sixers record
-
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో పోలార్డే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్తో టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ (100 సిక్స్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్లు), రోహిత్ శర్మ (88 సిక్స్లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
IND VS AUS 2nd Test: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన నితీశ్ రెడ్డి
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండిన ఓ లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు (భారత్ తరఫున) గతంలో సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 పర్యటనలో సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 6 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో నితీశ్ కుమార్ రెడ్డి సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో నితీశ్ ఇప్పటికే 7 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నితీశ్ ఈ సిరీస్లో మరిన్ని సిక్సర్లు బాదే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు..నితీశ్ కుమార్ రెడ్డి-7 (2024)వీరేంద్ర సెహ్వాగ్-6 (2003)మురళీ విజయ్-6 (2014)సచిన్ టెండూల్కర్-5 (2007)రోహిత్ శర్మ-5 (2014)మయాంక్ అగర్వాల్-5 (2018)రిషబ్ పంత్-5 (2018)ఇదిలా ఉంటే, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత టీ20 జట్టు సారధి సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (టీ20ల్లో) బాదిన బ్యాటర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. స్కై 2022లో 41 ఇన్నింగ్స్ల్లో 85 సిక్సర్లు (టీ20ల్లో) బాదగా.. అభిషేక్ ఈ ఏడాది కేవలం 38 ఇన్నింగ్స్ల్లోనే 87 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానంలో ఉండగా.. స్కై వరుసగా రెండు, మూడు స్థానాల్లో (2023లో 71 సిక్సర్లు) ఉన్నాడు.క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (38 ఇన్నింగ్స్ల్లో 87 సిక్సర్లు, 2024)సూర్యకుమార్ యాదవ్ (41 ఇన్నింగ్స్ల్లో 85 సిక్సర్లు, 2022)సూర్యకుమార్ యాదవ్ (33 ఇన్నింగ్స్ల్లో 71 సిక్సర్లు, 2023)రిషబ్ పంత్ (31 ఇన్నింగ్స్ల్లో 66 సిక్సర్లు, 2018)శ్రేయస్ అయ్యర్ (42 ఇన్నింగ్స్ల్లో 63 సిక్సర్లు, 2019)సంజూ శాంసన్ (32 ఇన్నింగ్స్ల్లో 60 సిక్సర్లు, 2024)సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ పటేల్ (గుజరాత్) రికార్డును సమం చేశాడు. ఉర్విల్ కూడా ఇదే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్లో అర్పిత్ భటేవారా (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. అభిషేక్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 9.3 ఓవరల్లోనే విజయతీరాలకు చేరింది. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసం
అబుదాబీ టీ10 లీగ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో జజాయ్ ఈ ఫీట్ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు. ఈ మ్యాచ్లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్లో బంగ్లా టైగర్స్కు ఇది వరుసగా రెండో విజయం. -
సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్సర్లు.. వీడియో
స్పెయిన్ టీ10 క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. pic.twitter.com/Mpq9PeLddD— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం. -
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ స్కోర్ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్లలో సౌథీ 92 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సెహ్వాగ్ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
1877 నుంచి ఇదే తొలిసారి: అసలైన మజానిచ్చే రికార్డు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా వీరబాదుడును క్రికెట్ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. కాన్పూర్లో పొట్టి ఫార్మాట్ తరహాలో ఒక్కో భారత బ్యాటర్ చెలరేగుతూ ఉంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకు ముందు వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దైన కారణంగా ఉసూరుమన్న ఫ్యాన్స్కు.. రోహిత్ సేన పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చి లెక్క సరిచేసింది.50, 100, 200, 250 పరుగుల రికార్డుటెస్టు ఫార్మాట్లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించి.. ప్రపంచంలో ఈ ఘనతలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 23 పరుగులు చేస్తే.. అతడి జోడీ యశస్వి జైస్వాల్(72) కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.1877 నుంచి ఇదే తొలిసారివిరాట్ కోహ్లి 35 బంతుల్లో 47 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ నలుగురు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో భారత జట్టు ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది.ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. తద్వారా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టెస్టుల్లో 90 సిక్సర్లు నమోదు చేసిన టీమ్గా చరిత్రకెక్కింది.కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ మూడు, యశస్వి జైస్వాల్ రెండు, శుబ్మన్ గిల్ ఒకటి, విరాట్ కోహ్లి ఒకటి,. కేఎల్ రాహుల్ రెండు, ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదారు. ఇక నవంబరులో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. కాబట్టి తన సిక్సర్ల రికార్డును రోహిత్ సేన తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది.టెస్టుల్లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుటీమిండియా- 90 సిక్స్లు(2024లో ఇప్పటి వరకు)ఇంగ్లండ్- 89 సిక్స్లు(2022లో)టీమిండియా- 87 సిక్స్లు(2021లో)న్యూజిలాండ్- 81 సిక్స్లు(2014లో)న్యూజిలాండ్- 71 సిక్స్లు(2013లో).చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్లో భీకర ఫామ్లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్తో మ్యాచ్లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్రైడర్స్తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
ఆల్టైమ్ రికార్డుకు ఏడు సిక్సర్ల దూరంలో ఉన్న రోహిత్
టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. హిట్మ్యాన్ త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే సిరీస్లో మరో ఏడు సిక్సర్లు బాదితే టీమిండియా తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును అధిగమిస్తాడు. వీరూ 103 టెస్ట్ల్లో 90 సిక్సర్లు బాదగా.. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 84 సిక్సర్లు (59 టెస్ట్ల్లో) ఉన్నాయి. టెస్ట్ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరూ, రోహిత్ తర్వాత ధోని (78), సచిన్ (69), రవీంద్ర జడేజా (64) టాప్-5లో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. మూడు ఫార్మాట్ల విషయానికొస్తే.. రోహిత్ ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఉన్నాడు. హిట్మ్యాన్ తన కెరీర్లో 483 మ్యాచ్లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476) టాప్-3లో ఉన్నారు.బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. రెండు టెస్ట్లు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 19 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19, రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 సిరీస్ అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగుతుంది. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్తో రాణించినా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించింది. -
టీమిండియా తరఫున ఎవరికీ సాధ్యం కాలేదు.. అభిషేక్ శర్మ సాధించాడు
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో (7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.𝙃𝙖𝙫𝙤𝙘 𝙞𝙣 𝙃𝙖𝙧𝙖𝙧𝙚 🌪️🏏@IamAbhiSharma4 smashes 100 in 47 balls 🥵💪#SonySportsNetwork #ZIMvIND #TeamIndia pic.twitter.com/hHYlTopD1V— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2024ఇదిలా ఉంటే, రెండో టీ20లో సుడిగాలి శతకంతో (46 బంతుల్లో) విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్ను సాధించాడు. కెరీర్లో కేవలం రెండో టీ20 ఆడుతున్న అభిషేక్.. సెంచరీ మార్కును హ్యాట్రిక్ సిక్సర్లతో (వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్లో) అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ శతకాన్ని హ్యాట్రిక్ సిక్సర్లతో అందుకోలేదు. ఈ మ్యాచ్లో అభిషేక్ తన పరుగుల ఖాతాను కూడా సిక్సర్తోనే ఓపెన్ చేయడం విశేషం. తన కెరీర్ తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అభిషేక్ రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసి పలు రికార్డులు కొల్లగొట్టాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్ల పరంగా) సెంచరీ చేసిన భారత క్రికెటర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ కేవలం రెండు ఇన్నింగ్స్ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.అభిషేక్కు ముందు ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన కెరీర్ మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ జాబితాలో యశస్వీ జైశ్వాల్ (21 ఏళ్ల 279 రోజుల వయస్సులో) టాప్లో ఉన్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 50 సిక్స్లు బాదాడు. అభిషేక్కు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (25 మ్యాచ్ల్లో 46 సిక్స్లు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్లో స్పిన్నర్ల బౌలింగ్లో 65 పరుగులు సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్కు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (57 పరుగులు) పేరిట ఉండేది. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఒకే ఓవర్లో 38 పరుగులు
ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కౌంటీ క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్లో వార్సెస్టర్షైర్కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.బషీర్ వేసిన ఇన్నింగ్స్ 128వ ఓవర్లో సర్రే బ్యాటర్ డాన్ లార్సెన్ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్లో 38 పరుగులు వచ్చాయి. కౌంటీ చరిత్రలో ఓ సింగిల్ ఓవర్లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్లో అలెక్స్ ట్యూడర్ కూడా ఓ ఓవర్లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్ బౌలింగ్లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 34 పరుగులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వార్సెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్ చేసింది. డాన్ లారెన్స్ (175) భారీ సెంచరీతో.. డామినిక్ సిబ్లీ (76), జేమీ స్మిత్ (86), బెన్ ఫోక్స్ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్లో 490 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్సెస్టర్షైర్ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్ లిబ్బీ (61), బెన్ అల్లీసన్ (19) క్రీజ్లో ఉన్నారు. -
T20 World Cup 2024: బట్లర్ విశ్వరూపం.. సిక్సర్ల సునామీ.. యువీ తర్వాత..!
యూఎస్ఏతో జరిగిన వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్కప్ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.హర్మీత్ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో యూఎస్ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెక్కల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.కాగా, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. -
T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో కెనడాపై సంచలన విజయం సాధించింది.డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఇక ఈ విజయంలో యూఎస్ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో. View this post on Instagram A post shared by ICC (@icc)చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్.. దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్కప్ 2024 హిట్మ్యాన్ మరో మూడు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.2007 నుంచి ఇప్పటివరకు 472 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 498 ఇన్నింగ్స్ల్లో 597 సిక్సర్లు బాదాడు. అన్ని సవ్యంగా సాగితే టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లోనే హిట్మ్యాన్ 600 సిక్సర్ల మార్కును తాకుతాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో నిలిచారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. దీనికి ముందు భారత్ ఇవాళ (జూన్ 1) బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో భారత్ రెండో మ్యాచ్ జూన్ 9న ఆడుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్తో తలపడనుంది.మరో రికార్డుపై కూడా కన్నేసిన రోహిత్జూన్ 5న ఐర్లాండ్తో జరుగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో రికార్డుపై కూడా కన్నేశాడు. ఆ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 26 పరుగులు చేస్తే.. విరాట్, బాబర్ తర్వాత 4000 టీ20 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ 151 టీ20 మ్యాచ్ల్లో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3974 పరుగులు చేశాడు. విరాట్ 117 మ్యాచ్ల్లో 4037 పరుగులు.. బాబర్ 119 మ్యాచ్ల్లో 4023 పరుగులు చేసి రోహిత్ కంటే ముందున్నారు. -
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్రైజర్స్తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (మే 8) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన సన్రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్దమయ్యాయి. సన్రైజర్స్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగునుంది. హైదరాబాద్లో నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నగరంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సన్రైజర్స్, ఎల్ఎస్జీ పాయింట్ల పట్టికలో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు చెరి 11 మ్యాచ్లు ఆడి ఆరింట గెలుపొందాయి. అయితే లక్నోతో పోలిస్తే సన్రైజర్స్ రన్రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో ఉంది. సన్రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు టెన్షన్ లేకుండా తదుపరి మ్యాచ్కు వెళ్లవచ్చు. ఇరు జట్ల ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.మరో మూడేస్తే..ఇక ఈ మ్యాచ్ ఓ భారీ మైలురాయికి వేదిక కానుంది. ఈ మ్యాచ్లో మరో మూడు సిక్సర్లు నమోదైతే ఈ సీజన్లో 1000 సిక్సర్లు (అన్ని జట్లు కలిపి) పూర్తవుతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్గా ఐపీఎల్ 2023 ఉంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇంకా 18 మ్యాచ్లు మిగిలుండగానే 1000 సిక్సర్లు మార్కు తాకితే ఆల్టైమ్ హైయెస్ట్ సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయం. నేటి మ్యాచ్లో తలపడబోయే సన్రైజర్స్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్లో కనీసం 20 సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సీజన్ల వారీగా సిక్సర్లు..2008- 6222009- 5062010- 5852011- 6392012- 7312013- 6722014- 7142015- 6922016- 6382017- 7052018- 8722019- 7842020- 7342021- 6872022- 10622023- 11242024- 997* -
పరుగుల ప్రళయం.. సిక్సర్ల సునామీ.. ఆల్టైమ్ రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (మార్చి 27) జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీ పడి సిక్సర్లు బాదారు. ఇరు జట్ల బ్యాటర్ల సిక్సర్ల సునామీ ధాటికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 18 సిక్సర్లు బాదితే.. ఛేదనలో ముంబై తామేమీ తక్కువ కాదని 20 సిక్సర్లు బాదింది. ఇరు జట్లు కలిపి ఈ మ్యాచ్లో ఏకంగా 38 సిక్సర్లు కొట్టాయి. ఫలితంగా భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు పలు ఆల్టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. పోట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. పురుషుల టీ20ల్లో అత్యధిక సిక్సర్లు.. 38 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 37 - బాల్ఖ్ లెజెండ్స్ vs కాబుల్ జ్వానన్, షార్జా, APL 2018 37 - SNKP vs JT, బస్సెటెర్రే, CPL 2019 36 - టైటాన్స్ vs నైట్స్, పోట్చెఫ్స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 35 - JT vs TKR, కింగ్స్టన్, CPL 2019 35 - SA vs WI, సెంచూరియన్, 2023 ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్ గానూ రికార్డు నెలకొల్పింది. 38 - SRH vs MI, హైదరాబాద్, 2024 33 - RCB vs CSK, బెంగళూరు, 2018 33 - RR vs CSK, షార్జా, 2020 33 - RCB vs CSK, బెంగళూరు, 2023 ఐపీఎల్లో అత్యధిక బౌండరీల సంఖ్య (4 6s).. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి కొట్టిన బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధికం. 69 - CSK vs RR, చెన్నై, 2010 69 - SRH vs MI, హైదరాబాద్, 2024 67 - PBKS vs LSG, లక్నో, 2023 67 - PBKS vs KKR, ఇండోర్, 2018 65 - డెక్కన్ ఛార్జర్స్ vs RR, హైదరాబాద్, 2008 ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కొట్టిన సిక్సర్ల సంఖ్య ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధికం కాగా, సన్రైజర్స్ బాదిన సిక్సర్ల సంఖ్య నాలుగో అత్యధికం. 21 - RCB vs PWI, బెంగళూరు, 2013 20 - RCB vs GL, బెంగళూరు, 2016 20 - DC vs GL, ఢిల్లీ, 2017 20 - MI vs SRH, హైదరాబాద్, 2024 18 - RCB vs PBKS, బెంగళూరు, 2015 18 - RR vs PBKS, షార్జా, 2020 18 - CSK vs KKR, కోల్కతా, 2023 18 - SRH vs MI, హైదరాబాద్, 2024 ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టుగా సన్రైజర్స్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016 246/5 - CSK vs RR, చెన్నై, 2010 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 టీ20ల్లో అత్యధిక స్కోర్లు.. ఈ మ్యాచ్లో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్రైజర్స్ టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. 314/3 - నేపాల్ వర్సెస్ మంగోలియా, హాంగ్జౌ, ఏషియన్ గేమ్స్ 2023 278/3 - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019 278/4 - చెక్ రిపబ్లిక్ వర్సెస్ టర్కీ, ఇల్ఫోకౌంటీ, 2019 277/3 - సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్, ఐపీఎల్ 2024 275/6 - పంజాబ్ వర్సెస్ ఆంధ్ర, రాంచీ, 2023 ఐపీఎల్ రెండో ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్లు.. ఐపీఎల్ హిస్టరీలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 (ఓటమి) 226/6 - RR vs PBKS, షార్జా, 2020 (గెలుపు) 223/5 - RR vs CSK, చెన్నై, 2010 (ఓటమి) 223/6 - MI vs PBKS, ముంబై WS, 2017 (ఓటమి) 219/6 - MI vs CSK, ఢిల్లీ, 2021 (గెలుపు) ఐపీఎల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్లు.. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు (సన్రైజర్స్ 277/3, ముంబై ఇండియన్స్ 246/5) చేయడంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్లో 500 పరుగుల మార్కు దాటింది. 523 - SRH vs MI, హైదరాబాద్, 2024 469 - CSK vs RR, చెన్నై, 2010 459 - PBKS vs KKR, ఇండోర్, 2018 458 - PBKS vs LSG, మొహాలి, 2023 453 - MI vs PBKS, ముంబై WS, 2017 టీ20ల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్లు.. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోర్గా రికార్డైంది. 523 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 517 - SA vs WI, సెంచూరియన్, 2023 515 - QG vs MS, రావల్పిండి, PSL 2023 506 - సర్రే vs మిడిల్సెక్స్, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023 501 - టైటాన్స్ vs నైట్స్, పోచెఫ్స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 -
హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్గా..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్మ్యాన్.. తాజాగా బ్యాటింగ్లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా.. ఓవరాల్గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్మ్యాన్ 32 ఇన్నింగ్స్ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు. కాగా, ధర్మశాల టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (476), మార్టిన్ గప్తిల్ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్ మోర్గన్ (352), ఏబీ డివిలియర్స్ (346), జోస్ బట్లర్ (328) వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. హిట్మ్యాన్ ముంగిట మరో రికార్డు.. ధర్మశాల టెస్ట్లో రోహిత్ శర్మ మరో సిక్సర్ కొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. కాగా, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్ మ్యాచ్ నామమాత్రం సాగనుంది. సిరీస్ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన రోహిత్
ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే టీ20 సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యం కాని ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు 148 మ్యాచ్ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్ల్లో 173 సిక్సర్లు) పేరిట ఉంది. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (125), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (124), టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (123) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. 117 సిక్సర్లతో విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. కాగా, జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్), 17 (బెంగళూరు) తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత టీ20ల్లో బరిలోకి దిగుతున్నారు. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్కీపర్), సంజు శాంసన్ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్లో హిట్మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
CWC 2023: సిక్సర్ల టీమిండియా.. సౌతాఫ్రికా, వెస్టిండీస్లను తలదన్ని..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పలు ప్రపంచకప్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్లో వ్యక్తిగత రికార్డులతో పాటు పలు టీమ్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. నిన్నటి మ్యాచ్లో భారత బ్యాటర్లు 16 సిక్సర్లు బాదడంతో తొలిసారి ఓ క్యాలెండర్ ఇయర్లో భారత్ 200కు పైగా సిక్సర్లు నమోదు చేసింది. నెదర్లాండ్స్పై 16 సిక్సర్లు కలుపుకుంటే ఈ ఏడాది వన్డేల్లో భారత్ సిక్సర్ల సంఖ్య 215కు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టూ ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. ఇదే ఎడిషన్లో సౌతాఫ్రికా 200 సిక్సర్ల మార్కును తాకింది. సఫారీలు ఈ ఏడాది వన్డేల్లో 203 సిక్సర్లు బాదారు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో భారత్, సౌతాఫ్రికా మధ్యలో వెస్టిండీస్ ఉంది. ఈ జట్టు 2019లో 209 సిక్సర్లు బాదింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (2015లో 179 సిక్సర్లు), ఆస్ట్రేలియా (2023లో 165 సిక్సర్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
IND VS AUS 3rd ODI: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔట్ కాగా.. విరాట్ క్రీజ్లోకి వచ్చాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/1గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 275 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదడంతో భారత్ వన్డే క్రికెట్లో 3000 సిక్సర్ల మార్కును (3007) తాకిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ వన్డేల్లో ఏ జట్టు ఇప్పటివరకు 3000 సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా విండీస్ (2953) ఉంది. ఈ జాబితాలో పాక్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజిలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), సౌతాఫ్రికా (1947), శ్రీలంక (1779), జింబాబ్వే (1303), బంగ్లాదేశ్ (959) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కొట్టిన 18 సిక్సర్లు వన్డేల్లో భారత్ రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదైంది. 2013లో బెంగళూరులో ఆసీస్పై బాదిన 19 సిక్సర్లు వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో భారత అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదై ఉంది. కాగా, ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ధేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2 వద్ద ఉండగా వర్షం మొదలై ఆటకు అంతరాయం కలిగింది. లబూషేన్ (17), వార్నర్ (26) క్రీజ్లో ఉన్నారు. -
IND VS AUS 1st ODI: సెంచరీ పూర్తి చేసిన వార్నర్
ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ అశ్విన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన వార్నర్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో వార్నర్ ఈ సిక్సర్తో పాటు మరో సిక్సర్ కూడా బాది తన సిక్సర్ల సంఖ్యను 101కి (148 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 53 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఆసీస్ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తూ 26 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. వార్నర్, మిచెల్ మార్ష్ (4), స్టీవ్ స్మిత్ (41) ఔట్ కాగా.. మార్నస్ లబూషేన్ (23), కెమరూన్ గ్రీన్ (5) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఎవరి పేరిట ఉందంటే..? వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), రోహిత్ శర్మ (286), సనత్ జయసూర్య (270), ఎంఎస్ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. భారత ఆటగాళ్లు సచిన్ (195), గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), విరాట్ కోహ్లి (141), సెహ్వాగ్ (136), సురేశ్ రైనా (120) 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. -
చరిత్ర మరచిపోలేని రికార్డుకు 16 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్లో యువీ చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్లో ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువీ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ను ఉతికి 'ఆరే'శాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్పై పడింది. ఫ్లింటాఫ్పై కోపాన్ని యువీ బ్రాడ్పై చూపించాడు. యువీ.. బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. Look out in the crowd! On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6 — ICC (@ICC) September 19, 2021 ఆ ఇన్నింగ్స్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 14 నిమిషాలు క్రీజ్లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్ (58), సెహ్వాగ్ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్.. పాక్ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. -
భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్.. మూడేస్తే రోహిత్, విరాట్ సరసన చోటు
విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగనున్న రెండో టీ20కి ముందు టీమిండియా చిచ్చరపిడుగు, వరల్డ్ టీ20 నంబన్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. నేటి మ్యాచ్లో స్కై మరో 3 సిక్సర్లు బాదితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (182), విరాట్ కోహ్లిల (117) సరసన చేరతాడు. రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ టీ20ల్లో 100 అంత కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లుగా రికార్డుల్లో నిలువగా.. స్కై ఈ జాబితాలో చేరేందుకు మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 49 అంతర్జాతీయ టీ20ల్లో స్కై ఇప్పటివరకు 97 సిక్సర్లు బాది, ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా.. 72 మ్యాచ్ల్లో 99 సిక్సర్లు బాదిన కేఎల్ రాహుల్ మూడో ప్లేస్లో నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 12 మంది 100 సిక్సర్లు బాదగా.. వారిలో రోహిత్ అగ్రస్థానంలో, కోహ్లి ఏడో ప్లేస్లో ఉన్నారు. రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (173), ఆరోన్ ఫించ్ (125), క్రిస్ గేల్ (124), పాల్ స్టిర్లింగ్ (123), ఇయాన్ మోర్గాన్ (120), జోస్ బట్లర్ (113), ఎవిన్ లూయిస్ (111), కొలిన్ మున్రో (107), మ్యాక్స్వెల్ (106), డేవిడ్ మిల్లర్ (106), డేవిడ్ వార్నర్ (105) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ టీ20 కెరీర్ను సిక్సర్తోనే ప్రారంభించిన సూర్యకుమార్.. అతి తక్కువ కాలంలో పలు టీ20 రికార్డులు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అతి తక్కువ వ్యవధిలో వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గానూ ఎదిగాడు. టీ20 కెరీర్లో 47 ఇన్నింగ్స్లు ఆడిన స్కై.. 174.1 స్ట్రయిక్రేట్తో 3 సెంచరీలు, 13 అర్ధసెంచరీల సాయంతో 45.8 సగటున 1696 పరుగులు చేశాడు. స్కై ఖాతాలో 97 సిక్సర్లతో పాటు 152 బౌండరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, విండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తొలి మ్యాచ్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్ (41), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (48) రాణించగా.. భారత్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు అర్ష్దీప్ సింగ్, చహల్ తలో 2 వికెట్లు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టగా.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
పోతూ పోతూ రికార్డుల్లోకెక్కిన స్టువర్ట్ బ్రాడ్.. సిక్సర్తో..!
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో చివరాఖరి మ్యాచ్లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్ టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్లో 167 టెస్ట్లు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాది బెన్ స్టోక్స్ (124), కెవిన్ పీటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయాన్ బోథమ్ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. Most sixes for England in Tests: 124* - Ben Stokes 81 - K Pietersen 78 - A Flintoff 67 - I Botham 55 - Stuart Broad@StuartBroad8 ends his Test career with fifth-most sixes for Englandpic.twitter.com/xLrFzLqIcd — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆఖరి టెస్ట్ కావడంతో బ్యాటింగ్కు దిగే ముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న బ్రాడ్.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్లో బ్రాడ్ (8, సిక్స్) నాటౌట్గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. కాగా, కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటలో మూడో సెషన్లో బ్యాటింగ్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. జో రూట్ 71, జానీ బెయిర్ స్టో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా ఇంగ్లండ్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ ముంగిట ఇంగ్లండ్ కనీసం 400 పరుగుల టార్గెట్ను పెట్టాలని భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టోక్స్ 67 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో స్టోక్స్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఆసీస్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో స్టోక్స్ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. 2018-19లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో వెస్టిండీస్ ఆటగాడు హెట్మైర్ కూడా 15 సిక్సర్లు బాదాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 2019-20లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 19 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక యాషెస్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన టెస్టు సిరీస్లు కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గా స్టోక్స్ రికార్డులకెక్కాడు. స్టోక్స్ తర్వాతి స్థానంలో కెవిన్ పీటర్సన్(2005 యాషెస్లో) 14 సిక్సర్లు బాదగా, 2019 యాషెస్లో మళ్లీ బెన్ స్టోక్స్ 13 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. 2005 యాషెస్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ 11 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు. Ben Stokes straightaway in the mood. Smashes Josh Hazlewood for a six in the first over after Lunch. pic.twitter.com/z9Di8YY4PM — Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2023 చదవండి: Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్పై రొనాల్డో అసహనం వాళ్లు లేరు.. వీళ్లకు ఛాన్స్.. బెడిసికొట్టిన ప్రయోగం! 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి.. -
మేజర్ లీగ్ క్రికెట్ 2023.. సిక్సర్లతో విరుచుకుపడిన పాక్ ఆల్రౌండర్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) తర్వాత పాక్ జట్టుకు చెందిన చాలా మంది ఆటగాళ్లు మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇమాద్ వసీమ్ ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకోగా.. తాజాగా పాక్ ఆల్రౌండర్ షాబాద్ ఖాన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లీగ్లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోరే అండర్సన్(52 బంతుల్లో 91 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్(30 బంతుల్లో 61 పరుగులు, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 31 పరుగులతో ఆడుతున్నాడు. సరబ్జిత్ లడ్డా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలుత స్ట్రెయిట్ సిక్సర్ సంధించిన షాదాబ్.. ఆ తర్వాత డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ తరలించాడు. అనంతరం రెండు వరుస బంతులను సిక్సర్లను సంధించాడు. షాదాబ్ఖాన్ మెరుపు ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. టిమ్ డేవిడ్ 53 నాటౌట్, డెవాల్డ్ బ్రెవిస్ 32, నికోలస్ పూరన్ 40, కీరన్ పొలార్డ్ 48 పరుగులు చేశారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనైన ముంంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగుల వద్ద ఆగిపోయింది. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో కార్మీ లి రౌక్స్, లియామ్ ప్లంకెట్లు చెరో రెండు వికెట్లు తీశారు. Feels good to contribute to a win in @SFOUnicorns first MLC match. pic.twitter.com/q8vKYEc0DW — Shadab Khan (@76Shadabkhan) July 15, 2023 చదవండి: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్పై రోహిత్ సీరియస్! -
మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సంచలనం
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ వికెట్ కీపర్ రింకూ సింగ్ విధ్వంసాన్ని అంత త్వరగా ఎవరు మరిచిపోలేరు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ పేరు మార్మోగిపోయింది. ఇటీవలే వెస్టిండీస్తో టి20 సిరీస్కు రింకూ సింగ్ను ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అది సరే ఇప్పుడు రింకూ సింగ్ ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అచ్చం రింకూ సింగ్ ఇన్నింగ్స్ను తలపించే మ్యాచ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్లో చోటుచేసుకుంది. 12 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ ఫలితాన్నే మార్చేశారు. కాకపోతే అక్కడ ఒక్క రింకూ సింగ్ ఉంటే ఇక్కడ మాత్రం ఇద్దరు రింకూ సింగ్లు కనిపించారు. విషయంలోకి వెళితే.. టీఎన్పీఎల్(TNPL 2023)లో సోమవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, దిండిగుల్ డ్రాగన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నెల్లయ్ కింగ్స్ బ్యాటర్స్ రితిక్ ఈశ్వరన్, అజితేష్ గురుస్వామి సంచలన బ్యాటింగ్తో అదరగొట్టారు.186 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన రాయల్ కింగ్స్ అజితేష్, రితిక్ అసమాన పోరాటంతో చివరి బాల్కు విజయాన్ని అందుకున్నది. రాయల్ కింగ్స్ గెలుపుకు 12 బాల్స్లో 37 రన్స్ అవసరమైన తరుణంలో గేర్ మార్చిన రితిక్ ఈశ్వరన్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. అజిత్ గురుస్వామి ఓ సిక్స్ దంచాడు. ఓ నోబాల్, సింగిల్ రన్తో మొత్తంగా ఆ ఓవర్లో 33 రన్స్ వచ్చాయి.ఆ తర్వాత మరో సిక్స్తో రాయల్ కింగ్స్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు రితిక్ ఈశ్వరన్. అజితేష్ గురుస్వామి 44 బాల్స్లోనే ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 73 రన్స్, రితిక్ ఈశ్వరన్ 11 బాల్స్లో ఆరు సిక్సర్లతో 39 రన్స్ తో నాటౌట్గా మిగిలారు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 185 రన్స్ చేసింది. దిండిగల్ డ్రాగన్స్ ఓపెనర్ శివమ్ సింగ్ 46 బాల్స్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 76 రన్స్ చేశాడు. భూపతి కుమార్ 41 రన్స్తో రాణించాడు. 33-RUN OVER WITH 5 SIXES! 🤯 Insane hitting by Easwaran 🔥 and Ajitesh 💥#TNPLonFanCode pic.twitter.com/GSc41DpGk7 — FanCode (@FanCode) July 10, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు! -
ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్
సాధారణంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే ప్రపంచ రికార్డుగా పరిగణిస్తారు. అదే ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొడితే దానిని సంచలనం అంటారు. అలాంటి సంచలనం విటాలిటీ టి20 బ్లాస్ట్లో నమోదైంది. సర్రీ బ్యాటర్ విల్ జాక్స్ మిడిలెసెక్స్తో మ్యాచ్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు.45 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 96 పరుగులు చేసిన జాక్స్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ తన మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న విల్ జాక్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన హోల్మన్కు చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్వికెట్ మీదుగా.. రెండో బంతిని స్ట్రెయిట్ వికెట్ మీదుగా.. మేడో బంతిని లాంగాన్ మీదుగా.. నాలుగో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా.. ఐదో బంతిని మరోసారి లాంగాన్ మీదుగా తరలించాడు. ఆఖరి బంతిని కూడా సిక్సర్ బాదే ప్రయత్నం చేసినప్పటికి కేవలం సింగిల్ మాత్రమే రావడంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్సయింది. అయితే విల్ జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ సర్రీని ఓటమి నుంచి తప్పించలేకపోయింది. 252 పరుగులు చేసిన సర్రీ జట్టు.. టార్గెట్ను కాపాడుకోలేకపోయింది. మిడిలెసెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 254 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించిన జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఐపీఎల్లో విల్ జాక్స్ ఆర్సీబీ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 6 6 6 6 6 🔥 Absolutely brutal 🫣 from Will Jacks 🏏#Blast23 pic.twitter.com/B0l9QWqS13 — FanCode (@FanCode) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్కు షాకిచ్చిన ఐసీసీ -
13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో(MPL 2023) మరో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. దేశవాలీ క్రికెటర్ అర్షిన్ కులకర్ణి 46 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్, పుణేరి బప్పా మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఈగల్ నాసిక్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అర్షన్ కులకర్ణి 54 బంతుల్లో 3 ఫోర్లు, 13 సిక్స్ లతో 216.67 స్ట్రైక్ రేట్ తో 117 పరుగులు చేశాడు.అయితే ఇందులో ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 90 పరుగులు చేయడం గమనార్హం. అతనికి తోడుగా రాహుల్ త్రిపాఠి 28 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అనంతరం 203 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పుణేరి బప్పా గెలుపు కోసం దీటుగానే అద్భుత ఆటను ప్రదర్శించింది.చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణేరి బప్పా ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఐదు పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది.ఇక పుణేరి బప్పా టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షన్ కులకర్ణి ఐదు పరుగులే ఇవ్వడంతో.. ఒక్క పరుగు తేడాతో ఈగల్ నాసిక్ టైటాన్స్ విజయం సాధించింది. 13 sixes! Arshin Kulkarni was looking to the skies with this century. .#MPLonFanCode pic.twitter.com/u8BagV5tfW — FanCode (@FanCode) June 20, 2023 Arshin Kulkarni, 18-year-old, playing in MPL: - 117(54) with bat. - 4/21 with ball. - Defended 5 runs in the final over. He has been a run-machine in age group cricket, another talent to watch out in future. pic.twitter.com/tzPxtnruQJ — Johns. (@CricCrazyJohns) June 20, 2023 చదవండి: #Ashes2023: ఇంతకు మించి ఏమి కావాలి.. చాలా సంతోషంగా ఉంది: కమ్మిన్స్ 'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు' -
WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా రన్నరప్గా నిలిచింది. మరి ఈ ఏడాదైనా టీమిండియా డబ్ల్యూటీసీ విజేతగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక టెస్టు క్రికెట్లో సాధారణంగా సిక్సర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బౌండరీలతోనే బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టడం చూస్తుంటాం. ఇన్నింగ్స్ మధ్యలోనూ సిక్సర్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరనేది పరిశీలిద్దాం. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టుల్లో 91 సిక్సర్లు కొట్టి సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు. 329 టెస్టు ఇన్నింగ్స్ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 83 ఇన్నింగ్స్ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 4వ స్థానంలో ఉన్నాడు. 184 టెస్టు ఇన్నింగ్స్ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరొక్క సిక్సర్ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీరాజ్, మహ్మద్ షమీరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రెవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషిన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. చదవండి: WTC Final: రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు! -
#JiteshSharma: పంజాబ్ తరపున కొత్త సిక్సర్ల వీరుడు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున వికెట్ కీపర్ జితేశ్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆడినంతసేపు ఎక్కువగా సిక్సర్లకే ప్రాధాన్యమిచ్చిన జితేశ్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం(మే 19న) రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో 28 బంతుల్లో 44 పరుగులు చేసిన జితేశ్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. Photo: IPL Twitter కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు జితేశ్ శర్మ 21 సిక్సర్లు బాదాడు. పంజాబ్ కింగ్స్ తరపున సీజన్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచాడు. జితేశ్ శర్మ తర్వాత లియామ్ లివింగ్స్టోన్, ప్రభ్సిమ్రన్ సింగ్ 19 సిక్సర్లతో ఉన్నారు. ఇక ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున జితేశ్ శర్మ మూడో టాప్ స్కోరర్గా నిలిచాడు. 14 మ్యాచ్ల్లో 309 పరుగులు చేశాడు. ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చే జితేశ్ ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. సీజన్లో అతని అత్యధిక స్కోరు 49 నాటౌట్గా ఉంది. చదవండి: స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి! -
సిక్సర్ల విషయంలో రోహిత్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ను ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆరంభించింది. రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి కాన్ఫిడెంట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 61 పరుగులు దాటింది. ఈ క్రమంలో హిట్మ్యాన్ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో షమీ వేసిన ఆఖరి బంతిని కవర్స్ దిశగా సిక్సర్ కొట్టాడు. రోహిత్కు ఇది ఐపీఎల్లో 252వ సిక్సర్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో డివిలియర్స్(251 సిక్సర్లు)ను రోహిత్ అధిగమించాడు. ఇక అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 357 సిక్సర్లతో టాప్లో నిలిచి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. 252 సిక్సర్లతో రోహిత్ శర్మ , 251 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్, 239 సిక్సర్లతో ధోని టాప్-5లో కొనసాగుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ 200 సిక్సర్లు పూర్తి చేసుకొని మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. There's the @ImRo45 we all love to see - short and pulled away beautifully for six 😍#IPLonJioCinema #TATAIPL #GTvMI pic.twitter.com/M3RPWoyx5E — JioCinema (@JioCinema) May 12, 2023 Rohit Sharma completing 200 sixes for Mumbai Indians. pic.twitter.com/kPQtyMQpsd — MI Fans Army™ (@MIFansArmy) May 12, 2023 చదవండి: అడుగు పడింది.. జైశ్వాల్ జోరులో గమనించలేదు -
చెత్త ఫీల్డింగ్తో మూడు లైఫ్లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ దారుణ ఫీల్డింగ్ కనబరిచింది. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తొలుత నితీష్ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్కుమార్ బౌలింగ్లో లాంగాఫ్ దిశగా షాట్ ఆడగా.. సిరాజ్ చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేశాడు. ఇక రెండోసారి సిరాజ్ బౌలింగ్ఓ ఫైన్లెగ్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ మరోసారి క్యాచ్ను జారవిడిచాడు. ఇక ముచ్చటగా మూడోసారి మ్యాక్స్వెల్ వదిలేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో రానా లాంగాన్ దిశగా ఆడగా.. మ్యాక్స్వెల్ కాస్త వేగంగా స్పందించి ఉంటే ఉంటే క్యాచ్ దొరికేది. ఇలా మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రానా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. Photo: IPL Twitter కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డు సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే నితీశ్ రానా ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్గా నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్లో నితీశ్ రానా కొట్టిన నాలుగు సిక్సర్లతో వంద సిక్సర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్ 180 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా.. వంద సిక్సర్లతో నితీశ్ రానా రెండో స్థానంలో, 85 సిక్సర్లతో యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్పలు సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్నారు. Nitish is scoring Run Rana Run 😅@KKRiders' skipper goes 💥 back-to-back 💪#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/I3fNVedeSr — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్ను ఉతికారేశాడు -
#JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్ను ఉతికారేశాడు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్కు జేసన్ రాయ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకొని ఉతికారేశాడు. ఇక మ్యాచ్లో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్ విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. Oh boy, this Roy can bat! 👏#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @JasonRoy20 @KKRiders pic.twitter.com/QVYc2ZuZ2b — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిందెవరు..?
పొట్టి క్రికెట్ అంటేనే సిక్సర్లకు పెట్టింది పేరు. ఈ ఫార్మాట్లో బ్యాటర్లు పోటీపడి మరీ సిక్సర్లు బాదుతుంటారు. ఒకటి అరా సందర్భాల్లో తప్ప దాదాపు ప్రతి మ్యాచ్లో సిక్సర్ల సునామీ తప్పక ఉంటుంది. ఐపీఎల్ వచ్చాక బ్యాటర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇన్నింగ్స్ తొలి బంతా, ఆఖరి బంతా.. స్పిన్ బౌలరా, ఫాస్ట్ బౌలరా అన్న తేడా లేకుండా ఎడాపెడా సిక్సర్లు బాదేస్తున్నారు. ఒక్కో మ్యాచ్లో సగటున 10 నుంచి 20 సిక్సర్లు వస్తుంటాయి. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, పోలార్డ్, వార్నర్ లాంటి భారీ హిట్టర్లయితే ఆడింది 200లోపు మ్యాచ్లే అయినా మ్యాచ్ల సంఖ్యకు మించి సిక్సర్లు కొట్టారు. మ్యాచ్లో ఏదో ఒక సందర్భంలో సిక్సర్ కొట్టడం ఒకెత్తైతే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సిక్సర్లు బాదడం మరో ఎత్తు. ఆఖరి ఓవర్ అనగానే సహజంగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తెగువ చూపి సిక్సర్లు బాదడం మన మహేంద్రుడికే చెల్లింది. అందుకే అతను చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా చివర్లో ధోని కొట్టినన్ని సిక్సర్లు కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రికార్డు స్థాయిలో 57 సిక్సర్లు బాదాడు. ధోని తర్వాత పోలార్డ్ అత్యధికంగా 33 సిక్సర్లు, రవీంద్ర జడేజా 26, హార్ధిక్ పాండ్యా 25, రోహిత్ శర్మ 23 సిక్సర్లు కొట్టారు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ 142 ఐపీఎల్ మ్యాచ్ల్లో 357 సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఏబీ డివిలియర్స్ (251), రోహిత్ శర్మ (245), ధోని (235), కోహ్లి (227) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని 17 బంతుల్లో 3 సిక్సర్లు, ఫోర్ సాయంతో అజేయమైన 32 పరుగులు సాధించినప్పటికీ సీఎస్కే గెలువలేకపోయింది. ధోని, జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చివరివరకు అద్భుతంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సందీప్ శర్మ ఆఖరి మూడు బంతులను అద్భుతంగా బౌల్ చేసి ధోని, జడ్డూలను కట్టడి చేశాడు. ఫలితంగా ఆర్ఆర్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఏంది ఈ అరాచకం.. రెండు సిక్సర్లకే!
వయసు పెరుగుతుంటే క్రేజ్ తగ్గుతుందంటారు.. కానీ ధోని విషయంలో మాత్రం అది రివర్స్లా కనిపిస్తుంది. 40 ఏళ్ల వయస్సులోనూ తనకున్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని ఐపీఎల్ 16వ సీజన్ చెప్పకనే చెబుతుంది. ఎంతలా అంటే సీఎస్కే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని ఒక్కసారి కనిపించినా అటు మైదానంలో తలా అభిమానుల గోల మాములుగా ఉండడం లేదు.. ఇదే అనుకుంటే అతను బ్యాటింగ్ చేస్తుంటే జియో సినిమాలో వ్యూయర్షిప్ రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ధోని కూడా తన ఆట స్టైల్ను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు ధోని క్రీజులోకి వస్తే కుదురుకోవడానికి సమయం తీసుకునేవాడు. అలా చాలా మ్యాచ్ల్లో నిలబడే ప్రయత్నంలో ఒక్కోసారి ఔటయ్యేవాడు. అయితే ఈసారి ధోని గేర్ మార్చాడు. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న ధోని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొడితే సిక్సర్ లేదంటే బౌండరీ బాదుతూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా సీజన్లో రెండు మ్యాచ్ల్లోనూ ధోని ఇదే స్టైల్ను అనుకరించాడు. గుజరాత్తో మ్యాచ్లో ఒక సిక్సర్, ఒక ఫోర్తో ఏడు బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇక సోమవారం లక్నోతో మ్యాచ్లోనూ ధోని అదే దూకుడును ప్రదర్శించాడు. మూడు బంతులాడిన ధోని రెండు సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు. అయితే వచ్చిన ప్రతీసారి సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అభిమానులు కూడా తన నుంచి ఇదే ఆశిస్తున్నారని ధోని గ్రహించాడు. ఈ నేపథ్యంలోనే లక్నోతో మ్యాచ్లో ధోని కొట్టిన రెండు సిక్సర్లకు స్టేడియం అభిమానుల గోలతో దద్దరిల్లిపోయింది. ధోని మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మొదలైన అరుపులు అతను ఔట్ అయ్యేవరకు కొనసాగాయి. చెపాక్ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో హోరెత్తింది. ఇక మార్క్వుడ్ బౌలింగ్లో ధోని కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్కే హైలైట్. మొదటి బంతిని మార్క్వుడ్ 148.7 కిమీ వేగంతో వేయగా.. థర్డ్మన్ దిశగా సిక్సర్ బాదాడు. అంతే స్టేడియం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఈ దెబ్బకు మార్క్వుడ్ కూడా కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత బంతిని ధోని మరోసారి సిక్సర్ బాదాడు. అంతే స్టేడియంలో అరుపులు ఎంత ఉన్నాయంటే డెసిబల్స్ కూడా కొలవలేనంతగా. ఇది కేవలం స్టేడియంలో జరిగిన విధ్వంసం మాత్రమే. ఇక ఐపీఎల్ డిజిటల్ రైట్స్ హక్కులు కొనుగోలు చేసిన జియో సినిమాలో వ్యూయర్షిప్ రికార్డులు బద్దలయ్యాయి. ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్టైం రికార్డుగా మిగిలిపోయింది. ఇంతకముందు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ధోని బ్యాటింగ్ను లైవ్లో 1.6 కోట్ల మంది చూశారు. తాజా దానితో ధోని తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. ఏంది ఈ అరాచకం.. కేవలం రెండు సిక్సర్లకే ఇలా రికార్డులు బద్దలయితే.. ధోని ఎక్కువసేపు క్రీజులో ఉంటే ఎలా ఉంటుందనేది ఊహించుకోవడానికి భయంగా ఉంది అంటూ కొంతమంది ఫ్యాన్స్ పేర్కొన్నారు. మనకు తెలిసి ఒక క్రికెటర్ను ఇంతలా అభిమానించడం ఈ మధ్య కాలంలో ఎక్కడా చూసి ఉండం.. ధోనినా మజాకా. The entry of MS Dhoni into Chepauk after 4 long years. pic.twitter.com/7YP60XWXlU — Johns. (@CricCrazyJohns) April 4, 2023 A treat for the Chennai crowd! 😍@msdhoni is BACK in Chennai & how 💥#TATAIPL | #CSKvLSG WATCH his incredible two sixes 🔽 pic.twitter.com/YFkOGqsFVT — IndianPremierLeague (@IPL) April 3, 2023 చదవండి: 'వాట్ యాన్ ఐడియా సర్ జీ'.. ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి -
ఎందరు వచ్చినా ధోనికే సాధ్యమైన వేళ.. సీఎస్కే తరపున
ఐపీఎల్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. వద్దన్న రికార్డులు వెల్లువలా వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్గా చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Photo: IPL Twitter అయితే ధోని మాత్రం సిక్సర్ల విషయంలో ఒక రికార్డు అందుకున్నాడు. సీఎస్కే తరపున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గుజరాత్తో మ్యాచ్లో భాగంగా జోష్ లిటిల్ బౌలింగ్లో డీప్స్వ్కేర్లెగ్ దిశగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. ధోని ఖాతాలో ఇది 230వ సిక్సర్ కాగా.. సీఎస్కే తరపున 200వ సిక్సర్. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. Photo: IPL Twitter ఇంతకముందు ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో క్రిస్ గేల్(ఆర్సీబీ-239 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ-238 సిక్సర్లు), కీరన్ పొలార్డ్(223 సిక్సర్లు- ముంబై ఇండియన్స్), విరాట్ కోహ్లి(218 సిక్సర్లు-ఆర్సీబీ)లు ఉన్నారు. తాజాగా ధోని(200 సిక్సర్లు- సీఎస్కే) వీరి సరసన నిలిచాడు.ఇక ఐపీఎల్లో సీఎస్కే తరపున ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధోని ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ధోనికి ఎవరు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ముంబై ఇండియన్స్ తరపున కీరన్ పొలార్డ్ 33 సిక్సర్లతో ధోనికి చాలా దూరంలో ఉన్నాడు. ఇక మ్యాచ్లో ఏడు బంతుల్లో 14 పరుగులు చేసిన ధోని ఇన్నింగ్స్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 5వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. సీఎస్కే విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్ (63) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. Maahi maar raha hai 💥🔥#IPL2023#cskvsgt pic.twitter.com/LErfszz1cA — Deepak K (@deepakkumar_dpk) March 31, 2023 -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్ను ఉతికారేసిన విండీస్ స్టార్
అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టి20లో షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్ అయినప్పటికి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రూథర్ఫోర్డ్ దెబ్బకు యూసఫ్ పఠాన్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లో యూసఫ్ పఠాన్ బౌలింగ్కు వచ్చాడు. తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్ఫోర్డ్కు స్ట్రైక్ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు రూథర్ఫోర్డ్. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా 90 మీటర్లు, మూడో బంతి లాంగాన్ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్ఫుట్ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్ సిక్స్ కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐదో బంతిని స్క్వేర్లెగ్లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓవర్ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్ షాట్తో సిక్సర్ తరలించాడు. దీంతో ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రూథర్ఫోర్డ్ మరుసటి ఓవర్లో ఆరో సిక్సర్ కొట్టే అవకాశం వచ్చినప్పటికి విఫలమయ్యాడు. ఈ దశలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే బిల్లింగ్స్తో ఏర్పడిన సమన్వయలోపంతో రూథర్ఫోర్డ్ రనౌట్గా వెనుదిరగడంతో అతని విధ్వంసానికి తెరపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.రూథర్ఫోర్డ్(23 బంతుల్లో 50, ఆరు సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(48 బంతుల్లో 54 పరుగులు), ముస్తఫా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The maestro, Sherfane Rutherford put up a stunning batting display tonight #DVvDC. 5 back to back 6’s 😯 Big contribution to his teams total with a 23-ball 5️⃣0️⃣ 🔥#DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/OSW8Av4lnh — International League T20 (@ILT20Official) February 2, 2023 చదవండి: ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు -
'ఐదో సిక్సర్ కొట్టగానే యువరాజ్ గుర్తుకువచ్చాడు'
దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఉత్తర్ ప్రదేశ్తో మ్యాచ్లో ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లే కష్టసాధ్యమనుకుంటే.. రుతురాజ్ మాత్రం ఏకంగా ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్ ధాటికి శివ సింగ్ ఏకంగా ఒకే ఓవర్లో 43 పరుగులిచ్చుకోవాల్సి వచ్చింది. ఇక రుతురాజ్ తాను ఏడు సిక్సర్లు కొట్టిన సందర్భంలో యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడంటూ పేర్కొన్నాడు. ''వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత నాకు ఒక వ్యక్తి గుర్తుకువచ్చాడు. అతనే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వరల్డ్కప్లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం దగ్గరి నుంచి చూశా.నేను కూడా అలా దిగ్గజం సరసన చేరాలని భావించా. అందుకోసమే ఆరో సిక్స్ కొట్టాను. కానీ ఇలా ఒకే ఓవర్లో ఎక్కువ సిక్సర్లు కొడుతానని కలలో కూడా ఊహించలేదు'' అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఉత్తర్ ప్రదేశ్తో మ్యాచ్లో రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 పరుగులు సాధించాడు. తాజాగా అస్సాంతో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో 126 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు స్కోర్ చేశాడు. ఈ శతకంతో రుతురాజ్ ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్ల్లో 3 శతకాలు (552 పరుగులు) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో (2021, 2022) రుతరాజ్ గత 9 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 7 శతకాలు (168, 220 నాటౌట్, 40, 124 నాటౌట్, 168, 21, 124, 154 నాటౌట్, 136) బాది లిస్ట్-ఏ క్రికెట్లో మరో రికార్డు నెలకొల్పాడు. ఇక అస్సాంపై విజయం అందుకున్న మహారాష్ట్ర ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 2న జరగనున్న ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్రలు అమితుమీ తేల్చుకోనున్నాయి. 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 చదవండి: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..! సచిన్, డివిలియర్స్ వంటి దిగ్గజాల సరసన రుతురాజ్.. రోహిత్తో పాటుగా -
ఇదేం షాట్ రా బాబు.. ఇండియాలో అయితే స్టేడియం బయటపడేది..!
Mitchell Marsh Massive 115 Metre Six: 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (నవంబర్ 22) జరిగిన ఆఖరి వన్డేలో ఆతిధ్య ఆస్ట్రేలియా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆసీస్.. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. Clobbered 115 metres! 💥 Mitch Marsh middled this one! #AUSvENG #Dettol | #PlayOfTheDay pic.twitter.com/QzToL1irbC — cricket.com.au (@cricketcomau) November 22, 2022 తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. మిచెల్ మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్.. ఆసీస్ ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఆ జట్టు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఓ కళ్లు చెదిరే షాట్ ఆడి మైదానంలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఓల్లీ స్టోన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్గా మలిచాడు. మార్ష్ కొట్టిన ఈ షాట్ నేరుగా స్టాండ్స్లోకి వెళ్లి ల్యాండైంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెల్బోర్న్ మైదానంలో బంతికి స్టాండ్స్లోకి వెళ్లిందంటే.. ఇండియాలోని గ్రౌండ్స్లో బంతి మైదానం దాటుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ సిక్సర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ సిక్సర్ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 2013లో సౌతాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ స్టేడియంలో ఏకంగా 153 మీటర్ల అత్యంత భారీ సిక్సర్ బాదాడు. -
సెంచరీతో పాటు సిక్సర్ల రికార్డు.. అరుదైన క్రికెటర్గా ఘనత
టి20 ప్రపంచకప్లో రెండో సెంచరీ నమోదైంది. సూపర్-12లో భాగంగా గ్రూఫ్-1లో శుక్రవారం శ్రీలంకతో మ్యాచ్లో కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ శతకంతో మెరిశాడు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు. డారిల్ మిచెల్ను ఒక ఎండ్లో నిలబెట్టి ఫిలిప్స్ స్ట్రైక్ రొటేట్ చేసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్లో షనకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్లో ఫిలిప్స్ రెండో శతకం అందుకున్నాడు. ఇక టి20 ప్రపంచకప్లో నాలుగో స్థానం లేదా ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చి సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్ రికార్డులకెక్కాడు. సెంచరీయే ఒక రికార్డు అనుకుంటే దానితో పాటు సిక్సర్ల రికార్డు కూడా అందుకున్నాడు. 2021 నుంచి టి20ల్లో ఫిలిప్స్ బాదిన సిక్సర్ల సంఖ్య 149(తాజా వాటితో కలిపి). ఈ నేపథ్యంలోనే 2021 నుంచి చూసుకుంటే అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గ్లెన్ ఫిలిప్స్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఉన్నాడు. లివింగ్స్టోన్ 152 సిక్సర్లు బాదాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కివీస్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2 వికెట్ల పడగొట్టగా.. తీక్షణ, ధనంజయ, హసరంగ, లహిరు కుమార తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో భాగంగా శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసింది. భానుక రాజపక్ష (34), దసున్ శనక (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, సోధి తలో 2 వికెట్లు.. సౌథీ, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: T20 WC 2022 : కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు -
సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల విషయంలో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టి20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా హిట్మ్యాన్ నిలిచాడు. శుక్రవారం నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే టి20ల్లో అత్యధికి సిక్సర్ల రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఓవరాల్గా 176 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి 104 సిక్సర్లతో టీమిండియా తరపున టి20ల్లో వంద సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్గా ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్లో జరుగుతుంది. చదవండి: బుమ్రా యార్కర్కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్.. బేబీ ఏబీ అని పిలుచుకున్న డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినప్పటికి వరుసగా ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన బ్రెవిస్ 30 పరుగులు పిండుకున్నాడు. సీపీఎల్లో డెవాల్డ్ బ్రెవిస్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గురువారం ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో బ్రెవిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అకిల్ హొసెన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని మిస్ చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత వరుస మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తయింది. 20వ ఓవర్ బౌలింగ్కు వచ్చిన డారిన్ దుపావిల్లన్ బౌలింగ్లో చివరి రెండు బంతులు ఆడిన బ్రెవిస్ రెండు సిక్సర్లు బాదాడు. అలా తాను ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికి... ఓవర్లు అయిపోవడంతో తృటిలో ఆరు సిక్సర్ల రికార్డు మిస్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో సెంట్ కిట్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రూథర్ఫోర్డ్ 7 పరుగులుతో టాప్ స్కోరర్గా నిలవగా.. డెవాల్డ్ బ్రెవిస్ 30 నాటౌట్, బ్రావో 23 పరుగులు చేశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్బాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Dewald Brevis 5 sixes in a row 30*(6) 🔥🔥🔥 pic.twitter.com/faGyEvD84z — ° (@anubhav__tweets) September 22, 2022 చదవండి: ఆ ఒక్క సిక్స్తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం.. -
ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్
అఫ్గానిస్తాన్ బ్యాటర్ నజీబుల్లా జర్దన్.. మంగళవారం ఆసియాకప్లో భాగంగా గ్రూఫ్-బిలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లోనే 6 సిక్సర్లు, ఒక ఫోర్తో 43 పరుగులు సాధించిన నజీబుల్లా ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో అఫ్గనిస్తాన్ గ్రూఫ్-బి టాపర్గా సూపర్-4 చేరింది. కాగా సంచలన ఇన్నింగ్స్తో మెరిసిన నజీబుల్లా జర్దన్ తాను కొట్టిన ఆరు సిక్సర్లతో ఏకంగా ప్రపంచ రికార్డు సాధించాడు. టి20 క్రికెట్లో చేజింగ్లో డెత్ ఓవర్స్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా నజీబుల్లా జర్దన్ అగ్రస్థానంలో ఉన్నాడు. చేజింగ్ సమయంలో నజీబుల్లా ఇప్పటివరకు 18 సిక్సర్లు(తాజా మ్యాచ్తో కలిపి) బాదాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్(17 సిక్సర్లు), శ్రీలంక ఆల్రౌండర్ తిసార పెరీరా(17 సిక్సర్లు)లను నజీబుల్లా అధిగమించడం విశేషం. దీంతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. టి20 క్రికెట్లో తొలి, రెండో ఇన్నింగ్స్ అని కాకుండా డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగాను నిలిచాడు. నజీబుల్లా ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 53 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ప్రొటిస్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ 47 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.'' వికెట్ చాలా లోగా ఉంది అందుకే నేరుగా ఆడేందుకు ప్రయత్నించాను. ఆరంభంలో కుదురుకునేందుకు కొన్ని బంతులు తీసుకున్నప్పటికి ఆ తర్వాత నా శైలిలో ఆడాను. నేను సరిహద్దులు చూడను.. కేవలం బౌలర్ను మాత్రమే గమనిస్తాను.. విజయంతో సూపర్-4కు చేరుకున్నాం అంటూ నజీబుల్లా మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. రెండు విజయాలతో అఫ్గానిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) తిప్పేశారు. ముసాదిక్ (31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసింది. లక్ష్యంలో సగం స్కోరైనా చేయలేదు. ఈ దశలో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్కు 69 పరుగులు చేసి గెలిపించాడు. చదవండి: Rashid Khan Asia Cup 2022: బంగ్లాపై విజయం.. రషీద్ ఖాన్ ఖాతాలో కొత్త రికార్డు Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ ఆల్రౌండర్ గుడ్బై -
అఫ్రిదిని అధిగమించి, క్రిస్ గేల్కు చేరువైన హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో హిట్మ్యాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదిన హిట్మ్యాన్.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతను పాక్ మాజీ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. ఇదిలా ఉంటే, విండీస్తో నాలుగో టీ20లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్కు మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 96/2గా ఉంది. దీపక్ హుడా (15 బంతుల్లో 19), రిషబ్ పంత్ (15 బంతుల్లో 16) క్రీజ్లో ఉన్నారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్ బౌలర్ ఔట్..! -
జింబాబ్వే బ్యాటర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 34 పరుగులు
ఇటీవలే టి20 ప్రపంచకప్కు అర్హత సాధించామన్న సంబరంలో ఉన్న జింబాబ్వే అందుకు తగ్గ ఆటతీరుతో దూసుకుపోతుంది. సొంత గడ్డపై జరిగిన టి20 సిరీస్లో విజృంభించిన జింబాబ్వే బంగ్లాదేశ్కు షాకిచ్చింది. జింబాబ్వే బ్యాటర్ రియాన్ బర్ల్ (28 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే చాన్స్ తృటిలో మిస్ అయినా దాదాపు ఆ ఫీట్ను అందుకున్నంత పని చేశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్ నసుమ్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్లో రియాన్ 6, 6, 6, 6, 4, 6 బాదాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన రియాన్ బర్ల్ ఐదో బంతిని బౌండరీ తరలించగా.. ఆ తర్వాత ఆఖరి బంతిని మరో సిక్స్గా మలిచాడు. ఓవరాల్గా ఐదు సిక్సర్లు, ఒక బౌండరీ కలిపి మొత్తం 34 పరుగుల్ని పిండేశాడు. టి20 చరిత్రలో యువరాజ్ (6 సిక్స్లు; భారత్), పొలార్డ్ (6 సిక్స్లు; విండీస్)ల తర్వాత రియాన్ బర్ల్ ఆడిన ఓవర్ మూడో విధ్వంసకర ఓవర్గా నిలిచింది. ఇక మూడో టి20 లో జింబాబ్వే 10 పరుగులతో బంగ్లాదేశ్ను ఓడించి సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. మొదట జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిసిన ర్యాన్ బర్ల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకోగా.. తొలి రెండు టీ20ల్లో మెరుపు అర్ధసెంచరీలు సాధించిన సికందర్ రాజా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్ట్ 5 నుంచి ప్రారంభంకానుంది. 6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣ Not an over we usually see! Truly unbelievable batting from @ryanburl3! Watch all the action from the Bangladesh tour of Zimbabwe LIVE, exclusively on #FanCode 👉 https://t.co/Kv4t1gRRPB @ZimCricketv @BCBtigers#ZIMvBAN pic.twitter.com/fqPsdbBmUV — FanCode (@FanCode) August 2, 2022 చదవండి: IND vs WI 3rd T20: సూర్యకుమార్ మెరుపులు.. మూడో టి20లో భారత్ ఘన విజయం -
ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే!
ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ టి20 క్రికెట్లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి రుచి చూపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో పాల్ స్టిర్లింగ్ 51 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. స్టిర్లింగ్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. బర్మింగ్హమ్ బేర్స్, నార్త్ హాంట్స్ మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. కాగా స్టిర్లింగ్ ఇన్నింగ్స్లో హైలైట్ అయింది మాత్రం ఒకే ఓవర్లో 34 పరుగులు బాదడం. ఒక్క ఓవర్లో అన్ని పరుగులు బాదినప్పటికి పాల్ స్టిర్లింగ్ మొహంలో నవ్వు కంటే చిరాకే ఎక్కువగా కనిపించింది. విషయంలోకి వెళితే.. జేమ్స్ సేల్స్ బౌలింగ్లో పాల్ స్టిర్లింగ్ వరుసగా 6,6,6,6,6,4 బాది మొత్తంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్ మొత్తం జేమ్స్ సేల్స్ షార్ట్ బాల్స్ వేయగా.. తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరొక సిక్సర్ కొడితే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చేది. కానీ స్టిర్లింగ్ తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జేమ్స్ సేల్స్ తన ఆరో బంతిని కూడా షార్ట్ బాల్ వేసినప్పటికి యాంగిల్ మారడం.. స్టిర్లింగ్ బ్యాట్ ఎడ్జ్ను తాకి డీప్ థర్డ్మన్ దిశగా బౌండరీ వెళ్లింది. దీంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టలేకపోయాననే బాధ పాల్ స్టిర్లింగ్ మొహంలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టి20 క్రికెట్లో మూడో సెంచరీ అందుకున్న స్టిర్లింగ్ పనిలో పనిగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐర్లాండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 16 ఓవర్లకు మ్యాచ్ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ బేర్స్ పాల్ స్టిర్లింగ్ దాటికి 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్ హంట్స్ 14.2 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. చదవండి: RCB: మరో దక్షిణాఫ్రికాలా తయారైంది.. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో! Alastair Cook: 15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣ - 34 from an over!@stirlo90 is a cheat code 😲 #Blast22 pic.twitter.com/Sy7ByS4wwm — Vitality Blast (@VitalityBlast) May 26, 2022 -
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022.. అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు
క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల రికార్డును (1000) 15వ ఐపీఎల్ ఎడిషన్ సొంతం చేసుకుంది. ఆదివారం సన్రైజర్స్-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ నమోదైంది. పంజాబ్ హిట్టర్ లివింగ్స్టోన్ సిక్సర్తో (1000వ సిక్సర్) ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. 1000 sixes hit in this season of tata ipl.97 metre six by Liam Livingstone.First time in the history of ipl.Most sixes in any ipl season 1)1001* in ipl 2022(still playoffs left) 2)872 in ipl 2018 pic.twitter.com/HJAgD2rSR6 — Shreyans Subham (@ShreyansSubham2) May 22, 2022 అంతకుముందు 2018 సీజన్లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్లో ఆ రికార్డు బద్దలైంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో మరో వంద సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ సీజన్ తొలి సిక్సర్ను సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఉతప్ప బాదగా.. థౌజండ్ వాలా సిక్సర్ను లివింగ్స్టోన్ పేల్చాడు. ఈ సీజన్ లాంగెస్ట్ సిక్సర్ రికార్డు కూడా లివింగ్స్టోన్ పేరిటే నమోదై ఉండటం విశేషం. సీజన్ల వారీగా సిక్సర్ల వివరాలు: 2022 : 1001 (అత్యధికం) 2018 : 872 2009 : 506 (అత్యల్పం) 2022 సీజన్లో లాంగెస్ట్ సిక్సర్లు: లివింగ్స్టోన్ : 117 మీటర్లు టిమ్ డేవిడ్: 114 మీటర్లు డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు చదవండి: పంత్ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు -
బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ 2022 పేరిట ఆల్టైమ్ రికార్డు
ఐపీఎల్ 2022 సీజన్లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. క్యాష్ రిచ్ లీగ్లో బ్యాటర్లు ఏయేటికాయేడు రెచ్చిపోతున్నారు. బౌలింగ్లో అడపాదడపా ప్రదర్శనలు నమోదవుతుంటే.. బ్యాటింగ్లో మాత్రం రికార్డులు బద్ధలవుతున్నాయి. బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారిన బ్యాటర్లు.. సిక్సర్ల విషయంలో పోటీపడిమరీ ఇరగదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ పలు భారీ సిక్సర్ల రికార్డులు కనుమరుగయ్యాయి. అలాగే, సిక్సర్ల విషయంలో ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్ ఓ ఆల్టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు (ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ వరకు) జరిగిన మ్యాచ్ల్లో ఏకంగా 896 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో ఇన్ని సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2018లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్లో ఆ రికార్డు బద్దలైంది. బ్యాటర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ సీజన్లో 1000 సిక్సర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తుంది. 64 మ్యాచ్ల్లోనే 896 సిక్సర్లు బాదిన బ్యాటర్లకు మరో 10 మ్యాచ్ల్లో (ఫైనల్ వరకు) 104 సిక్సర్లు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. సీజన్ల వారీగా సిక్సర్ల వివరాలు: 2022 : 896 (అత్యధికం) 2018 : 875 2009 : 506 (అత్యల్పం) 2022 సీజన్లో లాంగెస్ట్ సిక్సర్లు: లివింగ్ స్టోన్ : 117 మీటర్లు డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు లివింగ్ స్టోన్ : 108 మీటర్లు పూరన్ : 108 మీటర్లు జోస్ బట్లర్ : 107 మీటర్లు చదవండి: బౌలర్ను చూసి బ్యాటింగ్ ఎండ్ మార్చుకున్న వార్నర్.. తొలి బంతికే ఔట్.. -
సీఎస్కే తరపున ధోని అరుదైన రికార్డు
సీఎస్కే ఆటగాడు ఎంఎస్ ధోని ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ధోని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రిషి ధవన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని ధోని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్ దిశగా భారీ సిక్స్ బాదాడు. కాగా ఈ సిక్సర్ సీఎస్కే తరపున ధోనికి 220వది కాగా ఓవరాల్గా 224వది. ఇక సీఎస్కే తరపున ఇప్పటివరకు సురేశ్ రైనా పేరిట ఉన్న అత్యధిక సిక్సర్లు(219) రికార్డును ధోని అధిగమించాడు. ధోని, రైనాల తర్వాత ఫాఫ్ డుప్లెసిస్(93) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్గా సిక్సర్ల విషయంలో ధోని(224) నాలుగో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ 357 సిక్సర్లతో తొలి స్థానంలో, ఏబీ డివిలియర్స్ 239 సిక్సర్లతో రెండో స్థానంలో, రోహిత్ శర్మ 234 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక అంతర్జాతీయ, అన్ని టి20 లీగ్లు కలిపి చూసుకుంటే అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గేల్( 461 మ్యాచ్ల్లో 1056 సిక్సర్లు), కీరన్ పొలార్డ్(579 మ్యాచ్ల్లో 764 సిక్సర్లు) , ఆండ్రీ రసెల్(393 మ్యాచ్ల్లో 517 సిక్సర్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జోస్ బట్లర్ ఖాతాలో మరో సెంచరీ
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ ఐపీఎల్లో మరో సెంచరీ సాధించాడు. అదేంటి ఆర్సీబీతో మ్యాచ్లో బట్లర్ హాఫ్ సెంచరీ కదా చేశాడు అనే డౌట్ రావొచ్చు. కానీ బట్లర్ సెంచరీ పూర్తి చేసింది సిక్సర్ల విషయంలో. అవును ఆర్సీబీతో మ్యాచ్లోనే బట్లర్ ఐపీఎల్లో వంద సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వంద సిక్సర్లు పూర్తి చేయడానికి ఐపీఎల్లో 69 ఇన్నింగ్స్లు అవసరం అయ్యాయి. ఓవరాల్గా ఐపీఎల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న 26వ ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో క్రిస్ గేల్(357 సిక్సర్లు) తొలి స్థానంలో ఉండగా.. ఏబీ డివిలియర్స్(251 సిక్సర్లు), రోహిత్ శర్మ(232 సిక్సర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 222 సిక్సర్లతో ఎంఎస్ ధోని నాలుగు, పొలార్డ్ 215 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లి(212 సిక్సర్లు), సురేశ్ రైనా(203 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(201 సిక్సర్లు) వరుసగా ఉన్నారు. ఇక బట్లర్ తన భీకర ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ చివరి వరకు నిలిచి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి రెండు ఓవర్లలో హెట్మైర్తో కలిసి 42 పరుగులు పిండుకున్న బట్లర్ ఓవరాల్గా 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్గా నిలిచాడు. బట్లర్ ఇన్నింగ్స్లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం. బట్లర్ 70 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్తో పని లేదు' -
రెండు ఐపీఎల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్..
Ruturaj Gaikwad On Verge Of KL Rahul Record: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరిట ఉన్న అత్యధిక పరుగులు(528 పరుగులు), అత్యధిక సిక్సర్ల(22) రికార్డులకు రుతురాజ్ అతి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పేరిట 508 పరుగులు, 20 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్లో మరో 21 పరుగులు, 3 సిక్సర్లు బాదితే కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్తో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డును రుతురాజ్ లాగేసుకుంటాడు. ప్రస్తుతం ఉన్న గణాంకాలను ఈ ఇద్దరు క్రికెటర్లు 12 మ్యాచ్ల్లోనే సాధించారు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్లో తలపడుతున్న ఢిల్లీ, సీఎస్కే జట్ల గణాంకాలు ఇప్పటివరకు సమానంగా ఉన్నాయి. ఇరు జట్లు చెరో 12 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించి తలో 18 పాయింట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే రన్రేట్ పరంగా చూస్తే మాత్రం సీఎస్కే జట్టుదే కాస్త పైచేయిగా ఉంది. ఈ జట్టుకు 0.829 నెట్ రన్రేట్ ఉండగా.. ఢిల్లీకి 0.551 రన్రేట్ ఉంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్లు జరగ్గా సీఎస్కే 15, ఢిల్లీ 9 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్ తొలిదశలో జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్లో 100వ విజయాన్ని నమోదు చేస్తుంది. చదవండి: మ్యాక్స్వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు -
యువీ సిక్సర్ల సునామీ.. నేటికి ఆ పెను విధ్వంసానికి 14 ఏళ్లు
Yuvraj Singh 6 Sixes In T20 World Cup 2007: సరిగ్గా 14 ఏళ్ల క్రితం పొట్టి ఫార్మాట్లో పెను విధ్వంసం చోటు చేసుకుంది. 2007 సెప్టెంబర్ 19న టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. ఆ ఇన్నింగ్స్లో 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్.. 7 భారీ సిక్సర్లు సహా 3 ఫోర్లు బాది 58 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ మ్యాచ్లో టీమిండియా 218 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. యువీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు..
Rohit Sharma Three Sixes Away To Record 400 Sixes In T20s: ఓవరాల్ టీ20 ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. నేటి నుంచి ప్రారంభంకానున్న రెండో దశ ఐపీఎల్-2021 తొలి మ్యాచ్లోనే రోహిత్ ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది. టీ20ల్లో ఇప్పటివరకూ 397 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్.. నేడు చెన్నై సూపర్ కింగ్స్తో జరుగబోయే మ్యాచ్లో మరో మూడు సిక్సర్లు కొడితే, ఈ ఫార్మాట్లో 400 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గేల్ ఏకంగా 1042 సిక్సర్లు బాది ఈ జాబితాలో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గేల్ తర్వాతి స్థానాల్లో విండీస్ యోధులు పోలార్డ్(755), ఆండ్రీ రసెల్(509) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్(397) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ కంటే ముందు ఆరోన్ ఫించ్(399), ఏబీ డివిలియర్స్(430), షేన్ వాట్సన్(467), బ్రెండన్ మెక్కలమ్(485) ఉన్నారు. ఇక పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ క్రికెటర్ల విషయాకొస్తే.. ఈ లిస్ట్లో రోహిత్ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా(324), విరాట్ కోహ్లి(315), ఎంఎస్ ధోని(303) ఉన్నారు. ఇదిలా ఉంటే, క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో పునః ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై(10), బెంగళూరు(10), ముంబై(8) జట్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. చదవండి: మ్యాచ్కు ముందు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. భయంతో వణికిపోయాం -
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్
అల్ అమీరట్ (మస్కట్): అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత నమోదైంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జస్కరన్ మల్హోత్రా (అమెరికా) నిలిచాడు. పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్ వరుసగా 6, 6, 6, 6, 6, 6 పరుగులు బాదాడు. చండీగఢ్లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: T20 World Cup 2021: స్టార్ ఓపెనర్కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే ఈ ఇన్నింగ్స్లో 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 173 పరుగులతో అజేయంగా నిలిచిన అతను వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మోర్గాన్ (17) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. 2007 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో డాన్ వాన్ బంగ్ ఓవర్లో హెర్షల్ గిబ్స్ 6 సిక్సర్లు కొట్టగా... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ ఈ అరుదైన ఫీట్ను ప్రదర్శించారు. చదవండి: శిఖర్ ధావన్ను అందుకే ఎంపిక చేయలేదా! -
క్రికెట్ చరిత్రలో అతి భారీ సిక్స్.. కొడితే కనుచూపు మేరలో కనపడలేదు
Liam Livingstone Six: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20లో క్రికెట్ చరిత్రలోనే అతి భారీ సిక్స్ నమోదైంది. లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విధ్వంసకర యోధుడు లియామ్ లివింగ్స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సర్ను నమోదు చేశాడు. ఈ సిక్సర్ ఏకంగా మైదానాన్ని దాటి పక్కనే ఉన్న రగ్బీ పిచ్పై పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16 వ ఓవర్లో పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా గట్టిగా బాదడంతో అది కనుచూపు మేరలో కనబడలేదు. ఈ సిక్స్ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన అతి భారీ సిక్సర్ అని వ్యాఖ్యాతలతోపాటు నెటిజన్లు అంటున్నారు. అయితే, ఈ సిక్స్ యొక్క అధికారిక పొడవును కొలవడం మాత్రం సాధ్యపడలేదు. కాగా, ఇలాంటి సిక్స్ను తాము ఇంతవరకు చూడలేదని స్కై స్పోర్ట్స్ కామెంట్రేటర్లుగా ఉన్న ఇయాన్ వార్డ్, కుమార సంగక్కర మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తమ అధికారిక ట్విట్టర్లో ఈ సిక్సర్ వీడియోని షేర్ చేసి 'ఇదేనా అతి భారీ సిక్స్?' అంటూ ప్రశ్నించింది. కాగా, ఈ మ్యాచ్లో బట్లర్ (59), మొయిన్ అలీ (36), లియామ్ లివింగ్స్టోన్ (38) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ బౌలింగ్తో పాకిస్తాన్ కట్టడి చేశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20లోనూ లివింగ్స్టోన్ 42 బంతుల్లోనే శతకొట్టడం విశేషం. Biggest six ever?! 😱 @LeedsRhinos, can we have our ball back? 😉 Scorecard/clips: https://t.co/QjGshV4LMM 🏴 #ENGvPAK 🇵🇰 pic.twitter.com/bGnjL8DxCx — England Cricket (@englandcricket) July 18, 2021 -
విజయానికి 35 పరుగులు.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు
డబ్లిన్: టీ20 క్రికెట్ అంటేనే మజాకు పెట్టింది పేరు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంటుంది. అలాంటిది ఆఖరి ఓవర్లో 35 పరుగులు విజయానికి అవసరం అన్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఆశలు వదులుకోవడం సహజం. ఎందుకంటే ఆడిన ప్రతీ బంతిని సిక్స్ కొడితే గానీ మ్యాచ్ గెలవడం సాధ్యమవుతుంది.అచ్చంగా అదే పరిస్థితిలో దాదాపు ఓటమి అంచున ఉన్న టీమ్కు అద్భుత విజయాన్ని అందించాడు బాలీమెనా బ్యాట్ప్మెన్ జాన్ గ్లాస్. క్లబ్ క్రికెట్లో భాగంగా జాన్ గ్లాస్ ఈ అరుదైన ఫీట్ను అందుకున్నాడు. అందులోనూ టోర్నీ ఫైనల్ మ్యాచ్.. దాంట్లోను ఆఖరి ఓవర్.. అసలు ఒత్తిడి అనే పదాన్ని దరి చేరనీయకుండా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాది జాన్ గ్లాస్ అద్భుతం చేశాడు. ఐర్లాండ్ ఎల్వీఎస్ టీ20లో క్రెగాగ్, బాలీమెనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్ను చేధించే క్రమంలో బాలీమెనా 19 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరి ఓవర్కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. గ్లాస్(87*) అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇదే మ్యాచ్లో గ్లాస్ సోదరుడు సామ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఇక టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు అనగానే మొదట గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువీ ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్పై కోపంతో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత హర్షలే గిబ్స్, కీరన్ పొలార్డ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఫీట్లే నమోదు చేశారు. అయితే ఒక మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాదడం అనేది ఇదే తొలిసారి. ప్రస్తుతం జాన్ గ్లాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. JOHN GLASS TAKE A BOW! He has just hit 36 off the final over and Ballymena are the 2021 Lagan Valley Steels 2021 champions. What an innings from the skipper. #ncut20t pic.twitter.com/afatC6Q7co — Northern Cricket Union (@NCU_News) July 15, 2021 -
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్గా కొట్టేశాడు
లండన్: క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువీ ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత ఇలాంటి రికార్డులు చాలానే చూశాం. దక్షిణాఫ్రికా నుంచి హర్షలే గిబ్స్, శ్రీలంక నుంచి తిసార పెరీరా.. ఈ మధ్యనే విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆల్రౌండర్ జడేజా ఒకే ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు బాది.. ఆఖరిబంతికి ఫోర్ కొట్టడంతో తృటిలో రికార్డును మిస్ అయ్యాడు. తాజాగా ఆ అద్భుతం మరోసారి చోటుచేసుకుంది. అయితే ఈసారి ఇది జరిగింది యూరోపియన్ క్రికెట్ డొమెస్టిక్ లీగ్లో. విషయంలోకి వెళితే.. ఈసీఎస్ టీ10 పేరిట జరుగుతున్న టోర్నీలో శుక్రవారం బేయర్ ఉర్డింజిన్ బూస్టర్స్ , కోన్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బేయర్ ఉర్డింజిన్ బ్యాట్స్మన్ అరితరన్ వసీకరణ్ ఆయుష్ శర్మ బౌలింగ్లో ఈ ఫీట్ను సాధించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ మ్యాజిక్ చోటుచేసుకుంది. ఆయుష్ శర్మ వేసిన ఆరు బంతులను వరుసగా.. మిడ్ వికెట్, మిడ్ వికెట్,స్క్వేర్లెగ్, మిడ్ వికెట్, స్క్వేర్లెగ్, మిడాన్ దిశగా ఆరు సిక్సుల బాదాడు. అతను క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది. అతని సిక్సర్ల దెబ్బకు ఒక్క ఓవర్ తిరిగే సరికి బూస్టర్స్ స్కోరు 5 ఓవర్లలో 57/3గా నమోదైంది. మొత్తంగా వసీకరణ్ 25 బంతులెదుర్కొని 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్లు.. మూడు బౌండరీలు ఉన్నాయి. కాగా బూస్టర్స్ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఎక్కడ దొరకలేదు.. కానీ కొంతమంది నెటిజన్లు తమ ట్విటర్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. చదవండి: జడేజా పేసర్ అయితే బాగుండు.. మాకు చాన్స్ వచ్చేది 6 sixes in a single over by Aritharan Vaseekaran in European Cricket series. pic.twitter.com/TzvnfOc36F — Johns. (@CricCrazyJohns) May 21, 2021 Aritharan Vaseekaran, the latest addition to the six-sixes club. #ECST10 pic.twitter.com/nsr5Zf35lX — srikrishna 🏏 (@1998Srikrishna) May 21, 2021 -
సిక్సర్లలో 7వ స్థానం.. అరుదైన రికార్డు
ముంబై: సీఎస్కే బ్యాట్స్మన్ సురేశ్ రైనా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 200 సిక్సర్లు కొట్టిన 7వ ఆటగాడిగా రైనా నిలిచాడు. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో చహల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్గా మలిచిన రైనా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సర్లు బాదిన రైనా మొత్తంగా 24 పరుగులు సాధించాడు. కాగా రైనా కంటే ముందు గేల్ 354 సిక్సర్లతో టాప్లో ఉండగా.. ఏబీ డివిలియర్స్(240) రోహిత్ శర్మ(222), ఎంఎస్ ధోని(217), కోహ్లి(204), పొలార్డ్(202) తొలి ఆరు స్థానాల్లో నిలిచారు. ఇక ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జడేజా 11, రాయుడు 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు డుప్లెసిస్ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. -
ఐపీఎల్ చర్రితలో గేల్ అరుదైన రికార్డు..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో(ఐపీఎల్) విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ కీలక సభ్యుడు క్రిస్ గేల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్లిపోయాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బెన్ స్టోక్స్ బౌలింగ్లో అదిరిపోయే సిక్సర్ బాదిన గేల్.. ఐపీఎల్ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతను తెవాతియా బౌలింగ్లో సైతం మరో సిక్సర్ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు. Milestone 🚨 - 3⃣5⃣0⃣ Maximums in the IPL for the Universe Boss 💥💥#VIVOIPL | #RRvPBKS | @henrygayle pic.twitter.com/bhIxAAmq2J — IndianPremierLeague (@IPL) April 12, 2021 ఇదిలా ఉంటే, లీగ్ చరిత్రలో మరే ఇతర బ్యాట్స్మన్ కనీసం 250 సిక్సర్ల మార్క్ కూడా చేరుకోలేకపోవడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, ఆర్సీబీ కీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి ధోని 216 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 214, బెంగళూరు కెప్టెన్ కోహ్లి 201 సిక్సర్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్లు ఆడిన గేల్ 351 సిక్సర్లు బాదాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేయడంలో గేల్(28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన వంతు పాత్ర పోషించాడు. -
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్రౌండర్
కొలొంబో: శ్రీలంక ఆల్రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డును సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి లంక క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో భాగంగా శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రత్యర్ధి బౌలర్ దిల్హన్ కూరే బౌలింగ్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో అతను 13 బంతుల్లోనే హాఫ్సెంచరీ(52 పరుగులు) పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా, అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు శ్రీలంక ఆల్రౌండర్ కౌసల్య వీరరత్నే పేరిట నమోదై ఉంది. రంగన క్రికెట్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించిన వీరరత్నే 2005 నవంబర్లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 66) పూర్తిచేశాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. వీరరత్నే ఫిఫ్టీలో 2 ఫోర్లు, 8 సిక్సర్లుండగా... అందులో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు సాధించడం విశేషం. కాగా, తిసార పెరీరా ఈ ఘనతను సాధించడానికి కొద్ది వారాల క్రితమే అంతర్జాతీయ టీ20లో విండీస్ యోధుడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. శ్రీలంకతోనే జరిగిన ఈ మ్యాచ్లో లంక బౌలర్ అఖిల ధనుంజయ బౌలింగ్లో పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో తిసార పెరీరా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పెరీరాకు ముందు గ్యారి సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్(భారత్), రాస్ వైట్లీ(ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్ఘనిస్తాన్), లియో కార్టర్(న్యూజిలాండ్), పోలార్డ్(వెస్టిండీస్) ఉన్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ శిబిరంలో రోహిత్ -
ఆ జాబితాలో ఫించ్ కూడా చేరాడు..
వెల్లింగ్టన్: ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఫించ్ విధ్వంసకర వీరుల జాబితాలో చేరాడు. టీ20ల్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 135 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. హిట్మ్యాన్ రోహిత్శర్మ (127) రెండో స్థానంలో, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (113) మూడో స్థానంలో, న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో (107) నాలుగులో, విండీస్ యోధుడు గేల్ (105) ఐదో స్థానంలో ఉన్నారు. తాజాగా ఫించ్ వీరి సరసన చేరాడు. కాగా, టీ20 ఫార్మాట్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఫించే కావడం విశేషం. ఫించ్ 70 ఇన్సింగ్స్ల్లో రెండు సెంచరీలు, 14 అర్థ సెంచరీల సాయంతో 2,310 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా. సహచర ఆటగాడు వార్నర్ 81 మ్యాచ్ల్లో సెంచరీ, 18 అర్ధ సెంచరీల సాయంతో 2,265 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్లో ఫింఛ్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 పరుగుల తేడాతో కివీస్పై విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో ఆసీస్ 2-2తో సమంగా నిలిచింది. -
ఆసీస్పై రోహిత్ సెంచరీ సిక్సర్ల రికార్డు
సిడ్నీ: రోహిత్ శర్మ అంటేనే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఒక్కసారి మైదానంలో పాతుకుపోయాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఆసీస్ టూర్కి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్ వచ్చీ రావడంతోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లు కలిపి 100 సిక్సర్లు కొట్టిన ఏకైక టీమిండియా ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నాథన్ లయన్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ ద్వారా ఈ ఘనత సాధించాడు. రోహిత్ ఆసీస్పై కొట్టిన వంద సిక్సర్లలో 63 సిక్స్లు వన్డేల్లోనే రావడం విశేషం.తాజాగా మూడో టెస్టులో కొట్టిన సిక్స్తో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 424కు చేరింది. ఇప్పటి వరకూ చూసుకుంటే టీమిండియాలో ఏ క్రికెటర్కూ ఆసీస్పై ఇన్ని సిక్సర్లు బాదిన ఘనత లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో రోహిత్ కంటే ముందు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు విండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ (534 సిక్సర్లు) కాగా.. మరొకరు పాకిస్థాన్ బ్యాట్స్మన్ షాహిద్ అఫ్రిది (476 సిక్సర్లు). ఒక ప్రత్యర్థిపై వంద సిక్స్లు కొట్టిన రెండో ప్లేయర్ రోహిత్. ఇంతకుముందు ఇంగ్లండ్పై అన్ని ఫార్మాట్లలో కలిపి గేల్ 140 సిక్సర్లు కొట్టాడు. రోహిత్కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీ చేసింది ఆస్ట్రేలియాపైనే. 2013లో బెంగళూరులో జరిగిన వన్డేలో 209 పరుగులు చేయగా.. అందులో ఏకంగా 16 సిక్సర్లు ఉండటం విశేషం. ఆసీస్ పేరు చెబితేనే పూనకం వచ్చిన వాడిలా చెలరేగిపోయే హిట్మ్యాన్ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 8 సెంచరీలు బాదాడు.(చదవండి: నా ఫోకస్ మొత్తం అశ్విన్పైనే) International six No.424 for Rohit Sharma! Live #AUSvIND: https://t.co/xdDaedY10F pic.twitter.com/nypB41kYvB — cricket.com.au (@cricketcomau) January 8, 2021 -
ఆ ఒక్క సిక్సర్తో వరల్డ్ కప్ గెలవలేదు!
న్యూఢిల్లీ: భారత జట్టు రెండో సారి వన్డే ప్రపంచకప్ సాధించిన రోజు 2011, ఏప్రిల్ 2 గురించి తలచుకోగానే కెప్టెన్ ధోని అద్భుతమైన సిక్సర్తో మ్యాచ్ను ముగించిన క్షణం అభిమానుల మనసుల్లో మెదులుతుంది. ఆ షాట్ అందరి హృదయాల్లోనూ అలా ముద్రించుకుపోయింది. అయితే శ్రీలంకపై నాటి ఫైనల్ విజయంలో అందరూ విస్మరించే అంశం గౌతం గంభీర్ ఆడిన కీలక ఇన్నింగ్స్ గురించే. 31 పరుగుల వద్దే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడిన గంభీర్ విజయానికి పునాది వేశాడు. చివరకు 122 బంతుల్లో 97 పరుగులు చేసిన అతను త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వరల్డ్ కప్ జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడల్లా ధోని సిక్సర్పైనే చర్చ జరగడంపై తన అసహనాన్ని గంభీర్ ఏనాడూ దాచుకోలేదు. దానిపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతూ వచ్చిన అతను 9 ఏళ్ల తర్వాత కూడా మరోసారి ఆ ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ‘క్రిక్ఇన్ఫో’ ధోని ఆడిన చివరి షాట్ ఫోటో పెట్టి ‘2011లో ఈ రోజు... లక్షలాది భారతీయుల సంబరాలకు కారణమైన షాట్’ అని వ్యాఖ్య జోడించింది. దీనిపై గంభీర్ వెంటనే స్పందించాడు. ‘క్రిక్ఇన్ఫో...మీకో విషయం గుర్తు చేస్తున్నా. 2011 ప్రపంచకప్ భారత్ గెలిచింది. మొత్తం భారత జట్టు, సహాయక సిబ్బంది గెలిచింది. ఒక సిక్స్పై మీకున్న అతి ప్రేమను బయటకు విసిరి కొట్టండి’ అని ఘాటుగా బదులిచ్చాడు. విరాళంగా రెండేళ్ల జీతం... ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు కూడా అయిన గంభీర్ కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వానికి తన వంతు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఎంపీగా తనకు లభించే రెండేళ్ల జీతాన్ని ‘పీఎం కేర్’ ఫండ్కు విరాళంగా ఇస్తున్నట్లు అతను ప్రకటించాడు. ఇంతకు ముందే నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన అతను ఎంపీ ల్యాడ్స్ నిధులలో రూ. 1 కోటి దీనికి కేటాయిస్తున్నట్లు కూడా చెప్పాడు. విరాళాలు అందించిన ఇతర క్రీడా ప్రముఖులలో భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ (రూ. 4 లక్షలు), ప్రముఖ షూటర్ అపూర్వి చండీలా (రూ. 5 లక్షలు), భారత బ్యాడ్మింటన్ సంఘం (రూ. 10 లక్షలు) ఉన్నారు. -
టీమిండియా వరల్డ్ రికార్డ్
రాజ్కోట్: టి20ల్లో టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. బంగ్లాదేశ్తో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. పొట్టి ఫార్మాట్ ఛేజింగ్లో భారత జట్టుకు ఇది 41వ విజయం కావడం విశేషం. 61వ సార్లు టీమిండియా ఛేజింగ్కు దిగగా 41 పర్యాయాలు విజయాల్ని అందుకుంది. 40 విజయాలతో ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. అయితే ఆసీస్ 69 సార్లు సెకండ్ బ్యాటింగ్ దిగి 40 సార్లు గెలిచింది. అంటే ఆస్ట్రేలియా కంటే తక్కువ మ్యాచ్ల్లోనే టీమిండియా ఛేజింగ్ రికార్డును చేజిక్కించుకుంది. రోహిత్.. రికార్డులే రికార్డులు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పలు రికార్డులు బ్రేక్ చేశాడు. టి20ల్లో అత్యధిక సిక్సర్లు(37) సాధించిన కెప్టెన్గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(34) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ధోని 62 ఇన్నింగ్స్లో ఈ రికార్డు సాధించగా, రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 26 ఇన్నింగ్స్లో 26 సిక్సర్లతో విరాట్ కోహ్లి వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు. అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. 22వ అర్ధసెంచరీతో విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. కెప్టెన్గా వీరిరువురూ ఆరు అర్థసెంచరీలు సాధించడం విశేషం. టి20ల్లో వంద కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును కూడా శిఖర్ ధావన్తో కలిసి రోహిత్ శర్మ తన పేరిట లఖించుకున్నాడు. గతంలో కోహ్లితో కలిసి మూడు సార్లు వంద ప్లస్ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ‘హిట్మాన్’ తాజాగా శిఖర్ ధావన్తో కలిసి ఈ ఫీట్ను పునరావృతం చేశాడు. రాజ్కోట్ మ్యాచ్లో వీరిద్దరూ 118 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. (చదవండి: రోహిత్ తుఫాన్: రెండో టి20లో భారత్ జయభేరి) -
ధోని రికార్డుకు రోహిత్ ఎసరు!
మాంచెస్టర్: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. మరో 2 సిక్సర్లు బాదితే ధోని రికార్డును అధిగమిస్తాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మన్గా నిలుస్తాడు. 210 వన్డేలు ఆడిన రోహిత్ ఇప్పటివరకు 224 సిక్సర్లు బాదాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఖాతాలో 225 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది(351 సిక్సర్లు), వెస్టిండీస్ హిట్టర్ క్రిస్గేల్(324 సిక్సర్లు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రీలంక మాజీ ఆల్రౌండర్ సనత్ జయసూర్య 270 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 250 కంటే తక్కువ మ్యాచ్లు ఆడి ఈ జాబితాలో టాప్-5లో నిలిచిన ఒకే ఒక్కడు రోహిత్ కావడం విశేషం. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లను కలిపి చూస్తే ధోని కంటే రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్లు ఎక్కువగా ఉన్నాయి. 358 సిక్సర్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోని 355 సిక్సర్లు కొట్టాడు. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. రెండు సెంచరీలు, అర్ధశతకంతో 320 పరుగులు సాధించాడు. ఈరోజు వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో రాణించి తన రికార్డులను మరింత మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
మార్చి 16.. మర్చిపోలేని రోజు!
క్రికెట్ అభిమానులు ఈ రోజు(మార్చి 16)ను మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయిన రోజు. అందులో ఒకటి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలు సాధించింది కాగ, మరొకటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ హెర్షల్ గిబ్స్ తొలి సారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి నయా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ శతకాలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఇదే రోజున. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్పై చేసిన శతకం సచిన్కు వన్డేల్లో 49వ సెంచరీ కాగా, టెస్టులు(51), వన్డేల్లో కలుపుకుని వంద సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా ఈ "లిటిల్ మాస్టర్" సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతతో యావత్ క్రికెట్ అభిమానులు తెగ పండగ చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్(71) సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇప్పటివరకు 66 అంతర్జాతీయ సెంచరీలు సాధించి సచిన్ ‘వంద శతకాల’పై కన్నేశాడు. సిక్సర్ల సునామీ ఇక పన్నెండేళ్ల క్రితం సిరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు హెర్ష్లీ గిబ్స్ అద్భుతం చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిబ్స్ అతడికి చుక్కలు చూపించాడు. అప్పటివరకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో రవిశాస్త్రి, గార్ఫీల్డ్ సోబర్స్ సాధించిన రికార్డే(ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు) అత్యుత్తమం కావడం విశేషం. గిబ్స్ ఈ ఘనత అందుకున్న కొద్ది నెలల అనంతరం టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ రికార్డు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బ్రాడ్ బౌలింగ్లో యువీ ఈ ఫీట్ అందుకున్నాడు. -
"లిటిల్ మాస్టర్" వంద సెంచరీకి ఏడేళ్లు
-
వరుసగా 6 సిక్సర్లతో సంచలనం
-
వరుసగా 6 సిక్సర్లతో సంచలనం
హెర్షెలె గిబ్స్.. క్రికెట్ ప్రేమికులకు చిరపరితమైన పేరు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మన్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. దూకుడుగా ఆడటంలో అతడు పేరుగాంచాడు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున(మార్చి 16) వన్డే మ్యాచ్లో గిబ్స్ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్లో ఈ ఘనత నమోదు చేశాడు. నెదర్లాండ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో చెలరేగి ఆడిన గిబ్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 2007 వన్డే వరల్డ్ కప్లో భాగంగా గ్రూప్ ఏలో జరిగిన లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. జాక్వెస్ కల్లిస్(128) అజేయ శతకంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 132 పరుగులు మాత్రమే చేసింది. -
సిక్సర్ల రికార్డు సమం
బాసెటెర్ (వెస్టిండీస్): వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో గేల్(73; 66 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. ఈ మ్యాచ్లో ఐదో సిక్సర్ను సాధిండం ద్వారా గేల్ తన కెరీర్లో 476వ సిక్సర్ను నమోదు చేశాడు. ఫలితంగా ఆఫ్రిది(476 సిక్సర్లు) అత్యధిక సిక్సర్ల రికార్డును గేల్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఆఫ్రిది, గేల్ తర్వాత బ్రెండన్ మెకల్లమ్(398), సనత్ జయసూర్య(352), ఎంఎస్ ధోని(342), ఏబీ డివిలియర్స్(328), రోహిత్ శర్మ(291), మార్టిన్ గప్టిల్(274), సచిన్ టెండూల్కర్(264)లు ఉన్నారు. వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ సిరీస్ గెలుచుకుంది. -
రోహిత్ శర్మ అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా ఓపెనర్ రోహిత్ తన ఫామ్ చాటుకుంటూ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇండోర్లో జరిగిన మూడో వన్డేలో బాదిన నాలుగు సిక్సర్లతో ఆ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (61 సిక్సర్లు)ను రోహిత్ (65 సిక్సర్లు) అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 60 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. ఈ నాలుగేళ్లలో భారత ఓపెనర్గా 79 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ 113 సిక్సర్లు బాదాడు. ఈ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ 106 సిక్సర్ల (86 ఇన్నింగ్స్లు)తో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 95 ఇన్నింగ్స్ల్లో 100 సిక్సర్లు బాదాడు. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ నాలుగేళ్ల వ్యవధిలో ఓపెనర్గా 143 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్శర్మ 169 సిక్సర్లు సాధించగా, ఇందులోనూ సఫారీ స్టార్ ప్లేయర్ డివిలియర్స్ 153 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ నాలుగేళ్లలో ఓవరాల్గా 160 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ 43.28 సగటు, 85.19 స్ట్రైక్ రేట్తో 5843 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 13 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు.