Asia Cup
-
తొలిసారి ఆసియా కప్ బరిలో ఒమన్
న్యూఢిల్లీ: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈసారి 8 జట్లు పాల్గొననున్నాయి. ఒమన్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్లో తొలి రెండు స్థానాల్లో నిలువడం ద్వారా యూఏఈ, ఒమన్ జట్లు ఆసియా కప్ టోర్నీకి అర్హత పొందాయి. ఈ రెండు జట్లతోపాటు హాంకాంగ్ జట్టు కూడా ఆసియా కప్లో ఆడనుంది. 2026లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యలో ఈసారి ఈ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. 2023 వన్డే ప్రపంచకప్నకు ముందు జరిగిన ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరిగే అవకాశమున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉన్నప్పటికీ... తటస్థ వేదికపై టోర్నీ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లకుండా... దుబాయ్లోనే అన్నీ మ్యాచ్లు ఆడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు కూడా భారత్లో పర్యటించబోమని గతంలోనే వెల్లడించింది. దీంతో ఆసియా కప్ను యూఏఈ, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. -
ఈ ఏడాది మరో మూడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఈ ఏడాది మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ను షెడ్యూల్ చేసింది. ఈసారి ఈ కాంటినెంటల్ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో భారత్, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ రెండు, నాలుగు వారాల మధ్యలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీ మొదట భారత్కు కేటాయించబడింది. అయితే, భారత్-పాక్ల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ప్రస్తుతానికి వేదిక ఖరారు కానప్పటికీ.. యూఏఈ లేదా శ్రీలంకలో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ టోర్నీ 2025 ఎడిషన్లో భారత్, పాక్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. ఉపఖండం నుండి నేపాల్ ఒక్కటే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.గత ఎడిషన్లోలాగా, ఈ ఏడాది ఆసియా కప్లో కూడా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించబడతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్కు చేరతాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ ఫోర్ రౌండ్లో మరోసారి.. ఫైనల్లో మూడోసారి తలపడే అవకాశం ఉంది.కాగా, 2031లో ముగిసే ప్రస్తుత సైకిల్లో నాలుగు ఆసియా కప్లు జరుగనున్నాయి. 2025 ఎడిషన్ (19 మ్యాచ్లు) తర్వాత, 2027 ఎడిషన్ బంగ్లాదేశ్లో (13 మ్యాచ్లు) వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఆతర్వాత పీసీబీ ఆతిథ్యం ఇచ్చే టోర్నీ టీ20 ఫార్మాట్లో (19 మ్యాచ్లు) జరుగుతుంది. చివరిగా, 2031 ఎడిషన్ వన్డే ఫార్మాట్లో (13 మ్యాచ్లు) శ్రీలంకలో జరుగుతుంది. -
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్లో శ్రీలంకపై విజయంతో ఫైనల్కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్లో ఉన్నారు. ఇక బౌలింగ్లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
మెరిసిన త్రిష... భారత్ ఘనవిజయం
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ‘సూపర్ ఫోర్’ దశలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించి నెగ్గింది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (46 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కమలిని (0), సనిక చాల్కె (1) వెంటవెంటనే అవుటైనా కెపె్టన్ నిక్కీ ప్రసాద్ (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ త్రిష టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే మరో ‘సూపర్ ఫోర్’ మ్యాచ్లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది -
Ind vs Pak: పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్
జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్(ACC Women's U-19 Asia Cup)లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కౌలాలాంపూర్ వేదికగా భారత జట్టు ఆదివారం పాకిస్తాన్తో తలపడింది. అద్భుత ఆట తీరుతో చిరకాల ప్రత్యర్థిని ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.అదరగొట్టిన సోనమ్ యాదవ్ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోమల్ ఖాన్ (24; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... యువ భారత బౌలర్లలో సోనమ్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.PC: ACCకమలిని మెరుపు ఇన్నింగ్స్అనంతరం భారత జట్టు 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 68 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కమలిని మెరుపు ఇన్నింగ్స్తో పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచింది.మరో 73 బంతులు మిగిలుండగానేమరో ఎండ్ నుంచి సనికా చాల్కే (19 నాటౌట్; 3 ఫోర్లు) కమలినికి సహకారం అందించింది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కమలిని భారీ షాట్లతో విరుచుకుపడటంతో మరో 73 బంతులు మిగిలుండగానే గెలిచింది. పాక్పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కమలినికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక తదుపరి మ్యాచ్లో భారత జట్టు మంగళవారం నేపాల్తో తలపడనుంది. కాగా జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీకి మలేషియా ఆతిథ్యం ఇస్తోంది.చదవండి: WPL: మినీ వేలంలో పదహారేళ్ల ప్లేయర్పై కనక వర్షం.. ఎవరీ కమలిని? -
చైనాపై భారత్దే పైచేయి
మస్కట్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా... వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్లను భారత గోల్కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఫైనల్ చేరుకునే క్రమంలో లీగ్ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్ జిన్జువాంగ్ గోల్ చేయడంతో మాజీ చాంపియన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను కనిక సివాచ్ గోల్గా మలచడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది. -
ఆసియా కప్-2024కు భారత జట్టు ప్రకటన.. తెలుగు ప్లేయర్లకు చోటు
న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్లో పాల్గొననున్న భారత అండర్–19 జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ చోటు దక్కించుకున్నారు. కౌలాలాంపూర్ వేదికగా ఈ నెల 15 నుంచి 22 వరకు జూనియర్ మహిళల ఆసియా కప్ జరగనుంది.సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నికీ ప్రసాద్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా... సనికా చాల్కె వైస్ కెపె్టన్గా వ్యవహరించనుంది. అండర్–19 ప్రపంచకప్లో ఆడిన అనుభవం ఉన్న త్రిషతో పాటు మహిళల ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నమ్ ఇందులో చోటు దక్కించుకున్నారు.నలుగురు స్టాండ్బై ఆటగాళ్లను ప్రకటించగా... అందులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ కావ్యశ్రీ కూడా ఉంది. ఈ టోరీ్నలో పాకిస్తాన్, నేపాల్తో కలిసి భారత్ జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీ పడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. టోర్నీ ఆరంభ పోరులో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత జట్టు తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్–4కు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 22 జరగనున్న ఫైనల్లో తలపడనున్నాయి. భారత జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సనికా చాల్కె (వైస్ కెపె్టన్), గొంగడి త్రిష, కమలిని, భావిక అహిరె, ఈశ్వరి అవాసరె, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, అనందిత కిషోర్, షబ్నమ్, నందన. స్టాండ్బైలు: హర్లీ గాలా, హ్యాపీ కుమారి, గుగులోత్ కావ్యశ్రీ, గాయత్రి. -
సెమీఫైనల్లో భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరింది. తద్వారా జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సంపాదించింది. ఆసియా టైటిల్ వేటలో భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9–0 గోల్స్ తేడాతో థాయ్లాండ్పై ఏకపక్ష విజయం సాధించింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక అద్భుతంగా రాణించింది. ఆమె నాలుగు (28వ, 31వ, 35వ, 55వ నిమిషాల్లో) గోల్స్ చేయగా, కనిక సివాచ్ (23వ, 25వ, 40వ నిమిషాల్లో) మూడు గోల్స్ అందించింది. మిగతా వారిలో సాక్షి రాణా (17వ నిమిషంలో), లాల్రిన్పుయి (27వ నిమిషంలో), గోల్స్ చేశారు. భారత్ తొలి అర్ధభాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికే 5–0తో మ్యాచ్ను శాసించేస్థితిలో నిలిచింది. మూడు, నాలుగో క్వార్టర్లలో మరో నాలుగు గోల్స్ సాధించింది. మూడో క్వార్టర్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయడం ద్వారా దీపిక, కాసేపటికే మూడో గోల్ సాధించిన కనిక ‘హ్యాట్రిక్స్’ నమోదు చేశారు. శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్తో భారత్; చైనాతో దక్షిణ కొరియా తలపడతాయి. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
భారత్ X బంగ్లాదేశ్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో యువ భారత్ హాట్ ఫేవరెట్. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలిచింది. గత ఏడాదీ గెలిచే దారిలో బంగ్లాదేశ్ అడ్డుకుంది. దీంతో 2023 టోర్నీలో భారత అండర్–19 టీమ్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇప్పుడు ఆ సెమీస్ పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చి0ది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్ను అమీతుమీలో కంగు తినిపించి తొమ్మిదోసారి విజేతగా నిలిచేందుకు యువ భారత్ తహతహలాడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాపై విజయమే లక్ష్యంగా భారత కుర్రాళ్ల జట్టు బరిలోకి దిగుతోంది. టోర్నీలో పాక్తో తొలి మ్యాచ్ ఓడాక భారత్ వరుస విజయాలు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న యువ జట్టు వరుసగా జపాన్పై ఏకంగా 211 పరుగుల తేడాతో, యూఏఈపై పది వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో లంకపై 7 వికెట్ల తేడాతో ఇలా ప్రతీజట్టుపై భారీ విజయాలనే నమోదు చేసింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో అదరగొడుతున్నాడు. ఆయుశ్ మాత్రేతో కలిసి చక్కని శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో ఆయుశ్ 175 పరుగులు చేయగా, వైభవ్ 167 పరుగులతో నిలకడను ప్రదర్శించారు. నేడు జరిగే తుది పోరులోనూ వీళ్లిద్దరు మరో శుభారంభం ఇస్తే భారత్ ట్రోఫీ గెలిచేందుకు సులువవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ అస్త్రాలతో ప్రత్యర్థుల్ని కట్టిపడేస్తోంది. సెమీఫైనల్లో పాక్ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు ఫహాద్, ఇక్బాల్ హసన్ ఎమన్ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇద్దరు చెరో 10 వికెట్లతో జోరు మీదున్నారు. బ్యాటింగ్లో కెప్టెన్ అజీజుల్ హకీమ్, కలామ్ సిద్ధిఖీ, అబ్రార్ ఫామ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే టైటిల్ పోరు భారత్ బ్యాటింగ్, బంగ్లా బౌలింగ్ మధ్య రసవత్తరంగా జరగనుంది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
‘ఆసియా’ యువ భారత్దే
మస్కట్: ఒకే విజయంతో యువ భారత జట్టు రెండు లక్ష్యాలను సాధించింది. పురుషుల అండర్–21 ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో శర్దానంద్ తివారి సారథ్యంలోని టీమిండియా 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ టైటిల్ను ఐదోసారి సొంతం చేసుకుంది. గతంలో భారత జట్టు 2004, 2008, 2015, 2023లలో ఈ టైటిల్ను సాధించింది. తాజా విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇదే టోర్నీలో గతంలో రెండుసార్లు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు మూడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ ఏకంగా నాలుగు గోల్స్ (4వ, 18వ, 47వ, 54వ నిమిషాల్లో) సాధించగా... దిల్రాజ్ సింగ్ (19వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. పాకిస్తాన్ జట్టు తరఫున సూఫియాన్ ఖాన్ (30వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... హన్నాన్ షాహిద్ (3వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1తో మలేసియాను ఓడించింది. పాకిస్తాన్, జపాన్, మలేసియా జట్లు కూడా వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందాయి. పాక్తో జరిగిన తుది పోరులో భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో నిమిషంలో హన్నాన్ చేసిన గోల్తో పాకిస్తాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు మరుసటి నిమిషంలోనే గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 14 నిమిషాల తర్వాత భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పాక్ పోరాడి మూడో క్వార్టర్ ముగిసేసరికి మరో రెండు గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. చివరి క్వార్టర్లో భారత్ జోరు కొనసాగించి ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 5–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా ఆసియా కప్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో టీమిండియా నాలుగింటిని సది్వనియోగం చేసుకొని, రెండింటిని వృథా చేసింది. మరోవైపు పాక్ జట్టు సంపాదించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచింది. -
IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్కే తప్పు చేసిందా..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్లో బాగా నానింది. మాత్రే టాలెంట్కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్కే మాత్రేను ట్రయిల్స్కు కూడా పిలిచిందని సోషల్మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయాడు.ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో మాత్రే ఆల్రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్కేలో ఉంటే ఓపెనర్గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి. మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు. -
పసికూనపై విరుచుకుపడిన టీమిండియా... భారీ విజయం
అండర్-19 ఆసియా కప్లో టీమిండియా భారీ విజయం సాధించింది. పసికూన జపాన్తో ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో భారత్ 211 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (122) కదంతొక్కగా.. ఓపెనర్ ఆయుశ్ మాత్రే మెరుపు అర్ద సెంచరీతో (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. మిడిలార్డర్ బ్యాటర్ కేపీ కార్తికేయ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, సిక్స్) రాణించగా.. స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 23, ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వంశ్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జపాన్.. భారత బౌలర్లు యుధాజిత్ గుహ (7-3-9-1), హార్దిక్ రాజ్ (8-2-9-2), చేతన్ శర్మ (8-0-14-2), కేపీ కార్తికేయ (10-1-21-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ ఇన్నింగ్స్లో హ్యూగో కెల్లీ (50), చార్లెస్ హింజే (35 నాటౌట్), నిహార్ పర్మార్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ఈ మ్యాచ్లో ముందు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
వికెట్ తీసిన ఆనందంలో అతి చేశాడు.. మైదానంలో నుంచి మోసుకెళ్లారు..!
వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు సంబురాలు చేసుకోవడం సహజమే. అయితే ఓ బౌలర్ శృతి మించిన సంబురాలు అతన్ని మైదానంలో నుంచి మోసుకెళ్లేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో ఆదివారం నేపాల్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నేపాల్ బౌలర్ యువరాజ్ ఖాత్రి వికెట్ తీసిన ప్రతిసారి అతి సంబురాలు చేసుకున్నాడు. A twist of fate 🫣When luck smiles and frowns at the same time 🤕 🙆♂️#SonySportsNetwork #AsiaCup #NewHomeOfAsiaCup pic.twitter.com/OmPn5KepPu— Sony Sports Network (@SonySportsNetwk) December 2, 2024ఓసారి సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషిలా షూ తీసి చెవి దగ్గర ఫోన్లా పెట్టుకోగా.. మరోసారి తనను అభినందించేందుకు వచ్చిన సహచరులకు దొరకకుండా పరుగులు పెట్టాడు. ఇలా చేసే క్రమంలో యువరాజ్ కాలు మడత పడింది. నడవలేని స్థితిలో ఉన్న యువరాజ్ను మైదానంలో నుంచి భుజాలపై మోసుకెళ్లారు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.బంగ్లాదేశ్తో మ్యాచ్లో యువరాజ్ 4 వికెట్లతో మెరిసినా నేపాల్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 45.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ జపాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఛేదనలో పూర్తిగా చేతులెత్తసిన జపాన్ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో జపాన్ గెలవాలంటే 36 బంతుల్లో 231 పరుగులు చేయాల్సి ఉంది. -
Asia Cup 2024: శతక్కొట్టిన కెప్టెన్.. టీమిండియా భారీ స్కోర్
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్తో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి జపాన్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (118 బంతుల్లో 122; 7 ఫోర్లు) కదం తొక్కాడు. కేపీ కార్తికేయ (57), ఆయుశ్ మాత్రే (54) అర్ద సెంచరీలతో రాణించారు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 23 పరుగులకే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్లో ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వన్ష్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో భారత్, పాక్, జపాన్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో తలపడుతున్నాయి. ఇవాళే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్లో పాకిస్తాన్, యూఏఈ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాజైబ్ ఖాన్ (132), మొహమ్మద్ రియాజుల్లా (106) సెంచరీల మోత మోగించారు. -
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో యువ భారత జట్టు తలపడుతుంది. ఉదయం గం. 10:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ లీగ్ పోరులో శుభారంభం చేయాలని మొహమ్మద్ అమాన్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన యువ భారత్... ఈసారి కూడా టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ల్లో అఫ్గానిస్తాన్పై బంగ్లాదేశ్; నేపాల్ జట్టుపై శ్రీలంక విజయం సాధించాయి. -
యువ ఆటగాళ్ల ఆసియా సమరం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్, యూఏఈ, జపాన్తో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ చాంపియన్గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్తో అఫ్గానిస్తాన్... శ్రీలంకతో నేపాల్ తలపడతాయి. దుబాయ్, షార్జాలలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్గా నిలిచింది. డిసెంబర్ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్ ముగుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్ స్టార్స్గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తుండగా... కిరణ్ చోర్మలే వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్ 2న జపాన్తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. భారత అండర్–19 జట్టు: మొహమ్మద్ అమాన్ (కెపె్టన్), కిరణ్ చోర్మలే (వైస్ కెపె్టన్), ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్ పంత్, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, హర్వంశ్ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ. -
‘ఆసియా క్రికెట్’ మ్యాచ్లన్నీ ఆ నెట్వర్క్లోనే లైవ్ స్ట్రీమింగ్..!
భారత్కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్ఐ) ఆసియా క్రికెట్కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు. -
భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు
యూఏఈ వేదికగా జరగనున్న అండర్-19 ఆసియాకప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉత్తరప్రదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ అమాన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదే విధంగా ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. బిహార్కు చెందిన 13 ఏళ్ల సూర్యవంశీ క్రికెట్లో దూసుకుపోతున్నాడు. వైభవ్ ఇప్పటికే ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో బిహార్ తరపున వైభవ్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతి పిన్న వయససులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూ చేసిన ఎనిమిదవ ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు రంజీ మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు.రెడ్ బాల్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్న ఈ యువ క్రికెటర్.. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్లో దుమ్ములేపేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్లో-ఎలో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతో పాటు పాకిస్తాన్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్లో నవంబర్ 30న దుబాయ్ వేదికగా పాకిస్తాన్ అండర్-19 టీమ్తో తలపడనుంది.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, సి ఆండ్రీ సిద్దార్థ్, మొహమ్మద్. అమన్ (కెప్టెన్), కిరణ్ చోర్మలే (వైస్ కెప్టెన్), ప్రణవ్ పంత్, హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), అనురాగ్ కవ్డే (వికెట్ కీపర్), హార్దిక్ రాజ్, ఎండి. ఈనాన్, కెపి కార్తికేయ, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహా, చేతన్ కుమార్, నిఖిల్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: సాహిల్ పరాఖ్, నమన్ పుష్పక్, అన్మోల్జీత్ సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, డి దీపేష్చదవండి: ఆ నలుగురు నా కొడుకు కెరీర్ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి -
IND A Vs AFG A: టీమిండియాకు బిగ్ షాక్.. సెమీస్లో అఫ్గాన్ చేతిలో ఓటమి
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్-ఎ జట్టు ప్రయాణం ముగిసింది. అల్ఎమరత్ వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరిగిన రెండో సెమీఫైనల్లో 20 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బ్యాటర్లలో రమణ్దీప్ సింగ్(64) ఆఖరి వరకు పోరాడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. రమణ్దీప్, బదోని(31) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్,రహమన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక, అఫ్గాన్ జట్లు తలపడనున్నాయి. -
IND A Vs AFG A: అఫ్గాన్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో ఒమన్ వేదికగా భారత్-ఎతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్-ఎ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరద్దరితో పాటు కరీం జనత్( 20 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' Sediqullah hit two birds with ZERO stones! ⚡@ACBofficials #MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/MNdGmFiNgb— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024 -
భారత్ వర్సెస్ అఫ్గాన్ సెకెండ్ సెమీస్.. తుది జట్లు ఇవే
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో సెకెండ్ సెమీఫైనల్కు రంగం సిద్దమైంది. రెండో సెమీఫైనల్లో భాగంగా అల్ అమెరత్(ఒమన్) వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అన్షుల్ కాంబోజ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు అఫ్గానిస్తాన్ మాత్రం ఏకంగా నాలుగు మార్పులు చేసింది. బిలాల్ సమీ, మహమ్మద్ ఇషాక్, అల్లా గజన్ఫర్, జుబైద్ అక్బరీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు కూడా ఆజేయంగా నిలిచాయి. అదే జోరును సెమీస్లో కనబరచాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.తుది జట్లుఇండియా-ఎ : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రమణదీప్ సింగ్, నిశాంత్ సింధు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్, ఆకిబ్ ఖాన్ఆఫ్ఘనిస్తాన్-ఎ: సెదిఖుల్లా అటల్, జుబైద్ అక్బరీ, దర్విష్ రసూలీ(కెప్టెన్), మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, షరాఫుద్దీన్ అష్రఫ్, అబ్దుల్ రెహమాన్, అల్లా గజన్ఫర్, కైస్ అహ్మద్, బిలాల్ సమీ -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
నేడే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. గెలుపెవరది?
