Rathika Rose
-
బ్లాక్ కలర్ శారీలో కుర్రకారు మతిపోగోడుతున్న రతికా రోజ్
-
కన్ను కొట్టిన బుట్టబొమ్మ... ఫ్లవర్ డిజైన్ చీరలో తృప్తి!
ప్రకృతి ఒడిలో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలుచీరలో అందాలన్నీ చూపించేస్తున్న తృప్తి దిమ్రిహాట్ బ్యూటీ ఆయేషా ఖాన్ చుడీదార్ లుక్గ్లామర్తో చంపేసేలా సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్గర్ల్స్ నైట్ అవుట్లో నిహారిక-వితిక షేరు-మహాతల్లిఎక్స్ప్రెషన్స్తో నవ్వించేస్తున్న కావ్య కల్యాణ్ రామ్జీన్ షర్ట్లో వయ్యారంగా చూస్తున్న పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meghaa Shetty (@meghashetty_officiall) View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by KiKo (@kiaankokken) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) -
నాజుకు నడుముతో తాప్సీ హొయలు.. పెళ్లిలో తెలుగు హీరోయిన్ బిజీ
కాక రేపుతున్న 'బిగ్బాస్' బ్యూటీ రతికా రోజ్ క్లాస్ లుక్లో మరింత అందంగా కనిపిస్తున్న శ్రీలీల పసుపు చీరలో క్యూట్నెస్తో చంపేస్తున్న అమృత అయ్యర్ నాభి అందాలతో టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ తాప్సీ కిర్రాక్ బ్యాక్ పోజులతో హీరోయిన్ యషికా ఆనంద్ థార్ కారు పక్కన రేసుగుర్రంలా హాట్ బ్యూటీ రీతూ చౌదరి అందాల జాతర చేస్తున్న టీవీ బ్యూటీ దీపికా పిల్లి అక్క పెళ్లిలో కుందనపు బొమ్మలా హీరోయిన్ ఆషికా View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) -
బిగ్బాస్లో రతికా రోజ్.. ఓకే చెప్పేసిందా?
గతేడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్బాస్. దాదాపు 100 రోజులకు పైగా సినీ ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 17న ముగిసిన ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్దీప్ రన్నరప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే ఈ సారి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో బిగ్బాస్ నిర్వాహకులు త్వరలోనే మరో సీజన్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన బిగ్బాస్ సీజన్-7లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో సారి కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే మరోసారి రతికా బిగ్బాస్ షోకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ సీజన్లో రతికా ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా ఓ సినిమాలో నటిస్తోంది. -
బిగ్బాస్కు ఎందుకు వచ్చానంటే?.. రైతు బిడ్డ సమాధానం ఇదే!
రైతుబిడ్డగా బిగ్బాస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు సింపతీ పని చేసినప్పటికీ.. తనలో టాలెంట్ను కూడా అభిమానులకు చూపించాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్లో ఉండి తాను అనుకున్నది సాధించాడు. అయితే పల్లవి ప్రశాంత్కు బిగ్బాస్కు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బిగ్బాస్పై ఎందుకంత ఆసక్తి పెంచుకున్నాడు? దీనికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విషయాలపై విన్నర్ ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. బిగ్బాస్ హౌస్లో ఇచ్చిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ప్రశాంత్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్లో నాకు తెలిసిందే కూకట్పల్లి రైతు మార్కెట్ ఒక్కటే. చాలా రోజుల కింద ఓ వీడియోను చేశా. మనలాంటి వాళ్లు బిగ్బాస్కు ఎందుకు వెళ్లకూడదు? అని ఆలోచించా. అంతే కాకుండా మా బాపు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి మీ కొడుకు ఏం చేస్తాడని అడిగిండు. పొలంలో బాయి కాడ పనిచేస్తాడని బాపు చెప్పిండు. ఆయన మా బాపుతో మొహం మీదనే చాలా చీప్గా మాట్లాడిండు. ఆ తర్వాత నేను బాపుకు మాటిచ్చినా. బాయి కాడ పని చేసేటోళ్లు ఏం అనుకుంటే అది సాధిస్తారని బాపుతో చెప్పా. ఆ తర్వాత బాపును ఒప్పించి రూ.500 రూపాయలతో హైదరాబాద్లో అడుగుపెట్టా.' అని అన్నారు. రతికతో బిహేవియర్ గురించి మాట్లాడుతూ..'నేను ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తా. రతికతో పాటు అందరినీ నేను కుటుంబసభ్యులు గానే భావిస్తా. ఆమెను నేను ఒక ఫ్రెండ్గానే చూశా. రతికను చూడగానే మనవాళ్లు అనే భావన కలిగింది. నామినేషన్స్ తర్వాత ఎలా పిలవాలి అనే టాపిక్ వచ్చింది. ఆమెనే నన్ను అక్క అని పిలవమని చెప్పింది. అందుకే అక్కా అని పిలిచా. రతికకు ఎవిక్షన్ పాస్ ఇద్దామనుకున్నా. ఆమె తీరు మారకపోవడంతో వద్దనుకున్నా.' అని ప్రశాంత్ అన్నాడు. -
'బిగ్బాస్' రతిక స్పెషల్ పిక్.. స్మైల్తో ఫిదా చేస్తున్న మెగా కోడలు
ఎలిమినేషన్ తర్వాత గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేసిన రతిక హనీమూన్ ప్లస్ క్రిస్మస్ మంత్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య బ్లాక్ కోబ్రాలా మత్తెక్కించే లుక్స్లో రకుల్ ప్రీత్ సింగ్ బార్బీ డాల్ లుక్తో కేక పుట్టిస్తున్న మృణాల్ ఠాకుర్ సన్ కిస్ ఫొటో షేర్ చేసిన 'ఆదిపురుష్' బ్యూటీ కృతిసనన్ రొమాంటిక్ ఫొటోలతో కాక రేపుతున్న మాళవిక మోహనన్ విచిత్రమైన డ్రస్-ఇయర్ రింగ్తో ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Divya khosla (@divyakhoslakumar) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
Bigg Boss 7: మళ్లీ ఎలిమినేట్ అయిన రతిక.. కారణం మాత్రం అదే!
బిగ్బాస్ 7లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినితో పాటు బిగ్బాస్కి ఎంతో ఇష్టమైన రతిక ఎలిమినేట్ అయిపోయింది. తనని రెండోసారి కూడా బయటకు పంపేస్తారని రతికకి ముందే తెలుసు. ఎలిమినేషన్తో పాటు సండే ఎపిడోస్లో ఇంకా ఏమేం జరిగాయనేది Day 84 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) శివాజీ గురించి నిజం అశ్విని ఎలిమినేట్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆమె స్టేజీపైకి రావడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే హస్లో ఉన్నవాళ్లలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనేది చెప్పాలని నాగ్ అడగ్గా.. అలా కాదు హిట్, సూపర్హిట్ ఎవరనేది చెబుతానని అశ్విని చెప్పింది. రతిక-ప్రియాంక ఫ్లాప్ అని చెప్పిన అశ్విని, అమర్-గౌతమ్-శోభాశెట్టి-శివాజీ హిట్ అని చెప్పింది. ప్రశాంత్-అర్జున్-యావర్ మాత్రం సూపర్హిట్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే శివాజీ గురించి చెప్పిన అశ్విని.. ఆయన కొందరి వరకు మాత్రమే పరిమితమైపోయారని నిజాన్ని చెప్పింది. దీన్ని తీసుకోలేకపోయిన సోఫాజీ అలి.యాస్ శివాజీ.. నువ్వు అలా అనుకుంటున్నావ్ అని ఏదేదో చెప్పి కవర్ చేశాడు. చుక్క బ్యాచ్ vs ముక్క బ్యాచ్ అయితే అశ్విని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం హౌస్లో రెండు గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది. ఇది నిజమేనని ఒప్పుకొన్న నాగార్జున.. అమర్-శోభా-ప్రియాంకలని కలిపి 'చుక్క బ్యాచ్' అని.. శివాజీ-యావర్-ప్రశాంత్లని కలిపి 'ముక్క బ్యాచ్' అని చెప్పాడు. అయితే ఇన్నాళ్లు బయట అనుకున్నది స్వయంగా నాగార్జున చెప్పడంతో.. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని నిర్వహకులే ఒప్పుకొన్నట్లు అయింది. ఆ తర్వాత ఇంట్లో వస్తువుల గురించి, వస్తువులతో పాటల గురించి టాస్క్స్ పెట్టారు. ఇదంతా టైమ్ పాస్ పల్లీ బఠాణీ వ్యవహారంలా అనిపించింది తప్పితే అలరించలేకపోయింది. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) రతిక ముందే పసిగట్టింది శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఏడుగురిలో ఆదివారం వరసగా అమర్, గౌతమ్, ప్రశాంత్, యావర్, శివాజీ సేవ్ అయ్యారు. చివరగా అర్జున్, రతిక మిగిలారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరికైనా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా ప్రశాంత్? అని నాగ్ అడగ్గా.. తాను 14వ వారం మాత్రమే దీన్ని ఉపయోగిస్తానని ఖరాఖండీగా చెప్పేశాడు. ఆ తర్వాత కాసేపు సస్పెన్స్ మెంటైన్ చేసి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ శోభాతో రతిక మాట్లాడుతూ.. బహుశా ఆడట్లేదని నన్ను తీసేశారేమో అని తనలో తానే అనుకుంది. ఇక స్టేజీపై వచ్చిన తర్వాత 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అని పాట పాడి అందరికీ సెండాఫ్ చెప్పేసింది. ఎలిమినేషన్కి అదే కారణం ఈ వారం నామినేట్ అయినప్పుడే రతిక.. తన ఎలిమినేషన్ విషయాన్ని పసిగట్టింది కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఒకవేళ ఈ వారం టాస్క్ గెలిచి ఎవిక్షన్ పాస్ గెలుచుకుని ఉంటే కచ్చితంగా సేవ్ అయ్యేది. తొలుత నాలుగు వారాలు ఉన్నప్పుడు సోది ముచ్చట్లు పెట్టింది. దీంతో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు వారాలు ఉంది. కానీ గేమ్స్ ఆడే విషయంలో అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడు చూడు శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) -
Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా రెండో వికెట్ రూపంలో హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఈ వారం నామినేట్ అయినప్పుడే ఈమె బయటకెళ్లడం కన్ఫర్మ్ అని అందరూ ఫిక్సయ్యారు. అలా అనుకున్నదే జరిగింది.అసలు రతిక రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణమేంటి? మొత్తం రెమ్యునరేషన్ రూపంలో ఎంత సంపాదించింది? రతిక మళ్లీ అదే తప్పు బిగ్బాస్ షోలోకి వస్తున్నారంటే ఎంటర్టైన్ చేయాలి లేదంటే గేమ్స్ ఆడాలి. ఈ రెండు విషయాల్లోనూ రతిక ఫెయిలైంది. ఫస్ట్ ఎలిమినేట్ కావడానికి ముందు సరిగ్గా నాలుగు వారాలు హౌసులో ఉంది. అయితే వచ్చిన వెంటనే ప్రశాంత్ని తన చుట్టూ తిప్పుకొన్న రతిక.. అతడిపై రివర్స్ అయింది. దీంతో ఈమెపై నెగిటివిటీ పెరిగింది. పోనీ గేమ్స్ అయినా ఆడితే ఇది తగ్గేదేమో కానీ ముచ్చట్లు పెట్టడం తప్పితే ఒక్క విషయంలోనూ పెద్దగా మెప్పించలేకపోయింది. అలా నాలుగు వారాల తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) బిగ్బాస్కి ఏం ప్రేమ పుట్టకొచ్చిందో ఏమో గానీ ఎలిమినేట్ అయిన రెండు వారాల్లోనే పిచ్చి లాజిక్స్ అని చెప్పి, రతికని తిరిగి హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా రతిక గేమ్స్ ఆడిందా? అంటే అస్సలు లేదు. 'ఈ వారం కచ్చితంగా ఆడతా' అని హోస్ట్ నాగార్జునకు ప్రతిసారి చెప్పడమే సరిపోయింది. దానికి తోడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. అలా ఈ వారం నామినేషన్స్లో నిలిచింది. అయితే రైతుబిడ్డ ప్రశాంత్తో ఈమె గొడవ పెట్టుకోవడం మైనస్ అయింది. దీంతో పాటు పలు కారణాలు కూడా రతిక పాప ఎలిమినేషన్కి కారణమయ్యాయి. రెమ్యునరేషన్ ఎంతంటే? ఇక రెండుసార్లు కలిపి రతిక.. బిగ్బాస్ హౌస్లో 9 వారాలు ఉంది. తొలుత నాలుగు వారాలు, రీఎంట్రీ తర్వాత మరో ఐదు వారాల పాటు బండి లాక్చొచ్చేసింది. ఇక ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం రతికకి వారానికి రూ.2 లక్షలు అనుకున్నారట. అంటే ఓవరాల్గా దాదాపు రూ.18 లక్షల వరకు రెమ్యునరేషన్ రూపంలో సంపాదించినట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) -
Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఈసారి తనకు తానుగా ఎలిమినేట్ కాలేదు. రైతుబిడ్డ రివేంజ్ వల్ల ఈ బ్యూటీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రెండుసార్లు రతిక ఎలిమినేషన్కి రైతుబిడ్డ ప్రశాంతే కారణమయ్యాడు. ఇంతకీ లేటెస్ట్ ఎలిమినేషన్లో ఏం జరిగింది? ప్రశాంత్, రతికపై ఎలా పగ తీర్చుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ హౌస్లో రతిక ఓ వింత కంటెస్టెంట్. ఎందుకంటే తొలి వారంలో ఎఫర్ట్ పెట్టింది. రెండో వారానికి వచ్చేసరికి రైతుబిడ్డ ప్రశాంత్తో ప్రేమ కహానీ మొదలుపెట్టింది. అక్కడివరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచేసరికి తనలోని మరో యాంగిల్ బయటకు తీసింది. అన్నిరోజులు క్లోజ్గా మూవ్ అయిన ప్రశాంత్పై రివర్స్ అయింది. దీంతో ఈమెకి ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు గేమ్స్లోనూ రతిక సరిగా ఆడకపోవడం మరో మైనస్. ఫలితంగా ఐదో వారం ఈమెని ఎలిమినేట్ చేసి బయటకు తోసేశారు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) అయితే బిగ్బాస్కి రతిక అంటే చాలా ప్రేమ. దీంతో వింత లాజిక్స్ అన్ని పెట్టి ఎలాగోలా రీఎంట్రీ పేరుతో ఈమెని మళ్లీ హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా గేమ్స్, టాస్కులు ఆడిందా అంటే నో ఛాన్స్. శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. దానికి తోడు ప్రశాంత్ తో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో ఈ వారం రతిక, ప్రశాంత్.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇద్దరూ నామినేషన్స్లోనూ ఉన్నారు. ఇకపోతే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, హోస్ట్ నాగార్జున గత వారమే చెప్పారు. మరోవైపు ఈ వారం జరిగిన పోటీలో గెలిచిన ప్రశాంత్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దాన్ని ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషన్ సందర్భంగా ఉపయోగించేసినట్లు తెలుస్తోంది. తొలుత అశ్విని ఎలిమినేట్ అయిందట. రెండో విడతలో చివరగా రతిక, అర్జున్ మిగిలారట. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరి కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని చెప్పగా.. ప్రశాంత్ తన పాస్ ని అర్జున్ కి ఇచ్చేశాడట. అలా రతిక.. రైతుబిడ్డ వల్లే రెండోసారి ఎలిమినేట్ అయిపోయిందట. ఈ క్రమంలోనే రైతుబిడ్డ, రతికపై వేరే లెవల్ రివేంజ్ తీర్చుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) -
డబుల్ ఎలిమినేషన్: ఆ ఇద్దరు కంటెస్టెంట్లు అవుట్?!
బిగ్బాస్ షోలో గేమ్స్ ఒక్కటే కీలకం కాదు.. వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యమే! చిన్నచిన్న పొరపాట్లనే భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. చికాకు తెప్పించే కంటెస్టెంట్లను అస్సలు సహించరు. అలా ఈ సీజన్లో చాలామందిని బయటకు పంపించేశారు. తాజాగా మరో ఎలిమినేషన్కు రంగం సిద్ధమైంది. రిస్క్ తీసుకోవడం అవసరమా? బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో పన్నెండో వారం ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. ప్రియాంక, శోభ మినహా అందరూ నామినేషన్లో ఉన్నారు. అయితే వీళ్లలో అశ్విని తెలివితక్కువ పని చేసింది. సిల్లీ కారణాలతో ఎవరినీ నామినేట్ చేయలేనంటూ తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అసలే తనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. టాస్క్ల్లోనూ పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. పైగా ప్రతిదానికీ ఏడుస్తూ క్రైయింగ్ బేబీగా మారింది. కొంప ముంచిన సెల్ఫ్ నామినేసన్ పైగా ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో సెల్ఫ్ నామినేట్ చేసుకుని డేంజర్ జోన్లో ఉండటం అవసరమా? మళ్లీ ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని భయంతో వణికిపోతోంది. చివరకు ఆమె భయమే నిజమైంది. ఈవారం అశ్విని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.. ఈ రోజు ఎపిసోడ్లోనే ఆమె ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో రతిక కూడా ఎలిమినేట్ అయిందంటున్నారు. మరి అది నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే! చదవండి: దొరికిపోయిన సోఫాజీ.. ముసుగు ఊడిపోయింది.. విన్నర్ రేసులో నుంచి అవుట్ -
Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?
బిగ్బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్ లో నాగ్ చెప్పినట్లు ఈసారి డబుల్ ఎలిమినేషన్ గండం ఉంది. మరోవైపు పెద్దాయన శివాజీకి అమర్దీప్ వల్ల షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? నామినేషన్స్-ఓటింగ్-ఎలిమినేషన్ సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ సంగతేంటి? బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో 11 వారాలు పూర్తయ్యాయి. పదివారాల పాటు ఒక్కో కంటెస్టెంట్ చొప్పున ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. గతవారం మాత్రం యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేసిన కారణాన్ని చూపిస్తూ నో ఎలిమినేషన్ అన్నారు. ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ బాంబు పేల్చాడు. దీంతో ఈసారి నామినేషన్స్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. కెప్టెన్ ప్రియాంక, శోభా తప్పితే మిగిలిన 8 మంది లిస్టులోకి చేరిపోయారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) డేంజర్లో బ్యూటీస్? అయితే ప్రతిసారి రైతుబిడ్డ, శివాజీకి ఎక్కువ ఓట్లు పడేవి. ఈ వారం మాత్రం అనుహ్యంగా అమర్దీప్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఓ రకంగా శివాజీకి దెబ్బే అని చెప్పొచ్చు. అమర్ టాప్లో ఉండగా, రెండు-మూడు స్థానాల్లో శివాజీ, ప్రశాంత్ ఉన్నారట. ఆ తర్వాత వరసగా యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో రతిక, అశ్విని ఉన్నారట. అంటే ఆడ లేడీస్ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే. లిస్ట్ మారే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ వారం ఓటింగ్ విషయంలో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలానే అశ్విని.. ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని, అసలు బిగ్బాస్లో ఉండటానికి తనకు ఇష్టం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది. మరోవైపు రతిక.. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆకట్టుకోలేకపోతుంది. దానికి తోడు ఈ వారం నామినేషన్స్లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఓటింగ్ లిస్ట్ అనేది మారకపోవచ్చు. అంటే అమ్మాయిలిద్దరూ ఎలిమినేట్ అయిపోవడం గ్యారంటీ! శనివారం వరకు ఆగితే ఎలిమినేషన్ సంగతేంటో తేలిపోతుంది! అప్పటివరకు జస్ట్ వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?
బిగ్బాస్ షోలో ఆడుతున్న రైతుబిడ్డ ప్రశాంత్ మరో సూపర్ పవర్ సాధించాడు. శివాజీ గ్యాంగులో ఉన్నప్పటికీ ప్రతిసారి తనదైన మార్క్ చూపిస్తున్న ప్రశాంత్.. ఈసారి కీలకమైన పోటీలో గెలిచాడు. కాకపోతే ఇతడు గెలవడం ఓ లేడీ కంటెస్టెంట్కి శాపమయ్యేలా ఉంది. ఇంతకీ అసలేం జరిగింది? డేంజర్ జోన్లో ఉన్న ఆమె ఎవరు? ప్రస్తుతం బిగ్బాస్ హౌసులో 12వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలిన సగం ప్రసారం కానుంది. అయితే ఈ వారం కెప్టెన్ ప్రియాంక, శోభాశెట్టి తప్పితే మిగిలిన వాళ్లందరూ నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే గతవారం యావర్, తను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేశాడు. దీంతో సదరు పాస్ కోసం ఈ వారం మళ్లీ పోటీ పెట్టారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఎవిక్షన్ పాస్ కోసం ప్లేట్లు, గ్లాసుల్ని బ్యాలెన్సింగ్ చేసే టాస్క్ పెట్టగా ఇందులో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు గానీ న్యూస్ అయితే బయటకొచ్చేసింది. అయితే ఈ పాస్ని ప్రశాంత్.. ఎప్పుడు ఉపయోగించాలనేది అతడి ఇష్టం. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఉపయోగించమని బిగ్ బాస్ చెప్పాడే అనుకుందాం. ప్రశాంత్ కి ఓట్లు పడతాయి కాబట్టి తన గురించి తాను ఉపయోగించకపోవచ్చు. ఎలిమినేషన్స్లో ఉన్న మిగతా వాళ్ల కోసం అంటే యావర్, శివాజీకి ఓట్లు పడతాయి కాబట్టి వాళ్లు సేవ్ అయిపోతారు. తనని నామినేట్ చేసిన గౌతమ్, గతవారం నామినేట్ చేసిన అర్జున్ కోసం దీన్ని ప్రశాంత్ ఉపయోగించకపోవచ్చు. ఎటొచ్చి మొన్నటివరకు ప్రశాంత్తో మంచిగా ఉన్న రతిక.. ఈసారి అతడిని నామినేట్ చేసి పడేసింది. కాబట్టి రతిక బదులు అశ్వినిని ప్రశాంత్ సేవ్ చేయొచ్చు. ఒకవేళ గొడవ పడకుండా, నామినేట్ చేయకుండా ఉంటే రతికని ప్రశాంత్ సేవ్ చేసి ఉండేవాడేమో? ఎందుకో ఈసారి రతిక ఎలిమినేట్ కావడం గ్యారంటీ అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ రెండు హిట్ మూవీస్!) -
రైతుబిడ్డని వదలని రతిక.. అమర్, యావర్ల కొట్లాట ఆగేదేలే!
బిగ్బాస్ షోలో గతవారం ఎలిమినేషన్ ఎత్తేయడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. మరీ ముఖ్యంగా అశ్విని, రతిక అయితే తమ ప్రతాపం చూపించడానికి ఇంకో వారం దొరికిందని లోలోపలే సంతోషించారు. 12వ వారం నామినేషన్స్ మొదలుపెట్టాడు బిగ్బాస్. గేమ్లో ఫౌల్స్ ఆడావని యావర్ను నామినేట్ చేశాడు అమర్. అయితే అది తన తప్పు కాదని, సంచాలకుడిగా ఎవరేం తప్పు చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అమర్ మీద మండిపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎలిమినేషన్ ఫ్రీ పాస్ కోసం ఇచ్చిన టాస్కుల్లో ఒకటైన విల్లు గేమ్లో ఇద్దరూ తప్పు చేశారంటూ యావర్, శివాజీలను నామినేట్ చేశాడు అర్జున్. గేమ్లో అందరూ అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బ తిందన్న నువ్వు గేమ్లో అవుట్ అవగానే మిగతావాళ్లు ఆట ఆడుతున్నా పట్టించుకోకుండా అరిచేశావని కరెక్ట్ పాయింట్ లాగాడు. దీంతో శివాజీ తన దగ్గర సమాధానం లేక నవ్వి ఊరుకున్నాడు. గౌతమ్.. ప్రశాంత్, శివాజీని.. రతిక.. ప్రశాంత్, అమర్లను నామినేట్ చేశారు. మొత్తానికి ఈ వారం కెప్టెన్ ప్రియాంక, శోభా శెట్టి మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు కరెక్ట్ పాయింట్స్ చెప్పారు? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!
బిగ్బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క పాయింట్లోనూ ఆసక్తిగా అనిపించలేదు. శివాజీపై ఏదో వేయాలని హోస్ట్ నాగార్జున అక్కడక్కడ సెటైర్లు వేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ ఏం జరగలేదు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో హోస్ట్ నాగ్ కారణం చెప్పాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 77 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతిక కన్నింగ్ ప్రిన్స్ యావర్.. ఫౌల్ గేమ్ ఆడి, వీడియోలతో సహా దొరికిపోయినందుకు తన ఎవిక్షన్ పాస్ని తిరిగిచ్చేయడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. దాని గురించి డిస్కస్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రియాంక, శోభా.. యావర్ని మెచ్చుకోగా రతిక మాత్రం తన్న కన్నింగ్నెస్ బయటపెట్టింది. 'సేఫ్ గేమ్ ఆడావ్ నువ్వు, ఎక్కడ నాకు ఇవ్వాల్సి వస్తుందని తిరిగిచ్చేశావ్ కదా' అని యావర్తో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. అనంతరం హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఇక సింపతీ కొట్టేద్దామని ఫిక్స్ అయిన శివాజీ.. బూతులు మాట్లాడినందుకు అందరికీ సారీ చెప్పేశాడు. (ఇదీ చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్) సండే ఫన్డే కాదు ఇకపై సండే అంటే ఫన్డే కాదని చెప్పిన నాగార్జున.. యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్మేట్' టాస్క్ పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరు.. ఇద్దరికీ ఈ రెండు ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. ఎవరు.. ఎవరెవరికి ఏ ట్యాగ్ ఇచ్చారు? కంటెస్టెంట్స్.. ఫ్రెండ్.. బ్లాక్ హౌస్మేట్ గౌతమ్ - ప్రశాంత్, శోభాశెట్టి అమర్దీప్ - ప్రశాంత్, రతిక రతిక - శోభాశెట్టి, అమర్ శోభాశెట్టి - రతిక, గౌతమ్ అశ్విని - శోభాశెట్టి, గౌతమ్ యావర్ - శోభాశెట్టి, గౌతమ్ ప్రశాంత్ - అమర్దీప్, రతిక అర్జున్ - శివాజీ, యావర్ శివాజీ - అర్జున్, రతిక ప్రియాంక - ప్రశాంత్, అశ్విని శివాజీ మళ్లీ అలానే ఆదివారం ఎపిసోడ్లో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ ప్రమోషన్లో భాగంగా వచ్చారు. అయితే అంతా మాట్లాడుతున్న సమయంలో.. శివాజీని పెద్దాయన అని శ్రీకాంత్ సరదాగా అన్నాడు. దీంతో.. తనని అందరూ పెద్దాయన-పెద్దాయన అని అనడంపై శివాజీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తలుపులు తీస్తే ఎల్లిపోతా సర్, ఇది నరకంగా ఉంది అని బుర్ర బాదుకుని మరీ పాత శివాజీని గుర్తుచేశాడు. సరదాకి అన్నాసరే శివాజీ అంటున్నాడనేది అర్థం కాలేదు. ఇకపోతే సేవింగ్లో భాగంగా తొలి రౌండ్లో యావర్, ప్రియాంక.. రెండో రౌండ్లో అర్జున్, అమర్దీప్ సేవ్ అయ్యారు. మూడో రౌండ్లో శోభాశెట్టి, రతిక సేవ్ అయ్యారు. చివరగా గౌతమ్, అశ్వినిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకున్నారు. కానీ ఇద్దరు సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. తద్వారా ఈ వారం నో ఎలిమినేషన్ అని తేలింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?) నో ఎలిమినేషన్కి కారణమదే అయితే ఈ వారం ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేని పరిస్థితుల్లో అంటే ఈ రోజు ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గతవారం కేవలం ఐదుగురికి మాత్రమే ఎవిక్షన్ పాస్ కోసం పోటీపడే ఛాన్స్ వచ్చిందని, ఈ వారం మాత్రం అందరూ దానికోసం పోటీపడే అవకాశమొస్తుందని నాగ్ చెప్పాడు. అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందనేది బిగ్బాస్ డిసైడ్ చేస్తారని నాగ్ వివరణ ఇచ్చాడు. అలానే రాబోయే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగ్ షాక్ ఇచ్చాడు. అంటే ఈ వారం మిస్ అయినోడు, నెక్స్ట్ వారం కలిపి ఇద్దరిని ఒకేసారి ఇంటికి పంపేస్తారనమాట. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు రతిక.. తెగ భయపడిపోయింది. దీంతో నాగార్జున ఆమెని సముదాయించాడు. 'ఏంటి రతిక.. సేవ్ అయ్యావని నమ్మలేకపోతున్నావా?' అని నాగార్జున అడిగాడు. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సర్ అని తన ఆనందాన్ని, భయాన్ని మిక్స్ చేసిన ఫీలింగ్స్ రతిక బయటపెట్టింది. చివరవరకు వచ్చేసరికి అశ్విని కూడా అలానే భయపడిపోయింది. కానీ నో ఎలిమినేషన్ అనేసరికి రతిక, అశ్విని.. హమ్మయ్యా అనుకున్నారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) -
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్.. నో ఎలిమినేషన్
బిగ్బాస్ షోలో కొన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. షో ప్రారంభమైన తొలి వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇట్టే పసిగట్టేస్తుంటారు. కానీ రానురానూ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికి వారు తమకంటూ సొంత ఫ్యాన్బేస్ ఏర్పాటు చేసుకుంటారు. గెలుపు కోసం తెగ కష్టపడుతుంటారు, ఎంటర్టైన్ చేస్తుంటారు. వారి మధ్య పోటీ పెరగడంతో ఎలిమినేషన్ను అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. కానీ ఈ సీజన్లో దాదాపు అన్ని ఎలిమినేషన్స్ ఊహించినట్లే జరుగుతున్నాయి. నయని పావని, సందీప్, భోలె షావళి ఎలిమినేషన్స్ మాత్రమే కాస్త అటూఇటుగా జరిగాయి. ఎవిక్షన్ పాస్ వెనక్కు ఇక ఈ వారం ఎవరు మూటాముళ్లె సర్దుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బిగ్బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టడం.. అది యావర్ గెల్చుకోవడంతో ఎలిమినేషన్ మరింత ఉత్కంఠగా మారింది. కానీ బిగ్బాస్ తలిచింది వేరు.. ఆ పాస్ లేడీ కంటెస్టెంట్ గెలుచుకోవాలని ప్రయత్నించాడు. అందుకే ఒకటీ రెండు కాకుండా బోలెడన్ని గేమ్స్ పెట్టాడు. అయినా చివరకు యావరే గెలిచాడు. అయితే ఓ గేమ్లో యావర్ చేసిన తప్పును నేడు నాగార్జున వీడియో వేసి చూపించాడు. దీంతో తనది ఫౌల్ గేమ్ అని ఒప్పుకుని ప్రిన్స్ తన పాస్ను వెనక్కు ఇచ్చేశాడు. కానీ అంతలోనే సర్ప్రైజ్.. అంటూ పాస్ తిరిగిచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డేంజర్ జోన్లో అమ్మాయిలు.. అనూహ్య నిర్ణయం తీసుకున్న బిగ్బాస్ అయితే ఈ వారం శివాజీ, ప్రశాంత్ తప్ప మిగిలిన అందరూ నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో అమర్దీప్, ప్రిన్స్ యావర్, గౌతమ్, ప్రియాంక సేఫ్ జోన్లో ఉన్నారు. రీఎంట్రీ తర్వాత పెద్దగా ప్రభావం చూపని రతిక ఎలిమినేట్ కానుందని ప్రచారం జరిగింది. కానీ చివర్లో అశ్విని, శోభాలలో ఎవరో ఒకరిని బయటకు పంపించనున్నట్లు టాక్ నడిచింది. అయితే ఇవేవీ కాదని బిగ్బాస్ అనూహ్య ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ ఎత్తేశాడు. ఈవారం ఎవరినీ బయటకు పంపించలేదు. అమ్మాయిలను హౌస్లో ఉంచడానికే బిగ్బాస్ ఈ ప్లాన్ వేసినట్లు స్పష్టమవుతోంది. చదవండి: నీతులు చెప్తూ బూతులు మాట్లాడుతున్న శివాజీ.. ఈసారైనా నాగ్ కోటింగ్ ఇస్తాడా? -
Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?
బిగ్బాస్ 7 తెలుగు సీజన్ గతంతో పోలిస్తే గత కొన్నివారాలుగా పికప్ అయిందని చెప్పొచ్చు. గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నారు. అయితేనేం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇకపోతే ఉల్టాపుల్టా అనే ట్యాగ్ లైన్తో ఈ సీజన్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైన్కి మరోసారి న్యాయం చేసేలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ మేటర్ ఏంటి? ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) నామినేషన్స్లో ఎవరు? ఈ వారం బిగ్ బాస్ హౌసులో 8 మంది నామినేట్ అయ్యారు. శివాజీ కెప్టెన్ కాబట్టి అతడు లిస్టులో లేడు. రైతుబిడ్డ ప్రశాంత్కి ఒక్క ఓటు పడటంతో అతడు సేఫ్ అయిపోయాడు. దీంతో మిగిలిన వాళ్లందరూ అంటే అమర్దీప్, యావర్, ప్రియాంక, శోభాశెట్టి, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక ఉన్నారు. వీళ్లలో యావర్కి ఈసారి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. రెండులో అమర్ ఉన్నాడట. తర్వాత వరసగా రతిక, అశ్విని, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సీరియల్ బ్యాచ్లోని ప్రియాంక లేదా శోభాశెట్టిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి. కానీ బిగ్బాస్ ఆర్గనైజర్స్ అస్సలు వీళ్లని బయటకు పంపించారు. ఎందుకంటే ఆటైనా గొడవైనా వీళ్లిద్దరూ ముందుంటున్నారు. శివాజీకి ఎదురు నిలబడి మాట్లాడుతున్నది కూడా వీళ్లే. ఇలాంటోళ్లని ఎలిమినేట్ చేసి పంపించేస్తే షోలో మజా పోతుంది. అందుకే ఓట్లు తక్కువ పడినా సరే వీళ్లు బయటకెళ్లే ప్రసక్తే లేదనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ) డబుల్ ట్విస్ట్ ఈ వారం ఎవిక్షన్ పాస్ ఇవ్వడాని కంటే ముందు.. ఇప్పటివరకు హౌసులో ఉన్నదాని ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం నిలబడమని బిగ్బాస్ చెప్పాడు. దీంతో వరసగా శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా, అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక నిల్చున్నారు. చివరి రెండు స్థానాల్లో అశ్విని-రతిక ఉన్నారు. అంటే వీళ్లిద్దరూ ఎలిమినేషన్ కి అర్హులని పరోక్షంగా చెప్పినట్లే. అలా ఇప్పుడు ఈ ఇద్దరిని ఈవారం ఒకేసారి ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ప్లానింగ్లో ఉందని టాక్. ఎవిక్షన్ పాస్ సంగతేంటి? ఈవారం పెట్టిన పోటీల్లో గెలిచిన యావర్.. ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. అయితే మనోడు ఎలిమినేషన్లో ఉన్నాడు కాబట్టి సొంతంగా సేవ్ చేసుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెడితే.. యావర్ తనకోసం తానే దీన్ని ఉపయోగించే అవకాశముంటుంది. వేరే వాళ్ల కోసం అంటే మాత్రం కచ్చితంగా రతికని యావర్ సేవ్ చేసేస్తాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. గేమ్, టాస్కుల పరంగా చూసుకుంటే రతిక ఎప్పుడో వెళ్లిపోవాలి. కానీ బిగ్బాస్ ఎందుకో ఆమెపై తెగ ప్రేమ చూపిస్తున్నాడు. ఈసారి ఆమె ఎలిమినేట్ అవుతుందా? సేవ్ అవుతుందా అనేది చూడాలి. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) -
యావర్ చేతిలో ఎలిమినేషన్.. రతిక సేవ్ అయినట్లేనా?
బిగ్బాస్ ఇంటిసభ్యులు టాప్ 10 స్థానాల కోసం కొట్టుకున్నారు. ఎవరికి వారు ఒకటో స్థానం నాదేనని వాదించారు. ఎలాగోలా ఆ ప్రక్రియ ముగిశాక బిగ్బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్లో ఉన్నవారిలో వీక్ అనుకుంటున్న కంటెస్టెంట్ల కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. ఇందుకోసం టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలబడ్డ అమర్దీప్, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక పోటీపడ్డారు. అర్జున్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. కానీ ఇక్కడే ఓ మెలిక పెట్టాడు బిగ్బాస్. గెలిచిన అర్జున్ టాప్ 5లో ఉన్నవారితో పోటీపడి తన పాస్ను కాపాడుకోవాలనుకున్నాడు. అర్జున్ నుంచి చేజారిన పాస్ అయితే బిగ్బాస్ ప్లాన్ చూస్తుంటే ఈ పాస్ అమ్మాయిలను కాపాడేందుకే ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది. కానీ వారికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రిన్స్ యావర్ గేములో రెచ్చిపోయాడు. అర్జున్ను ఓడించి ఆడి గెలిచాడు. తర్వాత శోభాతో ఆడిన గేములోనూ గెలిచాడు. అనంతరం పల్లవి ప్రశాంత్తో పోటీకి దిగి అక్కడా అతడే గెలిచాడు. ఇలా వరుసగా మూడు ఆటల్లో గెలిచి పాస్ను దక్కించుకున్నాడు. యావర్ కనిపించడం లేదు, డల్ అయిపోయాడు, ఫోకస్ తగ్గిపోయింది, దారి తప్పుతున్నాడు.. ఇలా ఎన్నో మాటలు పడ్డ యావర్ చివరకు తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఒక్కొక్కరినీ చిత్తుగా ఓడిస్తూ తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. అక్కడివరకు బాగానే ఉంది.. కానీ ఈ పాస్ను ఎవరికోసం ఉపయోగిస్తాడు చెప్మా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. తిరుగులేని యావర్.. తను ఎలాగో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తనకోసం వాడుకోడని కచ్చితంగా రతిక కోసం వాడుతాడని అంటున్నారు. బిగ్బాస్ తలిస్తే ఏదైనా జరుగుతుంది.. ఉల్టా పుల్టా అని చెప్పి.. నీకోసం కాకుండా ఇతరుల కోసం వాడాలంటే చచ్చినట్లు రతిక కోసం వాడతాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ లెక్కన ఈ వారం రతిక సేవ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే అప్పుడు ఎలిమినేషన్ గండం శోభా శెట్టికి చుట్టుకుంటుంది. అంటే ఈ వారం ఎలిమినేషన్ ప్రజలు, బిగ్బాస్ చేతిలో కాదు.. యావర్ చేతిలో ఉందన్నమాట! చదవండి: మరో రికార్డు సాధించిన జవాన్.. ఓటీటీలో తగ్గడం లేదుగా! -
తమ్ముడికి రతిక వెన్నుపోటు.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ అలాంటి మాటలు!
బిగ్బాస్ ముద్దుబిడ్డ రతిక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఓసారి ఎలిమినేట్ అయి బయటకెళ్లి వచ్చినా ఇంకా బుర్ర పనిచేయట్లేదు. ఏకంగా తమ్ముడికే వెన్నుపోటు పొడిచి పారేసింది. రతికకు తోడు యవర్ కూడా అలానే మెంటలెక్కినట్లు బిహేవ్ చేశాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 73 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టాప్-10 ప్లేసుల కోసం గొడవ నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ఇప్పటివరకు 10 వారాలు పూర్తయ్యాయి కదా.. ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ చూసుకుని టాప్-10లో ఎవరు ఏ ప్లేసులో నిలబడాలో డిసైడ్ చేసుకోవాలని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో మొత్తం గొడవ గొడవ అవుతుందనుకుంటే చాలా సాదాసీదా గొడవలే జరిగాయి. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) ఏ కంటెస్టెంట్ ఏ స్థానంలో? 1 శివాజీ 2 యావర్ 3 ప్రశాంత్ 4 ప్రియాంక 5 శోభాశెట్టి 6 అమర్దీప్ 7 గౌతమ్ 8 అర్జున్ 9 అశ్విని 10 రతిక శోభా ఫస్ట్ టైమ్ ఏడుపు ఈసారి బిగ్బాస్ సీజన్లోకి వచ్చిన అమ్మాయిల్లో కాస్తోకూస్తో బెటర్ అంటే శోభా-ప్రియాంకనే. చాలామంది వీళ్లని తిడతారు గానీ ఇలాంటోళ్లు లేకపోతే అస్సలు మజా ఉండదు. అయితే ఇన్నాళ్ల గొడవలు, అరుపులతో హౌస్ మొత్తాన్ని గడగడలాడించిన శోభా.. అర్జున్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. టాప్-10లో శోభా ఏడో స్థానానికి సూట్ అవుతుందని చెప్పిన అర్జున్.. ప్రతిసారీ శోభాకు అదృష్టం కలిసొచ్చిందని కారణం చెప్పాడు. బయట కాస్త గంభీరంగా కనిపించిన శోభా.. బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. అమర్-ప్రియాంకతో దీని గురించి మాట్లాడుతూ తెగ బాధపడిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) రతిక వెన్నుపోటు ఆట తప్ప అన్నీ చేస్తున్న రతిక ఓసారి ఎలిమినేట్ అయింది. పిచ్చి కారణాలతో రీఎంట్రీ పేరు చెప్పి ఈమెని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చారు. అయినా సరే ఆడకుండా అలానే బండి లాక్కుని వస్తోంది. తాజాగా టాప్-10లో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. తొలి నాలుగు వారాల్లో నీ గేమ్ కనిపించలేదు, సొంతంగా గేమ్ ఆడలేవు, బిగ్బాస్ రూల్స్ అర్థం కావు, నువ్వు ఆడుతున్నావా? ఒకరి హెల్ప్తో(శివాజీని ఉద్దేశించి) గ్రూపులో ఆడుతున్నావా? అనేది కనిపించట్లేదని రతిక చెప్పింది. అలా శివాజీ గ్రూపులో కలిసిపోయిన రతిక.. అదే గ్రూప్లో పల్లవి ప్రశాంత్కి వెన్నుపోటు పొడిచేసింది. ఇక రతిక అన్నేసి మాటలు అనేసరికి రైతుబిడ్డ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. 'నీ వెనకాల తిరిగా అన్నావ్, మా అమ్మ-నాన్నని తిట్టావ్, నన్ను గుండు గొరిగిస్తా అన్నావ్.. అయినాసరే హౌసుకి ఫస్ట్ కెప్టెన్ అయ్యా. నేను కెప్టెన్ అవ్వాలని అన్న(శివాజీ) లెటర్ త్యాగం చేసిండు. అర్థమైందా అక్కా' అని రతికకి ప్రశాంత్ వేరే లెవల్లో కౌంటర్ వేశాడు. దీంతో బిగ్బాస్ ముద్డుబిడ్డ ఆమె ముఖం మాడిపోయింది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) యావర్కి నిజంగా పిచ్చే ఇక టాప్-10లో యావర్ ఎక్కడుండాలో అనేది అశ్విని చెప్పడానికి ట్రై చేస్తుంటే.. ఆమెతో యావర్ గొడవ పెట్టుకున్నాడు. ఒకానొక దశలో మాటామాటా పెరిగి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అశ్విని కోప్పడితే.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని యావర్ అన్నాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ఏం లేనిదానికి యవర్, అశ్వినితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో యావర్కి నిజంగా పిచ్చి పట్టిందా అని డౌట్ వచ్చింది. అర్జున్ కే ఎవిక్షన్ పాస్ అయితే టాప్-10లో అందరూ నిలబడిన తర్వాత బిగ్బాస్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడు. ఈ తతంగం అంతా కూడా ఎవిక్షన్ పాస్ గురించి అని చెప్పి.. చివరి ఐదు స్థానాల్లో నిలబడిన వాళ్లకు పోటీ ఉంటుందని, అందులో విజేతగా నిలబడిన వాళ్లకు ఎవిక్షన్ పాస్ దక్కుతుందని చెప్పాడు. ఇందులో అమరదీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడగా.. అర్జున్ పాస్ గెలుచుకున్నాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అయితే శివాజీ.. కాస్త ఆడమ్మా అని రతికకి గైడెన్స్ ఇచ్చినా సరే సొంత గ్రూప్ మీదకే ఈ పిల్ల తిరగబడటం కాస్త వెరైటీగా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్పై పోలీస్ కేసు) -
'నా లైఫ్లో ఎవ్వరూ ఇలా చేయలే'.. రైతు బిడ్డ ఎమోషనల్!
బిగ్ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. రైతు బిడ్డ ప్రశాంత్ మాత్రమే నామినేట్ కాలేదు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బిగ్ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ తీసుకొచ్చారు. మీలో మీరు కొట్టుకుని చావండి.. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నరీతిలో ర్యాంకింగ్ గొడవ తెచ్చారు. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఆ ర్యాంకింగ్ పోటీ ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతోంది. (ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) ప్రోమోలో పల్లవి ప్రశాంత్కు నంబర్వన్ ప్లేస్ ఇస్తానని శివాజీ చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్లో ఎవ్వరు చేయలే.. అన్న చేసిండు.. పల్లవి ప్రశాంత్ సీజన్-7 ఫస్ట్ కెప్టెన్.. అంటూ గుండెలపై బాదుకున్నాడు. ఆ తర్వాత రతికా మాట్లాడుతూ.. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియట్లే. నీకు సొంతంగా ఆడుతున్నవో.. గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అని అనడంతో.. అక్కా.. నువ్వు మా అమ్మ, బాపును తిట్టినవ్..గడ్డం గీకెస్తా అన్నావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ యావర్పై అశ్విని మండిపడింది. దీంతో వెంటనే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.. డోంట్ టీచ్ మీ దట్.. అని యావర్ అన్నాడు. ఆ తర్వాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ ఊహించని విధంగా షాకిచ్చాడు. ఈ సీజన్ ఉల్టా- పుల్టా అని మనకు తెలిసిందే. దీంతో ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే అంటే.. చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్ పాస్ పొందే అవకాశముందని ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్కు ఓ టాస్క్ ఇచ్చాడు. చివరి ఐదు స్థానాల్లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడ్డారు. మరీ ఈ గేమ్లో ఎవరు గెలిచారు? ఎవరినీ ఎవిక్షన్ పాస్ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇది చదవండి: ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?) -
రతిక పెట్టిన చిచ్చు.. మీదపడి మరీ అరుచుకున్న ఆ ఇద్దరు!
అమ్మాయిల వల్ల రాజ్యాలే కుప్పకూలిపోయాయి. ఆఫ్ట్రాల్ 'బిగ్బాస్' ఎంత? అవును మీరు కరెక్ట్గానే విన్నారు. తాజాగా 11వ వారం నామినేషన్స్లో ఓ అమ్మాయి గతంలో అనేసిన ఓ మాట కోసం ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ గొడవపడ్డారు. మీదమీదపడి కొట్టుకునేంతవరకు వెళ్లిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 72 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!) నామినేషన్స్లో రచ్చరచ్చ సోమవారం నలుగురు హౌస్మేట్స్ తమతమ నామినేషన్స్ పూర్తిచేశారు. మంగళవారం మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. అయితే సోమవారం కాస్తోకూస్తో లాజిక్స్ మాట్లాడారు కానీ మంగళవారం మాత్రం చాలా సిల్లీగా అసలేం ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సాగాయి. ఓవరాల్గా ఎనిమిది మంది ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - అర్జున్, రతిక అశ్విని - ప్రియాంక, అమరదీప్ యవర్ - శోభాశెట్టి, అమరదీప్ శోభాశెట్టి - యవర్, అశ్విని అమరదీప్ - గౌతమ్, యవర్ శివాజీ - గౌతమ్, ప్రియాంక దొరికిపోయిన యవర్ అమరదీప్ని నామినేట్ చేసిన అశ్విని.. తనపై పాట పాడినందుకే చేస్తున్నానని కారణం చెప్పింది. అయితే మరీ ఇంత సిల్లీ రీజనే ఏంట్రా బాబు అనిపించింది. దీని తర్వాత వచ్చిన యవర్, అమరదీప్ని నామినేట్ చేశాడు. అయితే ఫస్ట్ టెడ్డీ గేమ్లో తన బొమ్మ ఎందుకు పట్టుకున్నావ్ అని మాట్లాడాడు. ఇది నా గేమ్ అని అమర్ క్లారిటీ ఇచ్చేసరికి యవర్ మాట మార్చేశాడు. అది కాదు నింజా గేమ్ గురించి మాట్లాడుతున్నా అన్నాడు. దీంతో అమర్ చాలా కూల్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత వారాల్లో తప్పులు ఎత్తిచూపి నామినేషన్ చేస్తున్నావ్ అంతేగా అని అమర్ అనేసరికి.. ఇప్పటివరకు జరిగింది మొత్తం చూసి చెబుతున్నా అని యవర్ అరిచాడు. బిగ్బాస్ నెక్స్ట్ టైమ్ నుంచి ఇలాంటి గేమ్స్ ఇవ్వకండి.. యవర్కి ఇవి నచ్చట్లేదు అని అమరదీప్ సెటైరికల్గా మాట్లాడాడు. (ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!) రతిక చెప్పిన దానికోసం ఇకపోతే అమర్-యవర్ నామినేషన్స్ సందర్భంగా.. హైప్ కోసమే రతిక వెనక యవర్ తిరుగుతున్నాడని అమరదీప్ అప్పుడెప్పుడో మూడో వారామో నాలుగో వారమో అన్నాడట. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ జరగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ఇక్కడితో ఆగిపోయింటే పర్లేదు గానీ అమర్ రెచ్చగొట్టేసరికి యవర్ పైపైకి వచ్చాడు. మధ్యలో ఎంటరైన శివాజీ.. వాళ్లని ఆపుచేశాడు. యవర్ కావాలనే అబద్ధాలు చెబుతున్నాడని అమర్ రెచ్చిపోయాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈ వారం నామినేట్ అయినోళ్లు అమరదీప్ శోభా ప్రియాంక అర్జున్ రతిక అశ్విని యవర్ గౌతమ్ (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
బిగ్బాస్ ప్లాన్ ఫెయిల్? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో ఫ్యామిలీ వీక్ అయిపోయింది. కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు అటు ఇంట్లోకి, ఇటు స్టేజీపైకి వచ్చి మాట్లాడటంతో హౌస్మేట్స్లో జోష్ రెట్టింపయ్యింది. ఆడాలన్న కసి మరింత పెరిగిపోయింది. ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఈ వారాన్ని ప్రారంభించారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ను దృష్టిలో పెట్టుకుని నామినేషన్స్ మొదలుపెట్టారు. రతికను గేమ్ ఆడమని చెప్తే నామినేషన్స్లో తన టాలెంట్ చూపించింది. సా...గదీస్తూ చిరాకు పుట్టిస్తున్న రతిక ఏదేదో మాట్లాడుతూ.. రెచ్చిపోయి అరుస్తూ తనకు హైప్ తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ చూసేవాళ్లకు అదంతా కావాలని చేస్తుందని ఇట్టే అర్థం కావడంతో తన ప్రవర్తనకు విసుగెత్తిపోయారు. ఇక ప్రశాంత్ క్రేజ్ పెరిగిందనుకున్నాడో మరేంటో కానీ అర్జున్ అనూహ్యంగా రైతుబిడ్డను నామినేట్ చేశాడు. కాకపోతే అతడు చెప్పిన కారణాన్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే! నీ ఇండివిడ్యుయాలిటీ కోల్పోతున్నావ్, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదని చెప్పాడు. ఎప్పుడూ ఒకరి నీడలో ఉండి ఆడుతున్న ప్రశాంత్ ఈ పాయింట్ను అర్థం చేసుకుంటే అతడికే ప్లస్ అవుతుంది. ర్యాంకింగ్లో వెనకబడ్డ ఆ ఐదుగురు ఇకపోతే హౌస్లో ర్యాంకింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. కంటెస్టెంట్లు.. వారికి అర్హత అనిపించే ర్యాంకుల్లో నిలబడాలన్నాడు. దీంతో తొలి స్థానంలో శివాజీ, రెండు, మూడు స్థానాల్లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ నిలబడ్డారు. నాలుగైదు స్థానాల్లో ప్రియాంక, శోభ నిల్చోగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఫినాలేలో ఇదే ఆర్డర్ ఉండే అవకాశం లేదు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెల్చుకుంది అతడే అయితే చివరి ఐదు స్థానాల్లో ఉన్నవారి కోసం బంపరాఫర్ ఇచ్చాడు బిగ్బాస్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ఓ ఈజీ టాస్క్ ఇచ్చాడు. బహుశా అమ్మాయిలను కాపాడటానినే సులువైన టాస్క్ పెట్టాడేమో! కానీ బిగ్బాస్ ఆశలను అడియాశలు చేస్తూ అర్జున్ అంబటి పాస్ గెల్చుకున్నట్లు తెలుస్తోంది. పాపం.. రతికను కాపాడటానికి బిగ్బాస్ ఎంత ప్రయత్నిస్తున్నా ఈ వారం తనే ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: ఆల్రెడీ పెళ్లై విడాకులు తీసుకున్న హీరోతో ఐదేళ్లు సహజీవనం.. పిల్లల కోసమే పెళ్లి.. -
Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!
బిగ్బాస్ 7లో మరో నామినేషన్స్ డే వచ్చేసింది. అయితే ఈసారి రతిక కాస్త ఓవరాక్షన్ చేసింది. అది కూడా ఓ విషయం అర్థం కావడం వల్లే. మరోవైపు అర్జున్, ప్రశాంత్ గాలి అంతా తీసేశాడు. అలా ప్రశాంత్-రతిక అతి వల్ల శివాజీ టార్గెట్ అయిపోయాడు. మరోవైపు శోభా-ప్రియాంక భిన్నంగా ప్రవర్తించారు. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా ఏం జరిగిందనేది Day 71 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ మాయలో రతిక భోలె ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక భోలె వెళ్లిపోయాడని రతిక ఏడవడంతో సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫ్రెండ్ ఎలిమినేట్ అయినందుకు అశ్విని తెగ బాధపడిపోయింది. అస్సలు ఉండలని అనిపించట్లేదని ఏడుస్తూనే కనిపించింది. మరోవైపు ఎలిమినేషన్ మొదలవడానికి ముందు రతికని శివాజీ ఇన్ఫ్లూయెన్స్ చేశాడు. 'నువ్వు ఏమనుకుంటావో నాకు తెల్వదు, నామినేషన్స్లో నీ టాలెంట్ చూపియ్. నన్ను నమ్ము, ఇది నీకు చాలా హెల్ప్ అవుద్ది. అవతల వాళ్లు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూస్కో. అలానే వాళ్లు కూడా ఏం మాట్లాడుతున్నారో విను. భయంలో ఉండి వినకు' అని రతికతో చెప్పాడు. ప్రతిసారి తను ఎవరికీ ఏం చెప్పట్లేదు బాబుగారు అని చెబుతుంటాడు కదా! మరి ఇప్పుడు చేసిందేంటో శివాజీకే తెలియాలి. దీనిబట్టి రతిక గేమ్ మానేసి ఓట్లు కోసం శివాజీ మాయలో పడిందని క్లియర్గా అర్థమైంది. (ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!) నామినేషన్స్ షురూ సోమవారం ఎపిసోడ్లో భాగంగా కేవలం నలుగురు మాత్రమే తమ నామినేషన్స్ పూర్తిచేశారు. అయితే ఇన్ని వారాలు తినడం, ముచ్చట్లు పెట్టడం తప్ప మరో పనిచేయని రతిక.. ఈసారి నామినేషన్స్లో శివాజీ ఇన్ఫ్లూయెన్స్ వల్ల రెచ్చిపోయింది. అయితే చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా ఉండే బాగున్ను. కానీ శోభా-ప్రియాంక ఈమెని కూల్గా హ్యాండిల్ చేసేసరికి రతికకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ అలానే బిహేవ్ చేసింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? రతిక - శోభాశెట్టి, ప్రియాంక అర్జున్ - ప్రశాంత్, శోభాశెట్టి ప్రియాంక - రతిక, అశ్విని గౌతమ్ - అర్జున్, అమరదీప్ (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) రతిక భయపడిపోయింది ఓసారి ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చిన రతిక.. తిరిగొచ్చి మూడు వారాలు అవుతున్నా పెద్దగా పీకిందేం లేదు. దీపావళి ఎపిసోడ్లో అందరూ ఇదే చెప్పేసరికి ఈసారి నామినేషన్స్ లో ఏదో ఒకటి మాట్లాడేయాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే చేయకపోతే ఇంటికి పంపేస్తారుగా. అందుకే తొలుత శోభాని నామినేట్ చేసింది. గతవారం కెప్టెన్గా ఎఫర్ట్ ఏం కనిపించలేదని నామినేషన్కి కారణం చెప్పింది. మరి వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ సర్ అడిగినప్పుడు, నేను కెప్టెన్సీ బాగానే చేశానని ఎందుకు పైకెత్తావ్ అని శోభా అడగ్గానే.. రతిక టాపిక్ మార్చేసింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే రతికకి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందుకే హైప్ తెచ్చుకోవాలని నామినేషన్స్ లో కాస్త ఓవరాక్షన్ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రతిక.. ప్రియాంకని కూడా నామినేట్ చేసింది. దీంతో ఈమె కూడా లాజిక్తో కొట్టింది. 'నీకు ఇప్పుడు కూడా చెప్పడానికి పాయింట్ లేదు. వేరే వాళ్లు వచ్చి చెబితే దాన్ని నువ్వు సాగదీయడం తప్ప నీకు వేరేవాళ్లపై చెప్పడానికి ప్రత్యేకంగా పాయింట్స్ లేవు. రావు కూడా' అని శివాజీని ఉద్దేశిస్తూ ప్రియాంక సీరియస్ అయింది. ఈ సందర్భంగా వేరే వాళ్లు వచ్చి చెబితే అన్నది శివాజీ గురించే! అలానే 'నాగార్జున సర్ చెప్పేంత వరకు, మీ అమ్మ వచ్చి చెప్పేంత వరకు నీకు నీ విలువ తెలియదు' అని రతిక గాలి మొత్తం ప్రియాంక తీసిపడేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ప్రశాంత్-శివాజీ యవ్వారం ఇక అర్జున్.. పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేశాడు. 'నీ జోలికొస్తే నువ్వు వేస్తావ్, బాగానే ఉంటది. కానీ శివాజీ అన్న జోలికొచ్చినా సరే వేస్తావ్ చూడు అక్కడ కొంచెం బాగోదు' అని అర్జున్ కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్ ఎప్పటిలానే హంగామా క్రియేట్ చేయాలని చూశాడు. కానీ మిగతవాళ్లలా అర్జున్ ఊరుకోలేదు. ప్రశాంత్, నామినేషన్స్లో భుజం పైకెత్తి, అటుఇటు తిరుగుతూ ఎలా ప్రవర్తిస్తాడో.. సేమ్ అర్జున్ కూడా అలానే బిహేవ్ చేశాడు. దీంతో ప్రశాంత్ మెంటలెక్కిపోయాడు. 'శివాజీ అన్న నీకు ఫస్ట్ హెల్ప్ చేశాడు. నీకు వెన్నెముకలా నిల్చున్నాడు తప్పులేదు. ఇక నుంచైనా ఆయన ఆట నువ్వు ఆడటం మానేసి, నీ ఆట నువ్వు ఆడు' అని అర్జున్ మరో కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఇంకా పెరిగితే తన బండారం బయటపడుతుంది.. బాటిల్ పగలగొట్టేయమన్నాడు. అయితే ప్రశాంత్ గురించి అర్జున్ మాట్లాడుతున్నంతసేపు.. ఏదో తప్పు చేసినవాడిలా శివాజీ ముఖం దించేసి కనిపించాడు. సో దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా సరే ప్రశాంత్, రతిక, యవర్ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. పాపం ఈ ముగ్గురు.. శివాజీ మహానుభావుడు, నీతిమంతుడు, చాణక్య అనుకుని.. అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇప్పటికైనా వీళ్లు శివాజీ చెప్పాడనో, అతడి మాట వింటే ఓట్లు పడతాయనో కాకుండా ఎవరి గేమ్ వాళ్లు ఆడితే బెటర్. లేదంటే ప్రశాంత్, రతిక, యవర్ అని కాకుండా.. శివాజీ చెంచాలుగానే మిగిలిపోతారు. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
నెత్తిన పగిలిన బాటిల్స్, రైతుబిడ్డ సేఫ్.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది ఎలిమినేట్ అవడంతో హౌస్లో పది మంది మాత్రమే మిగిలారు. వీరందరూ టాప్ 5లో కర్చీఫ్ వేసేందుకు పోటీపడుతున్నారు. మరికొందరు కప్పు కొట్టుకుపోవాలని తహతహలాడుతున్నారు. ఎవరు ఫినాలేలో అడుగుపెట్టాలి? ఎవరు విజేతగా నిలుస్తారనేది ప్రజల చేతుల్లో ఉంది. రతికను రెచ్చగొట్టిన శివాజీ అయితే నామినేషన్స్ గండం గట్టెక్కితే కంటెస్టెంట్లు మరికొన్ని వారాలు హౌస్లో ఉండొచ్చు. మరి ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయో తెలియజేస్తూ తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో కెప్టెన్ శివాజీ.. నామినేషన్స్లో నీ టాలెంట్ చూపించు.. అంటూ రతికను రెచ్చగొట్టాడు. ఇంకేముంది.. రతిక రోజ్ రెచ్చిపోయింది. ప్రియాంక, శోభలను నామినేట్ చేసింది. కెప్టెన్ అంటే కేవలం బ్యాడ్జ్ పెట్టుకోవడమే కాదు, ఏం చేశావో చెప్పు.. అంటూ శోభా శెట్టిని నిలదీసింది. ప్రియాంకను కూడా ఏదో అడుగుతూ.. నేను అడిగినదానికి సమాధానం చెప్పు అంటూ ఆవేశంతో ఊగిపోయింది. సొంతంగా నామినేట్ చేశావా? అర్జున్ ఎవరూ ఊహించని రీతిలో రైతుబిడ్డను నామినేట్ చేశాడు. నువ్వు ఎప్పుడైనా సొంతంగా ఎవరినైనా నామినేట్ చేశావా? అని అడిగాడు. ఇంతలో ప్రశాంత్లో అపరిచితుడు బయటకు రాగా.. బరాబర్ చెప్తున్నా.. నువ్వు ఓడిపోయావ్ అంటూ అతడి తలపై బాటిల్ పగలగొట్టాడు అర్జున్. అలాగే శోభనూ నామినేట్ చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఈ వారం కెప్టెన్ శివాజీ, పల్లవి ప్రశాంత్ మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రైతుబిడ్డకు ఒక్క ఓటు మాత్రమే పడటం వల్ల అతడు నామినేషన్స్లో లేడని సమాచారం. చదవండి: బిగ్బాస్ 7: టాప్ 5లో ఉండేది వీళ్లే! -
బిగ్బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో మరో ఎలిమినేషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా అందులో ఒకరైన రతిక వైల్డ్ కార్డ్తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె ఎంట్రీతో షోకు ఒరిగిందేమీ లేదు. పాత గొడవలు తవ్వుతూ కూర్చోవడంతో చిరాకొచ్చిన నాగార్జున ఆ సోదంతా ఇప్పుడెందుకు అని గతాన్ని వదిలెయ్మన్నాడు. సరేనంటూ బుద్ధిగా ఆయన చెప్పినట్లే నడుచుకుంది. కానీ ఆటలో మాత్రం చాలా వెనకబడిపోయింది. కనీసం తనేం చేస్తుందే తనకే తెలియనట్లుగా ప్రవర్తిస్తోంది. ఎలిమినేషన్కు ముందు ప్రశాంత్తో పులిహోర కలిపిన ఆమె ఈసారి ప్రిన్స్ను తనవైపుకు తిప్పుకుంది. పాతాళానికి రతిక గ్రాఫ్ దీనివల్ల రతికకు ఏమైనా కలిసొస్తుందే లేదో కానీ యావర్ ఆట, గ్రాఫ్ మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. ఈమె ఆడదు, ఇంకొకరిని ఆడనివ్వదంటూ జనాలు రతిక మాకొద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నారు. సోషల్ మీడియా పోలింగ్స్లోనూ రతిక చివరి స్థానంలో ఉంది. అంటే ఈమె ఎలిమినేట్ అవాలని జనాలు గట్టిగానే డిసైడ్ అయ్యారు. అటు ఫ్యామిలీ వీక్లో కూడా ఆమెకు, ఆమె తండ్రికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రతిక ఎలిమినేట్ కానుందేమో, అందుకే తనను లైట్ తీసుకుంటున్నారని నెటిజన్లు రకరాలుగా ఊహించుకున్నారు. (చదవండి: 'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?) టాలెంట్ ఉంది కానీ.. కానీ తాజాగా మరో ఆసక్తికరవార్త నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ వారం భోలె షావళి ఎలిమినేట్ కానున్నాడట! ఇతడు కూడా పెద్దగా ఆడింది లేదు, కానీ పాటలతో ఇరగదీస్తున్నాడు. అప్పటికప్పుడు పాటలను అల్లుతూ అవలీలగా పాడేసే అతడి టాలెంట్కు జనాలు ఫిదా అవుతున్నారు. కానీ కొన్నిసార్లు సాగదీసి మాట్లాడటం, ఆటలో వెనుకబడటంతో తనకు కూడా తక్కువ ఓట్లే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం భోలె షావళి ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉల్టాపల్టా.. ఎలిమినేట్ అయ్యేది అతడేనా? మరి నిజంగానే భోలెకు తక్కువ ఓట్లు పడ్డాయా? అమ్మాయిలను కాపాడుకోవడానికి భోలెను బలి చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అసలే ఈ సీజన్ అంతా ఉల్టాపల్టా.. తక్కువ ఓట్లు వచ్చిన రతికను లోనికి పంపించారు. బాగా ఆడే సందీప్ను బయటకు పంపించేశారు. ఎలిమినేట్ కావాల్సిన శోభను హౌస్లో ఉంచుతున్నారు. ఇంకా ఈ సీజన్లో ఎన్ని జరగుతాయో చూడాలి! చదవండి: గతంలో చంద్రమోహన్కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్.. ఆ కంటెస్టెంట్కు శాపమైందా?
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్ను పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్లో పంపి కంటెస్టెంట్స్ను ఏడిపించేశారు. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే మూడో రోజు కూడా హౌస్లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశముంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్తో కంటెస్టెంట్స్ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. (ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..) -
రతికతో బ్రేకప్పై రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ రియాక్షన్
రతిక రోజ్.. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభంలో అందరినీ ఆకట్టుకుంది. సూటిగా, ధైర్యంగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బిగ్బాస్ ప్రియులకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత ప్రశాంత్తో పులిహోర కలపడం.. అందరిముందు మాత్రం మొత్తం నువ్వే చేశావ్ అంటూ అతడిని దోషిగా నిలబెట్టడం.. తనను చులకన చేసి మాట్లాడటం.. పదేపదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం.. ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించడం.. ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయింది. కానీ బిగ్బాస్ టీమ్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది రతిక. రతిక గురించి తొలిసారి మీడియాతో.. ఇక ఆమె హౌస్లో ఉండగా రతిక తన మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకవగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై రాహుల్ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరైన రాహుల్.. రతికతో బ్రేకప్పై తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రతికకు ఆల్ద బెస్ట్ చెప్పిన రాహుల్ ఆమెతో పాటు హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కు నేను ఆల్ద బెస్ట్ చెప్తున్నాను. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విన్నర్ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము. ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకప్పుడు బిగ్బాస్ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్బాస్ హౌస్లో చూస్తున్నారు' అని మాట్లాడాడు రాహుల్ సిప్లిగంజ్. చదవండి: 10 ఏళ్లకే ఫుల్ క్రేజ్.. 17 ఏళ్లకే తల్లయిన స్టార్ హీరోయిన్.. అర్ధాంతరంగా ముగిసిన కెరీర్.. -
నలిగిపోయిన అశ్విని, ఇచ్చిపడేసిన రతిక.. సీరియల్ బ్యాచ్ సేఫ్
నామినేషన్స్ అంటే డైరెక్ట్గా బయటకు పంపించేయరురా.. ఇదొక ప్రక్రియ మాత్రమే.. జనాలకు నచ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వల్లవేస్తుంటాడు శివాజీ. కానీ తనదాకా వచ్చేసరికి మాత్రం ఎవరైనా నామినేట్ చేస్తే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంటాడు. అవతలి వారి గొంతు పెగలనియ్యకుండా ఏది పడితే అది అనేస్తాడు. ఈరోజు కూడా అదే జరిగింది. తనను నామినేట్ చేయడంతో అతడి అహం దెబ్బ తింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. కత్తులు దూసిన కంటెస్టెంట్లు వాళ్లూ వీళ్లు చెప్తే కాదు, శివాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటూ గౌతమ్కు సలహాలిచ్చాడు అర్జున్. తాను కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నానన్నాడు. అనంతరం బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి వెల్లడించాడు. ఈసారి నామినేషన్స్ బిగ్బాస్ మహారాజ్యంలో జరుగుతాయని, ఈ రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి మిగతా ప్రజల్లో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. రాజకీయాలు జరిగాయన్న భోలె మొదట అమర్, అర్జున్ కత్తులు అందుకున్నారు. అమర్ మాట్లాడుతూ.. భోలె షావళిని టీమ్ నుంచి వెళ్లగొడుతుంటే తనను తాను సమర్థించుకోలేకపోయాడన్నాడు. దీనికి భోలె స్పందిస్తూ అక్కడ రాజకీయాలు జరిగాయని, అందుకే ఆ గ్రూపు నుంచి బయటకు రావడానికి సంకోచించలేదన్నాడు. అర్జున్ మాట్లాడుతూ.. చెప్పుడు మాటలు విని గౌతమ్ శివాజీ మీద అసత్య ఆరోపణలు చేశాడంటూ డాక్డర్బాబును నామినేట్ చేశాడు. అమర్, అర్జున్లలో రాజమాతలు అమర్ చెప్పిన పాయింట్ ఎక్కువ సమ్మతంగా అనిపించడంతో అతడి ప్రకారం భోలెను డైరెక్ట్గా నామినేట్ చేశారు. జీవితాలతో ఆడుకోకూడదు.. సోది మొదలుపెట్టిన భోలె ప్రిన్స్.. అమర్ను, ప్రశాంత్.. గౌతమ్ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రాజమాతలు..ప్రశాంత్కు మద్దతుగా నిలబడి గౌతమ్ను నామినేట్ చేశారు. తర్వాత భోలె షావళి.. అమర్ నన్ను వీక్ అనడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. కానీ అది సూటిగా చెప్పకుండా జీవితాలతో ఆడుకోకూడదు.. అదీ ఇదీ అని ఏదేదో సోది చెప్పాడు. ఇంతలో రాజమాత ప్రియాంకకు రోషం పొడుచొక్కింది. అమర్ నిన్ను వీక్ అనలేదు, బిగ్బాస్ అన్నాడంటూ అతడి తరపున లాయర్లా వాదించింది. ఊరుకో అని అశ్విని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆమె మీదకు గయ్యిమని లేచింది. శివాజీని అడ్డంగా బుక్ చేసిన గౌతమ్ గౌతమ్.. శివాజీ ఎవరినో కొట్టేసి పోతానన్నాడు. నాగ్ దాని గురించి అడిగితే తనను తాను కొట్టుకుని పోతానని మాట మార్చాడని చెప్పాడు. రాజమాతలు గౌతమ్కు మద్దతుగా నిలిచి శివాజీని నేరుగా నామినేషన్లోకి పంపించారు. ఇది సహించలేకపోయిన శివాజీ.. వాడి పాయింట్స్ మీకు కరెక్ట్గా అనిపించాయా? నేను తప్పుడు నా బిడ్డనైతే నన్ను ఎలిమినేట్ చేయండి అని ఆగ్రహించాడు. ఇంతలో ప్రియాంక, శోభ.. అశ్విని గొడవపడ్డారు. తనను అసలు మాట్లాడనివ్వట్లేదని, గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తున్నారని బాధపడింది అశ్విని. కాళ్లు మొక్కిన అశ్విని నువ్వొక్కదానివి గ్రేట్.. ఇక్కడ కూర్చున్న మేమంతా వేస్టా? అని ప్రియాంకతో వాదిస్తూ ఏడ్చింది. మధ్యలో శోభ గట్టిగట్టిగా అరవడంతో.. మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావని ఆమెపై ఫైర్ అయింది. కానీ వాళ్లముందు అశ్విని నిలబడగలదా? అశ్విని ఒక్కమాట అంటే ప్రియాంక, శోభ నాలుగు మాటలంటూ తనను డామినేట్ చేశారు. వారితో అరిచే ఓపిక లేక ఏడుస్తూ ఇద్దరి కాళ్లు మొక్కింది. దీంతో ఆ సీరియల్ నటులిద్దరూ ఇదంతా ఓవర్ యాక్షన్ అని తిట్టిపోశారు. అనంతరం శివాజీ, ప్రిన్స్ కత్తులు పట్టుకుని నిలబడ్డారు. మొదటగా శివాజీ.. గోనెసంచి గేమ్లో అమర్ నా చేయి పట్టుకుని లాగడంతో చేయంతా నొప్పి పుట్టిందంటూ నామినేట్ చేశాడు. అమర్ను టార్గెట్ చేసిన ఆ ఇద్దరు నిజానికి ఈ శివాజీయే అమర్ వల్ల చేయి బాగైందని కూడా సంతోషించాడు. ఇప్పుడు అమర్ను టార్గెట్ చేస్తూనే పైకి మాత్రం ఇతరత్రా కారణాలు చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్ సైతం మరోసారి అమర్ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇద్దరూ ఒకరినే నామినేట్ చేసేందుకు వీల్లేదన్నాడు బిగ్బాస్. ఎవరో ఒకరిని నామినేట్ చేయకపోతే నువ్వే నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో యావర్ తనకు తానుగా నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అటు రాజమాతలు కూడా యావర్నే నామినేట్ చేశారు. ఈరోజు చాలామంది అమర్ను నామినేట్ చేసేందుకు ప్రయత్నించినా రాజమాతలు మాత్రం విశ్వప్రయత్నాలు చేసి అతడిని కాపాడారుజ. బలైన రతిక అనంతరం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. రాజమాతలు చర్చించుకుని వారిలో ఒకరు నామినేట్ అవ్వాలన్నారు. రతిక, అశ్విని.. ప్రియాంకను నామినేట్ చేయగా ప్రియాంక, శోభ.. రతికను నామినేట్ చేశారు. ప్రియాంక, రతికకు టై అవడంతో నామినేషన్ బాధ్యతను కెప్టెన్కు అప్పగించాడు బిగ్బాస్. శోభకు మరో ఆప్షనే లేదు, ప్రియాంకను సేవ్ చేసి రతికను నామినేట్ చేసింది. కానీ ఈ క్రమంలో పెద్ద యుద్ధమే నడిచింది. నువ్వు నాకు ఆఫ్ట్రాల్ అంటూ శోభకు ఇచ్చిపడేసింది రతిక.ఈ వారం భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్లో ఉన్నారు. చదవండి: జూన్లో పెళ్లి.. త్వరలో తండ్రి కాబోతున్న హీరో.. -
తేజ అవుట్.. తను లేకుండా ఉండలేనంటూ శోకమందుకున్న శోభ
బిగ్బాస్ హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆల్రెడీ లీకవడంతో ఎపిసోడ్లో పెద్ద పస లేకుండా పోయింది. అయితే అటు తేజ కన్నా రతిక తానెక్కడ ఎలిమినేట్ అవుతుందోనని తెగ భయపడిపోయింది. ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని నాగ్ను అర్థించింది. ఇంతలో తేజ ఎలిమినేట్ అనడంతో ఊపిరి పీల్చుకుంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి(నవంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన.. నాగార్జున కొన్ని సామెతలను ఇచ్చి అది ఎవరికి బాగా సూటవుతుందో చెప్పాలన్నాడు. భోలె షావళి.. అమర్ది కుక్క తోక వంకర అన్నాడు. అమర్.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే బోర్డును అశ్విని మెడకు తగిలించాడు. ప్రశాంత్ ఏకులా వచ్చి మేకులా తగిలాడన్నాడు అర్జున్. ఇక తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిపడతాడని చెప్పాడు ప్రశాంత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత అశ్వినికి బాగా సూటవుతుందని అభిప్రాయపడింది ప్రియాంక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? భోలె షావళి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అని పేర్కొంది రతిక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అనేది రతిక విషయంలో నిజమైందన్నాడు గౌతమ్. పొరుగింటి పుల్లకూర రుచి అనే బోర్డు భోలెకు వేశాడు తేజ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్ యావర్. వేలు ఇస్తే చేయి గుంజినట్లు అనే బోర్డును ప్రియాంక మెడలో వేసింది అశ్విని. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనే సామెత తేజకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు శివాజీ. ఇటు రా అంటే ఇల్లంత నాదే అన్నట్లుగా తేజ ప్రవర్తిస్తాడంది శోభ. ఎలిమినేషన్ భయంతో ఏడ్చేసిన రతిక తర్వాత జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్ర యూనిట్ రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. వీరు హౌస్మేట్స్తో హుక్ స్టెప్ గేమ్ ఆడించి వెళ్లిపోయారు. తర్వాత తెలుగమ్మాయి ఈషా రెబ్బ హౌస్లోకి వెళ్లి పీరియడ్స్ సమస్యల గురించి మాట్లాడి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరగా రతిక, తేజ మాత్రమే మిగిలారు. ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని రతిక తెగ ఏడ్చేసింది. చివరకు తేజ ఎలిమినేట్ అనగానే రతికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఇక తేజ ఏడవకూడదనుకుంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. శోభకు ఎక్కువ మార్కులిచ్చిన తేజ ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తేజ కంటే శోభ ఎక్కువ ఏడ్చింది. అందరికీ వీడ్కోలు పలికేముందు హౌస్మేట్స్కు మార్కులు ఇచ్చాడు తేజ. శోభకు పదికి 20 మార్కులిచ్చాడు. గౌతమ్కు 8, అర్జున్కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్ యావర్కు 10, భోలె షావళికి 7మార్చులిచ్చాడు. ఆటపరంగా ఓకే కానీ మాటతీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓటమిని తీసుకోలేడంటూ ప్రశాంత్కు 9, వంటలక్క ప్రియాంకకు 10, అమర్దీప్కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులిచ్చాడు. అంటూ ఏడుపందుకున్న శోభ సెలవు తీసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి శోభ మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు, భయమేస్తోంది తేజ అంటూ శోకమందుకుంది. నీతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్లో చాలా రోజులు ఉండాలంటే భయమేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్లో ఉన్నప్పుడు నువ్వెవరు? అంటూ గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన శోభ తనకోసం ఏడుస్తున్నందుకు సంతోషపడాలా? బాధపడాలా? తెలియని అయోమయంలో ఉన్న శోభ ఎప్పటిలాగే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు. చదవండి: తొమ్మిది వారాల్లో తేజ అంత సంపాదించాడా? ఎలిమినేషన్కు కారణమిదే! -
రాహుల్ సిప్లిగుంజ్ తో లవ్..రతిక పేరెంట్స్ ఎమోషనల్ కామెంట్స్
-
రాహుల్ సిప్లిగంజే ఆ పర్సనల్ ఫోటోలు లీక్ చేశాడు: రతిక సోదరి
బిగ్బాస్ 7లో బాగా ట్రోల్ అయిన కంటెస్టెంట్ రతికా రోజ్.. హౌస్లో పదేపదే తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావిస్తూ.. రైతుబిడ్డను చులకన చేసి మాట్లాడుతూ నెగెటివిటీ పోగొట్టుకుంది. దీంతో జనాలు వెంటనే ఆమె మాకొద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేశారు. కట్ చేస్తే బిగ్బాస్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే రతిక బిగ్బాస్ హౌస్లో ఉన్న సమయంలో ఆమె రాహుల్తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీనిపై అటు రాహుల్ సైతం గరమయ్యాడు. రాహులే ఫోటోలు లీక్ చేశాడు! రతిక పీఆర్ చీప్గా ప్రవర్తిస్తుందంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా రతిక సోదరి ఈ ఫోటోలు లీక్ అవడంపై స్పందించింది. రతికకు ఎవరి పేరూ వాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో మాకే అర్థం కావడం లేదు. రతిక షోలో ఉంది.. తన ఫోన్ కూడా ఆమె దగ్గర లేదు. రాహుల్ దగ్గరి నుంచే ఫోటోలు లీకయ్యాయి అనుకున్నాం. ఎందుకంటే వారి పర్సనల్ ఫోటోలు ఇంకెవరి దగ్గరుంటాయి? ఒక అమ్మాయి తన ఫోటోలు లీక్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? పెళ్లికి ముందే కండీషన్స్ నిజానికి రాహుల్-రతిక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. రతిక ఇంట్లో కూడా చెప్పేసింది. తను సంతోషంగా ఉంటే అంతే చాలని నాన్న కూడా వారి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంతలో రాహుల్ కొన్ని షరతులు పెట్టాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకూడదు, అక్కడ పని చేయకూడదు అని చెప్పాడు. ఆ కండీషన్స్ రతికకు నచ్చలేదు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చాకే బ్రేకప్ చెప్పుకున్నారు. ఎవరి జీవితంలో వారు సంతోషంగానే ఉన్నారు. కానీ ఆ రోజు ఫోటోలు లీక్ అవడం గురించి రాహుల్ ఎందుకలా సీరియస్ కామెంట్స్ చేశాడో నాకూ అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. చదవండి: ఓ పక్క ట్రోలింగ్.. మరోపక్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా -
రాహుల్ సిప్లిగంజ్తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?
రతికా రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే బిగ్ బాస్తో ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. ఆమె వ్యక్తిగత విషయాలతోనూ అంతేస్థాయిలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆమెది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం కాగా.. ప్రస్తుతం వీరు తాండూరులో నివాసముంటున్నారు. రతికా రోజ్.. రాములు, అనితలకు రెండో సంతానం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు) రతికా నాన్న రాములు మట్లాడుతూ.. 'మాది చాలా చిన్న ఊరు. కేవలం 2 వేల జనాభా ఉంది. మొదట మా అమ్మాయికి పటాస్ షో అవకాశం వచ్చింది. అందులో ఏదో నాలుగు ఉంటుందని అనుకున్నా. ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్లో విజయ నిర్మలమ్మ తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా కావాలని ఫోన్ వచ్చింది. కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు. మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది. మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. నేను పోతా పట్టు పట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రతిక రెండో అమ్మాయి. మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం. ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే.' అంటూ చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ విన్నర్కు బిగ్ షాక్!) రతికా నాన్న మాట్లాడుతూ..' రాహుల్ సిప్లిగంజ్ వాళ్ల ఇంటికి కూడా పోయినా. మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు. యూట్యూబ్లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం. మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు. మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే మా పాపకు పెళ్లి కావాలే.. మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్ను బెదిరించా. మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి.. వాడితోనే పోతుంది అనేవారు. మేం వాటిని పట్టించుకోలేదు. రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.. కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు. రతికా అందరినీ ఫ్రెండ్లాగే భావిస్తుంది. బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది. బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు.' అని అన్నారు. అనంతరం రతికా తల్లి అనితా మాట్లాడుతూ..' రతికా నాతో కలిసి ఇంట్లో వంటలు కూడా చేస్తుంది. మటన్, పాయసం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది. -
రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని
బిగ్బాస్ సీజన్-7లో సింగర్స్ వెళ్లడం సహజం అలాగే ఈసారి కూడా దామిని భట్ల వెళ్లారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయితే.. గీతా మాధురి టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్లో సింగర్ దామిని భట్ల కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్లో ఉన్నారు. ఉన్న కొద్దిరోజులే అయినా ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందరిలా కాకుండా తనదైన స్టైల్లో గేమ్ ప్లే చేసింది. ఓట్ల కోసం నటించకుండా తనకు ఏదైతే నచ్చిందో ఆ పని మాత్రమే హౌస్లో చేసేది.. బహుశా ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. ఆమెలోని నెగటివ్ను మాత్రమే ప్రేక్షకులకు చూపించిన బిగ్ బాస్.. దామినిలోని పాజిటివ్ను మాత్రం తెరపైకి చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యలో బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. హౌస్లో వారికి చాలామందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను కూడా పీఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకునే బిగ్ బాస్లోకి వెళ్లాను. కానీ... నేను హౌస్లోకి వెళ్లే ముందు వారికి ఒక సూచన ఇచ్చా... నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని గట్టిగా చెప్పాను. అందులో తేడా వస్తే సహించనని కూడా చెప్పాను. కానీ నా లక్ బాగాలేదు.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాను.' అని దామిని చెప్పింది. రాహుల్తో ప్రేమ గురించి రతికనే చెప్పింది: దామిని బిగ్ బాస్ నుంచి నేను బయటికి రాగానే రాహుల్ సిప్లిగంజ్- రతికా రోజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిని తెలిసింది. అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అదే సమయంలో నాకు రాహుల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని ప్రశ్నించాడు... ఇంటి వద్దనే ఉన్నానని చెప్పి లోకేషన్ షేర్ చేస్తే ఇంటికి వచ్చేశాడు. అప్పుడు ఇద్దరం రతిక టాపిక్ గురించి చర్చించాము. ఆమె గురించి వాడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఒకసైడ్ మాత్రమే విన్న నేను తప్పు ఎవరిదని జడ్జ్ చేయలేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన మొదటి మూడు రోజుల్లోనే నా వద్ద రాహుల్ టాపిక్ రతక తెచ్చింది. తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే అర్థం వచ్చేలా ఆ సమయంలో క్లియర్గా చెప్పింది. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా నిజమే ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా సాగతీయలేదు. అని దామిని తెలిపింది. బిగ్ బాస్ విన్నర్ అతనే రతికా రోజ్ను రీ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని బిగ్ బాస్ అనుకున్నాడు.. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని తెలిపింది. తనకు నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్, సందీప్ ఓట్లు వేశారని చెప్పుకొచ్చింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. శివాజీ వయసు రిత్యా చాలా అనుభం వుంది. ఆయన మైండ్తో ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. కానీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావడం గ్యారెంటీ అని ఆమె తెలిపింది. అతనొక కామన్ మ్యాన్గా గుర్తింపు ఉంది. అతను చాలా మంచి వ్యక్తి నామినేషన్లో మాత్రమే అలా రెచ్చిపోతాడు... ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ అంటే తనకు ఇష్టం లేదని దామిని చెప్పింది. ప్రశాంత్ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్ కావడానికి సమయం పట్టింది. వాడికి ఫస్ట్ వారంలో ఏసీ కూడా సెట్ కాలేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి కుటుంబ సభ్యల గురించి కొందరు పీఆర్ టీమ్ వారు బూతులతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ ఏ మాత్రం మంచిది కాదని దామిని తెలిపింది. -
బిగ్బాస్లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!
టాలీవుడ్ నటుడు బాలాదిత్య గురించి పరిచయం అక్కర్లేదు. చంటిగాడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతేడాది బిగ్బాస్ సీజన్లో పాల్గొన్న బాలా.. గతంలో మా ఊరి పొలిమేర చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఈ సినిమాకు మా ఊరి పొలిమేర -2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. బాలాదిత్యతో పాటు సత్యం రాజేష్, గెటప్ శ్రీను, కామాక్షి భాస్కర్ల, అక్షత ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 3న ప్రేక్షకులను అలరించనుంది. గతేడాది బిగ్బాస్ రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సీజన్లో బిగ్బాస్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాలాదిత్యా మాట్లాడుతూ.. 'బిగ్బాస్ హౌస్లో ఉన్నవారిలో అంబటి అర్జున్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను, అతను జిమ్ మేట్స్. అర్జున్ బాగా స్మార్ట్గా ఆడుతున్నాడు. బిగ్బాస్ నాకు చాలా నేర్పించింది. ఈ రియాలిటీ షో అనేది ఓ గేమ్. ఇందులో కొంతమంది ఫేక్లానే అనిపిస్తారు. కొందరు జెన్యూన్లా కనిపిస్తారు. హౌస్లో ఎంత తెలివిగా ఆడుతున్నామనేదే మనకు ముఖ్యం. పల్లవి ప్రశాంత్, రతిక గురించి తెలుసు. హౌస్లో మన ఫర్మామెన్స్ మాత్రమే ఆడియన్స్ చూస్తారు. నువ్వు ఎంత లాజిక్గా ఆడుతున్నావనేదే ఆడియన్స్ గుర్తిస్తారు. ఐదు వారాలా తర్వాత వచ్చినవారికి కాస్తా అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో డిస్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ను మీరు ఎంత బాగా ఆడుతున్నారనేదే ముఖ్యం ' అని చెప్పుకొచ్చారు. -
దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!
బిగ్బాస్ షోలో మిగతా రోజుల సంగతెలా ఉన్న నామినేషన్స్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. కంటెస్టెంట్స్ అందరూ పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. అవతలి వాళ్లని నామినేట్ చేసి, వాళ్ల వ్యతిరేకిస్తే గొడవ పెట్టుకోవడానికైనా అస్సలు వెనుకాడరు. ఇప్పటికే సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలినవి జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా.. అందులో అమరదీప్ హైలైట్ అయ్యాడు. అలానే రతిక ఓ పాయింట్లో దొరికిపోయింది. (ఇదీ చదవండి: లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!) యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. మరి రతిక నోరు మూసుకుంది. మరి ఆమె ఏ విషయంలో దొరికిపోయిందనేది మంగళవారం ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేస్తుంది. 'మీరు నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు, అందుకే బాధతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా' అని అమర్, భోలెని నామినేట్ చేశాడు. 'ఈ హౌసులో ఇంత మంచి పేరు తెచ్చుకున్న నన్ను..' అని భోలె అంటుండగానే.. 'అయ్యో సూపరన్నా మీరు నిజంగా దేవుడు మీరు' అంటూ వెటకారంగా అనేసరికి భోలె మెంటలెక్కిపోయాడు. 'ఈ బిగ్బాస్ హౌసులో ఏం సాధించావ్ నువ్వు? బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావ్' అని భోలె అన్నాడు. 'ఐ యామ్ హియర్ ఏజ్ ఏ బ్యాడ్ బాయ్, మీకు ఏమన్నా ప్రాబ్లమా?' అని కౌంటర్ ఇచ్చాడు. అలానే 'మారు.. మారు' అని ఒకరికొకరు చెప్పుకొన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ షో చరిత్రలో ఫస్ట్టైమ్ అలాంటి నిర్ణయం!) -
శోభాశెట్టి ట్రాపులో పడిన రతిక.. ఈమెది దెయ్యం తిండి అట!
బిగ్బాస్ 7 సీజన్ కొన్నాళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ మారింది. గొడవలు, తిట్టుకోవడాలు ఎక్కువయ్యాయి. అదే టైంలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కిందామీదా పడుతున్నారు. తాజాగా కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఫైనల్ టాస్క్ ఒకటి పెడ్డగా.. ఇందులో శోభాశెట్టి హైలైట్ అయ్యింది. అదే టైంలో ఈమె వల్ల రతిక బండారం బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 54 హైలైట్స్లో చూద్దాం. ప్రశాంత్ vs రతిక అక్క ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ నిలవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ప్రశాంత్-రతిక మధ్య 'అక్క' అనే పదం గురించి డిస్కషన్తో శుక్రవారం ఎపిసోడ్ షురూ అయింది. తనని అక్క అని పిలవొద్దని, బయట చాలా ప్రాబ్లమ్ అయిందని రతిక చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ అస్సలు వినలేదు. అక్క అనే పిలుస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. మధ్యలో కారణం లేకుండా ఓసారి ఏడ్చాడు కూడా. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దిన పెద్దమనిషి శివాజీ.. రతిక-ప్రశాంత్ మధ్య సంధి కుదిర్చాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) కొత్త కెప్టెన్ వచ్చాడ్రోయ్ ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసులో ఉన్న ఐదుగురిలో ఎవరికి కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఉందో, వాళ్ల మెడలో ఎండుమిర్చి దండ వేయాలని.. 'ఈ మిర్చి చాలా హాట్' అనే టాస్కుని బిగ్బాస్ పెట్టాడు. చివరగా ఎవరి మెడలో అయితే తక్కువ దండలు ఉంటాయో వాళ్లే కెప్టెన్ అవుతారని అన్నాడు. ఇందులో అస్సలు ఒక్క దండ కూడా పడని గౌతమ్.. బిగ్బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఎవరు ఎవరికి దండేశారు? అమరదీప్ - ప్రశాంత్ తేజ - ప్రశాంత్ యవర్ - శోభాశెట్టి భోలె - ప్రియాంక అశ్విని - ప్రియాంక రతిక - శోభాశెట్టి అర్జున్ - సందీప్ శివాజీ - సందీప్ (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) శోభా ట్రాప్లో ఇద్దరు అయితే ఈ టాస్కులో భాగంగా తనని అనర్హత పేరు చెప్పి మిర్చి దండ వేయడంపై శోభాశెట్టి తట్టుకోలేకపోయింది. తొలుత యవర్తో.. తొలి రెండు పోటీల్లో ఓడిపోయి, మూడే గేమ్లో గెలిచావ్ అందుకే ఈ దండ వేస్తున్నా అని కారణం చెప్పాడు. దీంతో శోభా పెద్ద గొడవ పెట్టుకుంది. ఏకంగా పిచ్చోడు అనేసింది. దీంతో అతడు నిజంగానే మెంటలెక్కినట్లు అరిచాడు. మిర్చి దండ విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ సాగింది. ఇది అయిన తర్వాత లివింగ్ రూంలో కూర్చుని శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గేమ్లో గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ అని ఏడ్చేసింది. రతిక మళ్లీ అదే తప్పు హౌసులో మాటలు మారుస్తూ అందరి ఆట చెడగొడుతుందనే కారణంతో రతిక ఇప్పటికే ఓసారి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తోంది. శోభాకి మిర్చి దండ వేసిన ఈమె.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ శోభా ఊరుకోలేదు. దీంతో చాలాసేపు గొడవ జరిగింది. 'నిన్న నువ్వే నాతో అన్నావ్.. లేడీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని, ఇప్పుడు నువ్వే దండం వేస్తున్నావ్' అని రతిక నిజస్వరూపాన్ని శోభా బయటపెట్టింది. అలా శోభా కావాలనే రెచ్చగొడితే.. యవర్, రతిక ఇద్దరూ ట్రాపులో పడ్డారు. ఇది జరిగిన తర్వాత రతిక గురించి శోభా-అశ్విని మాట్లాడుకున్నారు. రతిక ఏంటి? దెయ్యంలా అంత తింటుంది! అని అశ్విని బయటపెట్టింది. రతిక.. తినడం, తిరగడం, మాట్లాడటం తప్ప హౌసులోకి ఏం చేయట్లేదని శోభా అరుస్తూ చెప్పింది. అలా శుక్రవారం ఎపిసోడ్ కాస్త నీరసంగానే ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!
