AIR
-
ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులు
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 జనవరిలో దేశీయ విమానయాన సంస్థలు 1.46 కోట్ల ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. ఇది 2024 జనవరిలో 1.31 కోట్లుగా ఉంది. దాంతో 11.28 శాతం పెరుగుదల నమోదు చేసినట్లయింది. ఈ పెరుగుదల దేశంలో విమాన ప్రయాణానికి అధికమవుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది.విమాన ప్రయాణికులకు సంబంధించి ఇండిగో వాటా 65.2 శాతంగా ఉంటే ఎయిరిండియా గ్రూప్ వాటా 25.7 శాతం, ఆకాసా ఎయిర్, స్పైస్జెట్ వాటాలు వరుసగా 4.7, 3.2 శాతంగా నమోదయ్యాయి. ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ-సమయానికి రాకపోకలు నిర్వహించడం)లో ఇండిగో 75.5 శాతంతో మొదటిస్థానంలో నిలువగా, ఆకాసా ఎయిర్ 71.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఎయిరిండియా గ్రూప్ ఓటీపీ 69.8 శాతం, అలయన్స్ ఎయిర్ ఓటీపీ 57.6 శాతం, స్పైస్ జెట్ 54.8 శాతంగా ఉన్నాయి.షెడ్యూల్ చేసిన దేశీయ విమానయాన సంస్థల మొత్తం రద్దు రేటు జనవరి 2025లో 1.62 శాతంగా ఉంది. ఫ్లై బిగ్ అత్యధికంగా 17.74 శాతం, ఫ్లై91 5.09 శాతం, అలయన్స్ ఎయిర్ 4.35 శాతం రద్దు రేటును నమోదు చేశాయి. విమానాల ఆలస్యం వల్ల 1,78,934 మంది ప్రయాణీకులు ప్రభావితం అయ్యారు. వీరికి సౌకర్యాలు అందించేందుకు విమానయాన సంస్థలు రూ.2.38 కోట్లు ఖర్చు చేశాయి. 2024 జనవరితో పోలిస్తే 2025లో విమానయాన సంస్థలు సామర్థ్య విస్తరణను 10.8 శాతం పెంచాయి. దేశీయ విమానయాన రంగం 2024 జనవరిలో 89.2 శాతం ఉన్న ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్-మొత్తం సీట్లకు తగిన ప్యాసింజర్లు) 2025లో 92.1 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాల ప్రభావంప్రయాణికుల పెరుగుదలకు కారణాలు..కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో విమాన ప్రయాణికుల్లో విశ్వాసం నెలకొంది. ఎయిర్ లైన్ నెట్వర్క్ల విస్తరణ, కొత్త మార్గాలను ఆవిష్కరించిడంతో అధిక జనాభా విమాన ప్రయాణం చేసేందుకు వీలువుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడానికి పోటీ ఛార్జీలు, ప్రమోషనల్ డీల్స్ను అందిస్తున్నాయి. ఇది విమాన ట్రాఫిక్ పెరుగుదలను మరింత పెంచింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ఆధునీకరణలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది కూడా ప్రయాణ సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోంది. -
రూ.600కే మూడు గంటల్లో చెన్నై-కోల్కతా ప్రయాణం
చెన్నై-కోల్కతాకు రూ.600 ఖర్చుతో కేవలం మూడు గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. నమ్మట్లేదు కదా.. నిజమేనండి.. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ తయారు చేసిన ఇ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ కంపెనీ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్ను బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో ఆవిష్కరించారు. దీనివల్ల కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్కతా మధ్య ప్రయాణం సాగించవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఇ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. గంటకు 500 కిలోమీటర్ల గరిష్ట వేగం దీని సొంతమని చెబుతున్నారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇది ఏసీ త్రీ టైర్ రైలు టికెట్ కంటే చాలా చౌక.ఈ ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ బోట్ను జీరో-కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సాంప్రదాయ విమాన ప్రయాణాలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంపై, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: జియో హాట్స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!భవిష్యత్తు ప్రణాళికలువాటర్ ఫ్లై టెక్నాలజీస్ వచ్చే ఏడాది నాటికి నాలుగు టన్నుల పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో 20 సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. 2029 నాటికి చెన్నై-సింగపూర్ వంటి ఖండాంతర మార్గాల్లోనూ ప్రయాణాలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. -
ఆకాశవీధిలో 1.36 కోట్ల మంది
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 అక్టోబరులో 1.36 కోట్లు నమోదైందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 5.3 శాతం పెరిగిందని వివరించింది.డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబరులో 1.26 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు విమాన ప్రయాణాలు సాగించారు. 2024 అక్టోబరులో బడ్జెట్ క్యారియర్ ఇండిగో 86.40 లక్షల మందిని వివిధ గమ్య స్థానాలకు చేర్చింది. తద్వారా 63.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. టాటా గ్రూప్ నడుపుతున్న ఎయిరిండియా 26.48 లక్షలు, విస్తారా 12.43 లక్షల మందికి సేవలు అందించాయి. ఎయిరిండియా గణాంకాల్లో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ల సంఖ్య కలిసే ఉంది.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..ఎయిరిండియా తన అనుబంధ సంస్థ ఏఐఎక్స్ కనెక్ట్ను తన అంతర్జాతీయ బడ్జెట్ విభాగం ఎయిరిండియా ఎక్స్ప్రెస్తో 2024 అక్టోబర్ 1న విలీనం చేసింది. గత నెలలో టాటా గ్రూప్ విమాన సంస్థ మార్కెట్ వాటా 19.4 శాతం కాగా, విస్తారా 9.1 శాతంగా ఉంది. గతంలో టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ మధ్య 51:49 శాతం జాయింట్ వెంచర్ అయిన విస్తారా కూడా నవంబర్ 12న ఎయిరిండియాలో విలీనం అయింది. రెండు టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ (ఎయిరిండియా, విస్తారా) గత నెలలో మొత్తం దేశీయ ప్రయాణికుల రద్దీలో 28.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆకాసా ఎయిర్ 6.16 లక్షల మందితో 5.4 శాతం, స్పైస్జెట్ 3.35 లక్షల మందితో 2.4 శాతం వాటా దక్కించుకున్నాయి. -
ఆయువు తీస్తున్న వాయువు
ప్రపంచవ్యాప్తంగా నిత్యం 2వేల మంది చిన్నారుల మృత్యువాత కలుషిత గాలిని పీల్చడంతోనే బలి 2021లో గాలి కాలుష్యంతో 80 లక్షల మంది మృతి పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత కాలుష్య మరణాలే ఎక్కువహెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడిసాక్షి, అమరావతి: ఇప్పటి దాకా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే... తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ దాదాపు 2వేల మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యంప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్టŠస్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం..2021లో 80లక్షల మందికిపైగా కలుíÙత గాలి కారణంగా మృతి చెందారు. వీరిలో చిన్నారులతో పాటు వయోజనులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే... ఇంట్లో కూడా కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించి అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి. పొగాకు, రక్తపోటు తర్వాత ఇదే..ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత మనిషి ప్రాణాలకు వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అధిక ఆదాయ దేశాల్లో కంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 500 రెట్లు చిన్నారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎం 2.5గా పిలిచే చిన్న కణాలు.. అంటే 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కంటే చిన్నవిగా గాల్లో కలిసిపోయి ఉండే వివిధ రకాల ధూళి కణాలు ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో 90 శాతం కంటే ఎక్కువగా కారణం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.వాయు కాలుష్యంతో నష్టాలు.. ⇒ శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా ధూళి కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరంలోని అవయవాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి. ⇒ గుండెజబ్బులు, మధుమేహం, చిత్త వైకల్యం తలెత్తుతున్నాయి ⇒ మహిళల్లో గర్భస్రావాలువాయు కాలుష్యానికి కారణాలు.. ⇒ చెట్ల నరికివేత, అడవుల్లో కార్చిచ్చు ⇒ తీవ్రమైన కరువులు, భూములు ఎండిపోవడం ⇒తీవ్ర గాలులు, తుపానులు ⇒ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ⇒ వాయు మార్గంలో ప్రయాణాలతో నైట్రోజన్ ఆక్సైడ్ల విడుదలవాతావరణ సంక్షోభమే కారణమా? వాతావరణ సంక్షోభం కూడా గాలి నాణ్యతను దిగజార్చుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య కారకాలు ఓజోన్లోకి ప్రవేశించడం ద్వారా 2021లో ఐదు లక్షల మందికిపైగా మరణాలకు కారణమైనట్టు నివేదిక తెలిపింది. ప్రధానంగా బయోమాస్, బొగ్గు, పారాఫిన్, ముడి ఇంధనాలతో వంట చేయడంతోనూ కాలుష్యం పెరిగి చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గుర్తించింది. సోలార్ స్టవ్ల వినియోగం అందుబాటులోకి వస్తే పీఎం 2.5 ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
మోటు సరసం !.. మద్యం మత్తులో బావబామ్మర్దుల పరాచకం
ఐనవోలు: బావబామ్మర్ధి పరాచకాలు.. ఆటపట్టించుకోవడాలు సాధారణంగా చూస్తుంటాం.. కానీ, ఏకంగా ఓ బావబామ్మర్ధుల జంట సరసం పరా కాష్టకు చేరింది. దీంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి.. మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, ఒంటిమామిడిపల్లికి చెందిన ఓ మెకానిక్, గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు మంచి స్నేహితులు. ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (27) ఈ నెల 20వ తేదీన రాత్రి మెకానిక్ షెడ్డులో ట్రాక్టర్ రిపేర్ చేయించుకుంటున్నాడు. అదే సమయంలో మిగతా ఇద్దరు అక్కడకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆకతాయి తనంతో ఏం చేస్తున్నామో తె లియని స్ధితిలో ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ను నువ్వు బక్కగా ఉన్నావు.. లావు కావాలి.. అంటూ గేలి చేస్తూ ఆట పట్టించారు. నీకు గాలి పె ట్టి దొడ్డయ్యేలాగా(లావు) చేస్తాం.. అంటూ పరా చకాలు అడుతూ చివరకు బలవంతంగా మెకానిక్ షాపులో ఉన్న హైడ్రాలిక్ ఎయిర్ ప్రెషర్ పైపు మలద్వారం వద్ద ఉంచి ఒక్కసారిగా గాలి వది లారు. సదరు ట్రాక్టర్ డ్రైవర్ పొట్టలోకి గాలి చేరడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు టాక్టర్ డ్రైవర్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పెద్ద పేగులోకి గాలి చేరి ఉబ్బిందని ఆపరేషన్ చేయడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే సదరు వ్యక్తి ఆహారం తీసుకుని.. మలవిసర్జన చేసే వరకు ఆస్పత్రిలోనే ఉండాలని, ఏదైనా సమస్య వస్తే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో అయ్యే ఖ ర్చంతా ఒంటిమామిడిపల్లికి చెందిన ఇద్దరు భరి స్తున్నారు. అయితే ఆరు రోజులైనా డిశ్చార్జ్ కాకపోవడంతో విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయి.. చర్చనీయాంశంగా మారింది. -
స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!