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అటు సీనియర్ జట్లు అయినా, ఇటు జూనియర్ టీమ్స్ అయినా రైవలరీ మాత్రం ఒకటే. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో భాగంగా ఆక్టోబర్ 19న భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ఒమన్లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం 7:00 గంటలకు దాయాదుల పోరు షురూ కానుంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ ఈవెంట్లో భారత జట్టు యువ సంచలనం హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, ప్రభుసిమ్రాన్ సింగ్, ఆయూష్ బదోని వంటి యువ ఆటగాళ్లు భారత జట్టులో భాగమయ్యారు. మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలిచింది. తుది జట్లు(అంచనా)భారత్ A: అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ, ఆయుష్ బడోని, నెహాల్ వధేరా, నిశాంత్ సింధు, రమణదీప్ సింగ్, రసిఖ్ సలామ్, వైభవ్ అరోరా, సాయి కిషోర్, రాహుల్ చాహర్పాకిస్థాన్ A: మహ్మద్ హారీస్, యాసిర్ ఖాన్, హైదర్ అలీ, ఒమైర్ యూసుఫ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), ఖాసిం అక్రమ్, షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, మహ్మద్ ఇమ్రాన్, అబ్బాస్ అఫ్రిది, అహ్మద్ డానియాల్ -
Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మొదటి మ్యాచ్లోనే దాయాది పాకిస్తాన్తో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఆక్టోబర్ 19న మస్కట్లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో చిరకాల ప్రత్యర్ధిలు మధ్య పోరు జరగనుంది.ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇండియా జట్టులో తిలక్తో పాటు యువ సంచలనం అభిషేక్ శర్మకు చోటు దక్కింది.అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ) కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు.మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు హ్యారీస్ ఉవ్విళ్లరూతున్నాడు.ఫైనల్ ఎప్పుడంటే?కాగా ఆక్టోబర్ 18న హాంకాంగ్, చైనా మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి.గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఎమర్జింగ్ ఆసియాకప్ మ్యాచ్లను భారత్లో ఫ్యాన్కోడ్ యాప్ లేదా వెబ్సైట్లో వీక్షించవచ్చు.భారత్ ఎ: తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా సలాం, సాయి కిషోర్, రాహుల్ చాహర్పాకిస్థాన్ ఎ: మహ్మద్ హారిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఖాసిమ్ అక్రమ్, అహ్మద్ డానియాల్, షానవాజ్ దహానీ, మహ్మద్ ఇమ్రాన్, హసీబుల్లా ఖాన్ (వికెట్-కీపర్), యాసిర్ ఖాన్, జమాన్ ఖాన్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖిమ్, మెహ్రాన్ ముఖిమ్ , అబ్దుల్ సమద్, ఒమైర్ యూసుఫ్ -
భారత్ మొదలుపెట్టింది, అప్పటి నుంచి మాకు ఈ గతి పట్టింది: పాక్ మాజీ కెప్టెన్
సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పాక్ దారుణంగా విఫలమై 146 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (448/6) చేసిన పాక్.. ఓవరాక్షన్ చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. పైగా ఈ మ్యాచ్లో పాక్ ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగింది. పిచ్ను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైన పాక్ మేనేజ్మెంట్ ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ పేసర్లను బరిలోకి దించి చేతులు కాల్చుకుంది. పై పేర్కొన్న కారణాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకున్న బంగ్లాదేశ్ పాక్ను వారి సొంతగడ్డపై చావుదెబ్బకొట్టింది. టెస్ట్ల్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్కు ఇది తొలి విజయం. పాక్ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టు బంగ్లాదేశే కావడం మరో విశేషం.బంగ్లా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ మాజీలు పాక్ జట్టును తూర్పారబెడుతున్నారు. షాహిద్ అఫ్రిది, రమీజ్ రజా.. ఇలా ప్రతి ఒక్కరు పాక్ జట్టుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చాలామంది పాక్ వ్యూహాలను తప్పుబడుతున్నారు. రమీజ్ రజా లాంటి వారైతే పాక్ జట్టు ఎంపికనే ఘోర తప్పిదమని మండిపడుతున్నాడు. రావల్పిండి లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్పై నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించాడు. జట్టులో ఒక్క స్పిన్నర్ను కూడా ఎంపిక చేయనప్పుడే పాక్ ఓడిందని అన్నాడు. పాక్ కోల్పోయిన 16 వికెట్లలో బంగ్లా స్పిన్నర్లు తొమ్మిదింటిని పడగొట్టారని గుర్తు చేశాడు.పాక్ దారుణ ఓటమి అంశాన్ని రమీజ్ రజా టీమిండియాతో ముడిపెట్టాడు. భారత్ వల్లే సుదీర్ఘ ఖ్యాతి కలిగిన పాక్ పేస్ బౌలింగ్ అటాక్ లయ తప్పిందని అన్నాడు. గతేడాది ఆసియా కప్లో టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై పైచేయి సాధించారు. అప్పటి నుంచి ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం సర్వ సాధారణంగా మారిపోయిందని అన్నాడు. అప్పడే పాక్ పేస్ బౌలింగ్ పతనం ప్రారంభమైందని తెలిపాడు. నాటి నుంచి పాక్ పేసర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా బ్యాటర్లు సులువుగా ఎదుర్కొంటున్నారని అన్నాడు. పాక్ ఓటమికి రమీజ్ టీమిండియాను కారణంగా చూపించడంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరేమో భారత్ దెబ్బ పడితే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.కాగా, బంగ్లాతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
వచ్చే ఏడాది భారత్లో ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ
పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు. గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోరీ్నల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
భారత్ వేదికగా ఆసియాకప్-2025.. పాకిస్తాన్ వస్తుందా?
పురుషుల ఆసియాకప్-2025కు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా 2024 నుంచి 2027 కాలానికి గాను స్పాన్సర్షిప్ హక్కుల కోసం ఐఈవోఐ(IEOI)లను ఆహ్వానించింది. దీని ప్రకారం ప్రకారం వచ్చే ఏడాది ఆసియాకప్ భారత్లో జరగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గతేడాది వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్కు పాకిస్తాన్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు. అదే విధంగా ఆసియాకప్-2026(వన్ఢే ఫార్మాట్)కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ వేదికగా జరిగే ఆసియాకప్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా ఆర్హత సాధించగా.. మరో జట్టు క్వాలిఫియర్స్ ఆరో జట్టుగా టోర్నీలో అడుగుపెడుతుంది. అదే విధంగా మొత్తం 13 మ్యాచ్లో ఈ ఈవెంట్లో జరగనున్నాయి. ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) విజేతగా భారత్ నిలవగా.. అంతకుముందు ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్గా శ్రీలంక నిలిచింది.పాక్ వస్తుందా?వన్డే ప్రపంచకప్-2023లో తలపడేందుకు భారత్కు వచ్చిన పాకిస్తాన్ మరోసారి తమ దాయాది గడ్డపై అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే వాస్తవానికి గతేడాది ఆసియాకప్కు పాకిస్తాన్ ఒంటరిగానే ఆతిథ్యమివ్వాల్సింది. కానీ భారత జట్టును పాక్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిచిండంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరిగింది.భారత్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కూడా పాక్ను ఆతిథ్యమివ్వనుంది. కానీ మరోసారి తమ జట్టును పాక్కు పంపేందుకు బీసీసీఐ సిద్దంగా లేదు. ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇంక ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే.. పాక్ ఆసియాకప్లో తలపడేందుకు భారత్కు వస్తుందో లేదో వేచి చూడాలి. -
టీమిండియాకు షాకిచ్చిన శ్రీలంక.. ఆసియా కప్ ఫైనల్లో జయకేతనం
ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక టీమిండియాకు షాకిచ్చింది. ఇవాళ (జులై 28) జరిగిన ఫైనల్లో భారత్పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారీ అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కవిష దిల్హరి (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (2 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఏకైక వికెట్ లభించింది. ఈ టోర్నీలో ఆది నుంచి ఆజేయంగా నిలిచిన భారత్ చివరి మెట్టుపై బోల్తా పడింది. -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
Asia Cup Final: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్పై, శ్రీలంక.. పాకిస్తాన్పై విజయాలు సాధించి ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
భారీ విజయంతో ఫైనల్లోకి భారత్
దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (32), షోర్ణా అక్తర్ (19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26 నాటౌట్) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. రేణుక అదుర్స్ మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ దిలారా అక్తర్ (6)ను అవుట్ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్లో ఇస్మా (8)ను పెవిలియన్కు పంపించింది. ఆరో ఓవర్లో ముర్షిదా ఖాతూన్ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది. ఇద్దరే కొట్టేశారు స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్ మ్యాచ్ల్లో నాలుగో హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా అక్తర్ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 26; స్మృతి (నాటౌట్) 55; ఎక్స్ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 83. బౌలింగ్: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్ 3–0–17–0, రాబియా ఖాన్ 2–0–10–0, రుమానా అహ్మద్ 1–0–5–0.9 మహిళల ఆసియాకప్లో (వన్డే, టి20 ఫార్మాట్ కలిపి) భారత జట్టు ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్గా నిలిచింది.1 టి20 క్రికెట్లో రెండుసార్లు 20వ ఓవర్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్గా రాధ యాదవ్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా పురుషుల క్రికెట్లో ఎనిమిది మంది, మహిళల క్రికెట్లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్ చివరి ఓవర్ను మెయిడెన్ చేశారు.3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్.. 2019లో వెస్టిండీస్పై 104 పరుగుల టార్గెట్ను వికెట్ కోల్పోకుండా అధిగమించింది.2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్ (4348; న్యూజిలాండ్) టాప్ ర్యాంక్లో ఉంది. -
సెమీస్కు క్వాలిఫై అయిన శ్రీలంక, బంగ్లాదేశ్.. భారత ప్రత్యర్థి ఎవరంటే..?
మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. గ్రూప్-బిలో భాగంగా నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ మలేసియాపై.. శ్రీలంక థాయ్లాండ్పై ఘన విజయాలు సాధించాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో మలేసియాపై బంగ్లాదేశ్ 114 పరుగల తేడాతో.. రాత్రి మ్యాచ్లో థాయ్లాండ్పై శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేశాయి. ఈ గెలుపులతో గ్రూప్-బి టాపర్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్కు క్వాలిఫై అయ్యాయి. మలేసియా, థాయ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-ఏ సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ సెమీస్కు అర్హత సాధించాయి. రేపు జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్ను.. పాకిస్తాన్ శ్రీలంకను ఢీకొంటాయి. రేపు మధ్యాహ్నం భారత్ మ్యాచ్, రాత్రి పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచే జట్ల మధ్య జులై 28న అంతిమ సమరం జరుగుతుంది.బంగ్లా-మలేసియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన మలేసియా 20 ఓవర్లలో 77 పరుగులకు పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ థాయ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. -
Asia Cup 2024: టీమిండియా హ్యాట్రిక్ విజయం.. సెమీస్కు అర్హత
మహిళల ఆసియా కప్ 2024 ఎడిషన్లో టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (జులై 23) పసికూన నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (81), దయాలన్ హేమలత (47) రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంది. నేపాల్ బౌలర్లలో సీతా రనా మగర్ 2 వికెట్లు పడగొట్టగా.. కబిత జోషి ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (4-0-13-3), రేణుకా సింగ్ (4-1-15-1), తనూజా కన్వర్ (4-1-12-0), అరుంధతి రెడ్డి (4-0-28-2), రాధా యాదవ్ (3-0-12-2) నేపాల్ను ముప్పుతిప్పలు నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 18 పరుగులు చేసిన సీతా టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో పాకిస్తాన్ యూఏఈపై ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఏ జట్టు ఇప్పటివరకు అధికారికంగా సెమీస్కు క్వాలిఫై కాలేదు. రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక గ్రూప్ టాపర్గా ఉండగా.. థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేసియా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ సెమీస్లో పోటీపడనుంది. పాక్.. గ్రూప్-బి టాపర్ను సెమీస్లో ఢీకొట్టనుంది. భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ అదే రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. -
నేడు (జులై 23) టీమిండియాతో నేపాల్ 'ఢీ'
మహిళల ఆసియా కప్ 2024లో ఇవాళ (జులై 23) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పాకిస్తాన్, యూఏఈ పోటీపడనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో నేపాల్ టీమిండియాను ఢీకొంటుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ప్రస్తుత ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన నేపాల్తో ఇవాళ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-ఏ నుంచి టాపర్గా ఉంది. నేటి మ్యాచ్లో భారత్ నేపాల్పై గెలుస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.గ్రూప్-ఏ నుంచి ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. యూఏఈ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్ భారత్ చేతిలో ఓడి యూఏఈపై గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్ నుంచి మూడో స్థానంలో ఉన్న నేపాల్.. యూఏఈపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్రేట్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేపాల్ భారత్పై గెలిచినా సెమీస్కు అర్హత సాధించలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ సెమీస్కు చేరడం దాదాపుగా ఖరారైనట్లే.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో శ్రీలంక టాపర్గా కొనసాగుతుంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. థాయ్లాండ్, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్లో విజయం సాధించి రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన మలేసియా చివరి స్థానంలో నిలిచింది. -
Asia Cup 2024: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు
మహిళల ఆసియా కప్ 2024లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. థాయ్లాండ్తో నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 10 మ్యాచ్ల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్కు లభించిన తొలి విజయం ఇది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.బంగ్లా బౌలర్ల విజృంభణటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రబేయా ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రీతూ మోనీ, సబికున్ నహార్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. థాయ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ బూచాథమ్ (40), లవోమీ (17), రోస్నన్ కనో (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. దిలార అక్తెర్ 17, ఇష్మా తంజిమ్ 16 పరుగులు చేశారు. థాయ్ బౌలర్లలో పుత్తావాంగ్, ఫన్నిట మాయా తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లా తమ తదుపరి మ్యాచ్లో మలేషియాతో తలపడనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్.. శ్రీలంక చేతుల్లో ఓడింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా వరుస స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. భారత్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి గ్రూప్ టాపర్గా కొనసాగుతుండగా.. పాకిస్తాన్, నేపాల్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఇవాళ (జులై 23) రాత్రి జరుగబోయే మ్యాచ్లో నేపాల్తో తలపడనుంది. -
చమరి అటపట్టు సూపర్ సెంచరీ
ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా దంబుల్లాలో సోమవారం మలేసియాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్స్లు) తన టి20 కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. -
Asia Cup 2024: పసికూనపై పాక్ ప్రతాపం
మహిళల ఆసియా కప్లో పాకిస్తాన్ తొలి విజయం సాధించింది. నేపాల్తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. పసికూన నేపాల్పై విరుచుకుపడింది. నేపాల్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని పాక్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా గ్రూప్-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మైదానంలో పాదరసంలా కదిలారు. పాక్ ఆటగాళ్లు ముగ్గురు నేపాల్ బ్యాటర్లను రనౌట్ చేశారు. సైదా ఇక్బాల్ 2, ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో కబిత జోషి (31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. సీతా రనా మగర్ 26, పూజా మహతో 25, కబిత కన్వర్ 13 పరుగులు చేశారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా (35 బంతుల్లో 57; 10 ఫోర్లు), మునీబా అలీ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) నేపాల్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఇవాళ (జులై 22) శ్రీలంక, మలేసియా.. బంగ్లాదేశ్, థాయ్లాండ్ మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్లో (జులై 23) నేపాల్తో తలపనుంది. -
రిచా ఘోష్ ఊచకోత.. టీమిండియా ఖాతాలో మరో విజయం
మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.రిచా ఘోష్ ఊచకోత.. హర్మన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు.మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.తిరుగులేని భారత్ఈ టోర్నీలో గ్రూప్-ఏలో పాకిస్తాన్, నేపాల్, యూఏఈలతో పోటీపడుతున్న భారత్.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. నేపాల్, పాక్ చెరో మ్యాచ్లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో థాయ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్లాండ్, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
Asia Cup 2024: టీమిండియా భారీ స్కోర్.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి..!
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యూఏఈతో ఇవాళ (జులై 21) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రిచా ఘోష్ చివరి ఐదు బంతులను బౌండరీలుగా తరలించింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్లో స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. -
శ్రీలంక, థాయిలాండ్ విజయం
దంబుల్లా: మహిళల ఆసియా కప్ టోరీ్నలో శనివారం శ్రీలంక, థాయిలాండ్ జట్లు విజయాలు నమోదు చేశాయి. మాజీ చాంపియన్ బంగ్లాదేశ్ను 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం లంక 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విష్మీ గుణరత్నే (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా...హర్షిత సమరవిక్రమ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించింది. మరో మ్యాచ్లో థాయిలాండ్ 22 పరుగుల తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ముందుగా థాయిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ననపట్ కొంచరోంకయ్ (35 బంతుల్లో 40; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించింది. ఆ తర్వాత మలేసియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేయగలిగింది. వాన్ జూలియా (53 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా మిగతావారంతా విఫలమయ్యారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నేడు జరిగే తమ రెండో మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తమ తొలి పోరులో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. -
IND Vs PAK: మనదే పైచేయి
దంబుల్లా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో శుభారంభం చేసింది. పాకిస్తాన్పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్ (35 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా... రేణుక, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. స్మృతి మంధాన (31 బంతుల్లో 45; 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 57 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. టపటపా... భారత మహిళల పదునైన బౌలింగ్ ముందు పాక్ ఏమాత్రం నిలవలేకపోయింది. పూజ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి ప్రత్యరి్థని నిలువరించగా, పవర్ప్లే ముగిసేసరికి పాక్ 37 పరుగులు చేసింది. కెప్టెన్ నిదా దార్ (8) ప్రభావం చూపలేకపోగా, రేణుక వరుస బంతుల్లో రెండు వికెట్లతో పాక్ను దెబ్బ కొట్టింది. ఈ దశలో తుబా, ఫాతిమా పోరాడి 25 బంతుల్లో 35 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్...రాధ ఓవర్లో ఫాతిమా రెండు సిక్స్లు బాదడంతో 100 పరుగులు దాటింది. 47 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. ఒకే ఓవర్లో 21 పరుగులు... ఛేదనలో భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి దూకుడుగా ఆడారు. వరుసగా మూడు ఓవర్లలో రెండేసి ఫోర్లు రాగా...తుబా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు, షఫాలీ ఒక సిక్స్ బాదారు. ఫలితంగా 6 ఓవర్లలోనే స్కోరు 57 పరుగులకు చేరింది. ఆ తర్వాత తుబా వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో స్మృతి చెలరేగింది. ఏకంగా ఐదు ఫోర్లు (4, 0, 4, 1 వైడ్, 4, 4, 4) బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17 పరుగుల వ్యవధిలో స్మృతి, షఫాలీతో పాటు హేమలత (14) కూడా వెనుదిరిగినా...హర్మన్ (5 నాటౌట్), జెమీమా (3 నాటౌట్) కలిసి లాంఛనం పూర్తి చేశారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో నేపాల్ ఆరు వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫేరోజా (సి) హర్మన్ (బి) పూజ 5; మునీబా (సి) రోడ్రిగ్స్ (బి) పూజ 11; సిద్రా (సి) రాధ (బి) రేణుక 25; ఆలియా (సి) రోడ్రిగ్స్ (బి) శ్రేయాంక 6; నిదా (సి) హేమలత (బి) దీప్తి 8; తుబా (సి) రాధ (బి) దీప్తి 22; ఇరమ్ (ఎల్బీ) (బి) రేణుక 0; ఫాతిమా (నాటౌట్) 22; అరూబ్ (రనౌట్) 2; నష్రా (సి) రిచా (బి) దీప్తి 0; సాదియా (బి) శ్రేయాంక 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–9, 2–26, 3–41, 4–59, 5–61, 6–61, 7–92, 8–94, 9–94, 10–108. బౌలింగ్: రేణుక 4–0–14–2, పూజ 4–0–31–2, దీప్తి శర్మ 4–0–20–3, రాధ 4–0–26–0, శ్రేయాంక పాటిల్ 3.2–0–14–2. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) అరూబ్ 40; స్మృతి (సి) ఆలియా (బి) అరూబ్ 45; హేమలత (సి) తుబా (బి) నష్రా 14; హర్మన్ (నాటౌట్) 5; జెమీమా (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (14.1 ఓవర్లలో 3 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–85, 2–100, 3–102. బౌలింగ్: సాదియా 2.1–0–18–0, ఫాతిమా 2–0–15–0, నిదా 1–0–10–0, తుబా 2–0–36–0, నష్రా 4–0–20–1, అరూబ్ 3–0–9–2. -
Asia Cup 2024: పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్మన్ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగెజ్ (3) భారత్ను విజయతీరాలకు చేర్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్ జులై 21న జరుగనుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో యూఏఈపై నేపాల్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్ను ఆసియా కప్లో మొదటిది. -
Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో యూఏఈపై నేపాల్ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ టీమ్
నేపాల్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.HISTORY CREATED BY NEPAL....!!!- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe— Johns. (@CricCrazyJohns) July 19, 2024కాగా, మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సత్తా చాటిన ఇందు బర్మాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా (4-0-19-3) సత్తా చాటడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నేపాల్ బౌలర్లు తలో చేయి వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. షబ్నమ్ రాయ్, కబిత జోషి, క్రితిక తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ ఇన్నింగ్స్లో ఇషా రోహిత్ ఓఝా (10), సమైరా ధర్నిధర్కా (13), కవిష ఎగోడగే (22), ఖుషి శర్మ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చెలరేగిన సంజనా116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. ఓపెనర్ సంజనా ఖడ్కా (45 బంతుల్లో 72 నాటౌటగ్; 11 ఫోర్లు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిష 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ
మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదికగా యూఏఈ - నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. "మహిళల ఆసియా కప్కు ఆతిథ్యం ఇస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయనే ఆసియాకప్ టోర్నమెంట్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.ఇక ఆసియా సింహాల పోరులో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఇరు జట్ల ఫ్యాన్స్ మ్యాచ్ను చూసేందుకు స్టేడియంకు తరలి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్,మలేషియా, థాయ్లాండ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఆసియాకప్కు భారత మహిళల జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. పాక్తోనే తొలి మ్యాచ్
మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో తలపడుతున్న భారత జట్టునే దాదాపుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెటర్లను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు-ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్తో పాటు ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్లో జూలై 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 21న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూపు మ్యాచ్లో జూలై 23న నేపాల్తో భారత్ తలపడనుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్ మ్యాచ్తో ప్రారంభం కానుంది.ఆసియాకప్కు భారత మహిళల జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
పాక్తో భారత్ తొలిపోరు
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్తో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టైటిల్ వేటను ఆరంభించనుంది. జూలై 19 నుంచి 28 వరకు శ్రీలంకలోని దంబుల్లా నగరంలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్, మలేసియా జట్లున్నాయి. జూలై 19న పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం భారత జట్టు 21న యూఏఈతో, 23న నేపాల్తో ఆడతాయి. రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి. టాప్–10లో స్మృతి, హర్మన్ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ టాప్–10లో ఉన్నారు. గతవారం మూడో స్థానంలో ఉన్న స్మృతి ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్లో నిలువగా... హర్మన్ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్కు చేరుకుంది. -
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
దుబాయ్: ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకు దంబుల్లాలో ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. చివరిసారి 2022లో బంగ్లాదేశ్లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. క్రితంసారి ఏడు జట్లు పాల్గొనగా... ఈసారి ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ జట్లున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్ (జూలై 21న), నేపాల్ (జూలై 23న) జట్లతో ఆడుతుంది. జూలై 26న సెమీఫైనల్స్... జూలై 28న ఫైనల్ జరుగుతాయి. -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
34 ఏళ్ల నిరీక్షణకు తెర.. బంగ్లాదేశ్ రియల్ హీరో అతడే
అండర్-19 ఆసియాకప్ 2023లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛాంపియన్స్గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. తొలిసారి ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. సీనియర్ జట్టుకు కూడా సాధ్యం కానిది జూనియర్ బంగ్లా టైగర్స్ చేసి చూపించారు. దీంతో తమ 34 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1989 నుంచి ఆసియాకప్ టైటిల్ కోసం పోరాడతున్న బంగ్లా అండర్-19 జట్టు ఎట్టకేలకు సాధించింది. కాగా సెమీస్లో భారత్ వంటి పటిష్ట జట్టును ఓడించి మరి బంగ్లాదేశ్ ఫైనల్కు దూసుకెళ్లింది. అతడే రియల్ హీరో.. బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు హెడ్ కోచ్ స్టువర్ట్ లాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా గతేడాది జూలైలో బంగ్లా అండర్-19 జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లా యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అతడి నేతృత్వంతో యువ క్రికెటర్లు మరింత రాటుదేలారు. ఆసియాకప్ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్లోనూ బంగ్లా యువ జట్టు అదరగొట్టింది. కాగా గతంలో బంగ్లా సీనియర్ జట్టుకు హెడ్కోచ్గా స్టువర్ట్ లా పనిచేశారు. 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు బంగ్లా ప్రధాన కోచ్గా లా కొనసాగారు. అతడి పర్యవేక్షణలో తమీమ్ ఇక్భాల్, ముష్ఫికర్ రహీం వంటి వారు వరల్డ్క్లాస్ క్రికెటర్లగా ఎదిగారు. అదే విధంగా అతడు శ్రీలంక, వెస్టిండీస్ జట్ల హెడ్కోచ్గా కొనసాగారు. ఇక అతడి నేతృత్వంలోని బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్కప్లోనూ అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. వీరే ఫ్యూచర్ స్టార్స్.. ఈ ఆసియాకప్ టోర్నీతో బంగ్లా జట్టుకు అషికర్ రెహ్మాన్ షిబ్లీ రూపంలో యువ సంచలనం దొరికాడు. ఈ టోర్నీ ఆసాంతం అషికర్ రెహ్మాన్ ఓపెనర్గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడిన షిబ్లీ... 255 పరుగులతో టోర్నీ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. యూఏఈతో జరిగిన ఫైనల్లో కూడా షిబ్లీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అరిఫుల్ ఇస్లాం కూడా సంచలన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వీరిముగ్గురూ అతి త్వరలోనే బంగ్లా జాతీయ జట్టులో కన్పించనున్నారు. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్బై... ముంబై ఇండియన్స్లో ఏమవుతోంది? -
ఈనెల 10న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
ఇటీవలికాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్కప్, అంతకుమందు ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్లో భారత్పై పాక్ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వన్డే ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్తాన్.. నేపాల్, పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాక్తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్ మూడు మ్యాచ్లు ఆడుతుంది. డిసెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్, 10న పాకిస్తాన్, 12న నేపాల్ జట్లతో యంగ్ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ డిసెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరుగనున్నాయి. భారత అండర్-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు (వికెట్కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ -
టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!
ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్ను ప్రశంసిస్తూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) రాజమౌళి ట్వీట్ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్ను చూసిన అభిమానులు సైతం సిరాజ్ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻 And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗 — rajamouli ss (@ssrajamouli) September 17, 2023 -
Asia Cup Final: శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం 2023 ఆసియా కప్ టైటిల్ను భారత్ ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా ఎనిమిదో ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలక చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టార్గెట్ 51.. 3 ఓవర్లలో భారత్ స్కోర్ 32/0 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ వేగంగా లక్ష్యం దిశగా సాగుతుంది. 3 ఓవర్లలో భారత్ వికెట్లు నష్టపోకుండా 32 పరుగులు చేసింది. గిల్ (18), ఇషాన్ (13) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరిగిన సిరాజ్.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) తనవంతుగా రాణించడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (5-1-23-1) కూడా ఓ వికెట్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 40 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో వెల్లలగే (8) ఔటయ్యాడు. సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. కుశాల్ మెండిస్ను (17) క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఈ ఇన్నింగ్స్లో తన ఆరో వికెట్ను పడగొట్టాడు. సిరాజ్ 5.2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. సిరాజ్కు ఐదు వికెట్లు శ్రీలంక జట్టు 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మహ్మద్ సిరాజ్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డి విరిచాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి సిరాజ్.. షనక (0)ను క్లీన్బౌల్డ్ చేశాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికి నిస్సంకను (2) ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు, ఆరు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను పెవిలియన్కు పంపాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0)లను పెవిలియన్కు పంపాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడో బంతికి సమరవిక్రమను (0) ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 8 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ అందుకోవడంతో నిస్సంక (2) ఔటయ్యాడు. కుశాల్ మెండిస్ (5), సమరవిక్రమ క్రీజ్లో ఉన్నారు. మొదలైన మ్యాచ్.. తొలి ఓవర్లోనే వికెట్ వర్షం కారణంగా భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే శ్రీలంక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే కేఎల్ రాహుల్ వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్ పట్టి కుశాల్ పెరీరాను (0) పెవిలియన్కు సాగనంపాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగనుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక, భారత్ జట్లు చెరో మార్పు చేశాయి. శ్రీలంకకు సంబంధించి తీక్షణ స్థానంలో దుషన్ హేమంత జట్టులోకి రాగా.. భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ భర్తీ చేశాడు. కాగా, మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. తుది జట్లు.. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్వికెట్గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు. ఆసియాకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హిట్వికెట్గా ఔటైన ముజీబ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో సిక్స్ కొట్టి మరి ముజీబ్ హిట్వికెట్గా ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్ వికెట్గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. అదే విధంగా ఈ విజయంతో బంగ్లాదేశ్ తమ సూపర్- ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక మంగళవారం లాహోర్లో శ్రీలంకతో జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ సమయంలో మెరుగైన రన్రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్ మ్యాచ్లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! చెత్త కారణాలు చెప్పారు -
నేపాల్తో మ్యాచ్.. శార్ధూల్పై వేటు! షమీకి ఛాన్స్!
ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 4న నేపాల్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో పసికూనపై గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. కాగా శనివారం పాకిస్తాన్తో జరగాల్సిన భారత తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది. ఈ క్రమంలో నేపాల్పై భారత్ విజయం సాధిస్తే 3 పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. బ్యాటింగ్కు మంచి ఛాన్స్.. ఇక పాకిస్తాన్తో మ్యాచ్తో రద్దైనప్పటికీ భారత బ్యాటింగ్ టాపర్డర్ మాత్రం తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. వారు తిరిగి మళ్లీ ట్రాక్లోకి రావడానికి నేపాల్తో మ్యాచ్ మంచి అవకాశం. నేపాల్పై అద్భుతమైన ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసంతో సూపర్-4లో ఆటగాళ్లు రాణించవచ్చు. పాకిస్తాన్పై టాపర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా(87) ఇషాన్ కిషన్(82) మాత్రం కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరి ఆటతీరుకు అంతా ఫిదా అయిపోయారు. శార్ధూల్పై వేటు.. షమీకి ఛాన్స్ ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో షమీకి కాదని శార్థూల్ ఠాకూర్ రూపంలో బౌలింగ్ ఆల్రౌండర్కు జట్టు మెన్జ్మెంట్ అవకాశం ఇచ్చింది. మెనెజ్మెంట్ నమ్మకన్ని శార్ధూల్ నిలబెట్టకోలేకపోయాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో నేపాల్తో మ్యాచ్కు శార్ధూల్ను పక్కన పెట్టి షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెన్జెమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
Asia Cup 2023 IND VS PAK: చరిత్ర సృష్టించిన పాక్ పేసర్లు
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్లో పాక్ పేస్ త్రయం (షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) చరిత్రలో 10కి 10 వికెట్లు (ఓ మ్యాచ్లో) తీసిన తొలి పేస్ బౌలింగ్ అటాక్గా రికార్డుల్లోకెక్కింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో ఓ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు పేసర్లే తీయడం ఇదే మొదటిసారి. 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ పేసర్లే మొత్తం 10 వికెట్లు తీసింది లేదు. కాగా, నేటి మ్యాచ్లో పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (10-2-35-4), నసీం షా (8.5-0-36-3), హరీస్ రౌఫ్ (9-0-58-3) టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ త్రయం భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టీమిండియాపై ఈ ముగ్గురు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకోకపోయుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది. ఇషాన్, హార్దిక్లతో పాటు ఆఖర్లో బుమ్రా కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ముగిసాక వర్షం మొదలుకావడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంకాలేదు. వర్షం కారణంగా మ్యాచ్ను కుదించాల్సి వస్తే 40 ఓవర్లలో 239 పరుగులు, 30 ఓవర్లలో 203, 20 ఓవర్లకు 155 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించాల్సి ఉంటుంది. -
శ్రీలంక గడ్డపై భారత జట్టు
కాండీ: ఆసియా కప్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు బుధవారం శ్రీలంకకు చేరుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం ముగిసిన తర్వాత టీమిండియా లంకకు బయల్దేరింది. నేరుగా విమానంలో కొలంబోలో దిగిన రోహిత్ శర్మ బృందం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాండీకి చేరుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని బ్యాటర్ కేఎల్ రాహుల్ మినహా ఇతర జట్టు సభ్యులంతా ఒకేసారి లంక గడ్డపై అడుగు పెట్టారు. రాహుల్ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆసియా కప్లో భాగంగా శనివారం పల్లెకెలె మైదానంలో జరిగే తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడుతుంది. గురువారం శ్రీలంకకు చేరుకునే పాకిస్తాన్ ఒకరోజు విశ్రాంతి అనంతరం మ్యాచ్ బరిలోకి దిగనుండగా... సోమవారం పల్లెకెలె మైదానంలోనే నేపాల్ను భారత్ ఎదుర్కొంటుంది. -
‘ఆసియా’ పోరుకు రంగం సిద్దం
ముల్తాన్: ప్రపంచ కప్ పోరుకు ముందు మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సమరంలో ఆరు జట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు వరల్డ్ కప్కు ముందు ఇది ట్రయల్గా ఉపయోగపడనుండగా... వరల్డ్ కప్ బరిలో లేని నేపాల్ ఆరో టీమ్గా తన ఉనికిని ప్రదర్శించే ప్రయత్నం చేయ నుంది. అన్నీ జట్లూ సహజంగానే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా... ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కనీసం రెండు సార్లు ఇరు జట్లు తలపడే అవకాశం ఉండగా, ఫైనల్ చేరితే మరోసారి దాయాదుల మధ్య పోరును చూడవచ్చు. నేడు సొంతగడ్డపై జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు రోహిత్ కుమార్ సారథ్యంలోని నేపాల్తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్–4 దశలో మిగిలిన మూడు టీమ్లను ఎదుర్కొన్న తర్వాత టాప్–2 టీమ్లు ఫైనల్లో తలపడతాయి. ఫేవరెట్గా రోహిత్ బృందం... ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్ జరగ్గా అప్పుడు రాబోయే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని టి20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్కు సరిగ్గా నెల రోజుల ముందు వన్డే ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ సహజంగానే ఫేవరెట్గా కనిపిస్తుండగా... వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్తో రెండో మ్యాచ్లో తలపడుతుంది. భారత జట్టు ఇటీవల ప్రదర్శన, వ్యక్తిగతంగా ఆటగాళ్ల రికార్డులు, టీమ్ కూర్పును బట్టి చూస్తే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉండగా, అఫ్గానిస్తాన్ కూడా సంచలనాలు ఆశిస్తోంది. అధికారికంగా ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ బోర్డుకే ఉన్నాయి. అయితే పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత్ అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్లలో 4 మాత్రమే పాకిస్తాన్లో జరుగుతుండగా, శ్రీలంక 9 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరిగే మ్యాచ్లకు వాన కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది. -
భారత మహిళల హాకీ జట్టుకు టైటిల్
సలాలా (ఒమన్): మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. తద్వారా 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున జ్యోతి, మరియానా కుజుర్ రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ నవ్జ్యోత్ కౌర్, మోనికా టొప్పో, మహిమా చౌదరీ ఒక్కో గోల్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన జట్లు తలపడే తొలి హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ వచ్చే జనవరి 24 నుంచి 27 వరకు మస్కట్లో జరుగనుంది. -
అందుకే చాహల్కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
ఆసియాకప్ 2023కు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్ వర్మకు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గమానార్హం. ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్ను కాదని కుల్దీప్ యాదవ్ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్ బ్యాట్తో కూడా రాణించగలడని, అందుకే చహల్ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. "విండీస్ సిరీస్లో సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్కు లోయార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్ చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్ను కాదని కుల్దీప్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్.. -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్ను సంప్రదించవచ్చు. -
పిల్ల బచ్చాలను పంపమని మేమడిగామా..? టీమిండియాపై పాక్ కెప్టెన్ అతి వ్యాఖ్యలు
శ్రీలంక వేదికగా కొద్ది రోజుల కిందిట జరిగిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఏసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్-ఏ టీమ్.. యువ భారత జట్టుపై 128 పరుగుల తేడాతో గెలుపొంది, ఆసియా ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ గెలుపు తర్వాత కొందరు నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విమర్శించడం మొదలుపెట్టారు. పాక్ సీనియర్ జట్టుతో (అనుభవం+వయసు) ఆసియా కప్ బరిలోకి దిగిందని, ఫైనల్లో ఓడిన భారత్ యువ జట్టుతో పోరాడిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై తాజాగా పాక్-ఏ జట్టు కెప్టెన్ మహ్మద్ హరీస్ స్పందించాడు. తమ గెలుపును ఒప్పుకోని వారికి హరీస్ చురకలంటించాడు. అంతర్జాతీయ అనుభవం లేని యువ భారత జట్టును ఆసియా కప్కు పంపమని తాము బీసీసీఐని అడగలేదని, అనుభవజ్ఞులున్నారంటున్న తమ జట్టులో ఒకరిద్దరూ మాత్రమే 10 లోపు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారని కౌంటరిచ్చాడు. మాకు పదుల సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంటే, ఆసియా కప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు వందల సంఖ్యలో (260 మ్యాచ్లు) ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది కదా అని ఎదురుదాడికి దిగాడు. పెద్ద వయసు వారిని బరిలోకి దించామని అంటున్నారు.. భారత్-ఏ టీయ్ యావరేజ్ వయసు 20.80 అయితే, పాక్-ఏ జట్టు సగటు వయసు 23.20 అని, వయసు రిత్యా ఇది పెద్ద తేడా కాదని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. వాస్తవానికి బీసీసీఐ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం కూడా లేని యువ భారత జట్టును ఎమర్జింగ్ ఆసియా కప్కు పంపింది. అదే పాక్ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ఏడుగురు ఆటగాళ్లను బరిలోకి దించింది. కెప్టెన్ సహా ఆ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పాక్ టీ20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. ఎలాగైనా ఆసియా కప్ గెలవాలనే కుయుక్తితో పీసీబీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ జట్టును బరిలోకి దించిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు యువకులతో కూడిన జట్టే అయినా భారత్ ఆసియా కప్లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్లో కొన్ని తప్పిదాల కారణంగా పాక్కు మ్యాచ్ అప్పగించింది. కెప్టెన్ యశ్ ధుల్, సాయి సుదర్శన్, నికిన్ జోస్, నిషాంత్ సింధు, మానవ్ సుతార్, హర్షీత్ రాణా, హంగార్గేకర్ అద్భుతంగా రాణించారు. ఫైనల్లో తయ్యాబ్ తాహిర్ సెంచరీ చేయడంతో పాక్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్... ఆసియా కప్కు ఆ ఇద్దరు స్టార్స్ దూరం
-
IND VS PAK Final: పాక్ బ్యాటర్ విధ్వంసకర శతకం.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) మధ్యాహ్నం మొదలైన తుది సమరంలో టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో అయూబ్, ఫర్హాన్, తాహిర్లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. ఖాసిం అక్రమ్ (0), కెప్టెన్ మహ్మద్ హరీస్ (2), మెహ్రన్ ముంతాజ్ (13) విఫలం కాగా.. మహ్మద్ వసీం జూనియర్ (17), సూఫియాన్ ముఖీమ్ (4) నాటౌట్గా నిలిచారు. 14 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలరల్లో నిషాంత్ (5.30) మినహా అందరూ 6 అంతకంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 51 పరుగులు, హంగార్గేకర్ 6 ఓవర్లలో 48, అభిషేక్ శర్మ 9 ఓవర్లలో 54, యువ్రాజ్ సింగ్ దోడియా 7 ఓవర్లలో 56, మానవ్ సుతార్ 9 ఓవర్లలో 68, రియాన్ పరాగ్ 4 ఓవర్లలో 24.. ఇలా ప్రతి భారత బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్పై టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్ధి భారీ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ఎలాగైనా తామే గెలుస్తామని భారత అభిమానులు సోషల్మీడియా వేదికగా యువ భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. -
పాకిస్తాన్తో భారత్ ఫైనల్ పోరు.. తుది జట్లు ఇవే
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు సర్వం సిద్దమైంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సెమీఫైనల్లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం తమ జట్టులో ఒక మార్పు చేసింది. అమాద్ బట్ స్ధానంలో మెహ్రాన్ ముంతాజ్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: ఇండియా ఎ: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధుల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మానవ్ జగ్దూసకుమార్ సుతార్, యువరాజ్సింగ్ దోడియా, హర్షిత్ రాణా, రాజ్వర్ధన్ హంగర్గేకర్ పాకిస్తాన్ ఎ: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్ (వైస్ కెప్టెన్), ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, మెహ్రాన్ ముంతాజ్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్పై సీరియస్ -
భారత్-పాకిస్తాన్ ఫైనల్ పోరు.. ఏ జట్టు ఫేవరేట్ అంటే?
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్గా ఉంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా నిశాంత్ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ టీమ్ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్ వసీమ్, కెప్టెన్ మొహమ్మద్ హారిస్, ఫర్హాన్, అర్షద్ ఇక్బాల్లకు ఇప్పటికే సీనియర్ టీమ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు. తుది జట్లు(అంచనా): భారత్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్ పాకిస్తాన్: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs WI: అశ్విన్తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్ -
ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్.. నాడు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్..!
కొలొంబో వేదికగా రేపు (జులై 23) జరుగబోయే 2023 ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. జులై 21న జరిగిన సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్ను, పాకిస్తాన్.. శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరాయి. ఫైనల్ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, ఇదే ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్లు గతంలో కూడా ఓసారి ఫైనల్లో తలపడ్డాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, 2013లో సింగపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత అండర్-23 జట్టును.. పాక్ అండర్-23 టీమ్ ఢీకొట్టింది. నాటి సమరంలో భారత్.. పాక్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా ఛాంపియన్గా నిలిచింది. India will face Pakistan in the Emerging Asia Cup final tomorrow! The last time they met was in 2013 when India won the Trophy under Suryakumar Yadav. KL Rahul won the Player of the match award in the final for scoring 93* runs. pic.twitter.com/Kj8FhqpuNZ — Johns. (@CricCrazyJohns) July 22, 2023 నాడు పాక్ను మట్టికరిపించిన భారత జట్టుకు ప్రస్తుత టీమిండియా సభ్యుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించగా.. ప్రస్తుత భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ నాటి ఫైనల్లో అజేయమైన 93 పరుగులు చేసి, పాక్ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సూర్య, కేఎల్ రాహుల్తో పాటు నాటి యంగ్ ఇండియాలో ప్రస్తుత భారత జట్టు సభ్యుడు అక్షర్ పటేల్, ప్రస్తుత యూఎస్ఏ ఆటగాడు స్మిత్ పటేల్ ఉన్నారు. అలాగే నాటి పాక్ జట్టులో ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (7) విఫలం కాగా.. మహ్మద్ రిజ్వాన్ (21), ఉమర్ వహీద్ (41), 10, 11వ నంబర్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాదిర్ (33), ఎహసాన్ ఆదిల్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బాబా అపరాజిత్ 3, సందీప్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెరో 2 వికెట్లు, సందీప్ వారియర్, అంకిత్ బావ్నే తలో వికెట్ పడగొట్టారు. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), మన్ప్రీత్ జునేజా (51 నాటౌట్) రాణించడంతో 33.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. -
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్లో ఉన్న నికిన్ జోస్కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
ఆసియా కప్-2023 ఫైనల్కు చేరిన పాకిస్తాన్..
ACC Mens Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్ జట్టు అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అతిథ్య శ్రీలంకను 60 పరుగులు తేడాతో చిత్తు చేసిన పాకిస్తాన్.. తుది పోరుకు అర్హత సాధించింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో ఆర్షద్ ఇక్భాల్ 5 వికెట్లతో చెలరేగగా.. ముబాసిర్ ఖాన్,సుఫియాన్ ముఖీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(97),సహన్ అరాచ్చిగే(97) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఒమర్ యూసఫ్(88), మహ్మద్ హారిస్(52), ముబాసిర్ ఖాన్(42) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో బౌలర్ మహ్మద్ వసీం(24) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో లహిరు సమరకోన్,ప్రమోద్ మదుషన్, కరుణ్ రత్నే తలా రెండు వికెట్లు సాధించగా.. వెల్లలగే, సహన్ అరాచ్చిగే చెరో వికెట్ పడగొట్టాడరు. ఇక జూన్ 23న కొలంబో వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్ లేదా బంగ్లాదేశ్తో పాకిస్తాన్ తలడపడనుంది. చదవండి: IND vs WI: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్..!
ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ ప్రథముడు. గత ఐపీఎల్ సీజన్తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్ల్లో 141.41 స్ట్రయిక్ రేట్తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్ చేసింది. అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 172.5 స్ట్రయిక్రేట్తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లతో టీమిండియా యంగ్ ఓపెనర్ల బెంచ్ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు. అయితే, ఈ సీజన్లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 100 స్ట్రయిక్రేట్తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్ విసిరాడు. టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్తో సవాల్ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది. -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్లు ఇదివరకే సెమీస్కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్కు చేరిన భారత్, పాక్లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్లతో పోలిస్తే భారత్, పాక్లకే ఫైనల్కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్లో భారత్-పాక్లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
పాక్తో మ్యాచ్.. సంచలన స్పెల్తో మెరిసిన సీఎస్కే బౌలర్
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్లో సీఎస్కే పేసర్.. యువ బౌలర్ రాజ్వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్తో మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్లో రెండో బంతికి సయీమ్ అయూబ్ను డకౌట్గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఎవరీ రాజ్వర్దన్ హంగర్గేకర్? నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్లో ప్రామిసింగ్ క్రికెటర్గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్కప్కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్వర్దన్ హంగర్గేకర్ సీఎస్కే తరపున ఐపీఎల్లో ఆడాడు. అయితే మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వ్యవహరించాడు. Pace is Pace Yaar, right? 😉 Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS — FanCode (@FanCode) July 19, 2023 చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్చేస్తే సూపర్మార్కెట్ ఓనర్గా Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' -
ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్తో మ్యాచ్లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్తో జరిగే మ్యాచ్లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్లో ఉన్న భారత్, పాక్లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లో విజయాలతో గ్రూప్ టాపర్గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
శతక్కొట్టిన యశ్ ధుల్.. ఆసియా కప్లో టీమిండియా బోణీ
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ను మట్టికరిపించిన పాక్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు. -
'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
ఆసియా కప్ 2023 నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షా.. సోమవారం భేటీ కావడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్కు తాను అంగీకరించినట్లు జకా అష్రఫ్ మీడియాకు వెల్లడించాడు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్లో శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు, పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. మ్యాచ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది. భారత్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు టీమిండియా త్వరలో వెళ్లనుందని.. ముందస్తుగా బీసీసీఐ సెక్రటరీ జై షా పాక్కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానుందని పేర్కొన్నారు. ''బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ సమావేశం తర్వాత ఆసియా కప్ పై స్పష్టత వచ్చింది. మా కార్యదర్శి జై షా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాబోతోందన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. భారత జట్టే కాదు.. చర్చల కోసం జై షా కూడా పాకిస్థాన్ వెళ్లడం లేదని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పాడు. ఆసియా కప్లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో నేపాల్ తో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్, శ్రీలంక.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా మ్యాచ్లు జరగనున్నాయి. ఉపఖండంలో 2016 తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా.. తర్వాత 2018, 2022లలో యూఏఈలో జరిగింది. చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్కు గ్రీన్ సిగ్నల్ WCC Suggests ICC: 'వరల్డ్కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్లను తగ్గించండి' -
జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్కు గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్లు ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్లో.. మరో తొమ్మిది మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్కప్తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
మరో యూ టర్న్.. వరల్డ్కప్లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు!
