Putin
-
ట్రంప్తో చర్చలకు పుతిన్ రెడీ: రష్యా
మాస్కో: డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. -
కుదిరితే కప్పు టీ
మాస్కో: భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధానమంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచదేశాల అధినేతల్లో తనకున్న కొద్ది మంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరని అన్నారు.పుతిన్ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తేనీరు సేవిస్తూ ఏ దేశ అధినేతతో సంభాషించాలని మీరు కోరుకుంటారు? అని ప్రశ్నించగా, భారత ప్రధాని మోదీతోపాటు జర్మనీ మాజీ చాన్స్లర్ హెల్ముత్ కోల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్విస్ చిరక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, చైనా అధినేత షీ జిన్పింగ్తో మాట్లాడడం ఇష్టమని, వారంతా తనకు మంచి స్నేహితులని స్పష్టంచేశారు. కుదిరితే వారితో టీ సేవిస్తూ సంభాషించడానికి ఇష్టపడతానని వెల్లడించారు.బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని పుతిన్ తేల్చిచెప్పారు. తమ కూటమి దేశాల ప్రయోజనాల కోసం తప్ప ఇతర దేశాలకు వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, పుతిన్ వచ్చే ఏడాది మొదట్లో భారత్లో పర్యటించబోతున్నారు. ప్రతిఏటా కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని పుతిన్, మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. -
మీరు రష్యాలో ఉంటేనే సేఫ్ అనుకుంటా సార్!
-
అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.ఉక్రెయిన్కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేశారు.ఇది కూడా చదవండి: నైజీరియన్ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్ -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
ట్రంప్తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్ను అభినందించారు. ట్రంప్ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్హౌస్లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్తో మాట్లాడు తూ.. పుతిన్తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.కాగా కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ప్రధాని మోదీ, జిన్పింగ్ చర్చలు
కజన్: బ్రిక్స్ సమావేశాల సైడ్లైన్స్లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో రష్యాలో బుధవారం(అక్టోబర్ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్పింగ్,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం -
పుతిన్తో ప్రధాని మోదీ భేటీ
మాస్కో:పదహారవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ సమావేశమై చర్చలు జరిపారు.ఈ పర్యటనలో చైనా అధ్యకక్షుడు జిన్పింగ్తోనూ ప్రధాని సమావేశమవనున్నారు. 22,23 తేదీల్లో జరిగే బబ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకుగాను ప్రధాని మంగళవారం రష్యాలోని కజన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింంది. కాగా, మూడు నెలల వ్యవధిలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సు.. రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం -
పుతిన్తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
పుతిన్పై ప్రశ్న.. రిపోర్టర్పై బైడెన్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13) వైట్హౌస్లో బైడెన్, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రీఫింగ్ ఇస్తుండగా స్కై న్యూస్ మీడియా ప్రతినిధి ఒకరు బైడెన్ను ప్రశ్నించారు.రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించే విషయంలో పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇవ్వడాన్ని రిపోర్టర్ ప్రస్తావించారు. దీనికి బైడెన్ స్పందిస్తూ నేను మాట్లాడే వరకు మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది.ముందు నన్నుపూర్తిగా చెప్పనివ్వండని రిపోర్టర్పై మండిపడ్డారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్ను తిరిగి ప్రశ్నించారు.తాను పుతిన్ గురించి అసలు ఆలోచించనని,ఉక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ గెలిచే ఛాన్సే లేదని బైడెన్ సమానధానమిచ్చారు.ఉక్రెయిన్కు సాయం చేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణుల వినియోగించడంపై అమెరికాకు కొత్త విధానమేమీ లేదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. -
పుతిన్ ఆకస్మిక చర్చల ప్రతిపాదన
ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.జెలెన్స్కీ గత జూన్లో స్విట్జర్లాండ్లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్స్క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్స్క్కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్స్క్పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది. వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే. పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు. అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది. ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది. అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్స్క్పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్స్క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్స్క్ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా యుద్ధం ఆగాలంటే అదొక్కటే మార్గం: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు. Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024 ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఏఐ ప్యాషన్ షో.. ప్రముఖుల ర్యాంప్ వాక్! (ఫొటోలు)
-
దేశాధినేతల స్నేహ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్ల మేర జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు!నిన్నగాక మొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా వెళ్ళినప్పుడు, రష్యా ప్రెసిడెంటు పుతిన్ అన్న మాటలు ఇవి: ‘‘నా ప్రియాతి ప్రియమైన స్నేహితుణ్ణి కలిసినందుకు ఎంతో సంతోషంగా వుంది.’’‘‘ఇచ్చానమ్మా వాయినం, పుచ్చుకున్నానమ్మా వాయినం’’ అన్నట్టు, పుతిన్ గురించి మోదీ కూడా ఏదో అనాలి కదా? ఆ మాటలు ఇవి: ‘‘నా ప్రియమిత్రుడు పుతిన్, రష్యా–భారత్ల మధ్య స్నేహాన్ని శిఖరాగ్రాలకు తీసికెళ్ళాడు’’అని! ఇద్దరూ కలవగానే భారత ప్రధాని, తన ప్రత్యేకమైన అలవాటు ప్రకారం, ఆ ప్రియ మిత్రుణ్ణి ‘ఆత్మీయ ఆలింగనం’ చేసుకున్న దృశ్యాలు అందరూ చూసే వుంటారు. అంతేనా? పుతిన్, మోదీని, తన గుర్రపు శాలకి తీసికెళ్ళడం, అక్కడ వాళ్ళిద్దరూ చెరో గుర్రానికీ ఏదో తినిపిస్తూ, ముద్దు చెయ్యడం! ఇంతేనా! బుజ్జి కారులో మోదీని ఎక్కించుకుని, పుతినే ఆ బుజ్జిని స్వయంగా నడుపుతూ, తన పెద్ద ఎస్టేట్లో విలాసంగా తిప్పడం! ఆ ప్రియ స్నేహితులిద్దరికీ అంతా సరదాగా జరిగిపోయింది. ఈ రెండు దేశాల అగ్రనేతలూ ఎందుకు కలిశారంటారు? ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్లది (సుమారు 542 లక్షల కోట్ల రూపాయలది) జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! ఈ భారీ వర్తకం వల్ల వచ్చిన మొత్తంలో, భారత దేశానికి వచ్చింది, దాదాపు 20 శాతమేనట! రష్యాకి 80 శాతం! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. రెండు దేశాల అధినేతలు కలిసినప్పుడు, ఏమేమి మాట్లాడుకునేదీ, ఏ రకం ఒప్పందాలు చేసుకునేదీ, అన్నీ క్షుణ్ణంగా అంతకు ముందే, రెండు దేశాల మంత్రులూ, అధికారులూ, సిద్ధం చేసి వుంచుతారు. మోదీకి ఎర్ర తివాచీలూ, సైనిక వందనాలూ, విందు భోజనాలూ, వగైరాలు అయ్యాక, దేశాధినేతలు సరుకుల గురించి అధికారికంగా, లాంఛనంగా, కాసేపు ముచ్చటించుకుంటారు.వర్తకంలో, ఎగుమతులుగా, దిగుమతులుగా, ఇటూ అటూ తిరిగిన ఆ సరుకుల తయారీదారులు, ఆ రెండు దేశాల కార్మికులే! కార్మికుల యజమానులు, ఆ దేశాల పెట్టుబడిదారులు! కొన్ని సరుకులు ప్రభుత్వ రంగ సంస్థలలో తయారైనవైతే, ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులే!ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అనే 1848 నాటి రచనలో, మార్క్స్, ఎంగెల్సులు చెప్పినట్టు: ‘‘ఆధునిక రాజ్యంలో, ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్) అనేది, మొత్తం బూర్జువా వర్గపు సమష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ మాత్రమే!’’ మైకెల్ పెరెంటీ అనే ఒక అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అయితే, మార్క్స్, ఎంగెల్సులకన్నా ఒక అడుగు ముందుకు వేసి, అనేక ఆధారాలు చూపుతూ, ‘‘కొద్దిమందికే ప్రజాస్వామ్యం’’ అనే తన పుస్తకంలో, ‘ప్రెసిడెంట్’ అనే దేశాధినేత గురించి, మామూలు మాటల్లో చెప్పాలంటే, ‘సరుకులు అమ్మేవాడు’ (‘‘సేల్సుమాన్ ఆఫ్ ది సిస్టం’’) అంటాడు!అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు! తమ దేశాల్లో వున్న అత్యున్నత బిరుదుల్ని ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కూడా! అదే జరిగింది నిన్న! పాతకాలపు రష్యాలో, ‘సనాతన చర్చి’ని (‘ఆర్తొడాక్స్ చర్చ్’) స్థాపించిన మత బోధకుడైన ‘సెయింటు ఆండ్రూ’ పేరుతో వున్న ‘అత్యున్నత బిరుదు’గా ఆ దేశం కీర్తించే బిరుదుని మోదీకి, పుతిన్ ఇచ్చి సత్కరించాడు. ఈ బిరుదుని జారు చక్రవర్తి 1698లో ప్రవేశ పెట్టాడు. దీనిని 1917లో, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవం జరిగాక, 1918లో రద్దు చేశారు. 1998లో, ‘ఎల్త్సిన్’ అనే మాజీ కామ్రేడు తిరిగి దానిని ప్రవేశపెట్టాడు. ఈ కామ్రేడే 1991లో ‘సోవియట్ కమ్యూనిస్టు పార్టీ’ని రద్దు చేసినవాడు! అదే సంవత్సరం సోవియట్ యూనియన్ని కూడా రద్దు చేశాడు!భారతదేశపు సనాతన మతాభిమానుల్లో అగ్రగణ్యుడైన వ్యక్తికి, ఆ దేశ సనాతన మత బోధకుడి పేరన వున్న బిరుదు దొరికింది! ఎంత సముచిత సత్కారం! మోదీ రష్యా పర్యటనలో, కొసమెరుపు అనదగ్గ సంగతి ఒకటి వుంది. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెనిస్కీ, మోదీ రష్యాలో పర్యటించడాన్ని ఇలా తప్పుపట్టాడు: ‘‘ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత, మాస్కోలో, రక్త పిపాసిని (పుతిన్ని) కావలించుకోవడం నిరాశాజనకం’’ అని! ఈ జెలెనిస్కీని కూడా, ఈ మోదీయే, నిన్న పుతిన్ని కావిలించుకున్నట్టే, మొన్న, అంటే, ఆ మధ్య, ఇటలీలో గట్టిగా కావిలించుకున్నాడు! ఈ కావిలింతలు మోదీకి రాజకీయ వెన్నతో పెట్టిన విద్య!ఉక్రెయిన్లో పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి, అనేక మంది చచ్చిపోయిన కొన్ని గంటల తర్వాత, మోదీ రష్యానేల మీద అడుగు పెట్టాడు. ఆ వార్త విమానం దిగుతూ విన్నాడేమో! తర్వాత, మొక్కుబడిగా పుతిన్తో అన్నమాటలు: ‘‘యుద్ధం పరిష్కారం కాదు. మానవుల ప్రాణాలు అమూల్యం, అమాయక పిల్లల మరణాలు చూస్తే, హృదయం ద్రవిస్తుంది!’’ అబ్బా! ఎంత సున్నిత హృదయం! ఈ మాటలు మోదీ అంటున్నప్పుడు, పుతిన్ బెల్లం కొట్టిన రాయిలాగా ముభావంగా వుండిపోయాడు! ‘ఈ రకం మొక్కుబడి మాటలు అన్ని దేశాల అధినేతలకీ మామూలేలే’ అన్నట్టు!మరి, ఏ సమస్యకీ యుద్ధం పరిష్కారం కాదని, మోదీ భావించినప్పుడు, రష్యా నించీ, అమెరికా నించీ, ఫ్రాన్స్ నించీ, ఇజ్రాయిల్ నించీ కుప్పలు కుప్పలుగా, లక్షల కోట్ల ఖర్చుతో మారణాయుధాలు ఎందుకు కొన్నట్టు? పైగా, ఉక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండిస్తూ, ఐక్య రాజ్య సమితిలో కొన్ని దేశాలు తీర్మానాలు చేసినప్పుడు, మోదీ ప్రభుత్వం ఓటింగులో పాల్గొననే లేదు! దీన్ని ఏమనాలి? ‘యుద్ధం వద్దు! అది పరిష్కారం కాదు!’ అనే నీతి వచనాలా! దురాక్రమణ యుద్ధం చేస్తున్న దేశపు ప్రభుత్వం ఇచ్చే ఆ దేశపు ‘అత్యున్నత’ బిరుదుని మోదీ, ఏ శాంతి నీతితో తీసుకున్నట్టు? ఈ రెండు దేశాధినేతల స్నేహ రహస్యం తెలిసిందా? - వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి- రంగనాయకమ్మ -
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
యుద్ధం వద్దు..!