ప్రస్తుతం మహా నగరాల్లో తాగునీటి ఇక్కట్లు మాములుగా లేవు. మన దేశంలో బెంగుళూరు, ముంబై, హైదరబాద్ వంటి నగరాలు సమ్మర్ వస్తే చాలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో జనాలు నివశించడానికే భయపడే పరిస్థితి ఎదురవ్వుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేసిన తప్పిదాలే ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచే మొత్తుకుంటున్నారు. నీటి ఎద్దడి కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి సక్సెస్ అవ్వడం అనేది ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడూ ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఓ సరికొత్త వాటర్ని తాజాగా శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. త్వరలోనే ఆ నీటిని బాటిల్స్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు కూడా. ఇంతకీ పరిశోధకులు ఎలా నీటిని సృష్టిస్తున్నారంటే..అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూర్యుడు, గాలితో నీటిని తయారుచేసే సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. ఏంటీ సూర్యకాంతి, గాలితోనా అని ఆశ్చర్యపోకండి. గాలిని స్వేదనంగా మార్చేందుకు హైడ్రోపనెల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో గాలి నుంచి నీరు ఆవిరిని అయ్యేలా చేసి..ఆ నీటిని సేకరిస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానెల్ మాదిరిగా ఉండే వాటిని తీసుకుంటారు. అయితే ఇవి విద్యుత్తుకు బదులు స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేశాయి.ఇక్కడ ఈ ప్యానెళ్లు గాలి నుంచి నీటి ఆవిరిని తీసుకుంటాయి. ఈ తేమను సాంద్రీకృత గాలి ప్రవాహంలోకి విడుదల చేసేందుకు మళ్లీ సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ ప్యానెల్ లోపల నీటి నిష్క్రియాంతక సంక్షేపణను అనుమతిస్తుంది. అంతేగాదు ప్రతి ప్యానెల్ ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపోయేలా మూడు లీటర్ల వరకు త్రాగునీటిని ఉత్పత్తి చేయగలదు. ఈ నీరు స్వచ్ఛమైనది, మినరలైజ్ చేసినది. త్రాగేందుకు సురక్షితంగా ఉండేలా ఓజోనేటెడ్ చేయబడుతుంది కూడా.నిజానికి దీన్ని జీరోమాస్ వాటర్ పేరుతో అమెరికా సోర్స్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో హైడ్రోప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లను గ్రౌండ్ శ్రేణులుగా లేదా ఇంటి పైకప్పులపై తాగునీటితో అనుసంధానించవచ్చు. ప్రతి హైడ్రోప్యానెల్ ధర సుమారు రూ. 2 లక్షల్లో అందుబాటులో ఉండేలా చేసి, నీటి కొరత సమస్యను నివారించాలని భావిస్తున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ పద్ధతిలో నీటిని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించేశారు కూడా. ఇక్కడ రోజుకు దాదాపు మూడు వేల లీటర్ని ఉత్పత్తి చేస్తున్నారు కూడా. అంతేగాదు సెప్టెంబర్ 2024 కల్లా యూఎస్ అంతటా స్కైవాటర్ బ్రాండ్తో పునర్వినియోగించే అల్యూమినియం క్యాన్ల్లో ఈ నీటిని విక్రయించాలని చూస్తున్నారు. అంతేగాదు అమెరికా కంపెనీ సోర్స్ స్కై వాటర్ని ప్రజలకు పరిచయం చేసేలా మార్కెటింగ్ చేయాలనుకోవడమే గాక హైడ్రోపనెల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచి స్థిరమైన నీటి వనరులను ప్రోత్సహించడమే లక్ష్యం అని చెబుతోంది. ప్రస్తుతం సోర్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ హైడ్రోప్యానెల్స్ అధిక ధర కాస్త అవరోధంగా ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు గణనీయంగా తగ్గితే సదరు కంపెనీకి మంచి లాభదాయకమే గాక అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
అసాధారణమైన దృశ్యాలు కానీ.. శాస్త్రం తేల్చలేని సంఘటనలు కానీ.. ఎప్పటికీ మిస్టరీలుగానే మిగులుతాయి.మహారాష్ట్ర, శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో కూడా అలాంటి మిస్టరీనే దాగి ఉంది. ఆ దర్గాలో ఉన్న ఓ 90 కేజీల రాయి.. కేవలం పదకొండు మంది చూపుడు వేళ్ల మీద నిలబడిపోతుంది. ఆ తర్వాత గాల్లోకి తేలుతుంది.‘దర్వేష్ అలీ సాహెబ్’ అనే ఒక ముస్లిం సాధువు.. ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి.. కొంత కాలం అక్కడే జీవించి, అక్కడే సజీవ సమాధి అయ్యారనేది స్థానికుల కథనం. నిజానికి ఆ దర్గాను ముస్లిమ్ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా హిందువుల్లో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని, అందుకు దర్వేష్ స్వామి ఆశీస్సులు ఉండాలని.. మొక్కుబడులు కట్టి, స్వామి పేరిట ప్రతి ఏడాది ఒక పొట్టేలును విడిచిపెడతారు. సంవత్సరం పాటు దాన్ని మేపి, ఉర్సు సందర్భంగా ఆ మొక్కు చెల్లించుకుంటారు. ఈ దర్గాను ‘దర్శెల్లి’ అని కూడా పిలుస్తారట. స్థానిక హిందువులు ఎంతో భక్తితో ఈ దర్గా స్వామి పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. అందుకే అక్కడ ఎక్కువగా దర్శం,దర్శెల్లి అనే పేర్లు వినిపిస్తుంటాయి. ఈ అనవాయితీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొక్కితే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది.ఇక ఆ రాయి విషయానికి వస్తే.. అది చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ చేతి వేళ్ల సాయంతో ఆ బండ ఎలా గాల్లోకి లేస్తుంది? అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కండలు తిరిగిన ఆజానుబాహులు కొందరు ఆ బండను బలవంతంగా లేపి.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పదకొండు మంది కలసి.. ‘దర్వేష్ అలీ బాబా’ నామాన్ని భక్తితో జపిస్తూ ఆ బండరాయిని లేపితే.. కేవలం వేళ్లపైనే.. అది తేలికగా పైకి లేస్తుంది. ఇది ఎలా సాధ్యమో నేటికీ మిస్టరీనే!సంహిత నిమ్మన (చదవండి: -
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్
ప్రయాణాలు చేస్తున్నపుడు వాహనాల్లోని టైర్లలో కొన్ని కారణాల వల్ల గాలి దిగిపోవడం సాధారణం. అయితే పట్టణ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి ఎదురైతే సమీపంలో గాలి పంపులు ఉండే అవకాశం ఉంది. కానీ దూరప్రాంతాలకు వెళ్లేపుడు సడెన్గా వాహనాల టైర్లలో గాలిదిగిపోతే ఎలా..? మళ్లీ సమీపంలోని టౌన్కి వచ్చి ఏదైనా ఏర్పాట్లు చేసుకుని, తిరిగి వాహనం వద్దకు చేరుకుని గాలి ఎక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసర పనిమీద బయటకు వెళ్లేపుడు ఇలాగాలి దిగిపోతే చాలా అసహానానికి గురవుతూంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ‘రాక్బ్రోస్’ అనే కంపెనీ ఇటీవల కొత్త ప్రొడక్ట్ను ఆవిష్కరించింది. ఈ కంపెనీ మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ పంపును తయారుచేసింది. దాన్ని అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించారు. ఆ ఎయిర్పంప్లో రెండుమోడ్లు ఉంటాయి. మొదటిమోడ్ కోసం పంపుపై ఉన్న బటన్ను ఒకసారి ప్రెస్ చేయాలి. దాంతో అది వాల్వ్లోకి వెళ్తుంది. రెండోమోడ్ కోసం మరోసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల పూర్తిగా వాల్వ్లో ఫిక్స్ అయి పంపులోని గాలి టైర్లోకి వెళ్తుంది. ఇందులో 100పీఎస్ఐ వరకు గాలి నిండేలా ఏర్పాటుచేశారు. అందులో గాలి అయిపోతే ఛార్జింగ్ పెట్టాలి. 25 నిమిషాల్లో అది ఫుల్ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. దీన్ని సైకిల్, బైక్, కార్లలో వాడుకోవచ్చని, త్వరలో భారీ వాహనాలకు వీలుగా రూపొందిస్తామని కంపెనీ చెప్పింది. ఈ పంపు ఎలా పనిచేస్తుందో తెలియజేస్తూ ఎక్స్లో పోస్ట్చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. ఇదీ చదవండి: ఇంజిన్లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ Rockbros Mini Electric Air Pump, a compact and portable air pump designed for inflating bike tires, car tires, and balls. pic.twitter.com/myBxoNfrsJ — Massimo (@Rainmaker1973) March 22, 2024 -
గాలితోనే జీవించిన జానీ బాబా! విస్తుపోయిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు!