దాదాపు పుష్కర కాలం తర్వాత వన్డే ప్రపంచకప్కు భారత్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీకు ఐసీసీ షెడ్యూల్ ఖారారు చేయడంతో.. ఈ ఈవెంట్లో పాల్గోనే ఆయా జట్లు తమ సన్నహాకాలను కూడా ప్రారంభించాయి. అయితే ప్రపంచకప్ విషయంలో అందరిది ఒక లెక్క. తనొదక లెక్క అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం పాల్గొంటుందా..? లేదా..? అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. తమ జట్టును భారత్కు పంపించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ ప్రభుత్వం సైతం పూటకో మాట మారుస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రీడా శాఖామంత్రి ఎహ్సాన్ మజారీ కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్ ఆడేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే పాకిస్తాన్ జట్టు సైతం భారత్కు వెళ్లదని అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్కు భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఏసీసీ ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఎహ్సాన్ మజారీ విలేకురల సమావేశంలో మాట్లాడుతూ.. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి భారత్ ఆసియా కప్ మ్యాచ్లను తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేస్తే.. భారత్లో జరిగే మేము కూడా అదే అదే డిమాండ్ చేస్తాము" అని అతను పేర్కొన్నాడు. అతడు చేసిన వాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఉన్నతస్థాయి కమిటీ.. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోనడంపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్ కోసం భారత్లో పాక్ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో ఎహ్సాన్ మజారీ కూడా సభ్యునిగా ఉన్నాడు. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది. ఇక షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. చదవండి: BAN W vs IND W: బంగ్లాదేశ్తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ! -
నా గురించి ట్వీట్లు చేస్తుంటారు... అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా! అంతకంటే..
ఐపీఎల్-2023లో ఎక్కువగా ట్రోలింగ్కు గురైన క్రికెటర్ రియాన్ పరాగ్. 2019లో క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ అసోం ఆల్రౌండర్ ఆరంభం నుంచే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజా ఎడిషన్లోనూ వైఫల్యాల పరంపర కొనసాగించాడు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు వరుస మ్యాచ్లలో తేలిపోయాడు. దీంతో మేనేజ్మెంట్ రియాన్కు కేవలం ఏడు మ్యాచ్లలో మాత్రమే అవకాశమిచ్చింది. అయితే, రియాన్ పరాగ్ మాత్రం వచ్చిన కాసిన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్లలో అతడు సాధించిన మొత్తం పరుగులు 78. అత్యధిక స్కోరు 20. ఆసియా కప్ ఆడే జట్టులో ఆటలో విఫలమైనప్పటికీ మైదానంలో అతి చేష్టల వల్ల ఓవరాక్షన్ ప్లేయర్గా ముద్రపడ్డాడు రియాన్ పరాగ్. నెటిజన్ల చేతిలో ట్రోలింగ్కు గురయ్యాడు. ఈ క్రమంలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నేపథ్యంలో ఇండియా- ఏ జట్టులో అతడు స్థానం సంపాదించడంతో మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తనపై వస్తున్న విమర్శలు, వ్యంగ్యాస్త్రాల గురించి స్పందించాడు. ‘‘తాము కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం వెచ్చించి మ్యాచ్ చూడటానికి వస్తారు. అలాంటపుడు వాళ్లను నిరాశపరిస్తే కొంతమంది తిట్టుకుంటారు. నేరుగా నాకే మెసేజ్ చేయొచ్చు కదా మరికొంత మంది మనల్ని ద్వేషిస్తారు. వాళ్ల కోపంలో అర్థం ఉంది. నేను ఆ విషయం అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. ట్వీట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు కదా! ‘‘నువ్వు ఇలా ఆడుతున్నావు. ఈ విషయంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి. టెక్నిక్లో మార్పులు చేసుకోవాలి. అలా అయితే నీ ఆట మెరుగుపడుతుంది’’ అని నాకు సలహాలు ఇవ్వొచ్చు కదా! సోషల్ మీడియాలో పోస్టులు చేసే సమయం కంటే ఇదేమీ ఎక్కువ టైమ్ తీసుకోదు. నిజంగా నాకు ఎవరైనా అలాంటి సలహాలు, సూచనలు ఇస్తే ఇష్టం’’ అంటూ రియాన్ పరాగ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు.. -
తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు
విశాఖ స్పోర్ట్స్: ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్ బ్యాట్తో సరదాగా బంతితో ఆడటం మొదలుపెట్టిన కె.నితీశ్కుమార్ రెడ్డి.. నేడు ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. చిరుప్రాయం నుంచే విశాఖ డివిజన్ క్లబ్ లీగ్స్లో సీనియర్ల ఆటను చూస్తూ వారి లాగే ఆడాలంటూ కలగనే వాడు నితీశ్. తండ్రి ముత్యాలరెడ్డి ఉద్యోగం సైతం విడిచి పెట్టి.. కుమారుడి క్రికెట్ కెరీర్కే ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు. కోచ్ల శిక్షణలో నితీశ్ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయికి ఎదిగాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్తో పాటు మీడియం పేస్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్రా జట్టుకు ఆల్రౌండర్గా మారాడు. ఏసీఏ అకాడమీ వైపు అడుగులు.. నితీశ్కుమార్ వీడీసీఏ శిబిరాల నుంచి అండర్–12, 14 గ్రూపుల్లో జిల్లాకు ఆడటం మొదలుపెట్టాడు. నార్త్జోన్కు ఆడే సమయంలో అప్పటి జాతీయ జట్టు సెలక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ నితీశ్ ప్రతిభను గుర్తించారు. ఆయన ప్రోత్సాహంతో కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రికార్డు ఆంధ్రా తరఫున ఆడుతున్న నితీశ్ నాగాలాండ్తో జరిగిన పోటీలో ఏకంగా 345 బంతుల్లోనే 441 పరుగులు సాధించడం విశేషం. విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఏకంగా 26 వికెట్లు తీయడమే కాకుండా 176.41 సగటుతో 1,237 పరుగులు చేసి టోరీ్నలో రికార్డును నమోదు చేశాడు. ఇదే నితీశ్కు 2017–18 సీజన్లో బీసీసీఐ అండర్–16 ఉత్తమ క్రికెటర్గా జగన్మోహన్ దాలి్మయా అవార్డును సాధించిపెట్టింది. ఏసీఏ నుంచి బీసీసీఐ అవార్డు పొందిన తొలి క్రికెటర్ నితీశ్ కావడం.. విశాఖ క్రీడాకారులకు నూతనోత్తేజం ఇచ్చింది. అరంగేట్రం ఇలా.. నితీశ్ రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున తొలిసారిగా 2020లో ఫస్ట్క్లాస్ క్రికెట్ మొదలెట్టాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరఫున 2021లో ఆడాడు. అదే ఏడాది సీజన్లోనే సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీలో పొట్టి ఫార్మాట్లో ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ టోరీ్నలో ఐదు దేశాల ఏ జట్లతో పాటు నేపాల్, ఒమన్, యూఏఈ సీనియర్ జట్లు ఆడనున్నాయి. ఐపీఎల్ అరంగేట్రం.. నితీశ్ కుమార్ 2023 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. 20 లక్షలకు సన్రైజర్స్ హైదరాబాద్ నితీశ్ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నితీశ్ 2 మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని నితీశ్.. 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. చాలా ఆనందంగా ఉంది అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అండర్–12లో టోర్నీలు ఆడే స్థాయికి చేరుకున్నాను. ఆ సమయంలోనే నాన్నకు విశాఖ నుంచి బదిలీ అయింది. నాన్న ఉదయపూర్ వెళ్లినా నా క్రికెట్ కెరీర్ గురించే ఆలోచించేవారు. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేశారు. అప్పుడు మా వాళ్లు కొందరు నాన్న ఏంటి ఇలా చేశారు అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ తరఫున తొలి క్రికెటర్గా బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మ విశ్వాసం పెంచింది. అన్ని ఫార్మాట్లలో మేటి టోర్నీలో ఆడటంతో పాటు ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున క్రీజ్లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్న చాలా సంతోíÙంచారు. భారత్–ఏ తరఫున ఎమర్జింగ్ ఆసియా కప్కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో స్థానం సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా మరింత సాధన చేస్తా. – నితీశ్కుమార్ రెడ్డి -
ఇండియా-ఏ జట్టులో ఓవరాక్షన్ ప్లేయర్.. అభిమానుల ట్రోల్స్
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. కాగా ఈ టోర్నీకి రియాన్ పరాగ్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ తన చర్యలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాడు ''ఆడేది తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ'' రియాన్ పరాగ్పై అభిమానుల ధోరణి ఇలానే ఉంటుంది. మనం కూడా ఇదివరకు చాలాసార్లు చూశాం. అందుకే అతనిపై ఓవరాక్షన్ ప్లేయర్ అనే ముద్ర ఉంది. ఇక ఐపీఎల్ 2023 ఏడు మ్యాచ్లాడి 78 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్పై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ఓవరాక్షన్ ప్లేయర్ను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కామెంట్ చేశారు. జూలై 13 నుంచి 23 వరకు టోర్నీ.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్-ఏ టాపర్తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). Riyan Parag after selection be like 😅#RiyanParag pic.twitter.com/IxlHQIhG8r — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) July 4, 2023 Riyan Parag scored a 33(45) in a tough wicket and is the 2nd highest scorer in the first Innings of the match between East zone and Central Zone #DuleepTrophy pic.twitter.com/a7SDXUNXFu — ' (@riyanparagfc_) June 29, 2023 Riyan Parag selected in India A squad Meanwhile me : pic.twitter.com/jiWU96Qnt3 — CHINMOY RAY (@ChinmoyRay07) July 4, 2023 చదవండి: Asia Cup- India A: ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్రెడ్డికి చోటు #ZIMVsSCO: హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్ -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్కి సితాంషు కొటక్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి.. -
Ind Vs Pak: ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగబోయేది అక్కడే..!
ఆసియా కప్-2023ను (వన్డే ఫార్మాట్) ఈ ఏడాది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతుందన్న వివరాలు వెల్లడి అయినప్పటికీ.. వేదికలు, ఫిక్షర్స్ ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఈ టోర్నీలో భారత్-పాక్ గ్రూప్ దశ మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్కు (ఏసీసీ) ఓ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ అనుకున్న విధంగా భారత్-పాక్ మ్యాచ్ను కొలొంబోలో కాకుండా డంబుల్లాలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీసీ ఇదివరకే నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. లంకలో జరిగే మిగతా మ్యాచ్ల వేదికలు ఖరారయ్యాక, ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్లో కొలొంబోలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున భారత్-పాక్ మ్యాచ్ వెన్యూను డంబుల్లాకు మార్చాలని అనుకున్నట్లు ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పాకిస్తాన్ లెగ్ మ్యాచ్లన్నీ లాహోర్లో జరుగుతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇదివరకే ప్రకటించింది. కాగా, ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్లో 4 మ్యాచ్లు, శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోటీపడతాయి. ఓ గ్రూప్లో భారత్, పాకిస్తాన్, నేపాల్.. మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. -
కోటి చాలదు! వద్దే వద్దు! ఇంకా పెంచుతాం.. బీసీసీఐ హామీ.. ఎట్టకేలకు..
BCCI New Chief Selector: టీమిండియా క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. వార్షిక వేతనం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చిన హామీ మేరకు ఈ మాజీ పేసర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చేతన్ శర్మ రాజీనామాతో కాగా ఓ ప్రైవేట్ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషరన్ వల్ల టీమిండియా చీఫ్ సెలక్టర్గా ఉన్న చేతన్ శర్మ పదవి ఊడిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు ఫిట్నెస్ లేకపోయినా ఇంజక్షన్లు తీసుకుని బరిలో దిగుతారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. దీంతో చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. సెహ్వాగ్ పేరు తెరపైకి! కొట్టిపడేసిన మాజీ ఓపెనర్ ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి స్టార్లను చీఫ్ సెలక్టర్గా నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనంటూ వీరూ భాయ్ కొట్టివేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా వ్యవహరించిన అజిత్ అగార్కర్ ఆ ఫ్రాంఛైజీతో బంధానికి వీడ్కోలు పలకడం చర్చకు దారి తీసింది. కోటి చాలదు! వద్దే వద్దు! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి చేపట్టేందుకు అగార్కర్ తొలుత సంశయించినా బోర్డు మాత్రం అతడిని ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా చీఫ్ సెలక్టర్కు ఏడాదికి కోటి రూపాయాలు వేతనంగా చెల్లిస్తోంది బీసీసీఐ. కమిటీలోని మిగతా సభ్యులకు వార్షిక వేతనంగా 90 లక్షలు అందజేస్తున్నట్లు సమాచారం. ఇంకా పెంచుతాం.. బోర్డు హామీ అయితే, జీతం విషయంలో అగార్కర్ వెనకడుగు వేయగా.. వేతనం పెంచేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామెంటేటర్గా, కోచ్గా అగార్కర్ ఆర్జిస్తున్న మొత్తాన్ని భర్తీ చేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు గురువారం చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇందుకు సంబంధించి శనివారం (జూలై 1) ఇంటర్వ్యూ జరుగనుంది. ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2023 టోర్నీకి ముందు చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ నియామకం ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. టీమిండియా తరఫున ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ టీమిండియా తరఫున 26 టెస్టులు, 188 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో టెస్టుల్లో 58, వన్డేల్లో 288, టీ20లలో మూడు వికెట్లు పడగొట్టి విజయవంతమైన ఫాస్ట్ బౌలర్గా పేరొందాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి వెస్టిండీస్తో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. చదవండి: ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్తో దిమ్మతిరిగిపోయింది! Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన -
టీమిండియాకు శుభవార్త! నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోదు: మాజీ క్రికెటర్ కౌంటర్
KL Rahul Replacemnet?: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఈ లక్నో సూపర్ జెయింట్స్ సారథి గాయపడిన విషయం తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్కు దూరం కావడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కూడా ఆడలేకపోయాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఈ కర్ణాటక బ్యాటర్ వెస్టిండీస్ పర్యటనకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో రాహుల్ త్వరలోనే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి.. మరోవారం రోజుల్లో ప్రాక్టీసు మొదలుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాకు శుభవార్త అంటూ ట్వీట్ ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్-2023 ఈవెంట్కి అతడు అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రాహుల్ పునరాగమనానికి సంబంధించిన వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అప్డేట్లు పంచుకునే ఓ ట్విటర్ యూజర్.. ‘‘టీమిండియాకు శుభవార్త. కేఎల్ రాహుల్ మరో రెండు వారాల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్కు సిద్ధమవుతున్నాడు’’ అంటూ కేఎల్ ఫొటో షేర్ చేశాడు. ఇందుకు స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ అంత సులభం కాదంటూ కౌంటర్ వేశాడు. అంత ఈజీ కాదు ‘‘బ్యాటింగ్లో తిరిగి ఫామ్లోకి రావడానికి, మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. జాతీయ జట్టులో పునరాగమనం మరీ అంత సులువుగా ఉండదు. ఉండకూడదు! నెట్స్లో ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సై అనడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ముందుగా రాహుల్కు ప్రత్యామ్నాయం వెదకాలి. సాయి సుదర్శన్ వంటి లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ను మిడిలార్డర్లో ఆడించే ప్రయత్నం చేయాలి’’ అని తమిళనాడుకు చెందిన ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు పరుగులు తీయాలి.. బౌలర్లు వికెట్లు పడగొట్టాలి ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. ‘‘సాయి బంతితో కూడా జట్టుకు ఉపయోగపడగలడు’’ అని వ్యాఖ్యానించగా.. శివరామకృష్ణన్.. ‘‘బ్యాటర్లు పరుగులు సాధించడానికి, బౌలర్లు వికెట్లు తీయడానికి ఉంటారు. జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రమే పార్ట్టైమ్ బౌలింగ్ గురించి ఆలోచించాలి’’ అని సమాధానమిచ్చాడు. కాగా మద్రాస్లో జన్మించిన శివరామకృష్ణన్ టీమిండియా తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడి ఆయా ఫార్మాట్లలో.. 26, 15 వికెట్లు పడగొట్టాడు. కొన్నాళ్లపాటు కామెంటేటర్గా వ్యవహరించిన అతడు.. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆటగాడు జథావేదఘ్ సుబ్రమణియన్ కోచ్గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ సహా జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ తదితర కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం విదితమే. చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ Good news for India. KL Rahul is expected to start the batting practice in a couple of weeks. pic.twitter.com/huZXTN8VLV — Johns. (@CricCrazyJohns) June 28, 2023 People like Sai Sudarshan need to be looked at, Left handed middle order batsman — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) June 28, 2023 -
ఆసియా కప్లో ఆ ఇద్దరు టీమిండియా స్టార్ల రీఎంట్రీ..!
ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్-2023తో ఇద్దరు టీమిండియా స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని ప్రముఖ దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్లు ఆసియాకప్లో ఆడతారని IE పేర్కొంది. వీరితో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) రిహాబ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, అతని రీఎంట్రీకి మరింత సమయం పట్టవచ్చని తెలిపింది. కాగా, వెన్ను సమస్య కారణంగా 2022 సెప్టెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న బుమ్రా.. ఇటీవలే పూర్తిగా కోలుకుని, ప్రస్తుతం నెట్స్లో సాధన చేస్తున్నాడు. అతను నెట్స్లో అవిశ్రాంతంగా 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్ సైతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, అయితే అతను ప్రాక్టీస్ ప్రారంభించేందుకు మరో వారం సమయం పట్టవచ్చని సమాచారం. శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ చాలాకాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. గాయానికి తగిన చికిత్స తీసుకున్నప్పటికీ అతను ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. అయ్యర్ ఇంకా ఇంజెక్షన్లపైనే ఉన్నాడని సమాచారం. కొందరేమో అయ్యర్ వరల్డ్కప్ సమయానికి కోలుకోవడం కూడా అనుమానమేనని అంటున్నారు. దీంతో బీసీసీఐ అయ్యర్కు ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో పడింది. -
అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్.. ఇది ఫిక్స్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కాబోయే చైర్మన్గా ప్రచారంలో ఉన్న జకా ఆష్రఫ్ వ్యాఖ్యలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆసియా కప్-2023 నిర్వహణ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ముందుగా అనుకున్నట్లుగానే టోర్నీ నిర్వహించి తీరతామని ఏసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్కు పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి గతంలోనే కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ తెర మీదకు రాగా.. పాకిస్తాన్లో 4 మ్యాచ్లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ల నిర్వహణకు పీసీబీ అంగీకరించింది. అయితే, నజమ్ సేథీ పీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో ఈ నిర్ణయం కాగా.. అతడి స్థానాన్ని భర్తీ చేయబోతున్న జకా ఆష్రఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ మేరకు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను హైబ్రిడ్ మోడల్ను వ్యతిరేకిస్తున్నానని తెలిపాడు. ఈ క్రమంలో జకా వ్యాఖ్యలపై స్పందించిన ఏసీసీ మెంబర్.. ‘‘ఆసియా కప్ మోడల్పై తుది నిర్ణయం జరిగిపోయింది. ఏసీసీ ఇందుకు అంగీకారం తెలిపింది. మా నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఆష్రఫ్ తాను ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడొచ్చు.. మాకేం సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్-2023పై మరోసారి గందరగోళం నెలకొంది. ఇక ఆగష్టు 31- సెప్టెంబరు 17 వరకు ఈ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక ఆసియా టీ20 కప్-2022లో శ్రీలంక విజేతగా అవతరించగా.. పాక్ రన్నరప్గా నిలిచింది. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం -
'పాక్కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్ను వ్యతిరేకిస్తున్నా'
''ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్ జకా అష్రఫ్ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్ సేథీ ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఈ హైబ్రిడ్ మోడల్ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి. ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్లన్నీ పాకిస్తాన్ బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు. PCB Nominated Chairman Zaka Ashraf Reject PCB hybrid Model for Asia Cup Interesting days ahead & controversy related #AsiaCup2023 #WorldCup2023 pic.twitter.com/3El1ISj0ym — Abdul Ghaffar 🇵🇰 (@GhaffarDawnNews) June 21, 2023 అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి పాక్కు మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇదివరకే తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యం. ఇక జకా అష్రఫ్ పీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! #AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
భారత్- పాక్ మ్యాచ్లు జరుగకపోతే అంతే సంగతులు! కాబట్టి: పాక్ మాజీ సారథి
India VS Pakistan Matches: భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు జరుగకపోతే మెగా క్రికెట్ ఈవెంట్లకు ఆదరణ తగ్గిపోయే అవకాశం ఉందని పాక్ మాజీ కెప్టెన్ ఇంతిఖాబ్ ఆలం అన్నాడు. దాయాదుల పోరు వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలికి భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోందన్న అతడు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగకపోతే నష్టం చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నాడు. రాజకీయాలకు అతీతంగా ఆట సాగాలని ఆకాంక్షించాడు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. వన్డే వరల్డ్కప్-2023 భారత్ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీ ఆడేందుకు టీమిండియాను పాక్కు పంపే ప్రసక్తి లేదని బీసీసీఐ తేల్చి చెప్పగా.. పాక్ హైబ్రిడ్ మోడల్కు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన ఇంతిఖాబ్ ఆలం.. భారత్- పాక్ మ్యాచ్లు జరిగితేనే క్రికెట్ మనుగడ కొనసాగుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశాడు. కూర్చుని మాట్లాడుకుంటే సరి! కూర్చుని మాట్లాడుకుంటే పరిస్థితులు చక్కబడతాయని.. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలే తప్ప పెంచకూడదని పేర్కొన్నాడు. ఇక హైబ్రిడ్ మోడల్ చెత్తగా ఉందని.. పాకిస్తాన్లో కేవలం నాలుగైదు మ్యాచ్లు ఆడితే ఏం ప్రయోజనం ఉంటుందని ఆలం ప్రశ్నించాడు. ఇలాంటి విధానం వల్ల తమకు నష్టం జరుగుతుందని.. వరల్డ్కప్ సమయంలో తాము కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే మ్యాచ్లు ఆడతామని పాక్ భీష్మించుకు కూర్చుంటే పరిస్థితి ఏమిటని వాపోయాడు. మెగా ఈవెంట్లలో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ మధ్య మ్యాచ్లు జరిగితేనే ఆదరణ మరింత పెరుగుతుందన్న ఇంతిఖాబ్ ఆలం.. ఆటగాళ్ల మధ్య రాజకీయాలకు అతీతంగా స్నేహభావం పెంపొందితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ప్రేమను పెంచుతుంది క్రికెట్ ఇరు దేశాల మధ్య స్నేహం, ప్రేమను పెంచడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడి పరిస్థితుల దృష్ట్యా తటస్థ వేదికపై మ్యాచ్లు నిర్వహిస్తే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గతంలో తెలిపారు. చదవండి: IND vs WI: కిషన్, భరత్కు నో ఛాన్స్.. భారత జట్టులోకి యువ వికెట్ కీపర్! న్యూ మిస్టర్ కూల్ అంటూ ప్రశంసల వర్షం.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్ -
బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్..
ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ఛాంపియన్స్గా భారత జట్టు అవతరించింది. హాంగ్ కాంగ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్.. తొట్ట తొలి మహిళల ఎమర్జింగ్ ఆసియా విజేతగా నిలిచింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 96 పరుగులకే కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మన్నత్ కశ్యప్ మూడు, కనిజా రెండు వికెట్లు సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నహీదా అక్తర్ 17 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరిందా దినేష్(36), కనినా అహుజా(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాటాన్, నహిదా ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రెబియా ఖాన్, సంజిదా చెరో వికెట్ సాధించారు. చదవండి: Ashes 2023: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్కు బిగ్ షాక్.. భారీ జరిమానా 🏆 U19 World Cup title 🏆 Emerging Teams Asia Cup title India's youngsters are on a roll! #WomensCricket | #TeamIndia pic.twitter.com/NVVvPgjBKd — Sportstar (@sportstarweb) June 21, 2023 𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆 Congratulations to India 'A' on the title triumph 👏 👏 #WomensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/OCaw8cvHLS — BCCI Women (@BCCIWomen) June 21, 2023 -
16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా, పాక్ను మట్టికరిపించిన బంగ్లాదేశ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య ఇవాళ (జూన్ 20) జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్లో బంగ్లాదేశ్ టీమ్ 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి తేరుకుని అద్భుత విజయం నమోదు చేసింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళలు.. 9 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేక 4 వికెట్ల నష్టానికి 53 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 21 పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్ నహీద అక్తర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ ఫైనల్కు చేరుకుంది. Bangladesh-A women have snatched victory from the jaws of defeat against Pakistan-A in the second semi-final of the Women's Emerging Asia Cup.#BANWvsPAKW pic.twitter.com/olrAa05wg3 — CricTracker (@Cricketracker) June 20, 2023 మరోవైపు ఈ టోర్నీలో భారత మహిళల జట్టు కూడా ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక-ఏతో జరగాల్సిన సెమీఫైనల్-1 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో, గ్రూప్ టాపర్ హోదాలో భారత్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. భారత్ ఉన్న గ్రూప్లో పాకిస్తాన్, నేపాల్, ఆతిధ్య హాంగ్కాంగ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో భారత్ ఒకే ఒక మ్యాచ్ (జూన్ 13) ఆడింది. ఇందులో హాంగ్కాంగ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 𝙄𝙣𝙩𝙤 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡! 🙌 🙌 Congratulations to India 'A' as they seal a spot in the #WomensEmergingTeamsAsiaCup summit clash 👏 👏#ACC pic.twitter.com/FFdUo4vzlG — BCCI Women (@BCCIWomen) June 20, 2023 ఆ మ్యాచ్లో భారత్ బౌలర్లు హాంగ్కాంగ్ను 14 ఓవర్లలో కేవలం 34 పరుగులకే ఆలౌట్ చేశారు. శ్రేయాంక్ పాటిల్ అత్యుత్తమ గణాంకాలు (3-1-2-5) నమోదు చేసింది. ఛేదనలో భారత్.. కెప్టెన్ శ్వేత సెహ్రావత్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. గొంగడి త్రిష, ఛెత్రి భారత్ను విజయతీరాలకు చేర్చారు. కాగా, రేపు (జూన్ 21) జరుగబోయే ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. -
మీరు వెనక్కి తగ్గకండి.. ముందు భారత జట్టు పాక్కు రాని! ఆ తర్వాతే ఏదైనా
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ జట్టు పాల్గోనడంపై ఇంకా క్లారిటీ లేదు. తమ జట్టును భారత్కు పంపడంపై పీసీబీ పూటకో మాట మారుస్తోంది. ఆసియాకప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పీసీబీ కూడా అమలు చేయనునున్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్లో పాల్గోనేందుకు భారత జట్టును పాక్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్-2023ను శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సిద్దమైంది. ఈ ప్రాతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకుంది. అయితే భారత జట్టు తమ దేశంలో అడుగుపెట్టనప్పుడు.. పాక్ ప్రభుత్వం కూడా మా జట్టును పంపేందుకుఅనుమతి ఇస్తుందో లేదో తెలియదని పీసీబీ ఛీప్ సైతం అనుమానం వ్యక్తం చేశాడు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు. బీసీసీఐ తమ జట్టును ముందుగా పాకిస్తాన్కు పంపడానికి అంగీకరించే వరకు.. పాక్ వరల్డ్కప్తో పాటు ఈతర మ్యాచ్లు ఆడేందుకు భారత్కు వెళ్లకూడదని మియాందాద్ మరోసారి విషం చిమ్మాడు. కాగా ఐసీసీ డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్తాన్లు తలపడాల్సి ఉంది. మీరు ఎందుకు వెళ్లాలి? "పాకిస్తాన్ జట్టు 2012, 2016లో భారత్కు వెళ్లింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ రావడం భారత్ వంతు. భారత్ జట్టు ఇక్కడకు రానింతవరకు పాకిస్తాన్.. ప్రపంచకప్తో సహా ఎటువంటి క్రికెట్ ఆడటానికి వారి గడ్డపై అడుగుపెట్టకూడదు. అయితే భారత్తో తలపడేందుకు మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాము. ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్కు పత్యేక గుర్తింపు ఉంది. మేము ఇప్పటికీ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను తయారు చేస్తున్నాము. కాబట్టి మనం భారత్కు వెళ్లకపోయినా దాని వల్ల పెద్ద నష్టమేమి లేదు. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. మనకు బలం ఉందని పొరుగువారిపై పెత్తనం చెలాయించకూడదు. కాబట్టి రెండు క్రికెట్ బోర్డులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకుపోవాలి. క్రికెట్ ఇరు దేశాల్లో చాలా మందికి ఒక ఎమెషనల్" అని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ పేర్కొన్నాడు. -
ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్లో ఇరు జట్లు
హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. లీగ్ మ్యాచ్లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్తో పాకిస్తాన్ తలపడతాయి. బంగ్లాదేశ్ భారీ విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో.. మిర్పూర్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో లిటన్ దాస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. 662 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 33 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోరు 45/2తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గానిస్తాన్ మరో 70 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్ (4/37), షోరిఫుల్ ఇస్లాం (3/28) అఫ్గానిస్తాన్ను దెబ్బ తీశారు. రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ షాంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల తేడా పరంగా బంగ్లాదేశ్ది మూడో అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లండ్ (1928లో ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపు), ఆస్ట్రేలియా (1934లో ఇంగ్లండ్పై 562 పరుగుల తేడాతో గెలుపు) జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
అహ్మదాబాద్లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రంపంచకప్ డ్రాప్ట్ షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకు సమర్పించిన సంగతి తెలిసిందే. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. వన్డే ప్రపంచకప్లో తమ మ్యాచ్లను అహ్మదాబాద్లో కాకుండా వేరే వేదికలో నిర్వహించాలని పట్టు పట్టుకు కూర్చోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆదేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించాడు. "పాకిస్తాన్ జట్టు అహ్మదాబాద్లో ఆడేందుకు పీసీబీ ఎందుకు నిరాకరిస్తుందో నాకు అర్ధం కావడం లేదు. అక్కడ ఏమైనా నిప్పులు వర్షం కురుస్తుందా లేదా దెయ్యం ఎమైనా ఉందా? అక్కడికి వెళ్లి గెలిచి రండి. భారత్ తమకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడే మ్యాచ్లు నిర్వహిస్తుంది. అది మనకు అనవసరం. వాళ్లు కోరుకున్న పిచ్ పై ఆడి.. భారత అభిమానుల ముందు మ్యాచ్ గెలవాలి. అలా సాధించిన గెలుపే అసలైన విజయం" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. ఇక ఈడాది ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా ఈ ఏడాది ఆసియాకప్ జరగనుంది. -
'వరల్డ్కప్కు ముందు ఆసియా కప్ కొట్టండి'.. ప్రోమో అదిరింది
ఆసియాకప్ 2023కి సంబంధించిన హక్కులను బ్రాడ్కాస్ట్ సంస్థ స్టార్స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్కు సంబంధించిన ప్రోమోను శుక్రవారం తన ట్విటర్లో రిలీజ్ చేసింది. ''ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ కొట్టడానికి ముందు ఆసియా కప్ కొట్టండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొండి'' అంటూ టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మాటలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆసియా కప్లో పాల్గొననున్న ఆరు జట్లను చూపిస్తూ ప్రోమో కొనసాగుతుంది. చివరగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆసక్తికరపోరు ఖాయమని చెబుతూ 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉపఖండపు దేశాల మధ్య పోరు రంజుగా ఉంటుంది.. అంటూ ముగించింది. స్టార్స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. All eyes on Asia as we gear up for an ultimate showdown in the #AsiaCup2023! Join #TeamIndia's exhilarating journey as they intend to conquer first the Asia Cup & then the World Cup #AajAsiaKalDuniya Watch Asia Cup LIVE from Aug 31-Sep 17, only on Star Sports Network pic.twitter.com/b1tcPlZ6dn — Star Sports (@StarSportsIndia) June 17, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు.పాకిస్తాన్లో 4 మ్యాచ్లు... శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. పాకిస్తాన్లోని నాలుగు మ్యాచ్లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: 'వరల్డ్కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత వీడింది. పీబీసీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోక్కు ఓకే చెప్పిన ఆసియా క్రికెటర్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఇక ఆసియా కప్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో రానుంది. కాగా ఆసియా కప్ నిర్వహణలో పీసీబీ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి.. పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా కప్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగానే నజమ్ సేథీ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. నజమ్ సేథీ మాట్లాడుతూ.. ''ACC ఆసియా కప్ 2023 కోసం మా హైబ్రిడ్ వెర్షన్ ఆమోదించింనందుకు నేను సంతోషిస్తున్నా. ఆసియా కప్ హోస్ట్గా మేము ఉండడం.. భారత్ పాకిస్తాన్ రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుంది. అయితే గత 15 ఏళ్లలో ఆసియా కప్ ద్వారా టీమిండియా పాకిస్తాన్లో అడుగుపెడుతుందని అనుకున్నాం. కానీ బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మాలాగే బీసీసీఐకి కూడా బార్డర్ దాటి పాక్లో ఆసియా కప్ ఆడేందుకు వారి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. కానీ మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు.'' అంటూ చెప్పుకొచ్చాడు. کرکٹ کے شائقین کے لیے بڑی خوشخبری ایشیا کپ ایک بار پھر پاکستان میں۔ پاکستان کرکٹ بورڈ کی مینجمنٹ کمیٹی کے چیئرمین نجم سیٹھی کا پیش کردہ ہائبرڈ ماڈل منظور, ایشیا کپ31 اگست سے17 ستمبر تک ہوگا۔ ابتدائی میچز پاکستان میں ہونگے جس کے بعد بقیہ میچز سری لنکا میں کھیلے جائیں گے۔ pic.twitter.com/r9jUZ8jCGX — Pakistan Cricket (@TheRealPCB) June 15, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్లు... శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. పాకిస్తాన్లోని నాలుగు మ్యాచ్లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ను ఖరారు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నీని ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించేందుకు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్లు... శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. పాకిస్తాన్లోని నాలుగు మ్యాచ్లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. -
ఆసియాకప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాళ్లు వచ్చేస్తున్నారు!
ఆసియాకప్-2023 పాకిస్తాన్, శ్రీలంక వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. ఈ మెరకు ఆసియా క్రికెట్ కౌన్సల్ గురువారం ఓ ప్రకటన చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ ఏడాది ఆసియా కప్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో జరగనున్న ఆసియాకప్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. టీమిండియాకు గుడ్న్యూస్.. ఇక ఆసియాకప్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్ అందే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ఆసియాకప్కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఆసియాకప్ సమయానికి అయ్యర్, బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని ఏన్సీఏ వైద్య బృందం తెలిపినట్లు ఈఎస్పీఎన్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా బుమ్రా తన వెన్ను గాయానికి న్యూజిలాండ్లో శస్త్ర చికిత్స చేసుకోగా.. అయ్యర్ లండన్లో సర్జరీ చేసుకున్నాడు. చదవండి: భారత క్రికెట్కు అహంకారం ఎక్కువైంది.. అందుకే ఇలా: వెస్టిండీస్ లెజెండ్ -
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ తేదీలు వచ్చేశాయి
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. ఎట్టకేలకు ఆసియాకప్-2023 నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఈ టోర్నమెంట్కు సంబంధించిన తేదీలను, వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్, శ్రీలంక వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ జరగనుంది. కాగా మొత్తం ఈవెంట్లో ఫైనల్తో కలిపి మొత్తం 13 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్లో, తొమ్మిది మ్యాచ్లో శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. ఇక వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి పూర్తిగా పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాకిస్తాన్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఏసీసీ హైబ్రిడ్ మోడల్కే మొగ్గు చూపింది. ఇక ఏడాది వన్డే ఫార్మాట్లో జరగనున్న ఆసియాకప్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూప్లో మూడు టీమ్లు ఉంటాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్కి అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్ స్టేజ్లోని మొదటి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. చదవండి: Ashes 2023: యాషెస్ సిరీస్కు సర్వం సిద్దం.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..! Dates and venues have been finalised for the Asia Cup 2023! The tournament will be held from 31st August to 17th September in a hybrid model - with 4 matches being held in Pakistan and the rest in Sri Lanka! https://t.co/bvkfSSAp9w#AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) June 15, 2023 -
ఆసియా కప్ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్..!
ఆసియా కప్ 2023 (వన్డే ఫార్మాట్) విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్లుగా హైబ్రిడ్ మోడల్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో.. భారత్ ఆడే మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది. పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆసియా కప్లో భాగంగా జరిగే 13 మ్యాచ్ల్లో 4 లేదా 5 మ్యాచ్లు మాత్రమే వారి స్వదేశంలో జరిగే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్లు సహా భారత్ ఆడే మిగతా మ్యచ్లన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి. టీమిండియా ఫైనల్కు చేరితే, ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు. అలాగే ఈ టోర్నీ షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సెప్టెంబర్ 1-17 మధ్యలో ఈ టోర్నీ జరిగవచ్చని సమాచారం. పాకిస్తాన్లో జరుగబోయే మ్యాచ్లన్నీ లాహోర్లో జరుగుతాయని తెలుస్తోంది. మొత్తంగా ఆసియా కప్ 2023 విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులు తొలుత పాకిస్తాన్కే దక్కాయి. అయితే భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో బీసీసీఐ.. భారత జట్టును పాక్కు పంపిచేందుకు నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తామని పాక్ చెప్పింది. పాక్ ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే చెప్పినా.. మిగతా దేశాలు ఎండలకు సాకుగా చూపి నిరాకరించాయి. దీంతో మధ్యే మార్గంగా ఏసీసీ శ్రీలంక పేరును ప్రతిపాదించగా, అందుకు అన్ని దేశాలు సరే అన్నాయి. ఆసియా కప్-2023లో భారత్, పాక్లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ జట్లు పాల్గొంటాయి. భారత్, పాక్, నేపాల్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో తలపడతాయి. ఆ తర్వాత సూపర్-4, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. చదవండి: గిల్ది ఔటే.. నేను క్లియర్గానే క్యాచ్ పట్టుకున్నా: గ్రీన్ -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. పాకిస్తాన్తో మ్యాచ్ ఎప్పుడంటే?
హాంకాంగ్ వేదికగా జరగనున్న ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్- 2023కు భారత-ఏ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపికచేసింది. ఈ జట్టుకు అండర్-19 స్టార్ క్రికెటర్ శ్వేతా సెహ్రావత్ నాయకత్వం వహించనుంది. అదే విధంగా ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు గొంగడి త్రిషా, బారెడ్డి మల్లి అనూషకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన యువ సంచలనం గొంగడి త్రిషా ఇప్పటికే భారత అండర్-19 జట్టు తరపున ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రాకు చెందిన యువ పేసర్ బారెడ్డి మల్లి అనూష అండర్-16 టోర్నీలో అద్భుతంగా రాణించడంతో ఈ మెగా ఈవెంట్కు ఎంపికైంది. ఇక ఈ మెగా టోర్నీ జూన్-12 నుంచి షురూ కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు భాగం కానున్నాయి. The high performance camp for the senior women in full swing at the NCA 👌👌 The camp will surely help the women gear up for an exciting upcoming season 👏👏 pic.twitter.com/8RcFrie9PR — BCCI Women (@BCCIWomen) May 22, 2023 ఈ 8 జట్లను ఏ, బి అని రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో భారత జట్టు గ్రూపు-ఏలో ఉంది. భారత్తో పాటు హాంకాంగ్, థాయిలాండ్ ‘ఎ’ మరియు పాకిస్తాన్ ‘ఎ’ వంటి జట్లు ఉన్నాయి. ఇక జూన్ 13న క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్ వేదికగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో హాంకాంగ్తో తలపడనుంది. అదే విధంగా పాకిస్తాన్-ఏ జట్టుతో జూన్ 17న భారత్ ఆడనుంది. From #TeamIndia to all of you, We wish you a very #HappyWomensDay 🫡 ☺️ pic.twitter.com/4YDwyFpeUr — BCCI Women (@BCCIWomen) March 8, 2023 ఇండియా ఎమర్జింగ్-ఏ జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిషా గొంగడి, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), యశశ్రీ ఎస్, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష చదవండి: వరల్డ్కప్కు ముందు టీమిండియాకు మరో గుడ్ న్యూస్.. అతడు కూడా వచ్చేస్తున్నాడు! -
AsiaCup 2023: కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!
ఆసియా కప్ 2023 విషయమై ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిరేలా సూచనలు కనిపించడం లేదు. ఆసియా కప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని చూసిన పీసీబీకి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ ప్రకారం పాక్లో కొన్ని మ్యాచ్లు.. భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించాలని పీసీబీ భావించింది. కానీ హైబ్రిడ్ మోడ్కు బీసీసీఐ అంగీకరించలేదని.. ఆ సమయంలో దుబాయ్లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడ్కు ఒప్పుకోనట్లు తెలిసింది. దీంతో పాకిస్తాన్ లేకుండానే ఆసియా కప్ జరగనున్నట్లు తెలిసింది. రిపోర్టు ప్రకారం, టోర్నమెంట్కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్ మినహా ఆసియా కప్ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్పష్టమైన సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్కు ఇప్పుడు వేరే మార్గం లేదు. ఒకవేళ ఈ ఈవెంట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్లు శ్రీలంక వేదికగా ఆసియా కప్లో ఆడతాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్లలో భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉంది. అయితే ఇది పాకిస్తాన్కే నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆసియా కప్ సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరిగే నిర్వహించే యోచనలో ఏసీసీ ఉంది. చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా? ఫామ్లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా?
ఆసియాకప్ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం నిర్వహించిన మీటింగ్లో ఆసియాకప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ ప్రపోజల్ను మీటింగ్లో శ్రీలంక సహా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జరిగితే మాత్రం ఆసియా కప్లో పాక్ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్లో చర్చించి ఆసియా కప్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్లో భారత్తో మ్యాచ్లు ఉండవు. నిజానికి రెండో రౌండ్లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
Junior Asia Cup: చైనీస్ తైపీని 18-0 తేడాతో చిత్తు చేసిన భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్ తైపీతో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా గోల్స్ వర్షం కురిపించి 18–0తో గెలుపొందింది. భారత ఆటగాళ్ల ధాటికి చైనీస్ తైపీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ (19వ, 19వ, 30వ, 59వ ని.లో) నాలుగు గోల్స్... అమన్దీప్ (38వ, 39వ, 41వ ని.లో) మూడు గోల్స్ సాధించారు. బాబీ సింగ్ ధామి (10వ, 46వ ని.లో), ఆదిత్య అర్జున్ లలాగే (37వ, 37వ ని.లో), కెప్టెన్ ఉత్తమ్ సింగ్ (10వ, 59వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. శ్రద్ధానంద్ తివారి (11వ ని.లో), అంగద్బీర్ సింగ్ (37వ ని.లో), అమీర్ అలీ (51వ ని.లో), బాబీ పూవణ్ణ చంద్ర (54వ ని.లో), యోగాంబర్ (60వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడుతుంది. ఈ టోర్నీ విజేత జూనియర్ ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. -
మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం!
ఆసియా కప్ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్ చేశారు. ''మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్కు బీసీబీ, ACB, లంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు. ఈ మీటింగ్లో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్ పాక్లో జరిగితే తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది. ఇక 2022లో టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్కప్ దృశ్యా ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. చదవండి: 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
తగలబడుతున్న పాకిస్తాన్...రెచ్చిపోతున్న పాక్ బౌలర్..
-
పాకిస్తాన్ కాదు, యూఏఈ కాదు, శ్రీలంక కాదు.. కొత్త ప్రదేశంలో ఆసియా కప్-2023..?
ఆసియా కప్-2023 ఆతిధ్యం విషయమై గతకొద్ది రోజులుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా భారత్.. పాక్లో అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పింది. దీంతో మరో ఆప్షన్ లేని పాక్.. టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై (యూఏఈ) నిర్వహిస్తామని ప్రతిపాదిస్తూనే, వన్డే ప్రపంచకప్ కోసం తాము కూడా భారత్లో పర్యటించమని మెలిక పెట్టింది. తాము భారత్లో జరిగే ప్రపంచకప్లో పాల్గొనాలంటే, టీమిండియా సైతం పాక్లో ఆసియా కప్ మ్యాచ్లు ఆడాలని ప్రకటించింది. ఈ మధ్యలో ఏసీసీ మిగతా సభ్య దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్లు.. యూఏఈలో ఆసియా కప్ జరిగే సమయానికి ఎండలు అధికంగా ఉంటాయని, అందుకే తాము యూఏఈలో అడుగపెట్టమని ప్రకటించాయి. ఈ సందిగ్థ పరిస్థితుల్లో పీసీబీ చీఫ్ నజమ్ సేథి సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఆతిథ్య హక్కులు తమవే కాబట్టి, వేదికను ఎంచుకునే అధికారం తమకే ఉంటుందని చెబుతూ.. ఆసియాకప్-2023ను పాక్, యూఏఈ, శ్రీలంకల్లో కాకుండా ఇంగ్లండ్లో నిర్వహిస్తే బాగుంటుందని అన్నాడు. పీసీబీ బాస్ సరికొత్త ప్రతిపాదనపై ఏసీసీ సభ్య దేశాలు ఏరకంగా స్పందిస్తాయో వేచి చూడాలి. చదవండి: పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ -
పాకిస్తాన్ కు షాక్...పంతం నెగ్గించుకున్న బీసీసీఐ
-
World Cup 2023: భారత్లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదు..!
ఆసియా కప్-2023 వేదిక వివాదం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ తక్ చానల్తో ఆయన మాట్లాడుతూ.. వన్డే వరల్డ్కప్-2023 కోసం తమ జట్టు భారత్లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదని అన్నాడు. పాక్ ఆడాల్సిన మ్యాచ్లు తటస్థ వేదికలపై నిర్వహిస్తేనే తాము వరల్డ్కప్ ఆడతామని, లేదంటే లేదని తెగేసి చెప్పాడు. భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్కప్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుందన్న ప్రచారం నేపథ్యంలో పీసీబీ ఈ రకంగా స్పందించింది. కాగా, భారత్-పాక్ల మధ్య ఈ క్రికెట్ వివాదం ఆసియా కప్ వేదిక మార్పు నేపథ్యంలో మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్లో ఆసియా కప్-2023 జరిగితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. దీంతో పీసీబీ వెనక్కు తగ్గింది. తటస్థ వేదికపై (యూఏఈ) భారత్ ఆడాల్సిన మ్యాచ్లు నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి బీసీసీఐ సైతం అంగీకారం తెలిపింది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆసియా కప్ జరిగే సెప్టెంబర్ మాసంలో యూఏఈలో ఎండలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని సాకుగా చూపుతూ, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు యూఏఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ.. యూఏఈ, పాక్లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుంది. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్లు అనవసర లొల్లి చేయడం సరికాదని అంటుంది. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని బెదిరింపులకు దిగుతుంది. ఆసియా కప్ వేదికను పాక్ నుంచి శ్రీలంక మార్చాలని ఏసీసీ యోచిస్తున్న తరుణంలో పాక్ అవకాశవాద రాజకీయానికి తెర లేపింది. ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్లో తమ మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటామని, లేదంటే లేదని అంటుంది. బీసీసీఐ కోరినట్లు టీమిండియా మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహించేందుకు తాము ఒప్పుకున్నప్పుడు.. బీసీసీఐ కూడా తమ మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని, లేదంటే తాము వరల్డ్కప్లో పాల్గొనేదే లేదని తెగేసి చెప్పింది. చదవండి: టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్ -
టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్
టీమిండియాపై పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశాడు. భద్రతా కారణాల కారణంగా పాక్లో జరగాల్సిన ఆసియా కప్-2023లో ఆడేందుకు టీమిండియా నిరాకరించిన నేపథ్యంలో జునైద్ ఖాన్ అవాక్కులు చవాక్కులు పేలాడు. భారత క్రికెట్ జట్టుతో పాటు బీసీసీఐపై కూడా ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నోరు పారేసుకున్నాడు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండటానికి టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇతర దేశాల క్రికెటర్లకు (శ్రీలంక, బంగ్లాదేశ్) లేని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ టీమిండియాకే ఎందుకని ప్రశ్నించాడు. ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకుని టీమిండియాను పాక్లో పర్యటించేలా చేయాలని, పాకిస్తాన్ లేని క్రికెట్ ఊహించడానికి కూడా అసాధ్యమని అన్నాడు. ప్రస్తుతం పాక్లో పరిస్థితులు మునుపటికంటే చాలా మెరుగయ్యాయని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటించాయని గుర్తు చేశాడు. అగ్రశ్రేణి జట్లు పాక్లో పర్యటించినప్పుడు భారత్కు ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించాడు. పాక్ చిన్న జట్టేం కాదని, ఇటీవలే ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్కు కూడా చేరిందని గొప్పలు పోయాడు. జునైద్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. వారి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను (ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న హింసాకాండ) చూపిస్తూ జునైద్కు గట్టిగా కౌంటర్లిస్తున్నారు. 33 ఏళ్ల జునైద్.. పాక్ తరఫున 22 టెస్ట్లు, 76 వన్డేలు, 9 టీ20 ఆడాడు. టెస్ట్ల్లో 71, వన్డేల్లో 110, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. కాగా, టీమిండియా పాక్లో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికగా యూఏఈని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీంతో సగం మ్యాచ్లు యూఏఈలో(భారత్ ఆడే మ్యాచ్లు), సగం మ్యాచ్లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్, పాక్ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు. అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్లు యూఏఈలో మ్యాచ్లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం. చదవండి: పాక్లో పర్యటిస్తున్న టీమిండియా సేఫ్.. వదంతులు నమ్మవద్దు -
ఆసియా కప్ జరగడం అనుమానమే.. 'అందుకు' ససేమిరా అంటున్న శ్రీలంక, బంగ్లాదేశ్
ఆసియా కప్-2023 నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే, భద్రత కారణాల దృష్ట్యా పాక్లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో, సగం మ్యాచ్లు యూఏఈలో (భారత్ ఆడే మ్యాచ్లు), సగం మ్యాచ్లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్, పాక్ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు. అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్లు యూఏఈలో మ్యాచ్లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం. టీమిండియా ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్లు అనవసర లొల్లి చేయడం సరికాదని పీసీబీ చీఫ్ అన్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేసినప్పటికీ శ్రీలంక, బంగ్లాదేశ్లు ససేమిర అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని పీసీబీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. శ్రీలంక, బంగ్లాదేశ్లను ఒప్పించేందుకు పీసీబీ చీఫ్ నజమ్ సేథి స్వయంగా రంగంలో దిగినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో టోర్నీ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరగాల్సి ఉన్న ఆసియా కప్-2023 టోర్నీకి సంబంధించి వచ్చే నెల(జూన్)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. చదవండి: వన్డే ప్రపంచకప్.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే? మరి పాక్తో -
Asia Cup: పాకిస్తాన్కు షాక్! పంతం నెగ్గింది..!
Asia Cup 2023: ఆసియా కప్-2023 వేదిక మారనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్ మండలి కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆసియా టీ20 టోర్నీ-2022 ఫైనలిస్టు పాకిస్తాన్ ఈసారి ఈ మెగా ఈవెంట్ నిర్వహించేందుకు హక్కులు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ.. బీసీసీసీఐ ఈ హైబ్రీడ్ మోడల్ను కూడా తిరస్కరించినట్లు కథనాలు వచ్చాయి. ఈసారి ఆసియా కప్ అక్కడే ఈ క్రమంలో ఆసియా కప్-2023 నిర్వహణ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు తరలించినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వచ్చే నెల(జూన్)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాలు వెల్లడించినట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. కాగా ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో శ్రీలంక- పాకిస్తాన్ ఫైనల్కు చేరగా.. పాక్ను ఓడించి లంక ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈవెంట్కు సంబంధించి పాక్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. అయితే, ఆటగాళ్ల భద్రతా అంశంపై బీసీసీఐ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. పీసీబీ హైబ్రీడ్ మోడల్ను ప్రతిపాదించింది. గట్టిగా ఫిక్స్ అయ్యారు టీమిండియా తప్ప మిగతా దేశాల మ్యాచ్లు పాకిస్తాన్లో నిర్వహిస్తామని తెలిపింది. అయితే, ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ ప్రపోజల్ను కూడా తిరస్కరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ నుంచి వేదికను తరలించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరులో ఈ టోర్నీ ఆరంభానికి షెడ్యూల్ ఖరారు కాగా కానుండగా.. వేదికపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చదవండి: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
శ్రీలంక వేదికగా ఆసియా కప్.. పాపం పాకిస్తాన్!
ఆసియా కప్-2023 నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఏడాది ఆసియా కప్ను పాకిస్తాన్లో కాకుండా శ్రీలంక వేదికగా నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీని పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలిపాయి. దీంతో ఆసియాకప్ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ఆసియా కప్ నిర్వహణ వేదికపై ఈ నెలాఖరున ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: సచిన్ నన్ను బ్యాట్తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ -
నేపాల్ సంచలనం.. ఇండియా, పాకిస్తాన్లతో కలిసి! ఇంతకీ టోర్నీ సంగతేంటి?
Asia Cup 2023: నేపాల్ క్రికెట్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెన్స్ ప్రీమియర్ కప్ ఫైనల్లో యూఏఈని ఓడించి మెగా ఈవెంట్ బెర్తు ఖరారు చేసుకుంది. నేపాల్- యూఏఈ మధ్య మంగళవారం ఖాట్మండు వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో గుల్షన్ కుమార్ ఝా 67 పరుగులతో చెలరేగిన నేపథ్యంలో నేపాల్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసియా కప్ ఈవెంట్కు అర్హత సాధించిన నేపాల్ గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. ఇండియా, పాకిస్తాన్ జట్లతో చేరి పోటీకి సిద్ధమైంది. 4 వికెట్లు పడగొట్టిన రాజ్ బన్షీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న నేపాల్.. యూఏఈని 117 పరుగులకే కట్టడి చేసింది. రాజ్బన్షీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. కరణ్ కేసీ, సందీప్ లమిచానే రెండేసి వికెట్లు కూల్చారు. సోంపాల్ కామీ, గుల్షన్ ఝా చెరె వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 33.1 ఓవర్లకే యూఏఈ కథ ముగిసింది. ఆదిలోనే ఎదురుదెబ్బ.. అయినా గానీ ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కుశాల్ భూర్టెల్ 1, ఆసిఫ్ షేక్ 8 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ గుల్షన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత నెత్తికెత్తుకున్నాడు. 84 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 67 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.అతడి తోడుగా భీహ్ షార్కీ 72 బంతుల్లో 36 పరుగులతో పట్టుదలగా నిలబడ్డాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 30.3 ఓవర్లలోనే నేపాల్ టార్గెట్ ఛేదించింది. అలాంటిదేమీ లేదు ఇదిలా ఉంటే.. ఆసియా వన్డే కప్-2023 టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తమ ఆటగాళ్లను పాక్కు పంపే పరిస్థితి లేదని కరాఖండిగా చెప్పింది. దీంతో హైబ్రీడ్ మోడల్ అవలంబించాలని యోచించినా బీసీసీఐ అందుకు తిరస్కరించిందనే వార్తలు వినిపించాయి. అంతేగాక ఆసియా కప్ రదద్దు చేసి.. ఐదు దేశాలతో టోర్నీ ప్లాన్ చేయాలని భావిస్తోందని వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆసియా కప్ రదద్దు, వాయిదా గురించి చర్చ జరుగలేదని వివరణ ఇచ్చారు. ఇలాంటివేమైనా ఉంటే సమావేశం నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: గొప్ప క్రికెటర్లే కావొచ్చు.. కానీ ఇది మరీ ఎక్కువైంది! కోహ్లిని చూసి ఏం నేర్చుకుంటారు? -
ఆసియా కప్ రద్దు? పాక్కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!?
Asia Cup 2023 India Vs Pakistan: ఆసియా కప్-2023 నిర్వహణ అంశంపై సందిగ్దం వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా క్రికెటర్లను పాక్కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా గతంలోనే స్పష్టం చేశారు. హైబ్రీడ్ మోడల్! బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ సైతం ఇదే తరహాలో బదులిచ్చింది. దీంతో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేయగా.. టోర్నీ సజావుగా సాగాలంటే కొన్ని మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అస్సలు కుదరదు ఈ క్రమంలో టీమిండియా ఆడే మ్యాచ్లు ఇతర వేదికలపై నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన హైబ్రీడ్ మోడల్కు పీసీబీ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదనకు మొదట కాస్త సానుకూలంగానే ఉన్న బీసీసీఐ.. తాజాగా తిరస్కరించినట్లు సమాచారం. టోర్నీ వేదికను పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని పట్టుబట్టినట్లు సమాచారం. అప్పుడు కూడా సమస్యలు ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక, యూఏఈ ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం.. తమ దేశంలోనే ఈ మెగా ఈవెంట్ నిర్వహించాలని, ఇప్పుడీ సమస్య పరిష్కారం కాకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా 2023 వన్డే కప్ అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇతర దేశాల అభిప్రాయం కూడా తీసుకుని కాగా పాక్లో ఆసియా కప్ నిర్వహణ అంశంపై జై షా రెండు వారాల క్రితం మాట్లాడుతూ.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సహా ఆసియా కప్ 2023 వేదిక అంశంపై టోర్నీలో పాల్గొనే ఇతర దేశాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. ఆసియా కప్ రద్దు చేసి ఆసియా కప్ నిర్వహణపై పాక్ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఈవెంట్ను రద్దు చేసి దాని స్థానంలో ఐదు దేశాలు మాత్రమే పాల్గొనేలా మరో టోర్నీ నిర్వహణకు వీలుగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా గతేడాది ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో పాటు హాంగ్ కాంగ్ పోటీపడ్డాయి. ఈ ఈవెంట్లో శ్రీలంక ట్రోఫీ కైవసం చేసుకోగా.. పాక్ రన్నరప్గా నిలిచింది. చదవండి: సెంచరీతో చెలరేగాడు.. భారత జట్టులోకి జైశ్వాల్! హింట్ ఇచ్చిన రోహిత్ శర్మ MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్స్టార్.. నో డౌట్! -
'కోట్లు నష్టపోతామని తెలుసు'.. మొండివైఖరి పనికిరాదేమో!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్ను మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపాడు. మేము చేసిన ప్రతిపాదనకు ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అంగీకరించకుంటే ఆసియాకప్ను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని.. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపాడు. ''ఆసియా కప్ విషయంలో మా వైఖరి ఏంటో ఇప్పటికే ఏసీసీకి క్లియర్గా చెప్పాం. హైబ్రిడ్ మోడ్లో టోర్నీ నిర్వహించడంపై మాకు అభ్యంతరం లేదు. హైబ్రిడ్ మోడ్లో భారత్ తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో ఆడుకోవచ్చు.. మిగతా మ్యాచ్లు మాత్రం(ఫైనల్తో పాటు) పాక్లో జరిగేలా చూడాలని చెప్పాం. అయితే దీనివల్ల మేము ఆతిథ్య హక్కులు కోల్పోకుండా ఉంటాం. ఒకవేళ ఆసియా కప్కు మరో షెడ్యూల్ను ప్రకటిస్తే మేము ఒప్పుకోం. ఆసియా కప్ను బహిస్కరిస్తాం. ఇక దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే తమ దేశంలో ఆసియాకప్ ఆడడానికి భద్రతాపరమైన కారణాలు చూపిస్తున్న బీసీసీఐ ఒక విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మా దేశంలో భద్రత కరువయ్యిందని వారు ప్రూఫ్స్ చూపిస్తే బాగుండు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు మా దేశంలో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పనప్పుడు.. భారత్ మాత్రం ఎందుకు ఈ కారణం చూపిస్తుందో అర్థం కావడం లేదు. అయితే ఏసీసీలో 80 శాతం ఆదాయం పాకిస్తాన్, భారత్ల మ్యాచ్ల వల్లే వస్తుంది. ఒకవేళ మా ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోతే వచ్చే నష్టాన్ని భరించడానికి సిద్దంగా ఉన్నాం'' అని పేర్కొన్నాడు. నజామ్ సేథీ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఇంత మొండితనం పనికిరాదేమో.. నష్టం భరిస్తామనడం మంచి పద్దతి కాదు.. బీసీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది'' అంటూ హితబోధ చేశారు. చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ -
Asia Cup: ఓటమి భయం.. అందుకే రానంటున్నారు! అంత సీన్ లేదులే గానీ!
Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదని వార్నింగ్ ఇస్తున్నారు. ముందు పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని, ఆత్మవిశ్వాసం ఉంటే పర్లేదని.. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు పాక్కు వెళ్లదని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు బోర్డుల మధ్య ఈ అంశానికి సంబంధించి చర్చోపర్చలు జరిగాయి. సాకు మాత్రమే అంటూ ఈ నేపథ్యంలో ఆసియా కప్ పాక్లో నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇమ్రాన్ నాజిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘భద్రతా కారణాలు అనేవి కేవలం ఓ సాకు మాత్రమే. ఆస్ట్రేలియా వంటి మేటి జట్లు కూడా పాకిస్తాన్కు వచ్చాయి. కానీ భారత జట్టు మాత్రం రావడానికి సాకులు వెదుకుతోంది. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే వాళ్లు ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడేగా అన్నీ తెలుస్తాయి. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఆసక్తి. కానీ టీమిండియాకు ఓటమిని తట్టుకునే శక్తి ఉండదు. అందుకే ఇలా చేస్తున్నారు’’ అని నాదిర్ అలీ పాడ్కాస్ట్ షోలో ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఇమ్రాన్పై నిప్పులు చెరుగుతున్నారు. ‘‘అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. గతంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ అప్పటికప్పుడు సిరీస్లు రద్దు చేసుకున్న విషయం గుర్తులేదా? టీమిండియా వంటి పటిష్ట జట్టు గురించి ఇలాంటి అవాకులు చెవాకులు పేలేముందు ఓసారి ఆలోచించుకుంటే మంచిది. మీ స్థాయి ఏమిటో మర్చిపోవద్దు. మీకంత సీన్ లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 పాక్లో జరుగనుండగా.. వన్డే వరల్డ్కప్-2023 భారత్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని! Suryakumar Yadav: ఈ మూడు మ్యాచ్లను మర్చిపో సూర్య.. ఐపీఎల్లో బాగా ఆడు! -
పాక్లోనే ఆసియా కప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే టోర్నీ పాక్లో జరుగుతుండడంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీంతో మొదట ఆసియా కప్ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) భావించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ను బహిష్కరిస్తామని తెలిపింది. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో మొండి వైఖరితోనే ఉంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇరుబోర్డుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఏసీసీ ఆధ్వర్యంలో పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్ ఆడుతుందని.. టోర్నీ పాకిస్తాన్లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది. అయితే భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్లకు సంబంధించి ఒమన్, యూఏఈ, ఇంగ్లండ్, శ్రీలంక పేర్లను పరిశీలించారు. ఈ వేదికల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ఫైనల్ బెర్తు బుక్ చేసుకుంటే.. ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకున్నట్లే. మరోవైపు పీసీబీ మాత్రం ఏసీసీ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఒక మెట్టు దిగినట్లయింది. ఇక ఏడాది చివర్లో వన్డే వరల్డ్కప్ ఉండడంతో ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోంది. ఆసియా కప్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొననుండగా.. భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్లు ఒక గ్రూప్లో ఉండగా.. మరొక గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లు ఉన్నాయి. మొత్తం 13 రోజుల పాటు జరగనున్న టోర్నీలో గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సూపర్-4లో టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. చదవండి: ఎలిమినేటర్.. ఫైనల్కు వెళ్లేది ఎవరు? ఐపీఎల్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు -
WC 2023: ఈసారి ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్! బీసీసీఐ, పీసీబీ ఏమీ చేయలేవు!
World Cup 2023- India Vs Pakistan: ‘‘ఇండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలి అంతే! ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా లేదంటే అహ్మదాబాద్లోనా అన్న అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా ఇండియా- పాక్ మధ్యే టైటిల్ పోరు జరగాలి’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందానికి విజ్ఞప్తి చేశాడు. కాగా 1983 వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి టైటిల్ గెలిచిన భారత జట్టు.. స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై ఈ ఐసీసీ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ సేనకు.. ఈ అపవాదు చెరిపివేసే సువర్ణావకాశం ముంగిట నిలిచింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉంటే.. 2011 సెమీస్లో పాకిస్తాన్ ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా.. శ్రీలంకపై గెలుపొంది విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. బీసీసీఐ, పీసీబీ ఏమీ చేయలేవు! ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ స్పోర్ట్స్తక్తో మాట్లాడుతూ.. ఈసారి ఫైనల్లో ఇండియా- పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశం గురించి స్పందిస్తూ.. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ వట్టి మాటలు. బీసీసీఐ లేదంటే పీసీబీ ఈ విషయంలో ఏమీ చేయలేవు. అనవసరపు మాటలు వద్దు భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ గవర్నమెంట్ అనుమతి లేకుండా పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ల విషయంలో మాజీ క్రికెటర్లు ఎవరూ ప్రతికూలంగా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందంటే టీమిండియా పాకిస్తాన్లో పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఇరు దేశాల మాజీ క్రికెటర్లు సంయమనం పాటించాలని అనవసరపు మాటలు మాట్లాడద్దని అక్తర్ విజ్ఞప్తి చేశాడు. చదవండి: WC 2023: వరల్డ్కప్-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్ ఎక్కడంటే! హైదరాబాద్లోనూ.. Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్! అయితే ధోని మాదిరి.. -
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలి.. మోడీ సార్నే అడుగుతా?
ఆసియా కప్- 2023 నిర్వహణ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ ఏడాది ఆసియాకప్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్-పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా.. పాకిస్తాన్లో పర్యటించడానికి బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను బీసీసీఐ సూచించింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆసియాకప్ను తమ దేశంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆసియా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని, మిగితా మ్యాచ్లను పాక్లోనే జరపాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని అఫ్రిది సృష్టం చేశాడు. అదే విధంగా ఈ విషయం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను త్వరలోనే మాట్లాడుతానని అఫ్రిది చెప్పాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన అఫ్రిది ఈ వాఖ్యలు చేశాడు. అఫ్రిది మాట్లాడుతూ.. "భారత్-పాక్ల మధ్య సంబంధాలు బాగుపడాలంటే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు, ఇతర టోర్నీలు జరగాలి. రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలని నేను మోడీ సార్నే అభ్యర్థిస్తాను. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా.. వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము. బీసీసీఐ చాలా బలమైన క్రికెట్ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు.. బాధ్యత కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులను పెంచుకోవాలి తప్ప శత్రువులను కాదు. మీకు సంభందాలు ఎంత ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బలహీనంగా ఏమీ లేదు. ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్కు ఓ ప్రత్యేకమైన స్ధానం ఉంది. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా పాకిస్తాన్కు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఇకభారత జట్టులో నాకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. మేము కలిసినప్పుడు అన్ని విషయాలు గురించి చర్చించుకుంటాము. లెజెండ్స్ లీగ్ సందర్భంగా రైనాను కలిశాను. అతడి బ్యాట్తో ఓ మ్యాచ్ కూడా నేను ఆడాను" అని పేర్కొన్నాడు. చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! సూర్యకు ఆఖరి ఛాన్స్ -
'మేం కాదు మీరే..' పాక్ మాజీ కెప్టెన్కు దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్కు టీమిండియా మాజీ ఫాస్ట్బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆసియాకప్ వేదికను మార్చడంలో బీసీసీఐ కీలకపాత్ర పోషించిదంటూ అసహనం వెళ్లగక్కిన మియాందాద్.. పాక్లో ఆడడానికి నిరాకరిస్తున్న టీమిండియాను ''గోటూ..హెల్(Go to Hell)'' అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నాడు. క్రికెట్లో పెద్దన్నలా వ్యవహరించాల్సిన ఐసీసీ.. బీసీసీఐకి తొత్తుల మారిందన్నాడు. బీసీసీఐ చెప్పినట్లు ఆడితే ఐసీసీ ఉండి ప్రయోజనం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. మియాందాద్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా భగ్గుమన్నాడు.'' పాకిస్తాన్తో ఆడకపోవడం వల్ల టీమిండియాకు ఒరిగేదేం ఉండదు. ఎటొచ్చి మనతో వాళ్లు ఆడకపోతే వాళ్లే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఈ విషయం తెలుసుకుంటే బెటర్. మీ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్ను మరింత ఊబిలోకి నెట్టేస్తున్నారు. నరకానికి వెళ్లేది మేం కాదు మీరే.. సిద్దంగా ఉండండి. ప్రపంచ క్రికెట్ను బీసీసీఐ శాసిస్తుందని నిరాధార ఆరోపణలు చేయడం తగదు. మీ వైఖరిని మార్చుకోండి. ప్రస్తుతం మీ దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవు.. సెక్యూరిటీ కారణంగానే టీమిండియా ఆడేందుకు నిరాకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పేర్కొన్నారు. తటస్థ వేదికపై ఆడేందుకు భారత్ అంగీకరించినట్లు గుర్తించడం మానేసి ఇలా పనికిమాలిన ఆరోపణలు చేయడం సరికాదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. But they are refusing to go to hell :) https://t.co/gX8gcWzWZE — Venkatesh Prasad (@venkateshprasad) February 6, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్బాలర్ -
వాళ్లు ఎక్కడికైనా పోనీ, ఏమైనా చేసుకోనీ..అయినా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Javed Miandad Fumes At ICC Over Asia Cup 2023: ఆసియా కప్-2023 నిర్వహణ, వేదిక తదితర అంశాలపై చిక్కుముడి వీడలేదు. బహ్రెయిన్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై మండలి ఓ నిర్ణయానికి వస్తుందని భావించినా అలా జరుగలేదు. దీంతో వచ్చే నెలలో మరోసారి సమావేశమైన తర్వాత ఈ మెగా టోర్నీ ఎక్కడ జరుగనుందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ ఆడేందుకు భారత జట్టు పాక్కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించగా.. పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా రాని స్పష్టత అప్పటి నుంచి టోర్నీ నిర్వహణ ఎక్కడ అన్న అంశంపై సందిగ్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం బహ్రెయిన్లో జరిగిన సమావేశంలో యూఏఈ పేరు ప్రస్తావన(తటస్థ వేదిక)కు వచ్చినా.. ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మార్చి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఏంటి ఇదంతా? ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ మద్దతు తమకేమీ అవసరం లేదని.. వాళ్లు పాకిస్తాన్లో ఆడకపోయినా పర్లేదని పేర్కొన్నాడు. అయినా ఐసీసీ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించాడు. భారత్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎక్కడికైనా పోనివ్వండి... ఐసీసీ ఏం చేస్తోంది? పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వండి.. వాళ్లు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? వాళ్లతో మాకేం పనిలేదు. అసలు మేము వాళ్లను పట్టించుకోము. నిజానికి ఇక్కడ తప్పుబట్టాల్సింది ఐసీసీని. ఈ సమస్యకు పరిష్కారం చూపని ఐసీసీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. దాని వల్ల ఉపయోగం ఏమిటి? మా దగ్గర ఇలాంటి చెల్లవు ప్రతి జట్టుకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలి కదా. టీమిండియా పటిష్ట జట్టే కావొచ్చు. అయినంత మాత్రాన వాళ్లొక్కలే క్రికెట్ ప్రపంచాన్ని నడిపించడం లేదు కదా. భారత జట్టు సొంతగడ్డపై పవర్హౌజ్ లాంటిది అయి ఉండవచ్చు.. అదంతా వాళ్ల దేశంలోనే చెల్లుతుంది. మా దగ్గర కాదు. ప్రపంచం మొత్తం మీద వాళ్ల మాటే నెగ్గాలంటే కుదరదు. అయినా పాకిస్తాన్కు వచ్చి మీరెందుకు ఆడరు? ఒకవేళ ఇక్కడికి వచ్చి ఓడిపోతే ఆ దేశ ప్రజలు సహించరు. అందుకేనా’’ అంటూ కవ్వింపు మాటలు మాట్లాడాడు. అదే విధంగా.. ఐసీసీ ఇప్పటికైనా భారత బోర్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. ఆ ఐదుగురు యమ డేంజర్.. ఏమరపాటుగా ఉంటే! Jasprit Bumrah: ఆరోజు కోహ్లి బుమ్రాతో మాట్లాడతా అంటే నేనే వద్దన్నా! ఎందుకంటే -
పాక్కు ఎదురుదెబ్బ.. యూఏఈలో ఆసియాకప్!
ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించాలనుకున్న పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆసియాకప్ పాక్లో నిర్వహిస్తే తాము ఆడబోయేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈసారి కూడా ఆసియాకప్ను యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఏసీసీ ఛైర్మన్ జై షా, పీసీబీ అధ్యక్షుడు నజామ్ సేథీ టోర్నీని యూఏఈకి మార్చే అంశంపై చర్చించారు. కాగా ఆసియాకప్ను ఎక్కడ నిర్వహించాలనేది మార్చిలో ఖరారు చేయనున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియాకప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీలో ఆడేందుకు పాక్కు వెళ్లమని గతేడాది అక్టోబర్లోనే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ టోర్నీలో భారత్ ఆడకుంటే ఆసియా కప్ పాక్ నిర్వహించినప్పటికి ఆదాయం మాత్రం పెద్దగా రాదు. భారత్ సహా అన్ని దేశాలతో తటస్థ వేదికలో టోర్నీ నిర్వహించినా ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి తగినంత గ్రాంటు లభిస్తుంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆసియా కప్ నిర్వహణ పేరుతో బీసీసీఐతో సున్నం పెట్టుకోవడం కంటే భారత్కు అనుగుణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించడమే మేలని పీసీబీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగానైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ప్రసార హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని యోచిస్తోంది. చదవండి: యువరక్తం ఉరకలేస్తుంది.. కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా' -
ఏకపక్షంగా ఆసియా కప్ షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు..? జై షాను నిలదీసిన పీసీబీ చీఫ్
ఆసియా కప్ 2023-24 (వన్డే ఫార్మాట్) సంవత్సరాలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు ఆసియా వేదికగా జరగాల్సి ఉన్న అన్ని క్రికెట్ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా నిన్న (జనవరి 5) విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్లో వరుసగా రెండు సంవత్సరాలు భారత్, పాక్లు ఒకే గ్రూప్లో తలపడపడాల్సి ఉంది. Thank you @JayShah for unilaterally presenting @ACCMedia1 structure & calendars 2023-24 especially relating to Asia Cup 2023 for which 🇵🇰 is the event host. While you are at it, you might as well present structure & calendar of our PSL 2023! A swift response will be appreciated. https://t.co/UdW2GekAfR — Najam Sethi (@najamsethi) January 5, 2023 అయితే ఈ క్యాలెండర్ ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజమ్ సేథీ తాజాగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. ఆతిధ్య దేశమైన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా షెడ్యూల్ను ఎలా ప్రకటిస్తారని ట్విటర్ వేదికగా జై షాను ప్రశ్నించాడు. అలాగే ఏసీసీ చైర్మన్ హోదాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) షెడ్యూల్ కూడా ప్రకటించాలని వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. పీసీబీ చైర్మన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. కాగా, ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ పెద్దలు ముక్తకంఠంతో ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. తాజాగా జై షా ప్రకటించిన షెడ్యూల్లో 2023కు సంబంధించి ఆతిధ్య దేశం (పాక్) ప్రస్తావన లేకపోవడంతో పాక్కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే భారత్కు ఎలాగైనా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో పీసీబీ చైర్మన్ ఈ ట్వీట్ చేశాడు. -
Ind Vs Pak: మరోసారి దాయాదుల పోరు.. ఒకే గ్రూపులో భారత్- పాక్
Asian Cricket Council- cricket calendars- India Vs Pakistan: ఆసియా క్రికెట్ టోర్నీకి సంబంధించి 2023-24 క్యాలెండర్ గురువారం విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పురుషుల ఆసియా కప్ ఈవెంట్ ఈ సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా మెగా టోర్నీలో దాయాదులు భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇక శ్రీలంక కూడా ఇదే గ్రూపులో ఉండగా.. క్వాలిఫైయర్స్లో గెలిచిన జట్టు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో చేరనుంది. ఈ మేరకు 2023- 24 క్రికెట్ క్యాలెండర్స్ పేరిట జై షా ట్వీట్ చేశారు. అది మాత్రం చెప్పలేదు! కాగా ఆసియా వన్డే కప్-2023 ఎప్పుడన్న విషయం చెప్పిన జై షా.. వేదిక గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్లదంటూ జై షా గతంలో వ్యాఖ్యానించారు. దీంతో బీసీసీఐ- పీసీబీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ- పీసీబీ చైర్మన్ నజీమ్ సేతీ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేయడం విశేషం. పురుషుల ఛాలెంజర్స్ కప్తో ఆరంభం ఇక కొత్త క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఆసియా టోర్నీ పురుషుల ఛాలెంజర్స్ కప్(వన్డే)తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొంటాయి. వీటిలో బహ్రెయిన్, సౌదీ అరేబియా, భూటాన్, చైనా, మయన్మార్, మాల్దీవులు, థాయిలాండ్, ఇరాన్ ఉండగా.. మరో రెండు జట్ల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఐదు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. మొత్తం 23 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చిలో మెన్స అండర్-16 రీజినల్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. ఇదిలా ఉంటే.. చాలెంజర్స్ కప్ విన్నర్, రన్నరప్ ఏప్రిల్లో జరిగే మెన్స్ ప్రీమియర్ కప్(వన్డే ఫార్మాట్)కు అర్హత సాధిస్తాయి. మొత్తంగా 24 మ్యాచ్లు ఆడతాయి. ఇక జూన్లో వుమెన్స్ టీ20 ఎమెర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జరుగనుంది. ఇందులో రెండు గ్రూపుల్లో నాలుగేసి జట్ల చొప్పున ఎనిమిది జట్లు ఉంటాయి. ఒక గ్రూపులో ఇండియా- ఎ, పాకిస్తాన్- ఎ, థాయ్లాండ్, హాంకాంగ్ ఉంటాయి. మరో గ్రూపులో బంగ్లాదేశ్- ఎ, శ్రీలంక- ఎ, యూఈఏ, మలేషియా టీమ్లు ఉంటాయి. దీని తర్వాత మెన్స్ ఎమెర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జరుగుతుంది. మేజర్ టోర్నీ ఇక వీటన్నిటిలో మేజర్ టోర్నీ అయిన పురుషుల ఆసియా వన్డే 2023 కప్ సెప్టెంబరులో జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఒక గ్రూపులో.. మరో గ్రూపులో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, క్వాలిఫైయర్ జట్టు ఉంటుంది. మొత్తంగా 13 మ్యాచ్లు జరుగుతాయి. PC: Jay Shah Twitter/ ACC PC: Jay Shah Twitter/ ACC Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn — Jay Shah (@JayShah) January 5, 2023 -
ODI WC: పాక్ ఇండియాకు వెళ్తుందా? లేదా? పీసీబీ కొత్త చీఫ్ క్లారిటీ
Asia Cup 2023- India Vs Pakistan- ODI World Cup 2023: పాకిస్తాన్ వన్డే వరల్డ్కప్-2023 ఆడే అంశంపై ఆ దేశ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ నజమ్ సేతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ ఐసీసీ మెగా టోర్నీ కోసం భారత్కు వెళ్లే విషయం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఆసియా కప్-2023 నిర్వహణ విషయంలోనూ ఏసీసీతో చర్చలు జరుపుతున్నామన్న సేతీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ ఈవెంట్ను పాకిస్తాన్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనా విషయం తెలిసిందే. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మాత్రం ఆ టోర్నీ కోసం టీమిండియా అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికపై ఈవెంట్ నిర్వహించే అంశం గురించి గతంలో ప్రస్తావించారు. జరుగుతుందా? లేదా? ఇందుకు స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా తమ దేశానికి రాకపోతే, తాము కూడా వరల్డ్కప్ ఆడేందుకు అక్కడికి వెళ్లమని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లలో మాత్రమే తలపడే చిరకాల ప్రత్యర్థుల పోరు చూస్తామో లేదోనంటూ అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఇది వరకే స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్లో వైట్వాష్ తర్వాత పీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నజమ్ సేతీ తాజాగా ఈ అంశంపై స్పందించాడు. ఎలా చెబితే అలా! కరాచీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ఇండియాకు వెళ్లొద్దని మా ప్రభుత్వం చెబితే మేము అలాగే నడుచుకుంటాం. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాతో ఆడాలా లేదా? అక్కడికి వెళ్లాలా వద్దా? అన్న విషయాల్లో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వం చెప్పినట్లుగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నాడు. చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్ Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్లా అలా! -
కోహ్లి కోసం తపిస్తున్న పాకిస్తాన్ అభిమానులు.. ఇది చూడండి..!
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కింగ్కు దాయాది దేశం పాక్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా ఇద్దరు పాక్ అభిమానులు కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్లో ఆడేందుకు కోహ్లి పాక్కు రావాలని ప్లకార్డ్లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్ కోహ్లి పాక్కు వచ్చి ఆసియా కప్ ఆడాలని మొరపెట్టుకున్నారు. ఓ అభిమాని అయితే.. మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాం అంటూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. Virat Kohli fans in Pakistan - The craze is huge. pic.twitter.com/THW0veDL7L — Johns. (@CricCrazyJohns) December 12, 2022 ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాక్లో జరిగే ఆసియా కప్లో ఆడేది లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఇందుకు ప్రతిగా పాక్.. తాము సైతం భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్లో ఆడేది లేదని బెదిరింపులకు దిగింది. పాక్ ఉడత బెదిరింపులకు భయపడేది లేదని, ఆ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టేది లేదని భారత వర్గాలు తెగేసి చెప్పడంతో పాక్ తోకముడిచి ఆ ప్రస్తావనకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన అభిమానులు కోహ్లి కోసం, టీమిండియా పాక్లో ఆడటం కోసం చేసిన విన్నపం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆటను ఇతర విషయాలతో ముడిపెట్టడం సబబు కాదని, ఆటను ఆటలా చూసి పాక్లో క్రికెట్ ఆడాలని కోరుతున్నారు. అక్కడ కూడా కోహ్లికి వీరాభిమానులు ఉన్నారు.. వారు కింగ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తపిస్తున్నారంటూ సోషల్మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
‘టీమిండియాను ఓడించిన పాక్ లేకుండా.. అసలు ఆ టోర్నీ ఎవరు చూస్తారు?’ అంటూ..
ODI World Cup 2023- India Vs Pakistan- Ramiz Raja: ‘‘ఒకవేళ వాళ్లు ఇక్కడికి వస్తేనే మేము వరల్డ్కప్ టోర్నీ ఆడటానికి అక్కడికి వెళ్తాం. భారత జట్టు ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ లేకుండానే మెగా టోర్నీ ఆడుకోమనండి. భారత్లో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ పాల్గొనపోతే.. ఆ ఈవెంట్లోని మ్యాచ్లను అసలు ఎవరు చూస్తారు?’’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ప్రగల్భాలు పలికాడు. తమ జట్టు దూకుడైన ఆట తీరుకు మారుపేరుగా మారిందని.. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టును కూడా మట్టికరిపించిందంటూ గొప్పలకు పోయాడు. కాగా ఆసియా కప్-2023 టోర్నీ పాకిస్తాన్ వేదికగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. అక్కడ ఆసియా కప్.. ఇక్కడ వరల్డ్కప్ అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత జట్టు పాక్కు వెళ్లే ప్రసక్తి లేదని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ తమతో చర్చించకుండా.. తమకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందిస్తూ.. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నారు. వాళ్లను ఓడించాం కదా ఈ విషయం గురించి తాజాగా ఉర్దూ న్యూస్తో మాట్లాడిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. తమ విషయంలో బీసీసీఐ ప్రవర్తించే తీరుపైనే వరల్డ్కప్ ఆడాలా వద్దా అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ మార్కెట్కు చెందిన జట్టును మేము ఓడించాం. మా ఆట తీరు మెరుగుపరుచుకుని.. అత్యుత్తమంగా ఆడుతుంటేనే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని నేను నమ్ముతాను. అందుకు తగ్గట్లుగానే టీ20 ప్రపంచకప్-2021లో మేము రాణించాం. టీమిండియాను ఓడించాం. తర్వాత ఆసియా కప్ టోర్నీలోనూ వాళ్లని మట్టికరిపించాం.బిలియన్ డాలర్ ఎకానమీ ఉన్న బోర్డుకు చెందిన జట్టును మేము రెండుసార్లు ఓడించాం. అంతేకాదు టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్కు కూడా చేరుకున్నాం. రమీజ్ రాజా వాళ్లు ఇక్కడికి రాలేమని చెబితే.. మేమూ అక్కడికి వెళ్లం. పాక్లేని వరల్డ్కప్ టోర్నీని ఎవరు చూస్తారు?’’ అంటూ తమ జట్టును ప్రశంసిస్తూ.. టీమిండియాను తక్కువ చేసే విధంగా మాట్లాడాడు రమీజ్ రాజా. అతడి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా.. తాజా వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసం మంచిదేనని.. అయితే అతి విశ్వాసం ప్రదర్శిస్తే బొక్కబోర్లా పడకతప్పదంటూ రమీజ్ రాజాను ట్రోల్ చేస్తున్నారు. భారత జట్టును ఓడిస్తేనే మీది గొప్ప జట్టుగా మారిందన్న నీ వ్యాఖ్యలు మాత్రం నిజమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఆడకపోతే పాకిస్తాన్కు నష్టమని చురకలు అంటిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్తో ప్రపంచకప్-2022 టోర్నీలో పాక్ భారత్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చదవండి: Umran Malik: ఉమ్రాన్ బౌలింగ్లో వైవిధ్యం లేదు.... ఇక వన్డేల్లోనే! అర్ష్దీప్ భేష్.. Ravindra Jadeja: వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్కు దూరం; కట్చేస్తే ఎన్నికల ప్రచారంలో -
పాకిస్తాన్కు వెళ్లేది లేనిది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది: బీసీసీఐ కొత్త బాస్
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద అంశంపై తాజాగా బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం భారత ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని బీసీసీఐ ఫాలో అవ్వాల్సిందే తప్పించి, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు భారత క్రికెట్ బోర్డుకు లేదని బీసీసీఐ అధ్యక్ష హోదాలో బిన్నీ వివరణ ఇచ్చాడు. ఈ విషయమై ప్రస్తుతానికి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, ఒకవేళ కేంద్రం నుంచి ఏవైనా కీలక ఆదేశాలు వస్తే మీడియాకు తప్పక తెలియజేస్తామని స్పష్టం చేశాడు. కాగా, ఇదే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రాలేదని ఆయన వివరించాడు. ఇదిలా ఉంటే, జై షా చేసిన ప్రకటనపై ఉలిక్కపడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్లో అడుగుపెట్టకపోతే, భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్లో పాక్ కూడా పాల్గొనబోదని బెదిరింపులకు దిగింది. -
ఇండియా ఎవరి మాట వినదు.. మా దేశానికి రమ్మని పాక్ను బతిమాలేది లేదు..!
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరుగబోయే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జై షా చేసిన ఈ ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) తీవ్రంగా స్పందించింది. ఆసియా కప్లో పాల్గొనేందుకు భారత్.. పాకిస్తాన్లో అడుగుపెట్టకపోతే, ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్కప్ను తాము బాయ్కాట్ చేస్తామని పీసీబీ బెదిరింపులకు దిగింది. ఈ ఉదంతంపై తాజాగా భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో పాల్గొనమని ఎవరిని బతిమాలేది లేదని పాక్ను ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చారు. వచ్చే వారికి భారత్ సాదరంగా స్వాగతం పలుకుతుందని.. రావడం, రాకపోవడం ఆయా జట్ల ఇష్టమని, ఈ విషయంపై స్పందించడం కూడా అనవసరమని పాక్కు సున్నితంగా మొట్టికాయలు వేశారు. భారత్ ఓ క్రీడా శక్తి అని, ప్రపంచ క్రికెట్ చరిత్రలో బీసీసీఐకి అత్యున్నత హోదా ఉందని, ఇదివరకే భారత్ ఎన్నో ప్రపంచకప్లను సమర్ధవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పాక్ బెదిరింపులకు భారత ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని, భారత్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి మాట వినదని అవాక్కులు చవాక్కులు పేలుతున్న పాక్కు గట్టిగా కౌంటరిచ్చారు. పాక్లో పర్యటించే అంశం కేంద్ర హోం శాఖ పరిధిలోని అంశమని, అక్కడ భద్రతాపరమైన సమస్యలున్నాయని నిఘా వర్గాల సమాచారం అందిందని మంత్రి వివరించారు. చదవండి: IND vs BAN: ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా..! -
Asia Cup 2023: జై షా వ్యాఖ్యలపై పీసీబీ స్పందన.. ఏకపక్షంగా..
Asia Cup 2023- BCCI Jay Shah- PCB: ‘‘ఆసియా కప్-2023 టోర్నీ నిర్వహణను తటస్థ వేదికకు మార్చనున్నామంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు పీసీబీని ఆశ్చర్యపరిచాయి. నిరాశకు గురిచేశాయి. ఏసీసీలోని సభ్యులతో గానీ.. ఆతిథ్య దేశ బోర్డుతో గానీ చర్చించకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించింది. కాగా ముంబైలో జరిగిన 91వ సర్వసభ్య సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తటస్థ వేదికపైనే ఆసియా కప్-2023ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాం ఈ ప్రకటనపై తాజాగా స్పందించిన పీసీబీ.. ‘‘ఏసీసీ బోర్డు, సభ్యుల సహకారంతో ఆసియా కప్ నిర్వహించేందుకు పాక్ సిద్ధమైంది. ఎంతో సంతోషించింది. కానీ.. షా మాత్రం ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. 1983, సెప్టెంబరులో రూపుదిద్దుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల స్ఫూర్తికి ఆయన ప్రకటన విరుద్ధంగా ఉంది. ఆసియా క్రికెట్ మండలి సభ్య దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా.. ఆసియా ఖండంలో క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పడింది. కానీ ఇలాంటి ప్రకటనలు ఆసియా క్రికెట్ దేశాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి. తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో పాకిస్తాన్.. ఇండియా పర్యటన.. అదే విధంగా 2024-2031 సైకిల్కు సంబంధించిన ఐసీసీ ఈవెంట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏసీసీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు సంబంధించి పీసీబీకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకుని.. సున్నితమైన ఈ అంశం గురించి చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియా కప్-2023 పాక్లో నిర్వహించాల్సి ఉండగా.. వన్డే వరల్డ్కప్-2023కు భారత్ వేదిక కానున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఏసీసీ, ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు పోటీపడుతున్నాయి. చదవండి: Ind Vs Pak: భారత్తో మ్యాచ్కు ముందు పాక్ మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక T20 World Cup 2022: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సహా ఆ మ్యాచ్లన్నీ వర్షార్పణం -
'భారత్లో జరిగే వరల్డ్కప్ను బాయ్కాట్ చేస్తాం'
Asia Cup 2023- India Vs Pakistan: చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగి చాలా కాలమైపోయింది. రాజకీయ వ్యవహారాల కారణంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. అందుకే ఐసీసీ మేజర్ టోర్నీల్లోనే టీమిండియా, పాకిస్తాన్లు తలపడుతూ వస్తున్నాయి. ఈసారి టి20 ప్రపంచకప్లోనూ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. మ్యాచ్ సంగతి పక్కనబెడితే.. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్-2023లో భారత్ జట్టు పాల్గొనబోదని కుండబద్దలు కొట్టాడు. కాగా జై షా వ్యాఖ్యలపై పాకిస్తాన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకపోతే.. అదే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్కప్ 2023 బాయ్కాట్ చేయాలని పీసీబీకి సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) నుంచి కూడా తప్పుకోవాలనే యోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీసీబీ కూడా జై షా వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టి20 వరల్డ్కప్ ముగిసిన అనంతరం మెల్బోర్న్లో జరగనున్న ఐసీసీ సభ్య సమావేశంలో జై షా చేసిన వ్యాఖ్యలను దృష్టికి తీసుకువస్తామని పీసీబీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇక వన్డే వరల్డ్కప్ 2023కి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఏసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒక దేశం తరఫునే మాట్లాడటం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ తమ పలుకుబడి చూపిస్తోందని.. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ను తొక్కెయ్యాలనుకుంటుందని పేర్కొన్నారు. వన్డే వరల్డ్కప్ బాయ్కాట్ చేస్తే బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని.. పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని కామెంట్ చేశారు. వన్డే వరల్డ్కప్ను బాయ్కాట్ను చేయడం ద్వారా బీసీసీఐకి వచ్చే నష్టం ఏం లేదని.. అది పీసీబీకే ఎసరు తెస్తుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ బాయ్కట్ చేస్తే.. పీసీబీపై ఐసీసీ కన్నెర్ర చేస్తుందని, బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇచ్చే నిధులను ఆపేస్తుందని చెబుతున్నారు. తద్వారా పీసీబీకే నష్టం వాటిల్లుతుందని, ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగెయ్యాలని హెచ్చరించారు. చదవండి: ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆసియా కప్-2023లో టీమిండియా ఆడదు.. స్పష్టం చేసిన జై షా
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) జరగాల్సిన ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇవాళ (అక్టోబర్ 18) స్పష్టం చేశాడు. ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ 91వ ఏజీఎమ్ (వార్షిక సాధారణ సమావేశం) సందర్భంగా షా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆసియా కప్ వన్డే టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహిస్తే పాల్గొనేందుకు తమకెటువంటి అభ్యంతరం లేదని, లేదు పాక్లోనే నిర్వహిస్తామని పట్టుబడితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనదని వెల్లడించాడు. ప్రస్తుతం పాక్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా దాయాది దేశంలో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమని షా పేర్కొన్నాడు. కాగా, పాక్లో జరిగే ఆసియా కప్-2023 వన్డే టోర్నీలో భారత్ పాల్గొంటుందని గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున ప్రచారం జరిగింది. బీసీసీఐ గత వార్షిక సమావేశంలో బోర్డు సభ్యులు కూడా ఇందుకు సమ్మతి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ దిగిపోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయిపోయాయి. ఏదిఏమైప్పటికీ భారత్.. పాక్లో పర్యటించేది లేదని తేలిపోవడంతో ఆసియా కప్ను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. భారత్.. తమ దేశంలో అడుగుపెడితే బాగా కూడబెట్టుకోవచ్చన్న పాక్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లినట్లైంది. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన పురుషుల ఆసియా కప్ టీ20 టోర్నీ కూడా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో జరగాల్సి ఉండింది. అయితే ఆర్ధిక సంక్షోభం కారణంగా టోర్నీని నిర్వహించలేమని లంక బోర్డు చేతులెత్తేయడంతో వేదికను అప్పటికప్పుడు యూఏఈకి మార్చారు. -
ఏడోసారి ఆసియా కప్ గెలిచిన భారత మహిళా జట్టు
-
Ind Vs Pak: మెగా టోర్నీ ఆడేందుకు పాక్కు టీమిండియా? బీసీసీఐ ప్లాన్!
India Vs Pakistan- Asia Cup 2023: సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైందా? ప్రతిష్టాత్మక టోర్నీ ఆడేందుకు దాయాది దేశానికి వెళ్లనుందా? అంటే ఆ అవకాశం ఉందనే సమాధానం వినిపిస్తోంది క్రీడావర్గాల్లో! ఆసియా కప్-2023 ఈవెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుందన్న విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. బాయ్కాట్ చేస్తుందా? ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ 2023- 2027లో భాగంగా ఆసియా కప్ వన్డే టోర్నీ సహా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ఈవెంట్లకు పాక్ వేదిక కానున్నట్లు ఆగష్టులో వెల్లడించింది. కాగా అనివార్య కారణాల వల్ల 2008 తర్వాత భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ను భారత్ బాయ్కాట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ నోట్లో ఏముంది? అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజా ఎజెండాలో భాగంగా టీమిండియా పాల్గొననున్న ఐసీసీ ఈవెంట్ల లిస్టులో ఆసియా కప్ గురించి ప్రస్తావన ఉండటంతో.. 14 ఏళ్ల తర్వాత తొలిసారి భారత జట్టు పాక్కు వెళ్లనుందన్న వార్తలు గుప్పుమన్నాయి. క్రిక్బజ్ కథనం ప్రకారం.. అక్టోబరు 18న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) జరుగనుంది. ఇందులో ప్రస్తావించిన అంశాల ప్రకారం.. 2023లో భారత జట్టు పాల్గొనే ఐసీసీ ఈవెంట్లు ►ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్కప్, సౌతాఫ్రికా ►ఐసీసీ వుమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్కప్, సౌతాఫ్రికా ►ఆసియా కప్, పాకిస్తాన్ ►ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్, ఇండియా ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ గురువారం ఓ నోట్ షేర్ చేసినట్లు క్రిక్బజ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆసియా కప్-2023లో పాల్గొనేందుకు పాక్కు వెళ్లనుందన్న వార్తలకు ఊతమిచ్చింది. ఈ క్రమంలో ఓ బీసీసీఐ అధికారిని సంప్రదించగా.. ‘‘భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్న అంశం మీదే ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’ అని అన్నట్లు క్రిక్బజ్ పేర్కొంది. కాగా పాక్లో మెగా టోర్నీలు ఆడేందుకు పలు దేశాలు విముఖత చూపిన నేపథ్యంలో పీసీబీ యూఏఈని వేదికగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి, భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: Ind Vs Pak- Babar Azam: భారత్తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం PAK Vs NZ: ఇంకా నయం బ్యాట్ మాత్రమే విరిగింది.. 🚨 Key points from Pakistan Men's Future Tours Programme (FTP) 2023-2027 🚨 pic.twitter.com/nSl57p0WRa — Pakistan Cricket (@TheRealPCB) August 17, 2022 -
Asia Cup 2022: దాయాదుల పోరుకు రంగం సిద్దం.. విజయం ఎవరిది?
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా ఉండే వాతావరణం. ఎవరితో ఓడినా ఇక్కడ మాత్రం ఓడరాదనే కసి... నాటి ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకుపోవడం, మాటల తూటాలు, టీవీ చానళ్లలో తీవ్ర చర్చ... ఇదంతా ఒకప్పటి మాట! గత కొంత కాలంగా చూస్తే ఆటగాళ్లు మధ్య స్నేహాలు, ప్రత్యేక పలకరింతలు, పరస్పర అభినందనలు, అవతలి జట్టు అభిమానులతో లెక్క లేనన్ని సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లకు సిద్ధమైపోతూ ఈ పోరు తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా చూసి మ్యాచ్కు ప్రాధాన్యత లేదని అనుకోవద్దు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆసక్తిలో మాత్రం మార్పు రాలేదు. స్టేడియంలో అన్ని టికెట్లు 10 రోజుల ముందే అమ్ముడుపోయాయి. టోర్నీలో ఇతర మ్యాచ్లకు 400 దిర్హమ్లు (సుమారు రూ.8,700)కు అమ్ముడుపోయే టికెట్ ఈ మ్యాచ్ కోసం 6000 దిర్హమ్లు (సుమారు 1 లక్షా 30 వేలు) పలికింది. నాలుగు గంటల వినోదం అంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు భారత్ నుంచి దుబాయ్కు ప్రత్యేక విమానాల్లో ట్రిప్లు కూడా ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో వారాంతంలో భారత్, పాక్ అభిమానులకు ఆనందం పంచనుంది. దుబాయ్: ద్వైపాక్షిక సిరీస్లు జరిగే అవకాశం లేకపోవడంతో ఇలా అరుదుగా తలపడుతుండటమే భారత్, పాక్ మధ్య మ్యాచ్పై ఆసక్తికి కారణమవుతోంది. గత ఏడాది ప్రపంచకప్లో అభిమానుల అంచనాలకు విరుద్ధంగా ఇదే వేదికపై పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడింది. సుమారు పది నెలల విరామం తర్వాత ఇప్పుడు రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి. స్వల్ప మార్పులు మినహా దాదాపు ఆ ఆటగాళ్లే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఈసారి టీమిండియా పైచేయి సాధిస్తుందా లేక పాక్ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా చూడాలి. కోహ్లిపైనే దృష్టి... టి20ల్లో గత కొంత కాలంగా భారత్ ఫామ్ చూస్తే తుది జట్టు విషయంలో పెద్దగా అనూహ్య మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే విశ్రాంతి తర్వాత సీనియర్లు పునరాగమనం చేయడంతో ఇటీవల రాణించిన కుర్రాళ్లను కూడా తప్పనిసరిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా, మూడో స్థానంలో కోహ్లి సత్తా చాటాల్సి ఉంది. రోహిత్ తనదైన శైలిలో చెలరేగితే పాక్కు కష్టాలు తప్పవు. ఇటీవల జింబాబ్వేతో వన్డేల్లో బరిలోకి దిగిన రాహుల్కు ఐపీఎల్ తర్వాత ఇదే తొలి టి20 మ్యాచ్. సుదీర్ఘ కాలంగా ఆశించిన స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లి తన స్థాయికి తగిన ప్రదర్శన చేయాల్సి ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, పంత్, పాండ్యా దూకుడైన బ్యాటింగ్ భారత్కు అదనపు బలం. ఏడో స్థానంలో జడేజా కూడా సత్తా చాటితే తిరుగుండదు. గాయంతో బుమ్రా, హర్షల్ దూరం కావడంతో సీనియర్గా భువనేశ్వర్పై అదనపు భారం ఉంది. అర్‡్షదీప్కు కూడా చోటు ఖాయం. లెగ్స్పిన్నర్ చహల్ ప్రత్యర్థిని కట్టి పడేయగలడు. రెండో స్పిన్నర్గా అశ్విన్, బిష్ణోయ్లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉండగా...పిచ్ పరిస్థితి బట్టి వీరిద్దరు కాకుండా మూడో పేసర్ అవేశ్కు కూడా చాన్స్ దక్కవచ్చు. ఎలా చూసినా పాకిస్తాన్తో పోలిస్తే మన జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. వారిద్దరు మినహా... పాకిస్తాన్ బ్యాటింగ్ భారం ప్రధానంగా ఇద్దరిపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్, కీపర్ రిజ్వాన్ చాలా కాలంగా ఓపెనర్లుగా జట్టుకు మంచి విజయాలు అందించారు. గత ఏడాది కూడా భారత్పై విజయంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. అయితే 152 లక్ష్యంతోనే బరిలోకి దిగిన నాటి వ్యూహం ఈసారి పని చేయకపోవచ్చు. వీరిద్దరు కూడా విధ్వంసకర బ్యాటర్లు కాదు. సాధారణ స్ట్రయిక్రేట్తో మాత్రమే ఆడగలరు. మూడో స్థానంలో ఫఖర్ జమాన్ కాస్త దూకుడైన ప్లేయర్. ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు ఎవరూ అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా నిరూపించుకున్నది లేదు. ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్, నవాజ్ ఏమాత్రం ప్రభావం చూపగలరో చెప్పలేం. షాహిన్ అఫ్రిది దూరం కావడం పాక్ బౌలింగ్ను బలహీనంగా మార్చింది. రవూఫ్తో పాటు నసీమ్ షా, హస్నైన్లపైనే జట్టు ఆధారపడుతోంది. ఉస్మాన్ ఖదీర్ రూపంలో రెగ్యులర్ స్పిన్నర్ టీమ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లికిది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ కానుంది. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్ల చొప్పున ఆడిన రెండో క్రికెటర్గా (న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ తర్వాత) అతను ఘనత సాధిస్తాడు. భారత్, పాక్ మధ్య 9 టి20 మ్యాచ్లు జరిగాయి. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’ అయింది. -
Asia Cup 2022: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా!
Asia Cup 2022 India Vs Pakistan:ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభమైంది. అంతకంటే ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడు(ఆదివారం) జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2021లో కనీవినీ ఎరుగని రీతిలో కోహ్లి సేనకు పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ శర్మ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. టీమిండియాతో మ్యాచ్లో మరోసారి పైచేయి సాధించాలని బాబర్ ఆజం బృందం ఆశపడుతోంది. మరి ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో భారత్- పాకిస్తాన్ ముఖాముఖి రికార్డులు ఎలా ఉన్నాయో గమనిద్దాం. మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా.. 1984 నుంచి ఆసియా కప్ నిర్వహణ ఆరంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రౌండ్ రాబిన్ పద్ధతిలో వన్డే ఫార్మాట్లో ఈ ఈవెంట్ జరిగింది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్ పోటీపడ్డాయి. భారత్- లంక ఫైనల్ చేరాయి. మొత్తంగా రెండు విజయాలతో టీమిండియా విజేతగా నిలిచింది. శ్రీలంక రన్నరప్ కాగా.. పాక్ రెండు మ్యాచ్లు ఓడి భంగపాటుకు గురైంది. టీమిండియా చేతిలో 54 పరుగులు, శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ఎన్నిసార్లు తలపడ్డాయంటే.. ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మొత్తం 14 మ్యాచ్లలో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో టీమిండియా 8 సార్లు గెలవగా.. పాకిస్తాన్ ఐదు మ్యాచ్లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. టీ20 ఫార్మాట్లోనూ మనదే పైచేయి.. ఆసియా కప్ టోర్నీని 2016లో టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అప్పటి నుంచి ఓ దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్లో.. ఇలా రొటేషన్ పద్ధతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా టీమిండియా భారత్- పాకిస్తాన్ మధ్య వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్లు జరుగగా.. భారత్ ఏడు గెలిచింది. అయితే 1997 నాటి వన్డే మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016లో జరిగిన ఏకైక టీ20లోనూ విజయం భారత్నే వరించింది. ఐదు వికెట్ల తేడాతో ధోని సేన.. ఆఫ్రిది బృందాన్ని మట్టికరిపించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు చాంపియన్గా నిలవగా.. శ్రీలంక ఐదుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్తాన్ కేవలం రెండుసార్లు ట్రోఫీ అందుకుంది. వేదిక స్టేడియం ఫార్మాట్ విజేత తేది దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం 23 సెప్టెంబరు 2018 దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపు 19 సెప్టెంబరు 2018 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం టీ20 ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం 27 ఫిబ్రవరి 2016 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం 2 మార్చి 2014 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 18 మార్చి 2012 డంబుల్లా రంగిరి ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే 3 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం 19 జూన్ 2010 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ గెలుపు 2 జూలై 2008 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 26 జూన్ 2008 కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియం వన్డే 59 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు 25 జూలై 2004 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 44 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం 3 జూన్ 2000 కొలంబో ఎస్ఎస్సీజీ వన్డే ఫలితం తేలలేదు 20 జూలై 1997 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 97 పరుగుల తేడాతో పాక్ గెలుపు 7 ఏప్రిల్ 1995 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం 31 అక్టోబరు 1988 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 54 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు 13 ఏప్రిల్ 1984 చదవండి: Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్మెషీన్.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే? ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్
-
నా కెప్టెన్సీ విజయ రహస్యం ఇదే...
-
ఆసియా కప్ కు జట్టును ప్రకటించిన పాకిస్థాన్
-
'ఆసియా కప్ నిర్వహించలేం.. వేదికను మార్చండి'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు మండిపోతుండగా.. పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటింది. తీవ్ర సంక్షోభంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో లంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృశ్యా ఆసియా కప్ను నిర్వహించలేమని.. వేదికను మార్చాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లంక క్రికెట్ బోర్డు వినతిపత్రం సమర్పించింది. కాగా జై షా సహా బీసీసీఐ అధికారులతో పాటు లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్నారు. ఇవాళ(మే 29) ఐపీఎల్ ఫైనల్ జరగనుండడంతో మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లో జై షా నేతృత్వంలో ఆసియా కప్ నిర్వహణకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు. లంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమని ఆ దేశ బోర్డు వివరించగా.. అందుకు మెజారిటీ ఏసీసీ సభ్యులు పాజిటివ్గా స్పందించారు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమైతే యూఏఈకి తరలించడమో లేక బంగ్లాదేశ్ వేదికగా టోర్నీని నిర్వహించాలని ఏసీసీ భావించింది. ఇదే నిజమైతే ఆసియా కప్ యూఏఈ లేదా బంగ్లాదేశ్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, యూఏఈలు తలపడనున్నాయి. టి20 ఫార్మాట్లో టోర్నీని నిర్వహించనున్నారు. ఆసియా కప్ చివరిసారి 2018లో యూఏఈలో జరగ్గా.. ఫైనల్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించిన టీమిండియా ఏడోసారి కప్ను కైవసం చేసుకుంది. చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్ -
జపాన్ చేతిలో భారత్కు షాక్
జకార్తా: ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు తొలి ఓటమి చవిచూసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున పవన్ (45వ ని.లో), ఉత్తమ్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మరో మ్యాచ్లో పాకిస్తాన్ 13–0తో ఇండోనేసియాపై గెలిచింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే గురువారం జరిగే మ్యాచ్లో జపాన్ చేతిలో పాకిస్తాన్ తప్పనిసరిగా ఓడిపోయి... ఇండోనేసియాపై భారత్ భారీ విజయం సాధించాలి. ఒకవేళ జపాన్–పాక్ మ్యాచ్ ‘డ్రా’ అయితే భారత్ సెమీఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. జపాన్–పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక భారత్ మ్యాచ్ ఉంది కాబట్టి సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని గోల్స్ తేడాతో గెలవాలన్న సంగతి టీమిండియాకు తెలుస్తుంది. -
Asia Cup, T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్కు చోటు!
Asia Cup and T20 World Cup 2022: ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు ఐసీసీ మెగా ఈవెంట్లు వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండుగే ముందుంది. ఆగష్టు- సెప్టెంబరులో ఆసియా కప్, అక్టోబరు- నవంబరులో పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్లో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, రాహుల త్రిపాఠి తమను తాము నిరూపించుకోవడం సహా హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్కుమార్, చహల్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తిక్ తిరిగి ఫామ్లోకి వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఈ రెండు మెగా టోర్నీలకు తన జట్టును ప్రకటించాడు. వసీం జాఫర్(ఫైల్ ఫొటో) క్రిక్ట్రాకర్ నాట్ జస్ట్ క్రికెట్ షో వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా తన తుదిజట్టులో యువ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్-2022లో అదరగొట్టిన దినేశ్ కార్తిక్కు వసీం చోటునివ్వకపోవడం విశేషం. ఆసియా కప్, టీ20 వరల్డ్కప్నకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్: వసీం జాఫర్ తుది జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా. ఇతర సభ్యులు: రుతురాజ్ గైక్వాడ్, దినేశ్ కార్తిక్/సంజూ శాంసన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ/దీపక్ చహర్. బ్యాకప్ ప్లేయర్లు: పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, టి. నటరాజన్. చదవండి👉🏾RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు! చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్ ఇస్తే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్లో భారత జూనియర్ ఆర్చర్లు అసాధారణ ప్రదర్శనతో ‘టాప్’ లేపారు. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో క్లీన్స్వీప్ చేశారు. దీంతో భారత్ 8 స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల రికర్వ్ ఫైనల్లో భజన్ కౌర్, అవని, లక్ష్మిలతో కూడిన భారత జట్టు ‘షూటాఫ్’లో బంగ్లాదేశ్ జట్టుపై నెగ్గింది. పురుషుల రికర్వ్ ఫైనల్లో పార్థ్ , మృణాల్, జుయెల్లతో కూడిన భారత జట్టు 5–1తో బంగ్లాదేశ్ను ఓడించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ప్రథమేశ్ 146–144తో రిషభ్పై గెలిచాడు. -
సత్తా చాటిన భారత ఆర్చర్లు.. ఆసియాకప్లో మూడు స్వర్ణాలు
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీలో భారత గురి అదిరింది. మంగళవారం జరిగిన పోటీల్లో మన ఆర్చర్లు 3 స్వర్ణాలు, ఒక కాంస్య పతకం గెలుపొందారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో పర్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీలతో కూడిన భారత జట్టు 204–201తో కజకిస్తాన్ జట్టును ఓడించి బంగారు పతకం గెలిచింది. పురుషుల ఫైనల్లో ప్రథమేశ్, రిషభ్ యాదవ్, సమాధాన్ బృందం 224–218తో బంగ్లాదేశ్ను ఓడించి స్వర్ణం సాధించింది. ఇక మూడో స్వర్ణం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రథమేశ్–పర్నీత్ కౌర్ సాధించారు. ఫైనల్లో ఈ జోడీ 158–151తో అదిలజెక్సెంబినొవా–క్రిస్టిచ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సమాధాన్ 147–145తో సెర్గెయ్ క్రిస్టిచ్ (కజకిస్తాన్)పై గెలిచి రెండో పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు భారత ఆర్చర్లు పది పతకాల కోసం పోటీపడనున్నారు. -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా