Ram Temple
-
బీహార్లో అయోధ్యను మించిన రామాలయం
అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది.బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023, జూన్ 20 నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్టు కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత మూడు అంతస్తుల నిర్మాణం సాగనుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర, రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయ రెండో దశ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. -
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
‘అడవి రాముడి’కి నవ వసంతం
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మూతబడిన ఒక రామాలయం తలుపులు సీఆర్పిఎఫ్ అధికారుల చొరవతో 21 ఏళ్ల అనంతరం తెరుచుకున్నాయి. సుక్మా జిల్లాలోని చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపొంద గ్రామంలో పురాతన రామమందిరం ఉంది. ఆ గుడిలో గ్రామస్తులు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు 2003 సంవత్సరంలో గుడి మూసేసి తాళాలు వేశారు. అప్పటి నుంచి ఆలయం నిరాదరణకు గురైంది. మావోయిస్టుల భయంతో స్థానికులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. అయితే, కేరళపొంద గ్రామంలో నెల రోజుల క్రితం సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు తరచుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటుండగా.. 21 ఏళ్లుగా తెరుచుకోని రామాలయ అంశం బయటపడింది. అయితే, తమకు తాముగా గుడి తెరిస్తే మావోయిస్టులు ఇబ్బంది పెడతారని గ్రామస్తులు చెప్పడంతో సీఆర్పీఎఫ్ అధికారులు చొరవ తీసుకుని మంగళవారం ఆలయాన్ని తెరిచారు. 74వ బెటాలియన్కు చెందిన అధికారులు, జవాన్లతో పాటు గ్రామస్తులు ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ రామమందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు సుందరంగా ఉన్నాయని, గుడి శిఖరంపై ఆంజనేయస్వామి విగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. గుడి తలుపులు తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఇక నుంచి ప్రతిరోజూ పూజలు చేస్తామని, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. -
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం
ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిని అటకెక్కించింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇది అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై విరాజిల్లుతోంది. – సాక్షి, రాయచోటి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు 2019 తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీపంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాలయం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. పచ్చదనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేకమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కోదండ రాముని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యాణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యాణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి కల్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తులకు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివారం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు. టీడీపీ హయాంలో అంతంత మాత్రమే 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. తర్వాత కాలంలోనూ అభివృద్ధి పనులు అంత వేగంగా జరగలేదు. పైగా 2018లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వామి కల్యాణం రోజున ప్రకృతి విపత్తుతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి. కల్యాణం రోజు ఇంతటి అపశృతి చరిత్రలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2014 నుంచి స్వామికి కల్యాణం రోజున పట్టు వ్రస్తాలు సమర్పించేందుకు స్వయంగా సీఎం హోదాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా అభివృద్ధి దిశగా అంత ఆలోచనచేయలేదని విమర్శిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా టీటీడీ అధికారుల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులూ కల్పించింది. అభివృద్ధితో కళకళ చిన్నతనం నుంచి చూస్తున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం గత నాలుగేళ్లలో నమ్మలేనంతగా మారిపోయింది. ఆలయాన్ని చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది. గుడి కళకళలాడుతోంది. భక్తులకు సకల వసతులూ సమకూరాయి. – శ్రీనివాసులు, ఒంటిమిట్ట రామయ్యకు రాజయోగం నేను కొన్నేళ్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చైర్మన్గా పనిచేశాను. ఇతిహాసాల్లోనూ ఒంటిమిట్ట రామయ్యకు చరిత్ర ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో రామయ్యకు రాజయోగం పట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. – ముమ్మడి నారాయణరెడ్డి, పెన్నపేరూరు, ఒంటిమిట్ట మండలం అద్భుత క్షేత్రమైంది ఈ రామాలయం టీటీడీ ఆధ్వర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడిది గృహం సమకూరింది. స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాటపట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట -
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
డల్లాస్ లో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు
-
అయోధ్యకు పోటెత్తిన భక్తులు
-
ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్
ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్ బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. చదవండి: Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. కాగా బుల్డోజర్ యాక్షన్ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్కు బుల్డోజర్ యాక్షన్ వ్యాపించింది. -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ రియాక్షన్
-
అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!
అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు. ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి. ► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోనేరులకూ యోగం.. అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్ఫ్రంట్ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. -
‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’
కోల్కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ -
అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదు?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: హిందువులకు నేడు పండగ రోజని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య కోసం పోరాడిన కర సేవకుల మీద కాల్పులు జరిపారని, సరయు నదిలో గుట్టలుగా శవాలు తేలాయని అన్నారు. అయోధ పోరాటంలో తాను కూడా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప నెరవేరిందని పేర్కొన్నారు. కర సేవకుల బలిదానాలు వృథాగా పోలేదని అన్నారు. కరసేవకుల కుటుంబాలకు ఇన్నేళ్లకు అసలైన పండుగ వచ్చిందన్నారు. అయిదు వందలవందల ఏళ్ల స్వప్నం నెరవేరడం ఆషామాషీ కాదని చెప్పారుజ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాడి జరగలేదన్న బండి సంజయ్.. ప్రజల దృష్టి మరల్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా?. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా?.అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని అన్నారు. ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కన్నుల పండుగగా రామమందిర ప్రారంభోత్సవం -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రామ్ లల్లా దర్శనం: సోనూ నిగమ్ భావోద్వేగం, బీ-టౌన్ సెల్ఫీ వైరల్
#AyodhyaRamMandir శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఘనంగా జరిగింది. ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల రామనామ స్మరణతో యావద్దేశం పులకించిపోయింది. ఈ సందర్బంగా కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా బాలీవుడ్ నటుడు బిగ్బీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతోపాటు, రిలయన్స్ అధినేత అంబానీ దంపతులను పలకరించి అభివాదం చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆనంద పరవశంలో మునిగి జైశ్రీరామ్ అంటూ నినదించింది. రామ మందిరాన్ని చూసి, ఆనంద పరవశంలో నటి కంగనా రనౌత్. #AyodhaRamMandir pic.twitter.com/KsynLcVD92 — Actual India (@ActualIndia) January 22, 2024 అలాగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్ నటులు దిగిన సెల్ఫీ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ సుభాష్ ఘాయ్ అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం విశేషం. అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో సోను నిగమ్ 'రామ్ సియారామ్' పాటను ఆలపించారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Sonu Nigam gets emotional; says, "...Abhi kuch bolne ko hai nahi, bas yahi (tears) bolne ko hai."#RamTemplePranPratishtha pic.twitter.com/6yoZ4s8APy — ANI (@ANI) January 22, 2024 #WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm — ANI (@ANI) January 22, 2024 కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు. అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్లో ఇలా చూడండి!) -
Ayodhya Ram Mandir: 32 ఏళ్ల తర్వాత అయోధ్యకు ఉమాభారతి
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH — Uma Bharti (@umasribharti) January 22, 2024 సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే -
Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా భారతీయులు ఎదురు చూశారన్నారు. దేశమంతా రామ నామమే మార్మోగుతోందని.. రాంనగరికి వచ్చిన వారందరికీ స్వాగతం చెప్పారు. అన్న్ని దారులూ రామ మందిరానికే దారి తీస్తున్నాయన్నారు. ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారి జీవితం ధన్యమైందన్న యోగి.. మనమంతా త్రేతా యుగంలోకి వచ్చినట్లుందని తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.. ఈ రోజు ప్రతి రామ భక్తుడు సంతోషం, గర్వం, సంతృప్తితో ఉన్నాడని అన్నారు యోగి ఆదిత్యనాథ్. తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు. కాగా అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ్లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు. చదవండి: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక.. అప్డేట్స్ -
Prana Pratishtha: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట?
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రాయశ్చిత్తం, సరయూనది ఒడ్డున దశవిద్ స్నానం, విష్ణుపూజ, గోదాన్, రామ్ లల్లా విగ్రహంతో నగరమంతా ఊరేగింపు తదితార కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవాళే మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. పైగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు రోజుగా ప్రకటించాయి కూడా. దేశమంతా ఈ వేడుక నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మహోత్సవ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోనున్నాయి కూడా. ఈ సందర్భంగా అస్సలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ? ఎందుకని చేస్తారు? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం! ప్రాణ ప్రతిష్ట అంటే.. ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవం ఇవ్వడం. ప్రాణ్ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్లాల్ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎలా జరుగుతుందంటే.. ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. ఆ తర్వాత ఆవుపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు. ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టడం జరగుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది. వేదాలు, పూర్ణాహుతి శ్లోకాలతో పుష్పాలు, ధూపం, నైవేధ్యం వంటివి దేవుడికి సమర్పించడం జరగుతుంది. అయితే ఈ వేడుక మాత్రం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఘట్టం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా ఆయన విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చిన్న బంగారు కర్రతో కాజల్ని బాలారాముని పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపుతారు. చివరిగా 108 దీపాలతో మహా ఆరతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించడం జరగుతుంది. గుడ్డతో ఎందుకు కప్పి ఉంచుతారంటే.. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహ స్వచ్ఛతను కాపాడుకునేందుకు ముఖాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట పూజ కార్యక్రమాలు జరిపేంత వరకు అలా గుడ్డతో కప్పి ఉంచుతారు. ఇలా దేవి నవరాత్రలప్పుడూ, గణపతి నవరాత్రుల్లో కూడా చేయడం మనం గమనించే ఉంటాం. అందులోనూ 500 నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ పవిత్రోత్సవాన్ని మరింత కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కన్నుల పండగగా జరుపుతోంది రామజన్మభూమి ట్రస్ట్. దీన్ని పురుస్కరించుకుని రాష్ట్రాలలోని ప్రతి రామాలయంలో ఘనంగా పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఎటూ చూసిన రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్లో ఇలా చూడండి!) -
అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే..
ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్లతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించారు. #WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g — ANI (@ANI) January 22, 2024 రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. దర్శన వేళలు ఇవే అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అయోధ్యలో సచిన్, జడేజా, అనిల్ కుంబ్లే.. వీడియో వైరల్
భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టానికి సమయం అసన్నమైంది. అయోధ్య నగరంలోని భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు మరి కాసేపట్లో తెరలేవనుంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ప్రముఖులు ఆయోద్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్య పురి మొత్తం భక్తులతో నిండిపోయింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Sachin Tendulkar reached Ayodhya#RamMandirPranPrathistha | #AyodhyaRamMandirpic.twitter.com/HuHQE9NxhR — Don Cricket 🏏 (@doncricket_) January 22, 2024 వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భారత స్టార్ ఆల్రౌండర్ ,రవీంద్ర జడేజా కూడా అయోధ్య పుర వీధుల్లో కన్పించాడు.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Virat Kohli reaches Ayodhya for Ram Mandir Pran Pratishtha 🛕#ViratKohli #RamMandir #Ayodhya #CricketTwitter pic.twitter.com/k132x5UNv9 — InsideSport (@InsideSportIND) January 22, 2024 -
ఆర్ట్లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ స్పెషల్ విషెస్
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని ఇన్స్ట్రాగ్రామ్లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు. చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!? Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ — Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024 -
సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
#ShriRamJanmabhoomiMandir అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్ను వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించామని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో , 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4) సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు భక్తులను అబ్బురపరుస్తాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీష్ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 -
అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7000 మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఉన్నారు. బాలరాముని ప్రాణప్రతిష్టకు హాజరయ్యే పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ నీతా అంబానీ కుమార్ మంగళం బిర్లా అజయ్ పిరమల్ ఆనంద్ మహీంద్రా అజయ్ శ్రీరామ్ కె కృతివాసన్ కె సతీష్ రెడ్డి పునీత్ గోయెంకా SN సుబ్రహ్మణ్యన్ మురళి దివి ఎన్ఆర్ నారాయణ మూర్తి నవీన్ జిందాల్ నరేష్ ట్రెహాన్ అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
అందంగా ముస్తాబైన భద్రాద్రి రామాలయం
-
అయోధ్యలో నూతనోదయం: యోగి ఆదిత్యానాథ్
జాసు బిరహ సోచహు దిన రాతీ! రటహు నిరంతర గున్ గన్ పాంతి!! రఘుకుల తిలక సుజన్ సుఖదాత! ఆయౌ కుసల్ దేవ ముని త్రాతా!! శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్ రాఘవ్ రామ్లల్లా’ తన జన్మస్థలమైన అవధ్పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగు తున్న ఈ చరిత్రాత్మకమైన, పవిత్రమైన సందర్భం... భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ‘మోక్షదాయని’ అయోధ్యపై చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారీ శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనందబాష్పాలతో తడిసిపోతుంది. అందరూ ‘రామ్–రామ్’ అని జపిస్తారు. తరతరాలుగా విశ్వాసులు, లోకాన్ని విడిచిపెట్టిన రామభక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. 2024 జనవరి 22 ప్రాముఖ్యత బాలరూప రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మించినది. ఇది ప్రజల విశ్వాస పునఃస్థాపనను సూచిస్తుంది. అయోధ్య ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శ్రీరామ జన్మభూమి ముక్తి మహాయజ్ఞం’ అనేది కేవలం సనాతన విశ్వాసానికి పరీక్ష కాదు; ఇది విజయవంతంగా దేశ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పింది. భారత దేశాన్ని ఐక్యతా సూత్రంతో కలిపింది. రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ప్రత్యేక ఐక్యత అసమానమైనది. సాధువులు, సన్యాసులు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సామాజిక సాంస్కృతిక సంస్థలు రోడ్మ్యాప్ను రూపొందించి ప్రజలను ఏకం చేశాయి. ఆ తీర్మానం ఎట్టకేలకు నెర వేరింది. భారతదేశంలో కొత్త ఉషస్సు వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు ‘అవని అమరావతి’ అనీ, ‘భూలోక వైకుంఠం’ అనీ పిలి చిన అయోధ్య శతాబ్దాల పాటు శాప గ్రస్తంగా ఉండిపోయింది. ‘రామ రాజ్యం’ ఒక ఆదర్శ భావనగా ఉన్న దేశంలోనే రాముడు తన ఉనికిని నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చింది. అతని జన్మస్థలానికి ఆధారాలు కావాల్సి వచ్చింది. కానీ శ్రీరాముని జీవితం మర్యాదగా ప్రవర్తించడం, స్వీయ నిగ్రహాన్ని పాటించడం నేర్పుతుంది. రాముని భక్తులు ఓర్పు, పట్టుదలను ప్రదర్శించారు. నేడు అయోధ్య తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడంతో యావత్ జాతి సంతోషిస్తోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు! 2024 జనవరి 22 వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన సందర్భం. నేను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు, రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు నా మనస్సును ముంచెత్తుతున్నాయి. ఈ సంకల్పమే నన్ను గౌరవనీయులైన గురుదేవ్ మహంత్ వైద్యనాథ్ జీ మహారాజ్ సద్గుణ సాంగత్యంలోకి నడిపించింది. విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మా తాత బ్రహ్మలీన్ మహంత్ శ్రీ దిగ్విజయ్నాథ్ జీ మహారాజ్, గౌరవనీయులైన గురుదేవ్ బ్రహ్మలీన్ మహంత్ శ్రీ వైద్యనాథ్ జీ మహారాజ్తో పాటు ఇతర గౌరవనీయులైన సాధువులు భౌతికంగా లేరని నాకు తెలుసు. కానీ వారి ఆత్మలు కచ్చితంగా అపారమైన సంతృప్తిని అనుభవిస్తాయి. గౌరవనీయులైన నా గురువులు జీవితాంతం అంకితభావంతో చేసిన తీర్మానం నెరవేరడానికి సాక్షిగా నిలవడం నా అదృష్టం. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా ప్రతిష్ఠాపన గురించి ప్రకటించినప్పటి నుండి, ప్రతి సనాతన విశ్వాసిలో నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనంద వాతావరణం దేశమంతటా వ్యాపించింది. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, రామసనేహి, ఘీసాపంథ్, గరీబ్దాసి, అకాలీ, నిరంకారీ, గౌడీయ, కబీర్పంథ్ వంటి విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు... అనేక సంఖ్యలో ఉన్న శాఖలు, ఆరాధన పద్ధతుల వారు... 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు... అటవీ – గిరి నివాసులు, గిరిజన సమూహాలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు... రాజకీయాలు, సైన్స్, పరిశ్రమలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలవారు అందరూ ఒకే గొడుగు కిందకు చేరడం నిజంగా అపూర్వమైనది, అరుదైనది. ఈ మహత్తరమైన సందర్భం ఎంతో గర్వకారణం. ఉత్తరప్రదేశ్లోని 25 కోట్ల మంది ప్రజల తరఫున పవిత్ర అయోధ్యధామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తరువాత, అయోధ్యధామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, పర్యా టకులకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ప్రణాళికలకు అనుగుణంగా అయో«ధ్యాపురి కచ్చితమైన సన్నాహాలు చేస్తోంది. నగరం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన రైల్వే స్టేషన్, అన్ని దిశల నుండి కలుస్తున్న 4–6 లేన్ రోడ్లతో బాగా అనుసంధానించబడిన నెట్వర్క్ను కలిగి ఉంది. అదనంగా హెలిపోర్ట్ సేవ, సందర్శకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలమైన హోటళ్లు, అతిథి గృహాల శ్రేణి ఏర్పాటైనాయి. కొత్త అయోధ్యలో, పురాతన సంస్కృతి, నాగరికత పరిరక్షణ జరుగుతూనే అత్యాధునిక నగర సౌక ర్యాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగినట్టుగా నిర్మాణం జరుగుతోంది. ఈ చొరవలో భాగంగా అయోధ్యలోని పంచకోసి, 14 కోసి, 84 కోసి పరిక్రమ పరిధిలోని మతపరమైన, పౌరాణిక. చారిత్రక ప్రదేశాలకు వేగవంతమైన పునరుజ్జీవనం కలిగించడం జరిగింది. ఈ సమష్టి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా పర్యాటకాన్ని పెంచడానికీ, ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ ఉపయోగపడతాయి. శ్రీరామ జన్మభూమి ఆలయ స్థాపన ఒక లోతైన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సూచిక. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జాతీయ దేవాలయం. శ్రీరామ్లలా పవిత్రోత్సవం యావత్ జాతి జనుల హృదయాన్ని గర్వంతో ఉప్పొంగించే ఒక ముఖ్యమైన సందర్భం. రాముడి దయతో, అయోధ్య సంప్రదాయ పరిక్రమ పవిత్రత ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలూ దాని పవిత్ర మార్గాన్ని నాశనం చేయలేవు. అయోధ్య వీధులలో ఇక బుల్లెట్లు ప్రతి ధ్వనించవు, సరయూ నది రక్తపు మరకను భరించదు, కర్ఫ్యూ విధ్వంసం జరగదు. బదులుగా ఆనందో త్సవ వేడుకలు జరుపుకొంటూ, రామనామ సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది. అవధ్పురిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ భారతదేశంలో రామరాజ్య స్థాపన తాలూకు ప్రకటనను తెలియజేస్తుంది. ఇది ఆదర్శానికి స్వరూపం. ఇక్కడ ‘సబ్ నర్ కరహీ పరస్పర ప్రీతి చలహీ స్వధర్మం నిరత శుతి నీతి’ అవుతుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరూప రాముని విగ్రహం మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రతి సనాతన విశ్వాసి తన మతపరమైన సూత్రాలను అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ శుభ సందర్భంగా 140 కోట్ల మంది తోటి పౌరులకు అభినందనలు! మన పూర్వీకులు నెలకొల్పుతామని గంభీరంగా ప్రమాణం చేసిన ఆలయాన్ని నిర్మించాలనే నిబద్ధత నెరవేరడం చూసి మనం ఎనలేని సంతృప్తిని పొందుదాం. భగవంతుడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి. శ్రీ రామః శరణం మమ జయ–జయ శ్రీసీతారామ్! యోగి ఆదిత్యనాథ్ వ్యాసకర్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి -
కౌంట్డౌన్: సర్వాంగ సుందరంగా అయోధ్య
మరికొద్ది గంటల్లో ఓ మహాఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రుల వారు కొలువుతీరనున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రేపు(సోమవారం)మధ్యాహ్నం 12 :15 నిమిషాల నుంచి 12: 45 నిమిషాల మధ్య జరుగనుంది. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు చేసే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ట అనగా స్థాపన. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు. దీంతో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా, ఎక్కడా చూసినా రాముడు, సీత, హనుమంతుడు, రామయాణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఇవి కూడా చదవండి: అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు.. ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా చూడటం ఎలా? అయోధ్యకు ఎలా వెళ్లాలి?.. దర్శనానికి ఏం చేయాలి అంతా రామమయం.. ఈ సంగతులు మీకు తెలుసా? -
రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్ చేశారు. అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir! Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world! Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm — KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024 ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. -
గుడిని శుభ్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ వచ్చేయ్ అంటూ..
శతాబ్దాల కల సాకారం కానుంది. సోమవారం(జనవరి 22) అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానాలు అందాయి. అందులో కంగనా రనౌత్ కూడా పేరు కూడా ఉంది. ఇంకేముంది, వెంటనే అక్కడ వాలిపోయిందీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. సిల్క్ చీర కట్టుకుని బంగారు నగలు ధరించి అయోధ్యలో హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటి గుడి ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేసింది. అనంతరం అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రామా.. ఇకనైనా వచ్చేయ్.. ఈ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన ఆధ్వర్యంలో హనుమంతుడి యాగం చేశాను. అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలో.. చాలా కాలం తర్వాత అయోధ్య రాజు తన స్వస్థలానికి రేపు తిరిగివస్తున్నాడు. వచ్చేయ్ రామా.. వచ్చేయ్' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. కాగా కంగనా రనౌత్ చివరగా తేజస్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె ప్రస్తుతం ఎమర్జన్సీ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు కావాలి.. అప్పుడు సంతోషంగా లేను, అందుకే.. -
రాముని విగ్రహం ఫొటోలు లీకు..! ప్రధాన పూజారి ఆగ్రహం
లక్నో: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు." అని తెలిపారు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలని ఆచార్య సత్యేంద్ర దాస్ కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. #WATCH | Ayodhya: On the idol of Lord Ram, Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, "...The eyes of Lord Ram's idol cannot be revealed before Pran Pratishtha is completed. The idol where the eyes of Lord Ram can be seen is not the real idol. If… pic.twitter.com/I0FjRfCQRp — ANI (@ANI) January 20, 2024 రేపు (జనవరి 22)న అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలో ప్రముఖ నేతలు హాజరుకావడానికి ఆహ్వానాలు అందాయి. దాదాపు 7,000 మంది హాజరుకానున్నారు. ఈ వేడుకకు విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
Ayodhya: శోభాయమానం.. రామమయం
అయోధ్య/న్యూఢిల్లీ: రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’, ‘అయోధ్య సిద్ధమైంది’ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆహూతులకు హార్దిక స్వాగతం పలుకుతున్నాయి. లౌడ్స్పీకర్ల నిండా రామ నామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అణువణువూ రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతున్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని శనివారం పవిత్ర సరయూ నదీజలాలతో అభిషేకించారు. గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుదీ్ధకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శా్రస్తోక్తంగా వాస్తు శాంతి, అన్నాధివాస, పుష్పాధివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదన జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళస్నానం జరగనుంది... దర్శనాలకు బ్రేక్ తాత్కాలిక మందిరంలో పూజలందుకుంటున్న ప్రస్తుత రామ్లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్టించనుండటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుంచి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు. విమానాల వరద... అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహా్వనాలు అందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు రానున్నట్టు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్కు విజ్ఞప్తులు అందినట్టు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ ల్యాండయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్నీ అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగీ దిగగానే వచి్చన విమానాన్ని వచి్చనట్టే వారణాసి, లఖ్నవూ తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతిస్తారు. 2 నెలలు..2 కోట్ల మంది! రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచీ భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుంచి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కలి్పంచనుంది. ఒక్కో లోక్సభ నియోజవర్గం నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 543 లోక్సభ స్థానాల నుంచీ భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఫొటోలు లీకయ్యాయి: పూజారి ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. యజమానులుగా 14 మంది దంపతులు ప్రాణప్రతిçష్ట క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొననున్నారు. వీరిని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీరందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని రామ జన్మభూమి ట్రస్టు వర్గాలను ఉటంకిస్తూ ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ వివరించారు. జైషే బెదిరింపులు ప్రాణప్రతిష్ట సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తున్నాయి. ‘రామ’ రైల్వేస్టేషన్లకు విద్యుత్ వెలుగులు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వేస్టేషన్లున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం అయోధ్య రామునికి దేశ విదేశాల నుంచి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం శనివారం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్కు చెందిన నాగభూషణంరెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాశ్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమరి్పంచాలంటూ చివరి కోరిక కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీగఢ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణంరెడ్డి చెప్పారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రసాదాలు ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. టెప్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1,265 కిలోల భారీ లడ్డూతో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్ (56 రకాల భోజన పదార్థాల)తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. -
అయోధ్య వేడుక.. ఆహ్వానం అందింది: మోహన్బాబు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుండగా ఇందుకోసం రాజకీయ, సినీ, క్రీడా రంగంలోని తదితర సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపారు. తాజాగా తనకూ ఆహ్వానం అందిందని చెప్తున్నాడు డైలాగ్ కింగ్ మోహన్బాబు. శనివారం నాడు ఫిలిం నగర్లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్టపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ.. 'ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులున్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు(రాములవారి ప్రాణప్రతిష్ట పూర్తయ్యేవరకు) అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఆయన మంచి పర్ఫార్మర్.. తనతో నటించేందుకు ఎదురు చూస్తున్నా.. -
అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్
Ayodhya Ram Mandir Ceremony: తాను అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు. కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్ను బాయ్కాట్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. జనవరి 22 తర్వాత వెళ్తా: కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘వాళ్లు(రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు) నాకొక లేఖ పంపించారు. ఆతర్వాత మేము వాళ్లకు ఫోన్ చేసి విషయం ఏమిటని కనుక్కున్నాం. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా, మరేం పర్లేదు. అయితే, అక్కడికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఆ లేఖలో వాళ్లు స్పష్టంగా పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఇది భక్తిభావానికి సంబంధించిన విషయం. ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే, తాను తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను గనుక జనవరి 22 తర్వాత అక్కడికి వెళ్తానని కేజ్రీవాల్ చెప్పడం కొసమెరుపు. వాళ్లే వెళ్లడం లేదు కదా మరోవైపు.. ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాత్రం శంకరాచార్యల వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ‘‘అంతటి వ్యక్తులే అక్కడికి వెళ్లడం లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. రామ మందిరం దేశ ప్రజలందరిదని... ఇందులో బీజేపీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీలు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే అది వాళ్లిష్టం. నేను మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తా. వ్యక్తిగా ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేనేమీ చేయలేను. నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పట్టించుకోను’’ అని పరోక్షంగా సొంత పార్టీకే సవాల్ విసిరాడు. కాగా భజ్జీ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. #WATCH | On opposition parties declining invitation to Ayodhya Ram Temple ‘Pran Pratishtha’ ceremony, former Cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, " It is our good fortune that this temple is being built at this time, so we all should go and get the blessings.… pic.twitter.com/YUAplDGMNk — ANI (@ANI) January 19, 2024 వాళ్లకు ఆహ్వానాలు కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన -
అయోధ్యతో కుదరాలి సయోధ్య
జనవరి 22న అయోధ్యలో రావ్ులల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. ఏ విధంగా చూసినా ఇదొక చరిత్రాత్మక ఘట్టమే. ఇది హిందువుల ఐదు వందల ఏళ్ల ధార్మిక, రాజకీయ, న్యాయ పోరాటాల ఫలితం. ఈ వాస్తవాన్ని నిరాకరించడం విజ్ఞత కాదు. కొన్ని పీఠాల ఆచార్యులు, రాజకీయ పార్టీలు, ముహూర్తం గురించి, బీజేపీ ప్రమేయం గురించి లేవనెత్తుతున్న వివాదాలు ఇప్పుడు ప్రతిష్ఠను ఆపలేవు. అసలు కొత్త వివాదాలు లేవదీయడమేఅసంగతం. శ్రీరామచంద్రుడిని హిందువులు మర్యాద పురుషోత్తమునిగా కొలుస్తారు. ఆ విశ్వాసాన్ని మిగిలిన మతస్థులు గౌరవించడం మర్యాద. ఆత్మ గౌరవానికి సంబంధించిన భావన ఇందులో బలమైనది, ప్రధానమైనది. భారతదేశ వైవిధ్యం పరిఢవిల్లాలంటే అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొనాలి. రామాలయ నిర్మాణం అంటే ఇటుకలు, సిమెంట్, ఒక నిర్మాణం అనుకోవద్దని లాల్కృష్ణ అడ్వానీ రథయాత్ర సమయం నుంచి సంఘ పరివార్ చెబుతూనే ఉన్నది. విదేశీ పాలనలతో మిగిలిపోయిన మానసిక బానిసత్వ జాడలు తొలగించుకోవాలన్న తాత్త్వికత కలిగిన రాజకీయ పక్షం, దాని నాయకత్వంలోని ప్రభుత్వం హయాంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. బాబ్రీ కమిటీ తరఫున కోర్టులో పోరాడిన అన్సారీ సహా, పలువురు ముస్లింలు అయోధ్య ఆలయ నిర్మాణ స్ఫూర్తిని సరిగానే గ్రహించారు. పలువురు సిక్కులు కూడా. మనమంతా ఈ దేశ వారసులం, ఈ భూమిపుత్రులం అన్న ఏకసూత్రాన్ని ప్రాణప్రతిష్ఠ వారిలో ప్రతిష్ఠించింది. ఆలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి గతాన్ని మరచి అంతా సమైక్యంగా ఉండాలంటూ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి వంటి వారు పిలుపునివ్వడం శుభసూచకమే. అలాగే ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కె.కె.మహమ్మద్ కొద్దిరోజుల క్రితమే కాశీ, మధుర కూడా హిందువులకు అప్పగించడం సరైన చర్య అవుతుందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడమూ అసంగతం కాబోదు. డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు ఇస్తున్న గణాంకాల ప్రకారం విదేశీయుల దండయాత్రలతో, మతోన్మాదంతో, పాలనలో ముప్పయ్ నుంచి నలభయ్ వేల హిందూ దేవాలయాలు నేలమట్ట మైనాయి. హిందూ సమాజం వాటి గురించి పట్టుపట్టడం లేదు. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ కూడా ప్రతి మసీదులోనూ శివలింగాలను వెతికే పని చేయవద్దని నిర్మాణాత్మక మైన సూచన చేశారు. అయినా చరిత్రకారులుగా, ఉదారవాదులుగా చలామణి అవుతున్న కొందరి వైఖరి హిందువులే తగ్గి ఉండాలన్న ట్టుగా ఉంది. భారతదేశ వైవిధ్యం పరిఢవిల్లాలంటే అన్ని మతాల వారి మధ్య సయోధ్య నెలకొనాలి. సెక్యులరిజం అంటే మెజారిటీ మతస్థుల మనోభావాలకు మన్నన లేకపోవడం, మైనారిటీల బుజ్జగింపు కాదన్న దృష్టి అవసరం. ఒక ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్ మత ఉద్రిక్తత లతో తన ప్రగతివేగాన్ని తనే తగ్గించుకోవడం ఆగిపోవాలి. దానికి రామమందిర ప్రాణ ప్రతిష్ఠతో శ్రీకారం చుట్టాలి. బాబ్రీ మసీదు రగడలో ముస్లింల వైపు నుంచి మతోన్మాద దృక్కో ణాన్ని చూడక్కరలేదు. మొదటి నుంచి బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకున్న పార్టీలు, కుహనా సెక్యులరిస్టు చరిత్రకారుల వల్ల ఇది రావణకాష్ఠం అయింది. ఈ మాట సంఘపరివార్ అన్నది కాదు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ కె.కె. మహమ్మద్ అన్నదే. అయోధ్యగురించి పదే పదే మాట్లాడి సమస్యను జటిలం చేసిన కొందరు చరిత్ర కారులను సాక్షాత్తు సుప్రీంకోర్టు 2019 నాటి తన తీర్పులో అభిశంసించిన సంగతిని మరచిపోవవద్దు. నిజానికి మసీదులను తరలించడం, ముస్లిమేతరులు కూల్చడం, స్వయంగా ముస్లిములే తొలగించడంవంటి ఘట్టాలు బాబ్రీ కూలిన 1992 డిసెంబర్ 6కు ముందు ఉన్నాయి, తరువాత కూడా జరిగాయి. కొన్ని ఉదాహరణలు చూడాలి. మొదటిగా చెప్పుకోవలసినది సౌదీ అరేబియాలో ప్రవక్త మహ మ్మద్ జీవితంతో సంబంధం ఉన్న మసీదులు, ప్రాంతాలను కూడా వారు అవసరం మేరకు తొలగించారు. ప్రవక్త మసీదు అందులో ఒకటి. ఇది ప్రవక్త కట్టించిన పెద్ద మసీదులలో రెండవదని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ పనిని అక్కడి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా చేసింది. కానీ బాబ్రీ అయోధ్య విషయంలో ఇంత అవాంఛ నీయ వాతావరణం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటనేది పరిశీలిస్తే అర్థమవుతుంది. అయోధ్య రగడకు కేంద్రబిందువు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్కు మరణానంతరం జరిగిన గౌరవం ఏమిటో తెలియాలంటే, ఆయన సమాధికి పట్టిన గతి ఏమిటో తెలియాలి. 1530లో చనిపోవడానికి ముందే తన అంత్య క్రియలు అఫ్గానిస్తాన్లో జరగాలని వారసులను కోరాడు బాబర్. కానీ వారు ఆగ్రాలోనే నిర్వహించారు. బాబర్ కొడుకు హుమాయున్ను తరి మేసి అధికారంలోకి వచ్చిన షేర్షా సూర్ 1539 ప్రాంతంలో బాబర్ కోరికను నెరవేరుస్తున్న తీరులో ఆ అవశేషాలను కాబూల్ నగర శివార్లకు చేర్చాడు. అక్కడే సమాధి ఏర్పడింది. దానిని షాజహాన్, జహంగీర్ తరువాత పెద్ద గార్డెన్గా అభివృద్ధి చేశారు. అఫ్గాన్ రాజు నాదిర్షా ఈ గార్డెన్ను (11 హెక్టార్లు) ఒక విహార యాత్రా స్థలంగా మార్చాడు. సమాధి రూపు మార్చాడు. అక్కడంతా ఐరోపా శైలిలో భవనాలు కట్టి, హోటళ్లు, వినోదకేంద్రాలు ఏర్పాటు చేశాడు. పోలెండ్ చరిత్రంతా రష్యా జార్ చక్రవర్తులతో, ‘ఎర్ర జార్’లతో పోరాటమే. 1920లో రాచరిక జార్ల ఆధిపత్యం పోయిన తరవాత రాజధాని వార్సాలోని అలెగ్జాండర్ నెవ్స్కీ కెథడ్రల్ను పోలెండ్ ప్రభుత్వమే కూల్చింది. 1894లో నిర్మాణం మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. 70 మీటర్ల ఎత్తయిన ఈ నిర్మాణం లియోన్ బెనొయిస్ అనే నాటి ప్రఖ్యాత వాస్తుశిల్పి ఆధ్వర్యంలో గొప్ప కళాత్మకంగా జరి గింది. అయినా నిర్మాణం పూర్తయిన పదేళ్లకే కూల్చారు. కారణం ఒక్కటే. పోలెండ్ ప్రజల జాతీయభావాలను అవమానించడానికి జార్ చక్రవర్తి ఈ చర్చ్ను నిర్మించాడని స్వతంత్ర పోలెండ్ భావించడమే. రెండు దేశాలవారు క్రైస్తవులే. తమ ప్రార్థనాలయాలే అయినాఅందులో జార్ చక్రవర్తి అణచివేత జాడలను చూశారు. ఇక చైనాలో వీగర్ ముస్లింలు, వారి అస్తిత్వం ప్రశ్నార్థకమైన సత్యాన్ని వీగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ నివేదిక వివరాలు కాస్త పరిశీలించినా అర్థమవుతుంది. కేరియా ఈద్ కాహ్ మసీదు 1200 సంవత్సరం ప్రాంతంలో నిర్మించినది. ఈ మసీదు రూపాన్ని వికృతం చేసి, పగోడాలా తయారు చేశారు. 1540 నాటి కార్గిలిక్ మసీదును పూర్తిగా ధ్వంసం చేశారు. 2016లో 100 మసీదులను నేలమట్టం చేయడం లేదా, రూపురేఖలను మార్చడం జరిగింది. అంటే మసీదును సంకేతించే గుమ్మటాలు, మీనార్లు తొలగించారు. అయోధ్య మసీదు విషయంలో రగడ చేసిన వామపక్షాల వారు, వారి అనుంగు చరిత్ర కారులు వీగర్ ముస్లింల మీద కాస్తయినా సానుభూతి ప్రకటించరేమి? ఇంచుమించు కాన్సెంట్రేషన్ క్యాంపులలోనే బతుకుతున్న వీగర్ ముస్లింల గురించి పాకిస్తాన్, టర్కీ పెదవి విప్పవేమి? ఇవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ రెండు విషయాలు గమనార్హం. ఈ విధ్వంసంలో ఎక్కడా హిందువులకు సంబంధం లేకపోవడం. బాబ్రీ విషయంలో మాత్రమే ఇంత రగడ జరగడం. అయోధ్య ఉద్యమం తీవ్రరూపం దాల్చి, అత్యధికంగా హిందువులు రామా లయం కోరుకున్నా కూడా మూడు దశాబ్దాలు వేచి చూడడం, వేచిఉండేటట్టు చేయడం ఎందుకు? నమాజ్ జరగని ఒక మసీదు కోసం ఇంత రగడను ఎందుకు కొనసాగించినట్టు? ఇంతకీ, అయోధ్యలో కడుతున్న కొత్త మసీదు పేరు బాబ్రీ మసీదు కాదు. మరి దేని కోసం జరిగింది ఈ అడ్డగింత? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుందాం. వాస్తవాలు గ్రహిద్దాం. అందులో మొదటిది, హిందువుల పరమత సహనం గురించి. అయోధ్య ఉద్యమ సమయంలో, ఆ నగరంలో లేదా భారతదేశంలో కావాలని ఏ మసీదునైనా కూల్చిన దాఖలాలు ఉన్నాయా? ఆరోపణలు ఉన్నాయా? మెజారిటీ ప్రజల మనోభావా లను అవమానించే తీరులో మైనారిటీలు వ్యవహరించడం సయోధ్యకు ఉపయోగపడేది కాదు. మెజారిటీ ప్రజలలో మెజారిటీ మనస్తత్వం సరికాదని చెబుతున్నవారు మైనారిటీల కొన్ని చర్యలలోని అసంబ ద్ధతను కూడా ఎత్తి చూపే బాధ్యతను స్వీకరించాలి. - వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ–మెయిల్: pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. అతిథుల జాబితా ఇదే!
ఎక్కడ, ఎవరి నోట విన్న పవిత్రమైన అయోధ్య, రామ మందిరం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట, ఈ మాటలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని వేలాది మంది అతిథులకు ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ప్రముఖుల నివాసాలకు వెళ్లి అయోధ్యలో జరిగే రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్లో కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజద్ అలీ ఖాన్, గీత రచయిత మనోజ్ ముంతాషీర్, అతని భార్య ప్రసూన్ జోషి, డైరెక్టర్లు సంజయ్ భన్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు పలువురు ఉన్నారు. పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూప్ చైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజయ్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివసన్ హాజరు కానున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కే సతీశ్ రెడ్డి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఆయన భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ హెడ్ నవీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మన్ నరేశ్ త్రెహాన్ ఉన్నారు. అలాగే లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జనరల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ జెట్లలో అయోధ్యకు వెళ్లనుండగా.. మరికొందరు సాధారణ విమానాల్లో ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రి అయోధ్య, లక్నో వంటి సమీప నగరాల్లో బసచేయనున్నారు. -
Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం
అయోధ్య: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. కాగా గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్ అంటూ పులకించిపోతున్నారు. రామ్లల్లా విశిష్టతలివే.. ►అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ► రామ్లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ►కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట పూజలు ► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్లల్లా దర్శనమిస్తాడు. ► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ►శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ►శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు ► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. ► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు. ► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. -
అంతా రామమయం..ఇంట్రస్టింగ్ సంగతులు తెలుసా మీకు?
అయోధ్యలో శ్రీరాముడి (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం (2024, జనవరి 22) ఆసన్నమవుతోంది. ఈ పుణ్యకార్యానికి సంబంధించిన అన్ని క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రామభక్తుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది. సోమవారం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు జై శ్రీరామ్ అంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు ,తమ ఇష్టదైవం శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు అయోధ్య వరకూ వెళ్లలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యేక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎటు చూసిన రామనామ జపం మారుమోగుతోంది. అసలు ఏంటీ అయోధ్య రాముని జన్మభూమి దేవాలయ చరిత్ర ఏంటి? ఎందుకంత విశిష్టత? మరి అక్కడికి ఎలా వెళ్లాలి, చూడాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం! ఇదీ చరిత్ర ⇒ 1885లో అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949లో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. ⇒ 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. ⇒ 1950లో పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. ⇒ 1959లో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. ⇒ 1981లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986లో ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ⇒ 1989లో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ⇒ 1992లో డిసెంబర్ 6 తర్వాత రామ మందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ⇒ 2002లో ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ⇒ 2010లో అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ⇒ 2011లో మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018లో ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ⇒ 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. ⇒ 2019లో ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కీలక సుప్రీంకోర్టు తీర్పు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. ఎలా వెళ్లాలి? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీ ప్రూఫ్నుకచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకదుస్తులు స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా, మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించాలి. దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఈ సందర్భంగా అయోధ్య ప్రయాణంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామభక్తుడైన ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ గర్హి. అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్-ఉద్-దౌలా ఈ ఆలయాన్ని స్థాపించారట. అలాగే అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని భక్తువల విశ్వాసం. సుమారు 76 మెట్లు ఎక్కి మరీ వాయుపుత్రుడిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో శుక్రవారం ప్రార్థనలు చేశారు. #WATCH | Uttar Pradesh Yogi Adityanath offers prayers at Hanuman Garhi temple in Ayodhya pic.twitter.com/VdRBr93kic — ANI (@ANI) January 19, 2024 రెండోది దేవకాళీ ఆలయం. సాక్షాత్తూ సీతమ్మవారు తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారట నమ్ముతారు. అలాగే గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరో ఘాట్. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది. రామ్ కీ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఛోటి దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని విశ్వసించే ప్రసిద్ధి చెందిన ఆలయం నాగేశ్వరనాథ్ దేవాలయం. ఆ తర్వాత శ్రీరాముని జంట కుమారుల్లో ఒకరైన కుశుడు అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడట. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు దర్శనమిచ్చే కనక భవన్ మరో అద్భుతమైన దేవాలయం. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతా దేవికి ఈ భవనాన్ని కానుకగా ఇచ్చారు. ముఖ్యంగా ఆలయ శిల్పం, శిల్పకళా వైభవానికి సంకేతమని చూసి తీరాలని భక్తులు నమ్ముతారు. -
Ayodhya Ram Mandir Idol Photos: అరుణుడు చెక్కిన అయోధ్య బాలరాముడితడే (ఫొటోలు)
-
దశాబ్దాల కల నెరవేరుతోంది: మోదీ
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణంతో దశాబ్దాల కల నెలరవేరిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇన్నాళ్లుగా భక్తులు రామున్ని చిన్న గుడారంలోనే దర్శించుకున్నారని చెప్పారు రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న దేశ వ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు. ప్రజలు తమ జీవితాల నుంచి పేదరికాన్ని తొలగించుకోవడానికి రామ జ్యోతి స్ఫూర్తినిస్తుందని మోదీ అన్నారు. మూడోసారి బీజేపీ పాలనలో భారత్ను ప్రపంచంలోనే మూడో ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశ ప్రజలకు కచ్చితంగా హామీ ఇస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. #WATCH | PM Modi in Maharashtra's Solapur says, "In the 3rd term of our Central government, in my next term, India will be in the top three economies of the world. I have given this guarantee to the people of India that in my next term, I will bring India into the top three… pic.twitter.com/A4DEGrrVOR — ANI (@ANI) January 19, 2024 రామ భజనలో నిమగ్నమైన దృశ్యాలను ప్రధాని మోదీ షేర్ చేశారు. "అయోధ్య రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు దేశం మొత్తం శ్రీరాముని పట్ల భక్తితో తడిసిముద్దయింది. నేపథ్య గాయకులు సురేష్ వాడ్కర్, ఆర్య అంబేకర్ తమ మధురమైన పాట ద్వారా భక్తుల భావాలను చిత్రీకరించారు" అని ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi sings 'Shri Ram Jai Ram' bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN — ANI (@ANI) January 16, 2024 రామ మందిర కార్యక్రమానికి ముందు మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. ఇదీ చదవండి: రాముడి కోసం.. నిద్రాహారాలలో కఠిన నియమాలు పాటిస్తున్న మోదీ -
PM Modi: రాముడి కోసం కఠిన నియమాలు
లక్నో: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మందిర నిర్మాణం నుంచి ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. బీజేపీ పెద్దల ఆశయాల్లో ఒకటిగా ఉన్న రామమందిరం నిర్మాణం తన చేతులమీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అప్పటికే పలుమార్లు చెప్పారు. అయోధ్య ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందే జనవరి 12 అనుష్టాన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నాటి నుంచి మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాన యజమానిగా మోదీ వ్యవహరించనున్నారు. జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. జనవరి 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మంది హాజరుకానున్నారు. 100 మంది విదేశీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారు. ఇదీ చదవండి: Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_6941921367.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం
లక్నో: అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. విగ్రహం కళ్లపై గుడ్డతో కప్పబడి ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే శుద్ధి కార్యక్రమాల కోసం రాముని పాదుకలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నిర్విఘ్నంగా క్రతువులు ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివస్లో భాగంగా రామ్లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన మైసూరులో ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబం స్వీట్లతో చేసిన రామమందిర ప్రతిరూపాన్ని తీసుకువచ్చింది. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్లల్లా -
అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్పేజీ ప్రారంభించిన ఐఎండీ
అయోధ్య: శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగే ఈ నెల 22న అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఏకంగా ఒక ప్రత్యేక వెబ్పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ట వేడుక జరిగే 22న అయోధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్, అత్యధిక ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని ఐఎండీ తెలిపింది. అయోధ్యలో 22వ తేదీన ఉండే ఉష్ణోగ్రతలతో పాటు తేమ, గాలి వేగం తదితర వాతావరణ సంబంధిత అంశాలను కూడా ఐఎండీ ఏర్పాటు చేసిన వెబ్పేజీ తెలియజేస్తోంది. 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు అయోధ్యలో ఉష్ణోగ్రతల ఫోర్క్యాస్ట్తో పాటు ఇక్కడ ఈ వారం రోజుల్లో ప్రతి రోజు ఏ సమయంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలవుతాయనే వివరాలను కూడా ఐఎండీ పొందుపరిచింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి IMD launched a dedicated page for Ayodhya weather forecast.#IMD #Ayodhya pic.twitter.com/wSEpUJr90K — Suresh Kumar (@journsuresh) January 18, 2024 ఈ వివరాలన్నింటని హిందీ, ఆంగ్లం, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఐఎండీ అందుబాటులో ఉంచింది. కేవలం అయోధ్యనే కాకుండా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, వారణాసి, లక్నోలతో పాటు రాజధాని న్యూ ఢిల్లీ నగరాల వాతావరణ వివరాలను కూడా ఐఎండీ వెబ్పేజీలో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. పర్యాటకుల సౌకర్యార్థమే ఐఎండీ ప్రత్యేక వెబ్పేజీని రూపొందించినట్లు సమాచారం. ఇదీచదవండి.. రామాలయం పోస్టల్స్టాంపు విడుదల -
రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్! #WATCH | Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and… pic.twitter.com/X2eZXJzTKz — ANI (@ANI) January 18, 2024 -
అయోధ్యకు హైదరాబాద్ నుండి భారీ లడ్డు, ముత్యాల మాల
-
అయోధ్యకు చేరుకున్న ‘హనుమంతుడు’..
అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధ నుండి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది అలాగే ప్రపంచం నలుమూలల నుండి అయోధ్యకు విలువైన కానుకలు చేరుతున్నాయి. ఈ రథం మూడేళ్లుగా దేశమంతటా తిరుగుతోంది. ఈ ప్రత్యేక రథం సీతామాత జన్మస్థలమైన బీహార్లోని సీతామర్హి గుండా అయోధ్యకు చేరుకుంది. ఈ రథంతోపాటు పర్యటనలు సాగిస్తున్న స్వామి గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న తరహాలోనే కిష్కింధలో కూడా హనుమంతుని ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీరాముని భక్తుడైన హనుమంతుని రాకకు చిహ్నంగా ఈ రథాన్ని అయోధ్యకు తీసుకువచ్చారు. ఈ రథం ద్వారా రామభక్తిని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఈ రథాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కిష్కింధ ప్రాంతం కర్ణాటకలోని కొప్పల్ విజయనగర జిల్లాలో ఉంది. ఇది తుంగభద్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న హంపి కంటే పురాతనమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆనెగుండి అని పిలుస్తున్నారు. కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడు తన సలహాదారు హనుమంతుని సహాయంతో పరిపాలించాడు. ఆనెగుండి గ్రామంలో రామాయణానికి సంబంధించిన పలు ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతమంతా రాళ్లు, పర్వతాలతో కూడి ఉంటుంది. రామాయణంలో ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన వినిపిస్తుంది. అనెగుండి గ్రామంలో పలు పురాతన గుహలు కూడా కనిపించాయి. ఇక్కడి రాళ్లపై కోతుల చిత్రాలను కనుగొన్నారు. ఇది కూడా చదవండి: రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి? -
రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం!
అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్లల్లా అడుగుపెట్టారు. శ్రీరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. జనవరి 16న నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశ యాత్ర చేపట్టారు. జనవరి 17న శ్రీరామ్లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్యలో ‘త్రేతా యుగం’నాటి రోజులు కనిపిస్తున్నాయి. అయోధ్యలోని అన్ని దుకాణాలపై రాములవారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. రామ్ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో అవి రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. శ్రీరామ్లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విమానం అయోధ్యతో కోల్కతా, బెంగళూరులను కలుపుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమానాలను ప్రారంభించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ జన్మభూమి మార్గంలోని ఎంట్రీ పాయింట్ దగ్గర రెండు పెద్ద స్తంభాలు నిర్మితమయ్యాయి. అవి త్రేతాయుగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి గోడలపై రామ్లల్లా జీవితానికి సంబంధించిన పలు దృశ్యాలు కనిపిస్తాయి. నూతన రామాలయం రాకతో ప్రముఖ స్టార్ హోటళ్లు అయోధ్యలో అడుగిడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారిపై గృహాలు కలిగినవారు తమ ఇళ్లను హోటళ్లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రూ.30,923 కోట్ల విలువైన 200కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 37 శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యూపీ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ 1200 ఎకరాల్లో న్యూ అయోధ్య టౌన్షిప్ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
సార్వత్రిక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరనుంది. సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్తోపాటు పలు కీలక పార్టీల అధినేతలకు కూడా శ్రీ రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని వెల్లడించిన విషయం విదితమే. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధానితో సహా బీజేపీ నేతృత్వంలోని కీలక నేతలు జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొంటే.. ఆ రోజు కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు, ఇతర పార్టీ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శన.. మతం అనేది వ్యక్తి గతమైన విశ్వాసమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆమె జనవరి 22న కోల్కతా సమీపంలోని కాళీఘాటకు వెళ్లి కాళీమాతను దర్శింకుంటానని తెలిపారు. అదేవిధంగా మత సామరస్యం పెంపొందాలని ర్యాలి చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాహుల్గాంధీ అస్సాంలో టెంపుల్ దర్శనం? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయం యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక యాత్రలో భాగంగా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు జనవరి 22న అస్సాంలోని ఓ గుడిని సందర్శిస్తారని తెలుస్తోంది. ఆ రోజు కాకుండా మరో రోజు.. రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదటి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాను రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేనని వెల్లడించారు. రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తాను అయోధ్య రాముడిని చాలా సులువుగా దర్శించుకుంటానని తెలిపారు. అప్పటి వరకు రాముడి మందిరం పూర్తిగా నిర్మాణం అవుతుందన్నారు. ఇంకా ఆహ్వానం అందలేదు.. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రస్తుతానికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందకపోవటం గమనార్హం. కానీ, ఆయన ఇప్పటికే రామ భక్తిలో నిండిపోయారు. జనవరి 22 రోజును ఢిల్లీ వ్యాప్తంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఆదేశించారు. సుందరకాండ పఠన కార్యక్రమాలను ఏర్పాటు చేయటంలో ఆప్ ప్రభుత్వం నిమగ్నమైంది. దేశ ప్రజలు కోరుకున్నవి జరగాలని అయోధ్య బాలరాముడికి ప్రార్థన చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే.. ‘మహా హారతి’ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జనవరి 22న నాసిక్లోని కాలారామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భగవాన్ కాలారామ్కు ‘మహా హారతి’ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆలయంలో నల్లరాతితో ఉన్న విగ్రహంలో రాముడు దర్శనం ఇస్తారు. రాముడు వనవాస సమయంలో నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో సీతా, లక్ష్మణులతో ఉండేవారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ జనవరి 22న జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళనాడులో డీఎంకే పార్టీ.. ఆధ్యాత్మికత పేరుతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్.. గత నెలలోనే తాము అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరుకామని తెలిపారు. తాము మతాలకు సంబంధించిన విశ్వాసాలు గౌరవిస్తామని అన్నారు. అయితే రాజకీయ ముగుసులో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలపై నమ్మకం లేదన్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ కౌంటర్ బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజే పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ను ప్రారంభించాడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసాలను బలోపేతం చేయటమే కాకుండా ఒడిశాలో బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్తో సహా ఇండియా కుటమి నేతలు.. బీజేపీ రామ మందిరాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా వాడుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని మండిపడుతున్నారు. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హజరుకాకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం అయోధ్య ముఖం చూడనన్న ప్రధాని మోదీ! -
అయోధ్య: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్లల్లా నేడు(బుధవారం) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
‘రామ మందిరం: రాజీవ్గాంధీ హయాంలోనే వేడుక జరిగింది’
అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రామాలయ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వాన ప్రతికలు అందజేస్తోంది. ఇక..ఈ కార్యక్రమంపై పలువురు రాజకీయ నాయకులు బీజేపీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తోదని రాబోయే లోక్సభ ఎన్నికలకు పావుగా వాడుకుంటోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పింస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీరుపై విమర్శలు చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ఏర్పాటుకు మాజీ, దివంగత ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ హయాంలోనే కీలకమైన ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) చేసి వేడుక జరిపారని గుర్తు చేశారు. శరద్ పవార్ కర్ణాటకలోని నిపాణిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంగళవారం మాట్లాడారు. రామ మందర విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయం కోసమే చాలా హడావుడీ చేస్తున్నాయని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) వేడుక చేశారని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయోద్యలో బలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 11 రోజులు ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. దానిపై కూడా సీనియర్ నేత శరద్ పవార్ స్పందిస్తూ.. రాముడిపై భక్తి, విశ్వాసం ఉండటాన్ని తాను గౌరవిస్తాన్నానని తెలిపారు. కానీ.. దేశంలో పేదరికం నిర్మూలించబడాలని ఉపవాసం చేస్తే దేశ ప్రజలు సైతం ప్రశంసిస్తారని హితవు పలికారు. చదవండి: అటల్ సేతుపై ఆటో రిక్షా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు! -
ప్రాయశ్చిత్త పూజ ఏమిటి? అయోధ్యలో ఎందుకు చేస్తున్నారు?
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముందుగా నేడు (మంగళవారం)ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నారు. ఇంతకీ ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రతీఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఆ తరువాత పశ్చాత్తాప పడుతుంటారు. హిందూ ధర్మంలో వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజించడానికి ప్రత్యేక నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏదైనా మతపరమైన ఆచారాన్ని నిర్వహించే ముందు వాటిని పాటించడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే పూజా విధానంలో పొరపాటున ఏవైనా నియమాలను తప్పితే, తప్పు జరిగిందని బాధపడుతుంటారు. అందుకే దోష పరిహారం కోసం ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ తరహా పూజలతో భౌతిక, మానసిక, అంతర్గత ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెబుతారు. ప్రాయశ్చిత్త పూజలో భాగంగా 10సార్లు పుణ్య స్నానాలు చేస్తారు. బూడిదతో సహా వివిధ వస్తువులతో స్నానం చేస్తారు. ఈ పూజలో గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి, నగలు మొదలైనవి కూడా దానం చేస్తారు. ప్రాయశ్చిత్త పూజలు చేయడం వలన ఎటువంటి దోషాలు అంటుకోవని చెబుతారు. అందుకే దేవాలయాలు నిర్మించినప్పుడు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని అంటారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
Ayodhya Ram Mandir: అలనాడు అయోధ్య రామమందిర కోసం.. నేడు ప్రాణప్రతిష్ట కోసం (అరుదైన చిత్రాలు)
-
శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు నెలల మౌనదీక్ష అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది. కుటుంబానికి దూరంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. శంకరాచార్యుల విగ్రహం కూడా.. అరుణ్ యోగిరాజ్కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్నాథ్లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇంటిలో సంక్రాంతి సంబరాలు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు. ‘జీవితం సార్థకమైంది’ అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి? -
అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి?
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుక జనవరి 22న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తూ వారికి లేఖలు పంపారు. అయితే జనవరి 22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? విమాన టిక్కెట్లు, హోటల్ గదుల ఛార్జీలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈజ్ మై ట్రిప్, థామస్ కుక్, ఎస్ఓటీసీ తదితర ట్రావెల్ సంస్థలు.. అయోధ్యలో జరిగే వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ‘థామస్ కుక్’, ‘ఎస్ఓటీసీ’ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుండి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధరలు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకూ చేరుకున్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. సోమవారం మేక్ మై ట్రిప్లో జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వన్వే ఫ్లైట్ టికెట్ రూ.17,900 నుంచి రూ.24,600 వరకూ ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్స్టాప్ విమానానికి రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్కతా నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధర రూ.19,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుండి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20కి రూ. 23,152 నుండి రూ. 32,855 వరకు విమాన టిక్కెట్ల ధర ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈజ్ మై ట్రిప్ పేర్కొన్న వివరాల ప్రకారం అయోధ్య రామాలయ ప్రారంబోత్సవానికి దాదాపు ఏడువేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈనెల 22 తరువాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుండి 100 శాతానికి చేరుకుంది. ఫలితంగా కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి పూట లక్నో లేదా ప్రయాగ్రాజ్లో బస చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ట్రాన్స్జెండర్ల కమ్మూనిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ట్రాన్స్జెండర్లు జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని ఆ పవిత్రమైన రోజు జన్మించే పిల్లల తల్లిదండ్రుల వద్ద ఎటువంటి డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఆశీర్వాచనం అందజేస్తామని తెలిపింది. తాము చిన్న పిల్లలు జన్మించిన ఇళ్లకు వెళ్లి పాటలు పాడి.. పుట్టిన చిన్నపిల్లలు సంతోషంగా పెరగాలని ఆశీర్వదిస్తామని ట్రాన్స్ కమ్మూనిటీకి చెందిన ప్రతినిధి రాణీ తెలిపారు. అయితే జనవరి 22 రాముడి ప్రాణప్రతిష్ట రోజున జన్మించే చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, కానుకలను తీసుకోకుండానే ఉచితంగా ఆశీర్వచనం ఇస్తామని తెలిపారు. రాముడి ప్రణప్రతిష్ట రోజు పిల్లల తల్లిదండ్రులు తమకు డబ్బుల బదులుగా సంతోషంగా పండ్లు ఇచ్చినా తీసుకుంటామని మరో ట్రాన్జెండర్ శరదా తెలిపారు. రాముడిని దర్శించుంచుకునే అవకాశం రావటం తమ జీవితాల్లో ఎంతో అదృష్టమని తెలిపారు. 500 ఏళ్ల నుంచి జరిగిన పోరాటం.. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టతో కార్యరూపం దాల్చుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. జనవరి 22న పవిత్రమైన రోజుగా భావిస్తూ.. అయోధ్యతో పాటు పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడంట! -
అయోధ్య రాముడికి 2.5 కిలోల విల్లు
లక్నో: శ్రీరాముడు అనగానే గుర్తొచ్చే రూపం విల్లు బాణం ధరించిన నిండైన విగ్రహం. ఈ నెల 22న అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగనుంది. ఆలయంలో కొలువుదీరే రామయ్యకు బహూకరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలో విల్లు, బాణాలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన విగ్రహానికి ఈ విల్లు, బాణాలు అలంకరిస్తారు. 2.5 కిలోల బరువైన ఈ విల్లు తయారీకి ఇతర లోహాలతోపాటు దాదాపు 700 గ్రాముల 23 క్యారెట్ బంగారం ఉపయోగిస్తున్నట్లు అయోధ్యలోని అమావా రామ మందిర్ ట్రస్టీ శయన్ కునాల్ చెప్పారు. వాల్మీకి రామాయణంలో వర్ణించినట్లుగానే విల్లుతోపాటు బాణాలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. రాముడు ఉపయోగించిన వేర్వేరు బాణాల వర్ణన వాల్మీకి రామాయణంలో ఉందన్నారు. చెన్నైలో సిద్ధమవుతున్న విల్లు, బాణాలు త్వరలో అయోధ్యకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 19న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు వీటిని అందజేస్తామని చెప్పారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏటా అయోధ్యకు దక్షిణ కొరియన్ల రాక! కారణం ఏంటంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశవిదేశాలను నుంచి రామ భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అయోధ్యకు ప్రతి ఏడాది వందల సంఖ్యలో దక్షిణ కొరియా దేశపు సందర్శకులు వస్తుంటారు. అయితే వారంతా వచ్చేది.. రామ జన్మభూమిని దర్శించుకోవడానికి వచ్చినవారు అయితే కాదు? మరి వారంతా అయోధ్యకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే... దక్షిణ కొరియాకు ఉత్తరప్రదేశ్లోని రాముడు పుట్టిన అయోధ్యకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. అయితే ఈ సంబంధం రాముడితో కాదు. ప్రతి ఏటా వందల మంది దక్షిణ కొరియన్లు రాణి హు హ్వాంగ్ ఓకేకు నివాళులు అర్పించడానికి అయోధ్య నగరాన్ని సందర్శిస్తారు. అయోధ్యతో తమకు పూర్వకాలపు సంబంధాలు ఉన్నట్లు దక్షిణ కొరియన్లు నమ్ముతున్నారు. దక్షిణ కొరియా ఇతిహాసాల ప్రకారం.. రాణి సూరిరత్న అని పిలువబడే క్వీన్ హు హ్వాంగ్ ఓకే దక్షిణ కొరియాకు వెళ్లక ముందు అయోధ్య యువరాణి. క్రీ.శ 48లో కరక్ వంశానికి చెందిన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారని దక్షిణ కొరియన్లు నమ్ముతారు. డాక్టర్ ఉదయ్ డోక్రాస్ పరిశోధనా ప్రకారం సుంగుక్ యుసా రాజు అయిన సురో అయుత రాజ్యానికి చెందినవారని తెలుపుతోంది. అప్పటి ‘అయుత’నే ప్రస్తుత అయోధ్య అని వివరించబడింది. అయితే దక్షిణ కొరియా రాణి స్మరకం 2001లో అయోధ్యలో ప్రారంభించారు. 2015లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భారత్లో పర్యటించారు. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ రాణి స్మారకం విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకాన్ని సుందరంగా తీర్చిదిద్ది 2022లో ప్రారంభించారు. ఇక రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకంగా 2019లో భారత్ ప్రభుత్వం రూ. 25, రూ.5 పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కరక్ వంశానికి చెందిన 60 లక్షల మంది ప్రజలు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తారని తెలుస్తోంది. చిన్న వయసులో రాణి సూరిరత్న పడవలో కొరియాకు చేరుకుందని, ఆమెకు 16 ఏళ్ల వయసులో వివాహం అయినట్లు కొరియా ప్రజలు నమ్ముతారని తెలుపుతోంది. మరోవైపు చైనా గ్రంథాల ప్రకారం.. అయోధ్యను పరిపాలించే రాజు తన 16 ఏళ్ల కూతురును దక్షిణ కొరియాకు చెందిన రాజు కిమ్ సూరోతో వివాహం జరిపించడానికి ఆమెను దక్షిణ కొరియాకు పంపాలని అతనికి కల వచ్చినట్లు ప్రచారంలో ఉంది. వారికి 10 మంది పిల్లలు పుట్టారని, వీరు 150 ఏళ్లు జీవించి ఉన్నారని చైనా గ్రంథాల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2020లో దక్షిణ కొరియా రాయబారి బాంగ్ కిల్.. అయోధ్యకు కొరియాతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొరియా పురాతన చరిత్ర గ్రంథాల్లో అయోధ్యకు చెందిన యువరాణి కొరియన్ రాజును వివాహం చేసుకున్నట్లు రాసి ఉందని తెలిపారు. రాజు కిమ్ సురో సమాధికి సంబంధించిన పురావస్తు పరిశోధనల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయనిపేర్కొన్నారు. View this post on Instagram A post shared by Uttar Pradesh Tourism (@uttarpradeshtourism) రాణి సూరిరత్న పార్క్ ప్రత్యేకతలు.. ►అయోధ్యలోని క్వీన్ హు హ్వాంగ్ ఓకే స్మారక పార్క్.. అయోధ్య నుంచి కొరియా వరకు యువరాణి సూరిరత్న ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లు ప్రతిబింబిస్తుంది. ►దక్షిణ కొరియా నుంచి రవాణా చేయబడిన రాతి నిర్మాణంపై పురాతన విషయాలు చెక్కారు. ►రూ. 21 కోట్ల రూపాయల బడ్జెట్తో సరయు నది ఒడ్డున ఈ పార్క్ నిర్మించారు. ►స్మారక చిహ్నం యొక్క ఆగ్నేయ దిశలో క్వీన్ హు హ్వాంగ్ ఓక్ విగ్రహం ఉంది. ►ఈశాన్య దిశలో రాజు కిమ్ సురో విగ్రహం ఏర్పాటు చేశారు. ►పార్కులో గ్రానైట్తో చేసిన గుడ్డు ఆకారం ఉంటుంది. యువరాణి సూరిరత్న కొరియాకు తన ప్రయాణంలో బంగారు గుడ్డును తీసుకువెళ్లిందని కొరియన్లు నమ్ముతారు. -
Ram Mandir: ‘నా సోదరుల ప్రాణత్యాగం వృథా అనుకున్నా’
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రామ జన్మభూమితో తన కుటుంబ సభ్యులకు ఎంతో అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి ఆనందం వ్యక్తం చేశారు. 1990లో అయోధ్యలో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు చోటుచేసుకున్న పోలీసు కాల్పుల్లో 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి, 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు. వారి సోదరే పూర్ణిమ కొఠారి. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజుల తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మితం కావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 2014 వరకు కూడా రాముడి జన్మభూమికి సంబంధించి తన సోదరుల ప్రాణ త్యాగం వృథా అయిందని బాధపడినట్లు చెప్పారు. 33 ఏళ్ల క్రితం తమ ప్రాణాలు త్యాగం చేసిన తన సోదరులు కళ నేడు నిజమవుతోందని అన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జీవితంలో మరిచిపోనని తెలిపారు. గత 33 ఏళ్లలో రామ మందిరం నిర్మితం కావటం తనకు చాలా ఆనందించదగ్గ విషయమని పూర్ణిమా అన్నారు. తన తల్లిదండ్రులు కూడా చనిపోయారని తెలిపారు. రామ మందిర నిర్మాణం అవుతుందనే నమ్మకం.. 2014 ముందు వరకు కూడా తనలో లేదని అన్నారు. వేల ఏళ్ల చరిత్ర గల రామ మందిరం నిర్మాణంలో తన సోదరులు ప్రాణ త్యాగం ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. రామ మందిర నిర్మాణం పట్ల తాను చాలా గర్వ పడుతున్నాని తెలిపారు. కొల్కత్కు చెందిన రామ్కొఠారి, శరత్ కొఠారి 1990 అక్టోబర్లో కరసేవకులు చేపట్టిన యాత్రలో పాల్గొన్నారు. అయితే వారు కోల్కతా నుంచి ప్రారంభం కాగా.. వారి బృందం బెనారస్ వరకు చేరుకోగానే పోలీసులు నిలువరించారు. ఇక వారు అక్కడి నుంచి టాక్సిలో ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: కాలారామ్ గుడికి ప్రధాని మోదీ.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు -
రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'
లక్నో: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమంలో రాముని విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవిత్రతను కాపాడే ప్రయత్నంలో ఛత్తీస్గఢ్, అసోం, ఉత్తరప్రదేశ్లో జనవరి 22న "డ్రై డే"గా ప్రకటించాయి. "డ్రై డే" అంటే మద్య పానీయాల అమ్మకాలు అనుమతించబడని రోజు. మద్యం దుకాణాలు మినహా, పబ్బులు, రెస్టారెంట్లు కూడా మద్య పానీయాలను విక్రయించబోరు. జనవరి 22ను జాతీయ పండుగలా జరుపుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు జనవరి 22న ఇప్పటికే సెలవు ప్రకటించారు. న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నుండి రామమందిరం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండనున్నట్లు చెప్పడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. రామాలయాన్ని బీజేపీ ఎన్నికల లబ్ది కోసం చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని విమర్శిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండటంపై బీజేపీ మండిపడింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నుంచి ఇంకేం ఆశించగలమని దుయ్యబట్టింది. ఇదీ చదవండి: Ram Mandir: రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం -
Ayodhya: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అరుదైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల పొడవైన అగరుబత్తి, 2,100 కిలోల బరువైన గంట, 1,100 కిలోల బరువైన భారీ ప్రమిద, బంగారు పాదుకలు, 10 అడుగుల ఎత్తయిన తాళం, తాళంచెవి, ఒకేసారి ఎనిమిది దేశాల సమయాన్ని సూచించే గడియారం తదితర ప్రత్యేక కానుకలను అయోధ్య రాముడికి సమరి్పంచేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ పుట్టిన ఊరు జనక్పూర్ ప్రస్తుతం నేపాల్లో ఉంది. నేపాల్ నుంచి అయోధ్యకు వెండి చెప్పులు, బంగారు ఆభరణాల వంటి 3,000కుపైగా బహుమతులు వచ్చాయి. ఇక శ్రీలంకలోని అశోక్ వాటిక నుంచి తీసుకొచ్చిన ఒక అరుదైన రాయిని అక్కడి ప్రతినిధులు అయోధ్యలో అందజేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7,000 కిలోల ‘రామ్ హల్వా’ అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం గుజరాత్ భక్తులు 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభాన్ని పంపిస్తున్నారు. మహారాష్ట్రకు విష్ణు మనోహర్ అనే వంట మాస్టర్ 7,000 కిలోల ‘రామ్ హల్వా’ తయారు చేసి అయోధ్యలో భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ 200 కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తామని తిరుమతి తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించడం తెలిసిందే. సీతమ్మ కోసం సూరత్లో ప్రత్యేకంగా చీర తయారు చేస్తున్నారు. సూరత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కిలోల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో కూడిన నెక్లెస్ రాముడికి బహూకరించబోతున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
Ram Mandir: ‘కాంగ్రెస్ పశ్చాత్తాపడటం తప్పదు’
అయోధ్యలో జనవరి 22న జగిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడటంలో కూరుకుపోయిందని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని వాళ్లు ఎందుకు సీరియస్కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మందిర ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీవాళ్లే తీవ్రంగా పశ్చాత్తాపపడతారని అన్నారు. రామ మందిర ప్రారంభ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ తీరుపై మరో బీజేపీ నేత నలిన్ కోహ్లి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఊహించిందేనని అన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తోందని మండిపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అయోధ్య ఆలయం కోసం ఎటువంటి సానుకూలమైన అడుగులు వేయలేదని అన్నారు. రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తూ.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసును సైతం జాప్యం చేసిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా హాజరుకామని ప్రకటించటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మజీందర్ సింగ్ సిర్సా కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాకపోతే తమకు ఏ ఇబ్బంది లేదని అన్నారు. కానీ, రామ మందిర ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఇక.. అయోధ్య రామ మందిర కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ సోనియా గాంధీ,లోక్సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తమ నిర్ణయంపై ఆలోచిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. బుధవారం హాజరు కావటంలేదని ప్రకటించింది. ఆయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమం ఆర్ఎస్ఎస్, బీజేపీ చెందిన కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్నిమోదీ ప్రభుత్వం రాజకీయ ప్రాజెక్టుగా మలుచుకుంటోందని కాంగ్రెస్ విమర్శలు చేసింది. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. కాంగ్రెస్ నిర్ణయం ఇదే
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతుందా లేదా అనే సందిగ్ధతకు పార్టీ తెర దించింది. జనవరి 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావొద్దని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటన విడుదల చేశారు. రామమందిరం ప్రతిష్ట కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారని కాంగ్రెస్ వెల్లడించింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్ని మోదీ సర్కార్ పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చిందని విమర్శలు గుప్పించింది. ఎన్నికల లబ్ధి కోసం అసంపూర్తిగా ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వెల్లడించింది. మతం వ్యక్తిగత అంశమని, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పింది. చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..! -
బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం!
ఈ నెల 22న అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు. ఆయన ఆరోజు గర్భగుడిలో రామ్లల్లాకు పట్టాభిషేకం చేయనున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తరువాత ప్రధాని మోదీ ఆ విగ్రహానికి పేరు పెట్టనున్నారు. ఆయన ఏ పేరు పెడతారనేది 22న తెలియనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న కాశీకి చెందిన పండితులు బాలరామునికి ఏ పేరు పెట్టాలనేది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు. విగ్రహానికి నామకరణం చేసే విషయమై ట్రస్టు సభ్యులు శాస్త్ర నిపుణులతో చర్చిస్తున్నారు. అయోధ్యకు తరలివచ్చిన పండితులు ముందుగా రామనగరిలో స్థానిక దేవతలుగా పూజిలందుకుంటున్న దేవతలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. ఏదైనా శుభ కార్యం, పూజలు లేదా ఆచారాల నిర్వహణకు స్థానికులు ఇక్కడి దేవతలను పూజిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే పండితులు ముందుగా హనుమాన్గర్హిలో కొలువైన హనుమంతులవారికి, శివుని పౌరాణిక పీఠమైన నాగేశ్వరనాథ్, సరయూమాత, కనక్ బిహారీ సర్కార్ దేవతలకు ఆహ్వానం అందించారు. పండితులు ఈ ఆలయాలకు వెళ్లి పూజలు చేసి..‘మీ నగరంలో భారీ కార్యక్రమం జరగబోతోందని, మీరు వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలలో పాల్గొనాలని’ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ఎయిర్పోర్టుకు భారీ భద్రత -
ఆ ఐదుగురు.. ‘ప్రాణ ప్రతిష్ఠ’ ప్రధాన అతిథులు!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముడు ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పటికే అయోధ్యలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆచార్యులు, అతిథుల ఫైనల్ జాబితాను ఖరారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన అతిథిగా హాజరుకానుండగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరు గర్భాలయంలో జరిగే పూజలలో పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న దేశ, ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల కోసం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించింది. దీని ప్రకారం జనవరి 14 నుంచి 22 వరకు దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22న వివిధ దేవాలయాలలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం భక్తులు రామ జ్యోతులు వెలిగించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మ గణేశ్వర శాస్త్రి, ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సారధ్యంలో జరగనుంది. వీరితో పాటు సునీల్ దీక్షిత్, గజానంద్ జోగ్కర్, అనుపమ్ దీక్షిత్, ఘాటే గురూజీలు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?
దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్లల్లా నూతన రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నూతన రామాలయాన్ని అత్యంత సుందరంగా, అంతకుమించిన వైభవోపేతంగా నిర్మించారు. అయితే ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ అస్సలు ఉపయోగించేలేదంటే మీరు నమ్ముతారా? అవి లేకుండా ఇంత భారీ ఆలయం ఎలా రూపుదిద్దుకుందనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని రామాలయం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమయ్యింది. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి.. అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఆలయ ప్రధాన నిర్మాణం రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్సీ పహర్పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమయ్యింది. ఈ గులాబీ రాయి బలంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది. ఈ రాళ్లతో ఆలయం అంతటినీ నిర్మించారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంటు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము, సిమెంట్ లేదా ఉక్కు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణం గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ఆలయ పునాదుల కోసం భూసార పరీక్షలు ప్రారంభించినప్పుడు, ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని, అది పునాదికి ఏమాత్రం అనువైనది కాదని తేలిందన్నారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)కంపెనీ, ఐఐటీ ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబే, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) నిపుణులు సంయుక్తంగా నేషనల్ జియోఫిజికల్ సర్వే పరిశోధనా సంస్థల (ఎన్జీఆర్ఐ)టాప్ డైరెక్టర్లు సహాయం కోరారు. 2020లో ఈ అంశంపై నిపుణుల మధ్య చర్చ జరిగింది. దీని తర్వాత అయోధ్యలోని ఆరు ఎకరాల ఆలయ భూమిలో 14 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు. దీని తరువాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి, ఖాళీ స్థలంలో ‘రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్’ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. ఈ కాంక్రీటు ఆ తరువాత రాయిగా మారుతుంది. ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీటును పునాది కోసం వినియోగించారు. ఈ విధంగా ఆలయ పునాది ఇనుము, సిమెంట్ లేకుండా నిర్మితమయ్యింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మిగిలిన ఆలయం నిర్మాణమంతా రాజస్థాన్లోని భరత్పూర్ నుండి తీసుకువచ్చిన గులాబీ ఇసుకరాయితో కొనసాగింది. అయితే 21 అడుగుల ఎత్తయిన ప్లాట్ఫారమ్ను నిర్మించడానికి కర్ణాటక, తెలంగాణ నుండి తెచ్చిన గ్రానైట్ ఉపయోగించారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో ఒక్క గ్రాము ఇనుము కూడా ఉపయోగించలేదు. దీనికి కారణం రామ మందిరాన్ని నాగర్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించడమే. ఈ శైలిలో ఇనుమును వినియోగించనవసరం లేదు. ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని మూడు శైలులలో నాగర్ శైలి ఒకటి. ఖజురహో, సోమనాథ్, కోణార్క్ సూర్య దేవాలయాలు నాగర్ శైలిలోనే నిర్మితమయ్యాయి. ఇప్పటికి అయోధ్యలో రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రామమందిర ట్రస్టుతోపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం! -
రామ మందిరం: బిహార్ మంత్రి వ్యాఖ్యలు దుమారం
పట్నా: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బిహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విషయంలో బీజేపీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. ప్రజలకు జబ్బు పడితే లేదా గాయపడితే గుడికి వెళ్లుతారా? లేదా ఆస్పత్రికి వెళ్లుతారా? అని సూటిగా ప్రశ్నించారు. సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలు, పదవులకు సాధించడానికి ఉపయోగపడే చదువు కావాలంటే గుడికి వెళ్లుతా? లేదా స్కూల్కు వెళ్లుతారా?’ అని విమర్శించారు. ప్రజలు కపట హిందుత్వ, అబద్ధపూరితమైన జాతీయవాదంపై అవగాహనతో ఉండాలని ఉన్నారు. "Temple or hospital?": Bihar Education Minister Chandra Shekhar sparks another controversy on Ram Temple Read @ANI Story | https://t.co/vJH2fFzYGT#Bihar #ChandraShekhar #RamTemple pic.twitter.com/Y81yIqFlXW — ANI Digital (@ani_digital) January 8, 2024 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22ను జరగనుంది. ఓవైపు ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు మరోవైపు ప్రతిపక్షాలు, పలు రాష్ట్రాల నేతలు బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ పావుగా వాడుకొంటుందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రముఖలకు ఆహ్వానం అందించకపోవటంతో బీజేపీపై మండిపడుతున్నారు. చదవండి: అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ -
అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ
సూరత్: సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్టైల్ అసోషియేషన్ ప్రత్యేకంగా ఓ చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, భగవాన్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. అయితే ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మా తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం ఉంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోంది. జానకీ మాత, భగవన్ హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు’ అని శర్మా తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు. తాము తయారు చేసిన ప్రత్యేకమైన చీరను ఆయోధ్యకు పంపిస్తామని అన్నారు. చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే తాము ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతా మాతా విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఇటీవల నేపాల్లోని జనాకీ మాతా జన్మస్థలం నుంచి పలు కానుకలు అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక.. జనవరి 22 తేదీన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖలకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: Delhi: 22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు -
రామ మందిర ప్రతిష్టాపన వేళ.. సిజేరియన్లకు తల్లుల అభ్యర్థనలు
కాన్పూర్: అయోధ్యలోని రామ మందిరం పవిత్రోత్సవం సందర్భంగా జనవరి 22న సిజేరియన్ ప్రసవాలు చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అదే రోజు శిశువులకు జన్మనిచ్చేలా సిజేరియన్ చేయాలని 14 వ్రాతపూర్వక అభ్యర్థనలు అందాయని గణేష్ శంకర్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగానికి ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న సీమా ద్వివేది తెలిపారు. తమ ఆస్పత్రిలో జనవరి 22న 35 సిజేరియన్ ఆపరేషన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ డెలివరీ తేదీలు కొన్ని రోజుల ముందు లేదా జనవరి 22 తర్వాత అయినప్పటికీ గర్భిణులు శుభ దినంగా పరిగణించి వైద్యులకు అభ్యర్థనలు చేశారని సీమా తెలిపారు. పూజారులు ఇచ్చిన ముహూర్తంలో డెలివరీ చేయాలని తల్లులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తాను నిర్ణీత సమయంలో ఆపరేషన్ చేసిన వివిధ అనుభవాలను ఆమె వివరించారు. అలా చేయడం ద్వారా తల్లి, బిడ్డకు తలెత్తే సమస్యలను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించిన శిశువులు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటారని వారు నమ్ముతున్నట్లు సీమా ద్వివేది తెలిపారు. ఇదీ చదవండి: అయోధ్య రామునిపై పాట.. సింగర్ని అభినందించిన ప్రధాని మోదీ -
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత?
సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం. ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధంపూస్తారు. తరువాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠగావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ, పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది కూడా చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. -
రామమందిర ప్రారంభోత్సవం.. ఇక్బాల్ అన్సారికి ఆహ్వానం
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న వైభవంగా జరిగిగే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వేడుకకు 7000 మంది హాజరుకానున్నారు. తాజాగా రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ స్థలం విషయంలో నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారికి కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ఆహ్వానం అందించింది. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరింది. బాబ్రీ మసీదుగా మద్దతుగా నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారికి 2020 ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమానికి కూడా ఆహ్వానం పంపించిన విషయం గమనార్హం. అయితే ఇటీవల అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ సమయంలో కూడా రోడ్డు షోలో పాల్గొన్న ప్రధానమంత్రికి ఇక్బాల్ అన్సారి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఇక్బాల్ స్పందిస్తూ.. అతను(మోదీ) మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మాకు అతిథి, మా ప్రధానమంత్రి కూడా’ అంటూ అందుకే స్వాగతం పలికానని వివరణ ఇచ్చారు. కాగా.. ఇక్బాల్ అన్సారి తండ్రి కూడా రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 95 ఏళ్ల వయస్సులో 2016లో మృతి చెందారు. అనంతరం రామజన్మభూమి వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కీలకంగా వ్యవహిరించారు. కాగా.. రామజన్మభూమి వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న కీలక తీర్పును వెలువరించింది. వివాదంలో ఉన్న స్థలాన్ని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ.. దానికి దగ్గరలో మరోచోటు ముస్లింలకు 5ఎకరాలకు స్థలాన్ని కేటించిన విషయం తెలిసిందే. చదవండి: జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట -
అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో ఐదు మండపాలు (హాళ్లు) ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం. దేవతా మూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. సింహద్వారం నుండి ప్రవేశించే భక్తులు 32 మెట్ల ద్వారా ఆలయం లోనికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహరీగోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ర్యాంప్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. 25 వేల మంది యాత్రికులకు సరిపడేలా సౌకర్యాల కేంద్రం (పీఎఫ్సీ)నిర్మిస్తున్నారు. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలు కల్పించనున్నామని ట్రస్ట్ తెలిపింది. ఇది కూడా చదవండి: Pran Pratishtha: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత? -
22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన
అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో రామ భజన, రామ స్తుతి, శివ తాండవ స్తోత్రాన్ని పఠించే ఏకైక బృందంగా భోపాల్ డమరూ బృందం పేరుగాంచింది. జనవరి 22న అయోధ్యలో దేశ నలుమూలలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలోనే భోపాల్కు చెందిన డమరూ బృందం కూడా తమ ప్రదర్శనతో ఉర్రూతలూగించనుంది. భోపాల్లోని శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి అయోధ్య నుండి ఆహ్వానం అందింది. దీంతో జనవరి 22న రామభక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలో శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి చెందిన డమరూ బృందం ప్రదర్శన ఇవ్వనుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి జనవరి 20న ఈ డమరూ బృందానికి చెందిన 108 మంది సభ్యులు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ వారు 21న రిహార్సల్ చేస్తారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీల సమక్షంలో వీరి ప్రదర్శన సాగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్ఘాట్లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు జనవరి 22న కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేస్తున్నారు. అయితే సామాన్యులు జనవరి 22 తరువాత ఆలయాన్ని సందర్శించుకోవాలని రామజన్మభూమి ఆలయట్రస్ట్ కోరింది. జనం రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించి అక్కడ రామభక్తుడు జటాయురాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో ఉన్న రామ మందిర సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు ఎస్టీఎఫ్ పర్యవేక్షించనుంది . 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం -
రాముణ్ణి చెక్కిన చేతులు
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు. అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్నాథ్లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు. 51 అంగుళాల విగ్రహం అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది. ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తల్లి ఆనందం కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది. తల్లిదండ్రులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్నాథ్లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024