బిగ్బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజులో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకొచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 49 హైలైట్స్లో చూద్దాం. దసరా స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి కొనసాగుతోంది. బిగ్బాస్ హౌసులోనూ పండగ సరదాతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫుల్ కలర్ఫుల్గా రెడీ అయి వచ్చిన నాగార్జున.. హౌస్మేట్స్కి దసరా శుభాకాంక్షలు చెప్పాడు. దసరా(DASARA)లో ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆరు గేమ్స్ పెడతానని, వీటిలో గెలిచినవాళ్లకి సర్ప్రైజులు ఉంటాయని చెప్పాడు. ఈ పోటీల్లో ఇరుజట్లు చెరో మూడింట్లో గెలిచి సమంగా నిలిచాయి. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' గౌతమ్ హీరోగా కొత్త సినిమా.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ఫస్ట్ టైమ్ ఏడ్చిన శోభా, యవర్ బిగ్బాస్లోకి వచ్చిన తర్వాత శోభా, యవర్ పెద్దగా ఏడవడం ఎవరూ చూడలేదు. వీళ్లు అలా స్ట్రాంగ్గా ఉండి ఆడుతున్నారు. ఆదివారం పెట్టిన గేమ్స్లో గెలిచిన తర్వాత ఇంటి నుంచి వీళ్లకు లెటర్స్ వచ్చాయి. తమ ఇంటి సభ్యులు తమ గురించి రాయడం, వాటిని వీళ్లు చదువుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ చేసింది. నామినేషన్స్ నుంచి సేవ్ అయినప్పుడు తేజ కూడా నాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసే వీళ్లు ఎమోషనల్ కావడం డిఫరెంట్గా అనిపించింది. పూజా ఎలిమినేట్ దసరా ఎపిసోడ్లో హీరోయిన్లు రెబా మోనికా జాన్, పాయల్ రాజ్పుత్.. డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టారు. యంగ్ సింగర్స్ వాగ్దేవి, లాలస, శిరీష పాటలతో అలరించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అమరదీప్, అశ్విని, తేజ, గౌతమ్, ప్రశాంత్ వరసగా సేవ్ అయ్యారు. పండగ కాబట్టి ఆయా కంటెస్టెంట్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులే వచ్చి సేవ్ అయినట్లు చెప్పుకొచ్చారు. పూజా, భోలె మిగలగా.. పూజా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మరోవైపు ఈవారం ఓ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఉంటుందన్నారు. అలా రతిక.. బిగ్బాస్లోకి తిరిగి అడుగుపెట్టింది. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) ప్రేక్షకులు మోసపోయారా? బిగ్బాస్లో ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని హౌస్ట్ నాగార్జున పదే పదే చెబుతుంటాడు. అలాంటిది రతిక ఆట బాగోలేదనే కదా.. ఆమెని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. కానీ నిర్వహకులికి మాత్రం ఆమెని తిరిగి ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్. మరీ నేరుగా తీసుకొచ్చేస్తే షో క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి దామిని, శుభశ్రీ, రతికలో ఒకరిని ఛాన్స్ ఉంటుందని కలరింగ్ ఇచ్చారు. బిగ్బాస్ సభ్యుల ఓట్ల ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. తీరా చూస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకి కాకుండా తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు రీఎంట్రీ ఇస్తారని నాగార్జున అన్నాడు. దీంతో ప్రేక్షకులకు సీన్ అర్థమైపోయింది. రతికని తీసుకురావడానికే ఇదంతా చేస్తున్నారని తెలిసిపోయింది. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఆమె రీఎంట్రీ ఇవ్వడంతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తంగా చూస్తే రతిక రీఎంట్రీ కోసం బిగ్బాస్ ఆర్గనైజర్స్.. ఓట్లేసిన ప్రేక్షకుల్ని నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారనిపించింది. ఈ వారం పూజాని ఎలిమినేట్ చేసేశారు. బిగ్బాస్ ప్రస్తుతం సీజన్లో వరసగా వెళ్లిపోయిన ఏడో లేడీ కంటెస్టెంట్ ఈమె. అయితే ఏ సీజన్లోనూ జరగనంతా విచిత్రంగా ఈసారి ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. అసలు ఏం చేస్తున్నారో? ఏ లాజిక్ ప్రకారం వరసగా లేడీ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి వల్ల బిగ్బాస్ చూస్తున్న ఆ కొద్దిమంది కూడా ఓట్లేసినందుకు నవ్వుకుంటున్నారు! (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
Rathika Rose : భగవంత్ కేసరి సినిమాలో బిగ్బాస్ 7 బ్యూటీ (ఫోటోలు)
-
బిగ్బాస్ 7లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రతిక ఎంట్రీకి రంగం సిద్ధం!
బిగ్బాస్ షోలో ఎక్కువ పస ఉండేది నామినేషన్స్లోనే! కంటెస్టెంట్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇక్కడే! హౌస్లో గేమ్ ఒక్కటే కాదు, ఇక్కడ వారి ప్రవర్తనను బట్టి కూడా ప్రేక్షక జనాలు ఆయా కంటెస్టెంట్లకు ఓట్లేస్తుంటారు. తక్కువ ఓట్లు వచ్చినవారు షో నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఇప్పటివరకు వరుసగా ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతిక రోజ్, శుభశ్రీ రాయగురు, నయని పావని వరుసగా హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే మూడు, నాలుగు, ఐదు వారాల్లో ఎలిమినేట్ అయిన దామిని, రతిక, శుభశ్రీలలో ఒకర్ని హౌస్లోకి పంపించేందుకు ప్లాన్ చేశాడు బిగ్బాస్. ఈ మేరకు ఓటింగ్ కూడా పెట్టాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వారినే హౌస్లోకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు. మొదట శుభశ్రీ హౌస్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ చివరి క్షణంలో హౌస్లో అడుగుపెడుతోంది మాత్రం రతికాయే! వైల్డ్ కార్డ్ ద్వారా రతికా రోజ్ రీఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఆమె హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయం తెలిసి కొందరు సంతోషంగా ఫీలవుతుంటే మరికొందరు మాత్రం నిరాశ చెందుతున్నారు. ఏదేమైనా రతిక చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశంగా మారనుంది. మరి ఈ అవకాశాన్ని రతిక ఏమేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి! చదవండి: భోలె గలీజు పురాణం.. బొక్కబోర్లా పడ్డాడు! -
హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' రతిక
'బిగ్బాస్ 7' రతిక బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటివరకు గుర్తింపులేని చిన్నచిన్న పాత్రలు చేస్తి ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. బిగ్బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తెలుగు దర్శకుడి కొత్త సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏంటా సినిమా? ఇప్పటివరకు తెలుగులో బిగ్బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ షోలో పాల్గొన్న తర్వాత ఎవరైనా కెరీర్ పరంగా బాగుపడ్డారు అంటే అది సొహైల్ మాత్రమే. ఎందుకంటే ఆ సీజన్లో గెలిచిన అభిజిత్కి కూడా ఛాన్సులు రాలేదు గానీ మనోడు మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. (ఇదీ చదవండి: మెగాహీరో పుట్టినరోజు.. వాళ్లకోసం రూ.20 లక్షలు విరాళం!) ప్రస్తుత సీజన్లో కాంట్రవర్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రతిక.. గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ గేమ్ సరిగా ఆడక బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. గతంలో నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి దర్శకుడు కె.రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. స్వయంగా ఈ విషయాన్ని రతికనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు పని ఎప్పుడో అయిపోయింది. ఎందుకంటే 2017లో చివరగా సినిమా తీశారు. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ చేసేందుకు రెడీ అయ్యాడట. అందులోనే రతికకి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ప్రకటన వరకే పరిమితం అవుతుందా? లేదా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి. (ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) -
బిగ్బాస్ షాకింగ్ నిర్ణయం.. ఓట్లేసిన ప్రేక్షకులు మోసపోయినట్లే!?
బిగ్బాస్ కొత్త కెప్టెన్ యవర్ యాటిట్యూడ్ వల్ల మిగితా ఇంటి సభ్యులు ఇబ్బందిపడ్డారు. దీని గురించి నాగ్ అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. అలానే హౌసులో బ్రెయిన్లెస్, యూజ్లెస్ ఎవరో తెలిసిపోయింది. మరోవైపు గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చిన బిగ్బాస్ రీఎంట్రీ ప్లాన్ అని చెప్పాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 41 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. కొత్త కెప్టెన్ వల్ల గొడవ? ప్రిన్స్ యవర్ బిగ్బాస్ హౌసుకి రెండో కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శనివారం ఎపిసోడ్ మొదలైంది. వీఐపీ రూంలోకి వెళ్లి స్ప్రైట్ తీసుకునేందుకు అమర్ వెళ్లగా, కెప్టెన్ యవర్ ఇప్పుడు వద్దు తర్వాత ఇస్తానని అన్నాడు. మధ్యలో వచ్చిన సందీప్ బలైపోయాడు. యవర్ కోపానికి దొరికిపోయాడు. మధ్యలో వచ్చిన ప్రియాంకపై కూడా యవర్ సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కిస్ టఛాలెంజ్లో భాగంగా అమ్మాయిలు ముద్దు సింబల్ని కరెక్ట్గా గెస్ చేసిన తేజ.. శోభాతో డిన్నర్ డేట్ కి వెళ్లాడు. అక్కడ ఒకరికొకరు 'ఐ లవ్ యూ' చెప్పుకోవడం విశేషం. (ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే బిగ్బాస్ నుంచి ఆమె ఎలిమినేట్!) నాగ్ క్లాస్ పీకాడు కానీ? ప్రోమోలో యవర్కి హోస్ట్ నాగార్జున ఏదో క్లాస్ పీకినట్లు చూపించారు. కానీ ఎపిసోడ్లో మాత్రం అలాంటిదేం లేదు. కెప్టెన్ ఏం చెబితే హౌసులో అదే రూల్. వీఐపీ రూంలో ఏది ఉంటే అది కెప్టెన్ జోన్లో ఉన్నట్లే. అతడి పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్లడానికి లేదు. స్ప్రైట్ తాగడానికి కూడా లేదని నాగ్.. అందరూ క్లారిటీ ఇచ్చాడు. అలా యవర్ చెప్పిన దానితో అంగీకరించాడు. ఇకపోతే ఈ వారం అమరదీప్.. గేమ్ పరంగా ఇంప్రూవ్ అయ్యావ్ అని నాగ్ మెచ్చుకున్నాడు. రైతుబిడ్డు అర్థంపర్థం లేకుండా తన కెప్టెన్సీ నుంచి కిచెన్ సెక్షన్, గౌతమ్కి ఇవ్వడంపై రైతుబిడ్డ ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. పుడ్ వేస్ట్ చేస్తున్నారని నాగార్జున దగ్గర చాడీలు చెప్పాడు. కానీ అది వేస్ట్ చేయడం కాదు, అటు ఇటు కావడంతో ఫ్రిడ్జ్లో పెట్టాం అని గౌతమ్, సందీప్, ప్రియాంక క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ తన కెప్టెన్సీ పోయిందని అర్థంపర్థం లేకుండా మాట్లాడినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) రీఎంట్రీ లాజిక్ లేని ట్విస్ట్ గత సీజన్లలోలానే ఈసారి గౌతమ్ని సీక్రెట్ రూంలో ఉంచి, హౌసులోకి రీఎంట్రీ ఇప్పించారు. అక్కడితో అందరూ అయిపోయిందనుకున్నారు. కానీ గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన దామిని, రతిక, శుభశ్రీని తీసుకొచ్చి వీళ్లలో ఒకరు తిరిగి కంటెస్టెంట్ గా హౌసులోకి వచ్చే అవకాశముందని, అది హౌస్మేట్స్ చేతుల్లోనే ఉందని నాగార్జున షాకిచ్చాడు. దీంతో ఈ ముగ్గురు ఎవరికివారు.. తమని మళ్లీ ఎందుకు తీసుకోవాలో కంటెస్టెంట్స్ తో అప్పీలు చేసుకున్నారు. అయితే వీళ్లలో ఎవరు, ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారనేది ఆదివారం చెప్తానని నాగ్ క్లారిటీ ఇచ్చాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే బిగ్బాస్ ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు పడిన కారణంగానే రతిక, దామిని, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు కదా. అంటే ప్రేక్షకులకు వీళ్ల ఆట నచ్చకే బయటకు పంపేశారు. అలాంటిది మళ్లీ వీళ్లనే తిరిగి హౌసులోకి తీసుకొస్తానని అనడం ప్రేక్షకుల ఓటింగ్ వేస్ట్ అని బిగ్బాస్ ఒప్పుకొన్నట్లేగా. ఇదే ఇప్పుడు విడ్డూరంగా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈమె తెలుగు సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్.. గుర్తుపట్టారా?) -
'బిగ్బాస్ 7'లో పెద్ద ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన ముగ్గురు రీఎంట్రీ
గత సీజన్లలా కాదు ఈసారి ఉల్టా పుల్టా ఉంటది అనే ట్యాగ్ లైన్తో ఈసారి బిగ్బాస్ మొదలైంది. దీంతో ప్రేక్షకులు చాలా ఊహించుకున్నారు. కానీ రియాలిటీలో అంత సీన్ లేదు. ఎపిసోడ్స్ అన్నీ కూడా సో సోగా సాగుతున్నాయి. దాదాపు ఆరు సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా వరసగా ఐదు వారాల్లో అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్లలో ముగ్గురు హౌసులోకి రీఎంట్రీ ఇచ్చారు. (ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) క్లాస్ పీకిన నాగార్జున గతవారం హౌసుకి కెప్టెన్గా రైతుబిడ్డ ప్రశాంత్ ఉన్నాడు. ఆ బాధ్యతలు ఇచ్చారు గానీ మనోడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కెప్టెన్సీ సరిగా చేయలేకపోతున్నావ్ అని స్వయంగా బిగ్బాస్తోనే చివాట్లు తిన్నాడు. తాజాగా ప్రిన్స్ యవర్.. హౌసుకి రెండో కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ చేతికొచ్చేసరికి యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. అమరదీప్తో గొడవ పెట్టుకున్నాడు. దీనిపై నాగార్జున క్లాస్ పీకాడు. తాజా ప్రోమోలో అదే చూపించారు. ఆ ముగ్గురు రీఎంట్రీ ఇప్పటివరకు ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్లలో కొందరు ఎలిమినేట్ కావడం చాలామందికి షాక్కి గురి చేసింది. వీళ్లలో రతిక, దామిని, శుభశ్రీ మళ్లీ హౌసులోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలో వీళ్లు రావడం చూపించారు. అయితే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమని వీళ్లని తీసుకొచ్చారా? లేదా ఇంకేదైనా ప్లాన్ ఉందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్!) -
రతిక జ్ఞాపకాలతో రాత్రంతా నిద్రపోని ప్రశాంత్.. రైతుబిడ్డపై రతిక పోస్ట్
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అత్యంత దారుణమైన వ్యతిరేకతను మూటగట్టుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది రతికానే! మొదట్లో బాగానే క్లిక్ అయిన ఈ బ్యూటీ కంటెంట్ కోసం అతి చేస్తూ నెమ్మదిగా ట్రాక్ తప్పింది. రైతు బిడ్డగా జనాల్లో సింపథీ ఉన్న పల్లవి ప్రశాంత్తో లవ్ ట్రాక్ నడిపి.. ఇది వర్కవుట్ అయ్యేలా లేదని అర్థం అయిన మరుక్షణం ప్లేటు ఫిరాయించింది. అప్పటినుంచి హౌస్ లోపల, బయట రతిక పతనం మొదలైంది. డిప్రెషన్లో రతికరోజ్? ప్రశాంత్ను టార్గెట్ చేయడం, తప్పు రెండు వైపులా ఉన్నా అవతలివారిదే తప్పని వాదించడం, కావాలని గొడవలు సాగదీయడం.. ఇలా చాలానే చేసింది. దీంతో జనాలు మాకొద్దీ కంటెస్టెంట్.. అని ఆమెను బయటకు పంపించేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్.. తనపై వచ్చిన నెగెటివిటీ చూసి డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరినీ కలవడానికి, ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా సుముఖంగా లేదు. తను చేసిన తప్పొప్పులను ఇప్పుడిప్పుడే బేరీజు వేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ప్రశాంత్: అన్నా, నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చిందన్నా.. నిద్ర పట్టలేదు. శివాజీ: నాకు గుర్తుకు వచ్చింది. కానీ ఏం చేస్తాంరా.. చిన్నపిల్ల. ప్రశాంత్: అది చిన్న పిల్ల ఏందన్నా బర్రె పిల్ల.. మస్త్ కోపం వస్తుందన్నా.. శివాజీ: బయటకు వెళ్లాక కలుద్దాంలేరా, నువ్వు బాధపడకు, నాకు అర్థమైంది నీ బాధ. ప్రశాంత్: రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్న దాన్ని.. నా మీద ఎందుకన్నా అంత కోపం? నేనేం చేశా? నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడిన.. కానీ, తను నన్ను నమ్మలేదు. శివాజీ: చిన్న పిల్లరా ఒదిలేయ్.. ప్రశాంత్: బయటకు పోయాక నన్ను కలవదన్నా.. ఇలా ప్రశాంత్... రతికను తలుచుకుంటూ బాధపడ్డాడట! దీనిపై ఈ బ్యూటీ స్పందిస్తూ.. 'సో స్వీట్.. నేను కూడా వాళ్లను మిస్ అవుతున్నాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. హౌస్లో ప్రశాంత్ను ఫుట్బాల్ ఆడావు, ఇప్పుడు జనాల రియాక్షన్ చూశాక మిస్ అవుతున్నానని నాటకాలు ఆడుతున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష! -
బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?
బిగ్బాస్ సీజన్-7 టైటిల్ ఫేవరెట్గా రతిక రోజ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కేవలం నాలుగో వారంలో ఆమె ఇంటిబాట పట్టింది. మొదట వరుసగా మహిళా కంటెస్టెంట్లను బిగ్బాస్ తప్పించేశాడు. అదేనండి ప్రజల ఓటింగ్ మేరకే.. వారిలో వరుసగా షకీలా ఫస్ట్ ఔట్ ఆ తర్వాత కిరణ్ రాథోడ్, సింగర్ దామిని, రతిక రోజ్ ఇలా ఎలిమినేట్ అయ్యారు. హౌజ్లోకి 14 మంది ఎంట్రీ ఇస్తే అందులో ఏడుగురు మహిళలు,ఏడుగురు పురుషులు ఉన్నారు. (ఇదీ చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ప్రివ్యూ రివ్యూ) ప్రస్తుతం హౌజ్లో ముగ్గురు మాత్రమే మహిళా కంటెస్టెంట్లు ఉన్నారు. దాంతో బిగ్ బాస్ ఇంట్లో బ్యాలెన్స్ తప్పింది అని చెప్పవచ్చు. ఈ సీజన్ చాలా బిన్నంగా ఉంటుందని, ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు చెప్పారు బిగ్బాస్. కానీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పవచ్చు. గత సీజన్లాగే ఈ సీజన్ కూడా తేలిపోయిందని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో గేమ్ చప్పగా నడుస్తుంది. సభ్యులు నిండుగా ఉన్నప్పుడూ అంతే.. దీంతో వచ్చే వారంలో మరో ఏడుగురు కంటెస్టెంట్లుగా బిగ్బాస్లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వీరిలో రతిక కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి; సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే) రతికకు రీ ఎంట్రీ అవకాశం బిగ్ బాస్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్బాస్ సీజన్- 2 సమయంలో నూతన్ నాయుడుకు రీ ఎంట్రీ అవకాశం కల్పించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా రతికకు కూడా మరో అవకాశం ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.. రీ ఎంట్రీ అనేది బిగ్ బాస్ అనుకుంటే జరగడం ఖాయం.. ఎందుకంటే ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు కదా.. సో ఈ లెక్కన హౌజ్లో రోజ్ గ్లామర్ నింపేందుకు రతికను తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
రతికలాంటి భార్య రావాలి.. హీరోను ఆడేసుకున్నారుగా!
బిగ్బాస్ హౌస్.. ఒక పాఠశాల. ఇందులో వయసు, వృత్తితో సంబంధం లేకుండా ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కొందరు పాఠాలు నేర్చుకుంటారు, మరికొందరు గుణపాఠంగా మిగులుతుంటారు. ఈ సీజన్లోనూ అదే జరిగింది. మొదట్లో మెరుగ్గా రాణిస్తుందనుకున్న రతిక రోజ్.. ఊహించని ప్రవర్తనతో, కుటిల బుద్ధి చూపించడంతో సడన్గా ఎలిమినేట్ అయిపోయింది. అది ఆమెకు పాఠమైతే.. వెన్నుపోట్లు ఎంత ప్రమాదకరమో, ఎలా ప్రవర్తిస్తే జనాలు తీవ్రంగా ఖండిస్తారో, అసలు ఒక అమ్మాయి ఎలా ఉండకూడదో ఆమెను చూసి నేర్చుకోవచ్చని.. తన జర్నీ ఒక గుణపాఠమని నెటిజన్లు భావిస్తున్నారు. ఒక గంట ఎపిసోడ్ చూసి ఆమె తప్పు చేసిందని, ముమ్మాటికీ ఆమెది తప్పేనని ముద్ర వేస్తున్నారు. అక్కడివరకు ఆగిపోతే సరి, కానీ నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే హీరో కిరణ్ అబ్బవరం వరకు! కిరణ్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ మూవీ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎక్స్(ట్విటర్)లో అభిమానులతో ముచ్చటించాడు. కొందరు సరదా ప్రశ్నలు వేస్తే మరికొందరు దొరికిందే ఛాన్సని సెటైర్లు కూడా వేస్తున్నారు. అన్నింటికీ ఓపికగా సమాధానాలు, కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు. దీనికి కిరణ్ స్పందిస్తూ.. ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం.. కానీ, ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం.. అని రిప్లై ఇచ్చాడు. 'హీరోలా ఉన్నావ్ అన్నా' అన్న కామెంట్కు హీరోలా లేకపోయినా పర్లేదు, మీలో ఒకడిలా ఉంటే చాలు అని కౌంటర్ ఇచ్చాడు. #AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV — Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023 #Askkiranabbavaram #RulesRanjann https://t.co/JfFvmxmPrR pic.twitter.com/AOiaLfM8pJ — Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023 చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక.. -
Rathika Rose Photoshoot Pics: బిగ్బాస్ షోలో రచ్చ చేసిన రతిక అందాలు (ఫోటోలు)
-
'బిగ్బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్
'బిగ్బాస్ 7' తెలుగు నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్ అయిపోయింది. మొదటివారం నుంచి నామినేట్ అవుతూ వచ్చిన రతిక.. నాలుగో వారం హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే టైటిల్ ఫేవరెట్స్లో ఒకరైన ఇంత త్వరగా వచ్చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఎలిమినేషన్ తర్వాత రతిక నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది. ఎలిమినేషన్కి కారణాలు? రతిక.. బిగ్బాస్ హౌసులోకి మంచి కాన్ఫిడెన్స్తో అడుగు పెట్టింది. తొలివారం ఈమెని చూస్తే కచ్చితంగా టాప్-5లో ఉంటుందని అనిపించింది. కానీ ఆ తర్వాత ఈమె పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్, యవర్తో ఉంటూ వాళ్లకే వెన్నుపోటు పొడిచింది. వీళ్లిద్దరితో చనువుగా ఉంటూ గేమ్ పక్కనబెట్టేసింది. మాజీ బాయ్ఫ్రెండ్ పేరు చెప్పి సింపతీ కొట్టేద్దామనుకుంది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో రతిక రెమ్యునరేషన్ అన్ని లక్షలా?) షాకింగ్ పోస్ట్ అయితే బిగ్బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రతిక.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'థాంక్యూ ఎవ్రీవన్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్(దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ వూ సా)' అని చెప్పింది. అంటే.. 'షోలో నన్ను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. హౌసులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది' అని దీనికి అర్థం. ఈ పోస్ట్ బట్టి చూస్తుంటే తన విషయంలో బిగ్బాస్ అన్యాయం చేసినట్లు ఈమె ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా చెప్పలేకు.. ఇలా పరోక్షంగా పోస్ట్ పెట్టి మరీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కొన్నిరోజులు ఆగితే అసలు ఈ పోస్టుకు అర్థం ఏంటనేది క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) #Rathika's Elimination AV #RathikaRose #BiggBossTelugu7 pic.twitter.com/k2yi0gxgYb — BigBoss Telugu Views (@BBTeluguViews) October 1, 2023 -
వాడుకోవడం అలవాటేగా.. గీతూ ప్రశ్నలకు బిక్కముఖం వేసిన రతిక
రతిక రోజ్.. ఎలిమినేట్ అయినప్పుడు నాగ్ ఓ మాటన్నాడు. ఇదొక పాఠం. బయటకు వెళ్లిన తర్వాత అబ్జర్వ్ చేసుకో అని చెప్పాడు. అటు తన జర్నీలోనూ ప్రశాంత్, యావర్తో నడిపిన ప్రేమ విన్యాసాలను చూపించేసరికి రతిక ముఖంలో రక్తం చుక్కలేకుండా పోయింది. పైగా లవ్ ట్రాక్లు, వెన్నుపోట్లు తప్ప ఆట ఏమీ లేదు. తన ఎలిమినేషన్ ప్రాంక్ అంటారేమోనని ఆశగా ఎదురుచూసింది రతిక. అంత సీన్ లేదన్నట్లుగా నాగ్ తనను అక్కడి నుంచి బయటకు పంపించేశాడు. ఎవరిని వెన్నుపోటు పొడిచాను?: రతిక ఎలిమినేషన్తో షాక్లో ఉన్న రతిక తాజాగా బిగ్బాస్ బజ్లో అడుగుపెట్టింది. ఇక్కడ గలాటా గీతూ అడిగే ప్రశ్నలకు తనకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఈ రోజ్ హౌస్లో అందరినీ వాడుకుని ఆడుకోవాలనుకుంది. కానీ, చివరకు వాడిపోయింది అంటూ రతికా రోజ్తో ఇంటర్వ్యూ మొదలుపెట్టింది గీతూ రాయల్. బాహుబలిలో కట్టప్పనే మించిపోయావనడంతో.. బిక్కముఖం వేసిన రతిక.. ఎవరిని వెన్నుపోటు పొడిచానని అడిగింది. దీనికి గీతూ.. రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. ప్రశాంత్ విషయంలో చేయి అందించిందే మీరు.. అని చెప్పడంతో రతిక నేనా? అని అమాయకంగా ప్రశ్నించింది. మీరు హౌస్లోనే కాదు, ఇక్కడ కూడా మానిప్యులేట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కౌంటర్ ఇచ్చింది గీతూ. వాడుకోవడం బాగా అలవాటేగా.. గీతూ కౌంటర్ ఇక హౌస్లో తన మాజీ ప్రియుడు(రాహుల్ సిప్లిగంజ్) గురించి పదేపదే మాట్లాడిన సంగతిని సైతం ప్రస్తావించింది గీతూ. ఎక్స్(మాజీ ప్రియుడు) అనే ఎమోషన్ను బాగా వాడుకున్నట్లు అనిపించింది. అయినా మీకు వాడుకోవడం బాగా అలవాటేగా అని సెటైర్ వేసింది. తన మాటలకు బిత్తరపోయిన రతిక.. వాడుకునే అలవాటుంటే ఆ టైం వచ్చినప్పుడే వాడుకునేదాన్ని అని బదులిచ్చింది. ప్రశాంత్ క్రైయింగ్ స్టార్ అయితే రతిక కన్నింగ్ స్టార్, ఫ్లిప్పింగ్ స్టార్.. రతిక కన్నా పాము నయం అంటూ సోషల్ మీడియా వచ్చిన కామెంట్లు చూపించింది గీతూ. ఇది చూసిన రతికకు మైండ్ బ్లాక్ అయిపోయింది. జనాలకు అలా అర్థమైతే అది నా ఖర్మ, దానికేం చేయలేం అని ఆన్సరిచ్చింది. ప్రశాంత్ అపరిచితుడు అనంతరం పల్లవి ప్రశాంత్ ఫోటోకు నిప్పు పెడుతూ రోజుకో యాంగిల్ చూపిస్తున్నాడు. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రతిక ఇంకా షాక్ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదు. ఏదైతేనేం.. ఈ ఇంటర్వ్యూ ప్రోమో కింద జనాలు మాత్రం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఎలిమినేట్ అయితే బాధేసేది, కానీ రతిక వెళ్లిపోయినందుకు ఎంత సంతోషంగా ఉందో అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్బాస్ 6లో గీతూ, బిగ్బాస్ 7లో రతిక.. చాలా ఇరిటేట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం.. రతికను అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ముందు ముందు జనాలకు తెలిసొస్తుందని చెప్పుకొస్తున్నారు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ప్రియుడు ఎమోషనల్.. వీడియో వైరల్ -
బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు
బిగ్బాస్ సీజన్-7 టైటిల్ ఫేవరెట్గా రతిక రోజ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అమాయికత్వంతో పాటు కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్ ప్రొగ్రామ్లో ఎలా ముందుకు వెళ్లాలో పసిగట్టలేకపోయింది. కొన్నిసార్లు తిక్కల వాదనలున్నా సరే రతిక కాస్త నయం. షోలో ఆమె ఇండివిడ్యుయాలిటీని చూపించింది. ఆటలో ఆమెకు నచ్చింది చేసింది. మరోక కంటెస్టెంట్ ఇచ్చిన సలహాను ఎక్కడా పాటించకుండా తన ఆటను కొనసాగించింది. ఆమె మొదట చేసిన అతిపెద్ద తప్పు రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్తో జతకట్టడం.. ఆ తర్వాత అతనితో విబేదాలు రావడం ఆమెకు మైనస్ అయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ప్రశాంత్ ఎంట్రీ ఇవ్వడంతో అతనికి చాలామంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. తను కూడా శక్తికి మించి బిగ్బాస్లో పోరాడుతున్నాడు. రతిక ఊరు ఎక్కడ తాజాగా రతిక తల్లిదండ్రులు పలు ఆస్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. తమ గతాన్ని గుర్తుచేసుకుని బోరున ఏడ్చారు. ఆమె పక్కా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇప్పటికీ ఆమె తండ్రి రాములు వ్యవసాయం చేస్తున్నాడు. రతిక అసలు పేరు ప్రియ అని తాము తెలంగాణలోని తాండూర్కు చెందిన వారమని ఆయన తెలిపాడు. కానీ ప్రస్తుతం ఆమె కోరికమేరకు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పాడు. రతిక వల్ల ఈ రోజు తమ జీవితం ఆనందంగా కొనసాగుతుందని రాములు తెలిపాడు. ఒకప్పుడు కనీసం రతిక స్కూల్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉండగా తనకు నవోదయ పాఠశాల్లో సీటు రావడంతో ఆమెను చదివించగలిగాను అని చెబుతూ ఆమె తండ్రి రాములు కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రామ సర్పంచ్గా నిజాయితీగా పనిచేశా గ్రామ సర్పంచిగా పనిచేసినప్పటికీ నిజాయితీగానే ఉన్నానని, బిడ్డల కోసం సంపాదించింది ఏమీలేదని ఆయన చెప్పాడు. ఆమె చదవులో మెరిట్ ఉండటంతో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఉచితంగా ఆయన కాలేజీలో ఇంజనీరింగ్ చదివించాడని ఆయన పేర్కొన్నాడు. ఆమెది చిన్నపిల్ల మనస్థత్వం అని, అంతే తప్ప కావాలని ఎవరినీ ఇబ్బంది పెట్టదని తెలిపాడు. తమ ఇంట్లో ఎలా ఉంటుందో బిగ్బాస్లో కూడా అలాగే ఉందని ఇలా రాములు తెలిపాడు. రతిక ప్రేమ,పెళ్లిపై వ్యాఖ్యలు 'నాకు మగపిల్లలు లేరు.. ఇద్దరూ ఆడపిల్లలే.. రతిక రెండో పాప, మొదటి అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. రతికనే కష్టపడి ఒక మగపిల్లాడిలా మమ్మల్ని పోషిస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు పడ్డాము.. రతిక మా కుటుంబానికి కొడుకులా నిలబడింది. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొదట మా పాపకు 'తుపాకి రాముడు' సినిమాతో జీవితం ఇచ్చారు. తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. ఆమెపై కావాలనే కొందరు ప్రేమ పేరుతో పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. ఆమె ఎవరినీ ప్రేమించలేదు. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు ఒక తండ్రిగా నేను చేస్తా.. ఏదున్నా ఓపెన్గా ఇంట్లో చెప్తుంది. ఆమెకు నచ్చినట్లు పెళ్లి చేయడం నా భాద్యత' అని రాములు తెలిపాడు రతిక గురించి ఆమె తల్లి మాటల్లో.. తన కూతురు రతిక ఒక తల్లిగా తమ కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆమె వల్లే తాము హైదరాబాద్కు వచ్చామని రతిక తల్లి అనిత ఇలా చెప్పింది. 'కుటుంబం కోసం మొదట్లో నేను ప్రైవేట్ హస్పిటల్లో పనిచేశాను.. తక్కువ జీతానికి అంతదూరం వెళ్లి కష్టపడటం ఎందుకు అని రతిక వారించడంతో ఉద్యోగం మానేశాను. మిమ్మల్ని పోషించడం కూతురిగా నా బాధ్యత అని హైదరాబాద్లో ఒక ఇల్లు రతికనే కొన్నది. ప్రస్తుతం ఆమె సంపాదనతోనే తాము ఉంటున్నట్లు రతిక తల్లిదండ్రులు తెలిపారు. కానీ తనకు పొలంలో పనిచేయడం ఇష్టం కాబట్టి వారంలో మూడు రోజులు తమ గ్రామం అయిన తాండూర్కు వెళ్తానని రాములు చెప్పాడు. తమకు ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు. శివాజీ,తేజ,యావర్ కంటే తక్కువా.. హౌస్ నుంచి ముందుగా శివాజీని పంపించేయాలని ఇప్పటికే కొందరు భారీగా కామెంట్లు చేస్తున్నారు. ఆయన నుంచి కనీసం వీసమెత్తు ఎంటర్టెయిన్మెంట్ కూడా చేయడం చేతకావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆయన నుంచి పెత్తందారీ పోకడ భరించలేక కంటెస్టర్లు కూడా శివాజీ బయాస్డ్గా ఉన్నారని ముద్రవేశారు . ఇది గ్రహించే తన అస్త్రను పగులగొట్టి, డిమోషన్ ఇచ్చేశాడు బిగ్బాస్. మరోవైపు యాంగర్ యావర్, తేజలు సరేసరి.. ఏ మాత్రం ఎంటర్టైన్ చేయడంలేదని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే మహిళా కంటెస్టెంట్లను అందరినీ బిగ్బాస్ నుంచి వరుసగా బయటికి వచ్చేశారు. షకీలాతో మొదలుపెడితే.. కిరణ్ రాథోడ్, సింగర్ దామినిని పంపించేశాడు బిగ్బాస్. రతిక రోజ్ను మాత్రం పనికట్టుకుని ఒక వర్గం ఆడియన్సే పంపించారని టాక్ నడుస్తుంది. ఇలా మహిళలను అందరినీ హౌస్ నుంచి బిగ్బాస్ పంపించిడంతో వైల్డ్ కార్డు ఎంట్రీకి సమయం ఆసన్నమైందని ప్రచారం జరుగుతుంది. -
రతిక ఎలిమినేట్.. 'బిగ్బాస్'లో రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!
బిగ్బాస్ 7 సీజన్ చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా షాక్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే వస్తున్న క్రమంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. దీన్నిబట్టి హౌస్లో ఉండాలని ఆమె ఎంతగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయటకు రాక తప్పలేదు. ఊహించని ట్విస్ట్ అయితే తొలి వారం నుంచి కెమెరాలు అన్నీ తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్న రతిక.. ఈ విషయంలో సక్సెస్ అయింది. కానీ గేమ్స్, టాస్కుల విషయానికి వచ్చేసరికి తేలిపోయింది. ఎందులోనూ విజయం సాధించలేకపోయింది. ఇక రెండో వారం రతిక.. సొంత టీమ్ సభ్యులనే బఫూన్స్ అనడం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?) లవ్ ట్రాక్స్ నో వర్కౌట్ ఇక బిగ్బాస్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్తో క్లోజ్ అయింది. వీళ్లిద్దరూ ప్రేమ పక్షులు అనే రేంజులో రెచ్చిపోయారు. తీరా రెండో వారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. యవర్తో ప్రేమ లాంటి వ్యవహారం కూడా బెడిసికొట్టింది. ప్రశాంత్, యవర్తో క్లోజ్గా ఉంటూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. ఇది ఆమెకు గేమ్ ప్లాన్లా అనిపించొచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆమెని ఎలిమినేట్ చేసేశారు. రెమ్యునరేషన్ గట్టిగానే నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక.. ప్రతివారం రూ.2 లక్షలు చొప్పున అంటే నాలుగు వారాలకు కలిపి రూ.8 లక్షలు సొంతం చేసుకుందని సమాచారం. దీన్నిబట్టి చూసుకుంటే నెల రోజులు హౌసులో ఉండి, ఇంత మొత్తం కూడబెట్టుకుంది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఇంత త్వరగా ఎలిమినేట్ అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే అందుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
'బిగ్బాస్' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?
'బిగ్బాస్'లో వీకెండ్ ఎపిసోడ్ అంటే చాలు ఎవరో ఒకరు బలవ్వాల్సిందే. హా అదేనండి ఎలిమినేట్ అవ్వాల్సిందే అని చెబుతున్నాం. ఈ వారం కూడా అలానే ఊహించని ఓ కంటెస్టెంట్ బయటకెళ్లిపోయింది. అమెనే రతిక. టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఎలిమినేట్ అయ్యేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా ఆదివారం ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది Day-28 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బిగ్బాస్ హౌస్లోకి అబ్బాస్, పృథ్వీరాజ్..!) శివాజీ క్వశ్చన్- నాగ్ ఆన్సర్ శనివారం ఎపిసోడ్లో భాగంగా శివాజీని.. హౌస్మేట్గా అనర్హుడు అని అందరూ తీర్మానించారు. దీంతో అతడి పవరస్త్రని బిగ్బాస్ తీసేసుకున్నారు. అలా ఆ ఎపిసోడ్ ముగిసింది. తనని అనర్హుడని ఎందుకు చేశారో కారణాలు చెప్పాలని శివాజీ.. హోస్ట్ నాగార్జునని అడగడంతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. దీంతో నాగ్.. శివాజీని నామినేట్ చేసిన వాళ్లని కారణాలు అడిగారు. శోభాశెట్టి, గౌతమ్, ప్రియాంక.. ఇలా అందరూ తమ తమ కారణాలు చెప్పారు. ఈ క్రమంలోనే శివాజీ మంచోడని బిగ్బాస్ ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున హౌస్మేట్స్ గట్టిగానే కౌంటర్స్ వేశాడు. సండే ఫండే ఆదివారం ఎపిసోడ్ అంటేనే గేమ్ కంపల్సరీ. ఈసారి 'బొమ్మ గీయ్ గెస్ చేయ్' అని ఆట పెట్టారు. ఇందులో భాగంగా అందరినీ రెండు టీమ్స్గా విభజించారు. ఒక జట్టులోని ఒకరు వచ్చి బౌల్లోని చీటీ తీస్తారు. అందులోని పేరు ఆధారంగా బోర్డుపై బొమ్మ గీయాలి. ఆయా వ్యక్తికి సంబంధించిన టీమ్ మెంబర్స్.. బొమ్మ ఆధారంగా ఆ పేరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆటలో టీమ్-B(ప్రియాంక, అమరదీప్, యవర్, శోభాశెట్టి, ప్రశాంత్) విజయం సాధించింది. (ఇదీ చదవండి: రతిక ఎలిమినేట్.. 'బిగ్బాస్'లో అలా జరగడం మొదటిసారి!) రతిక ఎలిమినేట్ ఇక ఓవైపు గేమ్స్ ఆడుతూనే మధ్యమధ్యలో నాగ్ సేవ్ టాస్కు పెడుతూ వచ్చారు. అలా ప్రియాంక, యవర్, గౌతమ్, శుభశ్రీ వరసగా సేవ్ అయ్యారు. చివరగా తేజ, రతిక ఉండగా, వాళ్లని యాక్టివిటీ రూంకి పిలిచారు. ఆ తర్వాత రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చిన ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది. ఆమెకి హౌస్ నుంచి వీడ్కోలు పలికేటప్పుడు అందరూ ధైర్యం చెప్పారు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం చాలా సైలెంట్గా రతికని అలా చూస్తూ ఉండిపోయాడు. చివరగా యవర్, శివాజీ, సందీప్, శోభాశెట్టి, తేజ, శుభశ్రీలో నచ్చని లక్షణాలు చెప్పి వెళ్లిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అదే కారణమా? అయితే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక.. నాలుగో వారమే ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. గ్లామర్ పరంగా బాగానే కంటెంట్ ఇచ్చినప్పటికీ ప్రశాంత్, యవర్తో ప్రేమగా నటిస్తూ, వాళ్లకే వెన్నుపోటు పొడవడం జనాలకు నచ్చలేదు. అలానే కొన్నికొన్ని విషయాలు ఈమె గొడవ పెద్దది చేస్తూ, దాన్నే సాగదీయడం లాంటి పాయింట్స్ కూడా రతికకు మైనస్ అయ్యాయి. అదే టైంలో పవరస్త్ర కోసం పెట్టిన గేమ్స్ లోనూ గెలవకపోవడం ఈమెకి మైనస్ అయిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!) -
రతిక ఎలిమినేట్.. 'బిగ్బాస్'లో అలా జరగడం మొదటిసారి!
బిగ్ బాస్ నుంచి రతిక ఎలిమినేట్ అయిపోయింది! ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకెళ్లిపోవడం గురించి ఈ రేంజులో డిస్కస్ చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా? కారణం ఏంటో తెలీదు గానీ శనివారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో చర్చంతా రతిక గురించే. అయితే ఈమె ఎలిమినేట్ కావడం ఏమో గానీ షో చరిత్రలోనే ఓ విచిత్రమైన రికార్డ్ నమోదైంది. రతిక ఎలిమినేషన్ బిగ్బాస్ ఏడో సీజన్లో టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగిన రతిక.. తొలివారం అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. కానీ ఆ తర్వాత తర్వాతే ప్రతి విషయంలో లేనిపోని నెగిటివిటీ సంపాదించింది. ప్రశాంత్, యవర్తో ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈమెపై ఉన్న పాజిటివిటీ కాస్త నెగిటివ్ అయిపోయింది. ఫలితంగా ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!) ఏంటా రికార్డ్? అయితే బిగ్బాస్ షో అబ్బాయిలు, అమ్మాయిలు సమంగా ఉండేలా చూస్తుంటారు. ఎలిమినేషన్ కూడా అందుకు తగ్గట్లే చేస్తుంటారు. ఈసారి మాత్రం వరసగా నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లలో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని తొలి మూడు వారాల్లో ఎలిమినేట్ కాగా ఇప్పుడు రతిక హౌస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా తొలి నాలుగు వారాల్లో వరసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోవడం షో చరిత్రలో ఇదే మొదటిసారి. కొత్తవాళ్ల రాక ఇప్పటికే దామిని వెళ్లిపోయింది. రతిక కూడా వెళ్లిపోయింది. దీంతో బిగ్బాస్లో గ్లామర్ విషయంలో కాస్త కలరింగ్ తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే శోభా, శుభశ్రీ అందంతో మేనేజ్ చేస్తున్నారు. వచ్చేవారం కొత్తగా హౌసులోకి నయని పావని, అంజలి పవన్ లాంటి బ్యూటీస్ రాబోతున్నారట. ఇదే నిజమైతే మాత్రం కలరింగ్ పెరుగుతుంది! లేదంటే మాత్రం గ్లామర్ లేక బోసిపోతుంది. (ఇదీ చదవండి: నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక) -
రతిక మంచి అమ్మాయి, తనను వాడుకున్నారు.. స్క్రీన్షాట్ వైరల్
కొన్ని ఎలిమినేషన్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొందరు ఎలిమినేట్ అయితే ప్రేక్షకులే తెగ ఫీలైపోతారు. కానీ మరికొందరు ఎలిమినేట్ అయితే బిగ్బాస్ హౌస్కు పట్టిన శని పోయిందని పండగ చేసుకుంటారు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఎప్పటిలాగే ఒక రోజు ముందే లీకైంది. బిగ్బాస్ బేబీ రతిక రోస్ హౌస్ నుంచి వచ్చేయనుందట! ఈ మేరకు ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రతిక రోస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్గా మారింది. రతికను సీక్రెట్ రూమ్లోకి పంపండి.. 'రతిక ఎలిమినేట్ కానుందంటూ ఒక అప్డేట్ వచ్చింది. కానీ తను హౌస్లో ఉండాల్సిన కంటెస్టెంట్. టాప్ 3లో ఉండేందుకు అర్హత ఉన్న కంటెస్టెంట్. అమర్దీప్ లాంటి కొందరు నెగెటివ్ వ్యక్తుల వల్ల తను తప్పుడుదారిలో నడిచింది. ప్లీజ్.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆమెను సీక్రెట్ రూమ్లోకి పంపించండి. తన వెనకాల ఏం జరుగుతుందో ఈ గేమర్కు తెలియనివ్వండి. ఎవరు తన మంచి కోరుతున్నారు? ఎవరు వాడుకుంటున్నారో? తనకు తెలియజేయండి. రతిక చాలా మంచి అమ్మాయి. అమర్దీప్ లాంటి వాళ్లు నిన్ను వాడుకున్నారు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇది చూసిన జనాలు మధ్యలో అమర్దీప్ ఎందుకు వచ్చాడు? అంటూ సెటైర్లు వేస్తున్నారు. రూల్స్కు విరుద్ధం కదా.. ఎలిమినేషన్కు ఇంకా ఒక రోజుంది.. అప్పుడే తను ఎలిమినేట్ అయిన విషయాన్ని కన్ఫామ్ చేసేశారేంటి? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రతిక ఇన్స్టాగ్రామ్ను హ్యాండిల్ చేస్తున్న వారికి.. ఇది బిగ్బాస్ రూల్స్కు విరుద్ధం అని కూడా తెలియదా అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతలోనే సదరు పోస్ట్ను రతికా రోజ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించారు. అయినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్షాట్ మాత్రం వైరల్గా మారింది. చదవండి: 'స్కంద'లో రామ్ చెల్లెలిగా నటించిందెవరో తెలుసా? ఫుల్ ఫాలోయింగ్.. -
'బిగ్బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!
బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో అనుకోనిది జరిగింది. ప్రతివారంలానే ఈసారి కూడా ఎలిమినేషన్ చేశారు. అయితే ఈసారి హాట్ బ్యూటీని హౌస్ నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. అదే టైంలో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి? బిగ్బాస్లో ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్) గత సీజన్ల సంగతేమో గానీ ఈసారి బిగ్బాస్.. అనుకున్న దానికంటే కాస్త డల్గా నడుస్తోంది. సోమవారం, వీకెండ్ ఎపిసోడ్స్లో తప్పితే మిగతా రోజుల్లో ఎంటర్టైన్ చేసే విషయంలో ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు అమ్మాయిలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. గ్లామర్ చూపించడంలో శోభాశెట్టి, రతిక వావ్ అనిపిస్తున్నారు. కొందరు వీళ్లకోసమే చూస్తున్నారు కూడా! సరే ఇదంతా పక్కనబెడితే ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్లో ఉన్నారు. వీళ్లలో ప్రియాంక, రతిక, శుభశ్రీ, గౌతమ్, తేజ, యవర్ అన్నారు. అయితే ప్రియాంక, గౌతమ్, యవర్, శుభశ్రీ సేవ్ అయినట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్లో ఉన్న వాళ్లలో రతిక ఎలిమినేట్ అయిపోయిందనే సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం హౌసులో గ్లామర్ తగ్గినట్లే. ఇలా జరిగితే మాత్రం షో చూసే కుర్రాళ్లు డిసప్పాయింట్ కావడం గ్యారంటీ! (ఇదీ చదవండి: ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే) -
హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!
'బిగ్బాస్'లో అందరూ ఆడటానికే వచ్చారు. శివాజీ మాత్రం అదే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నారు. వద్దని చెప్పినా సరే తీరు మార్చుకోవట్లేదు. అలానే ఆట తక్కువ సోది ఎక్కువ అనేలా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా పక్కనబెడితే 'బిగ్బాస్' నాలుగో పవరస్త్ర కోసం పోటీదారులు రెడీ అయిపోయారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగింది? ఏంటనేది ఇప్పుడు Day-25 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. తిండి కోసం గొడవ గురువారం జరిగిన బజర్ గేమ్లో అమరదీప్-గౌతమ్ జట్టుగా వెళ్లి విజయం సాధించారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. తర్వాతి రోజు తెల్లారడంతో గురువారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే అందరూ కిచెన్లో భోజనం చేస్తుంటే.. యవర్, ప్రశాంత్ మాత్రం బజర్ ప్రెస్ చేయాలనే తాపత్రయంతో దాని దగ్గరే కూర్చుని తిన్నారు. ఈ క్రమంలోనే యవర్.. శివాజీని చపాతీలు తీసుకుని రమ్మని అన్నాడు. అక్కడ గొడవ షురూ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?) సందీప్ vs యవర్ అయితే బజర్ దగ్గర కూర్చుని తినడం ఎందుకు? అది స్వార్థం అవుతుంది కదా? అంత ఉంటే మంచిది కాదని సందీప్ మాస్టర్ యవర్తో అన్నాడు. దీంతో వీళ్లిద్దరూ మాటలతో కొట్టుకున్నంత పనిచేశారు. ఈ క్రమంలోనే తన ప్లేటుని కిచెన్లో వెళ్లిపోయాడు. దీంతో ప్రియాంక, యవర్తో వాదించింది. అలా యవర్ గొడవ కాస్త శివాజీ, శోభాశెట్టి గొడవగా మారింది. 'ఈ ఇంట్లో ఎవరికీ లేదు, మీకు మాత్రమే ప్రతిదాన్ని గొడవ చేయాలని మీకే ఉంది' అని శివాజీపై శోభా రెచ్చిపోయింది. యవర్ సక్సెస్ గురవారం బజర్ ప్రెస్ చేసిన యవర్.. ప్రశాంత్ని తన పార్టనర్గా ఎంచుకున్నాడు. అమరదీప్-గౌతమ్ని ప్రత్యర్థి జట్టుగా సెలెక్ట్ చేశాడు. వీళ్లకు కన్నీళ్లతో గ్లాస్ నింపాలనే పిచ్చి గేమ్ని బిగ్బాస్ పెట్టాడు. ఎలాగైతేనేం ప్రశాంత్-యవర్ ఇందులో విజయం సాధించారు. ఆ తర్వాత మరోసారి బజర్ గేమ్ ఉందనుకున్నారు కానీ టాస్క్ పూర్తయిందని చెప్పిన బిగ్బాస్ అందరికీ షాకిచ్చాడు. దీంతో 118, 110 కాయిన్స్తో టాప్ లో నిలిచన యవర్, ప్రశాంత్ నాలుగో పవరస్త్ర కోసం అర్హత సాధించారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో సిద్ధార్థ్కి నిరసన సెగ.. ఆ గొడవ వల్లే!) శివాజీ మళ్లీ అదేగోల హౌసులో ఫస్ట్ వారం బాగానే ఉన్న శివాజీ.. రెండోవారం వచ్చేసరికి బయటకెళ్లిపోతా, బయటకెళ్లిపోతా అని పలుమార్లు అన్నాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్లో చిన్న వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇక అలా అననని చెప్పుకొచ్చాడు. తాజాగా గురువారం ఎపిసోడ్లో రతిక మాట్లాడుతూ.. 'ఉండబుద్ది అయితేలే బిడ్డా, కావట్లే..!' అని మరోసారి శివాజీ అన్నాడు. రతిక మరీ మరీ అడిగినా 'ఒట్టమ్మా, ఇన్నిరోజులు దాసుకుని ఉండటం నా వల్ల కావట్లేదు' అని అన్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాగ్ ఇప్పటికే చెప్పినా శివాజీ ఇలా అనడం బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్లే. బిగ్బాస్ దీనిపై సీరియస్ అయితే మాత్రం శివాజీని ఇంటికి పంపేచేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టాస్క్ అయిపోవడంతో బీబీ గాలా నైట్ అని స్పెషల్ ఈవెంట్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంట్లోని దొరికిన వస్తువులతో కంటెస్టెంట్స్ అందరూ ఎలా పడితే అలా రెడీ అయ్యారు. వాళ్లలో ఎవరు బిగ్బాస్ని మెప్పిస్తే వాళ్లో.. నాలుగో పవరస్త్ర కోసం మూడో కంటెండర్గా నిలుస్తారని చెప్పాడు. వాళ్లలో ప్రశాంత్, తేజ, ప్రియాంక, యవర్ ర్యాంప్ వాక్ చేశారు. అలా గురువారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ) -
వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అక్క అనేశాడు!
బిగ్బాస్ నాలుగోవారం నామినేషన్స్ ముగిశాయి. ఫైనల్ ఆరుగురి లిస్టులోకి వచ్చారు. అయితే ఈ నామినేషన్స్ వ్యవహారం కంటే బయట జరిగిన గొడవలే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అయితే ఈసారి మాత్రం అవాక్కయ్యే గొడవలు జరిగాయి. మిగతా వాటి సంగతేమో గానీ రతికని ప్రశాంత్ అక్క అని పిలవడం ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకీ మంగళవారం ఎపోసిడ్లో ఏం జరిగిందనేది Day-23 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ పిచ్చిలేసింది సోమవారం ఎపిసోడ్లో ప్రియాంక, రతిక నామినేట్ అయ్యారు. దీంతో వీళ్ల ఫొటోల్ని జ్యూరీ సభ్యులు గిల్టీ వాల్పై అతికించారు. గౌతమ్ తన నామినేషన్స్ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. యవర్ని బోనులో నిలబెట్టిన గౌతమ్.. అతడికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ నామినేట్ జరుగుతున్న సమయంలో శివాజీ తీరుతో విసిగిపోయిన గౌతమ్.. లాయర్లా ఒకవైపే సపోర్ట్ చేస్తున్నారని కుండ బద్ధలు కొట్టేశాడు. దీంతో మొత్తానికి జ్యూరీ సభ్యులు.. ప్రిన్స్ని నామినేట్ చేశారు. అయితే వాదనతో విసిగిపోయిన గౌతమ్.. ఈసారి తనని డైరెక్ట్గా నామినేట్ చేస్తే, ఇంటినుంచి బయటకెళ్లిపోతానని సందీప్ తో అని అసహనం వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!) అమరదీప్ vs ప్రశాంత్ తర్వాత వచ్చిన అమరదీప్.. శుభశ్రీ, ప్రశాంత్ని బోనులో నిలబెట్టాడు. గత వారం తన ఆడలేక సైడ్ అయిపోయానని, మళ్లీ అదే విషయాన్ని ఎత్తిచూపినందుకు శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. అతడు నటిస్తున్నాడని, దాగుడుమూతల దండాకోర్ టైపు గేమ్ ఆడుతున్నాడని అమరదీప్ అన్నాడు. అయితే అమర్ మాట్లాడుతుంటే.. ప్రశాంత్ రెచ్చగొట్టేలా నవ్వుతూ ఉండేసరికి.. సెగలుగా నవ్వకు అని అమరదీప్ సీరియస్ అయ్యాడు. ప్రశాంతంగా ఉండాల్సిన వాదన.. వీళ్లిద్దరి మధ్య సీరియస్ అయింది. ఫైనల్ శుభశ్రీ, ప్రశాంత్ ఇద్దరిలో ఒకరినే సెలెక్ట్ చేయాలి కాబట్టి జ్యూరీ సభ్యులు శుభశ్రీని నామినేట్ చేశారు. శుభశ్రీ ఏడుపు తప్పు కారణానికి తనని నామినేట్ చేశారని.. అదొక కారణమా.. సిల్లీయెస్ట్ రీజన్.. ఛీ అని అమరదీప్తోనే సీరియస్గా అంది. దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో, మనోభావాలు దెబ్బతిన్నాయ్ అట అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ప్రశాంత్.. గౌతమ్, అమరదీప్ని బోనులో నిలబెట్టాడు. అమర్ గతవారం గేమ్ లో ముందుకెళ్లకపోవడం తనకు బాగా అనిపించలేదని కారణం చెప్పిన ప్రశాంత్.. అమ్మాయి(శోభాశెట్టి) ముందు షర్ట్ తీసి గౌతమ్ షో హాఫ్ చేయడం తనకు నచ్చలేదని నామినేషన్స్కి కారణం చెప్పాడు. ఫైనల్గా జ్యూరీ సభ్యులు గౌతమ్ని నామినేట్ చేశారు. (ఇదీ చదవండి: నిత్యామేనన్ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ) రతిక అక్క అయిపోయింది ఇక ప్రశాంత్ తన నామినేషన్స్ చెబుతున్న సమయంలో రతికతో ప్రశాంత్ కొన్నిరోజుల ముందు బిహేవ్ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. ఆమె సింగిల్ పీస్ డ్రస్ వేసుకుంటే ఏమన్నాడో చెప్పుకొచ్చాడు. దీంతో గొడవ సైడ్ అయిపోయింది. దీంతో రతిక, ప్రశాంత్ వాదన పెట్టుకున్నారు. తను చాలా నార్మల్ గా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. ఎలా పడితే అలా అంటే ఒప్పుకొనేది లేదని రతిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలా కాసేపు వాదించిన తర్వాత.. ఇక నిన్ను రతిక కాదు ఏమని పిలవను కేవలం అక్క అని మాత్రమే పిలుస్తానని రైతుబిడ్డ వరస మార్చేశాడు. దీంతో చూస్తున్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఎందుకంటే తొలివారం వెంటబడ్డాడు, రెండో వారం గొడవపెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా అక్క అని పిలిచి అపరిచితుడిలా బిహేవ్ చేయడం వింతగా అనిపించింది. ఆరుగురు నామినేట్ తొలుత జ్యూరీ సభ్యులు ఐదుగురిని నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్బాస్ కల్పించుకుని.. తేజ, ప్రశాంత్, అమరదీప్లలో ఒకరిని నేరుగా సెలెక్ట్ చేయాలని చెప్పాడు. దీంతో జ్యూరీ(శోభాశెట్టి, శివాజీ, సందీప్).. తేజని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేట్ చేశారు. తనని నామినేట్ చేయడంపై తేజ.. కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. మరోవైపు రాత్రి కిచెన్లో శుభశ్రీ, అమరదీప్ గొడవపడ్డారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: స్టార్ డైరెక్టర్) -
లాయర్లా మాట్లాడకు.. నువ్వెంత.. శివాజీపై శివాలెత్తిన గౌతమ్!
ఈ ఏడాది ఉల్టా పల్టా అనే సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్బాస్ సీజన్-7 అదే రేంజ్లో దూసుకెళ్తున్నాడు. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ వాతావరణం నడుస్తోంది. గతవారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారంలో నామినేషన్స్లో ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఇవాళ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. అమర్దీప్ ఫైర్ ఏ టాస్క్ జరిగిన ప్రతి ఒక్కరికీ అదే విధంగా బిహేవియర్ ఉండాలి అని జడ్జిని ప్రశ్నిస్తాడు డాక్టర్ బాబు గౌతమ్. దీనికి శివాజీ ప్రతి ఒక్కరితో నీకు అనవసరం అంటూ కౌంటర్ ఇస్తాడు. కానీ నా ఇంట్లో వాళ్ల గురించి అవసరమే అని గౌతమ్ అడగడంతో.. ఇదే కేవలం గేమ్ మాత్రమే.. ఫ్యామిలీ కాదు అని శివాజీ అంటాడు. ఆ తర్వాత మీరు లాయర్ లాగా వన్సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారంటూ గౌతమ్ కౌంటరిస్తాడు. శివాజీ తీరుతో విసుగు చెందిన గౌతమ్ నువ్వెంత? అంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే ఈ వారంలో నామినేషన్స్ బాధ్యత శోభా శెట్టి, శివాజీ, సందీప్ల మీద పెట్టాడు బిగ్ బాస్. వీరు ముగ్గురు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించనున్నారు. అయితే కంటెస్టెంట్ తాము ఎవరినీ నామినేట్ చేయాలనుకున్న వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరినీ నామినేట్ చేయాలో జడ్జిలు నిర్ణయిస్తారు. నువ్వు ఎంత.. శివాజీపై గౌతమ్ ఫైర్ ఈ క్రమంలో మన డాక్టర్ బాబు గౌతమ్.. యావర్. తేజలను నామినేట్ చేసేందుకు కారణాలు చెప్పాడు. ఏ టాస్క్ ఓడిపోయినా కూడా యావర్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు అని ఇలా ఏదో కారణం చెప్పబోయాడు గౌతమ్. ఇంటి సభ్యులందరికీ ఇబ్బందిగా ఉందని అంటాడు. అది నీకు సంబంధిచిన సమస్య కాదు అని శివాజీ అంటాడు. ఇది ఫ్యామిలీ అని గౌతమ్ అంటాడు.. ఇది ఫ్యామిలీ కాదు.. ఆట అని శివాజీ సమాధానం ఇస్తాడు. దీంతో హౌస్లో హీట్ ఓ రేంజ్కు దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్ల మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నావంటూ అమర్ దీప్ ప్రశాంత్కు కౌంటరిస్తాడు. నీకు రెండు మొహాలు, రెండు నాలుకలతో మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని ప్రశాంత్పై అమర్ దీప్ ఫైర్ కాగా.. దీనికి సైతం వ్యంగంగానే సమాధానమిస్తాడు ప్రశాంత్. ఆ తర్వాత ఏకంగా రేయ్ నువ్వు సెగలుగా నవ్వొద్దంటూ అమర్ దీప్ వార్నింగ్ ఇస్తాడు. అయితే దీనికి నా ఆట నేను ఇలాగే ఆడతా అని పల్లవి ప్రశాంత్ అంటాడు. నువ్వు కూడా రెండు మొహాలు కాదా అమర్దీప్ను అనడంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నేను ఇలానే ఉంటా అనే అమర్ దీప్ అంటే.. నేను కూడా ఇంతే అంటూ పల్లవి ప్రశాంత్ అనడంతో ప్రోమో ముగిసింది. రోజు రోజులు హౌస్లో హీట్ పెంచుతోన్న నామినేషన్స్ ప్రక్రియ ఈ వారంలో ఎవరెవరూ నామినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఈ సీజన్లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా రిలీజైన మరో ప్రోమోలో గౌతమ్కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. కారణాలపై ప్రశాంత్ మాట్లాడుతూ.. 'అమ్మాయి అరిచినప్పుడు నువ్వూ అరువు. మస్తు అనిపిస్తది. కానీ మళ్లీ ఇక్కడకు వచ్చి షర్ట్ తీయడం నాకు నచ్చలేదు.' అని అన్నాడు. ఆ తర్వాత రతిక పొట్టి దుస్తులు వేసుకోవడంపై ప్రశాంత్ మాట్లాడగా గొడవ మరింత ముదిరింది. రతికను ఏదో సరదాగా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. మజాక్ చేయడానికి నేనెవర్రాభయ్ నీకు అంటూ రతిక మండిపడింది. మరో వైపు శుభ శ్రీని అమర్దీప్ నామినేట్ చేయగా.. ప్రియాంకతో ఫేవర్గా ఉన్నానంటే అది మా స్ట్రాటజీ. ఆ పాయింట్ నాకు హర్టింగ్గా అనిపించింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని తన కారణం చెప్పాడు. దీనికి శుభశ్ ఆగ్రహంతో అదొక కారణమా? ఛీ అంటూ మండిపడింది. దీంతో విరిద్దరీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్గా మారాయి. -
ఆయన మనిషేనా? ఛీ, అతడికా సపోర్ట్ చేసింది.. శివాజీపై రతిక ఫైర్
కంటెస్టెంట్లు పెద్దగా గొడవపడేది నామినేషన్స్లోనే! ఇతరత్రా సందర్భాల్లో గొడవపడ్డా దాన్ని గుర్తు చేసుకుని మరీ గొడవకు దిగేది, రచ్చ చేసేది కూడా నామినేషన్స్లోనే! బిగ్బాస్ 7లో నాలుగోవారం నామినేషన్స్ రసాభాసగా జరిగాయి. ఇంతకీ ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్(సెప్టెంబర్ 25) హైలైట్స్ చదివేయాల్సిందే! అతి చేస్తున్న శివాజీ హౌస్లో తనే పెద్ద తోపు, తురుమ్ఖాన్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు శివాజీ. ఎదుటివారిని మాట్లాడనివ్వడు, వారు ఏం చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. తను చెప్పిందే వేదం, తను చేసేది శాసనం అన్నట్లుగా ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు. అందరితో బాగుంటూనే అవసరం వచ్చినప్పుడు అసలు స్వరూపం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన రతిక రోజ్ అతడికి దూరంగా ఉండటమే బెటర్ అని ఫీలైంది. నాగార్జునగారి దగ్గర.. ప్రశాంత్ వెనుక నేను తిరుగుతున్నా అన్నట్లుగా శివాజీ అనడం నచ్చలేదని అమర్తో చెప్పింది రతిక. ఛీ.. ఈయన్నా నేను సపోర్ట్ చేసింది: రతిక 'అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ సేఫ్ గేమ్, గ్రూప్స్ ఆడుతున్నారని చెప్తున్నాడు. ఛీ ఈయనకా నేను సపోర్ట్ చేసింది.. పైకి మంచిగా ఉంటూ మార్కులు కొట్టేస్తూ మనల్ని పిచ్చోడిని చేస్తున్నాడు' అని తన ఆవేశాన్నంతా కక్కేసింది. ఆ తర్వాత శివాజీ దగ్గరకు వెళ్లి మరీ గొడవపెట్టుకుంది. ప్రశాంత్ టాపిక్ ఎత్తుతూ.. నాగ్ సర్ ముందు అమ్మాయిగా నా క్యారెక్టర్ గురించి ఇలా అనేశాడేంటి? అనిపించింది అని తన ఆవేదన చెప్పింది. దీంతో అతడు నేనలా అనలేదు. నువ్వే మరోలా ఊహించుకుంటున్నావు.. అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ రతిక వినకపోవడంతో సారీ చెప్పాడు. అయినా రతిక వాదిస్తుండటంతో.. ఎందుకు సాగదీస్తున్నావ్.. కాళ్లు పట్టుకోవాలా? అని సీరియస్ అవుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. జ్యూరీ సభ్యులను కారణాలతో మెప్పిస్తేనే.. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా సాగింది. పవరాస్త్ర పొందిన ముగ్గురు హౌస్మేట్స్ శోభా శెట్టి, సందీప్, శివాజీలను బిగ్బాస్ జ్యూరీ మెంబర్స్గా కూర్చోబెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని బోనులో నిలబెట్టి నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలి. జ్యూరీ ఎవరి నామినేషన్కు మద్దతు తెలుపుతుందో వారి ఫోటోలను గిల్టీ బోర్డుపై పెట్టాలి. ఒకసారి గిల్టీ బోర్డుకు ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా ప్రిన్స్ యావర్.. తనను కంటెండర్గా తప్పించిందని ప్రియాంకను, టాస్కులే ఆడట్లేదంటూ తేజలను నామినేట్ చేశాడు. ప్రియాంక గురించి చెప్పింది సబబు అనిపించడంతో జ్యూరీ మెంబర్స్ ఆమె ఫోటోను గిల్టీ బోర్డుపై పెట్టారు. మళ్లీ కయ్యానికి కాలు దువ్విన యావర్ శుభశ్రీ మాట్లాడుతూ.. బిగ్బాస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ గురించి చెడుగా మాట్లాడుతోందని నామినేట్ చేసింది. అలాగే గతవారం నామినేషన్స్ సొంతంగా ఆలోచించకుండా వేరొకరిని గుడ్డిగా ఫాలో అవడం కరెక్ట్ కాదని పేర్కొంది. దీంతో రతికకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నీలా గుసగుసలు ఆడటం రాదు. నా ఎక్స్ గుర్తొచ్చి ప్రియాంకతో చెప్పుకున్నాను. ఆ మాటలు విని నువ్విక్కడ చెప్తున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో శుభశ్రీ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ యావర్- గౌతమ్ ఫైట్ కంటెండర్గా గుండు గీయించుకోమంటే వెనుకాడాడంటూ అమర్ను నామినేట్ చేసింది. అది నా ఇష్టం, నీకేంటి బాధ? అని తనతో గొడవకు దిగాడు అమర్. జ్యూరీ.. అమర్-రతిక ఇద్దరిలో రతికను నామినేట్ చేశారు. అనంతరం గౌతమ్.. గతంలో ప్రిన్స్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని, అతడి కోపం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు. ఇది వినగానే ప్రిన్స్ మళ్లీ గొడవ షురూ చేశాడు. యావర్- గౌతమ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. బోనులో నిలబడకుండా గౌతమ్పైకి వెళ్లడంతో అతడిని బోనులో నిలబడమని సందీప్ మాస్టర్, శివాజీ కోప్పడ్డారు. వారిపైనా ప్రిన్స్ నిప్పులు చెరిగాడు. పిచ్చి కారణాలంటూ శివాజీ ఓవరాక్షన్ ఈ ప్రవర్తనే నచ్చలేదని గౌతమ్ అనగా నీవన్నీ పిచ్చి కారణాలు.. మేము పిలుస్తున్నా యావర్ మా మాట లెక్కచేయలేదు కాబట్టి ఆ ప్రవర్తనకు మాత్రమే నామినేట్ చేస్తున్నాం అంటూ శివాజీ అతి చేశాడు. ఇది నచ్చని గౌతమ్ మీరు పక్షపాతంగా ఉంటున్నారంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో బిగ్బాస్.. నామినేషన్లో ప్రవర్తనను బట్టి కంటెస్టెంట్లను నామినేట్ చేయకూడదు. కారణాల ఆధారంగానే వారిని ఎంపిక చేయాలి. మీ నిర్ణయాన్ని ఆలోచించి చెప్పండి అని పేర్కొన్నాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. మరి నామినేషన్లో ఇంకా ఎన్ని గొడవలున్నాయో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ.. నామినేషన్స్లో ఎవరెవరున్నారంటే?
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు దాని జాడే లేదు. ఈసారి సీజన్ ఉల్టాపల్టా అన్నారు కాబట్టి మరో రెండు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే ఆస్కారం ఉంది. ఇకపోతే ఈరోజు మండే అంటే బిగ్బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య మంటపెట్టే రోజు. నీ కాళ్లు పట్టుకోవాలా? తాజాగా నామినేషన్స్పై బిగ్బాస్ ప్రోమో వచ్చేసింది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అన్నావంటూ రతిక శివాజీతో వాదనకు దిగింది. నేను లేకపోతే నాగార్జున వీడియోలు వేసి చూపిస్తే నీ పరిస్థితేంటి? అని ప్రశ్నించాడు తిరిగి ప్రశ్నించాడు శివాజీ. అయినా మెట్టు దిగని రతిక ఇంకా సాగదీయడంతో ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా? అని అడిగాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జడ్జిలు ఏకీభవిస్తేనే నామినేషన్ మరోవైపు బిగ్బాస్ కొత్త తరహా నామినేషన్ ప్రవేశపెట్టాడు. పవరాస్త్ర గెలుచుకుని హౌస్మేట్స్గా ప్రమోషన్ పొందిన శోభా, శివాజీ, సందీప్లను జ్యూరీ సభ్యులిగా నియమించాడు. ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిని బోనులో నిలబెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు ఆ జడ్జిలకు సమ్మతంగా అనిపిస్తే అవతలివారు నామినేట్ అవుతారు. తేజ, ప్రియాంకను నామినేట్ చేసిన ప్రిన్స్ ముందుగా ప్రిన్స్ యావర్.. ఫెమినిజాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరమ్మాయిలు నన్ను ఆటలో నుంచి తప్పించారంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. కానీ ఇందుకు జడ్జి శోభా ఒప్పుకోలేదు. ఇద్దరమ్మాయిలున్నారు కాబట్టి త్యాగం చేస్తానని నువ్వు తేజతో అన్నావా? లేదా? అని నిలదీసింది. దీనికి ప్రిన్స్.. అది వేరే విషయమని.. అందరి ముందు చెప్పినదాని గురించి తాను మాట్లాడుతున్నానని వాదించాడు. తర్వాత తేజను సైతం నామినేట్ చేశాడు. బయట సెలబ్రిటీ గురించి ఎందుకు? అటు శుభశ్రీ సైతం కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది. ఈ హౌస్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని పేర్కొంది. ఇక్కడ లేని వ్యక్తి, ఓ సెలబ్రిటీ గురించి పదేపదే మాట్లాడటం తప్పని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం గౌతమ్, ప్రిన్స్, శుభశ్రీ, తేజ, రతిక, ప్రియాంక నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్: దామిని అవుట్.. వెళ్తూ వెళ్తూ ఆ సర్ప్రైజ్ -
రతిక మాజీ బాయ్ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!
'బిగ్బాస్' షో.. అప్పుడే మూడో వారం చివరకొచ్చేసింది. తొలి రెండు వారాలు ఓ మాదిరిగా సాగినప్పటికీ.. హౌసులో కొన్ని గొడవలు మినహా చెప్పుకోదగ్గవి అయితే ఏం జరగలేదు. గత రెండు వీకెండ్స్లో హోస్ట్ నాగార్జున.. ఎవరినీ పెద్దగా ఏం అనలేదు. ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండా స్మూత్ కౌంటర్స్ వేశాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు Day-20 హైలైట్స్లో చూద్దాం. మూడో హౌస్మేట్ శనివారం ఎపిసోడ్ కోసం వచ్చిన నాగ్.. శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్పై చూపించాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సంచాలక్ సందీప్కి నాగ్ అక్షింతలు వేశాడు. ఎవరు గెలుచుంటారని అతడిని అడిగాడు. మరోవైపు జుత్తు తీయకుండా బయటకొచ్చేసిన అమరదీప్ని కూడా అడిగితే అతడు కూడా ప్రియాంక పేరు చెప్పాడు. కానీ శోభాశెట్టి.. ఎద్దు పోటీలో 12 సెకన్ల తేడాతో గెలిచింది. మూడో హౌస్మేట్ అయిపోయింది. కొత్త గేమ్ పెట్టారు కానీ ఇక నామినేషన్స్లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పిన నాగార్జున.. తన ముందే ఒక్కో వ్యక్తి వాళ్లకు అనిపించిన గేమ్ ఛేంజర్ ఎవరు? సేఫ్ గేమర్ ఎవరో? చెప్పాలని, వాళ్లకు ఆయా బ్యాడ్జి అతికించాలని చెప్పాడు. ఇప్పటికే హౌస్మేట్స్ అయిన శివాజీ, సందీప్ తప్ప అందరూ తమకు అనిపించిన వారి పేర్లు చెప్పారు. ఆ లిస్ట్ దిగువన ఉంది. చూసేయండి. కంటెస్టెంట్.. గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ ప్రియాంక - శోభాశెట్టి, శుభశ్రీ శుభశ్రీ - యవర్, తేజ ప్రశాంత్ - యవర్, తేజ గౌతమ్ - ప్రియాంక, తేజ దామిని - యవర్, అమరదీప్ తేజ - ప్రియాంక, అమరదీప్ శోభాశెట్టి - ప్రియాంక, ప్రశాంత్ యవర్ - ప్రశాంత్, దామిని అమరదీప్ - దామిని, రతిక రతిక - యవర్, తేజ ఇందులో భాగంగా నాలుగు బ్యాడ్జిలు సొంతం చేసుకున్న యవర్ గేమ్ ఛేంజర్గా నిలిచాడు. నాలుగు బ్యాడ్జిలతో సేఫ్ ప్లేయర్ అయిన తేజకి మాత్రం నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. రాబోయే వారంపాటు ఇంట్లోని పాత్రలన్నీ క్లీన్ చేయాలని ఆర్డర్ వేశాడు. దీంతో తేజ అవాక్కయ్యాడు. సంచాలక్గా సందీప్ ఫెయిల్ సంచాలక్గా వ్యవహరించిన సందీప్.. చికెన్ ముక్కలు తిన్న టాస్క్, ఇతర టాస్కుల్లో భాగంగా కంటెడర్స్కి లేనిపోని సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తుచేసిన నాగార్జున.. గాలి మొత్తం తీసేశాడు. అతడు సంచాలక్గా ఫెయిలయ్యాడు అనుకున్నవాళ్లు చేతులు పైకెత్తండి అని నాగ్ చెప్పడంతో రతిక, ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్, తేజ చేతులు పైకెత్తారు. అంతకు ముందు శివాజీ కూడా సందీప్ చేసింది తప్పని అన్నాడు. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే.. 'నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా?' అని సందీప్కి నాగ్ కౌంటర్ వేశాడు. తప్పు చేసినందుకుగానూ సందీప్ బ్యాటరీ డౌన్ చేస్తున్నా అని చెప్పాడు. దీంతో బ్యాటరీ కాస్త.. గ్రీన్(పచ్చ) నుంచి ఎల్లోకి(పసుపు) పడిపోయింది. అమర్కి అరటిపండు సామెత ఇక మిగిలిన వాళ్లలో గౌతమ్తో మాట్లాడిన నాగ్.. శోభాతో గొడవ విషయంలో నువ్వు చేసిన దానికి కారణం ఏదైనా అయ్యిండొచ్చు కానీ అందరికీ అది షో హాఫ్లానే అనిపించందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరోవైపు అమరదీప్.. ఈ వారం ఆటలో ఎక్కడా కనిపించలేదని చెప్పిన నాగ్.. ఆటలో అరటిపండు సామెత చెప్పి మరీ పరువు తీసినంత పనిచేశాడు. ప్రశాంత్తో మాట్లాడుతూ.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? ఓపిక లేదా మరోసారి ఆడలేవా? కన్నీళ్లతో పనిజరగలేదు. బిగ్ బాస్ కరుణించడు అని నాగ్ కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడు. రతిక మాజీ ప్రియుడు టాపిక్ గత వారం పప్పులో రెండు గ్లాసులు అయినా నీరు అయినా వేశావ్, ఈ వారం అది కూడా చేయలేదు, ఆడు నీకు ఆ శక్తి ఉందని అని చెప్పిన నాగ్.. ఆమెని కాస్త ఎంకరేజ్ చేశాడు. 'మాజీ బాయ్ఫ్రెండ్ అంటే గతమే కదా! గతాన్ని ఇక్కడ బుర్రలో పెట్టుకున్నావ్ అనుకో ప్రస్తుతంలో ఉండవు, భవిష్యత్తుకి కూడా వెళ్లవ్. ఎక్స్ అంటే ఎక్సే వదిలేసేయ్.. లెట్స్ లివ్ ఇట్' అని నాగార్జున సుతిమెత్తగా రతికకు సలహా ఇచ్చాడు. అయితే ఈ వారం గేమ్ ఆడకుండా బాయ్ఫ్రెండ్ పేరు చెప్పి రతిక సింపతీ కొట్టేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అలానే నామినేషన్స్లో సిల్లీ రీజన్స్ చెబుతున్నారని, ఏదో చెప్పాలని చెప్పేస్తున్నారు తప్ప ఓ స్టాండ్ లేదని కంటెస్టెంట్స్కి చురకలు అంటించాడు. ఇక నామినేషన్స్లో ఉన్న ఏడుగురిలో యవర్ సేఫ్ అయ్యాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. -
నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు..
-
6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్
బిగ్బాస్ హౌస్లో అతి చేస్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతుచిక్కని ప్రవర్తనతో అపరిచితురాలిగా మారుతూ అందరినీ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో తొలిస్థానంలో ఉంటుంది రతిక. మొదట్లో అమ్మాయి బాగుంది, ఆటాడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా! తను కూడా అదే చేసింది.. కానీ బిగ్బాస్ ఇచ్చిన గేమ్ ఆడకుండా హౌస్మేట్స్తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పతిప్పలు పెట్టింది. ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఇప్పుడేమో హౌస్లో లవ్ ట్రాక్లు నడుపుతూ, వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇదంతా పక్కనపెడితే రతిక ఆ మధ్య తన మాజీ బాయ్ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతడి గురించే ప్రస్తావిస్తోంది. అతడు గుర్తొస్తే తన మైండ్ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్ అని కూడా హింటిచ్చింది. చివరకు ఆ సింగర్ మరెవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్ అంటూ నెట్టింట ఫోటోలు కూడా లీకయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్ స్పందించిన సంగతి తెలిసిందే! ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అని మండిపడ్డాడు. ముందే ప్లాన్ చేసుకున్నారా? తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోలు లీక్ అవడంపైనా అనుమానం వ్యక్తం చేశాడు. 'నాకో డౌట్.. ఆరేళ్ల తర్వాత సడన్గా వారి పర్సనల్ ఫోన్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లోకి ఎలా వచ్చాయి? అంటే.. లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? సమాధానమేంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైనా, అమ్మాయైనా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది! అలాంటిది.. ఇలా ఫోటోలు లీక్ చేసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారని ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్ చేయకండి. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదు, విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్ ద బెస్ట్' అని రాసుకొచ్చాడు. చదవండి: పేరు చెప్పకుండా సీరియస్ అయిన సింగర్ రాహుల్ -
రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్ఫ్రెండ్!
తెలుగు 'బిగ్బాస్'.. మరీ కాకపోయినా సరే ఓ మాదిరిగా అలరిస్తుంది. తొలి రెండు వారాలు చాలావరకు సైలెంట్గా ఉన్న కంటెస్టెంట్స్.. ఇప్పుడు అంటే మూడో వారం రెచ్చిపోయి మరీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గొడవలే టార్గెట్ అన్నట్లు మాటలతో కొట్లాడుకుంటున్నారు. అయితే హౌసులోని ఓ కంటెస్టెంట్పై.. బిగ్బాస్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఓ సీరియస్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది వైరల్గా మారింది. ఏం జరిగింది? తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం సీజన్లో నటి రతిక.. ఓ కంటెస్టెంట్గా వచ్చింది. పర్లేదు అనిపించేలా ఆడుతోంది. ఈమె-రాహుల్ గతంలో ప్రేమించుకున్నారని, పెళ్లికి రెడీ అయిన వీళ్లు కొన్ని కారణాలతో విడిపోయారని సమాచారం. (ఇదీ చదవండి: ప్రిన్స్ ముఖంపై పేడ.. బక్వాస్ రీజన్ అని శోభా సీరియస్) తొలివారం హౌసులో బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుని కాస్త బాధపడ్డ రతిక.. మంగళవారం ఎపిసోడ్లోనూ తన మాజీ ప్రియుడు పేరు ఎత్తకుండా అతడి గురించి మాట్లాడుకుంటున్నారని శివాజీ దగ్గరకొచ్చి కాస్త బాధపడింది. అయితే రతిక ఇలా చేయడంపై.. ఆమె పేరు ఎత్తకుండా రాహుల్.. ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టాడు. అదంతా పరోక్షంగా రతిక గురించే అని డౌట్ వస్తుంది. స్టోరీలో ఏముంది? 'ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్తోనే పైకి రావాలనుకుంటారు. కొందరు మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్' అని రాహుల్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో ఈ స్టోరీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) -
ప్రిన్స్ ముఖంపై పేడ.. బక్వాస్ రీజన్ అని శోభా సీరియస్
కాస్త ఆలస్యం చేసినా.. 'బిగ్బాస్' సరైన రూట్లోకి వచ్చేశాడు. తొలి రెండు వారాల కాస్త సాఫ్ట్గా సాగిన కంటెస్టెంట్స్.. ఇప్పుడు చెలరేగిపోతున్నారు. బిగ్బాస్ పెడుతున్న ఫిట్టింగ్స్ వల్ల హౌస్ అంతా అల్లకల్లోలం అవుతోంది. తాజాగా ప్రిన్స్ యవర్ కి నరకం చూపించగా, శోభాశెట్టి బీభత్సమైన సీరియస్ అయిపోయింది. ఇంతకీ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది? ప్రిన్స్-రతిక ఒకే ప్లేటులో మూడో పవరస్త్ర కోసం బిగ్బాస్.. అమరదీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ని ఎంపిక చేశాడు. వీళ్లలో ఎవరు అనర్హులో చెప్పాలని మిగతా కంటెస్టెంట్స్ని కోరాడు. వీళ్లలో ఓ ముగ్గురు యవర్ పేరు చెప్పారు. మిగతా వాళ్ల సంగతలా ఉంచితే రతిక తన పేరు చెప్పి, వెన్నుపోటు పొడిచేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కాస్త డల్ గా కనిపించిన యవర్.. రతికతో కలిసి ఒకే ప్లేటులో భోజనం చేయడం అమ్మ బాబోయ్ అనిపించింది. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) నరకం స్పెల్లింగ్ చెప్పించారు ఇక యవర్.. మూడో పవరస్త్ర కోసం పోటీలో ఉండడటం కోసం బిగ్బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. ఓ బల్లపై ముఖాన్ని పెట్టి ఉంచాలి. ఎవరెంత ఇబ్బంది పెట్టినా అస్సలు ముఖాన్ని కదల్చకూడదని కండీషన్ పెట్టాడు. దీంతో యవర్ ముఖంపై గుడ్లు పగలగొట్టడం, ఒళ్లంతా పేడ రాయడం లాంటివి చేసి అసలు సిసలు నరకాన్ని చూపించారు. శోభా-గౌతమ్ ఫైట్ మరోవైపు గౌతమ్.. తనని అనర్హురాలు అని చెప్పడాన్ని శోభాశెట్టి సహించలేకపోయింది. అతడిపై అరుస్తూ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే తన బాడీ గురించి శోభాశెట్టి కామెంట్స్ చేయడాన్ని తీసుకోలేకపోయాడు. ఇద్దరి మధ్య హీటింగ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. ఈ వ్యవహరంలో చివరకు ఏమైందనేది తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా) -
రతిక వెన్నుపోటు.. గిలగిలా కొట్టేసుకున్న ప్రిన్స్ యవర్
'బిగ్బాస్'లో మూడోవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. హౌస్మేట్స్ దాన్నుంచి బయటకొచ్చేశారు. అంతా ఓకే అనుకునేలోపు.. బిగ్బాస్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక రతిక వల్ల ప్రశాంత్, యవర్ మెంటలెక్కిపోయారు. ఇంతకీ బిగ్బాస్ హౌసులో మంగళవారం ఏం జరిగిందనేది Day-16 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) మాజీ బాయ్ఫ్రెండ్ టాపిక్ ఇక సోమవారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తేజని సేవ్ చేసి, అమరదీప్ని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందనేది సందీప్, శోభాశెట్టితో చెప్పుకొచ్చాడు. గతవారం ప్రశాంత్కి ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఈసారి అమర్ని అయితే తట్టుకోగలడని, కచ్చితంగా సేవ్ అవుతాడని అన్నాడు. మరోవైపు తన మాజీ బాయ్ఫ్రెండ్ గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారని, దీంతో తన మైండ్ ఆఫ్ అయిపోయిందని రతిక, శివాజీతో మాట్లాడుతూ బాధపడింది. బాధపడిన ప్రశాంత్ ఇక హౌసులో ఉన్న అందరూ కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పిండితో ముద్దలా చేసి, దానితో గణేశుడి ప్రతిమ చేసుకుని పూజా చేసుకుని, ప్రసాదం తిన్నారు. ఇక అసలు విషయంలోకి వచ్చేసిన బిగ్బాస్.. మూడో పవరస్త్ర కోసం తాను ముగ్గుర్ని సెలెక్ట్ చేశానని అమర్దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ పేర్లు చెప్పాడు. దీంతో మిగతా వాళ్లలో అసంతృప్తి మొదలైంది. అయితే ఏదో భూమి బద్దలైనట్లు ప్రశాంత్ తెగ బాధపడిపోయాడు. 'ఓడిపోయా.. నేను ఓడిపోయా' అని తనలో తానే అనుకున్నాడు. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్నే అవమానించిన రజనీకాంత్!) ఫిట్టింగ్ పెట్టిన బిగ్బాస్ బాధపడుతున్న ప్రశాంత్ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్బాస్.. పవరస్త్ర కోసం తాను ఎంపిక చేసిన ముగ్గురిలో అనర్హులు అనిపించిన వారి పేరు చెప్పమన్నాడు. సందీప్, శివాజీతో పాటు సెలెక్ట్ అయిన ముగ్గుర్ని కాకుండా అందరినీ పిలిచి అనర్హులు అనిపించిన వారి పేరు, అభిప్రాయాలు చెప్పమన్నాడు. అలా అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - శోభాశెట్టి ప్రియాంక - అమర్దీప్ శుభశ్రీ - శోభాశెట్టి తేజ - యవర్ దామిని - యవర్ గౌతమ్ - శోభాశెట్టి రతిక - యవర్ (ఇదీ చదవండి: అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు) శివాజీ పవరస్త్ర చోరీ ఓవైపు ఈ గేమ్ జరుగుతుండగానే శివాజీ గెలుచుకున్న పవరస్త్రని అమరదీప్ దొంగతనం చేశాడు. అతడు సైలెంట్గా ఏం తెలియనట్లు ఉండిపోయాడు. మరోవైపు ప్రశాంత్ తీశాడమేనని అతడితో రతిక గొడవ పెట్టుకుంది. ఏదో సరదా కోసం అనుకున్న గొడవ కాస్త.. అరిచి గోల గోల చేసుకునేలా మారిపోయింది. ప్రశాంత్, రతికని టచ్ చేస్తూ మాట్లాడటం కాస్త వింతగా అనిపించింది. రతిక వెన్నుపోటు ఎవరు అనర్హులో ఏడుగురు కంటెస్టెంట్స్ చెప్పిన వీడియోస్ని టీవీలో ప్లే చేసిన బిగ్బాస్.. బాంబు పేల్చాడు. తొలుత యవర్ పేరు చెప్పిన వాళ్ల వీడియోలు ప్లే చేశారు. ఈ క్రమంలోనే అతడు తేజతో గార్డెన్ ఏరియాలో గొడవపెట్టుకున్నాడు. అక్కడితో ఈ తతంగం అయిపోలేదు. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయిన యవర్.. స్మోక్ రూంలోని బెంచ్పై ఉన్న గ్లాసుని పదేపదే కొడుతూ.. అందరినీ భయపెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో కానీ రతిక తనకు ఈ రేంజులో వెన్నుపోటు పొడుస్తుందని ఊహించని యవర్.. ఇదే విషయాన్ని ఆమెతో చెబుతూ తెగ బాధపడ్డాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా) -
టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!
'బిగ్బాస్ 7' మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. తొలి రెండు వారాల్లో కిరణ్, షకీలా ఎలిమినేట్ అయిపోయారు. ఇక తాజా నామినేషన్స్లో ఏకంగా ఏడుగురు నిలిచారు. అయితే ఈసారి సోమవారం ఎపిసోడ్ కాస్త ప్లెయిన్ గానే జరిగినప్పటికీ ఆ తర్వాత గొడవలు, స్కెచ్లు, టాస్కులతో హౌస్ అంతా హీటెక్కిపోయింది. ఇంతకీ బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది? మళ్లీ పులిహోర మొదలు తొలివారం రతికతో ప్రశాంత్ గట్టిగా పులిహోర కలిపేశాడు. రెండో వారం వచ్చేసరికి అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీంతో ఇద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు. మూడోవారం వచ్చేసరికి మళ్లీ మొదటికొచ్చారు. తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని రతిక ఏడుస్తుంటే.. ఆమెని కూల్ చేసేందుకు ప్రశాంత్ ఫర్టింగ్ చేశాడు. కంట్లో నుంచి నీళ్లు రాకుండా పాలలెక్క వస్తున్నాయి ఏందని అన్నాడు. దీంతో ఆమె సిగ్గు పడిపోతూ నవ్వేసింది. (ఇదీ చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!) చేతులేయడంతో గొడవ రెండో ప్రోమోలో భాగంగా మూడు వారాల ఇమ్యూనిటీ టాస్క్ కోసం అమరదీప్, శోభాశెట్టి, యవర్ని బిగ్బాస్ సెలెక్ట్ చేశాడు. అయితే వీళ్లలో ఎవరు పోటీకి అనర్హులో చెప్పమని మిగిలిన వాళ్లని అడిగాడు. దీని తర్వాత ఏ విషయం గురించో తెలీదు గానీ ప్రశాంత్-రతిక గొడవపడ్డారు. 'హే పో' అని ప్రశాంత్.. రతికని టచ్ చేస్తూ అరిచాడు. దీంతో సీరియస్ అయిన రతిక.. మర్యాదగా ఉండదు చెబుతున్నా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే అసలు ఎందుకు గొడవపడ్డారు? ఏం జరిగిందనేది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. నామినేషన్స్ సంగతేంటి? ఈ వారం నామినేషన్స్లో శుభశ్రీ, గౌతమ్, అమరదీప్, ప్రియాంక, దామిని, రతిక, యవర్ ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతానికి అయితే ఓటింగ్ విషయంలో అమర్ టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. దామిని చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. మూడో ఎలిమినేషన్కి ఇంకా నాలుగైదు రోజుల టైముంది కాబట్టి అంతలో ఏదైనా జరగొచ్చు. ఓటింగ్ తారుమారు కావొచ్చనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీనే!) -
రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్పై నాగ్ సీరియస్!
రెండో పవరస్త్ర కోసం జరిగిన పోటీతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక శనివారం ఎపిసోడ్లో ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. అందరినీ నవ్విస్తూనే.. ఓవైపు చేసిన పనులకు మెచ్చుకుంటూ మరోవైపు ఎవరికి ఇవ్వాల్సిన డోస్ వాళ్లకు ఇచ్చేశాడు. ఇక చివర్లో నామినేషన్స్ గురించి కూడా చెప్పి భయపెట్టాడు. ఇంతకీ 'బిగ్బాస్'లో 13వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టిన మెగాకపుల్) యవర్ అది మర్చిపోలేదు మాయస్త్ర ఇచ్చే విషయమై రతిక తనని సపోర్ట్ చేయడంపై యవర్ మాట్లాడాడు. ఆమెపై గౌరవం పెరిగిందని అన్నాడు. ఇక తనకు అన్యాయం జరగడంపై.. మార్నింగ్ ఎక్సరసైజ్ చేస్తూ శుభశ్రీతో మాట్లాడాడు. 'ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు.. డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి' అని కెమెరాని చూస్తూ అన్నాడు. కాసేపటికి బెడ్ రూంలో అందరూ ఉన్న టైంలో ప్రిన్స్-గౌతమ్ మధ్య షకీలా కాంప్రమైజ్ చేసింది. అలానే రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర.. రూంలో నిద్రపోవడం గురించి సందీప్ చెప్పిన ప్రిన్స్ వినలేదు. అతడితో గొడవపడ్డాడు. ఈసారి కింగ్స్ మీటర్ శుక్రవారం జరిగింది అంతా చూసిన నాగార్జున.. శనివారం కంటెస్టెంట్స్తో మాట్లాడేందుకు వచ్చేశాడు. గతవారం ఆడియెన్స్ చెప్పారు, ఈసారి మాత్రం కింగ్స్ మీటర్తో తానే చెబుతానని అన్నాడు. అలా ఒక్కో కంటెస్టెంట్స్ ఈ వారం ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ చేశారనేది చెప్పుకొచ్చాడు. అలానే రెండో పవరస్త్ర గెలుచుకున్నది శివాజీ అని అనౌన్స్ చేశారు. 'బిగ్బాస్' అరిచే గేమ్లో శివాజీకి అత్యధికంగా 11 పాయింట్లు వచ్చాయి. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తెలుగమ్మాయి.. 'జవాన్' బ్యూటీ గ్లామర్ ట్రీట్) శివాజీకి పడ్డాయి గేమ్, టీమ్ ని లీడ్ చేసే విషయంలో శివాజీని సూపర్ అని మెచ్చుకున్న నాగ్.. 'తలుపు తీయరా సామీ బయటకెళ్లిపోతా' అని బిగ్బాస్తో పదేపదే అనడంపై నాగ్ ఓ రేంజులో కౌంటర్స్ వేశాడు. అది కరెక్ట్ కాదన్నాడు. అమర్దీప్ కూడా బాగానే ఆడాడని చెప్పిన నాగ్.. ప్రశాంత్ నామినేషన్ టైంలో చెప్పిన పాయింట్ మాత్రం కరెక్ట్ కాదని హితబోధ చేశాడు. షకీలా గురించి మాట్లాడుతూ.. వయసుతో శరీరానికి సంబంధం లేదు. వయసుకు తగ్గట్లు కాదు వయసుకు మించి ఆడాలని నాగ్ ఆమెతో చెప్పాడు. రైతుబిడ్డ తుస్ సందీప్ని బాగా ఆడుతావని మెచ్చుకున్న నాగార్జున.. శుభశ్రీ, ప్రియాంక ఇంకా బాగా ఆడాలని వాళ్లతోనే అన్నాడు. అయితే రైతుబిడ్డ ప్రశాంత్కి మాత్రం గట్టిగా కౌంటర్స్ పడ్డాయి. ఒక మొక్కని చూసుకోలేనివాడు రైతుబిడ్డా? అని నాగ్ అనేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. బిగ్బాస్ని అడిగి మరో మొక్క పంపిస్తా. ఈసారి గానీ మొక్క మాడిపోతే.. నామినేషన్స్లో అందరూ చెప్పింది నిజమని తాను నమ్ముతా అని నాగ్ ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ) యవర్కి గీతోపదేశం ప్రిన్స్ యవర్తో మాట్లాడిన నాగ్.. నీ అరుపులతో మేం డిసప్పాయింట్ అయ్యాం. బాగా ఆడావ్. ఎక్సప్రెస్ చేయ్ కానీ అరవాల్సిన అవసరం లేదు, అన్యాయానికి అరిస్తే న్యాయం జరగదు. నీకు రివార్డ్ దొరకదని చెప్పాడు. గౌతమ్ స్టెరాయిడ్స్ అని సైగ చేయడంపై మాట్లాడిన నాగ్.. అక్కడే గౌతమ్తో యవర్కి సారీ చెప్పించాడు. గౌతమ్తో మాట్లాడిన నాగ్.. ఏ గేమ్ లోనూ గెలవలేదు, వ్యక్తిగతంగానూ గెలుచుకోలేకపోయావ్. ఇంప్రూవ్ యువర్ గేమ్ అని నాగార్జున చిన్న వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు ఇంకా డేంజర్లోనే మిగతావాళ్లలో శుభశ్రీ, దామిని, శోభాశెట్టి, తేజ సరిగా ఆడటం లేదని హెచ్చరించిన నాగార్జున.. రతికకి మాత్రం గట్టిగానే ఇచ్చాడు. టీమ్ గేమ్ అంటే టీమ్ గేమ్ ఆడాలి, ఒక్కటే పాయింట్ పట్టుకుని మొండితనం కరెక్ట్ కాదు, బఫూన్ అంటే ఏంటో తెలుసా? అని అన్నాడు. ఆట ఆడు.. మనుషులతో ఆడుకోవద్దని చెప్పి కూల్ చేశాడు. ఇకపోతే రెండో పవర్ అస్త్ర గెలుచుకున్న శివాజీ.. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. అమర్దీప్ కూడా సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో ఏడుగురు అంటే ప్రశాంత్, షకీలా, గౌతమ్, యావర్, తేజ, శోభాశెట్టి, రతిక.. ఇంకా డేంజర్ లో ఉన్నారని చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. మరి రెండో వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరో ఆదివారం తేలనుంది. ఆ కంటెస్టెంట్స్ ఎవరని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!) -
కంట్రోల్ తప్పిన యవర్.. అపరిచితుడులా బిహేవ్ చేశాడు!
'మాయ అస్త్ర' గెలుచుకున్న రణధీర టీమ్లో ఎవరు దాన్ని ఉంచేందుకు అనర్హులో చెప్పే టాస్క్ మధ్యలోనే గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే ఇందులో భాగంగా ప్రిన్స్ యవర్.. గౌతమ్, సందీప్తో పెద్ద గొడవలు పెట్టుకున్నాడు. అలానే రెండో 'పవర్ అస్త్ర' కోసం ఆ ముగ్గురి మధ్య 'బిగ్బాస్' ఓ పోటీ పెట్టారు. ఇంతకీ అదేంటి? 12వ రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. యవర్ vs గౌతమ్ టాస్కులో భాగంగా ప్రిన్స్ దగ్గరున్న భాగాన్ని తీసుకుని.. 'మహబలి' టీమ్ దాన్ని శివాజీ చేతిలో పెట్టారు. దీనికి ప్రిన్స్ ఒప్పుకోలేదు. తన పార్ట్ని అస్సలు ఇచ్చేదే లేదని నానా రాద్ధాంతం చేశాడు. ఒకానొక దశలో బరస్ట్ అయిపోయిన యవర్.. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్ గేమ్ అన్నాడు. 'ఇచ్చేయ్ ఇచ్చేయ్' అని తన భాగాన్ని విసిరేసి.. గౌతమ్ వైపు చూస్తూ అరిచాడు. గేటు తెరవండి, ఇంటికెళ్లిపోతా అని చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చాడు. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) ప్లేట్ మార్చిన రతిక మహబలి టీమ్ లో అందరూ అనుకుని.. శివాజీ, షకీలాకు మాయ అస్త్ర భాగాల్ని ఇచ్చారని అందరూ అనుకున్నారు. కానీ అదే గ్రూపులో ఉన్న రతిక.. ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ ప్లేట్ తిప్పేసింది. తాను శివాజీ, ప్రిన్స్ అని చెబితే.. తన మాట అస్సలు వినలేదని సొంత టీమ్పైనే చాడీలు చెప్పింది. ఆడితే జెన్యూన్గా ఆడండని అరిచి గోల చేసింది. రతిక అలా అనేసరికి ప్రశాంత్, గౌతమ్ ఆమెపై రెచ్చిపోయారు. ఇప్పుడు చెబితే ఎలా అని గొడవపడ్డారు. కాసేపు అయితే ఆమెని కొట్టేవాళ్లేమో అన్నంతలా ఊగిపోయారు. ఇకపోతే రతిక, వాళ్ల టీమ్ వాళ్లతో గొడవపడుతుంటే మధ్య ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ ముఖం వరకు వచ్చి గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేశాడు. ఇంగ్లీష్, హిందీలో మాటాడుతూ హౌస్ రూల్స్ మళ్లీ బ్రేక్ చేశాడు. బాడీ చుడూ అని ప్రిన్స్ అంటే.. ఏంటి అవి ఇంజెక్షన్స్తో తెచ్చుకున్నవే కదా అని గౌతమ్ సైగ చేశాడు. దీంతో యవర్ ఒళ్లు మండింది. పర్సనల్కి వెళ్లొద్దు అని ప్రిన్స్ కోపం కట్టలు తెచుకుంది. కానీ గౌతమ్ తగ్గితేగా! గౌతమ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా.. పదే పదే మీదకొస్తూ యవర్ అల్లరల్లరి చేశాడు. బిగ్బాస్కే వార్నింగ్ హౌసులో రాజకీయాలు ఎక్కువైపోయాయని రతిక.. గట్టిగా అరుస్తూ చెప్పింది. అలానే ఇక్కడందరూ ఫేక్ మనుషులు అని, వాళ్లతో ఉండలేనని యవర్ చెప్పాడు. తన పార్ట్ లాగేసుకున్నారని, ఏకంగా సందీప్తోనూ గొడవపడ్డాడు. తనకు ఆన్సర్ కావాలని, లేకపోతే అప్పటివరకు మైక్ వేసుకోనని బిగ్బాస్కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. (ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ) యవర్ కూల్ అయ్యాడు అర్థరాత్రి కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏమైందని యవర్ని బిగ్బాస్ అడిగాడు.. దీంతో జరిగినదంతా చెప్పేశాడు. ఈ క్రమంలోనే.. మిమ్మల్ని బిగ్ బాస్ చూస్తున్నారు. బయట ప్రేక్షకులూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ నుంచి సారీ కావాలని యవర్ అడగ్గా.. అలాంటిదే ఉండదు అని డైరెక్ట్గా చెప్పకుండా, మీరు ఇక్కడికి గెలవడానికి వచ్చారు, మీరు ఇక బయటకెళ్లొచ్చు అని బిగ్బాస్, యవర్ని కూల్ చేశాడు. ట్విస్ట్ ఇచ్చిన పెద్దన్న అయితే గొడవ జరుగుతున్న టైంలో మాట వదిలావ్ అని రతికకి షకీలా గీతోపదేశం చేసింది. ఏదైతేనేం చివరకు సారీ చెప్పిన రతిక.. షకీలా కాళ్లకు దండం పెట్టింది. మరోవైపు రెండో పవర్ అస్త్ర కోసం మరో పోటీదారుడ్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తున్నారు అని సందీప్తో బిగ్బాస్ చెప్పారు. దీంతో చాలాసేపు ఆలోచింది అతడు అమరదీప్ పేరు చెప్పాడు. అయితే పోటీకి ఇద్దరే ఫిక్స్ అయిన తర్వాత మరో వ్యక్తిని ఎంటర్ చేయడేం ఏంటని శివాజీ, షకీలాతో వాదన పెట్టుకున్నాడు. నలుగురు కలిసి ఆడుతున్నారని క్లియర్గా తెలిసిపోతుందని(నలుగురు అంటే శోభాశెట్టి, ప్రియాంక, అమరదీప్తో సందీప్ కుమ్మక్కయ్యాడు) శివాజీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తలుపు తీయరా సామీ నేను వెళ్లిపోతా.. నాకొద్దు ఈ గోల అని బిగ్ బాస్ తో అన్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు) రతికతో యవర్ లవ్? అయితే బిగ్బాస్ తీరు తనకు నచ్చట్లేదని, ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ వేడుకున్నాడు. మరోవైపు రతికని లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ యవర్ని అడిగితే.. కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయని అన్నాడు. కొన్నిరోజులు ఆగు నీకే తెలుస్తుందని ప్రశాంత్.. తనకు తొలివారం జరిగిన అనుభవం దృష్ట్యా యవర్పై సెటైర్ వేశాడు. లవ్ వద్దురా నాయనా అని అన్నాడు. అరిచే టాస్కులో రచ్చ రెండో పవర్ అస్త్ర కోసం.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ చెవిలో గట్టిగా బిగ్ బాస్ అని మూడుసార్లు అరవాల్సి ఉంటుంది. ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్లు గెలిచినట్లు. కాస్త గ్యాప్ ఇచ్చి, శివాజీ-అమరదీప్-షకీలా తలో మూడుసార్లు అరిచారు. ఈ గ్యాప్లో యవర్.. సందీప్తో గొడవపెట్టుకున్నాడు. చపాతీలు ఎవరూ చేయట్లేదని తనవైపు వేలు చూపిస్తున్నావ్ ఏంటని దగ్గరకెళ్లి గొడవపెట్టుకోవడానికి చూశాడు. సందీప్ చాలా ప్రశాంతంగా ఉండటంతో అక్కడికది ఎండ్ అయిపోయింది. ఇకపోతే రెండో పవర్ అస్త్రతోపాటు నాలుగు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నది ఎవరో వీకెండ్లో నాగార్జున చెప్తారు, అప్పటివరకు వెయిట్ చేయండని బిగ్బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?) -
అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!
'బిగ్బాస్' హౌస్ రోజురోజుకీ క్రేజీగా మారుతుంది. లేకపోతే ఏంటబ్బా.. ఈరోజు ఫ్రెండ్ గా ఉన్నోళ్లు రేపటికి శత్రువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఒకే టీమ్ లో ఉన్నోళ్లు.. రోజు మారేసరికి ఒకరిని ఒకరు ఎలా పడగొట్టాలా అని స్కెచ్ లు వేసుకుంటున్నారు. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? 12వ రోజు ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. తొలివారం ఎంతో సరదాగా సాగిన బిగ్ బాస్.. రెండో వారంలోకి ఎంటరయ్యేసరికి చాలావరకు మారిపోయింది. ఎప్పుడు చూడు గొడవలే అవుతున్నాయి. మాట్లాడితే చాలు కంటెస్టెంట్స్.. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. తాజాగా 12వ రోజు కూడా గౌతమ్-ప్రిన్స్ గొడవపడ్డారు. దీంతో ప్రిన్స్ ఏడ్చేశాడు. ఇక కన్ఫెషన్ రూంలోకి వెళ్లొచ్చిన తర్వాత రతికతో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా ఇతడితో పులిహోర కలుపుతూ కనిపించింది. (ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) అయితే రతిక-ప్రిన్స్ మధ్య ప్రేమలాంటిది పుట్టడం కాదు.. అదంతా ప్రశాంత్ ముందే జరగడం.. అయ్యో పాపం అనిపించేలా ఉంది. మరోవైపు పవర్ అస్త్ర కోసం గేమ్స్ గెలుచుకున్న మహాబలి గ్రూపులో షకీలా, శివాజీ అర్హులని అందరూ నిర్ణయించారు. అయితే సడన్ ఎంట్రీ ఇచ్చిన బిగ్బాస్.. సందీప్ ని మరో వ్యక్తిని కంటెండర్ గా సెలెక్ట్ చేసే అవకాశం కల్పించాడు. దీంతో సంచాలకుడు సందీప్.. అమర్దీప్ని పవర్ అస్త్ర పోటీ కోసం ఎంచుకున్నాడు. దీంతో ఇప్పటికే పోటీలో ఉన్న షకీలా, శివాజీ అసహనం వ్యక్తం చేశారు. తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అరిచి కేకలు పెట్టడం మీరు తాజా ప్రోమోలో చూడొచ్చు. మరి పూర్తిగా ఏం జరిగిందనేది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) -
రతిక.. నా కొడుకుని వాడుకుంది, అమర్దీప్ అయితే..:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్
బిగ్బాస్ షోలో తన ఆటతో రాణిస్తున్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. బిగ్బాస్ షోకి వెళ్లాలని ఐదు సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. తన మాటతీరుతో, ఆటతో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా అతడి గురించి పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చస్తానని పొలం దగ్గరకు వెళ్లి.. 'నా కొడుకు బిగ్బాస్ షోకి వెళ్లినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్దీప్ నా కొడుకును ఏందిరా.. అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని హేళన చేస్తున్నారు. నాకు అదుంది, ఇదుందని విర్రవీగొద్దు. హౌస్లో అందరూ సమానమే. నా కొడుకు ఒకసారి లవ్ సాంగ్ తీస్తే రూ.7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను నా కొడుకు స్నేహితులు తీసుకుని మోసం చేశారు. అప్పుడు నా కొడుకు చాలా ఏడ్చాడు. ఒకరోజైతే చస్తానని పొలం దగ్గరకు వెళ్లిండు. నీకే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పిన. అప్పుడు ఫోన్ కొనిస్తే రీల్స్ చేసుకుంటానన్నాడు. అదే సంతోషం ఫోన్ కొనిచ్చిన, రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అయిండు. కానీ ఏదో ఒకటి చేయాలని తిండీతిప్పలు లేకుండా తిరిగిండు. బిగ్బాస్కు వెళ్లిండు, నాగార్జున సార్ను కలిశిండు, అదే సంతోషం. ప్రశాంత్కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ, తనకు ముందు సెటిలవ్వాలని ఉంది. సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకుంటా, మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ఇంట్లోకే రానని అన్నాడు. అందుకే ఊరుకున్నాం. బిగ్బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేస్తాం. రతిక మా కొడుకుని వాడుకుంది. ప్రశాంత్తో ఉంటే అతడికొచ్చే ఓట్లు తనకు కూడా వస్తాయని అనుకుంది, వాడుకుంది. అంతే! ప్రశాంత్ అందరినీ అక్కాచెల్లె అనుకుంటూనే మాట్లాడతాడు. తను ఎటువంటి దురాలోచన చేయడు' అని చెప్పుకొచ్చారు. చదవండి: మార్క్ ఆంటోని మూవీ ట్విటర్ రివ్యూ.. విశాల్ హిట్ కొట్టాడా? -
వీళ్లంతా బఫూన్స్.. ఏంది రతిక.. నీ లొల్లి.. హౌస్ మొత్తానికి బీపీ తెప్పించావ్!
బిగ్బాస్ 7లో ఉన్నవారంతా కంటెస్టెంట్లే.. హౌస్మేట్స్గా ప్రమోషన్ పొందాలంటే తను పెట్టే టాస్కులు గెలవాలి, తనను ఇంప్రెస్ చేయాలి.. అప్పుడే ఇంటిసభ్యులవుతారని బిగ్బాస్ మెలిక పెట్టిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఉన్న 14 మందిలో ఆట సందీప్ తొలి ఇంటిసభ్యుడిగా పేరు తెచ్చుకోగా మిగతావారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం హౌస్లో మాయాస్త్ర టాస్క్ నడుస్తోంది. మరి ఈ టాస్కులో ఏం జరిగాయి? హౌస్లో ఏం జరిగింది అనేది తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 9)లో చదివేద్దాం. దొరికేసిన పవరాస్త్ర శుభశ్రీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగో మాయాస్త్రలో ఏ పవర్ అస్త్రను గెలవలేకపోయాం కదా అని సందీప్ మాస్టర్ దగ్గరున్న పవర్ అస్త్రను కొట్టేసింది. పోనీ.. అదైనా జాగ్రత్తగా దాచిందా అంటే అదీ లేదు. కిచెన్లో దాయడం, అప్పటికే సందీప్ మాస్టర్ సహా పలువురు దానికోసం వెతుకులాట మొదలుపెట్టడం, అమర్దీప్ దాన్ని వెతికి మాస్టర్ చేతికివ్వడం జరిగిపోయింది. దీంతో శుభశ్రీ అంత ఈజీగా దొరికిపోయిందేంటి అని బిత్తరముఖం వేసుకుంది. బిగ్బాస్ బంపర్ ఆఫర్ తెల్లారిన తర్వాత బిగ్బాస్ మాయాస్త్ర టాస్క్ను తిరిగి కంటిన్యూ చేశాడు. ఈ మాయాస్త్ర ద్వారా నాలులుగు వారాల ఇమ్యూనిటీతో పాటు ఈ వారం కూడా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. మహాబలి టీం సభ్యులు.. రణధీర సమూహంలో ఎవరైతే పవరాస్త్ర పొందేందుకు అనర్హులో కారణం చెప్పి వారి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని అదే గ్రూప్లోని మరో సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. చివర్లో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ మాయాస్త్ర భాగాలు ఉంటే వారు పవరాస్త్ర కోసం పోటీ పడతారు. మొదటగా శుభశ్రీ వెళ్లి.. శోభా శెట్టి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని ప్రిన్స్ యావర్కు ఇచ్చింది. మూడు చెరువుల నీళ్లు తాగించిన రతిక పల్లవి ప్రశాంత్.. అమర్ దగ్గరున్నది తీసి శివాజీకి ఇచ్చాడు. తర్వాత మొదలైంది అసలు రచ్చ.. నెక్స్ట్ రతిక వెళ్లాలని మహాబలి టీం ఫిక్స్ చేసింది. లేదు, నేను చివర్లోనే వెళ్తానని తెగేసి చెప్పింది రతిక. లేదు, నేనే చివర్లో వెళ్తానని టేస్టీ తేజ, గౌతమ్లు వాదించారు. తనకు ఎంత సర్ది చెప్పాలని చూసినా వినిపించుకోలేదు. శివాజీని గెలిపించాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిన రతిక అందుకోసం తన టీమ్మేట్స్ మీద అరిచి గోల చేసింది. దామినితో అయితే మాటల పోట్లాటకు దిగింది. మనకంటే ఆ టీమ్ బెస్ట్ అని రతిక అనడంతో ఆ టీమ్లోకే వెళ్లు అని చెప్పింది దామిని. అసలు నువ్వు ఎవరు? ఆ టీమ్లోకి వెళ్లు, ఈ టీమ్లోకి వెళ్లు అని చెప్పడానికి అని మరింత రెచ్చిపోయింది రతిక. ఛీఛీ.. వీళ్లంతా జోకర్స్.. బఫూన్స్ టీఆర్పీ కోసమే కదా రెచ్చిపోతున్నావ్ అని ఉన్నమాట అనేసింది సింగర్. కానీ తర్వాత మాత్రం తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయింది. దీనికి బుర్ర లేదు, బుద్ధి లేదు, రెస్పెక్ట్ లేదు.. ప్రతీది టీఆర్పీ కోసమే చేస్తుంది అని ఏడ్చేసింది. ఏదేమైనా రతిక మాత్రం వెనక్కు తగ్గలేదు. చివర్లోనే వెళ్తానని డిసైడ్ అయింది. ఈ సమస్యను తేల్చేందుకు మూడో స్థానంలో ఎవరు వెళ్లాలని ఓటింగ్ పెట్టారు. అందరూ రతిక వెళ్లాలని చేతులు ఎత్తారు. దీంతో ఆమె ఛీఛీ.. వీళ్లంతా జోకర్స్లా ఉన్నారు, ఈ టీమ్లో ఉండటానికే చెండాలంగా ఉంది. వీళ్లంతా బఫూన్స్ అంటూ నోటికొచ్చింది వాగింది. ఒకసారి ఫస్ట్ వెళ్తానంటది, సెకండ్ అంటది, ఫోర్త్, లాస్ట్.. అంటుంది. ఈమెకే క్లారిటీ లేదు. మళ్లీ నోరు జారుతుంది అని సీరియస్ అయ్యాడు డాక్టర్ బాబు గౌతమ్. సందీప్ మాస్టర్కు బీపీ తెప్పించిన రతిక మధ్యలో కలగజేసుకున్న సంచాలక్ సందీప్.. రెండు రోజులుగా ఆ టీమ్లో ఉన్నావ్.. ఇప్పుడు వాళ్లను బఫూన్స్ అంటున్నావ్.. కరెక్ట్ కాదు అని చెప్పాడు. రతిక పాప వింటే కదా.. వాళ్లు అలాగే ప్రవర్తిస్తున్నారు.. ఏమనాలి మరి? అని తిరిగి ప్రశ్నించింది. టీమ్ మెంబర్స్ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సంచాలకుడైన సందీప్ మాస్టర్ మూడో స్థానంలో రతికను రమ్మని ఆదేశించాడు. అబ్బే.. నేను మోనార్క్ను, ఎవరి మాటా వినను అన్న స్టైల్లో తను రానని తెగేసి చెప్పింది. దీంతో సందీప్ మాస్టర్కు సైతం బీపీ వచ్చి ఆవేశపడ్డాడు. ఎవరేమనుకున్నా, ఎన్ని గంటలు సాగదీసినా సరే ఐ డోంట్ కేర్ అని లైట్ తీసుకుంది రతిక పాప. ఇచ్చిపడేసిన బిగ్బాస్ ఇదంతా చూసిన షకీల అమ్మ.. రేయ్, ఆమె కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.. ఇవ్వనివ్వండి అని అనుభవంతో మాట్లాడింది. ఇలాగైతే టాస్క్ ముందుకు వెళ్లేలా లేదని దామిని మూడో స్థానంలో వెళ్లింది. ప్రియాంక దగ్గరున్న మాయాస్త్రను షకీలాకు ఇచ్చింది. కనీసం నాలుగో స్థానంలో అయినా వెళ్లమని బతిమాలినా రతిక వినలేదు. దీంతో బిగ్బాస్ కలుగజేసుకున్నాడు. మహాబలి టీమ్కు సరిపడ సమయం ఇచ్చినా టాస్క్ పూర్తి చేయనందున ఎవరు నాలుగు, ఐదారు స్థానాల్లో రావాలో రణధీర టీమ్ నిర్ణయించాలని మెలిక పెట్టాడు. అంతేకాదు, అప్పటివరకు మాయాస్త్ర భాగాలను పొందినవారికి మాత్రమే మిగిలిన భాగాలు ఇవ్వాలని కండీషన్ పెట్టాడు. ఆటలో అరటిపండుగా మారిన సీరియల్ బ్యాచ్ ఈ నిర్ణయంతో ఆట సందీప్.. రతికను చూస్తూ చప్పట్లు కొట్టాడు. కానీ ఈ నిర్ణయంతో మాయాస్త్ర భాగాలు కోల్పోయిన అమర్, ప్రియాంక, శోభా శెట్టి ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మూడు రోజుల కష్టమంతా వృథా అయిందని ఆవేదన చెందాడు అమర్దీప్. వాష్రూమ్లోకి వెళ్లి.. మీ ఈగో వల్ల మా గేమ్ పోయింది అంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఏడ్చేశాడు. దీంతో ప్రియాంక, శోభా అతడిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి రతి పాప పంతం వల్ల సీరియల్ బ్యాచ్ ఆటలోనే లేకుండా పోయింది. చదవండి: సంచలనాలకు కేరాఫ్గా బిగ్ బాస్ సీజన్-7..! -
'బిగ్బాస్' ఆడుకున్నాడు.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!
'బిగ్బాస్' రెండో వారం నామినేషన్స్ హడావుడి సైడ్ అయిపోయింది. ఒకరిని ఒకరు కొట్టుకుంటారా అనేంతలా గొడవపడ్డ కంటెస్టెంట్స్ కాస్త.. ఇప్పుడు దాని గురించే మర్చిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే 'మాయ అస్త్ర' అని 'బిగ్బాస్' ఓ పోటీ పెట్టారు. మంగళవారం సగం ఆట కాగా, బుధవారం మిగతాది పూర్తి చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ పిల్లిమొగ్గలు వేశారు. ఓవరాల్గా ఏం జరిగిందనేది Day-10 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. దొంగతనం ప్లాన్ 'మాయ అస్త్ర' టాస్కులో భాగంగా మంగళవారం పెట్టిన 'పుల్ రాజా పుల్' గేమ్లో రణధీర సమూహం (శివాజీ, అమర్దీప్, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకీలా) గెలిచారు. దీంతో వీళ్లకి ఓ తాళం చెవిని 'బిగ్బాస్' ఇచ్చాడు. అక్కడితో మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. దాన్ని దొంగతనం చేయాలని మహాబలి టీమ్ ప్లాన్ వేయడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. తాళం సంపాదించమని చెప్పారు గానీ దొంగతనం చేయొద్దని చెప్పలేదుగా అని తేజ తొలుత డౌట్ పడ్డాడు. దీంతో తాళం చెవి కొట్టేద్దామని గౌతమ్ అన్నాడు. (ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!) తాళం కోసం తిప్పలు అప్పటికే రాత్రి అయిపోవడంతో అందరూ నిద్రపోవడానికి ఉపక్రమించారు. మహాబలి (రతిక, శుభశ్రీ, గౌతమ్, తేజ, దామిని, ప్రశాంత్) మాత్రం.. రణధీర గ్రూప్ దగ్గరున్న తాళాన్ని ఎలాగైనా కొట్టేయాలని రాత్రంతా నిద్రపోకుండా తెగ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిద్రపోయినట్లు నటిస్తున్న శుభశ్రీ దగ్గరకొచ్చిన శివాజీ.. 'ఏం యాక్టింగ్ చేస్తున్నావ్' అని అన్నాడు. ఇది జరిగిన తర్వాత దామిని-రతిక-శుభశ్రీ రాత్రంతా తాళం కోసం జాగరం చేశారు. తాళం కోసం మరో గేమ్ ఇప్పుడు 'బిగ్బాస్' మలుపులో గెలుపు అని రెండు గ్రూపులకు మధ్య మరో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా సంచాలకుడు సందీప్ ఓ చక్రంలో ఉన్న పుల్లని తిప్పుతాడు. అది ఏ రంగు అయితే వచ్చి ఆగుతుందో.. పోటీపడే కంటెస్టెంట్స్.. తమ ఎదురుగా బల్లపై ఉన్న సర్కిల్స్లో ఆ కలర్పై చేతులు లేదా కాలు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే ముందు తప్పు చేస్తారో వాళ్లు ఓడినట్లు. తొలుత గౌతమ్పై ప్రియాంక విజయం సాధించింది. ఆ తర్వాత శోభాపై ప్రశాంత్, రతికపై ప్రిన్స్ గెలిచారు. అలా తొలి గేమ్లో విజయం సాధించిన రణధీర్ టీమ్.. మళ్లీ రెండు పాయింట్లతో ఈ పోటీలోనూ గెలిచింది. (ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు) పవర్ అస్త్ర కొట్టేశారు ఇక తాళాలు దొంగిలించలేకపోయిన మహాబలి టీమ్ సభ్యులు.. సందీప్ గెలుచుకున్న 'పవర్ అస్త్ర' దొంగిలించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చిన్న చమక్కు విసిరిన దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరోవైపు తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నందుకు ప్రిన్స్కు 'బిగ్బాస్' పనిష్మెంట్ ఇచ్చాడు. లాన్ ఏరియాలో 'ఇంట్లో ఉన్నంతకాలం తెలుగులోనే మాట్లాడుతాను' అనే పేరా మళ్లీమళ్లీ చాలాసేపు చదువుతూనే ఉన్నాడు. చదువుతుంటే ప్రిన్స్ దగ్గరే తాళం ఉందనే విషయం తెలిసి, అతడిని మహాబలి టీమ్ తెగ ఇబ్బంది పెట్టారు. 'మాయ అస్త్ర' సొంతం ఇక పెట్టిన రెండు పోటీల్లోనూ విజేతలుగా నిలిచిన రణధీర్ సమూహానికి బిగ్బాస్ 'మాయ అస్త్ర' ఇచ్చాడు. అందులో ఆరు భాగాల్ని గ్రూపులో ఉన్న ఆరుగురు పంచుకున్నారు. వీళ్లందరూ కూడా 'పవర్ అస్త్ర' పోటీలో ఉంటారని బిగ్బాస్ గుర్తు చేశాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. మరి గురువారం ఏ టాస్క్ ఇస్తాడో ఎలా ఉండబోతుందనేది చూడాలి. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) -
హౌస్ అంతా ఓన్లీ గొడవలే..నామినేషన్స్లో ఆ తొమ్మిది మంది
బిగ్బాస్ హౌసులో నామినేషన్స్ సందర్భంగా సోమవారం ఫుల్ రచ్చ కొనసాగింది. మొత్తం గొడవ గొడవ జరిగింది. అలానే నామినేషన్స్ ప్రక్రియ.. మంగళవారం కూడా కొనసాగింది. ఈరోజు కూడా గొడవలు మాములుగా జరగలేదు. అలానే 'పవర్ అస్త్ర' కోసం మరో గేమ్ కూడా ఆడారు. దీంతోపాటే ఎనిమిదో రోజు ఎపిసోడ్ లో ఏమేం జరిగాయనేది Day-8 హైలైట్స్ చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'కి డబ్బింగ్ చెప్పే ఈయన ఎవరో తెలుసా?) ప్రశాంత్ ఓవరాక్షన్ పల్లవి ప్రశాంత్ నామినేషన్ మధ్యలో ఉండగానే సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మంగళవారం అక్కడే నుంచి మొదలైంది. తొలుత తేజ, గౌతమ్, దామిని, అమర్దీప్, ప్రియాంక, షకీలా నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఓవరాక్షన్ నచ్చ.. శోభాశెట్టి, రతిక, శుభశ్రీ కూడా వచ్చారు. ఒరిజినాలిటీ ఎక్కడా కనిపించట్లేదని శోభాశెట్టి.. ప్రశాంత్కి కౌంటర్ వేసింది. నిజం బయటపెట్టాడు ఇకపోతే అందరూ తనని నామినేట్ చేసేసరికి ప్రశాంత్.. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆట ఇప్పుడే మొదలైంది, బయట మా వాళ్లు ఉన్నారు. చూసుకుంటారు అని తన అసలు రంగు బయటపెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రతిఒక్కరూ ఇంట్లోకి వచ్చేటప్పుడు సెటప్ చేసుకుని వస్తారు కానీ ప్రశాంత్ ఇలా చెప్పడం కాస్త ఓవర్గా అనిపించింది. (ఇదీ చదవండి: చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత కన్నుమూత) మనసు విరిచిన రతిక ఇక ప్రశాంత్ ని నామినేట్ చేసిన రతిక.. అవకాశం వచ్చేవరకు ఓ ప్రశాంత్, వచ్చిన తర్వాత మరో ప్రశాంత్ కనిపిస్తున్నాడని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. దీంతో మనోడు సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ గెలిస్తే డబ్బులు ఏం తీసుకోకుండా ఉండగలవా అంటే.. అవును అస్సలు తీసుకోను అని ప్రశాంత్ చెప్పాడు. ఇదెక్కడి దిక్కుమాలిన గొడవరా బాబు అనిపించింది. మరోవైపు నామినేషన్లో భాగంగా 'లవ్ చేస్తున్నానా అని నీతో చెప్పానా?' అని రతికతో ప్రశాంత్ అనడం ఆమెకు నచ్చలేదు. దీంతో ప్రశాంత్ అసలు రూపం బయటపడిందని ఆమె చెప్పుకొచ్చింది. శోభాశెట్టి vs శివాజీ తర్వాత గౌతమ్ బాక్సులోకి రాగా.. ప్రశాంత్ నామినేట్ చేశాడు. అనంతరం శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. 'ప్రియాంక చెప్పిన రీజన్ నువ్వు కూడా చెప్పావ్, నన్ను నామినేట్ చేశావ్ అందుకే నామినేట్ చేస్తున్నా' అని అన్నాడు. యాక్టివిటీ రూంలో వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు గానీ బయటకొచ్చిన తర్వాత శివాజీ, శోభాశెట్టి మాటామాటా అనుకున్నారు. మాట తెరిస్తే కంటెంట్, కంటెంట్ అంటున్నారు మీరు అని శోభాశెట్టి అతడికి కౌంటర్ వేసింది. ఇంప్రెస్ టాస్కులో ఓడిపోయానని బిగ్బాస్ నాకు చెప్పలేదు కదా.. నా దగ్గరకు వచ్చి మీరు ఇబ్బంది పెట్టారు కదా అని శివాజీకి శోభాశెట్టి కౌంటర్ వేసింది. రీజన్ లేకపోయినా సరే కావాలని నామినేట్ చేస్తున్నారని మండిపడింది. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!) తేజతో రతికకి ఇష్యూ ఇకపోతే షకీలాని ప్రిన్స్ నామినేట్ చేశాడు. శుభశ్రీ, ప్రియాంకని ఎవరూ నామినేట్ చేయలేదు. తర్వాత రతిక రాగా.. ఆమెని గౌతమ్, తేజ నామినేట్ చేశారు. వీఐబీ బెడ్ రూంలో గొడవపడి, అదే బెడ్పై పడుకోవడం నచ్చలేదని గౌతమ్ రీజన్ చెప్పాడు. తనని బొండం అని పిలవడం నచ్చలేదని తేజ కారణం చెప్పాడు. మరి తనని చెంపపై కొట్టడం కరెక్ట్ కాదు కదా అని రతిక వాదించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య రచ్చ రచ్చ జరిగింది. మరోవైపు రతికని నామినేట్ చేస్తూ.. ప్రశాంత్ని తేజ టీజ్ చేశాడు. దీంతో తాను ప్రేక్షకుడిని, తనని వదిలేయ్ అన్న అని తేజతో ప్రశాంత్ అన్నాడు. రూల్స్ బ్రేక్ చేసిన శివాజీ ఇకపోతే అమర్దీప్ని ప్రిన్స్ నామినేట్ చేశాడు. అయితే హౌసులో ప్రతిఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండగా, శివాజీ ఒక్కరినే చేశాడు. ఈ విషయమై బిగ్బాస్ అడగ్గా శివాజీ తొలుత చేయనని అన్నాడు. కానీ రెట్టించి అడిగేసరికి అమర్దీప్ నామినేట్ చేశాడు. అయితే ఇక్కడ కావాలనే సింపతీ కొట్టేద్దామనే శివాజీ ఇలా ప్రవర్తిస్తున్నట్లు అనిపించింది. (ఇదీ చదవండి: కోర్టులో గెలిచిన విశాల్.. చెప్పిన టైమ్కే 'మార్క్ ఆంటోని') ఈ వారం నామినేషన్స్ లిస్ట్ శివాజీ ప్రశాంత్ రతిక తేజ అమర్ దీప్ షకీలా గౌతమ్ శోభా ప్రిన్స్ రూమ్ షేరింగ్ వీఐపీ రూంలో సందీప్ మాత్రమే ఉండాలని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. అలానే డీలక్స్, స్టాండర్డ్ రూమ్స్లో ఎవరెవరు ఉండాలనేది డిసైడ్ చేయాల్సిందిగా సందీప్ని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో డీలక్స్ రూంని షకీలా, శివాజీ, దామిని, శుభశ్రీ, అమర్దీప్కి కేటాయించారు. స్టాండర్స్ రూంని రతిక, ప్రిన్స్, ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, ప్రియాంకకు కేటాయించారు. మిగిలిన తేజని బయట సోఫాలో పడుకోమని చెప్పారు. అయితే శుభశ్రీకి డీలక్స్ రూం ఎందుకిచ్చారని.. శోభాశెట్టి, సందీప్తో గొడవ పెట్టుకుంది. పవర్ అస్త్ర కోసం పోటీ ఇప్పటికే పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ ఇంటి సభ్యుడి అయిపోయాడు. మిగతా వాళ్లు అది గెలుచుకోవాలంటే గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. 'మాయ అస్త్ర' పేరుతో ఓ టాస్క్ పెట్టాడు. 'టగ్ ఆఫ్ వార్' గేమ్ లాంటిది పెట్టగా, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించిన హౌస్మేట్స్.. రణధీర సమూహం (అమర్దీప్, శివాజీ, ప్రిన్స్, ప్రియాంక, శోభా, షకీలా), మహాబలి(గౌతమ్, ప్రశాంత్, తేజ, రతిక,దామిని, శుభశ్రీ) గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇందులో రణధీర టీమ్.. మూడు పాయింట్లు గెలుచుకుని విజయం సాధించింది. దీంతో 'పవర్ అస్త్ర' సంపాదించేందుకు కావాల్సిన తాళాన్ని రణధీర సమూహం దక్కించుకుంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
బిగ్బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ
బిగ్బాస్ హౌస్మేట్స్కు ఓ విషయం అర్థమైంది. ఇక మెతకగా ఉంటే పని అవ్వదని, అందరి కంట్లో పడాలంటే ఏదో ఒకటి చేసేయాలని తెలిసొచ్చింది. అసలే వీకెండ్లో నాగ్ కొందరు కంటెస్టెంట్లు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారని గాలి తీసేశాడు. ఇంకేముంది, నామినేషన్స్లో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. బిగ్బాస్కే బాస్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న శివాజీని, పదేపదే రైతుబిడ్డ అని చెప్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ సింపథీ కోరుకుంటున్న పల్లవి ప్రశాంత్ను ఉతికారేశారు. ముందు ఎదుటివారిని మాట్లాడనివ్వమని ప్రియాంక శివాజీకి గట్టిగానే కౌంటరిచ్చింది. అది తప్పా? అనంతరం హౌస్లో చాలామంది ప్రశాంత్ను వరుసపెట్టి నామినేట్ చేశారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నాయనా, నాకు నువ్వు నాకు కనిపించడం లేదని షకీలా మొదట ప్రశాంత్ను నామినేట్ చేసినట్లు చూపించారు. ఇక గౌతమ్ కృష్ణ.. తనను నామినేట్ చేస్తూ కారణం చెప్తుండగా అతడిని మధ్యలోనే అడ్డుకున్నాడు ప్రశాంత్. నేను చేసే పని గర్వంగా చెప్పుకున్నా, అది తప్పా? అని నిలదీశాడు. గౌతమ్ను మాట్లాడనివ్వకపోవడంతో.. ఫస్ట్ మొత్తం విన్నాక మాట్లాడు అని ప్రశాంత్పై ఫైర్ అయింది ప్రియాంక. అదిరే ఆన్సర్ ఇచ్చిన ఆట సందీప్ ఇక అమర్దీప్ అయితే రైతుబిడ్డ అనే క్యాసెట్ వినలేక తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రతిసారి రైతుబిడ్డ అనే సెంటిమెంటల్ డైలాగ్ వాడకురా అని హెచ్చరించాడు. సీరియల్లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చెప్పకు అని ఎదురుతిరిగాడు ప్రశాంత్. ఇంతలో ఆట సందీప్ కలగజేసుకుంటూ భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరూ రైతుబిడ్డే.. మా తాతలు కూడా రైతుబిడ్డేరా అని చెప్పాడు. కుక్కలా తిరిగినా అందరూ ఒకేసారి తనను వరుసపెట్టి వాయించడంతో ఏడ్చేశాడు ప్రశాంత్. ఆరో సీజన్ సమయంలో ఇదే స్టూడియో ముందు కుక్కలాగా తిరిగానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే రతిక రంగంలోకి దిగుతూ.. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నవ్? అని పాయింట్ లాగింది. ఆమె దగ్గరి నుంచి అటువంటి ప్రశ్న ఊహించని ప్రశాంత్ దెబ్బకు సైలైంట్ అయిపోయాడు. ఈ ప్రోమో మాత్రం ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. చదవండి: Kiran Rathod: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా? -
బిగ్బాస్7: టాప్ లేపిన రతిక.. 'పవర్ అస్త్ర' గెలిచిన ఆ ఒక్కరు
'బిగ్బాస్'లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వచ్చేసరికి మాత్రం అంతా కలర్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్.. వారం రోజుల పాటు చేసిన సంగతుల్ని స్టేజీపై మరోసారి డిస్కస్ చేస్తాడు. ఇందులో భాగంగా మెచ్చుకుంటాడు. అవసరమైతే అక్కడే కడిగి పారేస్తాడు. అలా ఈ శనివారం.. ఏం జరిగింది? ఆరో రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) రతికకి ప్రపోజ్ ఇకపోతే 'జవాన్' పాటతో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. వచ్చీ రాగానే శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్పై చూపించారు. అలా లాన్ లో కూర్చుని మాట్లాడుతున్న క్రమంలో.. సందీప్, అమర్దీప్ కచ్చితంగా టాప్-5లో ఉంటారని షకీలా జోస్యం చెప్పింది. మరోవైపు ప్రశాంత్.. రతికతో తెగ పులిహోర కలిపేశాడు. బ్రేకప్ హార్ట్ ని చేతిలో పట్టుకుని, మోకాలిపై కూర్చుని రతికకు ప్రపోజ్ చేస్తున్న పోజు పెట్టాడు. మరోవైపు రతిక భోజనం చేస్తుంటే.. ఆమెకు దగ్గరకెళ్లి తినిపించమని మారం చేశాడు. ఇదంతా ఫన్నీగా సాగింది. శోభాకి పనిష్మెంట్ ఇకపోతే శుక్రవారం ఎపిసోడ్లోనే ప్రిన్స్.. శుభశ్రీతో మాట్లాడుతూ యూజ్లెస్ అనే పదం ఉపయోగించాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. శనివారం ఎపిసోడ్లో నాగ్ ఈ గొడవ గురించి మాట్లాడుతూ.. ప్రిన్స్కి క్లాస్ పీకాడు. మరోవైపు అప్పుడప్పుడు ఏడుస్తున్న శోభాకి చిన్న వార్నింగ్ ఇచ్చాడు.ప్రేక్షకులకు ఇదంతా నచ్చదని, టాప్-5లో ఉంచరని అన్నాడు. అలానే.. హౌసులోకి వెళ్లేటప్పుడు ఇచ్చిన టాస్కులో (టేస్టీ తేజ ఈమెని హాట్ అన్నాడు) ఫెయిలైనందుకు వారం రోజులు వాష్రూమ్ క్లీన్ చేయాలని.. నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్బాస్ 7'.. కారణం అదే?) టాప్లో రతిక ఇకపోతే వీకెండ్ లో వచ్చిన నాగార్జున పై విషయాల్ని ముచ్చటిస్తూ.. 'ఫ్యాన్స్ పల్స్' అనేది ఉందని, దీని ద్వారా బయట ఉండే అభిమానులు తమ గురించి ఏమనుకుంటున్నారు? ఎన్ని మార్కులు వేశారు అనేది చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మొదటి స్థానంలో 80 మార్కులతో రతిక నిలిచింది. ఆమెకు అత్యధికంగా 80 మార్కులు వచ్చాయి. యాక్టివిటీ రూంలో రతిక ఉన్నప్పుడు.. దాదాపు రెండున్నర గంటలపాటు్టఉడత ఉడత ఊచ్' అనే పాట లూప్ లో ప్లే చేశారని, మొత్తం ఉడత అనే పదం ఎన్నిసార్లు ఉందని అడగ్గా.. 1056 సార్లు అని చెప్పిన రతిక గ్రేట్ అని నాగ్ మెచ్చుకున్నాడు. ఫ్యాన్స్ పల్స్ (కంటెస్టెంట్స్ వేసుకున్న మార్కులు) ప్రియాంక - 71 (100 మార్కులు) శివాజీ - 74 (90 మార్కులు) దామిని - 62 (95 మార్కులు) ప్రిన్స్ - 69 (94 మార్కులు) షకీలా - 69 (85 మార్కులు) సందీప్ - 72 (90 మార్కులు) శోభాశెట్టి - 76 (93 మార్కులు) టేస్టీ తేజ - 77 (100 మార్కులు) రతిక - 80 (90 మార్కులు) గౌతమ్ - 60 (100 మార్కులు) కిరణ్ రాథోడ్ - 50 (100 మార్కులు) ప్రశాంత్ - 74 (78 మార్కులు) శుభశ్రీ - 65 (98 మార్కులు) అమర్దీప్ - 60 (97 మార్కులు) 'పవర్ అస్త్ర' గెలిచిన సందీప్ షో ప్రారంభమైన రోజే చెప్పినట్లు 'పవర్ అస్త్ర' సాధిస్తేనే హౌస్మేట్గా కన్ఫర్మ్ అవుతారని నాగ్ చెప్పాడు. అలానే పలు టాస్కులు పెట్టగా వాటిలో గెలిచిన ప్రియాంక జైన, ఆట సందీప్.. ఫైనల్ గేమ్ వరకు వచ్చారు. వీళ్లిద్దరి మధ్య అటు ఇటు ఊగే బెంచిపై పరుగెత్తుతూ బుట్టలో బాల్ వేయాలనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా సందీప్ మాస్టర్ 53 బంతుల్ని బుట్టలో వేయగా, ప్రియాంక 34 బంతులు వేసింది. తద్వారా ఫస్ట్ విన్నర్గా నిలిచిన సందీప్.. పవర్ అస్త్ర గెలుచుకుని 'బిగ్బాస్ 7' తొలి హౌస్మేట్ అయిపోయాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఆదివారం.. ఎలిమినేషన్ అనేది ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!) -
రతిక-రాహుల్ సిప్లిగంజ్ బ్రేకప్ అవ్వడానికి కారణమిదే..
-
'బిగ్బాస్ 7'లో టాస్క్ అని రచ్చ.. చివరకొచ్చేసరికి!?
'బిగ్బాస్ 7' తెలుగు షో మెల్లమెల్లగా పికప్ అవుతున్నట్లు కనిపిస్తుంది. తొలుత ఒకటి రెండు రోజులు సరదాగా కనిపించిన హౌస్ కాస్త.. ఇప్పుడు గొడవలతో హీటెక్కిపోతోంది. తాజాగా ఓ టాస్క్లో భాగంగా మరీ అంత కాకపోయినా బాగానే అందరూ గొడవలు పడ్డారు. కానీ చివరకు వచ్చేసరికి బిగ్బాస్ ఉసూరుమనిపించారు. ఇది విచిత్రంగా అనిపించింది. ఇంతకీ బిగ్బాస్ హౌసులో ఐదు రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? హీరోయిన్గా తెలుగులో ఒకే సినిమా!) టాస్క్లో దామిని ఫెయిల్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే.. దామిని, కిరణ్ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్బాస్ వాళ్లకి ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్ల తలపై గుడ్లు పగలగొట్టి దానితో ఆమ్లెట్ వేసి, తనకు ఇవ్వాలని అన్నారు. ఇందులో భాగంగా కిరణ్ రాథోడ్ సక్సెస్ కాగా, దామిని మాత్రం బిగ్బాస్ని మెప్పించలేకపోయింది. ఈ టాస్క్ నుంచి తప్పించుకునేందుకు రతిక, శివాజీ చాలా బాత్రూంలో దాక్కుని ఉండిపోయారు. అంతా అయిపోయిన తర్వాత బిగ్బాస్ పిలిస్తే తప్ప వాళ్లు బయటకు రాలేదు. రతిక-శివాజీ విన్నర్స్ మరోవైపు 'ఇంప్రెస్ ద బిగ్బాస్' టాస్కులో రతిక, శివాజీ విజేతలుగా నిలిచారని స్వయంగా బిగ్బాస్ ప్రకటించాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే రతిక.. ఏం పనిచేయకపోయినా తనని బిగ్బాస్ ఎందుకు పొగుడుతున్నాడోనని షకీలా.. తోటి కంటెస్టెంట్స్కి చెప్పింది. మరోవైపు పల్లవి ప్రశాంత్.. తనకు అన్నలా(బ్రదర్) అనిపిస్తున్నాడని అతడితోనే చెప్పింది. (ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో) షకీలాకు ఎటాక్ తేజని భయపెట్టాలని ఫిక్స్ అయిన షకీలా.. తనకు పానిక్ ఎటాక్ వచ్చినట్లు నటించింది. దీంతో అందరూ ఆమెకు ఏమైంది ఏమైందని కంగారుపడ్డారు. ఆమె నిద్రపోతున్న సమయంలో పక్కనే ఉన్న తేజ.. ఒక్కసారిగా షకీలా ఉలిక్కిపడి లేచేసరికి గజగజా వణికిపోయాడు. తర్వాత తీరిగ్గా ఊరికనే.. తేజని భయపెట్టడానికే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. ఇకపోతే పల్లవి ప్రశాంత్.. వ్యక్తిగా తనకి నచ్చుతాడు తప్ప ఫీలింగ్స్ ఏం లేవని రతిక క్లారిటీ ఇచ్చేసింది. శుభశ్రీతో మాట్లాడుతూ ఇవన్నీ బయటపెట్టింది. గెలిచినట్లే గెలిచి ఇకపోతే 'ఫేస్ ద బీస్ట్' టాస్కులో గెలిచిన ప్రియాంక, సందీప్తోపాటు 'ఇంప్రెస్ట్ ద బిగ్బాస్' టాస్కులో గెలిచిన రతిక, శివాజీ.. పవర్ అస్త్ర కోసం పోటీపడ్డారు. అయితే ఈ నలుగురిలో ఎవరికీ అర్హత లేదో చెప్పమని.. మిగతా 10 మంది కంటెస్టెంట్స్ కి ఆర్డర్ వేశాడు. దీంతో రతికని.. శుభశ్రీ, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, శోభాశెట్టి, తేజ నామినేట్ చేశారు. శివాజీని అమర్దీప్, గౌతమ్ నామినేట్ చేశారు. ప్రియాంకని ప్రశాంత్, సందీప్ని ప్రిన్స్ నామినేట్ చేశారు. టార్గెట్ రతిక దీంతో ఎలా అయితే 'పవర్ అస్త్ర' పోటీలోకి రతిక, శివాజీ వచ్చారో.. అలానే కంటెస్టెంట్స్ నామినేట్ చేయడంతో సైడ్ అయిపోయారు. అంతా చూస్తుంటే.. రతికని హౌసులో అందరూ టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా ఈమెకి ఇది ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది కూడా. అలా ఐదో రోజు ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?) -
హౌసులో కొత్త గొడవలు.. లవ్బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?
'బిగ్బాస్ 7' సీజన్ మొదలవడానికి ముందు హోస్ట్ నాగార్జున.. ఈసారి అలా కాదు ఇలా, ఇలా కాదు అని ఏదేదో చెప్పారు. 'ఉల్టా పల్టా' ఉండబోతుందన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే.. సేమ్ రొటీన్ స్టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు లవర్స్ మధ్య సమస్యలు, మరోవైపు కొత్త గొడవలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? లవర్స్- మనస్పర్థలు బిగ్బాస్లో ఏ సీజన్ తీసుకున్నా సరే.. దాన్ని ప్రేమ అనొచ్చే లేదో తెలీదు గానీ కొందరైతే జంటలు అవుతుంటారు. అలా ఈ సీజన్ లో డాక్టర్-లాయర్ జంట ఒకటి ఉంది. అదే గౌతమ్-శుభశ్రీ జోడీ. వచ్చిన తొలిరోజు నుంచి కలిసి కనిపిస్తూ వచ్చారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయేమో అనిపిస్తుంది. తేజతో శుభశ్రీ డ్యాన్స్ చేస్తుండగా.. గౌతమ్ కాస్త డల్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా స్పర్థలు వచ్చినట్లు హింట్ ఇచ్చేస్తోంది. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') రతిక వార్నింగ్ ఇమ్యూనిటీ టాస్క్లో సందీప్, ప్రియాంక జైన్ గెలిచారు. మరోవైపు బిగ్బాస్ని ఇంప్రెస్ చేసిన శివాజీ, రతిక కూడా ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. వీళ్ల నలుగురిలో ఎవరికి అర్హత లేదో చెప్పమని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో పలువురు రతిక పేరు చెప్పారు. ఈ క్రమంలోనే దామిని, రతిక మధ్య గొడవ జరిగింది. నోరు అదుపులో పెట్టుకో అని దామినికి రతిక వార్నింగ్ ఇచ్చింది. టార్గెట్ ఆమెనే అయితే ప్రస్తుతం హౌసులో పరిస్థితి అంతా చూస్తుంటే దాదాపు చాలామంది రతికనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఓ విధంగా ఆమెకు ప్లస్ కావొచ్చు కూడా. కానీ ఎవరికీ అది అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. మరోవైపు సింక్లో ప్లేట్లు కడగకుండా పెట్టేస్తున్నారని ప్రియాంక గట్టిగా అరిచింది. దీనిపై దామిని రియాక్ట్ కాగా.. అప్పుడు ప్రియాంక-దామిని మాటమాట అనుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్హిట్ సినిమా.. కానీ?) -
రతిక మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్.. బ్రేకప్కు కారణమిదే!
రతిక రోస్.. హౌస్లో చలాకీగా కనిపిస్తున్న ఈ బ్యూటీ గుండెలో ఎంతో బాధను మోస్తోందని నిన్నటి ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోతుంది. సీజన్ మొదలైన తొలిరోజే తన బ్రేకప్ గురించి ఆరా తీశాడు నాగ్. హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చావా? అని అడిగితే హా అంటూ నవ్వుతూనే 'చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగుతున్నారో?' అని నాగ్నే నిలదీసింది. మధ్యలో నేనేం చేశానని నాగ్ అంటే.. 'మొత్తం మీరే చేశారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు హార్ట్ బ్రేక్ అయింది కదా, ఎలా ఉందని అడుగుతున్నారు' అంది. అప్పుడు పునర్నవి కోసం.. ఇప్పుడు రతిక కోసం.. సరే, నేనేం చేశానో చెప్పు అని అడిగితే మాత్రం హౌస్లోకి వెళ్లాక తెలుస్తుందని మాట దాటవేసింది రతిక రోస్. సరే, నీ హార్ట్ బ్రేక్ చేసినవాడిని ఇమిటేట్ చేయు అని అడిగితే.. ఇప్పుడు పాట పాడాలా? అన్నది. అంటే తన మనసు ముక్కలు చేసిన వ్యక్తి సింగర్ అని అర్థమైంది. నిన్నటి ప్రోమో, ఎపిసోడ్తో ఆ సింగర్ మరెవరో కాదు రాహుల్ సిప్లిగంజ్ అని తేలిపోయింది. పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నూమూయు వేళా.. అనే పాటను ప్రోమోలో వదిలి హింటిచ్చాడు బిగ్బాస్. అప్పుడే పరిచయం, ప్రేమ అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ఈ పాట పాడాడు రాహుల్. ఇప్పుడు రతిక కోసం మరోసారి ఈ పాట ప్లే చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఎపిసోడ్లో మాత్రం ఈ సాంగే వేయలేదు. అయితే రాహుల్-రతికల రిలేషన్ నిజమేనంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రాహుల్ గతంలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. హే పిల్ల ఆల్బమ్ షూటింగ్ సమయంలో రాహుల్, రతికల మధ్య పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. బిగ్బాస్ షో వల్లే బ్రేకప్ అయితే రాహుల్.. బిగ్బాస్కు వెళ్లాక పునర్నవితో లవ్ ట్రాక్ నడపడంతో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చినట్లు కనిపిస్తోంది. చివరకు వీళ్ల బంధం బ్రేకప్తో ముగిసిందట! బిగ్బాస్ మూడో సీజన్లో రాహుల్- పునర్నవిల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చెప్పింది నాగార్జునే! పదేపదే వీరి మధ్య ఏదో ఉందన్నట్లుగా కామెంట్లు చేశాడు. అందుకే ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్లో చేసిందంతా చేసి ఇప్పుడిలా అడుగుతున్నారా? అని ముఖం మీదే అనేసింది. చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా? -
మాజీ బాయ్ఫ్రెండ్ను తల్చుకుని ఏడ్చేసిన రతిక.. పల్లవి ప్రశాంత్ ఫేక్!
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. బిగ్బాస్ టాస్క్ ఇస్తే ఆలస్యం గెలిచి తీరాల్సిందే అన్నంత కసిగా ఆడుతున్నారు. ఐదువారాల ఇమ్యూనిటీ పవర్ ఇస్తానని బిగ్బాస్ ఆశ పెట్టగానే హౌస్హేట్స్ మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు మెప్పించగా మరికొందరు ఓవరాక్షన్ చేశారు. మరోపక్క అల్లరిపిల్లగా కనిపించే రతిక మాజీ ప్రియుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇంతకీ తాజా(సెప్టెంబర్ 7) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో ఓసారి చూసేద్దాం.. లేడీ గెటప్లో ప్రిన్స్ బిగ్బాస్ తనను ఇంప్రెస్ చేసినవారికి ఇమ్యూనిటీ టాస్క్ బరిలో నిలిచే ఛాన్స్ ఇస్తానన్నాడు. దీంతో అమర్దీప్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రలో, రతిక.. బ్రహ్మీ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ప్రిన్స్ యావర్ లేడీ గెటప్ వేసుకుని ఇల్లంతా తిరిగాడు. అయితే శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల అయ్యే పని కాదని తనలో ఉన్న ఫ్రస్టేషన్ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్బాస్ను చెడామడా తిట్టేశాడు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్ మాత్రమే అని బుకాయించాడు. తనకు కాఫీ కావాలని మొన్నటి నుంచే అడుగుతున్నాడు శివాజీ. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరకడంతో యాక్టింగ్ పేరుతో బిగ్బాస్ను నానామాటలు అని, అడ్డొచ్చిన వాళ్లను సైతం తిట్టి తన కోపాన్ని బయటకు కక్కాడు. మెలికలు తిరిగిన రతిక అటు గౌతమ్ను శివాజీ బీపీ చెక్ చేయమని, రతికను స్టెతస్కోప్తో అందరి గుండె ఏం చెప్తుందో చెప్పాలన్నాడు బిగ్బాస్. కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు. ఇతడి అతి భరించలేక ఆఖరికి బిగ్బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కాఫీ ఇచ్చి అతడి నోటికి తాళం పడేలా చేశాడు. మరోవైపు శుభశ్రీ ఏ పిల్లగాడా.. అంటూ పాట పాడుతూ పరికిణీలో స్టెప్పులేసింది. ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్బాస్ రతికను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు? అని అడగ్గా రతిక మెలికలు తిరిగిపోయింది. అమాయకంగా ఉండాలి, సంగీతంపై అవగాహన ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంది. ఏళ్లుగా మిస్ అవుతున్నా ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని బిగ్బాస్ అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుంది. 'మిస్ అవుతున్నావా? అని అడిగితే ఎవరైనా పేరెంట్స్ పేరు చెప్తారు. కానీ వాళ్లు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్ అవుతామా? అంటే అది ఆ వ్యక్తే! మిస్సింగ్ ఫీలింగ్ అనగానే అతడే గుర్తొచ్చాడు. కొన్ని ఏళ్ల నుంచి మిస్ అవుతున్నాను. ఈ టాపిక్ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు. బిగ్బాస్ హౌస్ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను' అని పేర్కొంది. దీనికి బిగ్బాస్ బదులిస్తూ.. ఇప్పటివరకు నువ్వు ఎన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్ అని పాట ప్లే చేశాడు. ప్రశాంత్ ఫేక్.. అనంతరం షకీలాను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి గాసిప్స్ సహా కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు. దీంతో షకీలా మాట్లాడుతూ.. 'ప్రశాంత్ స్ట్రాంగ్, కానీ ఫేక్ అనిపిస్తుంది. రతిక.. ప్రశాంత్ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది. గౌతమ్- శుభ్రీ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్ని బంధాలూ ఫేక్ రిలేషన్సే..' అని పేర్కొంది. టేస్టీ తేజ షో ప్రారంభంలో నాగ్ ఇచ్చిన బ్యాడ్జ్లను తాజా ఎపిసోడ్లో పంచాడు. పెరుగన్నం బ్యాడ్జ్ శుభశ్రీకి ఇచ్చాడు. ఇందుకోసం ఆమె 20 సెకన్లపాటు తేజను ఎత్తుకుంది. మిర్చి బ్యాడ్జ్కు గానూ శోభాశెట్టి తేజతో రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. బర్గర్ బ్యాడ్జ్ను రతికకు ఇచ్చాడు. తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు. డాక్టర్బాబు- మోనితల ట్రాక్ ఇంతలో తేజను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన బిగ్బాస్ ఇంట్లోని గాసిప్స్ గురించి ఆరా తీశాడు. 'శోభాకు కనెక్ట్ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు. డాక్టర్బాబు- మోనితల గురించి హౌస్లోనూ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ను ఫేక్ అని చెప్పలేను, కానీ.. కావాలని కింద కూర్చుంటూ, కింద పడుకున్నాడేమో అనిపిస్తోంది' అని తెలిపాడు. ఈ ఎపిసోడ్లో బిగ్బాస్ తనను ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. చదవండి: ఐ బొమ్మ వార్నింగ్ ఇవ్వడమేంటి?.. వైరలవుతున్న పోస్ట్!