-
గుర్రపుశాలలో మోదీ, పుతిన్
మాస్కో: రష్యాలో ప్రధాని మోదీ టూర్ రెండోరోజు కొనసాగుతోంది. మంగళవారం(జులై 9) ఉదయం రష్యా అధ్యకక్షుడు పుతిన్, మోదీలు కలిసి పుతిన్ అధికారిక నివాసం నొవో ఒగర్యోవ్లో గార్డెన్లో టీ సేవించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై అనధికారికంగా చర్చించుకున్నారు. అనంతరం గార్డెన్లో ఇద్దరు కలిసి కొద్దిసేపు నడిచారు. అక్కడే ఉన్న గుర్రాలశాలను సందర్శించి గుర్రాలను చేతితో నిమిరి పలకరించారు. మంగళవారం పుతిన్, మోదీ మధ్య శిఖరాగ్ర సదస్సులో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో మాస్కో చేరున్నారు. అనంతరం అధ్యక్షుడు పుతిన్ నివాసంలో ఇచ్చిన విందు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రజల కోసం మోదీ చేస్తున్న కృషిని పుతిన్ కొనియాడారు. -
రష్యా టూర్కు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన కోసం సోమవారం(జులై 8) ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మూడు రోజుల పాటు రెండు దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. Over the next three days, will be in Russia and Austria. These visits will be a wonderful opportunity to deepen ties with these nations, with whom India has time tested friendship. I also look forward to interacting with the Indian community living in these countries.…— Narendra Modi (@narendramodi) July 8, 2024 పర్యటనలో భాగంగా భారత్, రష్యా 22వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాకక్షిక చర్చలు జరపనున్నారు. రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనతరం అక్కడి నుంచి ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనుండటం విశేషం. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే గాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్డోస్కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్ల మిస్సింగ్పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్బుక్ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
పుతిన్ ఐదోసారి ప్రమాణం
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణం చేశారు. మంగళవారం క్రెమ్లిన్ ప్రాసాదంలో 2,500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి, విజయాలను అందుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్రెమ్లిన్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్ను తిలకించారు. దగ్గర్లోని అనన్షియేషన్ కేథడ్రల్లో రష్యన్ ఆర్థోడాక్స్ పాటియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. ఆరేళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఇదీ చదవండి.. వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం -
‘‘రష్యా ఎన్నికలు ఒక బూటకం.. చనిపోయేదాకా పుతిన్దే పవర్’’
లండన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయే వరకు పవర్లోనే ఉంటాడని, ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కింది నుంచి మీది దాకా ఒక భూటకం అని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్, రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్ బిల్ బ్రౌడర్ వ్యాఖ్యానించారు. అధ్యక్షఎన్నికల వేళ బ్రౌడర్ వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ‘దేశ ప్రజలకు జైలు, చావు తప్ప పుతిన్ ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఒక గొప్ప లీడర్ లక్షణం కాదు. పుతిన్ ప్రజలను ఇంకా అణచివేస్తే తిరుగుబాటు తప్పదు. ప్రజలు డిసైడైతే పుతిన్కు రొమేనియా కమ్యూనిస్టు లీడర్ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుంది’అని బిల్ బ్రౌడర్ హెచ్చరించారు. హెమిటేజ్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా రష్యాలో 1990 నుంచి 2000 సంవత్సరం వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన బిల్ బ్రౌడర్ను అవినీతి ఆరోపణలపై 2005లో దేశం నుంచి బహిష్కరించారు. కాగా, తొలుత రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ ఏజెంట్గా పనిచేసిన పుతిన్ 1999 నుంచి రష్యాలో అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ పుతిన్ గెలుపు ఖాయమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మరో ఆరేళ్లపాటు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మార్చి 15న ప్రారంభమైన రష్యా ఎన్నికలు 17 దాకా మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి -
కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్!!
తిరువనంతపురం: రష్యా ఎన్నికలు శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ తరహాలో ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ విషయంలో తమకు సహకరిస్తున్న రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టులుగా లేదా నివాసం ఉండేందుకు భారత్ వచ్చిన రష్యన్లకు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రష్యా పౌరురాలు ఉలియా తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చ్ 17వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ -
Russia Ukrain War: అణుయుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్కు అమెరికా గనుక తన సేనలను పంపితే తాము అణు యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్చ్ 15 నుంచి 17 వరకు దేశంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. ప్రస్తుతానికి అణుయుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవని, ఉక్రెయిన్పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు. అయితే మిలిటరీ, సాంకేతిక కోణంలో తాము అణుయుద్ధం చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పుతిన్ బాంబు పేల్చారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో చర్చలకు పుతిన్ సిద్ధంగా లేరని అమెరికా ప్రకటించిన తర్వాత అణుయుద్ధంపై రష్యా అధ్యక్షుడు స్పందించడం గమనార్హం. 1962 క్యూబన్ మిసైల్ సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2022 ఫిబ్రవరిలో వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్కు పంపి ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి పుతిన్ తెరలేపారు. కాగా, అమెరికా సేనలు ఉక్రెయిన్లోకి ప్రవేశిస్తే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలు వాడాల్సి వస్తుందని పుతిన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇదీ చదవండి.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్ -
Russia: మహిళలపై పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాస్కో: మహిళా దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు. మాతృత్వపు బహుమతులను వారు అందిస్తున్నారని కీర్తించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మార్చ్ 8)నాడు పుతిన్ దేశంలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మహిళలు క్లిష్టతరమైన బాధ్యతలు వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మగవారి పట్ల చాలా కేరింగ్గా ఉంటారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ వారెప్పుడూ అందంగానే వెలిగిపోతుంటారు’అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రష్యాలో బర్త్రేటు పెంచే ప్రచారాన్ని పుతిన్ తీవ్రం చేశారు. ముగ్గురు పిల్లలున్న యువ తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళా దినోత్సవం సందర్భంగా పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. గత వారం పార్లమెంట్లో మాట్లాడుతూ ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులు దేశానికి గొప్ప గౌరవం అని పుతిన్ కీర్తించడం గమనార్హం. కాగా, సోవియెట్ కాలం నుంచి రష్యాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మార్చి 8 వుమెన్స్ డేను హాలిడేగా ప్రకటించి మహిళలకు భారీగా బహుమతులు అందిస్తారు. ఇదీ చదవండి.. ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మర్డోక్ -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
Alexi Navalni: పుతిన్ ప్రత్యర్థి మరణం.. వెలుగులోకి సంచలన విషయం
మాస్కో: ఇటీవల రష్యా జైలులో వివాదాస్పద స్థితిలో మరణించిన పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని మృతికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నవాల్నిని జైలులో గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేసి ఉంటారని మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచిన్ తెలిపారు. ఇది రష్యా గూఢచారి సంస్థ కేజీబీ వేగులు చేసిన హత్యే అయి ఉండొచ్చన్నారు. కేజీబీ ప్రత్యేక వేగులకు మనుషులను గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేయడంపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇది వారి హాల్మార్క్ హత్య చేసే విధానమని తెలిపారు. ఈ హత్య చేసే ముందు నవాల్ని శరీరాన్ని బలహీపర్చే ఉద్దేశంతో జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అతడిని ఉంచారన్నారు. ఇలా చేయడం వల్ల మనిషిలో రక్తప్రసరణ నెమ్మదిస్తుందని చెప్పారు. అనంతరం గుండెపై గుద్ది చంపేస్తారన్నారు. కాగా, గత వారం ఆర్కిటిక్ పోలార్ వోల్ఫ్లోని పీనల్ కాలనీ జైలు అలెక్సీ నవాల్ని వివాదాస్పద స్థితిలో మృతి చెందారు. జైలులో సాయంత్రం వేళ కొద్దిసేపు వాకింగ్ తర్వాత నావల్ని ఇబ్బందిగా ఫీలయ్యారని, అనంతరం ఆయన కుప్పకూలారని జైలు అధికారులు వెల్లడించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన నావల్ని మృతిపై రష్యాలో ఆయన అభిమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహా పలు దేశాధినేతలు నవాల్ని మృతికి పుతినే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాయి. నవాల్ని భార్య, కూతురును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో కలిసి పరామర్శించారు. ఇదీ చదవండి.. నవల్ని మృతదేహం తల్లికి అప్పగింత -
కిమ్కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్లో శుక్రవారం చర్చించారు. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది. ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు -
ఉక్రెయిన్ పోరు దారెటు?!
‘ఇక్కడ బతుకు దుర్భరంగా వుంది. స్వీయానుభవంలోకి రాకుండా దీన్నర్థం చేసుకోవటం పూర్తిగా అసాధ్యం’ అని తన సన్నిహితుడికి రాసిన లేఖలో రష్యాలోని అతి శీతలమైన ఆర్కిటిక్ ప్రాంత కారాగారంలో ఇటీవల కన్నుమూసిన అసమ్మతివాది అలెక్సీ నవాల్నీ అన్నారట. రెండేళ్లు పూర్తయి మూడో యేట ప్రవేశించిన ఉక్రెయిన్ యుద్ధం కూడా అటువంటి పరిస్థితుల్నే సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన ఈ దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా అటు రష్యా సైనికులూ... ఇటు ఉక్రెయిన్ సైనికులూ, పౌరులూ కూడా చెప్పనలవికాని యాతనలు పడు తున్నారు. ఈ యుద్ధం నిరుడు రెండో ఏడాదిలో ప్రవేశించే సమయానికి ఉక్రెయిన్ పౌరుల్లో కాస్తయినా విశ్వాసం వుండేది. వచ్చే వేసవిలో రష్యా సైనికులను తరిమేయగలమని నమ్మేవారు. ఇప్పుడు అదంతా ఆవిరైంది. 2025 నాటికి మెరుగైన ఫలితాలొస్తాయని తాజాగా పాశ్చాత్య మీడియా నమ్మబలుకుతోంది. అమెరికా అండదండలతో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు దండిగా ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు అందించటంతోపాటు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి. 1945 తర్వాత యూరోప్ దేశాలన్నీ చిక్కుకున్న ఈ భారీ యుద్ధం ఎటుపోతుందో, చివరికేమవుతుందో ఎవరి అవగాహనకూ అందటం లేదు. ఈమధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో కూటమి దేశాలను హెచ్చరించారు. తమ తమ జీడీపీల్లో రక్షణకు 2 శాతంకన్నా తక్కువ వ్యయం చేసే యూరోప్ దేశాలకు తాను గద్దెనెక్కిన తర్వాత సహకరించబోనని ప్రకటించారు. పైగా యూరోప్ను ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండ’ని రష్యాకు చెబుతానన్నారు. ఆయన మళ్లీ అ«ధ్యక్షుడు కావటం ఖాయమని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈనాటికీ 18 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో వుంది. అక్కడా, ఇతరచోట్లా ఉక్రెయిన్ పౌరులు భయంతో బతుకులీడుస్తున్నారు. అంతేకాదు... రష్యా క్షిపణి దాడులు జరిగిన ప్రతిసారీ సమీప బంధువులనూ, స్నేహితులనూ కూడా అనుమాన దృక్కులతో చూసే ధోరణి మొదలైంది. కొందరు రష్యాకు అమ్ముడుపోయి క్షిపణి దాడులకు కారణమవుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇరాన్, ఉత్తర కొరియాలు రష్యాకు అవసరమైన డ్రోన్లు, క్షిపణులు అందిస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సామగ్రిని తుర్కియే సరఫరా చేస్తోంది. చైనానుంచి పేలుడు పదార్థాల్లో వినియోగించే రసాయనాలు వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి మొదలుకొని ఇంతవరకూ రష్యా ఆదాయాన్ని 433 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 35,500 కోట్లు) గండికొట్టగలిగామని పాశ్చాత్య దేశాలు సంబరపడుతున్నా రష్యా దూకుడు తగ్గలేదు. యుద్ధరంగంలో రష్యా వినియోగిస్తున్న ఆయుధాల్లోని 95 శాతం విడిభాగాలు అమెరికా, పాశ్చాత్య దేశాల్లో తయారైనవేనన్నది కియూవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యయన సారాంశం. సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ చెప్తున్న ప్రకారం ఇంతవరకూ 3,15,000 మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించటమో, గాయపడటమో జరిగింది. మూడింట రెండువంతుల శతఘ్నులుధ్వంసమయ్యాయి. రక్షణ కేటాయింపులు పెంచే విధానానికి స్వస్తిచెప్పి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని యుద్ధకాల ఆర్థిక వ్యవస్థగా (వార్ ఎకానమీ) రష్యా మార్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థతగల నాయకుడనీ, యుద్ధ హీరో అని పాశ్చాత్య మీడియా కీర్తించటంవల్ల ఒరిగేదేమిటో అర్థంకాదు. గతంతో పోలిస్తే ఆయన రేటింగ్స్ పడిపోయాయన్నది వాస్తవం. ముఖ్యంగా కమాండర్ ఇన్ చీఫ్ జలూజినీని తొలగించటం, కియూవ్ నగర మేయర్తో విభేదాలు జెలెన్స్కీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఉక్రెయిన్కు మరో ఆరువేల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి అమెరికా సెనేట్ గతవారం అంగీకారం తెలిపినా రిపబ్లికన్లకు ఆధిక్యతవున్న ప్రతినిధుల సభలో ఏమవుతుందో తెలియదు. కొత్త ఆయుధాల సరఫరాకు ఇప్పటికే రిపబ్లికన్లు బ్రేక్ వేశారు. ఉక్రెయిన్కు అందించదలచుకున్న సాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాలన్న సూచనలు రావటం అమెరికా అధ్యక్షుడు బైడెన్కు సమస్యాత్మకమే. ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించి, యుద్ధ నేరాలకు మూల్యం చెల్లించేలా రష్యాపై అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిళ్లు పెంచటమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఈ బాధ్యతను అమెరికా, పాశ్చాత్య దేశాలు విస్మరిస్తున్నాయి. ఉక్రెయిన్కు ఆయుధాలందిస్తూ పోతే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఆయుధ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయితప్ప ఒరిగేదేమీ వుండదు. ఉక్రెయిన్ గెలుపు గురించీ, రష్యాపై తీసుకునే చర్యల గురించీ ఆర్భాటంగా మాట్లాడుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు యుద్ధం మొదలై రెండేళ్లవుతున్నా తమ దేశాల్లోని రష్యా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటంలో వెనకడుగేస్తున్నాయి. వివిధ ఫైనాన్షియల్ కంపెనీల్లో వున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తుల్ని యుద్ధం మొదలైన రోజుల్లోనే స్తంభింపజేశారు. కానీ వాటì స్వాధీన ప్రక్రియను ప్రారంభిస్తే డాలర్ల రూపంలో నిధులు డిపాజిట్ చేసే విధానానికి చాలా దేశాలు స్వస్తి చెబుతాయన్న భయం అమెరికాకు ఉంది. ఇలా తమ ఆర్థిక వ్యవస్థల గురించీ, భవిష్యత్తు గురించీ ఆచి తూచి అడుగు లేస్తున్న సంపన్న దేశాలు ఈ యుద్ధాన్ని ఆపటంపై మాత్రం దృష్టి సారించటం లేదు. ఉక్రెయిన్ పోరునూ, గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దారుణ మారణకాండనూ ఇకనైనా నిలువరించకపోతే అన్ని దేశాలూ పెను సంక్షోభంలో కూరుకుపోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడటం అందరి కర్తవ్యం కావాలి. -
Alexi Navalni: నావల్ని భార్య, కూతురుకు బైడెన్ ఓదార్పు
కాలిఫోర్నియా: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని(47) భార్య, కుమార్తెను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరామర్శించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలని ఓ హోటల్లో నావల్ని భార్య, కుమార్తెలతో బైడెన్ గురువారం సమావేశమయ్యారు. నావల్ని మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న వారిద్దరనీ బైడెన్ ఓదార్చారు. ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో బైడెన్ ఒక పోస్టు చేశారు. నావల్ని మృతి తర్వాత కూడా వారు ధైర్యంగానే ఉన్నారు’ అని తెలిపారు. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, దేశంలో ప్రతిపక్షనేత నావల్ని వివాదాస్పద మృతి కారణంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా యోచిస్తోంది. కాగా, గత వారం రష్యాలోని జైలులో వివాదాస్పద స్థితిలో మృతి చెందిన నావల్ని తన జీవితమంతా పుతిన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది మృతి -
Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్
మాస్కో: రష్యాలోని జైలులో ఇటీవల వివాదస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్నిపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా ఏజెన్సీ టాస్ వెల్లడించింది. అయితే ఏ సెక్షన్పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. కాగా, మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇదీ చదవండి.. పుతిన్ ప్రేమలో పడ్డారా.. ఆమెతో సన్నిహితంగా -
అలెక్సీ నావల్నీ మరణం.. చిక్కుల్లో ట్రంప్!
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై కరడుగట్టిన విమర్శకుడిగా పేరొందిన అలెక్సీ నావల్నీ మృతి.. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. నావల్నీ మృతిపై.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగా స్పందించలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో పుతిన్ వింగ్ (పుతిన్ అనుకూల వర్గం) పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ను ఉద్దేశించి ఆ పార్టీ నేత లిజ్ చెనే హెచ్చరించారు. అలాంటివారిని వైట్హౌజ్లోకి వెళ్లనివ్వకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై డొనాల్డ్ ట్రంప్ సరైన రీతిలో స్పందించలేదు. చట్టానికి అతీతులుగా వ్యవహరించడంలో ట్రంప్, పుతిన్లు ఇద్దరూ ఇద్దరే. నాటో దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా, బ్రిటన్ల భద్రతను ప్రమాదంలో పడేస్తాయి’అని చెనే తెలిపారు. కాగా, నాటో మార్గదర్శకాల ప్రకారం ఖర్చు పెట్టని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని.. ఈ విషయంలో రష్యాను తాను ప్రోత్సహిస్తానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి.. సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్ -
Russia: ప్రతిపక్ష నేతలకు పుతిన్ భయం..!
మాస్కో: పుతిన్ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు. రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్కు 2022 డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. పుతిన్ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి నావల్ని -
జైలులో పుతిన్ ప్రత్యర్థి మృతి.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్షనేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని జైలులోనే మృతి చెందడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. నావల్ని మృతిని తాము ఇంకా ధృవీకరించలేదని, ఒకవేళ నిజమైతే మాత్రం అదొక భయంకర విషాదం అని వైట్హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుల్లివాన్ అమెరికా పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు నావల్ని మృతిపై అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ జర్మనీలోని మ్యూనిచ్లో స్పందించారు. నావల్ని మృతి నిజమైతే అది రష్యాలోని ప్రభుత్వ బలహీనత, కుళ్లును సూచిస్తుందని వ్యాఖ్యానించారు. జైలులో నావల్ని మృతి ఒక వ్యక్తిలోని భయాన్ని తెలియజేస్తోందని పరోక్షంగా పుతిన్ను ఉద్దేశించి అన్నారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి -
Russia: జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి
మాస్కో: పుతిన్ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నావల్ని గతంలో రష్యా ఇన్ ద ఫ్యూచర్ ప్రతిపక్ష పార్టీని లీడ్ చేయడంంతో పాటు పుతిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్థాపించారు. నావాల్ని మరణంపై పుతిన్కు సమాచారమందినట్లు రష్యా మీడియా కథనాలు ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్ని మరణం వివాదాస్పదమవుతోంది. ‘ఫిబ్రవరి 16న కరక్షనల్ కాలనీ(జైలు) నెంబర్ 3లో కొంత సేపు నడక తర్వాత నావాల్ని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది. ఇదీ చదవండి.. భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన అమెరికా -
పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో చర్చలు జరిపారు. రెండు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ అంశాలతో పాటు పలు ఇతర అంతర్జాతీయ అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. బ్రిక్స్ కూటమికి రష్యా అధ్యక్షత వహించే విషయంపైనా చర్చించారు. ‘ప్రెసిడెంట్ పుతిన్తో మంచి సంభాషణ జరిగింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలపై తీసుకోవాల్సిన చొరవపై ఇరువురం చర్చించాం. బ్రిక్స్కు రష్యా అధ్యక్షత వహించే విషయంపైనా మాట్లాడాం’అని ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో తెలిపారు. ఇటీవల రెండు దేశాల మధ్య అధికారుల స్థాయిలో జరిగిన హై లెవెల్ భేటీలపైనా మోదీ,పుతిన్లు సమీక్షించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 2024లో బబ్రిక్స్కు రష్యా అధ్యక్షత వహించే విషయమై భారత్ పూర్తి మద్దతిస్తోందని ప్రకటిస్తూ వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని పీఎంవో పేర్కొంది. ఇదీచదవండి.. మహారాష్ట్ర సీఎం నిర్ణయంపై సుప్రీం కోర్టుకు ఉద్ధవ్ థాక్రే -
ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగానే పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి వ్లాదిమిరి పుతిన్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుతిన్ను ఆయన మద్దతుదారులు లాంఛనంగా ప్రతిపాదించారు. మరో ఆరేళ్ల కాలానికి 2024లో రష్యాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పుతిన్ అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. అయినప్పటికీ పుతిన్కు ఆ పార్టీ పూర్తి మద్దతునిచ్చింది. పార్టీ టికెట్పై కాకుండా అధ్యక్షునిగా ఇలా పోటీ చేయడానికి కనీసం 500 మంది మద్దతు అవసరమని రష్యా ఎన్నికల చట్టాలు చెబుతున్నాయి. ఇదేగాక 40 ప్రాంతాల నుంచి కనీసం 3 లక్షల మంది సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. పుతిన్కు మద్దతు పలికినవారిలో అధికార 'యునైటెడ్ రష్యా పార్టీ' నేతలు, ప్రముఖ నటులు, గాయకులు, క్రీడాకారులు ఉన్నారు. పుతిన్ 2011లో నెలకొల్పిన రాజకీయ సంకీర్ణ కూటమి 'పీపుల్స్ ఫ్రంట్' ఏకగ్రీవంగా ఆయన్ని నామినేట్ చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 2012 ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్రునిగానే బరిలో దిగారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికవడం లాంఛనంగా మారనుంది. మరోమారు ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షునిగా పనిచేయనున్నారు. ఇదే చదవండి: బందీలపై కాల్పులు! -
రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్ (బాడీ డబుల్స్)ను వినియోగిస్తున్నదంటూ సోషల్మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండించింది. క్రెమ్లిన్ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిపుణులు ఇంటర్నెట్లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నారని , నాన్స్టాప్గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను క్రెమ్లిన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. బాడీ డబుల్స్ను వాడుతున్నారని నిరాధార ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధంగా పేర్కొన్నారు. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్లో వదంతులు వచ్చాయని పేర్కొంటూ ప్రశ్చ్యాత దేశాల మీడియా ప్రచురణలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ (71) క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు 2022 నుంచే వివిధ నివేదికలు వస్తున్నాయి. బహిరంగ ప్రదర్శనలలోనూ పుతిన్ అస్థిరంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ఈ పుకార్లకు అప్పట్లోనే ఆజ్యం పోసింది. తాజాగా సెప్టెంబర్లో రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.'మీరు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని దేవుడిని ప్రార్ధిస్తున్నాం' అంటూ ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు పుతిన్ ఆరోగ్యంపై క్రెమ్లిన్ ప్రతినిధిని తాజాగా ప్రశ్నించారు. బాడీ డబుల్స్కు సంబంధించి 2020లోనే పుకార్లు వచ్చాయి. భద్రతా ప్రయోజనాలు దృష్ట్యా ఓ దేహాన్ని ఉపయోగించారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ పుకార్లను క్రెమ్లిన్ అప్పట్లోనే ఖండించింది. ఇదీ చదవండి: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం -
పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన 21వ శతాబ్దంలో రష్యాను ముందుకు నడిపిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పుతిన్ లా కోర్సు పూర్తిచేసి, సోవియట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో చిన్న ఉద్యోగంతో కెరియర్ ప్రారంభించి దేశ అధ్యక్షుని హోదాకు చేరుకున్నారు. పుతిన్ 1952, అక్టోబర్ 7న లెనిన్గ్రాడ్ (నేటి సెయింట్ పీటర్స్బర్గ్)లో జన్మించారు. పుతిన్ తండ్రి కర్మాగారంలో పనిచేసేవాడు. తల్లి వీధులు ఊడ్చే పని చేసేది. పుతిన్ తన 12 సంవత్సరాల వయస్సులో జూడో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పుతిన్ కళాశాలలో చదువుతున్న సమయంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరారు. 1991లో ఆ పార్టీ రద్దు అయ్యే వరకు సభ్యునిగా కొనసాగారు. కళాశాల చదువు తరువాత పుతిన్ సోవియట్ యూనియన్ గూఢచార సంస్థలో చిన్న పోస్ట్లో చేరారు. అనంతరం అదే కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్నారు. పుతిన్ 1991లో కేజీబీకి రాజీనామా చేశారు. అప్పుడే అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది. మేయర్ కార్యాలయంలో విదేశీ సంబంధాల కమిటీకి ఎన్నికయ్యారు. తరువాత దాని అధిపతి అయ్యారు. 1994, 1996 మధ్యకాలంలో సెయింట్ పీటర్స్బర్గ్లో అనేక ప్రభుత్వ పదవులను నిర్వహించారు. 1996లో పుతిన్ మాస్కో వెళ్లారు. అక్కడ అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ పరిపాలనలో భాగమ్యారు. యెల్ట్సిన్ రాజీనామాకు ముందు పుతిన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్, రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా ఉన్నారు. 1999లో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. యెల్ట్సిన్ రాజీనామా తర్వాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. నాలుగు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పుతిన్ అధికారికంగా దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పుతిన్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తొలుత 2004 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2008 నుండి 2012 వరకు పుతిన్ నాటి అధ్యక్షుడు దిమిట్రీ మెద్వెదేవ్ దగ్గర ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: మార్స్ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది? -
అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా
కరడుగట్టిన నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మిత్రదేశం రష్యా చేరుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కిమ్ భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో రేపో చర్చలు జరగనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాపై ఉన్న ఉమ్మడి శత్రుత్వం వల్ల రష్యా–ఉత్తర కొరియా సన్నిహితంగా మారాయని చెప్పొచ్చు. రెండు దేశాలూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలను దుష్ట దేశాలుగా అమెరికా అభివర్ణిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్–పుతిన్ తాజా సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వల్ల ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఆయుధమే కీలకం.. పుతిన్–కిమ్ భేటీతో ఎవరికి ఎంత లాభం? అనేదానిపై చర్చ మొదలైంది. కిమ్ రాజ్యంలో భారీస్థాయిలో ఆయుధ పరిశ్రమ వర్థిల్లుతోంది. ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్పై సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల ఎగుమతిపై ఇరుదేశాల నడుమ ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అమెరికా అనుమానిస్తోంది. తుది ఒప్పందం కోసమే కిమ్ రష్యాకు వెళ్లినట్లు చెబుతోంది. అయితే, దీనిపై రష్యా ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. ఆయుధాల కొనుగోలును నిర్ధారించలేదు. కానీ, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియా తీర్మానించుకున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఈ ఏడాది జూలైలో ఉత్తర కొరియాలో పర్యటించారు. అక్కడ ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ఆయుధాల ఫ్యాక్టరీలను సైతం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఉత్తర కొరియాతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేపడతామని సెర్గీ ప్రకటించారు. అప్పట్లో సెర్గీకి కిమ్ జోంగ్ ఉన్ ‘టూర్ గైడ్’గా పనిచేశారు. దగ్గరుండి తమ ఆయుధాలను చూపించారు. సంతకాన్ని రద్దు చేసుకుంటే! ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు చేతికి అందిన తర్వాత ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని పుతిన్ సంకేతాలిస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో నడస్తున్న ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) మారుతుందని అంటున్నారు. తమ లక్ష్య సాధనకు ఉత్తర కొరియాతో సైనిక సహకారం సైతం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అణ్వస్త్ర ప్రయోగాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాతో ఎవరూ ఆయుధ వ్యాపారం చేయరాదని ఆదేశించింది. ఈ తీర్మానంపై రష్యా కూడా సంతకం చేసింది. తమ సంతకాన్ని రద్దు చేసుకొనే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వెనక్కి తగ్గితే ఉత్తర కొరియాపై ఆంక్షలు బలహీనమవుతాయి. అప్పు డు ఉత్తర కొరియా నుంచి యథేచ్ఛ గా ఆయు ధాలు కొనుగోలు చేసుకో వచ్చు. ప్రతిఫలం అదేనా? రష్యా సంగతి సరే మరి ఉత్తరకొరియాకు దక్కే ప్రయోజనమేంటి?రష్యాకు ఆయుధాలు ఇచ్చి, తిరిగి పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ రాజ్యంలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. పౌష్టికాహారం అనేది కలలో మాటగా మారింది. అందుకే మానవతా సాయం పేరిట రష్యా నుంచి భారీగా ఆహార ధాన్యాలను తీసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అలాగే సైన్యానికి ఉపయోగ పడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ముందంజలో ఉంది. ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచి సొంతం చేసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అందుకు పుతిన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ తనకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి తీసుకుంటారు. బదులుగా ఆహార ధాన్యాలు, ఆధునిక టెక్నాలజీని కిమ్కు అందజేస్తారు. ఇద్దరికీ లాభమేనన్నమాట! ఇక ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది. -
పుతిన్తో త్వరలో కిమ్ జోంగ్ ఉన్ భేటీ!
సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్లో కలుసుకున్నారు. -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్కు వెళ్లి పుతిన్ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
ప్రిగోజిన్ ఉత్థాన పతనాలు!
కిరాయి సైన్యం అధిపతి యెవ్గనీ ప్రిగోజిన్ బుధవారం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని రెండు రోజుల తర్వాత రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. రెండు నెలల క్రితం తిరుగుబాటు ప్రకటించి మాస్కోవైపు శతఘ్నులతో దూసుకెళ్లిన ప్రిగోజిన్ అధ్యక్షుడు పుతిన్ మినహా ఇతర ఉన్నత స్థాయి నాయకగణంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. కానీ ఉన్నట్టుండి జూన్ 23న నేరుగా తన కిరాయి సైనికులతో మాస్కో దిశగా దండయాత్రకు తరలివెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచాడు. బహుశా పుతిన్ మినహా మిగిలినవారిపైనే తాను ఆగ్రహిస్తున్నట్టు నమ్మించ గలుగుతున్నానని ప్రిగోజిన్ భ్రమపడి వుండొచ్చు. ఈ అలజడి పుతిన్ను భయోత్పాతంలో ముంచిందనీ, ఆయన అజ్ఞాతానికి పోయారనీ ప్రచారం జరిగింది. ఆ మర్నాడు మీడియాతో మాట్లాడిన పుతిన్, ప్రిగోజిన్ను ‘నమ్మక ద్రోహి’గా అభివర్ణించారు. ఇలా ప్రకటించటం మరణ శాసనమేనని అప్పట్లో చాలామంది జోస్యం చెప్పారు. రష్యాలో లేదా విదేశాల్లో ఉంటూ విమర్శలు గుప్పించే రాజకీయ ప్రత్యర్థులు కావొచ్చు, దేశ రహస్యాలను వేరే దేశాలకు విక్రయించినవారు కావొచ్చు పుతిన్ దృష్టిలో నమ్మక ద్రోహులే. ఆ హిట్ లిస్ట్లోని వారిలో తప్పనిసరై ఒకరిద్దరిని జైల్లో పడేశారు తప్ప ఇంతవరకూ ఎవరినీ ప్రాణాలతో వదల్లేదు. ఇతరేతర అంశాలైతే వేరుగానీ, నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని గతంలో పుతిన్ చేసిన ప్రకటనను ప్రిగోజిన్ వ్యవహారంలో కొందరు గుర్తుచేశారు. నిజానికి బెలారస్ మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ శాంతించారని, అతనికీ, ప్రభుత్వానికీ అంగీకారం కుదిరిందని ప్రకటన వచ్చినప్పుడు ప్రిగోజిన్కు రోజులు దగ్గరపడినట్టేనని చాలామంది అనుకున్నారు. అదే సమయంలో పుతిన్ అతన్ని క్షమిస్తారన్న విశ్లేషణలూ వచ్చాయి. ఎందుకంటే ఉక్రెయిన్పై ఏడాదిన్నర క్రితం దురాక్రమణ యుద్ధం మొదలెట్టాక రష్యా చేజిక్కించుకున్న పెద్ద నగరం బఖ్మూత్. వేరే నగరాలు చిక్కినట్టే చిక్కి చేజారగా, బఖ్మూత్ మాత్రం ఇంకా రష్యా నియంత్రణలోనే ఉంది. ఈ విజయం నిస్సందేహంగా ప్రిగోజిన్దే.అందుకే అతన్ని మళ్లీ తన దారికి తెచ్చుకుని ఉక్రెయన్ను ముప్పుతిప్పలు పెట్టడానికి పుతిన్ వినియోగించుకుంటారని భావించారు. కానీ ప్రిగోజిన్ తలరాతను పుతిన్ అప్పటికే వేరే రాశారు. తన 23 యేళ్ల ఏలుబడిలో పుతిన్ కఠినాత్ముడన్న పేరు తెచ్చుకోవటానికే మొగ్గుచూపారు. కానీ ప్రిగోజిన్ విషయంలో దాన్నంతటినీ తాత్కాలికంగానైనా దిగమింగి అతను క్షేమంగా వెళ్లిపోవటానికి అంగీకరించి, ఆ ఇమేజ్ను పోగొట్టుకున్నారు. చివరకు క్రెమ్లిన్లో అతని కిరాయి సైన్యంతో సమావేశమైనప్పుడు అందులో ప్రిగోజిన్ సైతం పాల్గొనటానికి పుతిన్ అనుమతించారు. ఈ ఆధునిక కాలంలో కూడా రాజ్యాలు తమ మనుగడ కోసం కిరాయి సైన్యాలపై ఆధారపడటం వింతగానే ఉంటుంది. అమెరికాలో పోలీసు విధులు కాంట్రాక్టులకు ఇచ్చే అలవాటున్నా సైన్యం విషయంలో ఆ విధానం పెట్టుకోలేదు. ఆఫ్రికా ఖండంలో ప్రస్తుతం అనేక దేశాలు ప్రిగోజిన్ సేవ లను వాడుకుంటున్నాయి. వాస్తవానికి పాశ్చాత్య దేశాల మీడియా చాన్నాళ్లుగా ప్రిగోజిన్ గురించి కథనాలు వెలువరిస్తున్నా ఆ సైన్యం ఉనికిని పుతిన్ ధ్రువీకరించలేదు. ఆఫ్రికా ఖండ దేశాల్లో అతని సైనికుల ఆగడాలపై అనేకానేక కథనాలు వచ్చాయి. ఆఖరికి ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధ సమయంలోనూ కిరాయి సేనల ఉనికిని రష్యా అధికారికంగా అంగీకరించలేదు. తమ చట్టాలు ప్రైవేటు సైనిక కంపెనీలను అంగీకరించబోవన్నదే పుతిన్ చెబుతూవచ్చిన జవాబు. కానీ జూన్ 23 నాటి తిరుగుబాటు ఈ వ్యవహారాన్ని బజారున పడేసింది. మాస్కోలో మాఫియా తరహా రాజ్యం నడు స్తోందన్న పాశ్చాత్య మీడియా ప్రచారానికి బలం చేకూర్చింది. రెండు దశాబ్దాలపైగా పుతిన్ అటు వంటి రాజ్యాన్నే నడుపుతున్నారనడానికి ఆయన వ్యతిరేకుల అనుమానాస్పద మరణాలను చాలామంది ఉటంకిస్తుంటారు. పుతిన్ అవినీతిపై కథనాలు రాస్తున్న మహిళా జర్నలిస్టు అనా పొలిటికోవ్స్కియాను 2006లో కాల్చిచంపారు. ఫెడరల్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తూ 2006లో బ్రిటన్ పరారైన అలెగ్జాండర్ లిత్వినెంకో లండన్లోని దుకాణంలో రేడియో ధార్మిక పదార్థం కలిసిన టీ తాగి మరణించారు. పుతిన్ అధికారానికి రావటానికి తోడ్పడిన బోరిస్ బెరిజోవ్స్కీ ఆయన ఆగ్రహానికి గురై బ్రిటన్ వెళ్లిపోయినా 2013లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 2015లో బోరిస్ నెమ్ట్స్నోవ్ అనే భౌతిక శాస్త్రవేత్తను క్రెమ్లిన్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒకప్పుడు పుతిన్కు సన్నిహితంగా మెలిగి తర్వాత అతనికి బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నవాల్ని సైతం 2020లో ఒక రేడియో ధార్మిక పదార్థం బారినపడ్డారు. ఆయన చచ్చి బతికాడనుకుంటే ఇప్పుడు నిరవధికంగా జైల్లో మగ్గుతున్నాడు. చట్టసభలూ, ఇతర వ్యవస్థలూ సజావుగా పనిచేస్తున్నట్టు కనబడే రాజ్యాల్లో నియంతలు బయల్దేరి వాటిని భ్రష్టుపట్టించటం, అధికారంలో శాశ్వతంగా కొనసాగేట్టు చూసుకోవటం కొత్తేమీ కాదు. కానీ పుతిన్ తీరే వేరు. రాజ్య వ్యవస్థలకు సమాంతరంగా చట్టాలతో సంబంధం లేకుండా పటిష్టమైన సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా వ్యతిరేకులను అణచివేసే విధానం ఆయనది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్ను మట్టికరిపించే క్రమంలో 87 లక్షల మంది సైనికులతో సహా దాదాపు 2 కోట్ల 70 లక్షలమంది ప్రాణాలు పోగొట్టు కున్న దేశానికి ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించివుండరు. ఏదేమైనా ప్రిగోజిన్ ఉత్థాన పతనాలు వర్తమాన ప్రపంచ దుఃస్థితికి అద్దం పడతాయి. -
పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం కష్టంగా ఉందని చెప్పారు. రష్యాలో పుతిన్కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు -
పుతిన్ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు
ఆగష్టులో జొహానెస్బర్గ్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా పుతిన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ అరెస్టు విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో అన్నారు. బ్రిగ్స్ సమావేశం నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను అరెస్టు చేయాలని ఆ దేశ ప్రతిపక్ష డెమోక్రటిక్ అలయెన్స్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పుతిన్ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం ప్రకటించినట్లేనని రమఫొస పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి మార్చాలన్న ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్ మషతిలే తెలిపారు. గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దురాక్రమణమని పలు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఐక్యరాజ్య సమితి నియమాలకు విఘాతం కలిగిస్తోందని తెలుపతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ను అరెస్టు చేయాలని కోరాయి. ఆ తర్వాత ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్ను జారీ చేసింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఇదీ చదవండి: మండుతున్న ధరలు, ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్.. పరిస్థితి కష్టమేనంటున్న ఐఎంఎఫ్ నివేదిక -
వాగ్నర్ గ్రూప్ చీఫ్ హతం! ఇందులో నిజమెంత? అమెరికా సందేహాలు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ ఇప్పుడు ఎక్కడున్నారు? రష్యాలోనే ఉన్నారా? లేక పొరుగు దేశం బెలారస్లో తల దాచుకుంటున్నారా? తిరుగుబాటు తర్వాత పుతిన్తో ఆయన సమావేశమై తన చర్యలపై వివరణ ఇచి్చనట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. అయితే, పుతిన్ ఆదేశాలతో రష్యా అధికారులు ప్రిగోజిన్ను ఇప్పటికే అంతం చేసి ఉండొచ్చని లేక జైల్లో బంధించి ఉండొచ్చని అమెరికా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పుతిన్తో ప్రిగోజిన్ భేటీ రష్యా ఆడిన డ్రామా అని ఆయన తేలి్చచెప్పారు. ప్రిగోజిన్ను ఇక బహిరంగంగా చూడటం అనుమానమేనన్నారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్ను రష్యా అధికారులు చంపేసి అయినా ఉండాలి లేదా జైల్లో పెట్టయినా ఉండాలి లేదా ఎక్కడైనా దాచేసి ఉండాలి అని రాబర్ట్ అబ్రామ్స్ వెల్లడించారు. ప్రిగోజిన్ జూన్ 23న తన ప్రైవేట్ సైన్యంతో కలిసి పుతిన్పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. కొందరు రష్యా సైనికాధికారుల అండతోనే ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు వాదనలు వినిపించాయి. తిరుగుబాటు కొన్ని గంటల్లోనే ముగిసింది. ఆ తర్వాత జూన్ 29న ప్రిగోజిన్ తన వాగ్నర్ గ్రూప్ కమాండర్లతో కలిసి పుతిన్తో సమావేశమయ్యారని, ఇకపై రష్యా ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామన్నట్టు వార్తలొచ్చాయి. ఉక్రెయిన్పై యుద్ధంలో ప్రిగోజిన్ సేవల దృష్ట్యా అతడికి పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించినట్టు వార్తలొచ్చాయి. -
మోదీ, పుతిన్ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఇటీవల రష్యాలో జరిగిన అంతర్యుద్ధం, ఉక్రెయిన్ అంశాలపై చర్చించుకున్నారు. ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో మోదీ మద్దతు తెలిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. రష్యాలో శాంతి పరిరక్షణలు నెలకొని పౌరుల భద్రత కాపాడాలని మోదీ ఆకాంక్షించినట్లు పేర్కొంది. అమెరికా పర్యటన తర్వాత మొదటిసారి మోదీ, పుతిన్లు ఫోన్లో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటనలను ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా జరుగుతున్న మార్పులు, పరస్పర సహకార అంగీకారాలపై ముచ్చటించారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలపై చర్చ జరిగిందని క్రెమ్లిన్ తెలిపింది. జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లలో ఇరుదేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందాలపై కూడా మోదీ, పుతిన్ మాట్లాడుకున్నారు. అయితే.. ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా దేశం ఎప్పడూ లేనంత ఇబ్బందుల్లో పడిపోయింది. పుతిన్ అధికారంలోకి వచ్చిన రెండు దశాబ్ధాల్లో ప్రిగోజిన్ తిరుగుబాటే అతనికి అతి పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
వాగ్నర్ సేనకు రష్యా క్షమాభిక్ష
మాస్కో: వాగ్నర్ సైన్యం తిరుగుబాటును నిలిపేయడంతో ఆ సైన్యం చీఫ్ ప్రిగోజిన్, అతని బలగాలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వారిపై ఎలాంటి క్రిమినల్ విచారణ ఉండదని ప్రకటించింది. 24 గంటల్లోపే వారు తమ కార్యకలాపాలను ఆపేయడంతో ఈ కేసును నిలిపివేస్తున్నట్టు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఉక్రెయిన్తో 16 నెలలుగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారానికి ముప్పుగా పరిణమించిన సంఘటనల వరుసలో ఇది తాజా మలుపు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించే లక్ష్యంతో ప్రిగోజిన్కు పుతిన్ కొన్ని వాగ్దానాలు చేశారని, మరికొన్ని హామీలు ఇచ్చారని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. వాగ్నర్ గ్రూప్కు ఏడాదిలో రూ.8 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఆ గ్రూపు బలగాలకు జీతాలు, అలవెన్సులను సమకూర్చామన్నారు. ఆ డబ్బును ఎలా ఖుర్చు చేశారన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తారని పుతిన్ చెప్పారు. ఇలా ఉండగా, ప్రిగోజిన్ తమ దేశంలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో ప్రకటించారు. అతని బలగాలు కూడా కొంతకాలం పాటు బెలారస్లోనే ఉంటాయని వెల్లడించారు. రష్యా మిలిటరీ ఆధీనంలో పనిచేయడానికి ఒప్పందాలపై సంతకం చేయడానికి జూలై 1 గడువు కంటే ముందే తన దళాలు తమ ఆయుధాలను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయని ప్రిగోజిన్ తెలిపారు. -
పుతిన్ Vs వాగ్నర్ గ్రూప్
-
రష్యాలో ప్రిగోజిన్ తిరుగుబాటుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారంటే..?
యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో రష్యా కష్టకాలంలో పడింది. ప్రిగోజిన్ అరెస్టును ఇప్పటికే ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అతన్ని దేశ ద్రోహిగా సంబోధించాడు. దీనిపై స్పందించిన ప్రిగోజిన్.. తాను నిజమైన దేశ భక్తుడనని చెప్పుకున్నారు. తన సైన్యం తిరుగుబాటుతోనే దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని చెప్పారు. అయితే.. రష్యాలో మొదలైన ఈ అంతర్యుద్ధాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. చెడును కోరేవారు అందులో అంతమవుతారని అన్నారు. కాగా.. వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో ఇన్ని రోజులు ఉక్రెయిన్లో మోగిన బాంబుల మోతలు ఇక రష్యాలో వినిపిస్తున్నాయి. Prigozhin went on to say that Wagner forces fought in Africa and Ukraine while the Russian military leadership embezzled ammunition, weapons, and money needed by forces on the ground for their own gain. — The Kyiv Independent (@KyivIndependent) June 24, 2023 రష్యా సైన్యం వాగ్నర్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వాగ్నర్ సేన లక్ష్యంతో వోరోనెజ్ సమీపంలోని హైవేపై మిలిటరీ బాంబుల వర్షం కురిపించి. ఆ దృశ్యాలు స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించాయి. The moment of the explosion on the highway near #Voronezh. https://t.co/Fp9RJR9rey pic.twitter.com/B1Ieuh9yF2 — NEXTA (@nexta_tv) June 24, 2023 ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపింది. కానీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. జిల్లా మిలిటరీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. There was an explosion near the headquarters of the Southern Military District in Rostov-on-Don - RT propaganda correspondent from the scene. pic.twitter.com/jNQdGkota0 — NEXTA (@nexta_tv) June 24, 2023 రోస్తోవ్ నగరాన్ని ఆక్రమించామని వాగ్నర్ సేన ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ పెద్ద ఆయిల్ స్థావరంపై దాడి జరిగింది. చమురు డిపోలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వీటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. An oil depot near #Voronezh is on fire, according to local media outlets. pic.twitter.com/itgHw2c5zc — NEXTA (@nexta_tv) June 24, 2023 ఇదీ చదవండి: రష్యాలో సైన్యంపై పుతిన్ సన్నిహితుడి తిరుగుబాటు.. పాతిక వేలమంది చావడానికి రెడీ! -
పుతిన్ పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబావుటా
-
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్బర్గ్లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
రెచ్చిపోయిన రష్యా.. ఒకేరోజు వెయ్యి మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: రష్యా ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ లో పదే పదే దాడులు చేసి రెచ్చగొట్టినందుకు రష్యా కోపంతో భారీ క్షిపణులతో విచక్షణారహితంగా దాడి చేసి 1000 మంది ఉక్రెయిన్ బలగాలను బలిగొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు భారీ స్ట్రోక్ ఇచ్చింది పుతిన్ సైన్యం. కొద్దిరోజుల క్రితం రష్యా స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సాయుధులు కనీసం 35 సార్లు దాడులు చేశారు. దీంతో విసుగు చెందిన రష్యా బలగాలు భారీ మిసైళ్ళతో విరుచుకుపడి ఉక్రెయిన్ బలగాలపై దాడి చేసింది. ఈ భారీ విధ్వంసంలో కనీసం 1000 మంది ఉక్రెయిన్ సైన్యం నాశనమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత కొంత కాలంగా క్యివ్ సైన్యం డొనెట్స్క్ లోని జనావాసాల మీద దాడులు చేస్తూ వాటిని రష్యా చేసిందని ఆరోపించే ప్రయత్నం చేస్తోందని, అందుకే వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది రష్యా రక్షణ శాఖ. ఈ ప్రమాదంలో ఒకేరోజు భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ వర్గాలు కూడా ప్రకటించాయి. ఇది కూడా చదవండి: ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ! -
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
మాస్కోపై డ్రోన్ దాడులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం ఉదయం డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో ప్రాణహాని జరగలేదని, భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మాస్కోపైకి దూసుకొచ్చిన ఎనిమిది డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు. డ్రోన్ల దాడిపై అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వం చేసిన ఉగ్రవాద దాడి అంటూ ఆరోపించారు. మాస్కోలో డ్రోన్లను కూల్చి వేసిన ప్రాంతంలో కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని నగర మేయర్ సెర్గీ సొబియానిన్ చెప్పారు. ఇద్దరు పౌరులకు స్వల్పంగా గాయాలయ్యాయి, దెబ్బతిన్న రెండు బహుళ అంతస్తుల భవనాల్లోని వారిని ఖాళీ చేయించామని తెలిపారు. అయిదు డ్రోన్లను మాస్కోలో కూల్చివేయగా, మూడింటిని జామ్ చేసి దారి మళ్లించి పేల్చివేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం మొదలైన దాదాపు ఏడాదిన్నర కాలంలో డ్రోన్లతో ఏకంగా సుదూర ప్రాంతంలోని రష్యా రాజధానిపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. ఈ నెలారంభంలో అధ్యక్షుడు పుతిన్ లక్ష్యంగా రెండు డ్రోన్లు క్రెమ్లిన్పైకి వచ్చాయని రష్యా ఆరోపించింది. రష్యా గత 24 గంటల్లో మూడో విడత ఉక్రెయిన్ రాజధాని కీవ్పై వేకువజామున బాంబులతో విరుచుకుపడింది. కీవ్ వాసులు భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడులతో ఒకరు చనిపోయారు. పేలుడు పదార్థాలతో వచి్చన 20 షహీద్ డ్రోన్లను కూల్చి వేసినట్లు కీవ్ అధికారులు తెలిపారు. మొత్తమ్మీద 24 గంటల్లో 31 వరకు డ్రోన్లను కూల్చి వేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. -
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
పశ్చిమ దేశాలదే ఈ పాపం
మాస్కో: ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్లో సైనిక చర్య ప్రారంభం కావడానికి, ఇదింకా కొనసాగుతుండటానికి అవే బాధ్యత వహించాలన్నారు. తమను నిందించడం తగదన్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పుతిన్ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ దేశాల ఆటలో రష్యా, ఉక్రెయిన్ బాధిత దేశాలుగా మారాయన్నారు. తాము ఉక్రెయిన్ ప్రజలపై పోరాడడం లేదని, కేవలం స్వీయ మనుగడ కోసమే పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పారంటే... అందుకే ఇలాంటి అడ్డదారులు ‘‘పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ బందీగా మారడం విచారకరం. రష్యా పతనమే వాటి లక్ష్యం. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ పోరుగా మార్చడమే వాటి ఉద్దేశం. రష్యా సరిహద్దు వరకూ విస్తరించాలని నాటో కూటమి ప్రయత్నించింది. రష్యా ఉనికిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం. మాపై యుద్ధం ప్రారంభించింది పశ్చిమ దేశాలే. దాన్ని ముగించడానికి మేం బలాన్ని ఉపయోగిస్తున్నాం. మాపై ‘సమాచార దాడులు’ కూడా జరుగుతున్నాయి. రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. యుద్ధక్షేత్రంలో రష్యాను ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థపైనా దాడి చేస్తున్నారు. కానీ, వారిప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. ఇకపైనా ఏమీ ఉండబోదు.’’ సైనికులకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు ‘‘తూర్పు దేశాలను నాశనం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాటో దళాల సంఖ్యను పెంచుతున్నారు. డాన్బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు మేము ప్రయత్నించాం. కానీ, పశ్చిమ దేశాలు క్రూరంగా వ్యవహరించాయి. ఉక్రెయిన్–రష్యా సమస్య పరిష్కారానికి అవి సిద్ధంగా లేవు. వాటి వైఖరి వల్లే వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది. రష్యాపై యుద్ధం కోసం ఆ దేశాలు ఉక్రెయిన్కు 150 బిలియన్ డాలర్లు అందజేశాయి. చివరకు ఉక్రెయిన్కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టించడం ఖాయం. ప్రపంచ భద్రత, శాంతి కోసం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని పుతిన్ పునరుద్ఘాటించారు. రష్యా కోసం పోరాడుతున్న సైనికులకు, వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘న్యూ స్టార్ట్’లో రష్యా భాగస్వామ్యం రద్దు అమెరికాతో కుదిరిన ‘న్యూ స్టార్ట్ సంధి’లో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు పుతిన్ మంగళవారం ప్రకటించారు. అణ్వాయుధాల నియంత్రణ కోసం అమెరికా, రష్యా మధ్య కుదిరి, ఇంకా అమల్లో ఉన్న చివరి ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఒకవేళ అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేపడితే తాము కూడా అందుకు సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. అమెరికా, దాని నాటో మిత్రదేశాలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయని, అందుకే న్యూ స్టార్ట్ సంధి నుంచి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగలేదని అన్నారు. తమను ఓడించి, తమ అణ్వాయుధాలను స్వా«దీనం చేసుకోవాలన్నదే పశ్చిమ దేశాల ఆలోచన అని మండిపడ్డారు. అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్ సంధి 2010లో కుదిరింది. 2021 ఫిబ్రవరిలో ఈ సంధి గడువు ముగిసిపోగా, మరో ఐదేళ్లు పొడిగించారు. -
పుతిన్ గెలవడం కల్ల రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవు
వార్సా: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న పచ్చిమ దేశాల సంకల్పాన్ని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కఠినతరంగా మార్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. కఠినమైన, అప్రియమైన రోజులు ముందు ముందు ఉండబోతున్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్కు సూచించారు. తాము, తమ మిత్రదేశాలు ఉక్రెయిన్కు అండగా నిలుస్తాయని వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని తేల్చిచెప్పారు. రష్యాపై దాడిచేసేందుకు పచ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయంటూ పుతిన్ చేసిన ఆరోపణలను బైడెన్ ఖండించారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు నేడు, రేపు, ఎప్పటికీ రక్షణ కవచంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని మంగళవారం పోలాండ్కు చేరుకున్నారు. పోలాండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడాతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. నాటోకు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు నాటో, పోలాండ్ కూడా అంతే అవసరమని డుడాతో బైడెన్ అన్నారు. అనంతరం రాజధాని వార్సాలోని రాజభవనంలో ఉక్రెయిన్ శరణార్థులను, స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రష్యా దండయాత్రను తట్టుకొని ఉక్రెయిన్ బలంగా ఎదురు నిలుస్తోందని ప్రశంసించారు. ఉక్రెయిన్ వైఖరి గర్వకారణమన్నారు. ‘నాటో’ కూటమి గతంలో ఎన్నడూ లేనంగా బలంగా ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. నాటోలోని ఏ ఒక్క దేశంపై అయిన ఎవరైనా దాడి చేస్తే అది మొత్తం నాటోపై దాడి చేసినట్లేనని హెచ్చరించారు. అయితే న్యూ స్టార్ట్ ఒప్పందంలో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నామన్న పుతిన్ ప్రకటనపై బైడెన్ స్పందించలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారంటూ పోలాండ్, ఉక్రెయిన్ సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘పుతిన్ తనను తాను కఠినమైన వ్యక్తినని అనుకుంటున్నారు. కానీ అమెరికా ఉక్కు సంకల్పంతో పేచీ పెట్టుకుంటున్నారు. చేసిన తప్పులకు రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అన్నారు. మిత్రదేశాలతో కలిసి రష్యాపై ఈ వారంలోనే మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. -
యద్ధాన్ని ఆపేలా పుతిన్ని మోదీ ఒప్పించగలారా?
ఉక్రెయిన్లో యుద్ధం ఆగడానికి చాలా సమయం పడుతుందని అమెరికా పేర్కొంది. ఇరు దేశాలు శత్రుత్వానికి ముగింపు పలికేలా పలు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది. ఆ ప్రయత్నాలన్నింటిని తాను స్వాగతిస్తానని కూడా వెల్లడించింది యూఎస్. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ..పుతిన్కి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా కొంత సమయం అవసరమని భావిస్తున్నా. ప్రధాని మోదీ పుతిన్ ఒప్పించి ఈ యుద్ధాన్ని ముగించేలా చేయగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ మోదీ యుద్ధాన్నే ఆపేలా ఏ ప్రయత్నం చేసినా.. దాన్ని తాను స్వాగతిస్తామని, ఆయనకు అవకాశం ఇస్తామని కిర్బీ అన్నారు. కాగా, భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో పుతిన్తో సమావేశమైన కొద్ది రోజుల్లనే వైట్హౌస్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలా ఉండగా, గతేడాది షాంఘై కో ఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ.."నేటి యుగం యుద్ధం కోసం కాదు. ఈ రోజు మనం శాంతి మార్గంలో ఎలా పురోగమించాలి అనే అవకాశాల గురించి చర్చింకునే తరుణం." అని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: ప్లీజ్ దేవుడా! ఒక్క బిడ్డనైనా కాపాడు..ఓ బాధిత తండ్రి ఆవేదన) -
ఉక్రెయిన్కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక
కీవ్: ఉక్రెయిన్కు శక్తివంతమైన ఆయుధాలిచ్చి తమను తాము నాశనం చేసుకోవద్దని పశ్చిమదేశాలకు రష్యా పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోదిన్ హెచ్చరించారు. ఎదురుదాడులకు ఉపయోగపడే ఆయుధాలను ఉక్రెయిన్కు అందజేస్తే, తాము మరింత శక్తివంతమైన ఆయుధాలను వాడాల్సి వస్తుందని, అంతిమంగా ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు మినహా గగనతల రక్షణ వ్యవస్థలు తదితరాలను అందజేస్తామంటూ నాటో, అమెరికా ఇస్తున్న హామీలపై ఆయన ఆదివారం ఈ మేరకు స్పందించారు. చదవండి: పెరూలో ఆందోళనలు హింసాత్మకం -
షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్!
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ వ్యక్తిగత ఫోన్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పనిచేసే ఏజెంట్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో లిజ్ మాట్లాడిన సంభాషణలతో పాటు ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ పంపుకున్న సందేశాలు వంటి కీలక రహస్యాలు రష్యా చేతికి చిక్కినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. ట్రస్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే రష్యా ఏజెంట్లు ఫోన్ హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. ఈ ఫోన్ హ్యాక్ చేసిన రష్యాకు బ్రిటన్ రహస్యాలు తెలిశాయని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయుధ సరఫరా, మిత్ర దేశాలతో సంబంధాలతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ను ఆమె వివర్శించిన సంభాషణలు కూడా పుతిన్ చేతికి చేరినట్లు వెల్లడించింది. ఇతర దేశాలకు కీలక సమాచారం చిక్కడంతో బ్లాక్మెయిల్కు పాల్పడి ఉండవచ్చని తెలిపింది. లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూకే చరిత్రలోనే అతితక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఆమే కావడం గమనార్హం. పదవి చేపట్టాక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం, మంత్రులు రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ స్వతహాగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ఎలాంటి పోటీ లేకుండా బ్రిటన్ ప్రధాని అయ్యారు. చదవండి: ఫుట్బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి -
అణ్వాయుధాలు ప్రయోగించం-పుతిన్
అణ్వాయుధాలు ప్రయోగించం-పుతిన్ -
రష్యాను ఏకాకిని చేయటమా? అది అసాధ్యం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్పై సైనిక చర్యతో విరుచుకుపడుతున్న రష్యాను నిలివరించేందుకు పశ్చిమ దేశాలతో పాటు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినా.. వెనక్కి తగ్గేదేలే అంటూ దాడులు కొనసాగిస్తున్నారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించి.. ప్రపంచ దేశాలకు దూరం చేయాలనే వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి రష్యాను వేరు చేసి ఏకాకిని చేయటం అసాధ్యమని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు దశాబ్దాలుగా మాస్కో సాధించిన ప్రగతిని నిలువరించలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు పుతిన్. ‘ప్రస్తుత పరిస్థితి మా దేశానికి ప్రధాన సవాలు అని తెలుసు. మా శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. మేము ప్రజల నమ్మకాన్ని, దశాబ్దాల పురోగతిని కోల్పోము. దేశంలోని సొంత సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొత్త పరిష్కారం కోసం దేశం చూస్తోంది. మా దేశానికి పెద్ద సవాలు ఇది. కానీ, మేము వెనక్కి తగ్గేదే లేదు. ప్రపంచానికి దూరంగా ఏకాకిగా మారటమనేది అసాధ్యమని విస్పష్టం.’ అని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టారు పుతిన్. అందుకోసం దేశీయ తయారీని ప్రోత్సహించటం, అంతర్గతంగా ఎండ్ టూ ఎండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటం, విదేశీ ఎగుమతులను నిలిపివేయటం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. రష్యా సాంకేతిక విభాగాలను ప్రోత్సహించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు ఆ దేశ ఆర్థిక మంత్రి అంటోన్ సిలునోవ్. ప్రభుత్వం ఒక రూబల్ పెట్టుబడితో వస్తే.. ప్రైవేటు సంస్థలు మూడు రూబల్ పెట్టాలని కోరారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ని మట్టికరిపించేలా...తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా! -
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
యుద్ధానికి మూణ్నెల్లు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగి మంగళవారంతో మూడు నెలలు పూర్తయ్యాయి. రేవు పట్టణం మారియుపోల్ను ఆక్రమించడం మినహా ఇన్నాళ్లలో రష్యా పెద్దగా సాధించిందేమీ లేదు. సైనికంగా కనీవినీ ఎరగని నష్టాలతో ఎన్నడూ లేనంత అప్రతిష్ట మూటగట్టుకుంది. పైగా అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. రోజుల్లో చేజిక్కుతుందనుకున్న ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల దన్నుతో ఇప్పటికీ దీటుగా పోరాడుతూ రష్యాకు చుక్కలు చూపిస్తోంది. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక అధ్యక్షుడు పుతిన్ తల పట్టుకుంటున్నారు. రాజధాని కీవ్ను ఆక్రమించాలన్న వ్యూహం విఫలమవడంతో రూటు మార్చారు. కనీసం తూర్పు ఉక్రెయిన్లో తమ అధీనంలో ఉన్న డోన్బాస్ ప్రాంతాన్నయినా పూర్తిగా చేజిక్కించుని గౌరవంగా వెనుదిరిగాలని చూస్తున్నా, ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధ తంత్రానికి రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోంది. అఫ్గానిస్థాన్లో పదేళ్ల యుద్ధంలో కోల్పోయినంత మంది సైనికులను ఉక్రెయిన్లో రష్యా మూడు నెలల్లోపే నష్టపోయిందని ఇంగ్లండ్ తాజాగా అంచనా వేసింది. యుద్ధం పట్ల రష్యన్లలోనూ వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మెక్డొనాల్డ్స్ వంటి రెస్టారెంట్లు మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల దాకా అన్నీ రష్యావ్యాప్తంగా ఒక్కొక్కటిగా మూతబడుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు రష్యాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయని పుతిన్ సోమవారం అంగీకరించారు. మారియుపోల్లో 200 శవాలు రష్యా ఆక్రమణలోకి వెళ్లిన మారియుపోల్లో ఓ అపార్ట్మెంట్ శిథిలాల్లో కుళ్లి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉన్న 200కు పైగా శవాలు తాజాగా బయటపడ్డాయి. నగరంలో నెలకొన్న అత్యంత అపరిశుభ్ర వాతావరణం పలు వ్యాధులకు దారి తీయవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లుహాన్స్క్లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న సెవెరో డొనెట్స్క్, పరిసర నగరాలపై రష్యా తీవ్ర బాంబు దాడులకు దిగింది. గత వారం డెస్నాపై జరిగిన క్షిపణి దాడిలో 87 మంది అమాయకులు బలయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ నెగ్గాలి: ఈయూ రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ నెగ్గి తీరాలని ఈయూ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. అందుకు యూరప్ అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలుపంపనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని మిత్ర దేశం ఫిలిప్పీన్స్ తొలిసారిగా తీవ్రంగా తప్పుబట్టింది. యుద్ధాన్ని మొత్తం యూరోపియన్ యూనియన్పైనే దాడిగా స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్ అభివర్ణించారు. లక్షకు పైగా శరణార్థులకు స్పెయిన్ ఆశ్రయమిస్తోందని చెప్పారు. యుద్ధాన్ని నిరసిస్తూ జెనీవాలో ఉన్న సీనియర్ రష్యా దౌత్యవేత్త బోరిస్ బొందరెవ్ రాజీనామా చేశారు. ఉక్రెయిన్పై పుతిన్ తెర తీసిన యుద్ధం కారణంగా తన కెరీర్లో మొదటిసారి అవమానంతో తలొంచుకున్నట్టు చెప్పారు. -
Russia War: శాంతి చర్చల కోసం రంగంలోకి కీలక వ్యక్తి.. పుతిన్ రెస్పాన్స్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు. కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు -
యుద్ధం మరింత ఉగ్రం
-
హమ్మయ్య! వాటి ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోగా..
మండే ఎండలను మించి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి రేట్లు సవరిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఈ అంతర్జాతీయంగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అంటూ సామాన్యులు ఎదురు చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చల రూపంలో ఆ తరుణం రానే వచ్చింది. ఇక పెట్రోలు ధరలు ఏమైనా తగ్గుతాయేమో అనుకునేలోగా మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్ రష్యా యద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. 2022 మార్చిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 140 డాలర్లకు ఎగిసింది. మొత్తంగా మార్చి నెల సగటు 112 డాలర్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఈ సగటు ధర 94 డాలర్లు ఉండగా జనవరిలో 84.67 డాలర్లుగా ఉంది. యుద్ధం మొదలైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 25 డాలర్లకు పైగానే పెరిగింది. దీంతో మన దగ్గర లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను పది రూపాయలకు పైగానే ఆయిల్ సంస్థలు పెంచాయి. మార్చి చివరి వారం నుంచి ఉక్రెయిన్ - రష్యాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా మొత్తబడుతున్నట్టు కనిపించింది. దీంతో ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి 12 వరకు ముడి చమురు సగటు ధర 98.48 డాలర్లుగా వచ్చింది. మార్చి సగటు 112 డాలర్లతో పోల్చితే దాదాపు 13 డాలర్ల వరకు ధర తగ్గింది. యుద్ధం ముగిసిపోతే సాధారణ పరిస్థితులు నెలకొని బ్యారెల్ ధరలు తగ్గి రిటైల్ మార్కెట్లో పెట్రోలు ధరలు తగ్గుతాయనే నమ్మకం ఏర్పడింది. ఉక్రెయిన్ మొండి వైఖరి కారణంగా శాంతి ప్రక్రియల నుంచి వెనక్కి తగ్గుతున్నామని, యుద్ధం మరింత కాలం కొనసాగవచ్చంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన తాజా ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పుతిన్ ప్రకటనకి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 98 డాలర్ల దగ్గర ఉండగా పుతిన్ ప్రకటన వెలువడిన తర్వాత 2022 ఏప్రిల్ 13న 104 డాలర్లకు చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు 6 డాలర్లు పెరిగింది. 2020 ఏప్రిల్లో బ్రెంట్ రకం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ సగటు ధర రూ. 63 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో మన దగ్గర లీటరు పెట్రోలు ధర రూ. 75 ఉండగా డీజిల్ ధర రూ.65లుగా ఉంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బ్యారెల్ ధర 99 డాలర్లు ఉండగా హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 119 డీజిల్ ధర 115 దగ్గర ఉంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే పెట్రో బాదుడు తప్పేలా లేదు. చదవండి: అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై ధరలు పెంచేస్తున్నాయి -
టెన్షన్లో జెలెన్ స్కీ.. చెచెన్యా రంజాన్ కడీరోవ్ సంచలన వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. తాజాగా రష్యా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో 1200 మందికి పైగా ఉక్రెనీయుల మృతదేహాలు బయటపడినట్టు ఆ దేశ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రష్యా దుశ్చర్య ప్రపంచానికి బహిర్గతమైందన్నారు. మరోవైపు.. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. రష్యాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రష్యా దాడి వల్ల దక్షిణ నగరమైన మరియుపోల్లో వేలాది మంది మృతిచెందారని అన్నారు. మురియుపోల్ నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు పారిపోయారని తెలిపిన జెలెన్ స్కీ.. శరణార్థులు ఇచ్చిన ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ వేలాది మంది మృతిచెందారని వెల్లడించారు. భారీ గొయ్యిల్లో ఆ మృతదేహాలను ఖననం చేశారని ఆరోపించారు. చెచన్ ఫైటర్లు అక్కడ లూటీలకు పాల్పడినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో రష్యా దాడులపై రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. మరియుపోల్ మాత్రమే కాదు, కీవ్పై కూడా దాడి చేస్తామని పేర్కొన్నాడు. ఈ క్రమంలో కీవ్, ఇతర నగరాలను కూడా స్వాధీనం చేసుకుంటామని వెల్లడించాడు. -
ఉక్రెయిన్ యుద్ధం.. పెద్దన్న పాత్రలో ప్రధాని మోదీ!
Modi Need To Speak Directly Putin How To End The War: టర్కీలో శాంతి చర్చల్లో పురోగతి లభించిందని అంతా అనుకున్నారుగానీ అందుకు విరుద్ధంగా రష్యా వైఖరి ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా బలగాలను ఉపసంహరించుకుంటానని హామి ఇచ్చి మరీ ఉక్రెయిన్ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. బుధవారం చెర్నిహివ్లో బలగాలు మైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కూడా రష్యా హామీని నిలబెట్టుకోకుండా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఉక్రెయిన్ భారత్ రష్యాతో గల సంబంధాలను ఉపయోగించి ఈ యుద్ధం ఆపేలా చేస్తే ఉక్రెయిన్లో మరో వేల ప్రాణాలను బలవ్వవు అని భారత్కి మరోసారి హితబోధ చేసింది. ఒక మీడియా సమావేశంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తే గనుక తాము దాన్ని స్వాగతిస్తాం అని అన్నారు. రష్యాతో భారత్ కలిగి ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకుని. పెద్దన్న పాత్ర పోషిస్తూ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని ఒప్పించాలని తాము అభ్యర్తిస్తున్నాం అని అన్నారు. రష్యాలో అన్ని నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి పుతిన్ కాబట్టి ఆయనతో మోదీ నేరుగా మాట్లాడి యుద్ధం ఆపేలా చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. అయినా ఈ భూమ్మీద యద్ధం కావాలని కోరుకునే ఏకైక వ్యక్తి పుతిన్గా అభివర్ణించారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ని రక్షించుకునేందుకే తాము పోరాడుతున్నామని ఇది న్యాయబద్ధమైన పోరాటం అని అన్నారు. భారత్ ఉక్రెయిన్కు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను అని కూడా అన్నారు. అంతేకాదు ఖార్కివ్లో రష్యా బాంబు దాడిలో మృతి చెందిన భారత విద్యార్థికి విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఇస్తాంబుల్లో ఉక్రెయిన్ మరోసారి రష్యాతో చర్చలు జరిపింది. కానీ మాస్కో చర్చల పురోగతిపై ఆశలు నీరుగారుస్తోందన్నారు. (చదవండి: యుద్ధంలో.. పుతిన్ను తప్పుదోవ పట్టిస్తోందెవరు?) -
పుతిన్పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పను: బైడెన్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండటానికి తగరంటూ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్లో పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై తన ఆక్రోశాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబించాయన్నారు. అందుకు క్షమాపణ చెప్పడం గానీ, వాటిని వెనక్కు తీసుకోవడం గానీ చేయబోనన్నారు. రష్యాలో తానేమీ నాయకత్వ మార్పు కోరడం లేదనిస్పష్టం చేశారు. అది అమెరికా విధానం కాదన్నారు. ‘ఉక్రెయిన్పై మతిలేని యుద్ధంతో పుతిన్ ఇప్పటికే ప్రపంచమంతటా అంటరాని వ్యక్తిగా మారారు. స్వదేశంలో ఆయన పరిస్థితి ఏం కానుందో! చెడ్డ వ్యక్తులు చెడు పనులు చేయడాన్ని అనుమతించొద్దు. నా వ్యాఖ్యలను ఆ ఉద్దేశంతోనే చూడాలి. అంతే తప్ప పుతిన్ను తప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్నది నా వ్యాఖ్యల ఉద్దేశం కాదు’ అంటూ వివరణ ఇచ్చారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
రష్యా విభజన దిశగా యోచన...టెన్షన్లో ఉక్రెయిన్!
Zelenskyy accused the West of cowardice: గత నెలరోజులకు పైగా రష్యా ఉక్రెయిన్పై పోరు సాగిస్తూనే ఉంది. రష్యా వేటిని లక్ష్యపెట్టక బాంబుల దాడులతో ఉక్రెయిన్ని అల్లకల్లోలం చేస్తోంది.ఈ నేపథ్యంలో యూఎస్ చట్ట సభ్యులతోనూ, యూరోపియన్ దేశాలకు తమకు మిలటరీ సాయం అందిచమని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. ఈ విషయమైన జెలెన్ స్కీ మాట్లాడుతూ తమకు మరిన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు కావాలని విజ్క్షప్తి చేశారు. అయితే పశ్చిమ దేశాలు తమకు మిలటరీ సాయం అందించెందుకు వెనకడుగు వేస్తున్నాయని, పిరికివని ఆరోపణలు చేశారు. అయితే యూఎస్, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కి పెద్ధ ఎత్తన మిలటరీ సాయం అందిచాయి కూడా. కానీ జెలెన్స్కీ అది సరిపోదని మరింత సాయం కావాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైరిలో బుడనోవ్, ఉక్రెయిన్ను రెండుగా విభజించాలని రష్యా ప్రయత్నిస్తోందని, ఉత్తర దక్షిణ కొరియాల మాదిరిగానే చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాదు ష్యా ఇప్పుడు తూర్పు డోన్బాస్ ప్రాంతాన్ని నియంత్రించడంపైనే ప్రధాన దృష్టి పెట్టిందని, దాని ప్రధాన లక్ష్యానికి చేరుకున్న తర్వాత బలగాలు ఉపహరించి విభజన దిశగా అడుగులు వేస్తోందేమోనని ఉక్రెయిన్ భయాందోళనలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మాత్రం ఉక్రేనియన్ల గెరిల్లా యుద్ధం అటువంటి ప్రణాళికలను నిర్వీర్యం చేస్తుందని ధీమాగా చెబుతుండటం గమనార్హం. అంతేకాదు 2014 నుంచి రష్యా-మద్దతుగల వేర్పాటువాదులచే పాక్షికంగా నియంత్రణలో ఉన్న తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై మాస్కో తన దృష్టిని కేంద్రీకరించిందని ఉక్రెయిన్ పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దళాలను తూర్పు వైపుకు మళ్లిస్తున్నట్లు రష్యా ఉన్నత స్థాయి అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్తో చర్చల్లో, మాస్కో డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తోందని తెలపింది. అంతేగాక యుద్ధాన్ని ముగించడంపై రష్యాతో చర్చలు జరగనున్నట్లు ఉక్రేనియన్ ప్రతినిధి డేవిడ్ అరాఖమియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సోమవారం టర్కీలో సమావేశమవుతాయని కూడా చెప్పారు. కానీ రష్యా మాత్రం చర్చలు మంగళవారం ప్రారంభముతాయని చెప్పడం గమనార్హం. ఇంతకముందు జరిగిన చర్చలు, ఒప్పందాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మేరకు జెలెన్ స్కీ కూడా తన పాత పాటనే పాడుత్నున్నారు. ఈ వారం టర్కీలో జరిగే ఉక్రేనియన్-రష్యన్ చర్చలలో ఉక్రెయిన్ ప్రాధాన్యతలు "సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత" అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. తాను శాంతి కోసమే చూస్తున్నాని, ఈసారి టర్కీలో ముఖాముఖి సమావేశానికి అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. (చదవండి: అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్స్కీ! పుతిన్ తగ్గట్లేదా?) -
పుతిన్ VS జెలెన్స్కీ
-
టెక్నాలజీనే పుతిన్ ప్రధాన శత్రువు
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధంలో సామాజిక మాధ్యమాలు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. యుద్ధం అనివార్యమని స్పష్టమవుతుండటంతో సైనిక దళాల కదలికలను పసిగట్టడానికి వారు తక్షణం రంగంలోకి దిగారు. తమ జీవితాలు ఎలా ధ్వంసమవుతున్నాయో ప్రపంచానికి చూపడానికి స్మార్ట్ ఫోన్లను ఉపయోగించసాగారు. అదే సమయంలో రష్యన్ ప్రభుత్వం సెన్సార్షిప్ పేరుతో మీడియాపై యుద్ధం ప్రకటించింది. అసలు యుద్ధం ఎలా పరిణమిస్తుందో గానీ, ఈరోజు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. అఫ్గానిస్తాన్, సిరియా ఉదంతంలో కంటే, టిక్టాక్ వీడియోలు ఉక్రెయిన్పై యుద్ధంతో మరింత త్వరగా, సన్నిహితంగా పెనవేసుకుపోయాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. ఉక్రెయినియన్లు ఈ మాధ్యమాన్ని అధికంగా వినియోగిస్తారు కనుక ఇది వారి ఏకైక వేదికగా మారింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని జర్నలిస్టులకు ఈ యూజర్లే ప్రధాన వనరులు అయిపోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉంటున్న ఒక ఇన్ఫ్లూయెన్సర్ ఫిబ్రవరి 23న పరుపుమీద కూర్చుని తనకు తాను రికార్డింగ్ చేశారు. తనకు సమీపంలో పేలుళ్ల గురించి ఆమె వర్ణిస్తూ ఏదో సీరియస్ ఘటన ప్రారంభమవుతున్నట్లుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈలోగా రష్యాలో యువతీయువకులు రష్యన్ మాల్స్లో షాపులను మూసి వేస్తున్న వీడియోలను పోస్ట్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఒక ఉక్రెయిన్ మహిళ, పోలండ్వైపు తాను ప్రయాణిస్తున్న ప్రతి అడుగునూ గ్రాఫిక్స్తో చూపిస్తూ తాను తప్పించుకున్న విధానాన్ని సుదీర్ఘంగా చూపించారు. ఆమె పది గంటలపాటు రైలులో నిల్చుని ప్రయాణించింది. తర్వాత సరిహద్దు వద్ద అయిదుగంటల పాటు నిలబడి పాస్పోర్టు కూడా లేకుండా పోలండ్లోకి అడుగుపెట్టింది. అలాగా తన చుట్టూ ఉన్న ఇతర శరణార్థులు రుచికరమైన కుడుములను తింటూండటం గురించి కూడా ఆమె చిత్రీకరించింది. యుద్ధ నేపథ్యంలో టిక్టాక్ వ్యూయర్లు ఉక్రెయిన్ గురించి చేసిన శోధన ఒక్కరోజులో 1.4 బిలియన్లకు పెరిగిందని వార్టాక్ అనే టిక్టాక్ అకౌంట్ పేర్కొంది. ఇలా యుద్ధంలో నాలుగు వారాలు గడిచిన తర్వాత అమెరికా, రష్యా రెండు దేశాలూ ఉక్రెయిన్పై దాడి గురించిన వార్తలను ఈ టిక్టాక్ యూజర్ల పోస్టుల నుంచే తమ ప్రజలు చూస్తున్నారని గుర్తిం చాయి. ముప్పైమంది ఉక్రెయిన్ సోషల్ మీడియా ప్రభావశీలురికి కనీవినీ ఎరుగని విధంగా జో బైడెన్ పాలనాయంత్రాంగం బ్రీఫింగ్ చేయడం అసాధారణమనే చెప్పాలి. అలాగే మాస్కో ప్రభుత్వ అను కూల వార్తలు పోస్ట్ చేయడం కోసం రష్యన్ ప్రభుత్వం రష్యన్ సోషల్ మీడియా ప్రభావశీలురకు డబ్బులిస్తోందని వైస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే అనుకూల ప్రచారంతో యుద్ధాన్ని గెలవడానికి రష్యాకు సోషల్ మీడియా ప్రభావశీలురు సరిపోరు. ఎందుకంటే యుద్ధాన్ని మొదలు పెట్టిందే రష్యా కదా! రష్యన్ అనుకూల ప్రచారా నికి పెద్దగా విలువ ఏముంటుంది? ఉక్రెయిన్కి ఉన్న ఇంటర్నెట్ పునాదిని ఎవరూ అంతతేలిగ్గా లోబర్చుకోలేరు. ఉక్రెయిన్లో 5 వేల మంది బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. రష్యా దాడి ప్రారంభం కాగానే శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీస్ కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎలాన్ మస్క్ తన స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ని యాక్టివేట్ చేశారు. ఈలోపు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం సోషల్ మీడియాపై సెన్సార్షిప్తోపాటు, ప్రభుత్వ వ్యతిరేక యుద్ధ వార్తలు పంపితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించడంతో టిక్టాక్ వంటి ఇతర అంతర్జాతీయ మీడియాపై ఆధారపడటం మరింతగా పెరిగింది. సైనిక కార్యకలాపాలపై తప్పుడు వార్తలు పంపితే 15 సంవత్సరాల జైలు శిక్షకు అనుమతిస్తూ రష్యా పార్లమెంట్ మార్చి నెల ప్రారంభంలో చట్ట సవరణ చేసింది. కొద్ది రోజుల లోపే ప్రముఖ పాశ్చాత్య వార్తల నెట్ వర్క్లన్నీ రష్యా నుంచి బయటకు వెళ్లిపోయాయి. తమ జర్నలి స్టులను ప్రమాదంలో పడేయడం ఇష్టంలేక బీబీసీ, బ్లూమ్బెర్గ్ తదితర పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్లు కూడా రష్యాలోని తమ ఆఫీసులను ఖాళీ చేశాయి. దేశం లోపల ప్రముఖ అమెరికన్ టెలివిజన్ నెట్వర్క్స్ వార్తల ప్రసారాన్ని నిలిపివేయడంతో సోషల్ మీడియా వీడియోలు విస్తృ తంగా ప్రసారమవుతున్నాయి. ఇకపోతే ఉక్రెయిన్ సోషల్ మీడియా రష్యన్ ప్రాపగాండాని ఎదుర్కోవడంలో మీకు తోడ్పడుతుంది. తన సొంత సోషల్ మీడియా బలగాన్ని ఏర్పర్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేతృత్వంలోనే సెన్సార్ షిప్ ఉంటుంది కాబట్టి వార్తలపై ఆంక్షలు విధించే పరిస్థితి కూడా ఉత్పన్నం కాదు. పైగా ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా చాలా స్థిరమైంది. దాన్ని విస్తృతంగా అనుసరిస్తుంటారు. ఇక ఉక్రెయిన్లో కొనసాగుతున్న రెండో యుద్ధం ఏమిటి అంటే, తప్పుడు సమాచారం, దుష్ప్రచారంపై సాగిస్తున్న యుద్ధమే! సాంకేతిక అవకా శాలు విస్తృతమవుతున్నందున యుద్ధ కాలంలో వాస్తవాల తనిఖీ కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రిటన్లో సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిసైలెన్స్ సంస్థ తనిఖీ చేసిన టిక్టాక్ వీడియోలలో 80 నుంచి 90 శాతం వరకు పౌరులు పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోలు అని తెలిసింది. ఈ యుధ్ధం మనకు తెలిపింది ఏమిటంటే, ఔత్సాహికులు, ఓపెన్ సోర్స్ పరిశోధకులు రష్యా దాడి సమయంలో కీలకమైన సైనిక కదలికలను విశ్లేషించడానికి టెక్నాలజీని ఉపయోగించడం. సైన్యం కదలికలను జియోలొకేట్ ద్వారా వీడియోలు తీసి యుద్ధం జరుగుతుండగానే ఘటనలను పునర్నిర్మించడం ప్రపంచానికి కొత్తే అని చెప్పాలి. చివరగా, రష్యన్ ప్రభుత్వం సెన్సార్షిప్కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం గురించి చెప్పాలి. బ్లాక్ చేసిన సేవలను పొందడానికి రష్యా లోనే వీపీఎన్ యాప్స్ని డౌన్లోడ్ చేయడం విపరీతంగా పెరిగి పోయింది. మరొక మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఇప్పటికీ ప్రభుత్వ అనుకూల, స్వతంత్ర కంటెంట్ రెండింటినీ పొందడానికి అనుమతి స్తోంది. బీబీసీ, రష్యన్ సర్వీస్ వంటి కొన్ని విదేశీ మీడియాల కంటెంట్ని కూడా టెలిగ్రామ్ అందిస్తోంది. అటు ఉక్రెయిన్లో, ఇటు రష్యాలో కూడా స్వతంత్ర మీడియాని సజీవంగా ఉంచడానికి పాశ్చాత్య దేశాల నుంచి దాతలు క్రౌడ్ ఫండింగ్ అందించడానికి పరుగు తీస్తున్నారు. రష్యన్ ప్రముఖ స్వతంత్ర వార్తా వెబ్సైట్ మెదుజా, లాత్వియాకు వెలుపల ఉన్న రష్యా శ్రోతలకు సమాచారం పంపుతూంటుంది. ఇది ఇప్పుడు మీడియా ఫండింగ్ సోదర కంపెనీ లకు పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. గూగుల్, ఫేస్బుక్ వంటి బడా మీడియా కంపెనీలతో పెట్టుకున్న రష్యా నష్టపోయింది. ఈ రెండు కంపెనీలు రష్యాను బ్లాక్ చేశాయి. రష్యా ఆన్లైన్ ఆర్థికవ్యవస్థకు ఊపిరాడకుండా చేసిన రెండు ప్రభావాల గురించి ఒక ప్రముఖ పత్రిక జర్నలిస్టు పేర్కొన్నారు. అవి ఏమిటంటే, సాంకేతిక నిపుణులు చాలామంది రష్యాను వదిలి వెళ్లిపోయారు. దీంతో రష్యన్ సెర్చ్ ఇంజిన్లు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీల నుంచి వచ్చిన ప్రకటనలపైనే ఇవి ఆధారపడి ఉండేవి. ‘పుతిన్స్ పీపుల్: హౌ ద కేజీబీ టుక్ బాక్ రష్యా అండ్ దెన్ టుక్ ఆన్ ద వెస్ట్’ పుస్తకం రాసిన జర్నలిస్ట్ కేథరిన్ బెల్టన్, పుతిన్ 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్ష పదవిని చేపట్టాక వేసిన తొలి అడుగు గురించి చెప్పారు. అధికారం చేపట్టిన నాలుగు రోజులలోపే రష్యాలో ప్రైవేట్ యాజమాన్యంలోని మీడియాకు వ్యతిరేకంగా పుతిన్ చర్యలు చేపట్టారు. ‘మీడియా మోస్ట్’ సంస్థ యజమాని, పాపులర్ టీవీ చానల్ ఎన్టీవీ ఓనర్ అయిన వ్లాదిమిర్ గుసిన్స్కీ ఆఫీసులపై పుతిన్ దాడి చేయించారు. మీడియా పవర్పై రష్యా అధ్యక్షుడి బద్ధ వ్యతిరేకత, ప్రభుత్వ టీవీపై ప్రయోగాలు చేయడం, ప్రైవేట్ మీడియా సంస్థలను ప్రభుత్వం స్వాధీనపర్చుకోవడం, ప్రభుత్వ కంపెనీ గాజ్ప్రోమ్ స్వాధీనం చేసుకున్న మీడియా ఆస్తులను తాను నమ్మిన కీలక వ్యక్తు లకు పుతిన్ అప్పగించడం వంటి ప్రతి అంశాన్నీ ఈ పుస్తక రచయిత్రి పూసగుచ్చినట్లు వివరించారు. కానీ తన మతిస్థిమితం లేనితనం, మూర్తీభవించిన అహంభావం అలా పక్కనబెట్టి చూస్తే, ఈ రోజు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు. వ్యాసకర్త జర్నలిస్ట్, మీడియా వ్యాఖ్యాత