ఏ కారణం చేతైనా ఒక్కపూట తినకపోతే రెండో పూట ఆకలికి ఆగడం కష్టమైన పనే. ఇక పూజో, వ్రతమో చేసి.. తప్పక సాయంకాలం వరకూ ఉపవాసం ఉండాల్సివస్తే మాత్రం రాత్రికి ఆ లెక్క పక్కాగా సరిచేయాల్సిందే. ఉదయం నుంచి తినలేదనే సాకుతో తూకం సరిచేసినట్లుగా నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. అలాంటిది ఒక మనిషి.. కొన్ని ఏళ్ల పాటు నీరు, ఆహారం తీసుకోకుండా బతకడం సాధ్యమేనా? గుజరాత్కి చెందిన ప్రహ్లాద్ జానీ బాబా 90 ఏళ్ల పాటు అలానే జీవించారు. గాంధీనగర్ జిల్లా, చరాడ అనే గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీ బాబాకు ‘చున్రీవాలా మాతాజీ’ అనే మరో పేరుంది. అతను నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా కేవలం గాలితోనే బతుకుతున్నాడనే వార్త 2001లో సంచలనం సృష్టించింది. అయితే అదే వార్త.. మరెందరికో అనుమానాలనూ రేకెత్తించింది. దాంతో 2003 నుంచి 2010 మధ్య కాలంలో ప్రహ్లాద్ బాబా జీవన శైలిపై నిఘాపెట్టిన కొందరు శాస్త్రవేత్తలు.. ‘అతను చెప్పేది, చేసేది నిజమే’ అని గ్రహించి నివ్వెరపోయారు. అప్పటికే 70 ఏళ్లు పైబడిన ఆ మాతాజీ.. ‘నేను నా పద్నాలుగో ఏట నుంచి తినడం, తాగడం మానేశాను. ఇన్నేళ్లు నేను బతికుండటానికి కారణం సాక్షాత్తు ఆ అమ్మవారే. స్వయంగా ఆవిడే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి నాకు నీరు, ఆహారం అవసరం లేదు’ అని ప్రకటించడంతో భక్తుల శాతం అమాంతం పెరిగింది. అతనిపై ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని.. ‘డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్’ (డీఐపీఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు నిఘా పెట్టారు. సుమారు 15 రోజుల పాటు పరిశీలనాత్మకంగా సీసీ కెమెరాల ద్వారా అతన్ని గమనించారు. ఆ పరిశీలనలో.. అతను ఏం తినకుండా, తాగకుండా కేవలం గాలి సాయంతోనే జీవిస్తున్నాడని, అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలింది. గాలితో మాత్రమే జీవించే యోగిగా ఎంతో ప్రజాదరణ పొందిన జానీ బాబా.. ‘మాతాజీ’గా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. అతని వేషధారణ.. పెద్దబొట్టు, పాపిట కుంకుమ, ముక్కపుడక, గాజులు, ఎర్రటి వస్త్రాన్ని చీరగా కట్టుకునే తీరు అంతా కూడా అమ్మవారిని తలపించేది. ‘ఆధ్యాత్మిక అనుభూతి’ కోసం జానీ చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి.. బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయం సమీపంలోని గుహలో నివసించారట. అక్కడే ధ్యానం చేసి.. తను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు ఆ సమీపంలోనే తన ఆశ్రమాన్ని నిర్మించారట. దశాబ్దాల పాటు అన్నపానీయాలు తీసుకోకుండానే జీవించిన మనిషిగా అంతర్జాతీయంగా పాపులరైనప్పటికీ.. సమాజంలోని ఓ వర్గం అతని శైలిని అనుమానించింది. తన 91 ఏట.. 2020 మే నెలలో మాతాజీ మరణించారు. అతని ఆశ్రమంలోనే ఆ బాబాకు సమాధి నిర్మించిన భక్తులు నేటికీ అతన్ని దైవంగానే భావించి పూజిస్తుంటారు. ప్రస్తుతం అతని శిష్యులే ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే చున్రీవాలా మాతాజీ.. అన్నేళ్లపాటు ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాకుండా ఎలా జీవించారు అనేది నేటికీ మిస్టరీనే! సంహిత నిమ్మన (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
గ్యాస్ చాంబర్గా రాజధాని.. కనిపించని సూర్యుడు!
దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. డిసెంబర్లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్సిఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’ -
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 350, ఆర్కె పురంలో 325, పంజాబీ బాగ్లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే? -
ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర వర్గానికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం జహంగీర్పురిలో 434, బవానాలో 441, ద్వారకలో 412, బురారీలో 441, ఆనంద్ విహార్లో 387, అశోక్ విహార్లో 386గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైంది. ఢిల్లీ-ఎన్సిఆర్లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పర్వతాలపై మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 10.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఇదిలా ఉండగా వాయు కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానం తదుపరి దశకు చేరుకుంది. దీంతో రాజధానిలో జీఎన్జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. టూరిస్ట్ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, రాష్ట్ర రవాణా బస్సులు, డీజిల్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల్లోని అన్ని రకాల పర్మిట్లు కలిగిన బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని నిషేధించనున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు! -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
హైదరాబాద్ నుంచి అమృత్సర్కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్సర్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్సర్కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్కు చేరుకుంటుంది. గ్వాలియర్కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు
దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 360, ఆర్కె పురంలో 422, పంజాబీ బాగ్లో 415గా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్సిఆర్లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్గఢ్లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్ మీటర్(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్గంజ్, నజాఫ్గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్ మీటర్ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ -
‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది. ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు. సరి-బేసి విధానం అంటే ఏమిటి? రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5…. ఇక సరి (ఈవెన్) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది. గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? -
ఈ డివైజైలో తక్కువ ఆయిల్తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!
డిజిటల్ డివైస్లలో.. లేటెస్ట్ మేకర్స్ని ఎన్నుకోవడమే నయాట్రెండ్. చిత్రంలోని డివైస్ అలాంటిదే. ఇంతవరకు ఫ్రంట్లోడ్ ఎయిర్ ఫ్రైయర్స్నే చూశాం. కానీ ఈ చిత్రంలోని డివైస్ టాప్లోడ్ ఫ్రైయర్. దీనిలో బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, డీప్ఫ్రైయింగ్ వంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఆరులీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బాస్కెట్లో.. బూరెలు, గారెలు, బజ్జీలు, చగోడీలు, మురుకులు, వడియాలు వంటివన్నీ తయారు చేసుకోవచ్చు. ఇందులో టైమింగ్, టెంపరేచర్ రెండిటినీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తోనే ఆహారం వేగంగా గ్రిల్ అవుతుంది. దీన్ని మూవ్ చేసుకోవడం చాలా సులభం. ఇందులో గ్రిల్ బాస్కెట్తో పాటు.. గ్రిల్ ప్లేట్ కూడా లభిస్తుంది. దానిలో చికెన్, మటన్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవచ్చు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. (చదవండి: ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్!) -
బుకింగ్లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మరింత దిగజారుతోంది. చలి తీవ్రమవుతోంది. ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాల్లో పొల్లాల్లోని గడ్డిని తగలబెడుతూండటమే రాజధాని ప్రాంతంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మరింత దిగజారేందుకు కారణమవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సమాచారం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. కొన్నేళ్లుగా నాసా వాతావరణ కాలుష్యంపై ఈ గడ్డి వాముల కాల్చివేత ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. తాజాగా నాసా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో (దిగువన) ఎర్రటి చుక్కలు పంటపొలాల్లో కాలిపోతున్న గడ్డిని స్పష్టంగా చూపుతున్నాయి. నాసా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ హిరెన్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ పంజాబ్, హర్యానాలలో గడ్డివాములను కాల్చడం అధికమవుతున్నదని అన్నారు. కాలుష్య నియంత్రణ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా మూడవ రోజు పేలవ స్థాయిలో నమోదైంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఏక్యూఐలో పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవు. బుధవారం ఉదయం పది గంటలకు నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 238గా ఉంది. ఢిల్లీలోని సెంటర్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే నాలుగైదు రోజులలో నగరంలో గాలి నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉంది. గాలి నాణ్యత సూచీ 500గా ఉంటే కాలుష్య స్థాయిని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. గడచిన మే తర్వాత తొలిసారిగా ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవమైన స్థాయిని చూపింది. ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం -
నాచుతో కాలుష్యాన్ని మాయం గాడ్జెట్.. ధర ఎంతంటే?
సముద్రపు నాచుతో పనిచేసే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పనిచేసే చోట టేబుల్పై పెట్టుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని రూపొందించారు. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్ల మాదిరిగానే ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మకణాలను తొలగిస్తుంది. ఇందులోని సజీవమైన సముద్రపు నాచు పరిసరాల్లోని ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. గాలిలోని తేమను పీల్చుకుని, గదిని చల్లబరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘మోస్ ఎయిర్’ దీనిని రూపొందించింది. ఇందులో హెపా ఫిల్టర్లతో పాటు ఒక చదరపు మీటరు నాచు ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇందులోని నాచును రెండేళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇందులోని డ్రిప్ నాజిల్స్ నాచును సజీవంగా ఉంచేందుకు సన్నని నీటి తుంపర్లను నిరంతరం విడుదల చేస్తుంటాయి. దీని ధర 198 డాలర్లు (రూ16,481) మాత్రమే! -
'అత్యంత స్వచ్ఛమైన గాలి' లభించేది ఇక్కడే..బాటిల్లో నింపి..
భూమిపై స్వచ్ఛమైన గాలి కోసం పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా తెగ అన్వేషిస్తున్నారు. మానవుల మెరుగైన ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన గాలి లభించే ప్రాంతాల గురించి జరిగిన అన్వేషణలో ఓ ప్రాంతం హాట్ టాపిక్గా మారింది. ఆ ప్రదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచం చిట్టచివరి ప్రదేశంగా పిలిచే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో వాయువ్య కొన వద్దే ఈ స్వచ్ఛమైన గాలి లభిస్తుందట. కేప్గ్రిమ్ అనే ద్వీపకల్పం వద్ద ఈ ప్రదేశం ఉంది. పర్యాటకులు సైతం ఆ గాలిని పీల్చేందుకు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ గాలి చాలా నాణ్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ కేప్గ్రిమ్ని దక్షిణ మహాసముద్రం మీద నుంచి పశ్చిమ గాలులు చాలా బలంగా తాకుతాయని చెబుతున్నారు. అందువల్లే ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం "ఎడ్జ్ ఆప్ ది వరల్డ్"గా ప్రసిద్ధి. భయంకరమైన గాలులకు పేరుగాంచిన ప్రాంతం కూడా. ఇక్కడ గంటకు 180 కిలోమీటర్ పర్ అవర్తో గాలులు వీస్తాయి. అందువల్లే కలుషితం కానీ గాలి ఇక్కడ వీస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి వేగం, గాలి దిశ డేటా ఆధారంగా కేప్గ్రిమ్కు చేరే గాలిలో దాదాపు 30 శాతం బాగుంటే చాలని దీన్ని బేస్లైన్గా తీసుకుంటామని అన్నారు. కానీ ఇక్కడ గాలి అంతకు మించి స్వచ్ఛంగా ఉండటమే కాకుండా స్థానిక వాతావరణ వనరులతో ప్రభావితం కాకుండా చాలా పరిశుభ్రమైన గాలి ఉంటుందని శాస్త్రవేత్త స్టావర్ట్ చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఓ మోస్తారుగా స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతాలు హవాయిలోని మౌనాలోవా స్టేషన్, మాక్వేరీ ద్వీపం, అంటార్కిటికాలోని కేసీ స్టేషన్, నై అలెసుండ్, స్వాల్బార్డ్ పట్టణం తదితరాలు ఉన్నాయి. కానీ ఈ టాస్మానియాలో వీచే గాలి మాత్రమే ఈ భూమిపై లభించే గాలుల్లోకెల్ల స్వచ్ఛమైన గాలి అని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ప్రస్తుతం ఈ టాస్మానియాలోని స్వచ్ఛమైన గాలిని డబ్బాలో పట్టి విక్రయిస్తున్నారట. ఒక రకంగా పరిశుభమైన గాలికి సంబంధించిన వ్యాపారం ఊపందుకుంది. ప్రతి డబ్బాలో దాదాపు ఓ వ్యక్తి 130 సార్లు టాస్మానియా గాలిని పీల్చుకునేంత స్టోరై ఉంటుందట. (చదవండి: మూత్రంతో తయారు చేసిన బీరు..ఎగబడుతున్న జనాలు!) -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
జనం.. గగనయానం!
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్ చేసుకుని సింగపూర్ చుట్టి వచ్చేశారు. ఇదీ ప్రయాణికుల రద్దీ 2022 ఏప్రిల్నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య: 26,73,979 పెరిగిన ప్రయాణికుల శాతం:28.2% ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు సంఖ్య: 34,29,083 ..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు. మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 25శాతం పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే విద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నారని ఎయిర్పోర్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సాగించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని.. ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్కు చెందిన మహేశ్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్ పండిట్ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ హోస్టెస్ను అసభ్యంగా తాకి.. గత ఏప్రిల్లో బ్యాంకాక్ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్హోస్టెస్తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్హోస్టెస్ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్ డిష్ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్హోస్టెస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు.. కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో.. గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్ కేజ్లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ.. ఆ మధ్య అమెరికన్ ఎయిర్లైన్స్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
ఎయిర్లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!
ఇది అలాంటిలాంటి విమానం కాదు, పెద్ద ఓడలాంటి విమానం. గాలిలో ఇది ఎగురుతుంటే, పెద్ద ఓడ నింగిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. బ్రిటన్కు చెందిన హైబ్రిడ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్లాండర్ ఈ భారీ విమానానికి రూపకల్పన చేసింది. బ్రిటన్కు చెందిన విమానాల డిజైనింగ్ సంస్థ ‘డిజైన్–క్యూ’ సహాయంతో రూపొందించిన ఈ విమానం పేరు ‘ఎయిర్లాండర్–10’. ఇందులో లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడం విశేషం. ఇదీ చదవండి: ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు! విశాలమైన ఈ విమానంలో ప్రయాణికుల కోసం ఎనిమిది బెడ్రూమ్లు, బాత్రూమ్లు, షవర్లు, సువిశాలమైన లివింగ్ ఏరియా, సీటింగ్ ఏరియా, వైఫై సౌకర్యం, ఇతర వినోద సౌకర్యాలు, బార్ వంటి విలాసాలు ఈ విమానం ప్రత్యేకత. సాధారణ విమానాలతో పోలిస్తే దీని వేగం కాస్త తక్కువే! సాధారణ విమానాల గరిష్ఠ వేగం గంటకు 500 మైళ్లకు పైగా ఉంటే, దీని గరిష్ఠవేగం గంటకు 100 మైళ్లు మాత్రమే! ఇది 2026లో తన తొలి ప్రయాణం ప్రారంభించనుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
Viral Video: విమానంని ఆకాశంలోకి లాకెళ్లిన గుర్రాలు
-
యాపిల్ని కోర్టుకి ఈడ్చిన ఎయిర్ ట్యాగ్
-
అదిరిపోయే గాడ్జెట్తో ఇంట్లో దుర్వాసనకు చెక్ పెట్టండిలా
ఇదో కొత్తతరహా ఎయిర్ప్యూరిఫయర్. మార్కెట్లో దొరికే మిగిలిన ఎయర్ప్యూరిఫయర్ల కంటే ఇది చాలా తేలిక. పోర్టబుల్ టేబుల్ఫ్యాన్ పరిమాణంలో ఉండే దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట తేలికగా అమర్చుకోవచ్చు. ఇళ్లలోను, కార్యాలయాల్లోను వాడుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ‘డాక్టర్ ఎయిర్పిక్’ పేరిట దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ పిక్సెల్రో కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని కార్బన్ మల్టీకంపోజిట్ ఫిల్టర్, ప్లాస్మా డీయాడరైజర్లు గాలిలోని దుమ్ము ధూళి, పొగ, సూక్ష్మజీవకణాలు వంటివి తొలగించడమే కాకుండా, పరిసరాల్లోని ఎలాంటి దుర్వాసననైనా నిమిషాల్లో మటుమాయం చేస్తాయి. దీని ధర 75 డాలర్లు (రూ.6,134) మాత్రమే! ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
గాలి శుభ్రం... తీరేను దాహం
ఫొటోలో వాటర్ డిస్పెన్సర్లా కనిపిస్తున్నది ఉత్త వాటర్ డిస్పెన్సర్ మాత్రమే కాదు, అంతకు మించిన అధునాతన యంత్రపరికరం. వాటర్ డిస్పెన్సర్ నుంచి నీరు రావాలంటే, అందులో నీరు నింపాల్సిందే! దీనికి ఆ అవసరమే లేదు. ఇది గాలిలోని తేమనే నీరుగా మార్చి సరఫరా చేస్తుంది. అంతే కాదు, గదిలోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా! ఇది టూ ఇన్ వన్ పరికరం. ఎయిర్ ప్యూరిఫయర్ కమ్ వాటర్ డిస్పెన్సర్. గదిలోని గాలిలో నిండి ఉండే దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవకణాలను పీల్చేసుకుని, గదిలోని గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంది. గాలిలోని తేమను ఒడిసిపట్టుకుని, నీటిగా మారుస్తుంది. ఇలా ఇది రోజుకు ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వేణ్ణీళ్లు కావాలంటే వేణ్ణీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లు క్షణాల్లో సరఫరా చేస్తుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుంది. ‘టాప్ఫ్రెష్’ పేరిట ఒక హాంకాంగ్ కంపెనీ రూపొందించిన దీని ధర 399 డాలర్లు (సుమారు రూ.32 వేలు) మాత్రమే! -
గాలిని శుభ్రం చేసే ఈ డబుల్ ధమాకా గాడ్జెట్ గురించి మీకు తెలుసా
ఈ ఫొటోలో గోడకు ఏదో అమర్చినట్లు కనిపిస్తోంది కదూ! గోడకు ఏమీ అమర్చలేదు గాని, ప్లగ్లో పెట్టిన చిన్న సాధనమిది. ఇదొక డబుల్ ధమాకా పరికరం. దీనిని ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు, గదిలోని గాలిని శుభ్రపరచడమే కాకుండా, దోమలనూ పారదోలుతుంది. ఈ ‘2022 ఎయిర్ ప్యూరిఫయర్స్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్’ పరికరాన్ని అమెరికన్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ‘కార్నర్షాప్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ప్యురిఫయర్ కమ్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్ పరికరం వివిధ దేశాల్లోని వాల్మార్ట్ స్టోర్స్లోనూ దొరుకుతుంది. దీనిని ఆన్ చేశాక ప్రతి 40 సెకండ్లకు ఒకసారి కొద్దిసేపు దీని నుంచి సన్నని ధ్వని వెలువడుతుంది. ఈ పరికరం గాలిలోని దుర్వాసనను పోగొడుతుంది. గాలిలోని హానికరమైన జీవ రసాయనిక కణాలను తొలగిస్తుంది. -
గాల్లోంచి.. మంచినీటి చుక్క, మాంసం ముక్క
ఎక్కడో ఎడారి నడి మధ్యలో ఉన్నారు.. చెట్లూ చేమలు ఏమీ లేవు.. నీటి జాడ అసలే లేదు.. అయినా తినడానికి మాంచి మటన్ లాంటి ఫుడ్డు, కావల్సినన్ని నీళ్లు రెడీ. బయట ఎక్కడి నుంచో తేలేదు.. అక్కడే, ఆ ఎడారిలోనే అబ్రకదబ్ర అన్నట్టు గాలిలోంచి తయారైపోయాయ్. శాస్త్రవేత్తలు నిజంగానే గాల్లోంచి ప్రోటీన్ ఫుడ్ను, నీళ్లను తయారు చేసే టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలివి.. నిరంతరాయంగా నీళ్లొస్తాయి ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల నీటికి కటకటే. ఎడారుల్లో మాత్రమే కాదు.. కొండలు, గుట్టల వంటిచోట కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందే. అలాంటి ప్రాంతాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా గాలి నుంచి నీటిని తీసే పరికరాన్ని స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్ (తానంతట తానే చల్లబర్చుకుంటూ.. గాలిలోని నీటి ఆవిరిని సంగ్రహించే)’సాంకేతికతతో ఈ పరికరం పనిచేస్తుంది. నిజానికి గాలిలోంచి నీటిని సంగ్రహించగల పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటికి విద్యుత్ అవసరం, ఉత్పత్తి అయ్యే నీళ్లు కూడా చాలా తక్కువ. కానీ తాము తయారు చేసిన పరికరానికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం లేదని.. పైగా రోజులో 24 గంటలూ నీటిని పొందవచ్చని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలా పనిచేస్తుంది? గాలిలోంచి నీటిని సంగ్రహించేందుకు ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్’చేయగల ప్రత్యేక గ్లాస్ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. పాలిమర్, వెండి పొరలతో కూడిన ఈగ్లాస్ సూర్యరశ్మిని పూర్తిస్థాయిలో ప్రతిఫలింపజేస్తూ.. బాగా చల్లబడుతుంది. ఈ గ్లాస్ దిగువభాగాన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత కంటే.. ఏకంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ల మేర తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో గాలిలో ఉన్న నీటి ఆవిరి గ్లాస్ దిగువ భాగాన నీటి చుక్కలుగా పేరుకుంటూ..దిగువన ఉన్న కంటైనర్లో కి చేరుతుంది. ఈ విధానంలో పూర్తి స్వచ్ఛమైన నీరు వస్తుందని.. పది చదరపు మీటర్ల పరిమాణమున్న పరికరంతో రోజుకు 12.7 లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇవాన్ హెక్లర్ తెలిపారు. మాంసమూ ఊడి పడుతుంది! మటన్, చికెన్, ఫిష్.. ఇలా ఏ మాంసం ఏదైనా జనం లొట్టలేస్తూ లాగించేస్తుంటారు. మరోవైపు ఇది జీవ హింస అనే వాదనలు. ఈ మధ్య మొక్కల ఆధారిత (ప్లాంట్ బేస్డ్) మాంసం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా గాలిలోంచే మాంసం తయారు చేయగలిగితే.. ఇంకా బెటర్ కదా. ఎయిర్ ప్రోటీన్ అనే సంస్థ దీనిని నిజం చేసింది. మొదట అంతరిక్ష యాత్ర కోసమని.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గాలిలోని వాయువులు, రసాయనాల నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంపై సుమారు 50 ఏళ్ల కిందే ప్రయోగాలు మొదలుపెట్టారు. అంగారకుడు, ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణం నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలిగితే.. వ్యోమగాములకు ఆహారం సమస్య తీరుతుందనేది దీని ఉద్దేశం. ఈ పరిశోధనలను ఎయిర్ ప్రోటీన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లీసా డైసన్, జాన్ రీడ్ తదితరులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎయిర్ ప్రోటీన్ను తీసి.. వివిధ పద్ధతుల్లో గాలిలోని వాయువులు, మూలకాలను సేకరించి, అవసరమైన మేర సమ్మిళితం చేసి.. ‘ఎయిర్ ప్రోటీన్’ను రూపొందించారు. దానిని శుద్ధిచేసి, పూర్తిగా ఆరబెట్టి.. ఒక పిండి వంటి పదార్థంగా తయారు చేశారు. ఈ ‘ఎయిర్ ప్రోటీన్’పిండితో.. చికెన్, మటన్, ఫిష్ వంటి వివిధ రకాల మాంసం తరహాలో తయారు చేశారు. తమ ‘ఎయిర్ ప్రొటీన్’రుచి, పోషకాల విషయంలో సాధారణ మాంసంతో సమానమని.. యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలూ ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలిలోని కార్బన వాయువులను తగ్గించడం వల్ల పర్యావరణానికీ మేలు అని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ గాలిలో ఉండగలదని, గాలి ద్వారా వ్యాపించగలదనడానికి సరైన ఆధారాలను సీఎస్ఐఆర్–సీసీఎంబీ హైదరాబాద్, సీఎస్ఐఆర్–ఇమ్టెక్ చండీగఢ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం కోవిడ్–19 చికిత్స అందించిన ఆస్పత్రులు, కోవిడ్–19 రోగులను ఉంచిన గదులు, హోం ఐసోలేషన్ పాటించిన కోవిడ్–19 రోగులున్న గదుల నుంచి గాలి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ క్రమంలో గాలిలో వైరస్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కనుగొన్నారు. కరోనా రోగులున్న పరిధిలో వైరస్ గాలిలోకి వ్యాపిస్తోందని, ఇతరులు ఆ పరిధిలోకి వెళ్తే వైరస్ బారిన పడతారని అంచనాకు వచ్చారు. గదిలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది రోగులున్న చోట కోవిడ్–19 పాజిటివిటీ రేటు 75 శాతం ఉందని.. ఒకరు ఉన్నా లేదా రోగులు వెళ్లిపోయిన తర్వాత ఖాళీ చేసిన గదిలో పాజిటీవిటీ రేటు 15.8 శాతంగా ఉందని కనుగొన్నారు. బయటి గాలిలో కన్నా గదిలోని గాలిలో వైరస్ ఎక్కువ యాక్టివ్గా ఉందని పరిశోధనలో పాల్గొన్న శాస్తవేత్త డాక్టర్ శివరంజని మొహరీర్ స్పష్టం చేశారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సీసీఎంబీ ప్రొఫెసర్, సీనియర్ సైంటిస్ట్, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనిటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సూచిస్తున్నారు. చదవండి: టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం -
పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!
Lot of smoke in Kyiv, people can't breathe properly: రష్యా ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం దట్టమైన పొగ మేఘంతో కప్పబడి ఉంది. దీంతో ఉక్రెయిన్ అధికారులు గాలి నాణ్యత.. అనారోగ్యకరమైన స్థాయిలో ఉందని నివాసితులు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక వాయు నాణ్యత మార్గదర్శక విలువ కంటే ప్రస్తుతం కీవ్లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8 రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. మార్చి19 నుంచి వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు కీవ్లో పొగ ఎక్కువగా ఉందని, ప్రజలు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అతేకాదు గాలిలో పొగలు కమ్ముకుంటున్నందున ప్రజలు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర పాలక సంస్థ కూడా ప్రజలను కోరింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి కీవ్లో అనేక పేలుళ్లు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్- రష్యా వార్ ముఖ్యాంశాలు ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించి 24 రోజులైంది. ఐక్యరాజ్యసమిది నివేదిక ప్రకారం, 3.2 మిలియన్ల మంది ప్రజలు దేశం నుంచి పారిపోగా, మరో 6.5 మిలియన్ల మంది ఉక్రెయిన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ యుద్ధంలో వందలాది మంది పౌరులతో పాటు, 112 మంది పిల్లలు మరణించారని దాదాపు 13 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే, అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, నాటో నేరుగా పాల్గొనడానికి లేదా ఉక్రెయిన్పై నో-ఫ్లై జోన్ను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఉక్రెయిన్, రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఉక్రేనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ప్రతినిధి బృందం శుక్రవారం ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని చెప్పారు. (చదవండి: పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!) -
మానవ మనుగడకి ముప్పుగా కాలుష్యం.. ఏటా 70 లక్షల మరణాలు!
ప్రకృతి ఒడిలో ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్నవారు తప్ప ప్రపంచంలో మిగతా ప్రజలంతా కలుషిత గాలినే పీల్చుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి కలుషితమైన గాలినే పీల్చుకుంటోంది ప్రపంచంలోని 99 శాతం జనాభా. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తాజా గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఎక్కువమంది ప్రాణాలను హరిస్తున్న కాలుష్య మహమ్మారి ఇది. ఏటా ఈ కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది బలవుతున్నారు. ఈ కాలుష్యం ఇంటా బయటా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఆరుబయటను పీల్చటం వల్ల ఏటా 42 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వంటగదుల్లో పొగ కాలుష్యం వల్ల ఏటా 38 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగటం వల్ల వస్తున్న క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్ సహా అనేక దీర్ఘకాలిక రోగాలతో ఏటా మన దేశంలో దాదాపు 13.5 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారత్లో వాయు కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. మనదేశంలో నమోదైన మొత్తం మరణాలలో ఇది 18 శాతం. మరణాలు, వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఏకంగా రూ. 2,60,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. స్థూల జాతీయోత్పత్తి లో ఇది 1.4 శాతం మేరకు ఉంటుందని ఒక నివేదిక చెబుతోంది. కోవిడ్ –19 కారణంగా దాదాపు రెండేళ్లలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 54.4 లక్షలు. అయితే ఏటా వాయు కాలుష్యం 70 లక్షల మందిని బలిగొంటున్నా పాలకులకు అంతగా పట్టట్లేదు. ఇంతకీ వాయు కాలుష్యం అంటే ఏమిటి? భూ ఉపరితల వాతావరణంలో ప్రకృతిసిద్ధమైన గాలి సహజ గుణగణాలను ఇంటా బయటా రసాయనిక, భౌతిక, జీవ సంబంధమైన వాహకం ద్వారా కలుషితం కావటం. ఒక్కమాటలో చెప్పాలంటే అసాధారణమైన రసాయనాలు లేదా ధూళి కణాలు కలిగి ఉన్న గాలే కలుషితమైన గాలి. వాయు కాలుష్య రకాలు.. వంట కలప, మోటారు వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, అడవులు తగులబడటం వంటివాటి ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున పంట అవశేషాలను కాల్చడం.. పొగ, పొగమంచు, సూక్ష్మరేణువులతో కూడి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ధూమపానం, రాడాన్ ప్రధాన కారణాలు. ఇంట్లో వాయు కాలుష్య కారకాలైన అత్యంత ప్రమాదరకమైన మూడు కారకాల్లో రాడాన్ ఒకటి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రధాన కాలుష్య కారకాలు.. అతిచిన్న ధూళి కణాలు (పిం.ఎం. 2.5, పి.ఎం. 10), కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్తో పాటు సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉంది. ఇవేకాక గ్యాసోలిన్, బెంజీన్, స్టైరిన్, ఫార్మాల్డిహైడ్ వంటి అస్థిర సేంద్రియ సమ్మేళనాలూ వాయు కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. సహజ వాయు కాలుష్య కారకాలు... అడవులను దహించే కార్చిచ్చు, పుప్పొడి, ధూళి తుపాను, రాడాన్ వాయువు మొదలైనవి. అసహజ కాలుష్య కారకాలు.. మనుషుల పనులు, వాహనాల్లో మండించే ఇంధనం, ఇళ్లు, ఫ్యాక్టరీలలో ఉపయోగించే బొగ్గు, కలప ఇతర ఇంధనాలు వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. హరిత గృహ వాయువులు.. వాతావరణ మార్పు వాతావరణ మార్పులతో వాయు కాలుష్యకారకాలు సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి. పార్టిక్యులేట్ మ్యాటర్ (పి.ఎం.) ధూళి కణాలు వాతావరణాన్ని వేడిక్కిస్తాయి లేదా చల్లబరుస్తాయి. బ్లాక్ కార్బన్, ఓజోన్ వంటి కొన్ని కాలుష్య కారకాలు వాతావరణంలో వేడిని బంధించడం ద్వారా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అయితే సల్ఫర్ డయాక్సైడ్ వంటివి కాంతిని పరావర్తనం చెందించే కణాలను ఏర్పర్చి వాతావరణాన్ని చల్లబరుస్తుంటాయి. సూర్యరశ్మిని భూవాతావరణంలో బంధిస్తూ హరిత గృహ వాయువులూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానమైనవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి (ఇవన్నీ సహజంగా ఏర్పడతాయి)తో పాటు ఫ్లోరినేటెడ్ వాయువులూ (ఇవి సింథటిక్) ఉన్నాయి. వీటిని హరిత గృహ వాయువులని, వీటి ప్రభావాన్ని హరిత గృహ ప్రభావమని అంటున్నాం. మన దేశంలో హరిత గృహ వాయువుల తలసరి ఉద్గారాలు తక్కువ. అయితే మొత్తంగా చూస్తే కాలుష్యకారక దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉంటే మూడో స్థానంలో మన దేశం ఉంది. మనుషుల అవసరాల కోసం బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే భూతాపోన్నతి.. గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. దీన్ని పారిశ్రామిక పూర్వకాలం (క్రీ.శ. 1850– 1900 మధ్య) నుంచే గమనిస్తున్నాం. ఇప్పుడు వాతావరణం వేగంగా మారుతోంది. 2100 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 5.4 డిగ్రీల సెల్సియస్ దాకా పెరగవచ్చు. ఈ మార్పు వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. ప్రజారోగ్యానికీ హాని కలుగుతోంది. జాతుల మనుగడకూ ముప్పే. దీన్ని తట్టుకొని నిలబడడం ప్రపంచానికే సవాలుగా మారింది. విధాన నిర్ణేతలు తప్పనిసరిగా మెరుగైన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వాయు కాలుష్య నివారణ,నియంత్రణ చట్టం – 1981 వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. పిల్లలను బడులకు పంపొద్దు పిల్లల ఊపిరితిత్తులు నాజూగ్గా ఉంటాయి. కాబట్టి వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని బడులకు పిల్లలను పంపవద్దు. ఎర్త్ లీడర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కార్యక్రమం కింద వ్యాస రచయిత సారథ్యంలో అహ్మదాబాద్, సూరత్లోని కొన్ని పాఠశాలల్లో వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే కిట్లను పిల్లలతోనే తయారుచేయించి, ఆయా పాఠశాలల్లో అమర్చారు. వాయు కాలుష్యం ఎప్పుడు, ఎంత ఉంటున్నదని తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా తెలుసుకోవడానికి వీలుగా డేటాను క్లౌడ్తో అనుసంధానించారు. వాయు కాలుష్య సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోంది. గాలిలో కాలుష్య కణాలు.. సల్ఫేట్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం క్లోరైడ్, బ్లాక్ కార్బన్ (డీజిల్ వాహనాల నుంచి విడుదలయ్యే కణాలు బ్లాక్ కార్బన్ను కలిగి ఉంటాయి), ఖనిజాల «ధూళి వంటివన్నీ కాలుష్య కణాలే. గాలిలో తేలియాడే ఈ అతిచిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకుంటున్నాం. పది మైక్రో మీటర్లు (మీటరులో 10లక్షల వంతు) లేదా అంతకంటే చిన్న కణాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లగలవు. అయితే వీటికన్నా ఇంకా చిన్న కాలుష్య కాణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న (పి.ఎం. 2.5) కాలుష్య కణాలు ఊపిరితిత్తులను దాటుకొని మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. పి.ఎం. 2.5 కణాలు మన వెంట్రుక వ్యాసంలో ముప్పయ్యవ వంతు సూక్ష్మంగా ఉంటాయి. మనుషులను మరణానికి చేరువ చేస్తున్న అయిదవ అతి ప్రమాద కారకాలివి. 80 శాతం వాయు కాలుష్య మరణాలకు పి.ఎం. 2.5 కాలుష్య కణాలే కారణం. వీటి మూలంగా 2010లో 6, 27,000 మంది మృత్యువాత పడ్డారని, ఆ ఏటి మరణాల్లో ఇవి 6 శాతమని 2012లో జీబీడీ – లాన్సెట్ పేర్కొంది. గాలి నాణ్యతపై నిఘా గాలి నాణ్యత విషయంలో ప్రతి దేశానికి వేరువేరు ప్రమాణాలున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను నిర్దేశించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సూచీలో కాలుష్య తీవ్రతను తెలియజెప్పే ఆరు విభాగాలున్నాయి. ఎనిమిది కాలుష్య కారకాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యత ఏ మేరకు ఉందో నిర్ధారిస్తారు. రెండేళ్లుగా బిఎస్6 ప్రమాణాలు శిలాజ ఇంధనాలు వినియోగించే మోటారు వాహనాలు తదితర యంత్రాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ (బీఎస్ఈఎస్)ను ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్ణీత కాలవ్యవధిలో ఈ గాలి కాలుష్య ప్రమాణాలు అమలవుతున్నాయి. భారత్స్టేజ్ 6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలకు మాత్రమే దేశవ్యాప్తంగా 2020 నుంచి రిజిస్ట్రేషన్ సాధ్యపడుతోంది. చమురు కంపెనీలు కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా 100 పీపీఎం మేరకు గంధకం కలిగిన పెట్రోలు డీజిల్ను సరఫరా చేస్తున్నాయి. తక్కువ కాలుష్య కారకమైన ఇంధనంగా పేరుగాంచిన సిఎన్జీతో సమానమైన సామర్థ్యం బిఎస్6 ప్రమాణాలతో కూడిన డీజిల్, పెట్రోల్కు ఉండడం విశేషం. కాటేస్తున్న వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 2019లో వాయు కాలుష్యం వల్ల 67 లక్షల మంది చనిపోయారు. చైనాలో అత్యధికంగా 18.5 లక్షల మంది, భారత్లో 16.7 లక్షల మంది వాయుకాలుష్యానికి బలయ్యారు. మన దేశంలో ప్రతి నలుగురు మృతుల్లో ఒకరు వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న కారణాల్లో రక్తపోటు, పొగాకు, నాసిరకం ఆహారం తర్వాత నాలుగో స్థానం వాయు కాలుష్యానిదే. దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైతే అనేక రకాల జబ్బుల పాలు కావడమే కాకుండా మరణాలూ సంభవిస్తున్నాయి. వాయు కాలుష్య మరణాలు ఆంధ్రప్రదేశ్లో 62,808 మంది తెలంగాణలో35,364 మంది ∙ 2019లో దేశంలో వాయుకాలుష్యంతో చనిపోయిన వారిలో సగం మంది ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్కు చెందిన వారే. తద్వారా జరిగిన ఆర్థిక నష్టం 3,680 కోట్ల డాలర్లు. ఇంకా చెప్పాలంటే మన దేశ స్థూల ఉత్పత్తిలో 1.36 శాతం. ∙2019లో ఆంధ్రప్రదేశ్లో 62,808 మంది వాయు కాలుష్యం బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏపీలో 15.6 శాతం మరణాలకు కారణం వాయుకాలుష్యమే. ఆర్థిక నష్టం 134.95 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 1.09 శాతం. ∙తెలంగాణలో 2019లో వాయు కాలుష్యం కారణంగా 35,364 మంది ప్రాణాలొదిలారు. రాష్ట్రంలో చనిపోతున్న వంద మందిలో 15.5 శాతం మంది వాయు కాలుష్యం వల్లనే చనిపోతున్నారు. ఆర్థిక నష్టం 111.59 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 0.91 శాతం. (సౌజన్యం: స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020) మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాలు ∙వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ∙వాయు కాలుష్యం ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. వృద్ధులు, శిశువులు, గర్భిణీలు, గుండె, శ్వాసకోశానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి హై రిస్క్ గ్రూపులోని వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ∙పిల్లల్లో ఊపిరితిత్తులు ఇంకా ఎదిగే దశలో ఉంటాయి కాబట్టి వాళ్లు వాయు కాలుష్యానికి బహిర్గతమైనప్పుడు అది వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ∙వాయు కాలుష్యం వల్ల కంటి దురదలు, తలనొప్పి, వికారం వంటి చిన్న చిన్న అనారోగ్యాలతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. అంతేకాదు దీర్ఘకాలం పాటు విషపూరిత వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి జబ్బులూ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ వాయు కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల దిగువ భాగాలకు చేరి శ్వాసనాళాల వాపు, సంధి వాపు వంటి వ్యాధులకూ కారణమవుతున్నాయి. డాక్టర్ ఎన్. సాయి భాస్కర్ రెడ్డి, జియో సైంటిస్ట్ 92463 52018 -
ఎయిర్ ప్యూరిఫైయర్.. ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే
మన పరిసరాల్లో గాలి స్వచ్ఛంగా ఉంటేనే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. వీధుల్లోకి వెళితే వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము ధూళితో నిండే గాలి ఉక్కిరిబిక్కిరి కావడం ఎటూ తప్పదు. కనీసం ఇంట్లోనైనా స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుందామనుకుంటే ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండాల్సిందే! ఇది ఫ్యాను మాదిరిగా చక్కని గాలి అందిస్తూనే, గాలిలోని ప్రమాదకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది వెయ్యి చదరపు గజాల పరిధిలోని గాలిని క్షణాల్లో స్వచ్ఛంగా మార్చేస్తుంది. యూరోపియన్ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘ఏస్పెన్’ డిజైనర్లు ‘హెచ్13 హెపా యూవీసీ జెర్మిసైడల్ ఎయిర్ ప్యూరిఫైయర్’ పేరిట దీనిని రూపొందించారు. దీనిని ఆన్ చేయగానే, గాలి వీచడంతో పాటు, ఇందులోని అల్ట్రావయొలెట్ లైట్ కూడా వెలుగుతుంది. దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు గాలిలోని సూక్ష్మక్రిములను క్షణాల్లో నాశనం చేస్తుంది. చదవండి: చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్కే అందని అద్భుతం -
గాలి నుంచి ఆక్సిజన్ వచ్చేదెలా?
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమ్మీద జీవులకు ఆక్సిజనే కీలకం. ఆక్సిజన్ అందకుండా కొన్ని నిమిషాల పాటు కూడా బతకలేం. మనం ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ను సంగ్రహించి, శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ను వదిలేస్తుంటాం. కానీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు.. శరీరానికి ఆక్సిజన్ సరిగా అందక, ప్రత్యేకంగా అందించాల్సి వస్తుంది. గాలిలో ఆక్సిజన్ ఉండగా మళ్లీ ఎందుకు అందించడం అనే సందేహాలు రావొచ్చు. మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్, 0.9శాతం ఆర్గాన్, మిగతా 0.1 శాతం ఇతర వాయువులు ఉంటాయి. మనం శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే 21%ఆక్సిజన్నే గ్రహించాల్సి ఉంటుంది. అదే 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటే.. మరింత మెరుగ్గా శరీరానికి అందుతుంది. శ్వాస సరిగా ఆడనివారికి ఆక్సిజన్ పెట్టడానికి కారణమిదే. సాధారణ గాలిలో నుంచి నైట్రోజన్ వాయువును తొలగించేస్తే.. మిగిలే గాలిలో 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్లు ఇదే పనిచేస్తాయి. ఈ సాంకేతికతను ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ)’గా పిలుస్తారు. పీఎస్ఏ ప్లాంట్లు పనిచేసేదిలా.. 1. సాధారణ గాలిని ప్రత్యేక పరికరాల ద్వారా సేకరిస్తారు. 2. గాలిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తారు. అందులో తేమను తొలగిస్తారు. 3. దుమ్ము, ధూళి లేకుండా ఫిల్టర్ చేస్తారు. 4. ఒక చిన్నపాటి ట్యాంకు (ఎయిర్ బఫర్) మీ దుగా అడ్సార్ప్షన్ ట్యాంకులకు పంపుతారు. 5. అడ్సార్ప్షన్ స్టేజీలో రెండు ట్యాంకులు ఉంటాయి. వాటిల్లో జియోలైట్గా పిలిచే ప్ర త్యేక పదార్థాన్ని నింపి ఉంచుతారు. వేర్వేరు వాయువులను పీల్చుకునేందుకు వేర్వేరు జియోలైట్లు ఉంటాయి. నైట్రోజన్ను పీల్చేం దుకు ‘జియోలైట్ 13’ను వాడుతారు. ముం దుగా ఒక ట్యాంకు (ఏ)లోకి తీవ్ర ఒత్తిడితో ఉన్న గాలిని పంపుతారు. అందులోని జియోలైట్ నైట్రోజన్ను పీల్చుకుంటుంది. 93–95 శాతం ఆక్సిజన్తో కూడి న గాలి మిగులుతుంది. దీనిని ఆక్సిజన్ ట్యాంకుకు పంపుతారు. తర్వాత ట్యాంకు (ఏ)లో నుంచి వృధా నైట్రోజన్ను బయటికి వదిలేస్తారు. ఇదే సమయంలో మరో ట్యాంకు (బి)లో నైట్రోజన్ పీల్చుకునే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత మ రో ట్యాంకులో ఉత్పత్తవుతూ ఉండటం వల్ల.. నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. 6. ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను వార్డులకు సరఫరా చేస్తారు. 7. వృధా నైట్రోజన్ను బయటికి వదిలేస్తారు. -
వాటర్ జనరేటర్లు: గాల్లోంచి తాగు నీరు ఎలా వస్తుందంటే..
