notes
-
రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది.ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.The total value of Rs 2000 banknotes in circulation, which was Rs 3.56 lakh crore at the close of business on May 19, 2023, when the withdrawal of Rs 2000 banknotes was announced, has declined to Rs 6839 crore at the close of business on November 29, 2024. Thus, 98.08% of the Rs… pic.twitter.com/hfpAFJCMR7— ANI (@ANI) December 3, 2024 -
కరెన్సీ కాదు.. కలర్ జిరాక్స్!
బత్తలపల్లి: టెక్నాలజీ మహిమ..అంతా మాయ. కాస్త ఏమరుపాటుగా ఉంటే ఇట్టే మోసం చేస్తున్నారు. తెలివిమీరిపోయిన కొందరు కేటుగాళ్లు... బత్తలపల్లిలోని చిరు వ్యాపారులకు టోకరా వేశారు. రూ.10 విలువైన వస్తువులు కొని రూ.200, రూ.500 నోట్లు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుని మరీ వెళ్లారు. ఆ నోట్లు తీసుకుని బ్యాంకులకు వెళ్లిన చిరువ్యాపారులు అవి కలర్ జిరాక్సు పేపర్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసాలు ఇటీవల బత్తలపల్లిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కూడలిలో ఆటోవాలాకు ఓ వ్యక్తి ఇలాగే కలర్ జిరాక్స్ నోటు ఇచ్చాడు. అలాగే జొన్నరొట్టెలు విక్రయించే వృద్ధురాలినీ ఓ ఆగంతకుడు ఇలాగే మోసం చేశాడు. కలర్ జిరాక్స్ నోట్ల బాధితుల్లో ఎక్కువగా చిరువ్యాపారులే ఉండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు ఎంతంటే..
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 98.04 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.6,970 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 అక్టోబర్ 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.6,970 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలంటే..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
-
రూ.10.. పరేషాన్..!
నెన్నెల: మార్కెట్లో రూ.10 నోటు కనిపించడం గగనంగా మారింది. దీంతో అటు వ్యాపారులు.. ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ కొనుగోళ్లకు 1, 2, 5, 10 రూపాయల నాణేలు గతంలో చాలా చెలామణిలో ఉండేవి. ధరల పెరుగుదల కారణంగా 1, 2, 5 రూపాయల నాణేలు ఉన్నా 5, 10 రూపాయల నాణేల వినియోగం పెరి గింది. ప్రస్తుతం ఆయా నాణేలతోపాటు రూ.10 నో ట్ల చెలామణి కూడా భారీగా తగ్గింది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10కి మూడు అని చెబుతున్నారు. దీంతో కి రాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, బస్సు, ఆటో చార్జీల్లో రూ.10 కరెన్సీనోటుకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తు తం రూ.10 నోటు మార్కెట్లో అందుబాటులో లేక వ్యాపారులు ఇక్కట్లకు గురవుతున్నారు.ఆన్లైన్ చెల్లింపులుకరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా యి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటుపడ్డారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తు వు కొనుగోలు చేయాలన్నా డిజిటల్ చెల్లింపులు అనే పరిస్థితి నెలకొంది. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో, చిన్నపాటి చెల్లింపులకు ఫోన్పే, గూగుల్పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులకు అనుమతిస్తున్నారు. దీంతో రూ.5, రూ.10 లావాదేవీలకు కూడా వినియోగదా రులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10 నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండడం గమనార్హం. ఎక్కడ ఆగిందో..?రూ.10 నోటు మార్కెట్లో చెలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వినియోగదారులు చిరు వ్యాపారు ల వద్ద వస్తువులు కొనుగోలు చేసినప్పడు రూ.100నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2 చెల్లింపులకు బదులు గా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి ఇచ్చేవారు. కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఇస్తే వినియోగదా రుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండడమే ఈ పరిస్థితికి కారణం. చిన్నమొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నోట్ల కొరత వాస్తవమేరూ.10 నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వు బ్యాంకు నుంచి రావడం లేదు. రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10 నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి. – గోపికృష్ణ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, ఆవుడం -
2.1 గోల్డ్ కొట్టేశారు!
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్రంగ్పుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
భారత్లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?
భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తరువాత రెండు వేలరూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ10000 నోటు.. అతిపెద్ద డినామినేషన్గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు భారదేశంలో అతిపెద్ద కరెన్సీ అంటే రూ. 500 నోటు అనే చెప్పాలి. -
ఇంకా మూలుగుతున్న రూ.రెండువేల నోట్లు
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.7,261 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 ఆగస్టు 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.7,261 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!
ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్ జెడ్ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్ బాట పడుతూ ‘సోషల్’ కల్చర్తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.భారత కార్పొరేట్ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్కు గుర్తింపుగా బ్యాడ్జ్లు, పాయింట్లు, నోట్స్ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్ మూడు షేర్.. ఆరు లైక్లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్ ఇండియా ‘సిటిజన్ ఆఫ్ ‘యూ’నివర్స్’ పేరుతో ‘పాస్పోర్ట్’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసేస్తున్నారు. ఆఫీస్ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్పోర్ట్’పై స్టాంప్ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సోనాలి దేసర్కార్ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఇండియా కూడా అప్లాజ్ పేరుతో అంతర్గత స్టోర్ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్ఫోన్ల నుంచి ఈవెంట్ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.అంతా ‘సోషల్’మయం... ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్బోర్డ్లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్ డిజిటల్ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్ చెప్పారు. ఇక మెర్క్ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్ ఆధారిత అవార్డులు, స్పాట్ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్స్టేట్ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్లో రిడీమ్ చేసుకోవచ్చు.డిజిటల్ బ్యాడ్జ్లకు ప్రాచుర్యంఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్ బ్యాడ్జ్లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్ సమర్థ సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్ కేపబిలిటీ ఎకోసిస్టమ్లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అభిప్రాయపడ్డారు. → ఎప్సిలాన్ ఇండియా కొత్తగా ‘పాస్పోర్ట్’ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. ఆఫీస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ ఉద్యోగులకు ‘స్టాంప్’ పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!→ రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ‘అప్లాజ్’ పేరుతో అంతర్గత స్టోర్ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్ చేసుకొని ఇక్కడ హెడ్ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్ బ్యాడ్జ్లు (బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.→ మెర్క్ ఇండియా, ఆల్స్టేట్ ఇండియా, థ్రైవ్ డిజిటల్లీడర్షిప్ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
రూ. 5 నుంచి రూ. 2000.. ఏ నోటుపై ఏ చిహ్నం?
మరికొద్ది రోజుల్లో మనమంతా పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకోనున్నాం. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన స్వదేశీ ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో ఒకటే సొంత కరెన్సీ. భారతీయ నోట్లపై వివిధ చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఏ నోట్పై ఏ చిత్రం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ఐదు రూపాయలుఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ కావడంతో ఆర్బీఐ ఇటీవలే ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. అయినప్పటికీ గతంలో ముద్రించిన 8 వేల 500 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు మార్కెట్లో చలామణీలో ఉన్నాయి. ఐదు రూపాయల నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ చిత్రం, మరో వైపు పొలం దున్నుతున్న రైతు చిత్రం కనిపిస్తుంది. ఈ ఫోటో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.పది రూపాయలుపది రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫోటో, వెనుకపైపు అశోక చక్రం కనిపిస్తాయి. 10 రూపాయల కొత్త నోట్ల శ్రేణిలో ఒకవైపు సూర్య దేవాలయ చక్రం కనిపిస్తుంది.ఇరవై రూపాయలుఇరవై రూపాయల నోటు విషయానికొస్తే ఈ నోటుపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రం, మరోవైపు అశోక స్థూపం కనిపిస్తుంది. మరికొన్ని నోట్లపై ఎల్లోరా గుహల దృశ్యం కనిపిస్తుంది.యాభై రూపాయలుయాభై రూపాయల నోటులో ఒకవైపు గాంధీజీ చిత్రం, వెనుకవైపు 'స్వచ్ఛ భారత్' లోగో కనిపిస్తుంది.100 రూపాయలుకొత్త రూ.100 నోటుపై ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని, వెనుకవైపు రాణికి వావ్(గుజరాత్లోని చారిత్రక ప్రాంతం) చిత్రాన్ని చూడవచ్చు.200 రూపాయలురూ.200 నోటుపై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక భాగంలో ప్రసిద్ధ సాంచి స్థూపం చిత్రాన్ని చూడవచ్చు.500 రూపాయలుకొత్త రూ.500 నోటు విషయానికొస్తే, ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక వైపు స్వచ్ఛ్ భారత్తో పాటు ఎర్రకోట చిత్రాన్ని చూడవచ్చు.రెండు వేల నోటురెండు వేల రూపాయల నోటును చలామణీని నిలిపివేశారు. ఈ నోట్పై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, మరోవైపు మంగళయాన్ చిత్రాన్ని చూడవచ్చు. -
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
నోట్లరద్దుపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గతేడాది మే 19న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది. ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ ఆర్బీఐ గతేడాది మే 19న రూ.2వేలనోట్ల రద్దు ప్రకటించింనా, సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆ తర్వాత నుంచి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబయి, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు వీలుంది. -
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Plastic Currency: దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు పార్లమెంటులో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అలాగే పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపైనా పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్లు క్లోజ్! కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్ బ్యాంక్ కొన్నేళ్ల కిందటే చేసింది. ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు పది లక్షల నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావించారు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును అటకెక్కించింది. -
మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడు ఆర్బీఐ క్లారిటీ
-
నలభై రెట్లు పెరిగిన అసెంబ్లీ ఎన్నికల వ్యయం
నిర్మల్ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ.40 లక్షలు మాత్రమే విధించబడినది. అయితే ఈ వ్యయ పరిమితి గతంలో ఉన్నదానికంటే క్రమంగా శ్రీఇంతింతై వటుడింతై...శ్రీఅన్న చందంగా పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు గరిష్టంగా రూ.లక్షగా నిర్దేశించబడింది. అప్పటి నుంచి ప్రతీసారి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చు చేయడానికి వ్యయపరిమితి విధించబడింది. అంటే ఎన్నికలు ప్రారంభమైన ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 40 రెట్లు పెరుగుతూ వచ్చింది. నామినేషన్ వేసిన రోజు నుంచే లెక్క షురూ.. 2014 అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకంగా రూ.40 లక్షలకు పెంచింది. లోక్సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు. పార్టీ చేసే ఖర్చు మాత్రం అభ్యర్థి వ్యయంలోకి రాదు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికే పోటీలో ఉన్న అభ్యర్థులంతా కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకున్నారు.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతి దానికీ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎన్నికల సంఘం ధరలు నిర్ణయిస్తుంది. వాటి ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి. పెరుగుతున్న వ్యయపరిమితి.. 1952 సాధారణ ఎన్నికల్లో రూ.లక్షతో ప్రారంభమైన ఎన్నికల వ్యయ పరిమితి 1962 నాటికి రూ.3 లక్షలు 1971 ఎన్నికల నాటికి రూ.4 లక్షలు, 1975 నాటికి రూ.5 లక్షలు పెరుగుతూ వచ్చింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరువైంది. 1991 నాటికి మరో రెండు లక్షలు పెరిగి రూ.12 లక్షలకు చేరుకుంది. 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని విధించారు. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎన్నికల్లో ఈ గరిష్ట వ్యయపరిమితి రూ.40 లక్షలకు చేరుకుంది. వ్యయపరిమితి పెరుగుదల ఇలా.. సంవత్సరం వ్యయపరిమితి (రూ.లక్షలలో) 1952 1 1962 3 1971 4 1975 5 1984 10 1991 12 1999 15 2004 17 2009 26 2014 28 2023 40 -
నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..
దేశంలో పెద్దనోట్లు రద్దయ్యి ఏడేళ్లు అవుతోంది. యూపీఐతోపాటు అనేక ఇతర డిజిటల్ పేమెంట్ పద్దతులూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ... పెరక్కపోవడం మాట అటుంచండి.. ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే రెట్టింపు అయినట్లు తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి చెబుతోంది. ఎందుకిలా? పెద్దనోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీలు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా జరుగుతూండటం వాస్తవమే. ఏటీఎంలలోనూ చాలా పరిమిత స్థాయిలోనే నగదు లభ్యమవుతోంది. సామాన్యులకు క్యాష్ దొరకడమే కష్టమవుతోంది. కానీ.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు మాత్రం పెద్దరోట్ల రద్దుకు ముందుకంటే డబుల్ అయింది. పైగా ఈ ఏడేళ్లలో ఆస్తుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలు 76 శాతం వరకూ ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వే ఒకటి తెలిపింది. దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 78 శాతం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు నగదు లావాదేవీలను తగ్గించగా, భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు నవంబర్ 2016లో రూ.17 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 2023 నాటికి రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. చిన్నచిన్న లావాదేవీలకు డబ్బు వినియోగించడం తక్కువైంది. కానీ ఆస్తుల కొనుగోలు వంటి భారీ లావాదేవీలకు మాత్రం నగదును ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆస్తుల లావాదేవీల్లో నగదు అవసరం లేదని 30 శాతం మంది తెలిపారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలింది. అయితే కొంతమంది మాత్రం వాహనమైనా లేదా గాడ్జెట్ అయినా అధిక విలువ కలిగిన గృహోపకరణాల కొనుగోళ్లు డిజిటల్గా చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ కిరాణా సామగ్రి, ఫుడ్ డెలివరీ, ఇంటి మరమ్మతులు, వ్యక్తిగత ఖర్చులు..వంటివి చెల్లించడానికి నగదును ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిపారు. ఇదీ చదవండి: అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా.. నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నల్లధనాన్ని వెలికితీయడానికి, నగదు చెల్లింపునకు బదులు ప్రజలను డిజిటల్ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేపట్టారు. -
రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!!
భారతదేశంలో రూ. 2000 నోట్ల డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ గురించి ఆర్బీఐ ప్రకటించి ఇప్పటికే మూడు నెలల కంటే కూడా ఎక్కువైంది. ప్రారంభంలో 2023 సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని ప్రకటించగా.. రావాల్సిన నోట్లు ఇంకా ఉండటం వల్ల ఈ గడువుని అక్టోబర్ 07కి పొడిగించారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి? ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికి తిరిగి రావాల్సిన నోట్లు 3.37 శాతం ఉన్నాయి, అంటే సుమారు రూ. 12000 కోట్లు వెనక్కి రావాల్సి ఉంది. కాగా 96 శాతం కంటే ఎక్కువ నోట్లు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి వెసులుబాటు ఉండదు. రూ. 2000 నోట్లు కలిగిన కస్టమర్లు లేదా సంస్థలు నేరుగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వీరు ఒక్క సారికి రూ. 20,000 నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇదీ చదవండి: మెకానిక్ నుంచి వేలకోట్ల సామ్రాజ్యం.. ఎక్కడైతే అడుగుపెట్టలేడని ఎగతాళి చేశారో అక్కడే.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. -
జైపూర్లో నోట్ల వర్షం హల్చల్: వీడియో వైరల్
Money Heist' Attire రాజస్థాన్లోని జైపూర్లో నోట్ల వర్షం కురిసిన ఘటన గందరగోళ పరిస్థితికి దారి తీసింది. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఫలితంగా ట్రాఫిక్ జామ్కు దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన జైపూర్లోనిమాల్వియా నగర్లోని గౌరవ్ టవర్ సమీపంలో చోటు చేసుకుంది. 'మనీ హీస్ట్' సిరీస్ స్ఫూర్తితో మనిషి నోట్ల వర్షం కురిపించాడు. తన ముఖంపై సాల్వడార్ డాలీ మాస్క్తో ఎరుపు రంగు జంప్సూట్లో ఉన్నట్టుండి బిజీగా ఉన్న మార్కెట్లో గాలిలో డబ్బుల వర్షం కురిపించాడు. దీనితో భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు వీలైనన్ని ఎక్కువ నోట్లను అందిపుచ్చుకోవడానికి పరుగులు తీశారు. ఇందులో దాదాపు అన్నీ 20, 10 రూపాయల నోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఎక్కడి వాహనాలు అక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ చర్యకు కారణమైన వ్యక్తిని జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసి, విచారణ కొనసాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు జ్ఞానచంద్ యాదవ్ వెల్లడించారు. 'మనీ హీస్ట్': అలెక్స్ పినా రూపొందించిన స్పానిష్ హీస్ట్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్ -
రూ. 2వేల నోట్లు తీసుకోవద్దు
తమిళనాడు: ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లు తీసుకోవద్దని రాష్ట్ర రవాణా సంస్థ అదేశించింది. నవంబర్ 8, 2016సంవత్సరంలో ప్రధాని మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేరోజు కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. తర్వాత 2019లో రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ పరిస్థితులో రాష్ట్ర రవాణా సంస్థ గురువారం నుంచి ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లను తీసుకోవద్దని ఆ శాఖ మేనేజర్లు, కండక్టర్లకు బుధవారం సమాచారం అందించింది. -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్లో లేఆఫ్లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్కి మారే పని లేకుండా ఈ నోట్స్లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్ను జూమ్ మీటింగ్లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్ను, టూల్స్ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్ఫారమ్లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్లను, లింక్లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
లెక్కల్లో జీరో స్కోర్.. ఇతర పేరెంట్స్కు స్ఫూర్తినిస్తున్న తల్లి సందేశం
పిల్లలు పరీక్షల సమయంలోనూ, వాటి ఫలితాలు వచ్చే సమయంలోనూ తెగ ఆందోళన చెందుతుంటారు. మంచి మార్కులకు రాకపోతే తల్లిదండ్రులతో తన్నులు తప్పవని భావిస్తుంటారు. అలాగే తక్కువ మార్కులు వస్తే టీచర్లు తిడతారని ఆందోళన చెందుతుంటారు. మార్కులు ఎలా ఉన్నా విద్యార్థులు తమ ప్రోగ్రస్ రిపోర్టును తల్లిదండ్రులకు చూపించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొందరు విద్యార్థులు ప్రోగ్రస్ రిపోర్టులో మార్కులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు తమ ప్రోగ్రస్ రిపోర్టును నిజాయితీగా తల్లిదండ్రులకు చూపిస్తారు. తాజాగా ఇదే అంశానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియా ప్లాట్ఫారం X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. దీనిని (@zaibannn) అనే పేరు కలిగిన అకౌంట్లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్గా ‘నా 6వ తరగతి పాత నోట్బుక్ దొరికింది. ఇది చూశాక నాకు స్కూలు రోజుల్లో మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చాయన్న విషయం మరోమారు గుర్తుకు వచ్చింది. అయితే అప్పుడు మా అమ్మ స్కోరు తక్కువ వచ్చిన ప్రతీ టెస్టులో పాజిటివ్ మెసేజ్ రాసేది’ అని రాశారు. ఆ పోస్టులోని వివరాల ప్రకారం ఆమె తల్లి మార్కులు రాసివున్న నోట్ బుక్లో సైన్ చేయడమే కాకుండా మెసేజ్ కూడా రాయడాన్ని మనం గమనించవచ్చు. మొదటి ఫొటోలో ‘ఇలాంటి రిజల్టు రావడానికి ధైర్యం కావాలి’ అని రాశారు. రెండవ ఫొటోలోనూ తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆమె తల్లి అలానే రాసింది. వీటిని కలిపి చూసినప్పుడు తల్లిదండ్రులంతా పిల్లలతో ఇలానే వ్యవహరించాలని, అప్పుడేవారు నిరాశ చెందకుండా, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తారని దీనిని పోస్టు చేసిన యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు found my grade 6 math notebook and love how precious mother was signing every bad test with an encouraging note for me! pic.twitter.com/AEJc3tUQon — zainab (Taylor’s version) (@zaibannn) August 25, 2023 -
‘ధన’ చరిత్ర! భారతీయ కరెన్సీ నోట్ల విశేషాలు తెలుసుకోండి..
భారతీయ కరెన్సీ సంవత్సరాలుగా మారుతూ వేగంగా అభివృద్ధి చెందింది. దేశ స్వాతంత్య్రానికి ముందే కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చినా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం గణతంత్ర రాజ్యంగా మారిన అనంతరం అనేక డినామినేషన్ల నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇప్పటివరకు భారతీయ కరెన్సీ నోట్లపై ఎవరెవరి చిత్రాలు కనిపించాయి? మొదటిసారిగా మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడు కనిపించింది? నోట్లపై ఏయే భాషలు ఎప్పుడు ముద్రించారు? నోట్ల రద్దు, ఉపసంహరణలు ఎప్పుడు జరిగాయి? వంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. వలసరాజ్యాల నుంచి స్వతంత్ర భారతదేశానికి కరెన్సీ నిర్వహణ బదిలీ సాఫీగానే జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. అయితే, 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ అంతకు ముందు నుంచే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూపాయి నోటు కొత్త డిజైన్ని 1949లో తీసుకొచ్చింది. అప్పటికింకా స్వతంత్ర భారతదేశానికి నూతన చిహ్నాలను ఎంపిక చేయాల్సి ఉంది. నోట్లపై మొదట్లో ఉన్న రాజు చిత్రం స్థానంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని భావించారు. ఆ మేరకు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో గాంధీ చిత్రానికి బదులుగా సారనాథ్లోని లయన్ క్యాపిటల్ ఎంపికకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మొదటి నోట్లు ఇవే.. రిపబ్లిక్ ఇండియా మొదటిసారిగా 1950లో రూ. 2, రూ. 5, రూ.10, రూ.100 కరెన్సీ నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల రంగు, డిజైన్లలో స్వల్ప వ్యత్యాసం ఉండేది. అయితే రూ. 10 నోటు వెనుకవైపు ఉన్న షిప్ మోటిఫ్ను మాత్రం అలాగే కొనసాగించారు. 1953లో కొత్త నోట్లపై హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయ హిందీ బహువచనంపై చర్చ జరగడంతో రూపియేగా మార్చారు. 1954లో రూ. 1,000, రూ. 5,000, రూ.10,000 వంటి అధిక విలువ కలిగిన నోట్లు తిరిగి ప్రవేశపెట్టారు. 1946 నాటి నోట్ల రద్దు వంటి కారణాలతోనే 1978లో మరోసారి అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేశారు. రూ. 2, రూ.5 వంటి చిన్న డినామినేషన్ నోట్లను తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో ఆయా నోట్లపై పులి, జింక వంటి జంతువుల చిత్రాలను ముద్రించారు. 1975లో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం చేస్తున్న కృషి తెలియజేసేలా రూ. 100 నోటుపై వ్యవసాయం, తేయాకు ఆకులు తెంపడం వంటి పనులకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. మొదటిసారిగా గాంధీ చిత్రం 1960ల ఆరంభంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1967లో నోట్ల సైజ్లను తగ్గించారు. కరెన్సీ నోట్లపై మొదటిసారిగా గాంధీజీ కనిపించింది ఈ కాలంలోనే. మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 1969లో సేవాగ్రామ్ ఆశ్రమం వద్ద కూర్చున్న గాంధీ చిత్రాన్ని ముద్రించిన స్మారక డిజైన్ సిరీస్ను విడుదల చేశారు. నోట్ల ముద్రణా ఖర్చులు తగ్గించుకునేందుకు 1972లో రూ.20 నోట్లు, రూ. 1975లో రూ.50 నోట్లను ముద్రించింది భారత ప్రభుత్వం. 1980 దశకంలో పూర్తిగా కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ నోట్లపై మూలాంశాలను పూర్తిగా మార్చేశారు. సైన్స్ & టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా రూ. 2 నోటుపై ఆర్యభట్ట చిత్రం, దేశ పురోగతిని చాటేలా రూ. 1 నోటుపై ఆయిల్ రిగ్, రూ. 5 నోటుపై ఫార్మ్ మెకనైజేషన్, రూ. 100 నోటుపై హీరాకుడ్ డ్యామ్ చిత్రాలను ముద్రించారు. అలాగే భారతీయ కళా రూపాలను ప్రదర్శించేలా రూ. 20 నోటుపై కోణార్క్ ఆలయ చక్రం, రూ. 10 నోటుపై నెమలి, షాలిమార్ గార్డెన్ చిత్రాలను తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ సిరీస్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ భారంగా మారడంతో 1987 అక్టోబర్లో మహాత్మా గాంధీ చిత్రంతో రూ. 500 నోటును ప్రవేశపెట్టారు. అశోక పిల్లర్ లయన్ క్యాపిటల్ మాత్రం వాటర్ మార్క్గా కొనసాగింది. రిప్రోగ్రాఫిక్ టెక్నిక్లు అభివృద్ధి చెందడంతో నోట్ల సాంప్రదాయ భద్రతా లక్షణాలు బలహీనమయ్యాయి. దీంతో కొత్త ఫీచర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా 1996లో కొత్త 'మహాత్మా గాంధీ సిరీస్'ను ప్రవేశపెట్టారు. కొత్త వాటర్మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, గుప్త చిత్రం, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఇవే కొత్త ఫీచర్లతో 2000 అక్టోబర్ 9న రూ. 1000 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 నవంబర్ 18న రూ. 500 నోట్ల రంగు మార్చారు. అదనపు భద్రతా ఫీచర్గా మధ్యలో ఉన్న సంఖ్యా విలువలో కలర్-షిఫ్టింగ్ ఇంక్ను చేర్చారు. మెరుగైన భద్రతా ఫీచర్లు 2005లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా రూ.100, అంత కంటే ఎక్కువ డినామినేషన్ నోట్లపై వైడ్ కలర్ షిఫ్టింగ్ మెషిన్ రీడబుల్ మాగ్నెటిక్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చారు. 2005లో మొదటిసారిగా నోట్లపై ముద్రణ సంవత్సరం ప్రవేశపెట్టారు. సీక్వెన్స్ని నిర్వహించడానికి, అదే క్రమ సంఖ్యతో లోపభూయిష్టమైన నోట్లను మళ్లీ ముద్రించకుండా ఉండేందుకు 2006లో నోట్లపై “స్టార్ సిరీస్” ప్రవేశపెట్టారు. రూపాయి చిహ్నం (₹) భారత రూపాయి గుర్తింపు చిహ్నంగా 2011లో రూపాయి చిహ్నాన్ని (₹) ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి 2010లో భారత రూపాయికి ఒక విశిష్ట చిహ్నాన్ని (₹) లాంఛనప్రాయంగా రూపొందించాయి. 2011లో కొత్త రూపాయి చిహ్నాన్ని బ్యాంకు నోట్లు, నాణేలపై ముద్రించడం ప్రారంభించారు. నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్ల భద్రతా ఫీచర్లను కాలానుగుణంగా అప్-గ్రేడేషన్ చేస్తుంటాయి. భారతదేశంలో అటువంటి అప్-గ్రేడేషన్ 2005లో జరిగింది. తర్వాత 2015లో అధిక డినామినేషన్లపై బ్లీడ్ లైన్లు, ఎక్స్ప్లోడింగ్ నంబర్లు వంటి కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. రూ. 50, రూ. 20 నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్ను 2016లో ఆపేశారు. భారత ప్రభుత్వం 2015లో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ నూతన సిరీస్ ద్రవ్య సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం 2016 నవంబర్లో రెండో సారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 500, రూ. 1,000 డినామినేషన్ల మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించింది. ఆ తర్వాత దేశ సాంస్కృతిక వారసత్వం , శాస్త్రీయ విజయాలను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ నూతన సిరీస్లో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఒక్కో డినామినేషన్ నోటును ఒక్కో రంగు, సైజ్ల్లో రూపొందించారు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 2000 నోటును 2017 ఆగస్టు 23న రూ. 200 నోటును కొత్తగా తీసుకొచ్చారు. కాగా రూ.2000 నోటును 2023 మే 19న చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇదీ చదవండి: Independence Day 2023: స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర -
టీడీపీ నేతలకు పోలీసు నోటీసులు
ద్వారకాతిరుమల: గోపాలపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. రెండు గ్రూపుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు, ఎటువంటి ఘటనలకు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకుని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలకు దేవరపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీలోని బలమైన వర్గం మద్దిపాటికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు బహిరంగ సమావేశాలు నిర్వహించింది. దాంతో ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మంగళవారం చంద్రబాబు రాకను పురస్కరించుకుని పార్టీ నేతలు దేవరపల్లి జంక్షన్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో రెండు వర్గాల నేతలు, వారి అనుచరులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని పోలీసు నోటీసులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా రెండు వర్గాలు బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా.. అవాంఛనీయ ఘటనలు జరిగినా తాము చేపట్టే చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ఆర్బీఐ అప్డేట్.. రూ. 2000 నోట్లు ఎన్ని కోట్లు వెనక్కి రావాలంటే?
RBI Update: రెండు వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన 2023 మే 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే చాలా వరకు రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో చేరుతున్నాయి. కాగా దీనికి సంబంధించి ఆర్బీఐ అప్డేట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఇంకా బ్యాంకులకు చేరవలసిన మొత్తం రూ. 0.42 లక్షల కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 30 అని గతంలోనే వెల్లడైంది, కాగా ఈ గడువు మళ్ళీ పెరుగుతుందా? లేదా అనేదాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలుగులోకి రాలేదు. కావున తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గడువు లోపల రెండు వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలి. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్జెడ్ జెనరేషన్కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్కాస్ట్తో పాటు ఆడియో బుక్స్కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
నోట్ల ఉపసంహరణ గడువుపై కేంద్రం కీలక ప్రకటన
భారతదేశంలో రూ. 2వేలు నోట్లను ఉపసంహరించుకోవడానికి ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నట్లు అందరికి తేవలిసిందే. అయితే ఈ సమయంలో కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గడువు పెంపుపై క్లారిటీ.. రూ. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బదులిస్తూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కావున నిర్దిష్ట గడువు లోపల తప్పకుండా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి.. లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇప్పటికే వెల్లడించిన గడువు (సెప్టెంబర్ 30) లోపల ఎవరైనా తమ వద్దే రెండు వేల నోట్లను అలాగే పెట్టుకుని ఉంటే నష్టపోవాల్సింది మీరే అని కూడా స్పష్టం చేసింది. (ఇదీ చదవండి: ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చింది, ఎవరు ప్రారంభించారో తెలిస్తే అవాక్కవుతారు!) తిరిగి వచ్చిన నోట్లు.. ఇప్పటి వరకు సుమారు రూ. 2.72 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ. 2000 నోట్లు ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా మార్చుకోవాలని సూచిస్తోంది. గడువు పెంపులో మార్పు లేదు కావున ప్రజలు తప్పకుండా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలి / ఎక్స్చేంజ్ చేసుకోవాలి. -
కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి..
డెహ్రాడూన్: భారతీయులు, సహా విదేశీయులు కేదార్నాథ్ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఓ మహిళ ఓవరాక్షన్తో ఆలయం గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఘటనపై ఆలయ కమిటీ సీరియస్ అయ్యింది. వివరాల ప్రకారం.. పవిత్ర కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు వెదజల్లడం చర్చనీయాంశంగా మారింది. ఆలయ గర్భగుడిలోని శివలింగానికి పక్కనే నిలబడి ఉన్న మహిళ కేదారేశ్వరుడిపై కరెన్సీ నోట్లు వెదజల్లింది. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు అడ్డుకోలేదు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా.. కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో ఫొటోలో, వీడియోలు తీయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఇలా తాజాగా వీడియో బయటకు రావడం, గర్భగుడిలో ఇలా కరెన్సీ నోట్లు చల్లడంపై బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆలయ కమిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు. అయితే, కరెన్సీ నోట్లు చల్లిన మహిళ ఎవరనేది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. #KedarnathDham : A woman showers currency notes on the Shivling inside the Kedarnath mandir. Look at her way of throwing money, is she in a dance bar or attending a Baraat, such people are disgrace to Sanatan dharm and for showoff can stoop any low. FIR has been filed. pic.twitter.com/VEPUJrq3Lb — Amitabh Chaudhary (@MithilaWaala) June 20, 2023 ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ! -
డోంట్ వర్రీ నేటి నుంచి 2000 వేల నోట్ల మార్పిడి..!
-
గతంలో రద్దైన పెద్ద నోట్లను ఏం చేశారో తెలుసా ?
-
2000 రూపాయల నోట్లను బ్యాంకు లో తీసుకోకపోతే ఇలా చేయండి
-
ఆర్ బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, బ్యాంకుల్లో నోట్లు మార్చుకునే ఛాన్స్
-
‘రూ.2000 నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం’
న్యూఢిల్లీ: నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి తెలిపారు. రూ.2000 నోట్లను రద్దు ద్వారా బ్లాక్ మనీ అరికట్టే క్రమంలో ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
అనుకోని అదృష్టం.. చేపల వేటకు వెళ్తే నోట్ల కట్టలు ప్రత్యక్షం..
పాట్నా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. చేపలు పట్టేందుకు కాలువలో దిగిన వారికి అనూహ్యంగా కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. దీంతో, ఎవరికి దొరికినన్ని నోట్లు వాళ్లు తీసుకెళ్లారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. రోహతక్ జిల్లాలోని ససారంలో ఉన్న సోన్ హైలెవల్ కెనాల్లో చేపల వేట కోసం మొరాదాబాద్ వంతెన వద్దకు శనివారం ఉదయం స్థానికులు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వారికి కరెన్సీ నోట్ల కట్టలున్న మూటలు కనిపించడంతో నమ్మలేకపోకపోయారు. తొలుత అవి నకిలీ నోట్లని అనుకున్నారు. కానీ, అసలైనవేనని తెలియడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో, వెంటనే వాటిని చేజిక్కించుకోడానికి ఎగబడ్డారు. ఈ విషయం బయటకు తెలియడంతో అటుగా వెళ్లే వారందరూ నోట్ల కోసం కాలువలోకి దిగి దొరికినంత తీసుకెళ్లారు. కాగా, వారికి దొరికిన నోట్లలో ఎక్కువగా రూ.10 నోట్లు ఉండగా.. రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు కూడా ఉన్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ నోట్లు కాల్వలోకి ఎలా వచ్చాయి? అని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే.. -
గీతానా మజాకా! రాత్రంతా కచేరి.. రూ.4 కోట్ల నోట్ల వర్షం! వైరల్ వీడియో
సినిమాకు ప్లస్ అయ్యే పాటను ‘కోటి రూపాయల పాట’ అనడం మనకు తెలుసు. మాటలకే పరిమితమైన ఈ విశేషణాన్ని తన పాటలతో నిజం చేసింది గీతా రబరి. ‘కచ్ కోయిల’గా పేరుగాంచిన గీత కచ్ (గుజరాత్) జిల్లాలోని రాపర్ పట్టణంలో ఒక రాత్రి మొత్తం పాటల కచేరి నిర్వహించింది. భజనల నుంచి జానపదాల వరకు ఎన్నో పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆమె పాటలకు మైమరచిపోయిన ప్రేక్షకులు నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. కార్యక్రమం పూర్తయ్యేసరికి అలా వచ్చి చేరిన నోట్ల విలువ నాలుగు కోట్ల పై మాటే. గీతపై నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కచ్ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన గీత అయిదవ తరగతి నుంచే భజనలు, జానపదాలు పాడేది. ‘రోమా సేర్మా’ పాటతో జిల్లావ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) -
రూ.500 నోటుతో పరాటా.. చివరకు ఏమైందంటే?
-
Viral Video: డబ్బుల వర్షం.. కారులో నుంచి నోట్ల కట్లను రోడ్డుపైకి విసిరిన వ్యక్తి
-
జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..
గాంధీనగర్: నటులు, గాయకులు, ఇతర కళాకారులపై కొందరు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. గజరాత్ ప్రముఖ జానపద గాయకుడు కృతిన్ గాధ్వీకి సరిగ్గా ఇలాగే జరిగింది. ఆయన పాటలు పాడుతుండగా.. కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఇష్టాన్ని చాటుకున్నారు. ఆయనపై రూ.10, 20, 50, 100 నోట్లు గుమ్మరించారు. 'వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్' నిర్వహించిన భజన కార్యక్రమంలో ఇలా జరిగింది. మార్చి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వందల మందిని కృతిన్ గాధ్వి తన గాత్రంలో అలరించి ఉత్సాహపరిచారు. అయితే గోవుల సేవ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఈ భజన నిర్వహించారు నిర్వహకులు. దీంతో ఈ డబ్బునంతా ఛారిటీకే ఇస్తున్నట్లు గాధ్వీ తెలిపారు. #WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo — ANI (@ANI) March 12, 2023 విరాళాల సేకరణ కోసం ఇలా భజనలు నిర్వహించడం గుజరాత్లో కొత్తేంకాదు. స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్టు కూడా కొత్త కంటి ఆసుపత్రి కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఫండ్స్ సేకరించింది. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
రూ.2000, 500 నోట్లపై ఏమైనా రాస్తే చెల్లవా? ఇదిగో క్లారిటీ..
రూ.2000, 500, 200, 100 కరెన్సీ నోట్లపై పెన్నుతో లేదా పెన్సిల్తో ఏమైనా రాస్తే అవి చెల్లవని, ఆర్బీఐ మార్గదర్శకాల్లో ఇది ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది ఇదే నిజమే అని నమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 2000, 500 సహా అన్ని కరెన్సీ నోట్లపై ఏమైనా రాసినా అవి అన్ని బ్యాంకుల్లో చెల్లుతాయని చెప్పింది. దీన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది. అయితే పెన్ను లేదా పెన్సిల్తో నోట్లపై రాయడం వల్ల వాటి మన్నిక కాలం తగ్గే అవకాశం ఉందని, అందుకే సాధ్యమైనంత వరకు ఏమీ రాయవద్దని సూచించింది. కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉన్నా వాటిని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా 2020లోనే జారీ చేసింది. అయితే కొంతమంది ఈ విషయంపై అవగాహన లేక కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉంటే అవి చెల్లవేమో అని భయపడి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇవన్నీ అవాస్తవమని ట్విట్టర్లో పోస్టు చేసింది. Does writing anything on the bank note make it invalid❓#PIBFactCheck ✔️ NO, Bank notes with scribbling are not invalid & continue to be legal tender ✔️Under the Clean Note Policy, people are requested not to write on the currency notes as it defaces them & reduces their life pic.twitter.com/V8Lwk9TN8C — PIB Fact Check (@PIBFactCheck) January 8, 2023 ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కరెన్సీ నోట్లపై పెన్ను, పెన్సిల్తో ఏమైనా రాసి ఉన్నా, సిరా మరకలు కన్పించినా అవి చెల్లుతాయి. వినియోగదారులు అవసరమైతే వీటీని తీసుకెళ్లి బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అలాగే నాణేలను కూడా ఇచ్చి కరెన్సీ నోట్లుగా తీసుకోవచ్చు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
దేశంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ...రూ.31.92 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో చెప్పారు. ‘‘జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతోపాటు డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్బీఐ, కేంద్రం బాధ్యత’’ అన్నారు. మరోవైపు, 60 పాత చట్టాల రద్దుకు, ఒక చట్టంలో సవరణకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే భూ సేకరణ (గనులు) చట్టం (1885), టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం(1950) వంటివి రద్దవుతాయి. చదవండి: ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్ -
కేజ్రీవాల్ కరెన్సీ డిమాండ్కు బీజేపీ కౌంటర్
-
గుజరాత్ ఎన్నికల వేళ కేజ్రీవాల్ వింత డిమాండ్
-
ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. అయితే ఇలా ఎందుకు చేయాలో కూడా కేజ్రీవాల్ వివరించారు. లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి దోహదపడుతుందని చెప్పారు. కష్టాలను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయకుడి ఫోటోతో ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఇండోనేసియా లాంటి దేశంలోనూ కరెన్సీపై వినాయకుడి ఫోటోను ముద్రిస్తున్నట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. అక్కడ 20వేల నోటుపై గణేషుడి ఫోటో ఉంటుంది. ఢిల్లీలో వర్చువల్గా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్.. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ గురించి మొదట ప్రస్తావించారు. ఆర్థికవ్యవస్థ బలంగా ఉండాలంటే స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాలని, మౌలికవసతులు మెరుగుపరచాలని సూచించారు. ఒక్కోసారి ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రావని కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టేముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని పేర్కొన్నారు. అందుకే ఆ దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సత్ఫలితాలు వస్తాయని, ఆర్థికవ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి గురువారం లేదా శుక్రవారం లేఖ రాస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే.. -
కోటీ 65 లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ
గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దశావతార గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణనాథుడిని కోటీ అరవై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీలక్ష్మీగణపతికి భక్తులు పూజలు నిర్వహించారు. గుంటూరులోని 21వ డివిజన్ కార్పొరేటర్ కె.గురవయ్య ఆధ్వర్యంలో కేవీపీ కాలనీ 1/10వ లైనులో 16వ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గణనాథుడిని రూ. 44,44,444 విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలకరించారు. – నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) రూ.కోటిన్నర కరెన్సీతో విఘ్నేశ్వరుడికి అభిషేకం ఖిలా వరంగల్: కోటిన్నర రూపాయలతో విఘ్నేశ్వరుడికి శుక్రవారం రాత్రి అభిషేకం నిర్వహించారు వరంగల్ శివనగర్లోని వాసవి కాలనీవాసులు. 108 మంది ఇచ్చిన 1,43,11,116 రూపాయల్లో కొన్నింటిని దండలు చేసి మారేడు చెట్టుకు ఉయ్యాల ఊగుతున్న విఘ్నేశ్వరునికి అలంకరించారు. మిగిలిన నోట్ల కట్టలను గణేషుడి ముందుంచి లక్ష్మీపూజ నిర్వహించారు. (క్లిక్: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు) -
మీకు తెలుసా! భారత కరెన్సీని ఏ పదార్ధంతో తయారు చేస్తారో!
మన దేశానికి చెందిన కరెన్సీని ఏ పదార్ధంతో చేస్తారు? అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది కాగితమనే చెబుతారు. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే! ఆర్బీఐ ఆధ్వర్యంలో తయారయ్యే కరెన్సీని కాటన్(పత్తి)తో పాటు మన్నికగా ఉండేందుకు ఇతర పదార్ధాల్ని వినియోగిస్తుంది. కాటన్తో తయారు చేసే నోట్లలో 75 శాతం కాటన్, 25 శాతం లినెన్ మిక్స్ ఉంటుంది. దీంతో పాటు కాటన్ ఫైబర్లో నార అనే ఫైబర్ ఉంటుంది. నోట్లను తయారుచేసేటప్పుడు అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు పత్తికి జెలటిన్ అనే అంటుకునే ద్రావణాన్ని కలుపుతారు. ఈ ద్రావణం కారణంగా కరెన్సీని ఈజీగా లెక్కించవచ్చు.ఫేక్ కరెన్సీని సులభంగా గుర్తించొచ్చు. పైగా మరింత సెక్యూర్గా ఉంటుంది. కరెన్సీ బలంగా, మృదువుగా ఉండేందుకు దోహదపడుతుంది. రాయల్ డచ్ కస్టర్స్ ప్రకారం..ఐరోపాలో కరెన్సీ నోట్ల కోసం కాంబర్ నాయిల్ను ఉపయోగిస్తారు. కాంబెర్ నోయిల్స్ కాటన్ మిల్లు వ్యర్ధాల నుంచి వెలికి తీసి తయారు చేస్తారు. యూఎస్ సైతం తన కరెన్సీ నోట్లకు నార నిష్పత్తికి సమానమైన పత్తిని ఉపయోగిస్తుంది. బ్యూరో ఆఫ్ ఎన్గ్రావింగ్ అండ్ ప్రింటింగ్ ప్రకారం..అమెరికన్ కరెన్సీ నోట్లలో 75 శాతం పత్తి, 25 శాతం నారతో తయారు చేయబడ్డాయి. -
చార్మినార్లో కరెన్సీ నోట్ల వర్షం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుల్జార్హౌజ్ ఫౌంటెన్ వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్లపై వెదజల్లిన నోట్ల కరెన్సీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న (శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు) మదీనా వైపు నుంచి గుల్జార్హౌజ్ వైపు వచ్చిన నాలుగైదు కార్లలో యువకులు కార్లను రోడ్డుపై నిలిపి ఫౌంటెయిన్ వద్దకు వచ్చి రూ.20 నోట్లను వెదజల్లారు. అక్కడే విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై పడిన కరెన్సీ నోట్లను ఎగబడి అందుకున్నారు. కొద్దిసేపు గుల్జార్హౌజ్ ఫౌంటెయిన్ వద్ద హంగామా సృష్టించి యువకులు అనంతరం కాలికమాన్ వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పెళ్లి బరాత్ ముగించుకొని వస్తుండగా.. దారి మధ్యలో ఈ సంఘటనకు పాల్పడినట్లు చార్మినార్ ఇన్స్పెక్టర్ గురు నాయుడు తెలిపారు. తమకు అందించిన సమాచారం మేరకు ఆయా పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. యువకులు ఎగరవేసిన నోట్లు నకిలీవా...? ఆసలైనా నోట్లా...? అని పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ
ముంబై: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులుగా వేరే ముఖాలను చూడబోతున్నామంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నోట్లపై గాంధీ ముఖం బదులు.. రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. సోమవారం మధ్యాహ్నం ఆర్బీఐ ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ట్విటర్లోనూ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat — ReserveBankOfIndia (@RBI) June 6, 2022 ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్లలో మరిన్ని మేర సెక్యూరిటీ ఫీచర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ సహానికి గాంధీ సహా ఠాగూర్,కలాం ఫొటోలను ఆర్బీఐ పంపిందని, కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్, కలాం ఫొటోల ముద్రణకు సంబంధించి ఆయన నుంచి నివేదిక కోరిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వాటిపై వివరణ ఇచ్చిన యోగేశ్ దయాళ్ ఆ వార్తలను ఖండించారు. -
నిజామాబాద్ జిల్లాలో కాలి బూడిదైన కరెన్సీ కట్టలు
-
500 నోటుపై పుకార్లు.. క్లారిటీ!
Rs 500 notes latest news: కరెన్సీకి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కొత్తేం కాదు. నోట్ల రద్దు, కరోనా టైంలో వాట్సాప్, ఫేస్బుక్లలో ఫేక్ కథనాలెన్నో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా 500రూ. నోటు మీద ఓ ప్రచారం వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా 500 రూపాయల నోటు విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (సెక్యురిటీ థ్రెడ్).. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే గనుక ఆ నోటు ఫేక్ అని, చెల్లదు అని!. ఈమేరకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఓ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో వైరల్ అవుతోంది కూడా. దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు వణికిపోతున్నారు. ఒకవేళ తీసుకున్నా.. ఒకటికి పదిసార్లు తీక్షణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రచారం సాధారణ జనాల్లోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. Factcheck On 500 Currency Note అయితే 500 నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్.. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరిగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, RBI సైతం ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోPress Information Bureau స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ రెండు నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పీఐబి (PIB) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ వీడియో నకిలీదంటూ ఓ పోస్ట్ను ట్విటర్లో ఉంచింది. Press Information Bureau అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. एक वीडियो में यह चेतावनी दी जा रही है कि ₹500 का ऐसा कोई भी नोट नहीं लेना चाहिए, जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास हो।#PIBFactCheck: ▶️यह वीडियो #फ़र्ज़ी है ▶️@RBI के अनुसार दोनों ही नोट वैध हैं विवरण:https://t.co/DuRgmS0AkN pic.twitter.com/SYyxG9MBs6 — PIB Fact Check (@PIBFactCheck) December 7, 2021 -
రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు..
Armored Truck Spills Cash On Highway: కాలిఫోర్నియా: స్థలం: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి. సమయం: శుక్రవారం ఉదయం 9.15 గంటలు. దృశ్యం: రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాటిని జేబుల్లో నింపుకుంటున్న జనం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాన్డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలావరకు ఒక డాలర్, 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. గమనించిన వాహనదారులు వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్ ఈ దృశ్యాలన్నీ ఫోన్లో చిత్రీకరించి, ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా?
మనలో చాలా మందికి ఒక రూపాయి నోటు, ఐదు, పది, 20,50, 100, 200, 500, 2000 రూపాయి నోటు గురుంచి తెలుసు కానీ, మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న "జీరో రూపాయి నోట్" గురుంచి చాలా మందికి తెలియదు. అసలు ఈ నోటుకు ఉన్న శక్తి గురుంచి చాలా మందికి తెలియదు అని చెప్పుకోవాలి. అసలు ఇది ఎక్కడ లభిస్తుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అవినీతి ఇప్పటికీ జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అధికారులను ఎదిరించలేక వారు అడిగిన ఎంతో కొంత మొత్తం ప్రజలు ఇస్తూ వస్తున్నారు. మన దేశంలో లంచం అడగడం, ఇవ్వడం రెండూ కూడా చట్ట ప్రకారం నేరం. అమెరికాలో జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఎన్నారై ఆనంద్ మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఏదైనా చేయాలని అనుకున్నాడు. అవినీతిని తొలిగించడానికి ఏమి చేయాలో ఆలోచించిన విజయ్ ఆనంద్ దేశంలో అవినీతిపై పోరాడాలనే ఏకైక ఉద్దేశ్యంతో 2006లో 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. జీరో రూపాయి నోట్ ప్రధాన ఉద్దేశ్యం ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల(శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, పత్రికా)ను దాటి మెరుగైన సమాజం, అవినీతి రహిత పాలనా వ్యవస్థ కోసం కృషి చేస్తున్న ప్రజల కోసం 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. 2007లో విజయ్ సమాజంలో అవినీతి నిర్మూలించడానికి ది "జీరో రూపాయి నోట్" అనే ఒక కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువచ్చాడు. జీరో రూపాయి నోట్లు సామాన్యులకు సాధికారత కల్పించడానికి ముద్రించబడ్డాయి. అవినీతి చేత ఎక్కువగా బాధపడేవారు, తరచుగా అవినీతి అధికారులచే అణచివేయబడేవారు అధికారంలో ఉన్నవారికి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పడం, తాము కోల్పోవడానికి ఏమీ లేదని అవినీతి అధికారులకు తెలియజేయడం, వారు పోరాటంలో ఒంటరిగా లేరని చెప్పడం ఈ నోట్ ప్రధాన ఉద్దేశ్యం. 30 లక్షల నోట్ల పంపిణీ 5వ పిల్లర్ వాలంటీర్ల సహాయంతో దీని గురుంచి అవగాహన కలిగించడానికి స్థానిక మార్కెట్ ప్రదేశాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో జీరో రూపాయి నోట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. వారు కరపత్రాలతో పాటు నోట్లను పంపిణీ చేస్తూ వివిధ ప్రదేశాలలో సమాచార డెస్క్ లను ఏర్పాటు చేశారు. 5th పిల్లర్ సంస్థ 30 లక్షల నోట్లను 2007 నుంచి 2014 వరకూ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలోని డొమెస్టిక్ విమానాశ్రయంలో ఉపయోగించారు. అక్కడ విజయవంతం కావడంతో తమిళంతో పాటూ… తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. ఒక్క భారత్ లోనే కాదు ఈ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ మెక్సికో, నేపాల్ వంటి దేశాల్లో కూడా జీరో నోట్లను ముద్రించి ఇస్తోంది. 2020లో మన దేశంలో అవినీతి ఏ రేంజ్ లో ఉంది అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం జరిపించగా.. సంవత్సరానికి రూ.490 కోట్ల అవినీతి జరుగుతోందని తేలింది. ఒకవేల మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే జీరో రూపాయి నోట్ చూపించాలని పేర్కొన్నాడు. ఈ నోటు చూపించక కూడా మీతో అతను ప్రతిఘటిస్తే ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్. వీటిని ఇచ్చే ముందు నోట్ వెనుక సూచించిన చిరునామాను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. ఇలా సమాచారం ఇచ్చిన తర్వాత అతని లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్ చెబుతున్నారు. దేశంలోని ప్రతి అణచివేతకు గురైన భారతీయుడు, అవినీతి అధికారికి జీరో రూపాయి నోటు చేరేలా చూడాలని 5వ పిల్లర్ కోరింది. ఇది ఖచ్చితమైన అహింసాత్మక ఆయుధం, అవినీతిపరులను ఆత్మపరిశీలన చేసుకోవడానికి సరైన మార్గం అని ఆనంద్ అన్నారు. ఎవరికైనా ఈ నోట్లు కావాలంటే ఈ సంస్థ వెబ్సైట్ (https://5thpillar.org)లోకి వెళ్లి డౌన్లోడ్చేసుకోవచ్చు. చేయి చేయి కలుపుదాం.. మనదేశంలో అవినీతిని రహిత సమాజాన్ని నిర్మిద్దాం. -
మరోసారి వార్తల్లో నటి వనితా విజయ్కుమార్.. నెట్టింట్లో వైరల్
తమిళ సినిమా: ఎప్పుడూ ఏదో ఒక చర్యతో వార్తల్లో వుండే నటి వనితా విజయ్కుమార్. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకుని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తున్న వనితా విజయ్కుమార్ తన భర్త ఎవరని అడుగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు. ఆమె తన ఇంటిలో కుబేరుడి పూజ నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వనితా విజయకుమార్, ఆమె కూతురు మెడలో డబ్బు నోట్ల మాలలు ధరించి పూజ నిర్వహించారు. ఆ దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
రూ.2 వేల నోట్లు జిరాక్స్ తీసి భార్య ఖాతాలో డిపాజిట్
సాక్షి, చెన్నై : ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హర్యానా ముఠా రాష్ట్రంలో హైటెక్ చేతివాటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రజలు మరిచిపోక ముందే ఓ వ్యక్తి ఏకంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి తన భార్య ఖాతాలోకి బ్యాంక్ ఆఫ్ బొరడా ఏటీఎం డిపాజిట్ మెషన్ ద్వారా డిపాజిట్ చేశాడు. పుదుకోటై జిల్లా అరంతాంగిలోని బ్యాంక్ ఆఫ్ బొరడా డిపాజిట్ మెషిన్ను తనిఖీ చేయగా రూ.2 వేలు జిరాక్స్ నోట్లు డిపాజిట్ చేసి ఉండడం వెలుగు చూసింది. సీసీ పుటేజీ ఆధారంగా అరంతాంగికి చెందిన శరవణన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన భార్య రేవతి ఖాతాలో రూ.2 వేలు జిరాక్స్ నోట్లతో రూ.60 వేలు డిపాజిట్ చేసినట్టు అంగీకరించాడు. అనంతరం మరో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి శరవణన్, రవిచంద్రన్ను అరెస్టు చేశారు. చదవండి: బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా -
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
కాకినాడ రూరల్: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సర్పవరం సీఐ గోవిందరాజు ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలోని గంగరాజునగర్ రోడ్డు నంబరు 7కు చెందిన చలగళ్ళ నాగప్రసాద్ను ఫోన్లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి చీటింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఒక వీడియోలో రూ.2వేల నోట్లతో కూడిన అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించి, ఆ తరువాత ఫోన్ ద్వారా రూ.2వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, రూ.500 నోట్లు తమకు కావాలని నమ్మబలికారు. ఇందుకుగాను రూ.90 లక్షల రూ.5 వందల నోట్లకు రూ.కోటి (2వేల నోట్లు) అందిస్తామని నమ్మించారు. సోమవారం సాయంత్రం నాగమల్లిజంక్షన్ వద్దకు రావాలని కోరడంతో అనుమానం వచ్చిన నాగప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులు విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖపట్నం పెద్దజాలరిపేటకు చెందిన తాటికాయల రాజా రవిశేఖర్, విశాఖపట్నం మల్కాపురానికి చెందిన కామాక నరసింగరావు, విశాఖపట్నానికి చెందిన కోడి కొండబాబు, కాకినాడ కర్ణంగారి జంక్షన్కు చెందిన నిడదవోలు సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
రూ. 2 వేల నోటు : ఆర్బీఐ తాజా నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోటు 2 వేల రూపాయల చలామణి క్రమంగా తగ్గుతోందని కేంద్రం బ్యాంకు నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం వెల్లడించింది. 2018 నుంచి ఈ నోట్ల చలామణి క్రమంగా తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. మరోవైపు 2018 నుంచి గత మూడేళ్లుగా 500, 200 రూపాయల నోట్ల చెలామణి గణనీయంగా పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది. చెలామణిలో ఉన్న 2 వేల విలువైన కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరినాటికి 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి ఆఖరికి 27,398 లక్షల నోట్లకు పడిపోయిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020 మార్చి చివరి నాటికి మొత్తం నోట్ల వాల్యూమ్లో 2.4 శాతం 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయని, ఇది 2019 మార్చి చివరినాటికి 3 శాతం, 2018 మార్చి నాటికి 3.3 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి పడిపోయింది, ఇది 2019 మార్చి చివరి నాటికి 31.2 శాతంగాను, 2018 మార్చి చివరి నాటికి 37.3 శాతంగాను ఉందని వివరించింది. (చదవండి : ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేందుకు మరింత సమయం) కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నోట్ల సరఫరాను ప్రభావితం చేసిందని ఆర్బీఐ తెలిపింది. ప్రధానంగా కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా 2019-20లో నోట్ల సరఫరా కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 23.3 శాతం తగ్గిందని తెలిపింది. నకిలీ నోట్ల విషయానికొస్తే, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,96,695 నోట్లను గుర్తించగా, ఇందులో 2 వేల నోట్ల సంఖ్య17,020. -
రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్బీఐ
సాక్షి, హైదరాబాద్ : ఇకపై రూ. 2 వేల నోట్ల సంఖ్య మరింతగా తగ్గనుంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం... పెద్దనోటు ముద్రణకు ఫుల్స్టాప్ పెట్టింది. నాలుగేళ్ల క్రితం రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్ చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. నాలుగేళ్లు.. 7,071 కోట్ల నోట్లు... బ్లాక్మనీకి ముకుతాడు వేయాలని భావిస్తున్న కేంద్ర సర్కారు.. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణను తగ్గించి రూ. 500 నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016–17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ. 500 నోట్లను ప్రింటింగ్ చేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల నోట్లను ముద్రించగా.. గడచిన ఆర్థిక సంవత్సరం 822.77 కోట్ల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్ను కూడా రిజర్వ్ బ్యాంక్ తక్కువ చేసింది. డిజిటల్ పేమేంట్లకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్బీఐ... వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది. రూ. 200 నోటు ముద్రణకే ఎక్కువ ఖర్చు కరెన్సీ ముద్రణలో రూ. 200 నోటుకే ఎక్కువ ఖర్చవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ నోటుకే అధికంగా వ్యయం చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ. 200 నోటు ప్రింటింగ్కు రూ. 2.15 చొప్పున వెచ్చించగా రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.34 ఖర్చు చేసింది. అలాగే రూ. 50 నోటుకు 82 పైసలు ఖర్చుకాగా, రూ. 20 నోటుకు దీనికంటే మూడు పైసలు అధికంగా (85 పైసలు) ముద్రణకు వెచ్చించింది. అతితక్కువగా రూ. 10 నోటు ప్రింటింగ్కు 75 పైసలు ఖర్చు చేసినట్లు తెలిపింది. గతేడాది రూ. 2 వేల నోటు ముద్రించినందున..ఈ సమాచారాన్ని ఆర్బీఐ ముద్రణ సంస్థ వెల్లడించలేదు. గత నాలుగేళ్లుగా ముద్రించిన నోట్ల సంఖ్య (కోట్లలో) సంవత్సరం రూ. 500 నోటు రూ. 2 వేల నోటు 2016–17 429.22 354.29 2017–18 578.10 11.15 2018–19 628.48 4.66 2019–20 822.77 – ============================== మొత్తం 2,458.57 370.1 -
ఆర్బీఐ ‘మనీ’ యాప్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరికొత్త మొబైల్ యాప్ను లాంచ్ చేసింది. కంటిచూపు సరిగ్గాలేని వారు కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ‘మనీ’ పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్ను తీసుకు వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈయాప్ను ప్రారంభించారు. ఈ యాప్ను ఐవోఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వంటి వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు దీనిని ఉచిత డౌన్లోడ్కు అందుబాటులో ఉంది ఆఫ్లైన్లో కూడా పని చేస్తుంది మనీ యాప్ డౌన్లోడ్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళండి. మణి’ అని టైప్ చేయండి. ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అప్లికేషన్ యాక్స్స్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ను ఓసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో లేకపోయినా అంటే ఆఫ్లైన్లో ఉన్నా కూడా పని చేస్తుంది. . మనీ యాప్ ఎలా ఉపయోగించాలి? వినియోగదారులు మాని అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత, మొబైల్ కెమెరాను ఉపయోగించి కరెన్సీ నోట్ను స్కాన్ చేస్తే, హిందీ, ఆంగ్ల భాషలలో నోట్ విలువ ఆడియో వినిపిస్తుంది. అయితే మని యాప్ నకిలీ నోట్లను గుర్తించలేదని ఆర్బిఐ స్పష్టం చేసింది. కాగా 2016 నవంబర్లో డీమోనిటైజేషన్ తర్వాత ఆర్బీఐ 'మహాత్మా గాంధీ సిరీస్' కింద కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. రంగు, డిజైన్, పరిమాణాలలో గణనీయమైన మార్పులతో కొత్త కరెన్సీ నోట్లను రూ .2000, రూ .500, రూ .200, రూ .100, రూ .50, రూ .20 రూ.10 నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని గుర్తించిడంలో అంధులు అనేక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో తాజాగా ఈ యాప్ను తీసుకొచ్చింది. -
వైఎస్ఆర్ అభిమాని.. నోటేశ్వరుడు
ఒక సామాన్యుడు వార్తల్లోకి వచ్చేదెప్పుడు? అసామాన్యమైన పని చేసినప్పుడు. వినూత్నంగా ఏదైనా చేసిప్పుడు. వైవిధ్యంగా ఆలోచించినప్పుడు. ఆలోచనను ఆచరణలో చూపించినప్పుడు. చెన్నారెడ్డి భాస్కర్రెడ్డి కూడా ఇలాంటి అసామాన్య సామాన్యుడే. చిలకలూరి పేట ఆయనది. వైఎస్ఆర్ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. అందుకే చేతల్లో చూపించారు! ఆయన ఏం చెప్తున్నారో వింటే.. ఆయన ఏం చేశారో, ఏం చేస్తున్నారో తెలుస్తుంది. వైఎస్ఆర్ పుట్టినరోజు (8–7–1949) ‘‘నేను చదువుకున్నది తొమ్మిదో తరగతి. చిలకలూరి పేటలో చిన్న హోటల్ నడిపాను. పిల్లలు పెద్దయ్యారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘ఇన్నాళ్లు కష్టపడినది చాలు ఇక ఆ పని మానుకో’ అని పిల్లలు ఒత్తిడి చేయడంతో హోటల్ వ్యాపారం నుంచి బయటకొచ్చాను. నాలుగు ప్రదేశాలు చూసే అవకాశం అప్పుడు వచ్చింది నాకు. మూడేళ్ల కిందట స్నేహితుడితో బెంగుళూరు వెళ్లాను. అక్కడ ఒక ఎగ్జిబిషన్లో మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం ఒక స్టాల్ ఉంది. అందులో వాజ్పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయి. ఆ తేదీల అంకెలతో కూడిన కరెన్సీ నోట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. అక్కడ మనం కోరిన పది రూపాయల నోటు కావాలంటే మూడు వందలివ్వాలన్నమాట. అలాంటిది చూడడం అదే మొదటి సారి. నాకిష్టమైన వైఎస్ఆర్ జీవితంలో ఘట్టాల తేదీల కరెన్సీ నోట్లను సేకరించాలనిపించింది. కానీ ఆ తేదీలేవి నాకు కచ్చితంగా గుర్తు లేవు. అందుకుని మా పెళ్లి రోజు తేదీ, మనుమరాళ్ల పుట్టిన రోజుల తేదీలు వచ్చే కరెన్సీ నోట్లు కొనుక్కుని, ఎగ్జిబిషన నిర్వహకుల ఫోన్ నంబరు తీసుకుని మా ఊరికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్యమైన తేదీలను సేకరించ మొదలుపెట్టాను. వైఎస్ఆర్ పుట్టిన రోజు, పెళ్లి రోజు, తండ్రయినరోజు (జగన్ గారి పుట్టిన రోజు) తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు, పాదయాత్ర తేదీలు, రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తేదీలు, షష్టిపూర్తి తేదీ, చివరిగా ఆయన మనల్ని వదిలిపోయిన రోజును కూడా లిస్ట్ రాసుకుని ఆ నోట్లను తెప్పించుకున్నాను. పనిలో పనిగా ఆ మహానుబావుణ్ని నేను కలిసిన తేదీ కరెన్సీ నోటు కూడా. నర్సరావు పేటలో 2005, జూన్ 25వ తేదీన ఆయన్ని చూడగలిగాను. ప్రతి తేదీకి ఒక్కరూపాయి, ఐదు, పది, ఇరవై రూపాయల నోట్లను సేకరించాను. వై.ఎస్.జగన్ పుట్టినరోజు (21–12–1972) వైఎస్ఆర్ ఓ అధ్యయనం రాజశేఖరరెడ్డి గారి గురించి వివరాల కోసం ఒక అధ్యయనమే చేశాను. ఎన్ని వివరాలు సేకరించానో, వాటన్నింటినీ తేదీల ఆధారంగా పుస్తకంలో రాసుకున్నాను. వాళ్ల సొంతూరు బలపనూరుకెళ్లి వారి మూడు ఇళ్లనూ చూశాను. సమాధుల దగ్గరకెళ్లి వైఎస్ఆర్ తాతగారు వెంకట రెడ్డి, తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ పుట్టిన తేదీలు, పోయిన తేదీలు, ఇతర బంధువులు చిన కొండారెడ్డి, పురుషోత్తమ రెడ్డి, రత్నమ్మల వివరాలు కూడా సేకరించాను. అన్ని తేదీలను సేకరించడం ఒకెత్తయితే వైఎస్ఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కోసం పడిన ప్రయాస చిన్నది కాదు. నా దగ్గర ఆయన గురించిన పదకొండు పుస్తకాలున్నాయి. అవన్నీ ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తర్వాతి ఘట్టాలకు అక్షర రూపాలే. ఆయన తొలినాళ్ల గురించి తెలిసిన వాళ్లు పెద్దగా లేరు. తెలిసిన వాళ్లు కూడా విషయాలను చెప్పగలుగుతున్నారే తప్ప తేదీలను చెప్పలేకపోతున్నారు. దాంతో రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు ఏయే సంవత్సరాల్లో జరిగాయో తెలుసుకుని, ఆయన ఏ ఏడాది గెలిచిందీ తెలుసుకున్న తర్వాత లైబ్రరీలకెళ్లి పాత పేపర్లు వెతికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తేదీని (1978, మార్చి 15వ తేదీ) పట్టుకున్నాను. ఇంటర్నెట్లో ఏడాది ఉంది కానీ తేదీ లేదు. ఒకసారి దారి పట్టుకున్న తర్వాత ఇక నేను ఎక్కడా ఆగిపోలేదు. వైఎస్ తన గురువు వెంకటప్పయ్య పేరుతో స్కూలు కట్టిన తేదీ, ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రసంగించిన తేదీ, ఆయన ముఖ్యమంత్రిగా ప్రారంభించిన స్కీముల తేదీలతో సహా ప్రతి ఘట్టాన్ని ఫైల్ చేశాను. నా దగ్గరున్న కరెన్సీ నోట్ల ఆల్బమ్ తిరగేస్తే... ఆ మహానుభావుడి జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. వైఎస్ఆర్ పెళ్లిరోజు (9–2–1972) ముగ్గురు నడిచిన నేల నాకు వైఎస్ఆర్ పాదముద్రలే కాదు, తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన పిల్లలన్నా అంతే అభిమానం. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన మీద వైఎస్ఆర్ నడిచిన తేదీ, షర్మిలమ్మ నడిచిన తేదీ, జగన్మోహన్ రెడ్డి నడిచిన తేదీల కరెన్సీ నోట్లున్నాయి నా దగ్గర. అలాగే షర్మిలమ్మ పాదయాత్ర ప్రారంభ తేదీ, ముగింపు తేదీల కరెన్సీ నోట్లున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రనయితే మరీ విపులంగా ఫైల్ చేశాను. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రతి వంద కిలోమీటర్ల మైలు రాయిని చేరిన తేదీలతోపాటు, ప్రతి పాతిక, యాభై... ఇలా ప్రతి రోజునూ రికార్డు చేశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నేళ్లలో ఆయన చేసిన ఓదార్పు యాత్ర, లక్ష్య దీక్ష, జల దీక్ష, జన దీక్ష, హరితయాత్ర, ఫీజు పోరు, రైతు దీక్ష, సాగు పోరు, మహా ధర్నా, కరెంటు పోరు, చేనేత దీక్ష, విద్యుత్ ధర్నా, విభజన వ్యతిరేక దీక్ష, బాబు వైఫల్యాల ధర్నా, సమైక్యాంధ్ర దీక్ష, సిఆర్డిఎ ధర్నా, పొగాకు రైతుల కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్ష, కరువు ధర్నా... ఇలా ప్రతి ఘట్టాన్ని నోట్ చేశాను. ఆ తేదీలు వచ్చేటట్లు కరెన్సీ నోట్లు సేకరించాను. నాకు ఓపిక ఉన్నంత కాలం ఇలా సేకరిస్తూనే ఉంటాను. వీటన్నింటితో వైఎస్ఆర్ వర్ధంతి రోజున ప్రదర్శన పెట్టాలనేది నా కోరిక’’ అంటారు భాస్కర్ రెడ్డి. వై.ఎస్.విజయమ్మ పుట్టినరోజు (19–4–1956) ఒక్క పది రూపాయల నోటుకు మూడు వందలు చొప్పున ఇన్నేసి నోట్లను సేకరించడానికి భాస్కర్ రెడ్డి ఖర్చు చేసిన మొత్తం మూడు లక్షల వరకు ఉంటుంది. ఆయన మాత్రం ‘‘మహానుభావుడి మీద నాకున్న అభిమానానికి వెల కట్టలేను. ఆ ప్రేమ అమూల్యం’’ అంటారు. - ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
అతడిపై నోట్ల వర్షం కురిసింది...
అహ్మదాబాద్ : అభిమానానికి హద్దే ఉండదనేది మరోసారి నిరూపితమైంది. గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదన్ గధ్విపై మరోసారి అభిమానం నోట్ల రూపంలో వెల్లువెత్తింది. గాయకుడి గానామృతానికి మంత్రముగ్ధులైన శ్రోతలు అతడిపై నోట్ల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్లో కీర్తిదన్ పాడిన పాటకు ఫిధా అయిన అభిమానులు అతడిపై లక్షల రూపాయలు వెదజల్లారు. ఇంకేముంది ఆయన ఉన్న వేదికపైకి కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా కీర్తిదన్పై నోట్ల తుఫాను కురిసిన విషయం విదితమే. -
కోఠిలో భారీగా కొత్త రూ.10 నోట్లు పట్టివేత
-
ఏటీఎంలో ఇలాంటి నోటు ఎపుడైనా చూశారా?
టెక్సాస్: ఏటీఎం కేంద్రాలకు సంబంధించి వింతలు, విశేషాలు మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత వద్దంటే కరెన్సీ నోట్ల వర్షం, ఫేక్ నోట్లు, దొంగతనాలు, దోపీడీలు లాంటి ఘటనలు అనేకం నమోదయ్యాయి. దీంతోపాటు డీమానిటైజేషన్ కాలంలో కరెన్సీకోసం భారీ క్యూలు, ఆ క్యూలలో జనం పడిన బాధలు, గాథలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా అమెరికాలోని టెక్సాస్ ఓ ఏటీఎం కేంద్రం దగ్గర ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కార్పస్ క్రిస్టీ లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎం నుంచి ఓ వింత నోటు..కాదు కాదు..వింత అభ్యర్థన దర్శనిమిచ్చింది. కొంతమంది దీన్ని జోక్ అనుకొని కొట్టిపారేశారు. మరికొంతమంది ఈ సంగతిని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఓ ధర్మాత్ముడు స్పందించి పుణ్యం కట్టుకోవడంతో బతుకు జీవుడా అంటూ ఓ ఉద్యోగి బయటపడిన వైనమిది. "దయచేసి నాకు సహాయం చెయ్యండి..నేను లోపల ఇరుక్కున్నాను, నా దగ్గర ఫోన్ లేదు, దయచేసి నా బాస్ కు సమాచారం ఇవ్వండి" ఇదీ సదరు ఏటీఎం రిసీట్ స్లాట్ నుంచి నోటుకు బదులుగా వచ్చిన వెరైటీ నోటు (చిట్టీ) సమాచారం. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ఏటీఏం కేంద్రాన్ని మరమత్తు చేయడానికి వచ్చి ఉద్యోగి అనూహ్యంగా ఏటీఏం సెంటర్ ఉన్న గదిలో బందీ అయిపోయాడు. మరోవైపు అతని ఫోన్ ను కూడా బయట వున్న అతని వాహనంలోనే వదిలేశాడు. దీంతో బయటికి వచ్చే మార్గం లేక..ఎంత అరిచినా ఎవరూ పట్టించుకునే నాధుడు లేక చివరికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. తనను రక్షించమంటూ వేడుకుంటూ, తన యజమాని ఫోన్ నెంబర్ సహా ఏటీఎం పేపర్ మీద రాసి, రిసీట్ స్లాట్ ద్వారా బయటికి వచ్చేలా చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగుల గొట్టి అతడికి విముక్తి కల్పించారు. ఏటీఎం మెషిన్ నుంచి వచ్చిన వాయిస్ వినిపించేంతవరకు తాము ఖచ్చితంగా నమ్మలేకపోయామని కార్పస్ క్రిస్టి పోలీస్ సీనియర్ ఆఫీసర్ రిచర్డ్ ఓల్డన్ స్థానిక మీడియాకు చెప్పారు. ఏటీఎం మెషీన్ లో మనిషి చిక్కుకోవడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని... ఇట్ వజ్ జస్ట్ క్రేజీ అంటూ కమెంట్ చేశారు. -
రద్దయిన పాత నోట్లతో పట్టుబడ్డ ముఠా
-
కొత్త నోట్లకూ నకిలీ మకిలి
అమలాపురంలో తండ్రీ కొడుకుల నకిలీలలు రూ.500, రూ.2000 నోట్ల కలర్ జిరాక్సుతో మోసాలు నిందితుల అరెస్ట్ .. 84 నకిలీ నోట్లు, కలర్ జిరాక్సు మిషన్ స్వాధీనం అమలాపురం టౌన్ : నల్ల ధనాన్ని...నకిలీ నోట్ల సమస్యను పరిష్కరిస్తాంటూ పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ జిల్లాలో పల చోట్ల రూ.500, రూ.2000 నోట్లకు నకిలీ మకిలి తప్పడ లేదు. నకిలీలతో ప్రజలు మోసపోవడం జిల్లాలో మొదలైంది. అమలాపురంలో తండ్రీ కొడుకులు నకిలీ నోట్ల తయారీ, మార్పిడి చేస్తూ ఇప్పటికే పట్టణంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో మోసాలకు ఒడిగట్టారు. రూ.500, రూ.2000 అసలు నోట్లను కలర్ జిరాక్సు మిషన్ ద్వారా అచ్చు గుద్దినట్టుగా జిరాక్సు నోట్లు సృష్టించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. అమలాపురంలో ఇటీవల కాలంలో నకిలీ నోట్ల బాధితులు లబోదిబో అనడం,..తీగ లాగితే డొంక కదిలినట్టు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేస్తే పట్టణంలో తండ్రీ, కొడుకు ఈ నకిలీ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. అల్లవరం మండలం తుమ్మలపల్లికి చెందిన వడ్డి మట్టయ్య అతని కొడుకు వడ్డి రాజేష్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలటంతో వారిద్దరినీ పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి రూ.500 నోట్ల జిరాక్సులు 33, రూ.2వేల నోట్ల జిరాక్సులు 51, కలర్ జిరాక్సు మిషన్, అందుకు ఉపయోగించే కెమికల్ కలర్స్ బాటిల్స్ (క్యాట్రిడ్జ్లు) స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆదివారం ఉదయం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. బీకాం కంప్యూటర్స్ చదివి.. వడ్డి మట్టయ్య అమలాపురంలో ఓ ఆస్పత్రిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. కొడుకు రాజేష్ అమలాపురంలోని ఓ కళాశాలలో ఇటీవలే బీకాం కంప్యూటర్స్ చదివాడు. వీరి కుటుంబం కొంత కాలంగా స్థానిక సూర్యనగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రాజేష్ తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ నోట్ల తయారీ, మార్పిడికి పథకం పన్నాడు. అందులో తన తండ్రిని కూడా భాగస్వామిని చేశాడు. ఇంట్లో ఆధునిక కలర్ జిరాక్సు ద్వారా కొత్త రూ.500, రూ.2000 అసల నోట్లను జిరాక్సు తీస్తున్నాడు. వాటిని తన తండ్రికి ఇచ్చి బిజీగా ఉండే వ్యాపార కూడళ్లు, అమ్మకాలు జోరుగా ఉండే పెట్రోలు బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు తదితర వ్యాపార దుకాణాలు , సంస్థల్లో మార్చుతున్నారు. నెల రోజుల కిందట పట్టణంలోని ఓ చికెన్ సెంటర్లో నకిలీ రూ.500 నోటు ఇచ్చి మాంసాన్ని విక్రయించాడు. ఆ సెంటర్ యాజమానికి ఆ నోటు తర్వాత నకిలీదని లబోదిబో అన్నాడు. ఆ బాధతుని ఆవేదనను అప్పట్లో ’సాక్షి’ పత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. ఇదిలా ఉండగా ఈ నెల 23 ఉదయం 11.30 గంటల సమయంలో స్థానిక ఎర్రవంతెన వద్ద పెయ్యల అర్జునరావు షాపింగ్ కాంప్లెక్సు ఎదురుగా రోడ్డు పక్కన ద్రాక్ష పండ్లు విక్రయించే దార మాధవరావు వద్ద వడ్డి మట్టయ్య అర కిలో ద్రాక్ష పండ్లు కొన్నాడు. రూ.500 నకిలీ నోటు ఇవ్వగా దుకాణదారుడు రూ.40 తీసుకుని మిగిలిన రూ.460 మట్టయ్యకు తిరిగి ఇచ్చాడు. తర్వాత మాధవరావుకు అది నకిలీ నోటు అని తెలియడంతో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాడు చేశాడు. తనకు నకిలీ నోటు ఇచ్చిన వ్యక్తి ఆనవాళ్లు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. మట్టయ్య, అతడి కుమారుడు రాజేష్ పట్టణంలో ఇటీవల కాలంలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తునట్టు తెలిలింది. తండ్రీ కొడుకులు ఆదివారం ఉదయం స్థానిక ఈదరపల్లి వంతెన వద్ద నకిలీ నోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా సీఐ శ్రీనివాస్, క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. కొత్త నోట్లు అమల్లోకి వచ్చాక ఇన్ని నకిలీ నోట్లు వెలుగు చూడడ... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయటం జిల్లాలో ఇదే ప్రథమం. -
నోట్ల చలామణి తగ్గిపోయింది!
పెద్ద నోట్ల రద్దు అనంతరం కరెన్సీ వాడకంపై పెడుతున్న ఆంక్షలు, డిజిటల్ లావాదేవీల వాడకం నోట్ల చలామణిని తగ్గించేశాయి. నోట్ల రద్దు అనంతరం కేవలం ఈ క్వార్టర్లో రూ.11.73 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని నేడు ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.16.41 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 21014 మార్చి 31 న రూ.12.82 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని, అవి 2015 మార్చి 31కి వచ్చేసరికి రూ.14.28కోట్లకు పెరిగాయని చెప్పారు. 2016 మార్చిలో మరింత పెరిగి రూ.16.41 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నోట్ల చలామణి తగ్గినట్టు తెలిసింది. నవంబర్ 8న ప్రధాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 86 శాతం కరెన్సీ నోట్ల చలామణిలోంచి వెనక్కి వెళ్లాయి. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చింది. 2017 ఫిబ్రవరి వరకు రూ.1.9 బిలియన్ల రూ.5 కాయిన్లు, రూ.1.03 బిలియన్ల రూ.10 కాయిన్లు చలామణిలో ఉన్నట్టు మేఘ్వాల్ చెప్పారు. అంతేకాక 2.6 బిలియన్ల రూ.10 నోట్లు, 3.6 బిలియన్ల రూ.20 నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్నట్టు వెల్లడించారు. -
పాతనోట్లు.. కొత్తపాట్లు
సత్యదేవుని హుండీల్లో రూ.3.60 లక్షల పాతనోట్లు డిపాజిట్ చేసుకోని బ్యాంకులు ఆర్బీఐకి లేఖ రాసిన దేవస్థానం అధికారులు అన్నవరం : జనవరి, ఫిబ్రవరి నెలల్లో సత్యదేవుని హుండీలలో భక్తులు సమర్పించిన రూ.3.60 లక్షలు విలువైన రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు భవితవ్యం ఏమిటి?. వీటిని రిజర్వ్బ్యాంక్ తీసుకుని కొత్తనోట్లు ఇస్తుందా?. మార్చి తర్వాత కూడా హుండీల్లో పాతనోట్లు వస్తే ఏమిచేయాలి అనే విషయాలపై అన్నవరం దేవస్థానం వర్గాలు సతమతమవుతున్నాయి. బ్యాంకులు తీసుకోకపోవడంతో రూ.3.60 లక్షల విలువైన పాతనోట్లను దేవస్థానం ఖజానాలో భద్రపరిచారు. గతేడాది నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి పాతనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరు వరకు పాతనోట్లను వాణిజ్యబ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆ నోట్లను తీసుకుంటుదని ప్రకటించారు. పాతనోట్ల రద్దు తర్వాత నవంబర్లో రెండుసార్లు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో ఒక్కోసారి సత్యదేవుని హుండీలను తెరిచారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చిన సుమారు రూ.25 లక్షల విలువైన పాతనోట్లను బ్యాంకులు డిపాజిట్ చేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన నోట్లను మాత్రం తీసుకోలేదు. బ్యాంకుల నిరాకరణ జనవరిలో స్వామివారి హుండీలను తెరవగా రూ.1.70 లక్షలు విలువైన పాత రూ.500, రూ.వెయ్యినోట్లు వచ్చాయి. ఫిబ్రవరిలో రూ.1.90 లక్షలు విలువైన పాతనోట్లు వచ్చాయి. ఈ రెండు నెలల హుండీ ఆదాయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకుల్లో జమచేశారు. వాటిలో పాతనోట్లను ఆ బ్యాంకులు తీసుకోకపోవడంతో దేవస్థానం ఖజానాలోనే భద్రపరిచారు. పాతనోట్లను తీసుకుని కొత్తవి మంజూరు చేయాలని అన్నవరం దేవస్థానం అధికారులు రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచ్ అధికారులకు గత నెలలో లేఖ రాశారు. దీనిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీల్లో వచ్చిన పాతనోట్లను తీసుకోవడానికి ఆర్బీఐ నిరాకరించినట్టు తెలియడంతో దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నోట్ల కష్టాలు..షరా మామూలే!
– గ్రామీణ ప్రాంతాల్లో మెరుగవ్వని పరిస్థితి – ఇప్పటికీ నో క్యాష్ బోర్డులు పెడుతున్న బ్యాంకులు – పనిచేయని ఏటీఎంలే అధికం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఇబ్బందులు తొలగడం లేదు. ఇప్పటికీ బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. పనిచేయని ఏటీఎంలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రజల సంఖ్యకు సరిపడ బ్యాంకులు, ఏటీఎంలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తరువాత జిల్లాలోని 445 బ్యాంకుల్లో రూ.5 ,500 కోట్ల రూపాయల పాతనోట్లు జమ అయ్యాయి. అయితే జిల్లాకు వచ్చిన కొత్త నోట్ల విలువ మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే. అందులో రూ.500 నోట్ల రూ. 500కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నగదు దొరక్క ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. పది రోజుల నుంచి పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చినట్లు కనిపించినా..పూర్తిస్థాయిలో మెరుగు పడలేదు. నగదు పరిమితిని పెంచాలి.. ప్రస్తుతం ఒక్కో ఖాతాదారుడికి బ్యాంకులు వారానికి రూ.24 వేలు ఇస్తున్నాయి. గతంలో బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి రూ.4 వేలే ఇచ్చేవారు. దానిని బ్యాంకుకు వచ్చే డబ్బును బట్టి పది వేల వరకు ఇస్తున్నారు. అయితే వారానికి మాత్రం రూ.24 వేల ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు పరిమితిని రూ.24 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఏటీఎంలలో రూ.4500 రావడం లేదు... జనవరి ఒకటో తేదీ నుంచి ఏటీఎంలలో రూ.4500 వచ్చే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. గతంలో రూ.2 వేలు మాత్రమే వచ్చేవి. దీంతో డబ్బుల కో సం ప్రజలు ప్రతినీత్యం ఏటీఎంల ఎదుట క్యూలలో నిలబడేవారు. ఈ పరిస్థితిని అధికమించడానికి ఒక్కో డ్రాలో రూ.4500 తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా అది ఎక్కడా అమలు కావడం లేదు. రూ.100, 500 నోట్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో నాలుగు వేలే వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తం... జిల్లాలో 32 బ్యాంకులకు సంబంధించి 445 బ్రాంచులు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 485 ఏటీఎంలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నోట్ల కష్టాలు తప్పడంలేదు. ప్రజల సంఖ్యకు అనుగుణంగా బ్యాంకులు, ఏటీఎంలు లేకపోవడంతో నేటికి వారికి అవసరమైన నగదు అందుబాటులోకి రావడం లేదు. ఎక్కువగా రైతాంగం జీవనం సాగిస్తుండడంతో పంటల సాగుకు ఇబ్బందిగా ఉంది. మరోవైపు రైతుల అమ్మిన సరుకుకు కూడా మార్కెట్లలో నగదు ఇవ్వడంలేదు. దీంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా ఉంది. చిల్లర లేక చిరు వ్యాపారుల అవస్థలు.. ప్రస్తుతం రూ.2 వేల నోట్లు ఎక్కువ చలామణిలో ఉన్నాయి. దీంతో చిల్లర సమస్య నెలకొంది. చిల్లర లేక చిరు వ్యాపారులు.. వ్యాపారాన్ని వదులుకుంటున్నారు. చిల్లర సమస్యను పరిష్కరించడానికి రూ.500 నోట్లను ఎక్కువగా చలామణిలోకి తేవాలని వ్యాపారులు కోరుతున్నారు. -
సింగర్పై నోట్ల వర్షం కురిపించారు
-
నగదు కష్టాలు గట్టెక్కించి మోదీ హీరో అవుతారా ?
-
నోట్ల రద్దుతో ఆక్వా రంగం విలవిల
-
పెద్ద నోట్ల రద్దుపై మళ్లీ మాట మార్చిన బాబు
-
ముంచుకొస్తున్న ముప్పు
- రుణాల మంజూరులో చేతులెత్తేసిన బ్యాంకులు - 2016–17 రుణ ప్రణాళిక కొండెక్కినట్లే - తీవ్ర నగదు కొరతతో రూ.7800 కోట్ల రుణాలు మంజూరు సాధ్యమేనా! కర్నూలు(అగ్రికల్చర్): అవసరాల్లో ఆదుకునే బ్యాంకులు నిర్వీర్యమవుతున్నాయి. భరోసా ఇస్తాయనే నమ్మకం పోతోంది.పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకుల్లో తీవ్ర నగదు కొరతతో మొత్తం బ్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. లావాదేవీలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రెండు రోజులు 40 రోజులుగా ఇంతే. కనుచూపు మేరలో నగదు కష్టాలు తీరే మార్గం కనిపించడం లేదు. బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో 2016–17 రుణ ప్రణాళిక కొండెక్కినట్టేనని అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది రూ. 7800 కోట్లుతో రుణ ప్రణాళికను తయారు చేసినా ఆచరణలో ఎలాంటి పురోగతి లేదు. కీలకమైన తరుణంలో నోట్ల రద్దు రూపంలో ఉపద్రవం వచ్చి పడటంతో అన్ని వర్గాలపై ఈ ప్రభావం పడింది. రైతులకు, ఇతర అన్ని వర్గాల వారికి రుణాల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బ్యాంకుల్లో నిరంతరం నో క్యాష్ బోర్డులు పెడుతుండటాన్ని చూస్తే రైతులకు, వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాలు ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వానికి భారీగా తగ్గిన ఆదాయం: ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా పడిపోతోంది. వెరసి రూ.500, 1000 నోట్ల రద్దతో ఏర్పడిన కరెన్సీ కొరతతో జిల్లా అభివృద్ధి తిరోగమనంలోకి ఽపయనిస్తోంది. నగదు రహిత లావాదేవీలకు స్పందన లేకుండా లేదు. జిల్లా అధికారులే నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆచరణలో ప్రజల్లోకి వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తవుతోంది. దాదాపు 25 రోజులుగా ఆన్లైన్ లావాదేవీలు అంటున్నా ఇప్పటి వరకు ఆ దిశగా జరుగుతున్న లావాదేవీలు కేవలం 10 శాతంలోపే ఉండటం గమానార్హం. రుణం.. అందనంత దూరం: బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో రుణాల పంపిణీ పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి బ్యాంకులు వివిధ రకాల రుణాలు ఇస్తాయి. ప్రధానంగా రైతులకు పెట్టుబడుల నిమిత్తం పంట రుణాలు ఇస్తాయి. 2016–17లో వ్యవసాయ రంగానికి రూ.5129.61 కోట్లు పంపిణీ చేయాలన్నది లక్ష్యం. రైతులకు పంట రుణాలు, ప్రోడ్యూస్ లోన్లు, టర్మ్ లోన్లు, వ్యవసాయ యాంత్రీకరణ, గోదాముల నిర్మాణం, భూముల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటికి రుణాలు ఇచ్చే విధంగా జిల్లా రుణ ప్రణాళికను రూపొందించారు. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో ఖర్చులకు అవసరమైన పైసలు కూడా లభ్యం కావడం లేదు. దాచుకున్న డబ్బుల్లో నెలకు రూ.10వేలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ రంగానికి రుణ ప్రణాళిక మేరకు రూ.5129.61 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు కష్టమే: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువత స్వయం ఉపాధిలో రాణించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూనిట్లు గ్రౌండింగ్ చేయాలంటే బ్యాంకు రుణం అత్యవసరం. అంతేగాక చేనేతకారులు, మత్స్యకారులు, పట్టువరిశ్రమ, పశుసంవర్థక శాఖ తదితర అన్ని పథకాలకు బ్యాంకు రుణాలు అవసరమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలలు ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే బ్యాంకులే ఆధారం. సూక్ష్మ, చిన్న, మద్య, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా బ్యాంకు రుణాల అవసరం ఉంది. 2016–17లో వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ధ్యీ) పరిశ్రమలు ఏర్పాటు, ప్రాధాన్యత రంగం తదితర వాటికి రూ. 7800 కోట్లు రుణాలుగా ఇవ్వాలనే రుణ ప్రణాళిక లక్ష్యం. బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు పెడుతుండటంతో రుణ ప్రణాళిక ఈ సారి కొండెక్కినట్లేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ప్రతి ఒక్కరి ఆర్థిక ఎదుగుదల బ్యాంకులతో ముడిపడి ఉంది. 40 రోజులుగా బ్యాంకులు నగదు లేక మనుగడ కోల్పోయో ప్రమాదం ఏర్పడింది. రుణాల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా పథకాల కింద న్రభుత్వం విడుదల చేసిన సబ్సిడీ పూర్తిగా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. 400 బ్రాంచ్ల్లో డబ్బుల్లేవ్.... జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా 445 బ్రాంచీలు ఉన్నాయి. గతంలో ఎపుడూ లేని విధంగా బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో 400 బ్రాంచ్ల్లో నగదు నిల్వలు జీరో ఉన్నయంటే ఆ బ్యాంకుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారయిందో ఊహించవచ్చు. 96 శాతం ఏటీఎంలు దాదాపు 40 రోజులుగా మూతపడ్డాయి. -
‘రద్దు’ తర్వాత హైదరాబాద్లోనే భారీగా బంగారం కొనుగోళ్లు
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉంగుటూరు: నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత దేశంలోని మిగతా ప్రాంతాలకంటే హైదరాబాద్లోనే ఎక్కువ మంది బంగారం కొన్నారని, వారి వివరాలన్నీ తమ దగ్గరున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో విలేకరుస మావేశంలో మాట్లాడిన ఆయన.. కరెన్సీ రద్దును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. కేంద్రప్రభుత్వం అవినీతిపై పోరాడుతున్నదని, జనవరి నాటికి పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. దేశంలో పెద్ద ఎత్తున నల్లధనం పేరుకుపోయిందని, పొరుగు దేశంలో దొంగనోట్లు ముద్రించి టెర్రరిస్ట్, డ్రగ్స్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని వెంకయ్య చెప్పారు. కొంతమంది బ్యాంకు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని మార్చుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చకొడుతున్నాయని విమర్శించారు. వ్యక్తిగత ఖాతాల్లో రూ.2.50 లక్షల వరకు డబ్బుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని, అంతకు మించితేనే లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు. కాగా, జనవరి 8న ముప్పవరపు ఫౌండేషన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. -
స్వైపింగ్.. కమీషన్
* మినీ ఏటీఎంలుగా ‘స్వైపింగ్’ * నరసరావుపేటలో దందా నరసరావుపేట ఈస్ట్ : పెద్దనోట్ల రద్దు కష్టాలు రోజురోజుకో మలుపులు తిరుగుతున్నాయి. పట్టణంలో పెట్రోల్ బంక్లు, షాపింగ్ మాల్స్ మినీ ఏటీఎంలుగా మారాయి. రూ. 2 వేల నోట్లకు చిల్లర లేక అల్లాడుతున్న ప్రజలకు స్వైపింగ్ మిషన్లే దిక్కయ్యాయి. రూ. 2 వేలకు స్వైప్ చేయించుకొని కొద్దిపాటి కమిషన్ తీసుకొని మిగతా నగదు ఇస్తున్నారని సమాచారం. ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో గంటల కొద్దీ నిలుచునే బదులు కమిషన్ పోయినా అవస్థలు తప్పుతాయని ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార సంస్థల అధినేతలు, గుమాస్తాలు ఏదో ఒకటి కొన్నట్లు బిల్లు సృష్టించి, ఆ మొత్తాన్ని అవసరమైన వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థల స్థాయిని బట్టి రూ.100 నుంచి రూ.10 వేల వరకు నోట్లు మార్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తుల అవసరాలను బట్టి 2 నుంచి 10 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. -
నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు
వెలుగోడు: నోట్ల మార్పిడి ఘటనలో పరారీలో ఉన్న నిందితులు బుధవారం వెలుగోడు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..ఈ నెల 9న నోట్లు మార్పిడి కోసం ప్రయత్నిస్తూ ఆత్మకూరు పోలీసులకు ఇద్దరు సభ్యులు పట్టుబడ్డారు. వీరిలో సంజీవగౌడ్, రవితేజారెడ్డి ఉన్నారు. మిగిలిన ప్రసాద్, సుధాకర్ పరారీలో ఉండగా, వారు బుధవారం పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్ఐ వివరించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డి, ఆంజనేయులును అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
దిశ మారిన డిమానిటైజేషన్
-
పోలీసుల అదుపులో నోట్ల మార్పిడి ముఠా
- సినీఫక్కీలో చేజింగ్ - కొనసాగుతున్న విచారణ బండిఆత్మకూరు: నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సినీ ఫక్కీలో శుక్రవారం రాత్రి చేజింగ్ చేయాల్సి వచ్చింది. బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు వద్ద ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకోగా, వెలుగోడు వద్ద ఆర్టీసీ వాహనంలో వెళుతున్న మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని మొత్తం ఐదుగురుని విచారిస్తున్నారు. అంతేగాక తప్పించుకున్న మరో ముగ్గురు కోసం విచారిస్తున్నారు. అయితే ఈ చేజింగ్లో డబ్బు లెక్కపెట్టె మిషన్ వారి వద్ద లభించినట్లు, నగదు లభించలేదని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమాచార మిలా.. ఆత్మకూరులో శుక్రవారం రాత్రి నోట్ల మార్పిడి ముఠా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు వారిని వెంబడించగా వారు టయోటా వాహనంలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు పోలీసుల నుంచి వెలుగోడు, బండిఆత్మకూరు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. చేజింగ్ ఇలా.. వెలుగోడు పోలీసులు అప్రమత్తమై ట్రాక్టర్ను రోడ్డుకు అడ్డంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెప్పపాట కాలంలో టయోటా వాహనం ఆగకుండా వెళ్లింది. ఆ తర్వాత బండిఆత్మకూరు పోలీసులు సైతం వచ్చి బస్టాండ్ వద్ద వేచి చూశారు. దీంతో టయోటా వాహనంలో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై తమ వాహనాన్ని ఓంకార క్షేత్రం వైపు తిప్పారు. ఆ వాహనం అటువైపు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు బోలెరో వాహనంతో వెంబడించారు. ఈ క్రమంలో టయోటా వాహనం సింగవరం, సోమయాజులపల్లె గ్రామం దాటి తెలుగుగంగ కాల్వ ప్రధాన కట్టపై నుంచి మణికంఠాపురం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. టయోటా వాహనం వెళుతున్న సమాచారాన్ని ఎస్ఐ విష్ణునారాయణకు చేరవేశారు. దీంతో ఈర్నపాడు వద్దకు ఎస్ఐ చేరుకొని ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా ఉంచి కాపు కాశారు. ఈ క్రమంలో కొద్ది సేపటికి టయోటా వాహనం వచ్చింది. వాహనంలో ఉన్న వ్యక్తులు దిగి పరిగెత్తే ప్రయత్నం చేశారు. వెంటనే ఎస్ఐ ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. బనగానపల్లె వ్యక్తులు.. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు బనగానపల్లెలోని ఒక ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరో వ్యక్తి కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ క్రమంలో టయోటా వాహనంలో నుంచి దిగి తప్పించుకున్న ముగ్గురు వ్యక్తులు ఈర్నపాడు గ్రామంలోని ఒక వ్యక్తి బాత్రూంలో తల దాచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెల్లవారుజామున ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి వెళ్లినట్లు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు పొలాల్లో డబ్బు లెక్క పెట్టే యంత్రం లభించినట్లు తెలుస్తోంది. ఎటువంటి నగదు దొరకలేదని సమాచారం. ఆర్టీసీ బస్సులో మరో ముగ్గురు వ్యక్తులు.. వెలుగోడు పోలీసులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదే సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం టయోటా వాహనంలో వెళ్తున్న వీరికి ఆర్టీసీ బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్న అనుమానితులకు గల సంబంధాల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు టయోటా వాహనం దిగి ఆత్మకూరు సమీపంలో ఉన్న నల్లకాల్వ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, తాలూకా సీఐ మురళీధర్రెడ్డి శనివారం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారమంతా ఆత్మకూరులోని ఒక హోటల్లో నోట్ల మార్పి భారీ ఎత్తున జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
నోట్ల రద్దు వారికి ముందే తెలుసా ?
-
త్యాగాలు ప్రజలకేనా ?
-
ఆర్టీసీలో ఇక పాత నోట్లు చెల్లవు
-
పరిధి దాటి పట్టుబడి..
పెద్దనోట్ల పట్టివేత కేసులో ఆర్ ఎస్సై చేతివాటం ఎస్సై పోస్టుకు ఎసరు తెచ్చుకున్న కానిస్టేబుల్ కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వేగేటు సమీపంలో పెద్దనోట్ల అక్రమ రవాణా పట్టివేత వ్యవహారంపై తవ్వేకొద్దీ పలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నగదు పట్టివేత, పోలీస్ స్టేషన్ అప్పగింత విషయంలో ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీస్ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది. పెద్దనోట్ల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే కాకినాడ సబ్ డివిజినల్ అధికారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన అనుమతి తీసుకున్నాక, సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చిన తర్వాతే తనిఖీలు చేపట్టాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా సర్వం తానై పెద్దనోట్ల పట్టివేతలో అక్రమానికి సదరు అధికారి తెరలేపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆర్ఎస్సై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లకుండా కేవలం కానిస్టేబుళ్లను పంపి తాను పక్కకు తప్పుకోవడం పోలీసు వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో రిజర్వు ఎస్సైగా విధులు నిర్వహిస్తూ, నాలుగు నెలలుగా కాకినాడ ఒకటో పట్టణ సార్జెంట్ ట్రాఫిక్ ఎస్సైగా చేరి పెద్దనోట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్ప డటంతో జిల్లా ఎస్పీ వీఆర్లో ఉంచారు. కొవ్వాడ కేసులో పెద్దనోట్ల అక్రమ రవాణాలో పట్టుబడ్డ నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు కాకినాడ రూరల్ సీఐ వి.పవన్ కిషోర్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని, విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రిలిమినరీ ఎస్సై పరీక్షకు క్వాలిఫై.. ఇటీవల జేఎ¯ŒSటీయూకే ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష (సివిల్ ఎస్సై) పోస్టుకు అర్హత సాధించిన ఓ కానిస్టేబుల్ పెద్దనోట్ల అక్రమ వ్యవహారంలో తలదూర్చి అడ్డంగా దొరికిపోవడంతో ఇతని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డిసెంబర్ 4వ తేదీన కొవ్వాడలో నగదు తనిఖీల్లో అక్రమాలకు పాల్పడి వీఆర్లోకి వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లలో ఒకరైన (గంగాధర్) ఒకటో పట్టణ ట్రాఫిక్ పోలీసుస్టేçÙన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీ దిగి, ఇంటికెళ్లిపోతున్న క్రమంలో ఆర్ఎస్సై తనిఖీలకు రావాలంటూ ఆదేశాలివ్వడంతో, కొవ్వాడ వెళ్లి ఈ కేసులో ఇరుక్కున్నట్టు పలువురు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. -
దిన‘ధన’ గండం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. కైకరం స్టేట్ బ్యాంక్లో రెండురోజు గురువారం కూడా డబ్బులు లేవనే బోర్డు పెట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్త ం చేసి రోడ్డు ఎక్కారు. మేనేజర్గానీ, సిబ్బందిగానీ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవటంతో ఖాతాదారులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాస్తారోకో వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఉంగుటూరు తహసీల్దార్, చేబ్రోలు ఎస్ఐలు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా తీసుకోవడానికి బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో వారు పనికి రావడానికి ఇష్టపడడం లేదని, ఇలా అయితే రబీలో పంట వేసినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ధాన్యం డబ్బులు బ్యాంకులో పడ్డాయి. మా డబ్బులు తీసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. బాకీదారులు మా ఇళ్ల చుట్టూతిరుగుతున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం తామూ పనులు మానుకుని పెద్ద సంఖ్యలో బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదో తేదీ వచ్చినా పింఛను సొమ్ములు అందకపోవడంతో వృద్ధులు ఆందోళ చెందుతున్నారు. పింఛను పడని వారికి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారికి సరైన సమాచారం లేక ఆందోళనగా బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదివరకు ఒకటో తేదీనే పింఛ¯ŒS వచ్చేది. ఇప్పుడు ఎనిమిదో తేదీకి కూడా రాకపోవడంతో అసలు వస్తుందా రాదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నోట్ల రద్దుతో చాలా వరకు పెద్ద నోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి చేరుకోగా.. ప్రస్తుతం చలామణీలో ఉన్న దొంగనోట్లును కొంతమంది వ్యక్తులు కార్మికులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు గుట్టుచప్పుడు కాకుండా వారి కూలీ డబ్బులు కింద చలామణీలో పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి రేష¯ŒSషాపులను మినీ బ్యాంకులుగా మారుస్తున్నామని రేష¯ŒS డీలర్లను బ్యాంకు కరస్పాండెంట్లుగా మార్చి బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ నిర్వహింప చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రకటన ఇంతవరకూ అమలులోకి రాలేదు. -
ఆ భారీ మొత్తం వెనుక పెద్దలెవరు?
కొవ్వాడ వద్ద నోట్ల పట్టివేత వ్యవహారంలో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వీఆర్లోకి ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ సహా ముగ్గురు కానిస్టేబుళ్లు కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వే గేటు సమీపంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్దనోట్ల పట్టివేత వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెద్దనోట్లను కాకినాడకు చెందిన ఓ వైద్యుని ఇంటికి తరలిస్తున్నట్లు వెల్లడికావడంతో తరలిస్తు్తన్న వ్యక్తుల నుంచి పోలీసులు బేరసారాలకు దిగి రూ. 5 లక్షలు లంచం తీసుకుని,అసలైన నిందితులను విడిచిపెట్టేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమపర్వానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 4న రాత్రి కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం–పైన రహదార్లో వాహనాల తనిఖీ చేపట్టారు. మాచవరం నుంచి కాకినాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్ద నోట్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పెద్దనోట్ల నగదు పట్టివేత, స్వాధీనంపై పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ నగదు స్వాధీనంపై సోమ, మంగళవారాల్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు అలా చేయకపోవడం ఆరోపణలకు ఊతమిచ్చింది. నగదు పట్టివేత, కేసు నమోదులో పోలీసుల వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. అక్రమ నగదు పట్టివేతపై పోలీసులపై ఆరోపణలు రావడాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ సీరియస్గా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నోట్ల పట్టివేత వ్యవహారంలో సిబ్బంది సొమ్ములకు ఆశపడి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్, ముగ్గురు కానిస్టేబుళ్లు గంగాధర్, ప్రసాద్, పరశురాంరెడ్డిలను వీఆర్లోకి పంపుతూ ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వీరిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న పెద్దనోట్లను ఎవరి దగ్గరకు తీసుకెళుతుండగా పట్టుకున్నారు, ఎంత మంది అక్రమ రవాణాలో పాల్గొన్నారన్నది తెలుసుకుని, పట్టుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. -
పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు విలవిల
-
నోట్ల రద్దు... దీర్ఘకాలానికి మంచిదే
స్వల్పకాలికంగా వృద్ధికి విఘాతం పెరగనున్న పన్నుల ఆదాయం ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సింగపూర్: పెద్ద నోట్లకు చట్టబద్ధత లేకుండా చేయడం వల్ల(డీలీగలైజేషన్) స్వల్పకాలికంగా వృద్ధికి విఘాతం కలిగించే అవకాశాలున్నప్పటికీ, మధ్య-దీర్ఘకాలికంగా స్థూల ఆర్థిక స్థితిగతులపై దీని ప్రభావాలు సానుకూలంగానే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎంత వేగంగా, ఎంత సమర్ధవంతంగా హ్యాండిల్ చేయగలిగితే, ప్రతికూల ప్రభావాలు అంత తక్కువగా ఉంటాయని డీమోనటైజేషన్ అంశంపై రాసిన వ్యాసంలో సుబ్బారావు విశ్లేషించారు. ’అత్యంత స్వల్పకాలికంగా చూస్తే డీలీగలైజేషన్.. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది. వినియోగంపై నగదు కొరత ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా మధ్య, దీర్ఘకాలిక స్థూల ఆర్థిక ప్రభావాలను చూస్తే, సానూకూలమే’ అని ఆయన పేర్కొన్నారు. డీలీగలైజేషన్ వల్ల విచక్షణేతర వినియోగాలు తగ్గడం వల్ల ఆ మేరకు వినియోగదారుల ధరల ఆధారిత సూచీపైనా ప్రభావం పడి, ద్రవ్యోల్బణం తగ్గవచ్చని తెలిపారు. చట్టబద్ధత లేని కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్ చేశాక, కొత్త కరెన్సీ చెలామణీలోకి రాగానే కొన్ని సానుకూల పరిణామాలు కనిపించడం మొదలుపెట్టగలవని ఆయన చెప్పారు. నల్లధనపు ఎకానమీ అధికారిక ఆర్థిక వ్యవస్థలో కలిసిపోతుందని, న్యాయబద్ధమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించగలదని తెలిపారు. ప్రభుత్వానికి మరింత ఆదాయం.. ఇంతవరకూ లెక్కల్లో లేని సంపద ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిపై వచ్చే పన్నుల రూపంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడగలదని సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు అదనపు పన్నుల కింద స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కనీసం అరశాతం మేర (దాదాపు రూ. 65,000 కోట్లు) దఖలుపడే అవకాశం ఉందన్నారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి, ఇన్ఫ్రాలో పెట్టుబడులు మొదలైన వాటికి ఉపయోగపడగలదన్నారు. వ్యవస్థ ప్రక్షాళన చేయడమనేది ఇటు పొదుపునకు, అటు పెట్టుబడులకు కూడా సానుకూలాంశమేనని సుబ్బారావు వివరించారు. ఇక, ఆర్బీఐ పాలసీ రేట్లలో కోత పెట్టకపోరుునా కూడా ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ల రాకతో బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయని సుబ్బారావు పేర్కొన్నారు. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు, మరింతగా రుణ వితరణకు వెసులుబాటు లభించగలదని చెప్పారు. -
డబ్బు సర్దుబాటు కోసం టెన్షన్..టెన్షన్
-
నోట్లమార్పిడి వ్యవహారంలో ముగ్గురిపై వేటు
మహానంది: మహానంది దేవస్థానంలో వివిధ కౌంటర్లలో జరిగిన నోట్ల మార్పిడి వ్యవహారంపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బుకింగ్ కౌంటర్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో పనిచేస్తున్న మహేశ్వరీ, వెంకటేశ్వర్లు ఆలియాస్ శివప్ప, లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న డీబీ శివకుమార్లను ససెన్షన్ చేసినట్లు సూపరింటెండెంట్ పరశురామశాస్త్రి తెలిపారు. ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను వదిలేయడం వెనుక పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ చిరుద్యోగిని బెదిరించి తన పేరు చెప్పవద్దని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. -
దేశం ఎటు వెళ్తోంది?
-
డిసెంబర్ తర్వాత కేంద్రం ఏం చేస్తుంది ?
-
చేతిలో చిల్లిగవ్వ లేదు ఏటీఎంలో మనీ లేదు
-
నోట్ల రద్దుతో కళ తప్పిన చేపల మార్కెట్
-
సర్దుకునే చాన్స్ ఇవ్వలేదని బాధ!
-
నగదు కొరత..ప్రజల వ్యథ
– బ్యాంకుల్లో గంటల తరబడి నిరీక్షణ - నందికొట్కూరులో బ్యాంకులోనే రిటైర్డ్ ఉద్యోగి మృతి - దాచుకున్న డబ్బు తీసుకోలేక అల్లాడుతున్న ఖాతాదారులు - కర్నూలులో నిబంధనలు పాటించని ఓ బ్యాంకు - ఇష్టానుసారంగా నగదు మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకుల్లో నగదు కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం ఒకే రోజు రూ.24వేలు లేదా వారంలో విడతలుగా అంతే మొత్తంలో తీసుకోవచ్చు. నగదు కొరతతో చాలా బ్యాంకుల్లో ఇంత మొత్తం ఇవ్వడం లేదు. దీంతో ఖాతాదారులు విసిగిపోతున్నారు. వృద్ధులు క్యూలో నిల్చోలేక కుప్పకూలి పోతున్నారు. నందికొట్కూరులోని ఎస్బీఐ బ్రాంచిలో విత్డ్రా కోసం వచ్చిన రిటైర్డ్ ఉద్యోగి.. నగదు లేదనే మాటను విని వరుసలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. అడ్డదారిలో.. దాచుకున్న డబ్బులో రూ.4వేలు ఇవ్వడానికి లేదంటున్న కొందరు బ్యాంకు అధికారులు ..అడ్డదారిలో మాత్రం కొంతమందికి రద్దయిన పాత నోట్లను తీసుకొని కొత్తనోట్లను ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ తతంగం కర్నూలు నగరంలోని ఒక ముఖ్యమైన బ్యాంకులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు సమయం ముగిసిన తర్వాత దళారులు వెళ్లి పాత నోట్ల కట్టలు ఇచ్చి కొత్తకరెన్సీ కట్టలు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు బ్యాంకు అధికారికి ముడుపులు భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ తంతు ఇటీవల జరిగింది. జిల్లాకు ఎంత కరెన్సీ వచ్చింది.. ఇందులో ఏఏ బ్యాంకుకు ఎంత ఇచ్చారు. దానిని ఏఏ ఖాతాదారులకు ఎంతెంత ఇచ్చారు... విచారణ జరిపితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. నోట్ల మార్పిడికి ఆధార్ నెంబర్లు తీసుకుంటున్నారు. విత్డ్రాకు పరిమితులు ఉన్నాయి. కాని పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు బయటికి రావడం చర్చనీయాంశం అయింది. అడ్డదారిలో నోట్ల కట్టలు బయటికి రావడంతో బయట కొంత మంది 20 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తే నల్లడబ్బును వైట్ చేస్తామంటున్నట్లు తెలుస్తోంది. ఏ బ్యాంకుల్లోను డబ్బుల్లేవ్.... జిల్లాలో 34 బ్యాంకులు ఉన్నాయి. వీటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 445 బ్రాంచిలు ఉన్నాయి. కరెన్సీ చస్ట్లు ఉన్న బ్యాంకులతోపాటు మిగతా వాటిలోనూ నగదు కొరత ఏర్పడింది. బాంకుల్లో దాచుకున్న డబ్బు అవసరానికి ఉపయోగించే పరిస్థితి లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని పనులు వదలు కొని విత్డ్రా కోసం బ్యాంకులకు వెళ్తున్నా... నగదు లేదు... రేపురా అనే సమాధానం ఎదురవుతోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు ప్రతి బ్రాంచ్లో కనీసం రూ. 2 కోట్ల నగదు ఉండేది. నేడు రూ.2 లక్షలు కూడా లేవంటే బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా తయారు అయిందో ఊహించవచ్చు. రోజువారి చెల్లింపులకు జిల్లా మొత్తం మీద రూ. 100 కోట్లు అవసరం ఉంటుంది. నేడు జిల్లా మొత్తం మీద రూ.10 కోట్లు లేవు. రిటైర్డ్ ఉద్యోగి మృతి.... నందికొట్కూరుకు చెందిన బాలరాజు(65) అనే రిటైర్డ్ ఉద్యోగి దాచుకున్న డబ్బలోంచి కొంతమొత్తం విత్ డ్రా చేసుకునేందుకు నాలుగు రోజులుగా స్థానిక బ్యాంక్కు వెళ్తున్నారు. రోజూ నగదులేదంటూ వెనక్కి పంపుతున్నారు. శుక్రవారం కూడ వచ్చి వరసలో నిలబడ్డారు. ఉన్న దాంట్లో ఒక్కొక్కరికి రూ.2వేలు, 4వేలు ఇస్తుండగా తన ముందు మరో ఇద్దరు ఉండగా నగదు అయిపోయిందని విత్డ్రాను ముగించారు. దీంతో ఆయన ఒక్కసారిగా ఆందోళనకు గురి కావడంతో గుండెపోటు వచ్చింది. వరసలోనే కుప్ప కూలి బ్యాంకులోనే మృతి చెందాడు. పెరగిన కష్టాలు.... రిజర్వుబ్యాంకు నోట్ల మార్పిడి నిలిపివేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇక్కట్లు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా ఆర్బీఐ తీరుపై బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.100, 50, 20, 10 నోట్ల కొత్త కరెన్సీని ౖహెదరాబాద్లోని ప్రయివేటు బ్యాంకులకు ..పాత కరెన్సీని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నారని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. -
నోట్లు మార్పిడి కోసం RBI వద్ద ఇంక క్యూ
-
ఇదే చివరి అవకాశం..త్వరపడండి!
ముంబై: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో చెల్లింపులకు నేడే (నవంబర్ 24)చివరి రోజు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల వినియోగానికి ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్,రైలు, బస్సు టికెట్లు సహా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి రద్దయిన పాతనోట్ల అనుమతికి రోజు అర్థరాత్రి వరకే అవకాశం ఉంది. పాతనోట్లని కేవలం బ్యాంకుల్లో మార్పిడికి, లేదా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంది. అది కూడా డిశెంబర్ 30 వరకే. 1.ప్రభుత్వాసుపత్రులు 2. రైల్వే టిక్కెట్లు 3.పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ 4. ఎయిర్ లైన్ టిక్కెట్లు 5. మిల్క్ బూత్స్ 6. బరియల్ గ్రౌండ్స్ (శ్మశానాలు) 7. పెట్రోల్ బంకులు 8, మెట్రో రైలు టిక్కెట్లు 9. నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలు 10. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో మెడిసిన్స్ 11. ఎల్పీ జీ సిలిండర్స్ 12. రైల్వే కేటరింగ్స్ 13.కరెంట్, వాటర్ బిల్స్ 14. ఆర్కియాలజీ సర్వే డిపార్ట్ మెంట్ల ఎంట్రీ టిక్కెట్లు 15. కోఆపరేటివ్ స్టోర్లు 16. ప్రభుత్వశాఖలు విధించిన పన్నులు, జరిమానాలు 17. ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తన విక్రయ కేంద్రాలు కాగా నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఆందోళన రాజేసింది. అటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఈ వ్యవహారంతో అట్టుడుకుతున్నాయి. మరోవైపు ఆర్థికశాఖ ఎన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నప్పటికీ, 16రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఏం సెంటర్ల వద్ద జనం పడిగాపులు మాత్రం కొనసాగుతున్నాయి. అటు పాత నోట్ల చలామణి గడువును పొడిగించాలన్న డిమాండ్ కూడా భారీగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దుతో మహిళా కార్మికుల కష్టాలు
-
ఖమ్మం రైతు మార్కెట్లో నోట్ల రద్దు ఎఫెక్ట్
-
ఇదో రకం ధనిద్రం
తమకో, తమ వారికో ఏదైనా జబ్బు వచ్చి, చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోతే పేదలు పడే బాధ జబ్బు బాధ కన్నా ఎక్కువేనని వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడలాంటి బాధను కొందరు డబ్బులుండి కూడా అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దు, కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోట్లు రోగులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అత్యవసర సేవలకు రద్దయిన పెద్దనోట్లు ఈ నెల 24 వరకూ చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, మందుల షాపుల యజమానులు వాటిని తీసుకోవడానికి తిరస్కరిస్తుండడంతో రోగుల బంధువులు అవస్థలు పడుతున్నారు. ఇక కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. రెండు వేల నోటు తీసుకెళుతుంటే చిల్లర లేదన్న సమాధానమే వస్తోంది. దీంతో రోగులు, వారి బంధువులు ఉసూరుమంటున్నారు. వ్యాధుల వ్యధకు తోడవుతున్న నోట్ల బాధ రద్దయిన పెద్దనోట్లను తిరస్కరిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త రూ.2000 నోటుకు దొరకని చిల్లర ఆధార్ నకలు అందజేస్తేనే ఇస్తున్న బ్యాంకులు సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఆస్పత్రుల్లో ఓపీ ఫీజులు రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. రెండు వేల నోటు తీసుకుంటే మిగతా చిల్లర వందల రూపంలో ఇవ్వాల్సి వస్తుండడంతో ఆస్పత్రి సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఓపీ ఫీజు, బయట మందుల దుకాణంలో మందులు, రక్తపరీక్ష కేంద్రాల్లో ఫీజులు చెల్లించేందుకు రూ. రెండు వేల నోటు ఇస్తుంటే, వారు చిల్లర ఇవ్వాలని అడుగుతుండడంతో రోగులకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అసలే ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రులకు వెళుతుంటే చిల్లర సమస్య వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. చేతిలో చెలామణి అయ్యే నగదు ఉన్నా వైద్యం చేయించుకోలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రెండువేల నోటుకు చిల్లర కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆస్పత్రిలోనే ఓపీ ఫీజు, పరీక్షలు, మందులు దొరికే విధంగా ఉన్న పరిస్థితుల్లో కొంత ఉపశమనంగా ఉంది. అలాంటి చోటఅన్నీ కలిపి ఒకే సారి బిల్లు చేసి రూ.రెండు వేల నోటు తీసుకుంటున్నారు. బ్యాంకుకు వెళితే పూట పడిగాపులే.. రూ.100, 50, 20, 10 నోట్లు తగినంతగా అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. తమ వద్ద పాత నగదు ఉన్నా చెల్లకపోవడం, ఉన్న రెండు వేల నోటుకు చిల్లర లేకపోవడంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రద్దీ కారణంగా బ్యాంకుకు వెళ్లిన వారు రోజులో ఓ పూట అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న చిల్లర నోట్ల నిల్వలను అందరికీ పంచేందుకు ఒక్కొక్కరికీ రూ. రెండు వేలు మాత్రమే చిల్లర నోట్లు ఇస్తున్నారు. అదీగాక ఆధార్ నకలు ఇస్తేనే బ్యాంకులు రెండు వేల నోటుకు చిల్లర ఇస్తుండడం గమనార్హం. -
అవే పాట్లు
►బ్యాంకుల్లోనూ నోట్లు కరువు ►95 శాతం ఏటీఎంలు మూత ►బడాబాబులకే వాణిజ్య బ్యాంకుల ప్రాధాన్యం ►సామాన్యులను పట్టించుకోని వైనం ఇస్తున్న నోట్లు రూ.2 వేలవే ►చిల్లర కోసం జనం తిప్పలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సామాన్యుడి చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. పెద్దనోట్ల రద్దరుు రెండు వారాలు దాటుతున్నా కష్టాలు తీరడంమాట అటుంచి.. రోజురోజుకూ మరింత పెరుగుతున్నారుు. కొత్త రూ.500,రూ.1000 నోట్లు వస్తాయని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ వాటి ఊసేలేదు. రూ.100 నోట్లు అసలు కనిపించడం లేదు. బ్యాంకుల్లోనూ అటు అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంల లోనూ రెండు వేల నోట్లే ఇస్తున్నారు. వాటికి చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. అలంకారప్రాయంగా ఏటీఎంలు.. జిల్లావ్యాప్తంగా 95 శాతానికిపైగా ఏటీఎంలు మూతబడ్డారుు. మార్కాపురంలో 16 బ్యాంకుల పరిధిలో 22 ఏటీఎంలు ఉంటే నాలుగు చోట్ల మాత్రమే డబ్బులు పెడుతున్నారు. గిద్దలూరులో 12 ఏటీఎంలు ఉండగా మూడు మాత్రమే సేవలు అందిస్తున్నారుు. దర్శిలో 1, 2 ఏటీఎంలల్లో డబ్బులు అందుబాటులో లేవు. ఇక చీరాలలో సైతం ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 95 శాతానికిపైగా ఏటీఎంలలో బ్యాంకులు డబ్బులు పెట్టడం లేదు. ఇక బ్యాంకుల్లో సైతం తగిన మేర డబ్బులు లేక పోవడంతో పేరుకు తెరిచి ఉన్నా లావాదేవీలు దాదాపు నిలిచిపోయారుు. వచ్చిన అరకొర డబ్బులను కొందరికి మాత్రమే మొక్కుబడిగా ఇచ్చి బ్యాంకులు మిన్నకుండిపోతున్నారుు. సామాన్యుల ఇబ్బందులు పట్టని బ్యాంకులు.. ఇక వాణిజ్యబ్యాంకులు, సామాన్యుల కష్టాలను పట్టించుకోవడం లేదు. తమ ఖాతాదారులైన బడాబాబుల సేవలోనే తరిస్తున్నారన్న ఆరోపణలున్నారుు. చాలా బ్యాంకుల్లో కొందరు ఉన్నతాధికారులు పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని అనుకూలంగా మలుచుకొని నల్లధనాన్ని భారీ ఎత్తున మార్పిడి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇందులో నల్లబాబుల నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు సాక్షాత్తు కొందరు బ్యాంకు ఉద్యోగులే పేర్కొంటుండటం గమనార్హం. జిల్లాలోని స్టేట్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉండటంతో అక్కడే ఎక్కువ లావాదేవీలు నడుస్తున్నారుు. మిగిలిన బ్యాంకుల్లో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి సాయంత్రం పూట మాత్రమే డబ్బులు వస్తున్నారుు. దీంతో అందుబాటులో ఉన్న వారికే డబ్బుల పంపిణీ జరుగుతుంది. సొంత కస్టమర్లకే ప్రాధాన్యం.. బ్యాంకులు తమ కస్టమర్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కూడా ఆర్థిక స్థోమత ఉన్న నల్లకుబేరులకే సేవలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నారుు. వచ్చిన డబ్బులను పెద్దల నల్లధనాన్ని మార్చేందుకే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం క్యూ కట్టినా ప్రయోజనం లేకుండాపోతోంది. మొక్కుబడిగా డబ్బులు విదిల్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నారుు. తగినంత డబ్బులను బ్యాంకులకు అందించటంలో ఇప్పటికే ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.రెండు వారాల దాటుతున్న సమస్య కొలిక్కి రాకపోవడంతో సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతం. నిత్యావసర సరుకులు కూడా డబ్బులు అందుబాటులో లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమస్య ఎన్నిరోజులకు పరిష్కారమవుతుందో కూడా తెలియకపోవడంతో జనంలో తీవ్ర ఆందోళనలు నెలకొంది. అన్ని పనులు మానుకొని జనం రోడ్లపై పడి చిల్లర కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా పెద్దనోట్ల రద్దుతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోరుుంది. -
అభి‘వంద’నం
అపురూపమవుతున్న రూ.100 నోట్లు అవసరాలకు ఆలోచించి ఖర్చు చేస్తున్న ప్రజలు అమలాపురం టౌన్ : ‘‘ఎవ్రీ డాగ్ హేజ్ ఏ డే..’’ ‘‘ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది’’ నిజమే అలాంటి రోజు, అలాంటి టైం రూ.వందనోటుకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ నోటును ప్రజలు తమ జేబుల్లో, పర్సుల్లో ఉంచుకునేందుకు ఇష్టపడేవారు కాదు. పది వంద నోట్లకు బదులుగా ఒక్క వెయ్యి నోటును సింపుల్గా తీసుకువెళ్లేవారు. కానీ పెద్దనోట్లు(రూ.500, వెయ్యి) రద్దుతో వందనోటు తిరిగి వెలుగులోకి వచ్చింది. అందరూ ‘వందే’మాతరం అనాల్సిన పరిస్థితి నెలకొంది. వంద నోట్ల కోసం పడిగాపులు పడాల్సిన సమయం వచ్చింది. ఈనెల ఎనిమిదో తేదీ వరకూ మూడో స్థానంలో ఉన్న వంద నోటు.. పెద్ద నోట్ల రద్దుతో మొదటి స్థానానికి ఎగబాకింది. గతంలో రూ.100 నోటును విచ్చలవిడిగా ఖర్చుచేసిన జనం ప్రస్తుతం అపురూపంగా చూసుకుంటున్నారు. ఖర్చు చేసేందుకు ఆలోచిస్తున్నారు. జేబులో రూ.100 నోట్లు పది ఉంటే చాలు రూ.లక్ష ఉన్నంత అండతో.. ధైర్యంతో ఉంటున్నారు. పెద్ద నోట్లున్న ధనికుడు కంటే.. రూ.వందనోట్లున్న వారే ప్రస్తుతం రారాజుగా చలామణీ అవుతున్నారు. అత్యవసర ఖర్చులకు వంద నోట్లు విక్రయాలు, కొనుగోళ్లు అధికంగా ఉండే వ్యాపార దుకాణాల, పెట్రోలు బంకులు తదితర చోట్ల తమకు బాగా తెలుసున్న వ్యక్తులు ఉంటే వారి వద్ద నుంచి రూ.500 నోటు ఇచ్చి ఐదు వంద నోట్లు తీసుకుంటున్నారు. అలా వంద నోట్లను సేకరించుకుని ముందు జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల నుంచి రూ.రెండు వేల నోట్లే వస్తుండడంతో వంద నోటును ఆలోచించి ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో పాటు పది పట్టణాల్లో వంద నోట్లకు ఉన్న డిమాండు ఇంతా అంతా కాదు. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను రూ.వందల నోట్లలోకి మార్చేందుకు రోజులో సగానికి పైగా సమయం అందుకే వెచ్చిస్తున్నారు. అమలాపురంలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న రూ.2000 నోటు మార్చేందుకు పూట సమయం పట్టింది. సామాన్యుడైన అతను ఏటీఎంలో డ్రా చేసుకుని చివరకు అత్యవసరం కాకపోయినా కేవలం చిల్లర కోసం రూ.600 ఖర్చు చేసుకుని అతికష్టంతో చిల్లర సాధించగలిగాడు. -
ఇక బిగ్బజార్లోనూ క్యాష్ విత్డ్రా
-
మరోసారి షాక్ ఇవ్వనున్న కేంద్రం
-
ఎన్నాళ్లీ క(న)ష్టాలు
తొలగని చిల్లర ఇక్కట్లు సామాన్యుల సతమతం వరి కోతలలకూ దెబ్బ 80 శాతం పనిచేయని ఏటీఎంలు రూ. జిల్లాకు రూ.600 కోట్లు కావాలని ఇండెంట్ కనీసం రూ.200 కోట్లు వస్తే కొంత సమస్య తీరినట్టే ఆచరణలోకి రాని పెంట్రోలు బంకుల వద్ద నోట్ల మార్పిడి రూ.2 వేల నోటున్నా వైద్యం అందక ఓ వ్యక్తి మృతి ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలోనని భయపడుతున్న జిల్లా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టి పక్షం రోజులు కావస్తున్నా ప్రజల ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. బ్యాంకుల వద్ద డబ్బులు లేకపోవడం, ఏటీఎంలు మూసి వేయడంతో బారులు తీరి నిరాశతో వెనుకకు తిరిగిన సందర్భాలే అధికం. ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి. ఆస్తమాతో బాధపడుతున్న ఏజెన్సీకి చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్దామని బయలుదేరాడు. ఆయన వద్ద రూ. 2 వేల నోటుంది. చిల్లర కోసం గంటలతరబడి తిరిగి తీరా చిల్లర చేజిక్కాక ఆసుపత్రికి వెళ్లడానికి బైకుపై వెళ్తుండగా ఆదివారం మధ్యాహ్నం మార్గ మధ్యలోనే తనువు చాలించాడు. ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని జిల్లా ప్రజలు భయపడుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పాత రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దుతో గత పదమూడు రోజులుగా జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అవసరమైన మేరకు ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో సరిపడా నగదు లేకపోవడం, బ్యాంకుల్లో నగదు మార్పిడిని క్రమంగా తగ్గించడంతో సమాన్యుల వెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ప్రజలకు పంపిణీ చేసిన నగదులో 80 శాతం రూ.2 వేల నోట్లుండడంతో అవి మార్చుకోవడానికి ప్రజలు తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు వందలకు కొనుగోలు చేసినా మిగతా చిల్లర మొత్తం రూ.వందల్లో ఇవ్వాల్సి వస్తుండడంతో వ్యాపారులు రూ.రెండు వేల నోట్లు తిరస్కరిస్తున్నారు. దీంతో నిత్యవసర సరుకులు కూడా ప్రజలు కొనుగోలు చేయాలేని పరిస్థితి నెలకొంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వ్యాపారాలు దాదాపు 70 శాతం తగ్గిపోయాయి. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులు, బడ్డీకోట్లు వారు 13 రోజులుగా వ్యాపారాలు లేక కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు తమకు రూ.600 కోట్లు కావాలని ఆర్బీఐకు ఇండెంట్ పెట్టాయి. ఇందులో రూ.200 కోట్లు వస్తే నగదు కొరత సమస్య దాదాపు తీరుతుందని లీడ్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరో రూ.50 కోట్లు రూ.100 నోట్లు చెలామణిలోకి వస్తే చిల్లర సమస్య కూడా తీరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.100 నోట్లను పూర్తి స్థాయిలో చెలామణి చేయకుండా భవిష్యత్తు అవసరాలకు దాస్తుండడంతో చిల్లర సమస్య తలెత్తుతోందని పేర్కొంటున్నారు. ఏటీఎం.. ఎనీ టైం మూత.. నగదు కొరత వల్ల జిల్లాలోని అన్ని ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. 811 ఏటీఎంలకుగాను కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తున్నాయి. అన్ని ఏటీఎంలను రూ.రెండు వేల నోట్లకు అనుగుణంగా మార్చకపోవడం వల్ల చిన్న పట్టణాలల్లోని ఏటీఎంలలో రూ.రెండు వేల నోట్లు కూడా లభించడంలేదు.బ్యాంకుల వద్ద, ముఖ్యమైన కూడళ్లలోని ఏటీఎంలలోనే బ్యాంకులు నగదును అందుబాటులో ఉంచుతున్నాయి. రూ.రెండు వేలు, రూ.100 నోట్లు పెడుతుండగా రూ.100 నోట్లు నిమిషాల్లో అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏటీఎంల వద్ద 'నో క్యాష్, రూ.రెండు వేల నోట్లు మాత్రమే' అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ డీలర్ల నుంచి నగదు పంపిణీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించినా ఆ ప్రక్రియ ఇంకా జిల్లాలో ప్రారంభంకాలేదు. వరి కోతలకు చిల్లర దెబ్బ... జిల్లాలో వరి ఖరీఫ్ కోతలు మొదలైన పక్షం రోజులు దాటింది..పెద్ద నోట్లు రద్దు.. రూ. 100 నోట్లు లేకపోవడంతో వరి కోతలకు కూలీలు రావడంలేదు. చిల్లర నోట్లు ఇస్తామంటేనే కోతలకు వస్తామని ముందుగానే తెల్చి చెబుతున్నారు. దీంతో కోతలు ఆలస్యమై పంటకు దోమ పడుతోంది. అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయకపోతుండడంతో గింజలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్లో ప్రజలకు పాత నోట్లు... విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు సిబ్బంది చిల్లర లేదని పాత రూ.500 నోట్లు ఇస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఇంజినీర్ ఎ.అప్పారావు సోమవారం ఈపీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రంలో రూ.1,388 బిల్లునకు రూ.2000 నోటు ఇచ్చారు. అయితే బిల్లు కట్టిన తర్వాత పాత రూ.500 నోటు రూ.100 నోట్లు ఇస్తున్నారు. పాత నోటు ఇస్తున్నారేంటని అప్పారావు అడగ్గా సిబ్బంది దురుసుగా మాట్లాడారని ఆయన వాపోయారు. ఈ విషయమై 'సాక్షి' ఏపీఈపీడీసీఎల్ అకౌంట్ ఆఫీసర్ ఆదినారాయణతో మాట్లాడగా.. చిల్లర లేక అలా ఇచ్చి ఉండవచ్చని, తగినంత చిల్లర లేకపోతే మొత్తం నగదుకు బిల్లు చేసే విధంగా సిబ్బందికి ఆదేశాలిస్తామని చెప్పారు. రూ.500 నోటు తీసుకున్న వ్యక్తి మంగళవారం కార్యాలయానికి వస్తే రూ.100 నోట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. -
ఆర్టీసీలో బెదిరించి నోట్లు మారుస్తున్నారు
-
పత్తి రైతులకు పాత నోట్లే ఇస్తున్నారు
-
ప్రాణాలు తీస్తున్న నోట్లు
-
మహానందీశ్వరుడి సాక్షిగా..
- రూ. లక్షల్లో నోట్ల మార్పిడి - అధికార పార్టీ నేత అండగా ఓ అధికారి కక్కుర్తి - సిబ్బంది భాగస్వామ్యం - 13 మందికి షోకాజ్ నోటీసులు మహానంది: నల్లకుబేరులు పెద్ద నోట్ల మార్పిడికి మహానంది క్షేత్రాన్ని అడ్డాగా మార్చుకున్నారు. ఓ అధికారి సహకారంతో నల్లడబ్బును తెల్లగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకున్న వారిలో ధర్మకర్తల మండలి సభ్యులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ తంతగంలో ఓ చిరుద్యోగి తన హవాను కొనసాగిస్తున్నాడు. గత ఆది, సోమవారాల్లో రెండురోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. ఆదివారం సెలవురోజు కావడంతో సుమారు రూ. 4లక్షలు, కార్తీక పౌర్ణమి కావడంతో సోమవారం భక్తులరద్దీ అధికంగా ఉండటంతో రూ. 5లక్షల వరకు ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో రూ. 9లక్షలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులరద్దీ, ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు రోజులనే నల్లకుబేరులు టార్గెట్ చేశారు. అధికార పార్టీ అండగా ఓ ఉద్యోగి కింది స్థాయి సిబ్బంది సహకారంతో రెండు రోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి చేసినట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఎనిమిది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఏజేన్సీ ఉద్యోగులు కలిపి 21 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వీరిలో స్థానిక అధికారపార్టీ నేతతో పాటు ఓ ఉద్యోగి బంధువు, మరికొందరు స్థానికులు ఉన్నారని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.అలాగే లోకాయుక్తను ఆశ్రయించి కేసు వేస్తామన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవు: శంకర వరప్రసాద్, డిప్యూటీ కమిషనర్, మహానంది నోట్ల మార్పిడిలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజేన్సీ, ఔట్సోర్సింగ్, ఇతరులకు కలిపి మొత్తం 21 మందికి షోకాజ్నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాము.ఆది, సోమవారాల్లో కలిపి రూ. 2.64లక్షల మార్పిడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విచారణ అనంతరం బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవు. -
ఎన్ని నోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రత్నామ్నాయ నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు మూడు ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా రోజుకి మిలియన్ల కొద్దీ కరెన్సీని ముద్రిస్తోంది. తద్వారా తగినంత కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా బీఆర్బీఎన్ఎంపీఎల్ (భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ ) ద్వారా (18లైన్లు) సుమారు 4కోట్లు( 40 మిలియన్ల)రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. అలాగే బీఎన్పీ దివస్ (బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ (3లైన్లు) లో 90 లక్షల రూ.500 నోట్లను రడీ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే నాసిక్ ప్రెస్ లోని నాలుగు లైన్ల ద్వారా సుమారు కోటి 80 లక్షల( (18మిలియన్లు) కరెన్సీ నోట్లను ముదిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాసిక్ లోని ప్రెస్ (1లైన్) ద్వారా రోజుకు ముఖ్యంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్ల ను ముద్రిస్తోంది. అలాగే (2లైన్లు) కోటి(10 మిలియన్ల) రూ.100 నోట్లును ముద్రిస్తోంది. తగినంత కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరోసా ఇచ్చింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా తొమ్మిదో రోజుకూడా ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడి పరిమితిని గురువారం రూ2వేలకు కుదించింది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ లో ప్రతిపక్షాల నిరసనల సెగ రేగిన సంగతి తెలిసిందే. -
మలిసంధ్యలో 'మనీ' పాట్లు
– బారులు తీరలేక సొమ్మసిల్లుతున్న వృద్ధులు – ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని మనవి ఎమ్మిగనూరు: నోట్ల పాట్లు వయోవృద్ధులకు తప్పలేదు. వణుకుతూ.. తడబడుతూ.. బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. క్యూలో నిరీక్షించి నీరిస్తున్నారు. దాహంతో తల్లడిల్లి, ఆకలితో అలమటిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. పొద్దుపొడుపుతో బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. పొద్దు గూకే దాక నోట్ల మార్పిడి కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. పాపం యువకులతో పోటీ పడలేక, గంటల తరబడి వేచి ఉండలేక ఉన్నచోటనే సొమ్మసిల్లుతున్నారు. వికలాంగులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. ఈ నెలలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో దాదాపు 35 వేల పైగా వృద్ధులు, వికలాంగులు పింఛన్లు పొందారు. అందరికీ పాత నోట్లతో పింఛన్లు అంటగట్టారు. నెలనెలా ఆసరాతో పోగు చేసుకున్న డబ్బు సైతం పనికిరాకుండా పోయింది. పూట గడవని బతుకులు కడుపుమాడ్చుకుని క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల వద్దకు తరలివస్తున్నారు. బ్యాంకులతో బారులు తీరలేక గంటల తరబడి నిరీక్షించలేక యాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఎస్బీఐ, ఏడీబీ,ఆంధ్రబ్యాంక్,గోనెగండ్ల, మంత్రాలయం, కోసిగి ఎస్బీఐ, రాయలసీమ గ్రామీణ బ్యాంకులతో రద్దీ ఎక్కువగా ఉంది. -
చెల్లని నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా..?
-
ఆర్టీసీకి ‘చిల్లర’ దెబ్బ
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపైనా పడింది. చిల్లర కొరత, రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల ఎదుట క్యూ కట్టాల్సి రావడంతో ప్రజలు ప్రయాణాలను విరమించుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.8 లక్షల వరకూ ఆదాయ నష్టం వాటిల్లుతోంది. కార్తీక మాసంలో ఆదాయం గణనీయంగా పెరగాల్సి ఉంది. ఏటా ఈ సీజ¯ŒSలో జిల్లాలోని శైవ క్షేత్రాలు, రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులు అధికంగా ఉంటారు. చిల్లర కొరత కారణంగా భక్తులెవరూ పెద్దగా ప్రయాణాలు చేయడం లేదు. సమీపంలోని శివాలయాలను దర్శించుకుని సరిపెడుతున్నారు. అయ్యప్ప మాలధారులు సైతం ప్రయాణాల విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఆర్టీసీకి సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోల్చితే కార్తీక మాసంలో మరో 15 శాతం వరకూ అధికంగా ఆదాయం వస్తుంది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెద్దనోట్ల ప్రభావంతో సుమారు 10 వేల మంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్టు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని 8 డిపోల నుంచి తిప్పుతున్న ఆర్టీసీ సర్వీసులలో ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. 10 వేల మంది ప్రయాణికులు తగ్గడంతో రోజువారీ ఆదాయం రూ.8 లక్షల వరకు తగ్గినట్టు అంచనా. కార్తీక మాసంలో రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం సమకారాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి రూ.65 లక్షలు మాత్రమే వస్తోంది. ఈ సీజ¯ŒSలో రావాల్సిన రోజువారీ ఆదా యంలో రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు కోల్పోతోంది. సీజన్తో సంబంధం లేకుండా సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోలిస్తే రోజుకు రూ.8 లక్షల వరకు ఆదాయం తగ్గింది. నిత్యం 10 వేలమంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని, ఈ కారణంగా రోజువారీ సగటు ఆదాయంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు గండి పడుతున్నట్టు అంచనా వేశామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీకి రోజుకు రూ. 20 లక్షల నష్టం
24వ తేదీ వరకు బస్సుల్లో పెద్దనోట్లకు అనుమతి కోవెలకుంట్ల: రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా పడిందని ఆర్టీసీ కర్నూలు రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం రాత్రి స్థానిక ఆర్టీసీ డిపోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో రీజియన్లోని ఆయా డిపోల నుంచి రోజుకు రూ. 90 లక్షల నుంచి రూ. 95 లక్షల ఆదాయం వచ్చేదని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రోజుకు రూ. 20 లక్షల ఆదాయం తగ్గిందన్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో ఎక్కువశాతం మంది ప్రయాణీకులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి కారణాలతో నష్టాలు సం¿¶ విస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కర్నూలు రీజియన్ అక్టోబర్ నెలాఖరు వరకు రూ. 51 కోట్ల నష్టాలో ఉందని, పెద్దనోట్ల రద్దు ప్రభావం కారణంగా ఆ నష్టం మరింత పెరిగే అస్కారం ఉందన్నారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు డిపోల్లో ఎక్కువ నష్టాలు ఉన్నాయన్నారు. వివిధ బ్యాంకుల నుంచి రూ. 20, రూ. 20, రూ. 100 నోట్లు తెప్పించి ప్రయాణీకుల కష్టాలు తీర్చుతున్నామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ఈ నెల 24వ తేదీ వరకు రూ. 500, రూ. 1000 నోట్లను అనుమతిస్తామని ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, తహశీల్దార్ రామచంద్రారెడ్డి, ఎస్ఐ మంజునాథ్ పాల్గొన్నారు. -
కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
-
కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
న్యూఢిల్లీ: కరెన్సీ బ్యాన్ తో ఉద్భవించిన అనివార్య పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. దేశ ప్రజలకు నగదును అందుబాటులో ఉంచేందుకుగా చర్యలు వేగం చేసింది. మూడు నెలల క్రితం నమోదైన కరెంట్ ఖాతాలకు నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించి చిన్న వ్యాపారుదారులకు భారీ ఊరట నిచ్చారు. బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ.50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అలాగే డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద లావాదేవీ ఛార్జీలు రద్దుచేయాల్సిందిగా బ్యాంకులు కోరినట్లు విలేకరులతో చెప్పారు. కనీసం మూడు నెలల పాత ఖాతాలలో నగదు ఉపసంహరణ పరిమితి పెంచుతున్నట్టు ప్రకటించారు. వారానికి రూ. 50,000 డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కార్మికుల వేతనాలు, వారాంతపు వ్యాపార చెల్లింపులు తదితర వ్యయాల నిమిత్తం కరెంట్ ఖాతా ఉన్న వ్యాపార సంస్థల పరిమితిని పెంచినట్టు దాస్ చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ప్రజల ఇబ్బదుల దృష్టిలో పెట్టుకొని నగదు సరఫరా నిమిత్తం దేశవ్యాప్తంగా కొత్త మైక్రో ఏటీఎంలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు వివరించారు. -
పోస్టాఫీసుల్లో రూ. 1.40 కోట్ల మార్పిడి
కర్నూలు (ఓల్డ్సిటీ): పోస్టాఫీసుల ద్వారా డివిజన్ పరిధిలో ఆదివారం రూ. 1.40 కోట్ల మేరకు నోట్లు మార్పిడి చేసినట్లు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క హెడ్ పోస్టాఫీసులోనే రూ. 40 లక్షల మేరకు మార్పిడి చేశామన్నారు. సోమవారం గురునానక్ జయంతి సెలవు దినమైనా పోస్టాఫీసులు పనిచేస్తాయన్నారు. ఆదివారం ఎస్బీ ఖాతాలకు రూ. 4.79 కోట్ల డిపాజిట్లు జమ కావడంతో మొత్తం డిపాజిట్లు రూ. 35 కోట్లకు చేరాయని వివరించారు. -
విశాఖ కాలువలో 50, 100 నోట్లు
-
పాత నోట్లతో క్రమబద్ధీకరణ
ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం నోటీసు అందుకున్న వారు చెల్లించాల్సిన సొమ్మును పాత రూ.500, రూ.1000 నోట్ల ద్వారా కూడా చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావులతో సీఎం కేసీఆర్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయాల్సిన పనులన్నీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల్లో నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం చేసే చెల్లింపులకు ఈ నెల 14 వరకు పాత పెద్ద నోట్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు. జీవో నంబర్ 59తో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, జీవో నంబర్ 92తో యూఎల్సీ ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ట్రేజరీలకు కూడా సమాచారం అందించింది. ఆదివారం (13వ తేదీ)న కూడా బ్యాంకులు, ట్రేజరీలు తెరిచి ఉంటాయని, ఆది, సోమవారాల్లో ట్రేజరీల ద్వారా చెల్లింపులకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని దరఖాస్తుదారులను ప్రభుత్వం కోరింది. చెల్లింపులకు సంబంధించిన చలాన్లను సంబంధిత రెవెన్యూ అధికారులకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. చలాన్లు అందిన వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
‘ఉప్పు’తిప్పలు
– ధర పెరిగిందంటూ వదంతలు – దుకాణాలకు క్యూ కట్టిన ప్రజలు – పోలీస్ బందోబస్తు కోరిన వ్యాపారులు – పెద్దనోట్ల రద్దుతో ఉప్పు రవాణాలో ఇబ్బందులు నంద్యాల/ఎమ్మిగనూరు/ కోడుమూరు రూరల్ ఎక్కడి నుంచి వచ్చిందో..ఎలా వచ్చిందో తెలియదుకాని ఉప్పు ధర భారీగా పెరుగుతోందన్న పుకారు శనివారం ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. పుకార్ల దెబ్బకు కిరాణ దుకాణాలు కిటకిటలాడాయి. జనతాకిడిని తట్టుకోలేక కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేసి.. పోలీసులను ఆశ్రయించారు. ధరలు పెరగలేదని.. వదంతులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేసిన వందంతుల ప్రభావం శనివారం రాత్రి వరకు తగ్గలేదు. తమిళనాడులోని టూట్కార్ నుంచి నంద్యాలకు లారీల్లో ఉప్పు సరఫరా అవుతుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి పది టన్నులను దిగుమతి చేసుకొంటారు. వీటితో పాటు పలు కార్పొరేట్ కంపెనీలకు చెందిన అయోడైజ్డ్ ప్యాకెట్లను కూడా వ్యాపారులు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం కేజీ రూ.6 నుంచి రూ.7కు విక్రయిస్తున్నారు. కేజీ అయోడైజ్డ్ ప్యాకెట్ను హోల్సెల్ షాప్లో రూ.11కు రిటైల్ షాప్లో రూ.17కు విక్రయిస్తున్నారు. రవాణాలో అంతరాయం... ఉప్పు దిగుమతి చేసుకోవడానికి రవాణాలో అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని టూట్కార్ నుంచి లారీల్లో దిగుమతి చేసుకోవడానికి నోట్ల కొరత ఇబ్బంది ఏర్పడింది. ట్రాన్స్పోర్టు సిబ్బంది పాత నోట్లు రూ.1000, రూ.500 తీసుకోవడానికి నిరాకరించి, కేవలం రూ.100 నోట్లు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రూ.100 నోట్ల కొరత ఉండటం, కొత్త రూ.500, రూ.2వేల నోట్లు చేతికి అందకపోవడంతో ఉప్పు వ్యాపారులు సకాలంలో దిగుమతి చేసుకోలేకపోయారు. దీంతో ఉప్పుకు కొంత డిమాండ్ వచ్చింది. షాపుల వద్ద క్యూకట్టిన స్థానికులు.. ఉప్పు ధర పెరిగిపోతుందని, కేజీ రూ.150 వరకు విక్రయించే అవకాశం ఉందని వతంతులు వచ్చాయి. దీంతో ఉప్పును భారీ మొత్తంలో కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకోవడానికి స్థానికులు గాంధీచౌక్, పప్పులబట్టి, మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న హోల్సెల్ షాపుల వద్ద ఎగబడ్డారు. జనం అధికంగా రావడంతో వారిని నియంత్రించలేక వ్యాపారులు.. పోలీసులను ఆశ్రయించారు. తమకు బందోబస్తును కల్పిస్తే, మామూలు ధరకే విక్రయిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వారికి బందోబస్తును కల్పించారు. రూ.50కిపైగా విక్రయం... ఉప్పు కొరత ఏర్పడుతుందని వచ్చిన డిమాండ్ను కొందరు రిటైల్ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. రూ.7కు విక్రయించే ముడి ఉప్పును రూ.20, అయోడైజ్డ్ ప్యాకెట్లను రూ.50 వరకు విక్రయించారు. అయినా స్థానికులు ఒక్కొక్కరు 10 నుంచి 20కేజీల వరకు కొనుగోలు చేశారు. సొమ్ము చేసుకున్న వ్యాపారులు.. ఎమ్మిగనూరు పట్టణంలోని శకుంతల సర్కిల్లోని కిరాణా దుకాణాల్లో రాళ్ల ఉప్పును కేజి రూ. 40 ప్రకారం, సన్న ఉప్పును రూ. 50 చొప్పున విక్రయించారు. కొందరు 80 శాతం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొంతమంది ఉప్పు దొరకదేమోననే ఆందోళనతో షాపులముందు ఉన్న ఉప్పుసంచులతో పరుగు లగించారు. కూలి చేసుకోలేక పూట గడవడమే కష్టంగా ఉంటే బ్యాంకుల చుట్టూ, ఉప్పు కోసం దుకాణాల చుట్టూ తిరగడమేమిటని సామాన్యులు నిట్టూర్పు విడిచారు. నిజం లేదు.. కోడుమూరులో భారీస్థాయిలో ఉప్పును కొనుగోలు చేశారు. జనాలు ఎగబడుతుండడంతో కొందరు వ్యాపారులు కిలో ఉప్పు ధరను రూ.5 నుంచి రూ.40కు, ప్యాకెట్ ధరను రూ.15 నుంచి రూ.50కు పెంచి అమ్మారు. ఉప్పు ధర పెరుగుతోందని వస్తున్న పుకార్లలో నిజం లేదని, ఎన్ని సంచుల ఉప్పు కావాలంటే అన్ని సంచుల ఇస్తామని హోల్సెల్ వ్యాపారస్తులు ప్రకటించారు. అందరూ చెబుతుంటే... బాలమద్ది, కోడుమూరు ఉప్పు ధర పెరుగుతోందంటూ జనాలంతా అంగళ్లకు పరుగులు తీస్తున్నారు. ఎందుకైనా మంచిదని నేను కూడా రెండు సంచుల ఉప్పు ప్యాకెట్లను తీసుకెళుతున్నా. ధర పెరగదు: మల్లికార్జునశెట్టి, కార్యదర్శి, రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్, నంద్యాల ఉప్పుపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఉప్పు అపారంగా ఉంది. యథావి«ధిగానే దిగుమతి అవుతుంది. కేవలం నోట్ల కొరత వల్లనే కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా దృష్టికి రాలేదు: వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు తహశీల్దార్ కేజి ఉప్పును రూ. 50లకు కిరాణా వ్యాపారులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వ్యాపారులను సమావేశ పరచి ధరల అదుపునకు చర్యలు తీసుకుంటాం. -
ఊరికి ఉపకారి
ఉచితంగా ప్రజలకు పిండి పట్టిస్తున్న షేక్షావలీ శివపురం(కొత్తపల్లి): చిల్లర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజలకు తన వంతు చేయూతను అందించేందుకు ఓ జిన్ను నిర్వాహకుడు ముందుకు వచ్చారు. ఒక కుటుంబంలో మూడు పళ్ల జొన్నలు తీసుకుని వస్తే ఉచితంగా పిండి జిన్ను ఆడించి ఇస్తానని గ్రామంలో దండోరా వేయించారు. శివపురం గ్రామానికి చెందిన కొండపల్లి షేక్షావలీ పిండి జిన్ను నిర్వహిస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతోగ్రామస్తులు చిల్లర కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కొన్ని కుంటుంబాలు పస్తులు ఉండడం గమనించిన షేక్షావలీ.. గ్రామంలోని పేద, ధనిక తేడా లేకుండా అందరికీ తన పిండి జిన్నులో జొన్నలు పట్టించి ఉపకారం చేయడానికి ముందుకు వచ్చారు. గ్రామంలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. -
నోట్ల రద్దుతో పడిపోయిన కార్ల విక్రయాలు
-
ఇకపై గోదానాలు, సువర్ణదానాలు
అక్షర తూణీరం ఒకప్పుడు సంపదంటే భూరూపేణా, బంగారం లేదా గోవుల రూపేణా ఉండేది. తిరిగి ఆ రోజులు రావచ్చు. ఓ పని చేసిపెట్టినందుకు అధికారికి గోవుని ఇచ్చుకోవచ్చు. పెద్ద నోట్లు రద్దు! ఎక్కడ విన్నా ఇవే కబుర్లు. నోట్ల రద్దు ప్రకటన కొందరిపై పిడుగుపాటు ప్రభావాన్ని చూపింది. కొందరికి చల్లని జల్లుగా అనిపించింది. ప్రధాని మోదీ నిజంగా ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా నల్ల కుబేరులు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. డెబ్బై ఏళ్లలో మూడు తరాల నల్లకుబేరులు పుట్టి పెరిగారు. వాళ్లకి తెలియకుండా ప్రభుత్వం ఏనాడూ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈసారి కథ అడ్డం తిరిగింది. డబ్బు కట్టల మీద హాయిగా నిద్రపోతున్న వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉత్త పీడకలగా కాసేపు కలగన్నారు. కానీ సొంత సెల్ఫోన్లు నిజమేనని ధృవీకరించాక పాముల మీద పడుకున్నట్టనిపించింది. ఏమిటి వన్నీ, కనీసం పాత వార్తాపత్రికలన్నా కాదు. కనీసం తూకానికి వేస్తే పదో పరకో వచ్చేది. ఈ రంగురంగుల కాగితం ముక్క పల్లీల పోట్లాలకి కూడా పనికిరావు. అప్పటిదాకా ఖరీదైన గులాబీ రెక్కల మీద పొర్లుతున్న ట్టుంది. ఏ పూల పరిమళాన్ని తలుచు కుంటే ఆ తావి సోకింది. ఆ కరెన్సీ మహత్యం ఉన్నట్టుండి నిర్జీవమైపో యింది. జగద్గురువు శంకరాచార్యులవారు భజగోవిందంలో చెప్పినట్టు – ఎంతటి ఆత్మీయుడైనా శవమయ్యాక భయం వేస్తుంది. పాపం! అదే జరిగింది. మనకి స్వాతంత్య్రం రావడానికి కొద్ది ముందు కరెన్సీ చెల్లదని ఒక వదంతి వచ్చింది. బ్రిటిష్ వారెళ్లిపోతే, వారి బొమ్మలతో వచ్చిన కరెన్సీకి కాలం చెల్లుతుందన్నారు. అప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ గురించి పెద్దగా తెలియదు. అలాగే పిచ్చి కాగితాల్లాగే వాటిని రెండేళ్లపాటు చూశారు. కానీ అనుకున్నట్టు ఆ నోట్లు రద్దు కాలేదు. తర్వాతి కాలంలో రెండుసార్లు పెద్ద నోట్లని రద్దు చేశారు గాని అవి మరీ పెద్ద నోట్లు. అసలు ఒక స్థాయి పౌరులు వాటిని దర్శించే అవకాశం కూడా లేదు. అందువల్ల ఆ ప్రభావం సామాన్యుడిపై ఏ మాత్రం పడలేదు. ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాక అయిదువందల నోటుకి గొప్ప కీర్తి లేకుండా పోయింది. అసలు చాలాచోట్ల ఆ నోటిచ్చి సరుకు కొన్నాక తిరిగి చిల్లర రానే రాదు. కూరలు, పళ్లు, మందులు, పెట్రోలు ఇలాంటి నిత్యావసరాలు కొనేవేళ అది పెద్ద నోటు కానేకాదు. చాలా మంది బ్లాక్వీరులు రాత్రికి రాత్రి జీరోలయ్యారు. ఇప్పుడేం జరుగుతుంద న్నది సామాన్యుడి ప్రశ్న. అద్భుతాలేమీ జరగవు. పాత వాసన పోతుంది. కొత్త వాసన నిదానంగా ఆవరిస్తుంది. స్వార్థం అవినీతి నల్లధనానికి విత్తనాలు, ఎరువులు. దీనివల్ల దేశానికి ఎంతో కొంత మేలు జరిగేమాట వాస్తవం. లంచగొండితనం రూపుమాసిపోదు. ఇకపై బంగారు, వెండి కాయిన్స్ సమాంతర ఎకానమీని నడపచ్చు. ఒకప్పుడు సంప దంటే భూరూపేణా, బంగారం లేదా గోవుల రూపేణా ఉండేది. తిరిగి ఆ రోజులు రావచ్చు. ఓ పని చేసిపెట్టినందుకు అధికారికి గోవుని ఇచ్చుకోవచ్చు. లంచమా అంటే, శివశివా గోదానం అంటూ సెంటిమెంట్తో సరిపెట్టవచ్చు. గోదానమనగానే మోదీ కూడా సంతోషిస్తారు. ఈ అర్థరాత్రి నిర్ణయం వల్ల గొప్పవాళ్లు ఎందరు దారికొస్తారో తెలీదు గానీ, చాలామంది రైతులు దెబ్బతిన్నారు. అమరావతి రాకతో చుట్టుపక్కల జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రిజిస్ట్రేషన్ విలువకు చాలా రెట్ల ధర నడి చింది. బ్లాక్మనీ అని తెలియకుండానే రైతు గుమ్మంలోకి పెద్ద మొత్తంలో దిగింది. కొందరు వెంటనే స్థిరాస్తులు కొన్నా, కొందరు అటకల మీదే ఉంచారు. ప్రభుత్వం, ఆర్థిక మేధావులు అప్పుడే రైతులకు తగు సూచనలు చేసి ఉండాల్సింది. రైతులను నల్లకుబేరుల జాబితాలో చేర్చకూడదు. వీరికేదైనా దారి చూపాలి. పన్ను వసూలు చేసి వారి డబ్బును వదిలెయ్యచ్చు. నిజంగానే స్వచ్ఛభారత్లో తుక్కునోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. కొత్త నోట్లు త్రివర్ణ పతాకాల్లా రెపరెపలాడుతున్నాయి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
'చిల్లర' చిక్కులు
* పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడికి తప్పని తిప్పలు * పాల ప్యాకెట్ల కొనుగోలుతో కష్టాలు మొదలు * ప్రభుత్వ సంస్థల్లోనూ రూ.500, రూ. 1000 నోట్ల తిరస్కరణ * భారీగా తగ్గిన ఆదాయం * బోసిపోయిన దుకాణాలు.. సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో/సాక్షి, గుంటూరు : సామాన్యుడికి చిల్లర చిక్కులు బుధవారం ఉదయం నుంచే మొదలయ్యాయి. పాల ప్యాకెట్లు కొనడం, టీస్టాల్స్ వద్ద తేనీరు తాగడానికి రూ. 500 నోటు మార్చడానికి చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. హోటళ్లు, కూరగాయల దుకాణాలు, పచారీ షాపులు, బార్బర్ షాపులు.. ఎక్కడా రూ. 500, రూ. 1000 నోట్లను అంగీకరించకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించింది. శుక్రవారం నుంచి బ్యాంకులు పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వడంతో కొంతలో కొంత ఊరట లభించనుంది. హోల్సేల్ మార్కెట్లదీ ఇదే దారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హోల్సేల్ మార్కెట్లలోనూ పెద్ద నోట్ల రద్దు కష్టాలు స్పష్టంగా కనిపించాయి. అన్ని రకాల హోల్సేల్ మార్కెట్లలోని వ్యాపారులు రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. రూ. 100 నోట్లు ఉన్నవారు నిత్యావసరాల కొనుగోలు, అత్యవసర ఖర్చులకు మాత్రమే ఉంచుకోవడంతో వ్యాపారాల జోరు తగ్గిందని వ్యాపారులు చెప్పారు. హోల్సేల్ మార్కెట్లకు వచ్చిన వినియోగదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం.. ప్రహసనం.. ప్రయాణం అందరికీ అత్యవసరం కిందే లెక్క. పెద్ద నోట్లను నమ్ముకుని ఆర్టీసీ బస్సులు ఎక్కినవారికి నిరాశే ఎదురైంది. ప్రజా రవాణా బస్సుల్లో పెద్ద నోట్లు చెల్లుబాటవుతాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోవడానికి కండక్టర్లు నిరాకరించారు. గట్టిగా ఒత్తిడి చేసినవారికి పెద్ద నోట్లను తీసుకుని టికెట్లు ఇచ్చారు. వారి వద్ద చిల్లర లేకపోవడంతో ముగ్గురు నలుగురికి కలిపి రూ. 500 నోటు ఇచ్చి.. చిల్లర పంచుకోండన్నారు. ఆర్టీసీలో మంగళవారం రాత్రి వరకు వచ్చిన చిన్న నోట్లను అధికారులు దారిమళ్లించారు. బుధవారం ఉదయం తమకు చిల్లర అప్పగించి ఉంటే.. ప్రయాణంలో కష్టాలు తప్పేవని కొందరు కండక్టర్లు చెప్పారు. రైల్వే కౌంటర్లలో ఘర్షణ రైల్వే కౌంటర్లలో పెద్ద నోట్లు తీసుకోవడానికి సిబ్బంది సిద్ధపడినా.. ప్రయాణికులకు చిల్లర సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం చెప్పినా పెద్ద నోట్లు ఎందుకు తీసుకోరంటూ విజయవాడ రైల్వే కౌంటర్లలో గొడవపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు కౌంటర్లలో ఇలాంటి సమస్యలే తలెత్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వెలవెలపోయిన మాల్స్.. పెద్ద నోట్లు తీసుకోవడానికి పలు షాపింగ్ మాల్స్ ముందుకు వచ్చినా.. పెద్దగా వ్యాపారం సాగలేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల మీద వ్యాపారం కూడా సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా జరిగిందని వ్యాపారులు చెప్పారు. కస్టమర్లు పెద్దగా రాకపోవడంతో జంటనగరాల్లో పలు మాల్స్ వెలవెలపోయాయి. సినిమా హాళ్లు కూడా బోసిపోయాయి. వన్నె తగ్గిన బంగారం.. బంగారం ధర పెరగడం, పెద్ద నోట్ల రద్దు.. వెరసి బంగారు ఆభరణాల కొనుగోళ్లు బుధవారం మందగించాయి. బంగారం వర్తకంలో పన్నులు చెల్లించకుండా చేసే ‘జీరో’ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచే బంగారం దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. ఎయిర్పోర్ట్లోనూ అదే తీరు.. గన్నవరం విమానాశ్రయంలో వాటర్ బాటిళ్లు, స్నాక్స్ విక్రయించే దుకాణదారులు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం (ఆన్బోర్డ్)లోనూ ప్రయాణికులకు స్నాక్స్ విక్రయిస్తారు. కానీ పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పదుల సంఖ్యలో టికెట్లు కొనడానికి బుధవారం ఉదయం పలువురు విమానాశ్రయం కౌంటర్లకు వచ్చారు. ఇద్దరికి టికెట్లు విక్రయించిన తర్వాత పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించారు. ఆన్లైన్లో కొనుక్కోవాలని సూచించారు. పెట్రోల్ పంపుల్లోనూ చిల్లర ఇవ్వలేదు.. పెట్రోల్ పంపుల్లో పెద్ద నోట్లు అంగీకరించారు. కానీ రూ. 500 నోటు ఇస్తే ఆ మొత్తానికి ఇంధనం పోయించుకోవాలని సిబ్బంది తెగేసి చెప్పడం పలుచోట్ల కనిపించింది. కొన్ని చోట్ల కస్టమర్లు వాగ్వాదానికి దిగారు. ఇక టోల్గేట్ల వద్ద పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించడం, కొన్నిచోట్ల తీసుకున్నా.. చిల్లర సమకూర్చడంలో జాప్యం జరగడంతో కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొనే తాత్కాలికంగా టోల్ రుసుము వసూలును కేంద్రం రద్దు చేసింది. కాజ టోల్గేట్ వద్ద సాయంత్రం నుంచి వసూళ్లు నిలిపివేశారు. ఇదే అదనుగా భావించిన మద్యం దుకాణాల యజమానులు మందుబాబుల వ్యసనాన్ని ఆసరాగా తీసుకుని రూ. 500 నోటు ఇస్తే రూ. 350కు మాత్రమే మద్యం ఇస్తూ అడ్డంగా దోచుకున్నారు. నీరసించిన రిజిస్ట్రేషన్లు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోజూ సరాసరి 1200–1300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. బుధవారం దశమి కావడంతో మంచిరోజుగా భావించి సరాసరి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికార వర్గాలు భావించాయి. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా 15 శాతానికి పడిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్, రవాణా, మున్సిపల్ శాఖ కార్యాలయాల్లో బిల్లులు, రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించేందుకు వెళ్లినవారి వద్ద పెద్ద నోట్లు తీసుకోలేదు. రవాణా శాఖలో నాలుగో వంతు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రోజుకు రూ. 50 లక్షల పన్ను వసూళ్లవుతుంటాయి. బుధవారం రూ. 18.08 లక్షలు మాత్రమే వసూలైంది. గుంటూరు కార్పొరేషన్లో రోజుకు రూ. 12 లక్షలు వసూలయ్యే పన్ను రూ. 27వేలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. రోజుకు రూ. 60 లక్షలు వసూలయ్యే విద్యుత్ బిల్లులు రూ. 37 లక్షలకు పడిపోయాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.. బస్స్టేçÙన్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకుల వద్ద చిల్లర లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం బ్యాంకులు పనిచేయనుండడంతో బ్యాంకర్లతో మాట్లాడి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించడం, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. టోకెన్ సిస్టమ్ ద్వారా‡ డిపాజిట్లు, చెల్లింపులు చేయించేలా చూడాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. -
మోదీ నిర్ణయంపై ‘బాబు’ బడాయి
రావులపాలెం : నల్లధనం అరికట్టేందుకు రూ.500 రూ.వెయ్యి నోట్ల రద్దు చేస్తే అదంతా తాను రాసిన లేఖ వల్ల నే జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. అంత పలుకుబడి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని హితవుపలికారు. రావులపాలెం వైఎస్సార్ పీపీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ సంచలనం జరిగిన అది తన వల్లే జరిగిందని చెప్పుకునే నాయకుల్లో చంద్రబాబు ప్రథమ నాయకుడన్నారు. ముందుగా తెలిసే పెద్ద నోట్లపై చంద్రబాబు జాగ్రత్తపడి ప్రధాని లేఖ రాసారేమోనని అనుమానం కలుగుతుందన్నారు. నల్ల్లధనం అరికట్టే చర్యలకు వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. నల్లధనంతో కుబేర్లుగా మారిపై గురిపెట్టే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే జిల్లాలో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి గ్రామగ్రామాన అపూర్వ ఆదరణ లభిస్తుందని కన్నబాబు అన్నారు. ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబు ఒక ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చేస్థాయికి రాజకీయాలు దిగజారడం చూసి భయపడి మోదీ ఈ నోట్లను రద్దు చేసి ఉంటారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగితే జనం నిలదీస్తారనే భయంతో మోటారు సైకిళ్ళపై పారిపోయే జన చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, కలవచర్ల సర్పంచ్ గానుగుల కృష్ణార్జున రావు, తదితరులు పూల మాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్?ర నాగిరెడ్డి, జిల్లా పారిశ్రామిక విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు, ఎంపీటీసీలు జవ్వాది రవిబాబు, కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, మండల కన్వీనర్లు దొమ్మే టి అర్జునరావు, తమ్మన శ్రీను, నందం సూరిబాబు, కోనాల రాజు పాల్గొన్నారు. -
500 ‘నో’ట్లు.. 1000 పాట్లు
బిజినెస్.. ఖల్లాస్! – 20 నుంచి 30 శాతానికి పడిపోయిన వ్యాపారాలు – మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు బంద్.. రైతుల ఆందోళన – హైవేపై ట్రాఫిక్ జామ్.. టోల్ ఎత్తేయడంతో సాఫీగా రవాణా – రవాణా, వాణిజ్య పన్నులశాఖ చెక్పోస్టుల్లో నిలిచిపోయిన చెల్లింపులు – రిజిస్ట్రేషన్శాఖలో భారీగా తగ్గిన లావాదేవీలు – చిల్లర ఇవ్వలేక చేతులెత్తేసిన కండక్టర్లు – వెలవెలబోయిన సినిమా థియేటర్లు.. దుకాణాలు పాలు కొనుగోలు చేయాలన్నా చిల్లర దొరకదు. కూరగాయలకు వెళ్దామంటే అక్కడా ఇదే సమస్య. పెట్రోలు బంక్ల వద్దకు వెళితే.. రూ.500 మొత్తానికి అయితేనే అనే సమాధానం. సరుకులు కొందామంటే.. రూ.100 నోట్లు ఉంటేనే బేరం అంటున్నారు. బంగారు షాపులు.. బట్టల దుకాణాలు.. సినిమా థియేటర్లు అన్నీ వెలవెలబోగా.. పెద్ద నోట్ల రద్దు కలకలం జిల్లాను కుదిపేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఎక్కడ చూసినా పెద్ద నోట్ల చర్చే. తమ వద్దనున్న ఈ నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలోననే విషయంలోనే తర్జనభర్జనలు. అత్యవసరంగా చిల్లర కోసం కాళ్లు కాలిన పిల్లుల్లా జనం చక్కర్లు కొట్టడం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే సమస్య. దైనందిన జీవితంలో సామన్య, మధ్య తరగతి ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. వినియోగదారులు లేక షాపులన్నీ బోసిపోయాయి. కరెంటు, టెలిఫోన్ బిల్లుల చెల్లింపులకూ ఆటంకాలు ఎదురయ్యాయి. మరోవైపు టోల్గేట్ల వద్ద చిల్లర లేక వాహనదారులు రహదారిపైనే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో హైవే మొత్తం ట్రాఫిక్జామ్తో స్తంభించిపోయింది. శుక్రవారం వరకూ టోల్ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు సాయంత్రం ప్రకటన రావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సగటున రోజుకు 700 వరకూ లావాదేవీలు జరిగేవి. అయితే, నోట్ల రద్దుతో ఈ సంఖ్య కాస్తా 190కి పడిపోయాయి. థియేటర్లదీ అదే దుస్థితి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో రోజుకు సగటున రూ.100 కోట్ల లావాదేవీలు జరగాల్సి ఉండగా.. ఈ సంఖ్య కాస్తా రూ.20 నుంచి రూ.30 కోట్లకు పరిమితమైపోయింది. అయితే, నోట్ల రద్దు పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కొంచెం చిల్లర తీసుకునే ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దుతో వివిధ వర్గాల ప్రజల ఇక్కట్లు ఇవీ.. – మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్కు ఉల్లిగడ్డలు తెచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే మద్దతు ధర లేక కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులకు... కొనుగోళ్లు లేకపోవడం మరింత శరాఘాతంగా మారింది. హైవేలపై ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు తమకు రూ.100 నోట్లలో చెల్లింపులు చేస్తేనే లారీలు తీస్తామని యాజమాన్యాలు పేర్కొనడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. – మందుబాబులకూ నోటు రద్దు తిప్పలు తప్పలేదు. రూ.500, రూ.1000 నోట్లకు మద్యం ఇచ్చేది లేదని మద్యం షాపు యాజమాన్యాలు స్పష్టం చేశాయి. మరికొన్ని షాపుల యజమానులు మాత్రం పెద్ద నోట్లను తీసుకుని మందును సరఫరా చేశారు. – థియేటర్లో జనాలు లేక బోసిపోయాయి. ఇక థియేటర్లోని షాపులదీ అదే పరిస్థితి. రోజుకు సగటున (షోకు రూ.30 వేల చొప్పున) లక్షా 20 వేల చొప్పున జరిగే బిజినెస్ కాస్తా షోకు రూ.10 వేల చొప్పున రూ.40 వేలకు పరిమితమయ్యిందని థియేటర్ల యాజమాన్యాలు వాపోతున్నారు. – పెట్రోలు బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే.. అంతే మొత్తానికైతేనే పెట్రోలు/డీజిల్ పోస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో ఇచ్చిన పెద్ద నోటు మొత్తానికీ తప్పనిసరి పరిస్థితులల్లో పెట్రోలు/డీజిల్ను వాహనదారులు పోయించుకున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. – బంగారు షాపులు, షాపింగ్ మాల్స్ల్లో కూడా వ్యాపారం లేక వెలవెలబోయాయి. సెల్ఫోన్ల విక్రయాలు కూడా గణనీయంగా పడిపోయాయి. – ఆర్టీసీ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు తీసుకుంటున్నప్పటికీ అంత పెద్ద నోట్లకు చిల్లర ఇవ్వలేక ఆర్టీసీ, రైల్వే అధికారులు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. – రవాణా, వాణిజ్యపన్నులశాఖ చెక్పోస్టులల్లో కూడా పన్ను చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.500, రూ.1000 నోట్లను తీసుకోవ్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో చెల్లింపులన్నీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో చేయాలని ఆయా శాఖల అధికారులు తేల్చి చెప్పారు. ఫలితంగా రవాణా శాఖ చెక్పోస్టు ఆదాయం కాస్తా రూ.2.5 లక్షల నుంచి రూ.60 వేలకు పడిపోయింది. అన్ని బ్యాంకులకూ చేరని డబ్బు కొత్త నోట్లను బ్యాంకులకు పంపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో కేవలం ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకులకు మాత్రమే కొత్త నోట్లు వచ్చాయి. అది కూడా కేవలం రూ.2 వేల నోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. దీంతో గురువారం బ్యాంకులు తెరచినప్పటికీ ఈ రెందు బ్యాంకుల వద్ద భారీగా రద్దీ ఉండనుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ద్వారా బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక పోస్టాఫీసులకూ ప్రత్యేకంగా కొత్త నోట్లను సరఫరా చేయలేదు. వీరు కూడా బ్యాంకుల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిందేనని తెలిసింది. సమయం ఇస్తే బాగుండేది...! వాస్తవానికి నోట్ల రద్దు నిర్ణయం పట్ల సాధారణ ప్రజలతో పాటు మేధావులు, మధ్యతరగతి ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రోజువారీ అవసరాలకు చిల్లర తీసుకునే ఏర్పాట్లను చేసిన తర్వాత నోట్లను రద్దు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ నోట్లను రద్దు చేసినప్పటికీ పరిమిత మొత్తంలోనైనా చిల్లర ఇచ్చే ఏర్పాట్లను బ్యాంకుల ద్వారా కేంద్రం చేసి ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేదనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా రోజువారీగా వినియోగించే పాలు, కూరగాయలు, పెట్రోలు, మందులు, ఇంట్లో వంటింటి సరుకుల వరకైనా చిల్లర మార్పిడికి అవకాశం కల్పించి ఉండాల్సిందని పేర్కొంటున్నారు. మరోవైపు త్వరలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారి ఇబ్బందులు వర్ణనాతీతం. కనీసం బట్టలు, బంగారం కొనేందుకూ అవకాశం లేకపోవడంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోజువారీ నగదు విత్ డ్రాయిల్స్పై పరిమితి ఉండటంతో వారం రోజుల్లో కూడా బట్టలు, బంగారం కొనే వెసులుబాటు లేదని వాపోతున్నారు. -
పెద్ద నోట్లు రద్దు..
-
అనంతపల్లి హెచ్ఎం సస్పెండ్
ఏలూరు సిటీ/నల్లజర్ల : నల్లజర్ల మండలం అనంతపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.గంగరాజును డీఈవో డి.మధుసూదనరావు సస్పెండ్ చేశారు. మంగళవారం పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ఎం గంగరాజు ఎంఈవో అనుమతి లేకుండా అనధికారికంగా సెలవు పెట్టడాన్ని గుర్తించారు. ఖాళీ కాగితంపై సంతకం చేసిన గంగరాజు సెలవుపై వెళ్లారు. అయితే డీఈవో రావటాన్ని గమనించిన ఉపాధ్యాయులు సెలవు దరఖాస్తు చేసినట్టుగా చూపించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం నిల్వలు, రిజిష్టర్లో పేర్కొన్న రికార్డులు వేర్వేరుగా ఉండడాన్ని గుర్తించి సస్పెండ్ చేశారు. డైరీ రాయడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల నోట్స్ను సరిచూడలేదన్న కారణాలతో ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. -
నకిలీ నోటు కలకలం
చిలుకూరు: చిలుకూరులో నకిలీ రూ. 500 నోట్లు మంగళవారం కలకలం సృష్టించింది. పెట్రోల్ బంక్లో ఈ నకిలీ నోట్లు వచ్చినట్లుగా పలువురు తెలిపారు. రూ. 500 నోట్లు చెల్లకపోడంతో బ్యాంక్కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారులు వాటిని న కిలీ నోట్లుగా గుర్తించినట్లుగా తెలిపారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేసి ఈ నకిలీ నోట్లు వ్యవహారం భయటపెట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. -
రంగులు మార్చే హైటెక్ పెన్
న్యూయార్క్: నోట్స్ రాసేటప్పుడు కానీ పెయింటింగ్ వేసేటప్పుడు గానీ వేర్వేరు రంగుల కోసం పదే పదే పెన్నులను మార్చాల్సి వస్తుంది. పెయింటింగ్ వేసేటప్పుడైతే సరిగ్గా సరిపోయే రంగు ఉన్న పెన్ను ఒక్కోసారి మనకు దొరకదు కూడా. ఇక బ్రష్తో వేసేవారికైతే కలర్ మిక్సింగ్ ఓ పెద్ద సమస్య. ఇలాంటప్పుడే ఎంతో చిరాకు వస్తుంది కూడా. దీంతో ఇటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు వస్తోంది హైటెక్ పెన్. మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మన ముందుకొచ్చేసింది. ఈ పెన్ను ప్రకృతిలో కనిపించే పండ్లు, పూలు, ఆకులు ఇలా ఏ వస్తువు ముందు ఉంచినా క్షణాల్లో ఆ వస్తువు తాలూకు రంగును స్కానింగ్ చేసుకొని, ఆ రంగులోకి మారిపోతుంది. ఈ ఒక్క పెన్ను మీ దగ్గరుంటే ఇక మీరు రంగులను మిక్సింగ్ చేసుకోకుండానే అద్భుతమైన చిత్రాలను గీయవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ ఇది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేసిన ఈ పెన్ను పెయింటింగ్లో అద్భుతాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. -
పైసాలోనే పరమాత్మ!
బడ్జెట్ అంటే అంతా డబ్బుతో పని. ఇప్పుడంటే అంతా నోట్లలోనే నడుస్తోంది గానీ.. గతంలో అన్నీ నాణేలే. మరి దేశంలోని మొదటి నాణెం నుంచి మనం స్వర్ణయుగమని చెప్పుకునే గుప్తుల నుంచి విజయనగర రాజుల వరకూ, అటు మొగలుల నుంచి ఇటు హైదరాబాద్ నిజాం కాలం వరకూ నాణేలు ఎలా ఉండేవి.. ఇదిగో ఇలా ఉండేవి. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
'నా ఎదుటే మా అమ్మాయిపై దాడికి దిగాడు'
* నోట్స్ విషయంలో.. * విద్యార్థినికి ఫిట్స్.. ఆస్పత్రికి తరలింపు ఆత్మకూరు/ఎంజీఎం: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఒగ్లాపూర్లోని కేర్ ఫార్మసీ కళాశాల లో సోమవారం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కళాశాలలో ఖమ్మం జిల్లాకు చెందిన కాసర్ల వేదశ్రీ హన్మకొండలో తల్లితో ఉంటూ ఫార్మాడీ మూడో సంవత్సరం చదువుతోంది. మనీషా, దొంతి వంశీకృష్ణ కూడా నగరంలో ఉంటూ ఇదే కళాశాలలో చదువుతున్నారు. మూడురోజుల క్రితం వేదశ్రీ, మనీషాకు నోట్స్ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయంలో మనీషాకు వంశీకృష్ణ మద్దతు పలికి వేదశ్రీతో గొడవపడ్డాడు. ఈ విషయం పెద్దల వరకు చేరడంతో ఇరువర్గాల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చారు. వేదశ్రీ తల్లి, వంశీకృష్ణ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వేదశ్రీపై వంశీకృష్ణ చేయి చేసుకోవడంతో ఆమెకు ఫిట్స్ వచ్చి పడిపోయింది. దీంతో ఆమెను కళాశాల వాహనంలో ఎంజీఎంకు తరలించారు. నోట్స్ విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన విషయం వాస్తవమేనని కళాశాల ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. ఏసీపీ జనార్దన్రెడ్డి, సీఐ మదన్లాల్ వేదశ్రీ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అయితే, ఈ ఘటనపై వేదశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గొంతు నులిమి దాడికి పాల్పడ్డాడు... ‘మా అమ్మాయి వేదశ్రీని.. వంశీ అనే అబ్బాయి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కళాశాలకు వచ్చాం. వంశీకి మరో అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇందులో మా అమ్మాయిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా ఎదుటే మా అమ్మాయిపై వంశీ దాడికి దిగాడు. గొంతునులిమి తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగాడు. వెంటనే మా అమ్మాయిని ఎంజీఎంకు తీసుకువచ్చాం.’ అని వేదశ్రీ తల్లి విలేకరులకు తెలిపారు. -
ప్యూహాలు రచిస్తున్న కేసిఆర్