల వద్ద అనధికార టోల్గేట్లు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమరావతి మండలంలో ఎర్రమట్టి దందా ఇతని కనుసన్నల్లోనే సాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లను తొలగిస్తున్నారు. మద్యం సిండెకేట్, బెల్టు షాపుల వ్యవహారం అంతా ఈయన చెప్పినట్లే సాగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ ఎమ్మెల్యేనా మజాకా! వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ‘మూడు రోజుల ఎమ్యెల్యే’ అని నియోజకవర్గ ప్రజలు పిలుస్తున్నారు. వారంలో ఆయన గరిష్టంగా నియోజకవర్గంలో మూడు రోజులే ఉంటారు. మిగిలిన నాలుగు రోజుల్లో సొంత వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా చేపల చెరువులన్నింటిని ఈయన తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమంగా మట్టి తోలడం, భూకబ్జాలు, నచ్చని వారిపై అక్రమ కేసులు, వేధింపులు ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబుకు అల్లుడు వరసయ్యే విజయ్ అంతా తానై నడిపిస్తున్నాడు.గ్రావెల్కు అధిక ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న టిప్పర్ మట్టికి ప్రస్తుతం రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. కోటప్పకొండను అక్రమ గ్రావెల్కు అడ్డాగా మార్చారని, పోలీసులను అడ్డుపెట్టుకుని పంచాయితీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. చిలుకలూరిపేటలో అయితే అంతా ‘అమ్మ’గారి దయేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేరుకేనని, అంతా ఆయన భార్యదే పెత్తనమని చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఒకే మాట చెబుతున్నారు. అధికారులంతా ఆమె సేవలోనే తరిస్తున్నారని విమర్శిస్తున్నారు. -
అమ్మ చంద్రబాబూ.. అది నిజమేనట!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయపాటి సాంబశివరావు నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారా? అయినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో వారిని నాశనం చేశారా? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు వీరి నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారా? మామూలుగా ఇలాంటి ఆరోపణ మరెవరిమీద అయినా వచ్చి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర ఎల్లో మీడియా ఎంత భీబత్సంగా ప్రచారం చేసి ఉండేవి! ఆంగ్ల మీడియా సైతం ఎంత ప్రాధాన్యం ఇచ్చి ఉండేవి. కాని ఆశ్చర్యం ఏమిటంటే సాక్షి తప్ప ఇతర మీడియా ఏది పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. చివరికి ఆంగ్ల మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారో గుర్తు చేసుకోండి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని ఆయన ఆయా సభలలో అన్నారు. కాని దానిపై తదుపరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంతేకాదు. 2019 లో టిడిపి ఓటమి తర్వాత చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటి శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు సిబిటిడి ప్రకటించింది. అయినా చంద్రబాబుకు ఏమీ కాలేదు. ఐదేళ్లు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే టైమ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల అవినీతి జరిగిందో లేదు తెలియదు కాని నెలల తరబడి ఢిల్లీ ఆప్ మంత్రులు జైలులో గడపవలసి వస్తోంది. మన దేశ వ్యవస్థలలో ఎందుకు ఇంత తేడా వస్తోంది? ఒకే తరహా కేసుల్లో ఒకరికేమో ఆయా వ్యవస్థలలో పూర్తి సానుకూల నిర్ణయాలు వస్తుంటాయి. ✍️కొందరికేమో బెయిల్ రావడమే గగనం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే చంద్రబాబునాయుడుపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలా పెద్దవాటి కింద లెక్క. నిజంగానే చంద్రబాబుకు అవినీతితో సంబంధం లేకుంటే కేంద్రం కాని, ప్రధాన మంత్రి మోదీ కాని ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం తప్పు అవుతుంది. వాటిలో నిజం ఉంటే అలా వదలివేయడం సరైనదేనా అన్న చర్చ వస్తుంది. అంటే పలుకుబడి, మేనేజ్ మెంట్ నైపుణ్యాన్ని బట్టి కేసుల నుంచి తేలికగా బయటపడవచ్చన్న అభిప్రాయం కలగదా! బీజేపీ నేతలు అవినీతికి వ్యతిరేకంగా గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. కాని చంద్రబాబు వంటి కొంతమందిపై వచ్చిన ఆరోపణల గురించి మాత్రం నోరు విప్పరు. ఇంకో సంగతి చెప్పాలి. న్యాయ వ్యవస్థ సైతం ఆయన పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందా అన్న భావన ప్రజలలో కలుగుతుంది. ✍️ఎందుకంటే ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సైతం ఏళ్ల తరబడి విచారణకే రాలేదంటే అది చంద్రబాబు నైపుణ్యం అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కదా! చంద్రబాబు నాయుడు తనపై ఏ కేసు వచ్చినా స్టే తెచ్చుకోవడం ఆయన స్పెషాలిటీగా అంతా భావిస్తారు.ఒక సందర్భంలో ఆయనే ఒక మాట అన్నారు. తాను ఏ విషయంలోను టెక్నికల్ గా, లీగల్ గా దొరకనని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోవడంతో అది వాస్తవం అనిపిస్తుంది. అలాంటిది ఎపి సిఐడికి స్కిల్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చిక్కి ఏభై మూడు రోజులు జైలులో ఉండవలసి వచ్చింది. ✍️ఆయనకు కింది కోర్టులో బెయిల్ నిరాకరణ జరిగినా హైకోర్టులో మాత్రం పొందగలిగారు. విశేషం ఏమిటంటే బెయిల్ కోసం ఆయన తనకు నానా రకాల జబ్బులు ఉన్నాయని ఒక ప్రైవేటు ఆస్పత్రివారు ఇచ్చిన సర్టిఫికెట్ ను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చే రిపోర్టును చూస్తారు. మరి చంద్రబాబు విషయంలో బిన్నంగా జరిగిందంటే అది ఆయన లాయర్ల గొప్పదనం అనుకోవాలి. సు నుంచి బయటకు వచ్చాక మాత్రం చంద్రబాబు డాక్టర్ లు ఇచ్చిన రిపోర్టులన్నీ అబద్దాలే అన్నట్లుగా ఆయన టూర్లు చేస్తున్నారు. మంచి జోష్ గా అరుపులు,పెడబొబ్బలు పెడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా అంత తీవ్రమైన గుండె జబ్జు ఉన్న వ్యక్తి అలా చేయగలుగుతారా? న్యాయ వ్యవస్థ ఆ విషయాలను పరిశీలించదా అంటే ఏమి చెబుదాం. ✍️స్కిల్ కేసులో ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ అమెరికా పారిపోయినా ఏమీ కాలేదు. ఈడి అధికారులు నలుగురిని అరెస్టు చేసినా, అసలు కేసే లేదని చంద్రబాబు తరపున వాదించగలుగుతున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసులు పెట్టడం తప్పు అంటూ ఆయన సుప్రింకోర్టుకు వెళ్లారు.దానిపై కూడా గౌరవ కోర్టువారు నెలల తరబడి తీర్పు ఇవ్వకపోవడం కూడా గమనించదగ్గ అంశమే. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయనకు కోటి రూపాయలు ఇచ్చానని హర్షద్ మెహతా అని స్టాక్ బ్రోకర్ చేసిన ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోని మీడియా అంతా దానిపై చిలవలు, పలవలుగా కదనాలు ఇచ్చేవి. ✍️చివరికి కోర్టుకు కూడా పివి వెళ్లవలసి వచ్చింది. కాని చంద్రబాబును మాత్రం మూడు దశాబ్దాలలో ఎవరూ కదల్చలేకపోయారు. ఎన్ని అవినీతి అభియోగాలు వచ్చినా సేఫ్ గా బయటపడుతుంటారు. ఆయనకు ఉన్న పట్టు అటువంటిదని అంతా నమ్ముతుంటారు. ఈ నేపద్యంలో తాజాగా గుంటూరు మాజీ ఎమ్.పి.రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చేసిన ఆరోపణ ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నది చర్చనీయాంశం. ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఈ ఆరోపణలకు సంబంధించి కుక్కిన పేల మాదిరి నోరు మూసుకుని కూర్చున్నాయి. అయినా సోషల్ మీడియా ఉంది కనుక జనానికి విషయం తెలిసింది. చంద్రబాబు, లోకేష్ లు తమ కుటుంబాన్ని నాశనం చేశారని అంటూ చంద్రబాబు ఫోటోను రంగారావు నేలకేసి పగలకొట్టిన వీడియో వైరల్ గా మారింది. రాయపాటికి కాంగ్రెస్ టైమ్ లో పోలవరం టెండర్ దక్కింది. దానిని ఆయన కొంతమేర ఎక్జిక్యూట్ చేశారు. ✍️ఈలోగా శాసనసభ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఆ పార్టీ ప్రముఖులంతా టీడీపీ లేదా వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. రాయపాటి కూడా టీడీపీలో చేరి నరసరావుపేట టిక్కెట్ పొందారు. టీడీపీలో చేరినా పోలవరం కాంట్రాక్టును రాయపాటి నుంచి తప్పించి నవయుగ సంస్థకు చంద్రబాబు అప్పగించారు. ఎంపీ గా మరోసారి గెలిచారన్న భావన తప్పితే రాయపాటి ఆర్దికంగా బాగా దెబ్బతిన్నారని చెబుతారు.గత ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఇచ్చామని, చంద్రబాబు,లోకేష్ లు ఒకరికి తెలియకుండా డబ్బు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం అంతా బోగస్ అని ఆయన లోగుట్టు విప్పేశారు.టిడిపి రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యాపార సంస్థ అని కూడా రాయపాటి సూత్రీకరించారు. ✍️దీనికి తోడు సత్తెనపల్లి సీటును తమ ప్రత్యర్ధి అయిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడం కూడా రాయపాటి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయినా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చి, ఎన్నికల సమయంలో బయటపడ్డారు. కట్టలు తెగిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు, పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యపరచింది. ఎంతగా నష్టపోయి ఉండకపోతే ఆయన ఇంతలా ఆవేదన చెందుతారా అన్నభావన కలుగుతుంది.దీనికి చంద్రబాబుకాని, ఆయన పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కాని స్పందించలేక పోయారు. ఇక మరో కీలక నేత ,విజయవాడ ఎమ్.పి కేశినేని నాని పార్టీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడం కాదు. ✍️ఆ పార్టీ తరపున పోటీచేయబోతున్నారు. చంద్రబాబు ,లోకేష్ లు ఎలా తన పట్ల అనుచితంగా వ్యవహరించింది ఆయన తెలియచెప్పారు. చంద్రబాబు పెద్ద మోసగాడని కూడా నిర్మొహమాటంగా పేర్కొన్నారు.తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలలో సామాజికపరంగా కూడా బలమైన నేతలుగా ఉన్న ఇద్దరు ప్రముఖులు పార్టీని వీడడమే కాకుండా, సంచలనాత్మకమైన ఆరోపణలు చేయడం సహజంగానే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో రంగారావు వేసిన మరో ప్రశ్న కూడా ఆసక్తికరంగా ఉంది. లోకేష్ రాయలసీమలో కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈసారి కూడా గెలవనివ్వబోమని ఆయన అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరైనా టీడీపీలో చేరితే అదేదో వైఎస్సార్సీపీకి తీవ్రమైన నష్టం కలిగినట్లు టీడీపీ నేతలు, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటారు.మరి ఇప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలే పలువురు టీడీపీకి రాం రాం చెప్పడమే కాకుండా సంచలన విషయాలు బయటపెడుతుండడం పై మాత్రం కిమ్మనడం లేదు.దీనిని బట్టే అర్దం కావడం లేదూ తెలుగుదేశం ఎంత ఆత్మరక్షణలో పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ -
‘కన్నా పోటీచేస్తాడో.. పారిపోతాడో తెలియదు’
సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇష్టంమొచ్చినట్లు కన్నా మాట్లాడితే వైఎస్సార్సీపీ సహించదన్నారు. ‘కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్ఝ్ మాత్రమే. కన్నా పోటీ చేస్తాడో.. పారిపోతాడో తెలియదు. ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నాది. కన్నా సంగతి అమిత్ షాను అడిగితే బాగా చెబుతారు. మాజీ మంత్రి కన్నా పార్టీలు మారిన వ్యక్తి. చంద్రబాబును తిట్టి వారి బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నాడు కన్నా. కన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కన్నా సంగతి గుంటూరు కంటే వారి తోటలో ప్రజలు చెబుతారు.. ఆయన ఇంటిముందు ఫ్లెక్సీలు చెబుతాయి’ అని అంబటి మండిపడ్డారు. -
నువ్వేంటో.. నీ బతుకేంటో.. గుంటూరు ప్రజలందరికీ తెలుసు..
కొరిటెపాడు(గుంటూరు): మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాలు మాట్లాడితే.. తాను నిజాలు చెబుతానని, ఆయన జీవితమంతా అవినీతి మయమేనని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పేర్కొన్నారు. బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట్లో సున్నాగా ఉన్న కన్నా.. 45 గజాల స్థలం నుంచి వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది కుంభకోణాలు, అవినీతితోనే అన్న సంగతి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అందరికీ తెలుసు అని అన్నారు. కన్నా స్కాముల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సహకారశాఖ మంత్రిగా తన తండ్రి దినానికి విజయవాడలోని విజయకృష్ణ కో–ఆపరేటివ్ సూపర్ బజారు నుంచి లారీల కొద్దీ సరుకులు తెప్పించుకున్న నీచమైన చరిత్ర కన్నాదని.. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. కన్నా పాపాల చిట్టా అంతా తనకు తెలుసని.. దాని గురించి మాట్లాడుకుందామా..? నువ్వేంటో.. నీ బతుకేంటో.. గుంటూరు ప్రజలందరికీ తెలుసు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రాము ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం సిగ్గుచేటు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీబీఐకి లేఖ రాయడంపై ఆ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము భగ్గుమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు పట్టుకుని మీడియా ముందు కనీస పరిజ్ఞానం లేకుండా కన్నా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని, చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టాడో ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం తన రాజకీయ స్వలాభం కోసం టీడీపీలో చేరిన కన్నాకు, ఆయన్ను చేర్చుకున్న చంద్రబాబుకు సిగ్గులేదన్నారు. నిరూపించకలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా..? తమ బ్యాంక్ పరిధిలో నకిలీ పాసు పుస్తకాలతో రూ.13 కోట్ల సొమ్ము స్వాహా జరిగిన మాట నిజమేనని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే కాక తమ హయాంలో జరిగిన వాటిపైనా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తమ బ్యాంకులో జరిగిన అవినీతి గుట్టును తామే స్వయంగా వెలికి తీసి అందుకు బాధ్యులైన వారిపై నిజాయితీగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం మాది అని ఆయన సగర్వంగా ప్రకటించారు. అందరికీ తెలిసిన ఈ వాస్తవాలు తాజాగా చంద్రబాబు చంకలో దూరిన కన్నాకు తెలియకపోవడం శోచనీయమన్నారు. అవినీతి అంతమే పంతంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేసే నిబద్ధత కలిగినవారిగా, కన్నా డిమాండ్ చేసిన సీబీఐ విచారణకు స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. తాము కూడా కన్నా అవినీతి, అక్రమ సంపాదనపై సీబీఐ విచారణ కోరతామని తెలిపారు. కన్నాకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కూడా దాన్ని స్వాగతించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. ఒక వేళ నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం స్వీకరించాలని కన్నాకు బహిరంగ సవాల్ విసిరారు. ఈ విషయంపై బహిరంగంగా చర్చకు సైతం తాను సిద్ధమని.. కన్నాపై పరువు నష్టం దావా కూడా వేస్తామని ఆయన తేల్చి చెప్పారు. నిజంగా తాను చేసిన ఆరోపణలకు కన్నా కట్టుబడి ఉంటే కనీసం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని.. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోమారు తమ బ్యాంకు గురించి కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గురించి కానీ అవాకులు, చెవాకులు పేలితే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. -
ఆ అక్రమాలన్నీ బాబు హయాంలోనే ‘కన్నా’..
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు ఆస్కారంలేని రీతిలో సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ స్పష్టంచేశారు. సహకార రంగంలో రూ.5వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ ఇటీవలే టీడీపీ పంచన చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంలో వాస్తవంలేదన్నారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో సవాల్ చేశారు. అందులో ఝాన్సీ ఏం పేర్కొన్నారంటే... ♦ చంద్రబాబు ప్రాపకం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. కాకినాడ డీసీసీబీ పరిధిలోని గండేపల్లి సొసైటీలో రైతుల పేరిటే రూ.22 కోట్ల బినామీ రుణాలు తీసుకుని దారిమళ్లించారు. ఇదంతా 2017–18, 2018–19లలో అప్పటి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి చేశారు. ఈ అక్రమాలు వెలికితీసింది మా ప్రభుత్వ హయాంలోనే. సొసైటీలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణతో పాటు బాధ్యులైన బ్యాంకు సిబ్బందిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడమేకాక అప్పటి గండేపల్లి మేనేజర్ ఎ.గణపతి, ఆర్.శ్యామలను సస్పెండ్ చేశాం. ♦ కృష్ణా డీసీసీబీ పరిధిలోని పెడన సొసైటీలో ఒక మహిళ 1.80 ఎకరాల వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాల భూమిగా చూపి 2018–19లో రుణం తీసుకోగా, వడ్డీతో సహా రుణ మొత్తాన్ని రాబట్టేందుకు లీగల్గా అన్ని చర్యలు తీసుకున్నాం. ♦ విశాఖపట్నం డీసీసీబీకి చెందిన రూ.4 కోట్లు సిక్కిం బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఆ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3 కోట్లు రాబట్టాం. మిగిలిన మొత్తం కోసం బ్యాంకు హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది. ♦ ఇక గుంటూరు డీసీసీబీలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందంటూ మాజీమంత్రి ‘కన్నా’ చేసిన ఆరోపణలో పసలేదు. ఈ బ్యాంకులో డ్వాక్రా సంఘాలకు ఇచి్చన రూ.600 కోట్ల రుణాలలో రూ.470 కోట్లు ఔట్స్టాండింగ్గా ఉన్నాయి. అలాంటప్పుడు రూ.500 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలి. ♦ వినుకొండ బ్రాంచిలో డ్వాక్రా రుణాలు రూ.1.40 కోట్లు దుర్వినియోగం కాగా.. యానిమేటర్గా ఉన్న తన తల్లి, మేనమామతో కలిసి బ్రాంచ్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించాం. పక్కదారి పట్టిన రూ.1.40 కోట్లు తిరిగి బ్యాంకుకి కట్టించడమే కాక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న మేనేజర్ని సస్పెండ్ చేశాం. ♦ ఏలూరు డీసీసీబీ పరిధిలో టీ.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట, రంగాపురం, సరిపల్లి సొసైటీల్లో నిధులు మళ్లినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఇప్పటికే చింతలపూడి సొసైటీ సెక్రటరీతో పాటు సొసైటీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశాం. ♦ వైఎస్సార్ జిల్లా డీసీసీబీలో ఎలాంటిæ అవినీతి జరగలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.20 కోట్ల వరకు పేరుకుపోయిన నష్టాలు (ఎక్యుమలేటెడ్ లాసెస్) ఉన్న బ్యాంకును రూ.20 కోట్ల లాభాలను ఆర్జించే స్థాయికి తీసుకొచ్చాం. ఇలా.. ఈ నాలుగేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని అణిచివేస్తూ పారదర్శకంగా రైతులకు సేవలందిస్తున్నాం. సహకార రంగానికి జవసత్వాలు కలి్పంచేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.298 కోట్లు కేటాయించారు. -
‘కన్నా నీ చరిత్ర నాకు తెలుసు.. దమ్ముంటే చర్చకు రావాలి’
సాక్షి, గుంటూరు: జీడీసీసీ బ్యాంకు, ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అన్నారు. బ్యాంకులో రూ.500కోట్ల కుంభకోణం జరిగిందని కన్నా చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే కుంభకోణం జరిగిందని నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా, బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణం జరిగిందని కన్నా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. లేకపోతే కన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ నిజాయితీపరుడో లేక నేను నిజాయితీపరుడినో చర్చికుందాం చర్చకు రావాలి. కన్నా నీ చరిత్ర అంతా నాకు తెలుసు. 90 గజాల రేకుల షెడ్డు నుంచి రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పు. రైతులను మోసం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దొంగతనం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. కన్నాకు దమ్మంటే రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దూళిపాళ్ల నరేంద్ర నుంచి రైతులకు ఇప్పించాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు -
టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా ఇష్టపడే వస్తున్నారా?
సత్తెనపల్లి: సత్తెనపల్లి టీడీపీలో ముసలం మరింత ముదరనుందా? ఇప్పటి వరకు సీటు తమదంటే తమదంటూ పావులు కదిపిన నేతలు.. ఇకపై తమ అసమ్మతి గళం వినిపించనున్నారా ? ఇప్పటికే ప్రజల్లో మెండైన సానుకూలతతో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ ఇష్టపడే వస్తున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లోనా! అనేది స్పష్టత కొరవడింది. పెదకూరపాడు కాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కానీ కన్నా ఆశించారనేది సన్నిహితుల మాట. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అదే సమయంలో మహానాడు ద్వారా పార్టీకి ఉత్సాహాన్ని తీసుకొద్దామనుకున్న చంద్రబాబు.. కాపీ మేనిఫెస్టోతో బొక్కబోర్లా పడ్డారు. ఈ క్రమంలో పార్టీలో చేరిన మూడు నెలల తర్వాత సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మార్పుపై పార్టీలో భిన్నమైన టాక్ వినిపిస్తోంది. నాలుగు స్తంభాలాట గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయన అకాల మరణంతో ఇన్చార్జి బాధ్యతలను అధిష్టానం ఎవరికీ అప్పగించలేదు. కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి), మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో మూడు గ్రూపులుగా విడిపోయారు. ఈ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం తాజాగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరామ్, మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆందోళనలో ఉన్నారు. దీనివల్ల గ్రూపు విభేదాలు, అసంతృప్తులు మరింత పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కన్నాకు కాపు కాసేది లేదు... తొలి నుంచి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989, 1994, 1999, 2004లలో పెదకూరపాడు నుంచి గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో కన్నా గురి కూడా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలపైనే ఉందని ఆయన సన్నిహితుల మాట. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అంబటి రాంబాబు తొలి నుంచి కాపులతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలుస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి ఓటమిపాలైన నిమ్మకాయల రాజనారాయణ యాదవ్, ఆయనపై గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి (2004లోనూ గెలుపొందారు), కాపు సంఘ నేత పక్కాల సూరిబాబు వైఎస్సార్ సీపీలో చేరడంతో అధికారపార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా ఉండేందుకు కన్నా కూడా విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో టీడీపీకి నాలుగో కృష్ణుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇన్చార్జిగా బాధ్యతల అప్పగింత ఇప్పటికే వర్గపోరు పార్టీ శ్రేణుల్లో నిస్తేజం తాజాగా నాలుగు స్తంభాలాటకు అధిష్టానం ఆజ్యం కన్నాకు సత్తెనపల్లికి రావడం ఇష్టం లేదని టాక్ -
సీనియర్కు షాకిచ్చిన టీడీపీ లీడర్లు.. చంద్రబాబుకు వార్నింగ్!
ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే. ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకునే మరో నేత పంచన ఈ మధ్యే చేరారు. పచ్చ గూటిలో చేరగానే ఆ సీటు నాదే అంటూ ఖర్చీఫ్ వేసేశారు. అయితే అప్పటికే అక్కడున్న వాళ్ళు అధినేతకే వార్నింగ్ ఇచ్చారు. ఏమైందో ఏమో.. చంద్రబాబు ఆ నియోజకవర్గానికి వచ్చినపుడు కొత్తగా వచ్చిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ కనిపించలేదు. ఆ సంగతేంటో చూద్దాం.. ఒకప్పుడు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్ని శాసించారు. మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని నిర్ధారించుకుని కాషాయ తీర్థం తీసుకున్నారు. అక్కడా ఇమడలేక ఈ మధ్యనే తెలుగుదేశం గూటికి చేరారు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీలో చేరిన వెంటనే జిల్లా రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కావాలనే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నేతలందరికీ పార్టీ ఇచ్చారు. గుంటూరు సిటీలో వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. అయితే ఆయన సొంత నియోజకవర్గం అయిన సత్తెనపల్లిపైనే కన్నా ఫోకస్ పెట్టారు. తరచు సత్తెనపల్లి వెళ్ళడం, అక్కడి నేతలతో సమావేశం కావడాన్ని అప్పటికే అక్కడ కుమ్ములాడుకుంటున్న నియోజకవర్గ నేతలు గమనించి అలర్ట్ అయ్యారు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు. కోడెల కుమారుడు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. తాజాగా మూడో కృష్ణుడు రావడంతో పాత నేతలిద్దరూ అలర్ట్ అయ్యారు. కన్నా సత్తెనపల్లి నుంచే పోటీ చేయబోతున్నారని, చంద్రబాబు తన పర్యటనలో ఈ విషయం స్పష్టం చేస్తారని ఆయన అనుచరులు నియోజకవర్గంలో హడావుడి చేయడం ఆరంభించారు. దీంతో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు మూడో కృష్ణుడికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. సత్తెనపల్లి సభలో కన్నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఆయన అనుచరులు డప్పు కొట్టినా అక్కడ మాత్రం పూర్తి రివర్స్లో జరిగింది. సత్తెనపల్లికి ముందు చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించినపుడు కన్నా లక్ష్మీనారాయణ అధినేత పక్కనే ఉన్నారు. కాని సత్తెనపల్లి రోడ్షోలో కాని.. సభలో కాని కన్నా కనిపించలేదు. ఆ పరిసరాల్లో ఎక్కడా ఆయన జాడే లేదు. సత్తెనపల్లి సభలో చంద్రబాబుకు ఇరువైపులా కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు దర్శనమిచ్చారు. కన్నాకు సీటు ప్రకటిస్తారనని అందరూ భావిస్తే ఆయనకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం, సభలో ప్రచార రథం కింద నిలబడి ఉండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. సత్తెనపల్లి రోడ్షో, సభలో చంద్రబాబు పక్కన కన్నా లేకపోవడానికి కోడెల శివరాం, వైవీ ఆంజనేయులే కారణమని వారిద్దరి వర్గీయులు చెబుతున్నారు. నాలుగేళ్లనుంచి పార్టీని మోస్తున్న తమను పక్కకు నెట్టి.. కొత్తగా వచ్చిన కన్నాకు సీటు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని చంద్రబాబుకే నేరుగా చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ వల్లనే చంద్రబాబు పక్కన కన్నాకు చోటు దొరకలేదని చెప్పుకుంటున్నారు. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ దక్కించుకుంటామే గాని.. కన్నాకు మాత్రం ఛాన్స్ ఇచ్చేది లేదని ఇప్పుడు వైరి వర్గాలు రెండూ ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే కన్నా వర్గీయులు మాత్రం కోడెల, వైవీ వర్గీయుల ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. చంద్రబాబు సత్తెనపల్లి పర్యటన మొత్తం కన్నా డైరెక్షన్లోనే జరిగిందంటున్నారు. మంచి రోజులు కాకపోవడంతో కన్నా సత్తెనపల్లిలో చంద్రబాబు వాహనం ఎక్కలేదని చెబుతున్నారు. త్వరలో పార్టీ అధినేతే కన్నా పేరు ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సత్తెనపల్లికి చంద్రబాబు వచ్చినపుడు అనుకున్నదొకటైతే.. జరిగింది మరొకటి. ఇక ముందు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం జగన్ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ -
టీడీపీ మెప్పు కోసం కన్నా విమర్శలు చేస్తున్నారు: గుంటూరు మేయర్
-
బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?
అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అలాగే ఆ పార్టీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఆయన కూడా కాంగ్రెస్లో ఉంటూ గ్రూపులు మార్చడంలో కాని, ఆ తర్వాత పార్టీలు మార్చడంలో కాని ఆరితేరినవారే. తన అవసరార్ధం కన్నా బీజేపీలో చేరారు. ఆయనేదో రాష్ట్రం అంతటిని, కనీసం కాపు సామాజికవర్గంలో అయినా ప్రభావితం చేస్తారేమోనని ఆశపడి బీజేపీ భంగపడింది. చివరికి ఆయన తన దారి తాను చూసుకున్నారు. పోతూ, పోతూ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై, పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. బీజేపీ అర్డెంట్గా జనసేనతో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన మనసులో మాట కావచ్చు. కాని అందుకు పార్టీ అధిష్టానం ఇష్టపడడం లేదు. బీజేపీని దారుణంగా మోసం చేసి, అవమానించిన చంద్రబాబుతో జతకట్టడానికి అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు ససేమిరా అంటున్నారు. మరోసారి ఎలాగోలా ఎమ్మెల్యేగా అయినా గెలవాలని తాపత్రయపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ,ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొత్త కూటమి ఏర్పడితే కాని అది సాధ్యం కాదని భావిస్తుండవచ్చు. కాకపోతే ఆ మాట చెప్పకుండా, బీజేపీ ఏదో అన్యాయం చేసినట్లు, తన వర్గంవారిని పదవుల నుంచి తొలగించడంపైన ఏవేవో ఆరోపణలు చేశారు. అది వేరే విషయం. కన్నా చరిత్ర చూస్తే ఒకరకంగా అదృష్టవంతుడే అని చెప్పాలి. గతంలో కావూరి సాంబశివరావు, ఎన్.జి.రంగా వంటివారి ద్వారా తొలిసారి పెదకూరపాడు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ పొందారు. అప్పట్లో ఆయన నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గానికి సన్నిహితం అయ్యారు. తొలుత చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. కాని నేదురుమల్లి మంత్రివర్గంలో స్థానం పొందారు. మొదటిసారే శాసనసభకు ఎన్నికైనా ఆయనకు ఈ అవకాశం రావడం అదృష్టమే. ఆ తర్వాత నేదురుమల్లి కోటాలో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో కూడా కొనసాగారు. 1994,99, 2004 లలో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఆయనకు పడేది కాదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. కాని 2004 నాటికి వైఎస్ వర్గానికి దగ్గరయ్యారు. వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి పదవి పొందారు. 2009లో నియోజకవర్గాల డిలిమిటేషన్ కారణంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారి మళ్లీ గెలిచారు. అప్పటికే సీనియర్ నేతగా గుర్తింపు పొంది తిరిగి వైఎస్ మంత్రివర్గంలో తన బెర్త్ తాను పొందారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన మళ్లీ గ్రూపు మార్చుకున్నారు. రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు రోశయ్యకు, కన్నాకు గుంటూరు రాజకీయాలలో పడేది కాదు. అది వేరే అంశం. రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. సీఎం సీటుకు కూడా పోటీపడాలని ప్రయత్నించారు. కాని అవి దక్కలేదు. 2014లో ఆయన కాంగ్రెస్లోనే పోటీచేసి ఓడిపోయారు. గుంటూరు రాజకీయాలలో కన్నాకు పెద్ద ప్రత్యర్దిగా ఉన్న రాయపాటి సాంబశివరావు అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపిగా గెలిచారు. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉండడంతో రాయపాటి కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని తన పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తనను ఇబ్బంది పెడతారోనని సందేహించారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమి చేయాలా అన్నదానిపై ఆలోచించి వైఎస్సార్ కాంగ్రెస్లోకి రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఇందుకు సంబంధించి ప్లెక్సీలు కూడా వెలిశాయి. కాని సడన్గా అమిత్ షా పోన్ చేసి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. వారి మధ్య అప్పుడు ఏమి జరిగిందో కాని, ఆయన వైసీపీలోకి వచ్చే ఆలోచన విరమించుకుని సాకు కోసం ఆస్పత్రిలో చేరారు. బీజేపీలోకి వెళితే సేఫ్ అని ఆయన నమ్మారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, కన్నాకు మధ్య ఉప్పు, నిప్పుగా పరిస్థితి ఉండేది. కన్నా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రంగాతో పాటు తనను కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కన్నా బీజేపీలో చేరితే అక్కడ జాక్ పాట్ తగిలినట్లుగా ఆయన బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. దాంతో రాష్ట్ర స్థాయి ఎలివేషన్ బాగా వచ్చింది. 2019 లో నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట వైసీపీకి చెందిన కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలే మెయిన్ టెయిన్ చేసినట్లు చెబుతారు. కాని తాను కోరిన కొన్ని పనులు జరగడం లేదని అసంతృప్తి ఉండేదట. దాంతో ఆయన క్రమంగా వైసీపీకి దూరంగా ఉండడం ఆరంభించారు. అంతలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లును తీసుకు రావడం, అమరావతి పేరుతో ఒక కృత్రిమ ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహించడం వంటి ఘట్టాలు జరిగాయి. ఈ అమరావతి వ్యవహారంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త దగ్గరయ్యారు. తిరుపతిలో జరిగిన ఒక సభలో చంద్రబాబుతో కలిసి చేతులు ఎత్తారు. ఇది ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గతంలో శాసనసభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇలా కలుస్తారని ఊహించగలరా? అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉండి, తదుపరి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో ఈయన సన్నిహితంగా కనిపించేవారు. అమరావతిలో ఏమైనా ప్రయోజనమో, లేక రాజకీయ బందమో తెలియదు కాని టీడీపీతో దగ్గరవుతున్న సంకేతాలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే 2019లో పార్టీ పంపించిన డబ్బు పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బీజేపీ అధినాయకత్వానికి కన్నా పై క్రమేపి విశ్వాసం తగ్గింది. ఆ క్రమంలో ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినా, అది పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. అయినా కన్నా బీజేపీపై కన్నా, పక్కచూపులే ఎక్కువగా చూస్తున్నారన్న ప్రచారం జరిగేది. దానికితోడు కన్నా తనతో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు కొందరు తనకు సన్నిహితులైనవారిని కూడా బీజేపీ నుంచి బయటకు తీసుకువెళతారమోనన్న అనుమానంతో కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వారిని తొలగించారు. అది కన్నాకు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈలోగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈయనను కలిసి రాజకీయాలు చర్చించారు. జనసేనలోకి వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేయాలని కన్నా భావించారు కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి వెనుకాడారట. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతను జనసేనలో చేర్చుకుంటే ఇబ్బంది వస్తుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నా బహుశా టీడీపీలో చేరడానికి మానసికంగా సన్నద్దమయ్యే బీజేపీని వీడారని భావిస్తున్నారు. కన్నా అనుచరులు టీడీపీలోకి వెళదామని సూచించారట. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లవద్దని చెప్పారట. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ఇలా తన పార్టీలోకి వద్దామనుకున్నవారిని చేర్చుకుంటే ఎలా ఫీల్ అవుతారో తెలియదు. జనసేన కార్యకర్తలనే తీవ్రంగా అవమానించిన నటుడు బాలకృష్ణ ఎదుట కూర్చున్న వ్యక్తికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చేమో!. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా దూషించిన కన్నా ఇప్పుడు ఆయనలో తన భవిష్యత్తు చూసుకుంటున్నారట దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి మరోసారి నిర్దారణ అవుతుంది. దీని వల్ల కన్నా లక్ష్మీనారాయణకు గౌరవం పెరుగుతుందని చెప్పలేకపోయినా, ఎన్నికల ఫలితాన్ని బట్టి చూసుకోవచ్చులే అని ఆయన సరిపెట్టుకుని ఉంటారు.అందుకే కన్నా అద్దె ఇంటి వంటి బీజేపీని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. కాకపోతే కన్నాకు కొత్త ఇంటి కోసం వెదుకుతూ చివరికి తన ఒకప్పటి రాజకీయ శత్రువు ఇల్లే శరణ్యం అవడమే ఆయన దయనీయ స్థితికి అద్దం పడుతోందని అనుకోవచ్చు! - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా -
మాటకు మాట
-
Kanna Lakshminarayana vs GVL Narasimha Rao: మాటకు మాట
-
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. జీవీఎల్ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పిందన్నారు. సోము వీర్రాజుపై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఎంపీగా నా బాధ్యతకు లోబడే నేను పని చేశా’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించిన కన్నా.. సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయని, సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయని ఫైర్ అయ్యారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం -
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
సాక్షి, గుంటూరు: ఏపీలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించారు. కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయి. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాగా, గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. సోము వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తన వర్గానికి చెందినవారికి పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని గతంలో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కన్నా ధిక్కార స్వరం దేనికి సంకేతం..?
-
పరువు నష్టం కేసులో రాయపాటి, కన్నా రాజీ
గుంటూరు లీగల్: పరువు నష్టం కేసులో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావులు రాజీ అయ్యారు. మంగళవారం నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇందుకు వేదికైంది. 2010లో రాయపాటి సాంబశివరావు పలు ఆరోపణలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణను విమర్శించారు. అవి తన పరువుకు నష్టం కలిగించాయంటూ కన్నా కోర్టులో పరువు నష్టం దావా చేశారు. పరిహారంగా రూ.కోటి చెల్లించడంతోపాటు భవిష్యత్లో మళ్లీ ఏవిధమైన ఆరోపణలు చేయకుండా ఉండేలా పర్మినెంట్ ఇంజెంక్షన్ ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. ఇప్పటికే కన్నా తరఫున సాక్ష్యాలు కోర్టుకు సమర్పించగా.. ప్రస్తుతం రాయపాటి తరఫున సాక్ష్యాలు సమర్పించే దశలో కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్జి ఇరు పార్టీలను మంగళవారం కోర్టుకు పిలిపించి, వారి న్యాయవాదుల సమక్షంలో రాజీ చర్చలు జరిపారు. తాను చేసిన ఆరోపణలను ఉపసహరించుకుంటున్నట్టు రాయపాటి చెప్పగా, దానికి కన్నా అంగీకరించారు. ఇరువర్గాల వారు స్నేహ పూర్వకంగా కేసు రాజీ పడేందుకు అంగీకరించి కోర్టులో ఉమ్మడి మెమో దాఖలు చేశారు. దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
సోము వీర్రాజు.. కన్నాలా వ్యవహరించకు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాగా.. మరొకటి టీడీపీ బీజేపీ అంటూ ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం కావడం సంతోషకరమైన విషయంగా భావించాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని ఆశించాం. కానీ మూస ధోరణిలో మతం గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు రథయాత్ర చేస్తామన్నారు.. అది ఎందు కోసం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై ప్రజలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు విచారణ ప్రారంభించ లేదు’ అన్నారు ‘ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు.. మరొకరు చంద్రబాబు నాయుడు పంపిన బీజేపీ నాయకులు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు అజెండా చదివి పదవి కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల వలలలో మీరు పడొద్దు. రాముడు అందరి దేవుడు. ఆయనని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. గతంలో అద్వానీ ప్రతి పక్షంలో రథయాత్ర చేస్తే అందరూ సహకరించారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండగా రథయాత్ర ఎందుకోసం చేయాలి. మీరు పద్దేనిమిది నెలల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి ఏం ప్రాజెక్టులు తీసుకువచ్చారో.. రథయాత్ర ప్రారంభించడానికి ముందు ఆలోచించండి. మేనిఫెస్టో అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోండి’ అన్నారు. (చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!) ‘సీఎం జగన్ పాలనలో దేవాలయాల విషయంపై రాజీ పడే పరిస్థితి లేదు. నిందితులపై చర్యలు కఠినంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మీరు గుర్తించరా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్న విషయం గమనించండి’ అని కోరారు. -
రాజధానిపై బీజేపీది ఆరు నాలుకల ధోరణి
తాడికొండ: రాజధాని అంశంపై బీజేపీది ఆరు నాల్కల ధోరణి అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గతంలో బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ మాటేమిటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 76వ రోజు దీక్షలో పలువురు దళిత సంఘాల నాయకులు ప్రసంగించారు. రాజధాని అంశంపై గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఒకటి మాట్లాడితే, ఇప్పుడు సోము వీర్రాజు ఇంకొకటి మాట్లాడుతున్నాడని, ఇదివరకే జీవీఎల్ నరసింహారావు ఒకటి మాట్లాడగా, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని అఫిడవిట్ సమర్పించిందని గుర్తు చేశారు. రాజధానికి వచ్చిన సోము వీర్రాజు 76 రోజులుగా పోరాటం చేస్తున్న పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలపై మాట్లాడకుండా రాజధాని రైతుల కోసం ప్రేమ ఒలకబోయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజధాని పేదలకు రావాల్సిన 50 వేల ఇళ్ల స్థలాలు, మూడు రాజధానుల కోసం చేస్తున్న దీక్షలు జయప్రదం కావాలని కోరుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాంతిహోమం నిర్వహించారు. పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ‘కన్నా’ రాసిన లేఖపై పార్టీ ముఖ్యులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా, తెలుగుదేశం పార్టీ లైన్లో ఈ లేఖ ఉందని.. ఇది రాసేటప్పుడు ఎవ్వరినీ కూడా సంప్రదించలేదని ఇద్దరు ముఖ్యనేతలు ‘కన్నా’ వద్ద తీవ్ర అభ్యంతరం చేసినట్లు సమాచారం. టీడీపీ నేతలు లేఖ రాసిన కొద్దిసేపటికే ‘కన్నా’ కూడా రాయడం ఏమిటని ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని కేంద్రంలో పార్టీ ముఖ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు దీనిపై ఆరా తీసినట్లు తెలిసింది. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి భిన్నంగా ‘కన్నా’ లేఖ ఉందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సాధారణంగా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుందని.. కానీ, ‘కన్నా’ లేఖవల్ల పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. కన్నా లేఖపై అవసరమైతే కేంద్ర పార్టీ పెద్దలు గవర్నర్కు వివరణ ఇచ్చే అవకాశం ఉందని ఒక ముఖ్యనేత చెప్పారు. -
పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ' ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?' అంటూ ఎద్దేవా చేశారు. -
కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి
-
‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి
హైదరాబాద్/రైలుపేట (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య నల్లపు రెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్లోని విల్లా నంబర్–28లో అద్దెకుండే పవన్ రెడ్డి ఇంట్లో విందు చేసుకుంటున్న సమయంలో డ్యాన్స్ చేస్తూ ఆమె స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. రాయదుర్గం సీఐ ఎస్.రవీందర్ కథనం ప్రకారం.. సుహారికకు ఫణీంద్రతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గచ్చిబౌలిలోని హిల్రిడ్జ్ విల్లా నంబర్ 11లో ఉంటున్నారు. సుహారిక తల్లి మల్లిసాగరిక కూడా వీరితో ఉంటున్నారు. ఫణీంద్ర, సుహారికలకు సంతానంలేదు. కాగా, సుహారిక చెల్లి నిహారిక భర్త ప్రవీణ్రెడ్డికి బంజారాహిల్స్కు చెందిన వివేక్, విహాస్, పవన్రెడ్డిలు స్నేహితులు. వీరంతా తరచూ పార్టీలు చేసుకుంటారు. విందులో డ్యాన్స్ చేస్తూ.. కాగా, గురువారం ఉ.7.30 గంటలకు వీరంతా పవన్రెడ్డి ఇంట్లో పార్టీ ప్లాన్ చేసుకున్నారు. సుహారిక భర్త ఫణీంద్రకు వీలుపడక సుహారిక మాత్రమే పార్టీకి వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు విరామం లేకుండా డ్యాన్స్ చేయడంతో సుహారిక స్పృహ తప్పి పడిపోయారు. అక్కడికి సమీపంలో ఏఐజీ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. అరగంట పాటు వైద్యులు చికిత్స అందించినా ఆమె స్పందించకపోవడంతో చివరికి చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే, సా.5.30 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వైద్యులతో మాట్లాడారు. అంతేకాక.. విందులో పాల్గొన్న వారందరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం లేదని సుహారిక తల్లి మల్లిసాగరిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్యాన్స్ చేయడంవల్లే స్పృహ తప్పి పడిపోయారని, ఆమె మరణంపై ఏ అనుమానాలు లేవని భర్త ఫణీంద్ర కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయి ఉండొచ్చని తెలిపారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే సుహారిక మృతికి అసలు కారణాలు తెలుస్తాయని సీఐ ఎస్.రవీందర్ తెలిపారు. ఆమె మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నేడు ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు పంపనున్నారు. అయితే, సుహారిక మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. అంత ఉదయం ఎందుకు పార్టీ చేసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కన్నా లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. -
అప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు?
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోతే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 దేవాలయాలు కూల్చేసినపుడు కూడా కన్నా మాట్లాడలేదని, బాబు ఇచ్చిన డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారన్నారు. బుధవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ ఆస్తులని అమ్మాలని సంతకాలు కూడా చేశారు. భాను ప్రకాష్ రెడ్డి విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదు. అప్పట్లో నేను బీజేపీలో ఉండి దేవాలయాలు పడగొట్టే అంశాన్ని అడ్డుకుంటే నన్ను అరెస్ట్ చేశారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ( ‘ఆనాడు భూముల విక్రయ కమిటీలో బీజేపీ వారు లేరా) మీరు అమ్మాలనుకున్న ఆస్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపితే నిరాహార దీక్ష చేస్తారా? దేవాలయాల డబ్బులు తీసుకుని వెళ్లి ఇమామ్లకి, పాస్టర్లలకి ఇస్తున్నారన్న దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. టీటీడీ ఆస్తుల గురించి ఫిబ్రవరిలో చర్చించాం అంతే. డబ్బులకి అమ్ముడు పోయి ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని మీరిలా మాట్లాడటం సబబు కాదు. పవన్ కళ్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారు, చేతిలో దేవుడి పటం ఉంటుంది. వీళ్ళు కూడా టీటీడీ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం') భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వండి: మల్లాది విజయవాడ : టీటీడీ ఆస్తుల అమ్మకం సమయంలో టీడీపీతో జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని, అప్పుడు వారెవరూ దీని గురించి నోరు విప్పలేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న సమయంలో బీజేపీలో ఉన్నారని తెలిపారు. భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. జనసేనలో ఉన్న నాగబాబు గాడ్సేని భుజాన వేసుకుని మాట్లాడారని, ఆయనకి దేవాలయాల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. -
డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారు..
-
'నీ కబ్జాకోరు బాగోతాలు బయటకు తెస్తాం'
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు రాష్ట్రప్రభుత్వం వన్టైం సహాయం కింద రూ. 5వేల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లలో జమచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ను నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కన్నా ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలి. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసినందుకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారా..? టీటీడీ ఆస్తుల పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నా నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా గురించి కొద్దీ రోజుల్లో బయట పెడతాం. మా ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఊరుకునేది లేదు.’ అని మండిపడ్డారు. చదవండి: ‘ఆలయాలను కూల్చిన నీచుడు చంద్రబాబు’ అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది: మల్లాది విష్ణు ‘‘నూజివీడులో నీ కబ్జా కోరు నిజస్వరూపం త్వరలోనే బయటకు తెస్తాం. హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది అంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ కారణంగా మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు 5000 నగదు ఇవాళ అకౌంట్ లో పడింది. సీఎం వైఎస్ జగన్ ఎవరికి ఇబ్బంది వచ్చిన సాయానికి ముందుకు వచ్చారు. కానీ ఇవేమీ పట్టని కన్నా ఏసీలో కూర్చొని దీక్షలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో భూముల అమ్మకం నిర్ణయం చేస్తే దాన్ని మా సీఎం రద్దు చేశారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, మీరు కలిసి చేసిన పాపానికి ప్రాయచ్చిత్తంగా మీరు దీక్షలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక్కడి పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు ఈ విషయాలపై అప్పటి మీ మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించండి’’ అని మల్లాది విష్ణు హితువు పలికారు. చదవండి: లాక్డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్ -
మనమే ముందున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం చర్యలు చేపడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పరాయి రాష్ట్రంలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని, కలసి జీవించాలని, జాగ్రత్తలతో ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు సూచించారన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావిస్తే చంద్రబాబు దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. కరోనా పరీక్షల కిట్ల కంపెనీలో తాను డైరెక్టర్గా ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించటాన్ని తీవ్రంగా ఖండించారు. ‘నేను డైరెక్టర్గా ఉన్నట్లు నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకు రాజీనామా చేస్తా. లేదంటే కన్నా రాజీనామా చేస్తారా?’ అని సవాల్ విసిరారు. ప్రముఖులంతా అదే చెప్పారు.. ► కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదు. ఈ యుధ్దంలో నూరు శాతం విజయం సాధించడం అసంభవం. కేసులు సున్నాకు వచ్చేవరకు వ్యవస్ధను పునఃప్రారంభించకుంటే ఇబ్బందులు తప్పవని ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తదితరులు చెప్పారని బుగ్గన గుర్తు చేశారు. ► కరోనాతో సహజీవనం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థే చెబుతోంది. మాస్కులు మన జీవితంలో భాగం కాబోతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లోకేశ్ నాయుడూ.. లెక్కలు తెలుసుకో నారా లోకేశ్ నాయుడు ఉదయం ఒకటి సాయంత్రం మరో ట్వీట్తో పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోలేకపోతోందని టీడీపీలోనే ఒకరు విమర్శలు చేస్తుంటే లోకేశ్ నాయడు మాత్రం అదనంగా రూ.30 వేల కోట్లు ఆదాయం వచ్చిందని, మార్చి నెలాఖరులో పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించారంటూ అవాస్తవాలు చెబుతున్నారని బుగ్గన పేర్కొన్నారు. ► 2018–19 ఆర్ధిక ఏడాదిలో రూ.1,64,841 కోట్ల ఆదాయం వస్తే 2019–20లో రూ.1,70,000 కోట్ల ఆదాయం వచ్చిందని బుగ్గన వివరించారు. అంటే అదనంగా దాదాపు రూ.ఐదు వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ► మార్చి 30, 31 తేదీల్లో పిల్లల చదువులు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పెన్షన్లు, డైట్ చార్జీలు, 104,108 వాహనాల కొనుగోళ్లకు రూ.6,411 కోట్లు ఇచ్చాం. ఇందులో గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, పిల్లల చదువులకు మిగిల్చిన బకాయిలు కూడా ఉన్నాయి. ► కరోనా నియంత్రణ చర్యలతోపాటు లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ఇప్పటివరకు రూ.8,757 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ► లోకేష్ నాయుడు తీరు చూస్తుంటే పిల్లల చదువులు, ఆరోగ్యశ్రీ, డైట్ చార్జీలు, సంక్షేమ పెన్షన్లకు నిధులు ఇవ్వొద్దని చెబుతున్నట్లుగా ఉంది. ఆయన ఇప్పుడైనా లెక్కలు చూసుకోవాలి. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు.. ► ఆంధ్రప్రదేశ్లో 5.34 కోట్ల జనాభా ఉండగా 1,02,460 çకరోనా పరీక్షలు చేశాం. ప్రతి పది లక్షల మందికి సగటున 1,919 పరీక్షలు చేశాం. ఇది దేశంలోనే అత్యధికం. ► దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల శాతం 4.12 కాగా ఆంధ్రప్రదేశ్లో 1.5 శాతం మాత్రమే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ టెస్ట్లు చేసి పాజిటివ్ శాతాన్ని తక్కువగా చూపిస్తున్నారు. ► కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందుతున్నందున రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. 403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్ అవుతున్నారంటే ట్రీట్మెంట్ బాగుండబట్టే కదా. ► చంద్రబాబు కనుక ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే కరోనాపై కత్తి యుద్ధం, అర్థరాత్రి ఒంటి గంట వరకు బాబు సమీక్ష, ఐరాసలో కరోనాపై బాబు ప్రజెంటేషన్, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులపై ఆగ్రహం, ఆఖరికి కరోనాను బాబు జయించారు లాంటి వార్తలను ప్రచారం చేసుకునేవారు. -
నిరూపిస్తే రేపు ఉదయమే రాజీనామా: బుగ్గన
సాక్షి, విజయవాడ: కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ను కాదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపణలపై శుక్రవారం ఆయన స్పందించారు. తాను సదరు కంపెనీలో డైరెక్టర్ను అని నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కిట్కు రూ. 730 చొప్పున వెచ్చించి తొలుత లక్ష కిట్లను దిగుమతి చేసుకున్న సర్కారు.. రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్లో ప్రత్యేకమైన క్లాజ్ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది. (కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ తొలిస్థానం: బుగ్గన) ఈ క్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ సహా పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ర్యాపిడ్ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో వీరి తప్పుడు ప్రచారం బట్టబయలైంది. ఇదిలా ఉండగా.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. -
చంద్రబాబుకు కన్నా మంచి స్నేహితుడు..
సాక్షి, తూర్పుగోదావరి: మహమ్మారి కరోనా(కోవిడ్-19)ను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. కరోనాపై పోరులో ప్రభుత్వం సమర్థవంతగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా.. టీడీపీ నేతలు ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దున్న ఈనిందంటే దూడని కట్టండని గావు కేక పెట్టినట్టుగా ప్రతిపక్షాల తీరు ఉందని ధ్వజమెత్తారు. కరోనా కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్లు పెట్టడమేమిటని ప్రశ్నించారు. బుధవారమిక్కడ మాట్లాడిన దాడిశెట్టి రాజా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.(ఒక్కో టెస్టింగ్ కిట్ రూ.795; ఆ నోళ్లకు తాళం!) ‘‘తనకు డౌట్ వచ్చి ట్వీట్ పెట్టానని కన్నా చెప్పినప్పుడు టీడీపీ ఎల్లో గ్యాంగ్ ఎందుకు మౌనంగా ఉంది. చంద్రబాబు నాయడు రంగాను హత్య చేశాడు... నన్ను కూడా హత్య చేస్తాడని చెప్పిన మాటలు కన్నాకు ఇప్పుడు గుర్తులేవా. చంద్రబాబు దగ్గర చందాలు తీసుకుని కన్న విమర్శలు చేస్తున్నారు. సంస్కారం లేని చంద్రబాబు కన్నాకు మంచి మిత్రుడు అయిపోయాడు. ఆకాశం మీద ఉమ్మివేస్తే ఏం జరుగుతుందో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అదే జరుగుతుంది’’ అని కన్నా తీరును ఎండగట్టారు. చంద్రబాబు అసలు మనిషేనా.. ఆయనకు కొంచమైనా మానవత్వం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళ టీడీపీ పాలనలో నీరు- చెట్టు నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా రూ.6 లక్ణల కోట్లు దోచేసి... పార్టీ శవాలపై పేలాలు ఏరుకుందని దుయ్యబట్టారు.(ఆయన దారుణ వ్యక్తిత్వం మరోసారి రుజువైంది: సజ్జల) -
కన్నా.. ఈ ఐదు ప్రమాణాలకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: బీజేపీలో ఆఫర్ కోసం గుండెపోటును తెప్పించుకుని గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా నీతులు వల్లెవేయడం ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలోకి రావాలని ‘కన్నా’ ముహూర్తం పెట్టుకుని ఆ తరువాత బీజేపీ నుంచి ఆఫర్ వస్తే గుండెపోటు అని చెప్పి ఆసుపత్రిలో చేరిన మాట వాస్తవమా? కాదా?.. అని అంబటి ప్రశ్నించారు. రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. ► కాణిపాకం వినాయకుడి దగ్గరకు ‘కన్నా’ వచ్చి.. 2018 ఏప్రిల్ 24న తాను గుండెపోటుతోనే ఆసుపత్రిలో చేరాను, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవడానికి తాను రూ.20 కోట్లు ఢిల్లీలో ఒక బ్రోకర్కు ఇవ్వలేదు, 2019 ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేశాను, చిన్నస్థాయిలో ఉన్న నేను ఇన్ని వందల కోట్లకు అధిపతి కావడానికి సొంతంగా కష్టపడి సంపాదించానే తప్ప రాజకీయ అవినీతి చేయలేదు, చంద్రబాబుకు అమ్ముడు పోలేదు.. అని ఈ ఐదు ప్రమాణాలను చేయాలి. ► ‘కన్నా’ ఎప్పుడు విలేకరుల సమావేశం పెట్టినా ఈ ఐదింటికీ సమాధానం ముందుగా చెప్పాలి. ► మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రూ.20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని, ఆధారాలున్నాయని విజయసాయిరెడ్డి వివరంగా చెబితే మీరు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ► మీరు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పార్టీ నిధులను కొట్టేశారా లేదా లెక్క చెప్పకుండా తప్పుకు తిరుగుతున్నది నిజమా కాదా? ► చంద్రబాబు రెండు రోజులకోసారి యాప్ ద్వారా వచ్చి కరోనా కేసులను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చూపిస్తోందని సూక్తిముక్తావళి చెబుతున్నారు. అసలు తగ్గించి చూపాల్సిన అవసరం ఏముంది? ► బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు ‘కన్నా’, సుజనాచౌదరి గురించి బీజేపీ నేతలు దయచేసి తెలుసుకోవాలి. -
‘కన్నా’పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నాయని.. అయితే, సమస్యల్లా చంద్రబాబుకి అమ్ముడుపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీకి వలస వెళ్లిన టీడీపీ గుంటనక్కలవల్లే వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► నా జీవితంలో నేను ఎక్కడా ఇంతవరకూ అవినీతికి పాల్పడలేదు. కాణిపాకమే కాదు.. నా ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామి సాక్షిగానే కాదు.. ఏ దేవుడు ముందు ప్రమాణం చెయ్యమన్నా సిద్ధంగానే ఉన్నా. ► ‘కన్నా’పై నేను చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఆయన రూ.20 కోట్లకు చంద్రబాబుకి అమ్ముడుపోయారు. ఇది రుజువు చెయ్యగలను. ► గత ఎన్నికల్లో రాష్ట్రానికి బీజేపీ పంపిన నిధుల్లో పురంధేశ్వరి ఎంత తీసుకున్నారో.. ‘కన్నా’ ఏ నియోజకవర్గానికి ఎంతిచ్చారు? ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలు నేను చెప్పగలను. కానీ.. ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి బయటపెట్టడంలేదు. ► ఇక సుజనా చౌదరి విషయానికి వస్తే.. నేను చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయనకు ఆడిటర్గా వ్యవహరించాను. వందల సంఖ్యలో బోగస్ కంపెనీల్ని సృష్టించి.. రూ.వేల కోట్లు బ్యాంకుల్ని మోసం చేసిన ప్రతీదానికీ నా వద్ద ఆధారం ఉంది. ► బ్యాంకులు దివాలా తీయడానికి, విలీనం చేసే స్థితికి రావడానికి సుజనా వంటి వ్యక్తులే కారణం. ► చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీ గుంటనక్కలు బీజేపీలో చేరి ఆ పార్టీ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. ► సీఎం జగన్.. లాక్డౌన్పై కచ్చితమైన విధానంతో వెళ్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతంలో వెసులుబాటు కల్పించాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు. ► చంద్రబాబులా చెయ్యని పనులు చేసుకున్నట్లు ప్రచారం చేసుకోవడం, కష్టకాలంలో ప్రజల గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టిసారించే పనులు ఈ ప్రభుత్వానికి అనవసరం. ఆయనకు అల్జీమర్స్ వచ్చినట్లు కనిపిస్తోంది. ► కోవిడ్–19పై కొన్ని రాష్ట్రాలు జిల్లాని క్లస్టర్గా తీసుకుంటుంటే.. మనం మాత్రం మండలాలను క్లస్టర్లుగా తీసుకున్నాం. పరీక్షలు నిర్వహించేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ ఈ విధంగా ఏర్పాటు చేశారు. ► రాజధాని తరలింపు కోసమంటూ టీడీపీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖకు రాజధాని తరలిస్తారు. ఈ ఇష్టాగోష్టిలో మంత్రి ముత్తంశెట్టి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. విరాళమిచ్చే ప్రతి పైసాకీ జవాబు దారీతనం అలాగే, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విరాళాల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసాకీ జవాబుదారీతనంగా ఉంటామని స్పష్టంచేశారు. కరోనా కారణంగా ముస్లింలు రంజాన్ పండుగను ఇళ్ల వద్దనే జరుపుకోవాలని మతపెద్దలకు సూచించారు. త్వరలో సీఎం వైఎస్ జగన్ ముస్లిం పెద్దలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతారన్నారు. విశాఖలోని ముస్లింలందరికీ ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరకులను అందజేస్తామన్నారు. అనంతరం నగరంలోని పలు వార్డుల్లో వికలాంగులు, ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. -
‘ఆయన చంద్రబాబు జేబులో మనిషే’
సాక్షి, విజయవాడ: కరోనాపై కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయని.. నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. (లక్ష్మీనారాయణా.. సమాధానం చెప్పు) ఎన్నికల ఫండ్ను కొట్టేశారో లేదో చెప్పాలి.. ‘‘కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ అయిన నేత కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. బీజేపీలో అధ్యక్షుడిగా ఇవ్వడం లేదని వైఎస్ఆర్సీపీలో చేరాలనుకోలేదా? చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడు పోయి ఇప్పుడు మాపై విమర్శలా?. కన్నా.. చంద్రబాబు జేబులో మనిషి. 20 కోట్లు ఇచ్చి కాంగ్రెస్లో సీఎం పదవి కొనుక్కోవాలని ప్రయత్నించలేదా? బీజేపీ ఎన్నికల ఫండ్ను కన్నా కొట్టేశారో లేదో చెప్పాలి. గత ఏడాది ఏప్రిల్ 24న నిజంగానే గుండెపోటు వచ్చిందా? 2019లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికల ఫండ్ను సద్వినియోగం చేశావా?’ అంటూ విమర్శలు గుప్పించారు. (ఆకాశంపై ఉమ్మేయొద్దు : విజయసాయిరెడ్డి) ఎందుకు ప్రశ్నించడం లేదు..? వందల కోట్లు సంపాదించుకోడానికి రాజకీయ అవినీతి చేయలేదని.. చంద్రబాబుకు అమ్ముడుపోలేదని కన్నా ప్రమాణం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెబితే కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కేంద్రం కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకే ర్యాపిడ్ కిట్లు కొనుగోలు చేశామన్నారు. కర్ణాటక రాష్ట్రం కూడా 790కే కొనుగోలు చేసిందని.. వాటిని కన్నా లక్ష్మీ నారాయణ ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
లక్ష్మీనారాయణా.. సమాధానం చెప్పు
సాక్షి, తాడేపల్లి: కరోనాపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబుకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వత్తాసు పలకడం బాధాకరమన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఎల్లో మీడియా వంత పాడుతుందని ధ్వజమెత్తారు. కరోనా టెస్ట్ కిట్లు కొనుగోలు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కన్నా ఆరోపణలు అర్థ రహితమన్నారు. (కోవిడ్-19 ఎఫెక్ట్పై షాకింగ్ సర్వే) కన్నా సమాధానం చెప్పాలి.. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలను కేంద్రం, జాతీయ మీడియా ప్రశంసించాయని చెప్పారు. కిట్ను రాష్ట్రం రూ.730కి కొంటే.. కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందన్నారు. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నా, టీడీపీ నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తున్నారని.. వారితో కలిసి కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వాలంటీర్ల వ్యవస్థ తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోందని తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. -
‘అవినీతి జరిగిందని నిరూపించగలరా ?’
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బురద చల్లుతున్నారని మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలను తప్పుపట్టారు. కిట్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని నిరూపించగలరా అంటూ కన్నాను మంత్రి ప్రశ్నించారు. కరోనా కట్టడిలో ముందున్నాం.. ‘ఏపీలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం రూ.730 మాత్రమే వెచ్చించాం. చంద్రబాబుతో కలిసి కన్నా ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిలో ఆయన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, కన్నా కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారని’’ ఆయన నిప్పులు చెరిగారు. కరోనా కట్టడిలో మిగిలిన రాష్ట్రాల కంటే ముందున్నామని.. తమ ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారి అని స్పష్టం చేశారు. (దోచుకున్న డబ్బును బయటకు తీయండి) అత్యంత పారదర్శకంగా పాలన అందిస్తున్నాం.. ‘‘ఏ రాష్ట్రమైనా మా కంటే తక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేసిందా? కేంద్రం మా కంటే ఎక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేసింది. కావాలనే ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేస్తున్నారని’’ దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా మూడు సార్లు ఆరోగ్య సర్వే చేశామని.. ఏపీలో 32 వేల మంది కరోనా అనుమానితులకు లక్ష ర్యాపిడ్ కిట్స్ ద్వారా టెస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. కరోనా కట్టడికి సీఎం వైఎస్ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అందిస్తోన్న మంచి పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేసే కుటిల రాజకీయాల్లో భాగస్వామ్యం కావొద్దని కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి ఆళ్ల నాని హితవు పలికారు. (కష్టాల్లో ఉన్నా.. పథకాల్లో ముందుకే : వైఎస్ జగన్) -
విపత్కర పరిస్థితుల్లో నీచ రాజకీయాలా బాబూ!
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే, టీడీపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని దుయ్యబట్టారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1.33 కోట్ల మందికి రూ.1000 చొప్పున సాయం అందిస్తే దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణం అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► రూ.1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లు ఓ వీడియోను చూపించి దుష్ప్రచారం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ అది ఎక్కడిదో బయటపెట్టాలి. ► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు నిధులు విడుదల చేస్తే బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నారని మాట్లాడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ► 2020– 21 ఏడాదికి 15వ ఆర్ధిక సంఘం రెవెన్యూ లోటు కింద రూ. 5,987 కోట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. దీనిలో భాగంగా ఏప్రిల్ నెలకు 491.41 కోట్లు కేటాయించారు. 15వ ఆర్ధిక సంఘం విపత్తు సహాయం నిమిత్తం రూ.1,491 కోట్లు కేటాయించి రూ.559.50 కోట్లు విడుదల చేసింది ► కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలనేదే సీఎం లక్ష్యం. ► సీఎం వైఎస్ జగన్ విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారనే టీడీపీ కడుపుమంట. ► ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బందిని అందరం గౌరవించాలి. టీడీపీ నేతలు మాత్రం ఈ పరిస్థితుల్లోనూ అడ్డగోలుగా ట్వీట్లు చేస్తున్నారు. ► టీడీపీ కడుపు మంటతో చౌకబారు విమర్శలు చేస్తూ ప్రతి విషయాన్ని ఈసీ, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తోంది. -
రాజధాని ఎక్కడన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారంతో తీసుకునే నిర్ణయమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇందులో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని అయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే ప్రక్రియలో భాగంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంటరీæ నియోజకవర్గాల బీజేపీ నేతలతో సోమవారం ఆయన విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టును శాశ్వతంగా కర్నూలుకు తరలించాలని కోరుతూ ఆరు నెలల క్రితమే తాను కేంద్ర మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసినంత మాత్రన అదొక రాజధానిగా అనలేమని వ్యాఖ్యానించారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందన్నారు. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పురందేశ్వరి నేతృత్వంలో పార్టీ కమిటీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై అభిప్రాయాలను సేకరిస్తుందన్నారు. పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా 19న కడపలో ధర్నా చేపట్టాలని నిర్ణయించామన్నారు. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న పోలవరం నిర్మాణంలో అవినీతి, విశాఖ భూకుంభకోణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పందన లేదన్నారు. -
28న పవన్, బీజేపీ నేతల భేటీ రద్దు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా జనసేనతో కలిసి ఫిబ్రవరి 2న నిర్వహించ తలపెట్టిన లాంగ్మార్చ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీజేపీ ప్రకటించింది. త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న జరగాల్సిన రెండు పార్టీ నేతల సమావేశం కూడా వాయిదా పడింది. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్) ఢిల్లీ నాయకత్వం మొట్టికాయలు..! లాంగ్మార్చ్ వాయిదా వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం మొట్టికాయలు వేయడమే కారణమని ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలో దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల నేతలకు సూచించింది. అయితే రాష్ట్రంలో ఆ కార్యక్రమాల్ని పక్కనపెట్టి స్థానిక నేతల సొంత అజెండా ప్రకారం వెళ్లడంపై జాతీయ నాయకత్వం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. (పవన్కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!) సీఏఏపై అవగాహన కార్యక్రమాలు మరో పది రోజులు కొనసాగించాలని బీజేపీ పెద్దలు సూచించారు. అయితే రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమాలు జరగకపోవడాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం తప్పుపట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో పది రోజుల పాటు సీఏఏపై ప్రజలలో అవగాహన కలిగించే కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. -
పార్ట్నర్స్ వేసిన మరో ప్లాన్..!
సాక్షి, అమరావతి: ఇది పార్ట్నర్స్ వేసిన మరో ప్లాన్..! ఒకవైపు.. ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి తేరుకునే ఛాయలు ఏమాత్రం కానరాకపోవడం మరోవైపు.. అమరావతిలో లక్షల కోట్ల రూపాయల తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి తన ‘పార్టనర్’ను తెరపైకి తెచ్చారు. ఆర్థిక, రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో జట్టు కట్టేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ద్వారా స్కెచ్ వేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు – పవన్ కల్యాణ్ జోడీ మరో పన్నాగం పన్నింది. పవన్ ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖను అమరావతి పోరులోకి దించే ఎత్తుగడ వేసింది. బాబు ప్రయోజనాలే పవన్కు పరమావధి! ముందస్తు స్కెచ్ ప్రకారం పవన్ కల్యాణ్ను మరోసారి రంగంలోకి దింపిన చంద్రబాబు ఆయన్ను ఢిల్లీకి పంపి రెండు రోజులు మకాం వేయించారు. సుజనా చౌదరి తదితరుల సహకారంతో పవన్ బీజేపీ నేతలను కలిసేలా చేశారు. బాబు స్క్రిప్టు ప్రకారం బేషరతుగా బీజేపీతో కలసి పనిచేసేందుకు పవన్ సమ్మతించారు. విభజన చట్టం హామీలను అమలు చేయాలని పవన్ కనీసం అడగకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ కోసం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుంటామని విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణ పదే పదే చెప్పడం వారి అసలు ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుపై పవన్, కన్నా పరస్పర విరుద్ధంగా మాట్లాడి ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి తెరతీశారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడటమే తమ విద్యుక్త ధర్మం అన్నట్టుగా వారిద్దరూ మాట్లాడారు. దశలవారీ విలీనానికి గ్రీన్ సిగ్నల్? పవన్ కల్యాణ్ తమతో బేషరతుగా కలసి పనిచేసేందుకు సమ్మతించారని గురువారం చర్చల సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దేవ్ధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పదేపదే చెప్పడం గమనార్హం. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడానికి వీల్లేదన్న ఆదేశానికి పవన్ సమ్మతించారు. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు రాష్ట్రంలో కాస్త బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇదే అదనుగా జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. అందుకు పవన్ కల్యాణ్ సూత్రప్రాయంగా సమ్మతించారని తెలుస్తోంది. ఒకేసారి విలీనం కాకుండా దశలవారీగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక నుంచి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధేవ్ధర్ నేతృత్వంలో రాష్ట్రంలో తాము పనిచేస్తామని ప్రకటించడం ద్వారా పవన్ అసలు ఉద్దేశాన్ని వెల్లడించారు. -
కుట్రపూరితంగానే అమరావతిలో రాజధాని
సాక్షి, అమరావతి: స్వలాభాపేక్ష, మోసపూరిత ఆలోచనలతో చంద్రబాబు నాయుడు అప్పట్లో కుట్రపూరితంగా అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని ఆక్షేపిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ కోర్ కమిటీ శనివారం ఒక తీర్మానం చేసింది. అయినప్పటికీ గతంలో అన్ని పక్షాలు అమరావతిని రాజధానిగా తీర్మానించిన నేపథ్యంలో.. అక్కడే రాజధానిని కొనసాగించడం సమంజసమని ఆ తీర్మానంలో పేర్కొంది. రాజధాని అంశంపై పార్టీ పరంగా ఒక స్పష్టమైన వైఖరిని బహిర్గతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ శనివారం గుంటూరులో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో నేతల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అనంతరం నేతలు ఏకాభిప్రాయంతో ఒక తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ తీర్మానం వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు విడుదల చేశారు. బాబు మోసం ‘‘శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలను గత టీడీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసి, ఏపీ ప్రజలను మోసగించింది. ఆ కమిటీ నివేదికను ప్రజల ముందుకు తీసుకొని రాకుండా స్వలాభాపేక్షతో కుట్రపూరితంగా అక్కడే (అమరావతిలో) రాజధానిని స్థాపించాలని నిర్ణయించడం చంద్రబాబు మోసపూరిత ఆలోచనలకు నిదర్శనం. రూ.లక్షల కోట్ల వ్యయంతో సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించడం రాష్ట్ర ఆర్థిక వనరులపై భారం మోపడమే కాకుండా సాధ్యపడే విషయం కాదని శివరామకృష్ణన్ కమిటీ నివేదించింది’’ అని తీర్మానంలో బీజేపీ కోర్ కమిటీ పేర్కొంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ బీజేపీ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో చెప్పారు. 15వ తేదీన పోరాట కార్యచరణను ప్రకటిస్తామన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరుతూ తీర్మానం చేయాలన్న ప్రతిపాదనకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ అంగీకారం తెలపలేదు. -
రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారం
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని, ఈ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు కలిగిస్తున్న అపోహలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం విజయవాడలో కన్నా ఆవిష్కరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ఎటువంటి జోక్యం చేసుకోదని, ఇది బీజేపీ తరఫున అధికారికంగా చేస్తున్న ప్రకటన అని జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. ‘నేనూ దానికి తేడాగా చెప్పడం లేదు కదా?’ అని కన్నా ప్రశ్నించారు. మీడియానే భిన్నంగా అర్థం చేసుకుందన్నారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, ఇప్పుడు దాన్ని మార్చే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. -
మోదీనే గాంధీజీకి నిజమైన వారసుడు
సాక్షి, విజయవాడ: ‘గాంధీ సంకల్ప యాత్ర’ పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ సంకల్ప యాత్రను రాష్ట్రంలో ఒక దీక్షలా నిర్వహించామన్నారు. గాంధీ స్పూర్తిని ఈ తరానికి చైతన్యం కలిగించేలా ప్రధాని మోదీ ఈ కార్యక్రమం చేయాలన్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉండి అవమానాలకు గురైన గొప్ప నేతలను స్మరించుకోవడం బీజేపీ ఉద్దేశమన్నారు. అందుకే మహాత్ముని పేరుతో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. గాంధీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఆయన ఆశయాలను ఆ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. గాంధీజీ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఎంపీలను ఆదేశించారని తెలిపారు. ఏపీలో గాంధీ సంకల్ప యాత్ర చాలా గొప్పగా జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలను అసలు పాటించలేదని, లౌకిక వాదం పేరుతో హిందు వ్యతిరేక రాజకీయాలను చేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి సరిపోయే పేరు రాహుల్ జిన్నా, సోనియా జిన్నా అని వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదులో అప్పట్లో రాముడి విగ్రహం పెడితే వాటిని తొలగించేందుకు నెహ్రు ప్రయత్నించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదని అన్నారు. కుటుంబ పాలనను కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చేసిందని విమర్శించారు. ప్రస్తుతం అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ దారిలోనే కుటుంబ పాలన చేస్తున్నాయని అన్నారు. గాంధీజీ పేరుతో దేశంలోని వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కుటుంబాలు లేని, కుటుంబాలను వదిలేసిన పాలన బీజేపీదన్నారు. మహాత్మాగాంధీ పేరు చెప్పుకుని దేశాన్ని సోనియాగాంధీ కుటుంబం దేశాన్ని దోచేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పాటించలేదని అన్నారు. మోదీనే గాంధీజీకి నిజమైన వారసుడని సత్యకుమార్ పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను నెరవేర్చేది మోదీనే అని, మహాత్ముడి ఆశయ సాధన కోసం బీజేపీ నాయకులు 4లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చా నేత పురందేశ్వరి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
‘బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్’
సాక్షి, తాడేపల్లి: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తన పదవిని కాపాడుకోవడానికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేసే ముందు ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలనే కన్నా చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ ఎంత విచ్చలవిడిగా జరిగిందో కన్నాకు తెలియదా అని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసి బీజేపీ నేతలు చేసిన విమర్శలు.. రోజూ చంద్రబాబు చేసే విమర్శలేనన్నారు. టీడీపీ విధానాలను బీజేపీ నేతలు అమలు చేస్తున్నారా.. అని నిప్పులు చెరిగారు. బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్.. దళిత ఎమ్మెల్యేను టీడీపీ నేతలు దూషిస్తే నోరు ఎందుకు మెదపలేదో కన్నా సమాధానం చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు ఒక ఐపీఎస్ అధికారిపై నోరు పారేసుకొంటే ఎందుకు మాట్లాడలేదని.. దళిత ఎస్ఐపై టీడీపీ నేతలు కులం పేరుతో అవమానిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైస్సార్సీపీపై గవర్నర్కు ఫిర్యాదు చేసే అర్హత కన్నాకు లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతుల కోసం రైతు భరోసా వంటి పథకాలు తీసుకోస్తే కన్నా ఎందుకు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్ లా ఉన్నాయని విష్ణు ఎద్దేవా చేశారు. టీడీపీ క్రిమినల్స్ పార్టీ... టీడీపీ క్రిమినల్స్ పార్టీ అని.. సదావర్తి భూములను కాజేస్తే కన్నా ఏమి చేశారని ప్రశ్నించారు. టీడీపీని.. టీడీపీ నాయకులే భ్రష్టు పట్టించారన్నారు. దుర్గమ్మ సన్నిధిలో క్షుద్రపూజలు చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. దేవాలయ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని కన్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. పేదల ఇళ్ల కోసం దేవాలయ భూములను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన కొంతమంది టీడీపీ నాయకులు బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యనించారు. బీజేపీ అధ్యక్షుడిగా కన్నా తొలగించాలని సుజనా, సీఎం రమేష్ వంటివారు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. -
ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని ఆరోపించారు. అందుకే అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైతే మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధి కోసం నాయకులతో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అని పేర్కొన్నారు. -
జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఆయన...జైట్లీ మరణవార్త వినగానే హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైట్లీ లేని లోటు దేశానికి తీర్చలేనిది. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం. అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అత్యుత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్నారు. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.’ అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. I am deeply shocked to learn about the demise of Shri Arun Jaitley,a long time dear friend and one of my closest associates. His death is an irreparable loss to the nation and a personal loss to me. I have no words to express my grief. — VicePresidentOfIndia (@VPSecretariat) August 24, 2019 మరోవైపు జైట్లీ మరణంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు తిరుపతిలోని పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ పయనం అయ్యారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం -
'చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లే'
సాక్షి, శ్రీకాకుళం : ఆర్టికల్ 370 రద్దు గొప్ప చారిత్రక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇన్నాళ్లు కశ్మీర్ నిప్పుల కుంపటిలా మండిపోయిందని, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ భారతదేశం భూభాగంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన నత్తనడకన సాగుతుందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. -
‘టీడీపీ, జనసేన నుంచే ఎక్కువ’
సాక్షి, విజయవాడ: తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మైనారిటీ నేత ఖాజా అలీ సోమవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీలోకి చేరికలు నిత్యం కొనసాగుతున్నాయని చెప్పారు. జనసేన, టీడీపీ, కాంగ్రెస్ నుంచి చేరికలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్పై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చిత్తశుద్ధి చూసి బీజేపీ వైపు అందరూ వస్తున్నారని వ్యాఖ్యానించారు. మైనారిటీ, బీసీ, దళిత వర్గాల నుంచి చేరికలు ఎక్కువగా వున్నాయని తెలిపారు. మాజీ మంత్రి రావెల కిశోర్బాబు జనసేన నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరారు. కాగా, చంద్రబాబు నాయుడిపై విసుగుతోనే టీడీపీ నేతలు పార్టీ వీడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అంతకుముందు అన్నారు. ఫిరాయింపులపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని, ప్రధాని మోదీ పనితీరును చూసి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని వివరించారు. -
వైస్రాయ్ హోటల్ అప్పుడు ఏమైంది చంద్రబాబు?
సాక్షి, అమరావతి: పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 40 మంది టీంఎంసీ ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని మోదీ చెబితే.. ప్రధాని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నారని మాట్లాడుతన్న చంద్రబాబు గతంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నప్పుడు, వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్కు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని చంద్రబాబును నిలదీశారు. కర్ణాటక ఎలక్షన్లో హంగ్ వచ్చినప్పుడు జేడీఎస్ నేత కుమారస్వామికి సపోర్టు చేసిన 110 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తీసుకువచ్చి హోటల్లో దాచినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మాట అన్నారు.. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తమరు ఎన్ని వేషాలు వేశారో మర్చిపోయారా అంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఎన్నికలు ముగిసినా బాబు హడావుడి తగ్గలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు అతీతంగా పని చేస్తుందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హడావుడి తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై అభ్యంతరకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేసి ఓటమిని తప్పించుకోలేరన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో తనపై జరిగింది దాడిగా భావించడం లేదన్నారు. (గురువారం జీవీఎల్ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా శక్తి భార్గవ వ్యక్తి అనూహ్యంగా ఆయనపైకి బూటు విసిరాడు. వేగంగా దూసుకొచ్చిన బూటు జీవీఎల్ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు) దాడులకు భయపడను... ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని, ఇది కాంగ్రెస్ ప్రేరేపిత దాడిగా ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మరోసారి జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసులో సదురు వ్యక్తి చేసిన హడావుడి తనను ఉద్ధేశించి చేసింది కాదన్నారు. ఆ వ్యక్తిపై గతేడాది ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిందని, అతని దగ్గర రూ. 500 కోట్ల విలువైన బంగ్లాలు ఉన్నట్టు గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం అతను ఐటీ విచారణ ఎదుర్కొంటున్నాడని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ తన పని తాను చేసుకుపోతుంటే పార్టీ ఆఫీసులో హడావుడి చేయడం వెనుక ఉద్ధేశం ఏమిటన్నది పోలీసులు నిర్ధారిస్తారని జీవీఎల్ తెలిపారు. దాడిని ఖండించిన కన్నా లక్ష్మీనారాయణ అమరావతి: జీవీఎల్ నరసింహారావుపై జరిగిన దాడిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు బీజేపీ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. తిరిగి మోదీ ప్రధాని అవటాన్ని చూసి ఓర్వలేక, సైద్దాంతిక రాజకీయాలను ఎదుర్కొనలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మే 23న వచ్చే ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టు కాగలవన్నారు. -
చంద్రబాబుకు ఓటేస్తే ఇమ్రాన్ ఖాన్కు వేసినట్లే : కన్నా
సాక్షి, గుంటూరు : తనకు ఎంతో అనుభవం ఉందని, తానైతేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 2018 వరకూ మోదీ మంచివాడన్న చంద్రబాబు.. తరువాత చెడ్డవాడు అని ఎలా అయ్యాడో చెప్పాని డిమాండ్ చేశారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అందుకే కశ్మీర్లోని అరాచక వాదులతో ఏపీలో ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి ఓటు వేసినట్లేనన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అత్యంత అవినీతిపరుడని, నియోజకవర్గంలో నీరు, మట్టి, క్వారీలు, ఇసుకను అక్రమంగా తరలించి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. -
అదేమన్నా పకోడి పొట్లమా?
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ని గెలిపిస్తే మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకి తీసుకువెళతారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ‘‘లీకేష్, పోర్టు ఏమైనా, పకోడి పొట్లం అనుకుంటున్నావా, తెలంగాణకు తీసుకెళ్లడానికి? మీ నాయనతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా నీ తెలివికి జడుసుకుంటున్నారు. రాత్రికి దేవాన్ష్ జాగ్రఫీ పుస్తకంలో మ్యాప్ చూడు.. కేఏ పాల్ ఒక పక్క, నువ్వు ఒక పక్క రాష్ట్రాన్ని భలే తగులుకున్నారు’ అని ట్విట్టర్లో కన్నా పేర్కొన్నారు. -
‘ఈ కుట్రలో ఆయనకు భాగం ఉంది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ నరసింహన్ను కోరటం విడ్డూరంగా ఉందని మంత్రి కేఎస్ జవహార్ వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు బీజేపీ నేతల మాటలు నమ్మరన్నారు. గవర్నర్కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ దుర్వినియోగం చేశారన్నారు. -
‘తల్లిదండ్రులను చంపి.. అనాథనయ్యాను అన్న చందంగా..’
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులను చంపి కోర్టుకు వెళ్లి అనాథనయ్యాను.. మీరే కాపాడాలన్న చందంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతి సభలో మాట్లాడారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చేవారైతే.. 2014లో విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పొందు పరచలేదని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలనే ఆర్డినెన్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆఖరి కేబినెట్లో ఎందుకు తిరస్కరించారో చెప్పాలన్నారు. మాజీ ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీ కంటే ఎక్కువ నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తుందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని స్పష్టంగా చెప్పారని తెలిపారు. టీడీపీ మార్ఫింగ్ చేసిన వీడియోలను చూపించి ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఇస్తామని చెప్తే ఎస్పీవీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. -
చంద్రబాబు ఇప్పుడు మతిస్దిమితం లేని సీఎం అయ్యారు
-
గుంటూరు ప్రజలకు నమస్కారం: మోదీ
గుంటూరు : ‘ఏపీ అక్షర క్రమంలో తొలిస్థానంతో పాటు అన్ని రంగాలలో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు, పద్మభూషణ్, దళిత కవి గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం...’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గుంటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ఆయన తొలిగా ప్రసంగం చేసి, అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య, డాక్టర్ నాయుడమ్మను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఎంతోమంది ప్రముఖులను జాతికి అందించిన గడ్డ గుంటూరు అని, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆక్స్ఫర్డ్ అని ప్రధాని వ్యాఖ్యానించారు. గుంటూరు సమీపంలో ఉన్న అమరావతికి ఎంతో చరిత్ర ఉందని, ఇప్పుడు అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా ఎదుగుతుందని అన్నారు. అమరావతిని హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. మీరు నాపై ఎంతో ప్రేమ ...నిరంతరం పనిచేసేలా తనకు ప్రేరణ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభా స్థలి నుంచే రిమోట్ కంట్రోల్ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్ టర్మినల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. -
కన్నా లక్ష్మీనారాయణకు అవమానం
విజయవాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాబితాలో ఆయన పేరు లేదంటూ.. కన్నా లక్ష్మీనారాయణను విమానాశ్రయం లోనికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోనికి అనుమతించకపోవడంతో సాధారణ ప్రయాణికులు వేచి ఉండే ఎయిర్పోర్టు లాంజ్లో కన్నా లక్ష్మీనారాయణ కూర్చున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. నల్ల జెండాలు, బెలూన్లు, ఖాళీ కుండలతో నిరసన తెలిపారు. -
జీవోల పై కన్నా లక్ష్మీనారాయణ పిటిషన్
-
కేంద్రం ఇవ్వకుండానే కియా మోటర్స్ వచ్చిందా?
-
చంద్రబాబు వల్ల ఖజానాకు భారీ నష్టం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన చర్యల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగించారని, కావాల్సిన వారికి విలువైన భూములను నామమాత్రపు ధరలకు కేటాయించారని, సన్నిహితులకు అత్యంత విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని, వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ జాయింట్ డైరెక్టర్, ఏపీఐఐసీ, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్), వైద్య విద్య డైరెక్టర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, రేచెమ్ ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్లను ప్రతివాదులుగా చేర్చారు. సీఎం చంద్రబాబు, ఏపీఈపీడీసీఎల్ ఎండీ హెచ్.వై.దొరను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) డి.రమేశ్ చేసిన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. కన్నా వ్యాజ్యంలోని ముఖ్యాంశాలు.. ‘‘కండక్టర్ల కొనుగోళ్లకు సంబంధించి కాంట్రాక్టును ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) బెంగళూరుకు చెందిన రేచమ్ ఆర్పీడీ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించాయి. ఇందులో రూ.131 కోట్ల మేర అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విభాగం తేల్చింది. అక్రమాలకు పాల్పడిన ఏపీఈపీడీసీఎల్ ఎండీ హైచ్.వై.దొరను చంద్రబాబు కాపాడుతున్నారు. ఈ–సెంట్రిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ మధురవాడలో అత్యంత ఖరీదైన 50 ఎకరాలను కేటాయించారు. ఈ కంపెనీ డైరెక్టర్ జి.శ్రీధర్రాజు సీఎం తనయుడు, మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడు. బహిరంగ మార్కెట్లో ఈ 50 ఎకరాల విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుంది. అయితే సీఎం జోక్యంతో ఈ భూమిని ఆ కంపెనీకి రూ.25 కోట్లకే కేటాయించారు. బాలకృష్ణ బంధువులకు 498.93 ఎకరాలు కృష్ణా జిల్లా జయతీపురం గ్రామంలోని సర్వే నెంబర్ 93లో వీబీసీ ఫెర్టిలైజర్స్కు యూరియా ప్లాంట్ నిమిత్తం 498.93 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సమీప బంధువులది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘అందరికీ ఇల్లు’ పథకం పేరు మార్చి.. కాంట్రాక్టర్లకు రూ.38 వేల కోట్లను ప్రభుత్వం దోచిపెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు కలిగిన నష్టాలపై సీఎం చంద్రబాబుకు స్వయంగా పలు లేఖలు రాశాను. రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాను. అయినా చర్యలు తీసుకోలేదు. అందుకే న్యాయస్థానం జోక్యాన్ని కోరుతూ ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నా’’ అని కన్నా పిటిషన్లో పేర్కొన్నారు. -
కాంగ్రెస్తో ఏ పార్టీ కలిస్తే ఆ పార్టీ భూస్థాపితమవుతుంది
-
‘కాకిలా తప్ప హంసలా బతకడం ఆయనకు చేతకాదు’
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో చెప్పుకోదగ్గ కనీసం 15 అభివృద్ది పథకాలన్నా ఉన్నాయా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎప్పుడూ కాకిలాగా బతుకుతాడే తప్పా హంసలా బతకడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చేతకాదని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమొచ్చిన ఫ్రంట్లోకి వాళ్లు వెళ్లొచ్చని.. అందరూ చంద్రబాబు చెప్పిన ఫ్రంట్లోకి వెళ్లాలా అంటూ ధ్వజమెత్తారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అమిత్ షాను అడ్డుకుంటామనడం టీడీపీ సంస్కృతని ఆరోపించారు. ప్రతిదానికి చంద్రబాబు సైన్దవుడిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఒంటరిగానే ఎన్నికలకు స్టీల్ ఫ్లాంట్ వస్తుందని తెలిసి టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసేవారని అన్నారు. చార్మినార్ కట్టించిన వ్యక్తి రేపు విశాఖ రైల్వే జోన్కు కూడా శంకుస్థాపన చేస్తాడని ఎద్దేవ చేశారు. అమిత్ షాను ఎందుకు అడ్డుకుంటారో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేశారు. -
ఏపీ బీజేపీ మేనిపెస్టో కమిటీ ఇదే..!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి చేపట్టనున్న బస్సు యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించడానికి కన్నా లక్ష్మీనారాయణ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చైర్పర్సన్గా, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కన్వీనర్గా ఉన్నారు. వీరితోపాటు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు.. 1. డి. పురందేశ్వరి(చైర్పర్సన్) 2. ఐవైఆర్ కృష్ణారావు(కన్వీనర్) 3. పి. విజయ బాబు 4. పీవీఎన్ మాధవ్ 5. దాసరి శ్రీనివాసులు 6. షేక్ మస్తాన్ 7. పాక సత్యనారాయణ 8. కె. కపిలేశ్వరయ్య 9. పి సన్యాసి రాజు 10. సుదీష్ రాంబోట్ల 11. డీఏఆర్ సుబ్రహ్మణ్యం -
ఏపీలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచిపోషిస్తున్నారు
-
కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
‘బాబు అడుగుపెట్టారు.. కాంగ్రెస్ కనుమరుగైంది’
సాక్షి, నెల్లూరు : తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగు పెట్టారు.. కాంగ్రెస్ కనుమరుగైందని, వచ్చే ఎన్నికల్లో దేశంలో కూడా కాంగ్రెస్ కనపడదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిందన్నారు. అన్ని పథకాలలో కూడా కమీషన్లు తీసుకుంటున్నారని, టీడీపీ నేతలు మట్టి, ఇసుకను కూడా భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులని కేంద్రం ఏపీకి ఇచ్చిందని చంద్రబాబు ప్రభుత్వ వెబ్సైట్లో ఈ వివరాలు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని వెల్లడించారు. వాటికి చంద్రబాబు తన పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం 9 లక్షల ఇళ్లను ఇస్తే ఇప్పటివరకు లక్షన్నర ఇళ్లు కూడా పూర్తి కాలేదన్నారు. -
గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
-
సీబీఐ అంటే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్?
-
నీ దేశద్రోహ చర్యలు సిగ్గుచేటు
సాక్షి, గుంటూరు : ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తనకు ఏదో జరగబోతోందనే ఊహలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చక్రం తిప్పుతున్నానని ఫీలవుతున్నారు.. దేశం మొత్తం చక్రంలాగా తిరిగి వచ్చిన చంద్రబాబు తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీలవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బాబుకు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం బ్రోకర్ పనులు చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్? చంద్రబాబు చేసిన అక్రమాలు వెలికితీస్తారనే భయంతోనే బరితెగించి దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ సంస్థలను ధిక్కరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణలో ట్విటర్లో పేర్కొన్నారు. చంద్రబాబుకు.. అర్బన్ నక్సలైట్లు, వేర్పాటువాదులకు తేడా లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐ తన పని తాను చేస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తనిఖీని కేవలం దొంగలు, నేరస్తులు మాత్రమే వ్యతిరేకిస్తారని ఎద్దేవా చేశారు. -
టీడీపీ ఓ పెద్ద డ్రామా కంపెనీ
-
రచ్చకెక్కిన టీడీపీ, బీజేపీ చర్చ
తాడేపల్లిగూడెం, రూరల్, తాడేపల్లి రూరల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య అభివృద్ధిపై చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో మోహరించడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి, ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇంటి గోడ దూకి మరీ చర్చా వేదిక వద్దకు వెళ్లేందుకు సన్నద్ధం కాగా పోలీసులు అడ్డుకుని బలవంతంగా లోపలికి పంపారు. మాణిక్యాలరావుకు మద్దతుగా వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులను పోలీసులు గుంటూరు జిల్లా సరిహద్దులోనే ఆపేశారు. ఇటీవల పెంటపాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఒకరికొకరు ప్రెస్మీట్ల అనంతరం బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు ఈ నెల 6వ తేదీన జెడ్పీ చైర్మన్ బాపిరాజు (టీడీపీ) సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు స్పందిస్తూ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, వెంకట్రామన్నగూడెంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ చర్చకు వస్తానని బదులిచ్చారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వెంకట్రామన్నగూడెంలో టీడీపీకి చెందిన జెడ్పీ చైర్మన్ను, గూడెంలో మాణిక్యాలరావు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు (టీడీపీ)ను హౌస్ అరెస్టు చేశారు. గోడదూకి రోడ్డుపైకొచ్చిన మాణిక్యాలరావు బహిరంగ చర్చ నేపథ్యంలో బుధవారం రాత్రే జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెంకట్రామన్నగూడెంలోని పుసులూరి పుల్లారావు నివాసానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు జెడ్పీ చైర్మన్ను అక్కడే గృహ నిర్బంధం చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బహిరంగ చర్చ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు బలవంతంగా ఇంటి గేట్లను తోసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వెంకట్రామన్నగూడెం వెళ్లడానికి మాణిక్యాలరావు గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. అతన్ని అడ్డుకునే క్రమంలో రక్షణగా నిలచిన బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులపై పోలీ సులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను పోలీసులు బలవంతంగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ నేత సోము వీర్రాజు ఘటనాస్థలికి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ సీన్ మారింది. బాపిరాజుకు దమ్ముంటే పోలీసు పికెట్స్ ఎత్తివేయించి పోలీసు వాహనంలో ఎమ్మెల్యేను చర్చకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ దొడ్డిదారిన తప్పించుకుని వెంకట్రామన్నగూడెం చేరుకోగా పోలీసులు బలవంతంగా వెనక్కు పంపారు. పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు.. ‘పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసులకు తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వడం లేదు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును పరామర్శించేందుకు ఎంపీలు గోకరాజు గంగరాజు, జి.వి.ఎల్.నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుతో కలిసి గుంటూరు నుంచి తాడేపల్లిగూడెం బయల్దేరగా మార్గం మధ్యలో తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గమ్మ వారధి వద్ద అర్బన్ జిల్లా నార్త్జోన్ సబ్ డివిజన్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎంపీలతో కలిసి జాతీయ రహదారిపై గంట సేపు బైఠాయించారు. కన్నా, జీవీఎల్లు.. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నియంత పాలనతో అరాచకం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు వారిని బలవంతంగా జీపులో ఎక్కించి గుంటూరుకు తరలించారు. అనంతరం కన్నాను హౌస్ అరెస్ట్ చేశారు.కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నగరంపాలెం మీదుగా గుంటూరు మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సైతం బైఠాయించారు. పోలీసుల తీరుపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వల్లే వారిని హోస్ అరెస్ట్ చేశామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ నాయకులు ప్రకటించారు. -
‘ఏపీలో ఎవరికీ రక్షణ లేదు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసలు రాష్టంలో ఎవరికీ రక్షణ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావును హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం బయల్దేరిన తమ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కన్నా.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు. ‘ మా ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అన్యాయంగా రోడ్డుపైనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. రాష్టంలో ప్రతిపక్ష నేతకు సైతం రక్షణ లేదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకి రక్షణ ఎక్కడ ఉంటుంది. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. మాణిక్యాలరావును హౌస్ అరెస్ట్ చేయడంతో కోర్ కమిటీ సమావేశం రద్దు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు జీవీఎల్, కావూరి సాంబశివరావులను కూడా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో కన్నా ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చదవండి: మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రికత్త -
బాబూ! సీబీఐ విచారణకు సిద్దమా? : కన్నా
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో ఐదు ప్రశ్నలు సంధించారు. కన్నా ఇప్పటివరకు చంద్రబాబును వంద ప్రశ్నలు వేశారు. అనంతపురంలో పంట కుంట తవ్వకాల్లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై సీబీఐ విచారణకు సిద్దమా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన చంద్రబాబుపై ప్రశ్నల పరంపర కొనసాగిస్తూ.. ‘‘నెల్లూరు జిల్లాలో సెజ్ల పేరుతో భూకేటాయింపులు జరిపి పరిశ్రమలు స్థాపించకపోవటంతో హైకోర్టు చివాట్లు పెట్టడం వాస్తవం కాదా?. రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయితీలతో రాష్ట్రాన్ని నష్టం కలిగించటం లేదా?. సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందకపోగా నాసిరకం వస్తువులు ఇచ్చి మీ జేబులు నింపుకుంటున్న విషయం నిజం కాదా?. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి మీరు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు. -
అవినీతిని ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా? : కన్నా
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం వారం రోజుల రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ఏపీలో అవినీతి పాలన జరుగుతోందని విమర్శించారు. ఏపీకి ద్రోహాం చేసిన కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవటం హాస్యాస్పదమన్నారు. హాయ్ లాండ్ కాజేసేందుకు చంద్రబాబు ఏకంగా అగ్రిగోల్డ్ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పోలీసు భద్రత లేకుండా టీడీపీ నేతలు ప్రజల్లో తిరగలేరని ఎద్దేవా చేశారు. మరోసారి టీడీపీకి అధికారం కట్టబెడితే ఏపీని చంద్రబాబు అమ్మేస్తారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. -
ఆ గ్రామాల్లో ఎక్కడా తాగునీరు కూడా అందడం లేదు
-
‘చంద్రబాబు ఆ ఆలోచనలు మానుకోవాలి’
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలమీద పెంకులేరుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం టిట్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిట్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోయిందన్నారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని, పచ్చగా ఉండాల్సిన ప్రాంతం స్మశానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ నాధ్ సింగ్కు టిట్లీపై రిపోర్టు అందజేశామన్నారు. హూద్ హుద్ కంటే ఎక్కువగా రైతుకు పెద్ద నష్టం కలిగిందని చెప్పారు. బీజేపీ తరుపున మృతుల కుటుంబాలకు 10 వేల రూపాయల ఆర్ధికసాయం చేస్తామని తెలిపారు. చంద్రబాబుకు రాజకీయాలు కావాలని.. తమకు సమస్యలు కావాలని పేర్కొన్నారు. రాజకీయాలతో ఈ ప్రాంతానికి లాభం జరగదని, కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని చెప్పారు. సీఎం తన ప్రచారం కోసం అధికారులను వెంటేసుకుని తిరుగుతున్నాడని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘తుఫాన్ను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవద్దు. ఈరోజు పది గ్రామాల్లో పర్యటించా... ఆ గ్రామాల్లో ఎక్కడా తాగునీరు కూడా అందడం లేదు. నిజంగా నష్టపోయిన ప్రాంతాలకు ఏమీ అందడం లేదు. సహయక చర్యలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ఇప్పటికైనా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరందించండి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రానికి ఇక్కడి పరిస్థితిని వివరిస్తా. మూడేళ్ల పాటు 300 రోజుల ఉపాధి హామీ పధకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఇంతనష్టం జరిగినా ఇక్కడి పరిస్థితులపై తగినంత ప్రచారం జరగలేదు. గ్రామాల దత్తతకు పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు ముందుకు రావాలి. కేంద్రంతో మాట్లాడి నష్టం అంచనా కోసం బృందాన్ని రప్పిస్తా’’మన్నారు. -
ఐటీ అంటే బాబుకు ఎందుకు దడ?
-
ఐటీ దాడులు అంటే బాబుకు ఎందుకు దడ?
-
బాబుతో పాటు లోకేష్ కూడా రాష్ట్ర ఖజానాను దోచేస్తున్నారు
-
‘రాజధాని పేరుతో బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజధాని పేరుతో బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా రాష్ట్ర ఖజానాను దోచేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు డబ్బులు లేవంటునే విలాసాలు చేస్తూ రూ. 1.30 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. రాజధాని పేరుతో బలవంతంగా 33వేల ఎకరాలు లాక్కొన్న చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. -
అమరావతి విరాళాలు ఏమైయ్యాయి?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకుని ఆ డబ్బును మంత్రి లోకేష్కు చేరవేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీతాల ఆన్లైన్ ప్రక్రియలో రూ.250 కోట్లు అవినీతి జరిగిందని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. లక్షా 30 వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేశారని కన్నా ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ను తిట్టి ఇప్పడు వారితోనే పొత్తు పెంటుకుంటారా అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ది పేరుతో సేకరించిన విరాళాలు ఎక్కడికిపోయాయని.. ఎన్జీవోల ఆహ్మానంతో అమెరికా వెళ్లిన చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.