మంచి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తట్టుకునేందుకు యూఏఈ, టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. వాటర్ జనరేటర్ల సాయంతో తేమ నుంచి నీటిని తయారు చేసుకుంటోంది. అదీ పర్యావరణానికి ఎలాంటి భంగం కలిగించకుండానే!. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగా.. త్వరలో అధికారికంగా ఈ సెటప్ను దేశవ్యాప్తంగా లాంఛ్ చేయనుంది. విశేషం ఏంటంటే.. తాగు నీరు కోసం జరిగిన ప్రయోగాల్లో ఇదే భారీ సక్సెస్ కూడా. అబుదాబి: పూర్తిగా సోలార్ పవర్తో నడిచే ప్రాజెక్ట్ ఇది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. హైపర్-డెహూమిడీఫైయర్స్ అనే జనరేటర్ల(20 జనరేటర్ల దాకా) సాయంతో రోజూ 6,700 లీటర్ల తాగు నీటిని తయారు చేశారు. పైగా ఇది నిరంతర ప్రక్రియ కావడం విశేషం(ప్రపంచంలోనే ఈ తరహా ప్రయోగం మొదటిది ఇదే). ఇవి ఎలా పని చేస్తాయంటే.. సోలార్ ప్యానెల్స్- భారీ ఫ్యాన్లు-పైపులను అనుసంధానించి ఈ వాటర్ జనరేటర్ల సెటప్లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్లు వాతావరణంలోని తేమను లాక్కుని.. అనుసంధానంగా ఉన్న పైపుల ద్వారా జనరేటర్ సెటప్లకు చేరవేస్తాయి. ఈ మధ్యలో పైపుల గుండా తేమకు ప్రత్యేకమైన లిక్విడ్(చల్లబరిచేవి) చేరుస్తారు. తద్వారా ఆ తేమ పోయే కొద్దీ నీటి బిందువులుగా మారతాయి. ఆపై ఆ తేమ నీరు బొట్టు బొట్టుగా పెరిగి.. ఆ నీరు దశలవారీగా ఫిల్టర్ అవుతుంది. ఫైనల్గా ఈ వాటర్ జనరేటర్లు తాగు నీటిని బయటకు వస్తుంది. కండిషన్స్ అప్లై ఇలా గాల్లో తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేయడం కొత్తేం కాకపోవచ్చు. అయితే అవి అవసరాల కోసమే తప్పించి.. మంచి నీటి కోసం ఉత్పత్తి చేసేవి లేవు. యూఏఈ పరిశోధనలు మాత్రం భారీ లెవల్లో నీటిని ఉత్పత్తి చేయడం, అదీ తాగు నీటి అవసరాల కోసం చేయడం ప్రపంచంలో తొలిసారి. ఇక 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద.. అదీ గాల్లో 60 శాతం తేమ శాతం ఉన్నప్పుడు ఈ వాటర్ జనరేటర్లు పనిచేశాయి(పైలట్ దశలో ఇదే తేలింది). త్వరలో అబుదాబి ఎయిర్పోర్ట్ దగ్గర్లోని మస్దర్ సిటీలో దీనిని లాంఛ్ చేయనున్నారు. సుమారు 54 ఎకరాల్లో సుమారు తొంభై వేల సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ సెటప్ ఏర్పాటు చేయబోతున్నారు. -
ఇదొక్కటి ఉంటే చాలు, 80 వేల ఇళ్లకు కరెంట్ సప్లయ్ చేసుకోవచ్చు
ఫొటోలో కనిపిస్తున్నది కొత్త తరహా ఓడ కాదు, ఓ గాలిమర. పైగా ఇది నీటిలో తేలుతుంది. సాధారణంగా గాలిమరలను ఎల్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ గాలి బాగా వీస్తుంది కాబట్టి. అయితే ఎత్తయిన ప్రాంతాల కంటే సముద్రాల మీదే గాలి బాగా వీస్తుంది. మరి ఆ గాలిని ఇప్పటి వరకు ఉపయోగించుకోకపోవడానికి కారణం.. అక్కడ వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతుండడమే. పైగా అక్కడ వీచే పెనుగాలులకు గాలిమర ఫ్యాను రెక్కలు, దానికి ఆధారంగా ఉండే స్తంభం విరిగిపోతాయి. అందుకే నార్వేకు చెందిన ఓ కంపెనీ డబ్ల్యూసీఎస్ (విండ్ క్యాచింగ్ సిస్టం) టెక్నాలజీ ఉపయోగించి దీనిని రూపొందించింది. చతురస్రాకారంలో ఉండే ఈ నిర్మాణం వెయ్యి అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో చిన్న చిన్న ఫ్యాన్లు అమర్చి, డివైడ్ అండ్ రూల్ పద్ధతిని అమలు చేశారు. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ అవి ఉత్పత్తి చేసే విద్యుత్ మాత్రం ఒకే చోట నిల్వ అవుతుంది. దీనివల్ల ఏదైనా ఒక ఫ్యాను పనిచేయక పోయినా, ఇతర ఫ్యాన్లు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉపయోగించుకునే వీలుంటుంది. సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ గాలిమర ఒకేసారి సుమారు 80 వేల ఇళ్లకు కావల్సిన విద్యుత్ను సరఫరా చేయగలదు. ఇది నేల మీద ఉండే 25 గాలిమరల సామర్థ్యానికి సమానం. వీటి మన్నికా ఎక్కువే. సాధారణ గాలిమర మన్నిక 30 సంవత్సరాలు ఉంటే, సముద్రంలోని ఈ గాలిమర 50 సంవత్సరాల వరకు నిరంతరాయంగా పని చేయగలుగుతుంది. త్వరలోనే ఇలాంటి మరిన్ని గాలిమరలను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది డబ్ల్యూసీఎస్ కంపెనీ. -
‘న్యూస్ ఆన్ ఎయిర్’ హైదరాబాద్ ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: న్యూస్ ఆన్ ఎయిర్ సేవల వినియోగంలో హైదరాబాద్ మూడోస్థానం దక్కించుకుంది. ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ ‘న్యూస్ ఆన్ ఎయిర్’లో ఆల్ ఇండియా రేడియోకు సంబంధించిన 240 రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం90 దేశాల్లో శ్రోతలు ఉన్నారు. మే 15-31వ తేదీల మధ్య ఈ యాప్లోని సేవల ర్యాంకులను ప్రసార భారతి విడుదల చేసింది. న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో సర్వీసుల్లో వివిధ భారతి మొదటి స్థానంలో నిలిచింది. నగరాల వారీగా చూస్తే ‘న్యూస్ ఆన్ ఎయిర్’యాప్ సేవలు వినియోగించిన నగరాల్లో పుణె, బెంగళూరు, హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా పొందిన సేవల్లో వివిధ భారతి నేషనల్ మొదటి స్థానంలో, ఎఫ్.ఎం.రెయిన్ బో విజయవాడ రెండో స్థానం, ఆలిండియా రేడియో(ఏఐఆర్) తెలుగు 3వ స్థానంలో, ఏఐఆర్ హైదరాబాద్ వీబీఎస్ 4వ స్థానంలో, హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్ బో 5వ స్థానంలో నిలిచాయి. వీబీఎస్ విజయవాడ, ఏఐఆర్ హైదరాబాద్ ఏ, ఏఐఆర్ విశాఖ పీసీ, ఏఐఆర్ కర్నూలు సేవలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. -
లాన్సెట్ సంచలన నివేదిక: గాలి ద్వారానే కోవిడ్ అధిక వ్యాప్తి
వాషింగ్టన్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్ నిండి ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే వైరస్ క్రిములు ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయని బ్రిటన్, అమెరికా, కెనడా సైంటిస్టులు సంయుక్తంగా చేసిన అధ్యయంనలో వెల్లడైంది. అందుకే కరోనాను గాలి ద్వారా వ్యాపించే వైరస్ (ఎయిర్ బోర్న్) అని ప్రకటించాలని వారు సూచిస్తున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి అధికంగా ఉందనేందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు వారు స్పష్టం తెలిపారు. యుద్ధ ప్రాదికన చర్యలు చేపట్టి కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), ఇతర వైరస్ పీడిత దేశాలకు వారు సూచనలు చేశారు. రీసెర్చ్లో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించిన పలు జర్నల్స్ను సమీక్షించారు. గాలి ద్వారానే కోవిడ్ అధిక మొత్తంలో వ్యాప్తి చెందుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని లాన్సెట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. సైంటిస్టుల నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కరోనా గాలి ద్వారానే వేగంగా వ్యాప్తి ►మనుషుల ప్రవర్తన, ఇంటరాక్షన్, గది సైజు వెంటిలేషన్ వంటి అంశాలు వైరస్ వ్యాప్తిలో కీలకం. ►మనుషులు ఒకరినొకరు కలుసుకోకుండా క్వారంటైన్లో ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ►ఎవరైతే దగ్గకుండా, తుమ్మకుండా ఉన్నారో వాళ్ళలో కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా, 33 నుంచి 59 శాతం ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇదో కారణం. ►బయట కంటే కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ►కరోనా రాకుండా ఉండడానికి చాలా చోట్ల పీపీఈ కిట్స్ ని ధరించారు. అలా ధరించిన ప్రదేశాలలో కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ►నిపుణులు కనుగొన్న దాని ప్రకారం గాలిలో మూడు గంటల పాటు ఈ వైరస్ ఉంటుంది. ►కరోనా వైరస్ ఎయిర్ ఫిల్టర్ లలో, శుభ్రం చేసినప్పటికీ ఆసుపత్రుల బిల్డింగ్ మూలల్లో వైరస్ తిష్ట వేసుకుని ఉంటుంది. ►పెంపుడు జంతువుల ఆవాసాల్లో కూడా కరోనా వైరస్ గుర్తింపు. ►ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు ( చదవండి: గడ్డకడుతున్న రక్తం.. అమెరికాలో జాన్సన్ టీకా నిలిపివేత ) -
గాల్లోని తేమ నీరవుతుంది ఇలా..
భూమిపై నీటి వనరులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధకులు ఎప్పటినుంచో ప్రయోగాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గాల్లోంచి నీటిని ఒడిసిపట్టేందుకు ఇప్పటికే బోలె డన్ని యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటన్నింటికీ కరెంటు కావాలి. భారీ సైజు యంత్రాలూ కావాలి. పెద్ద పెద్ద తెరలు అవసరమవుతాయి. అయితే ఇవేవీ లేకుండానే గాల్లోని ఆవిరిని నీరుగా మార్చేయవచ్చని అంటోంది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్). ప్రత్యేకమైన ప్లాస్టిక్ పోగులు, సూక్ష్మ రంధ్రాలతో అత్యధిక ఉపరితలాన్ని కలిగిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లతో ఈ అద్భుతాన్ని సాధించవచ్చని ఎన్యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. కిలో ఏరోజెల్తో రోజుకు 17 లీటర్ల నీరు.. ఈ పద్ధతిలో ఒక కిలో ఏరోజెల్ పదార్థంతో రోజుకు 17 లీటర్ల నీటిని పొందొచ్చు. ఈ పదార్థం ఒక స్పాంజ్ మాదిరిగా గాల్లోని తేమను కాస్తా నీరుగా మారుస్తుంది. ఈ పదార్థం సేకరించిన నీటిని స్పాంజ్ మాదిరిగా పిండి సేకరించాల్సిన అవసరం లేదు. తగుమోతాదులో నీరు చేరిన వెంటనే దానంతట అదే నీరు బయటకు వచ్చేస్తుంది. ఏరోజెల్లోని పదార్థాలు నీటి అణువులను ఆకర్షించడం.. వికర్షించడం రెండూ చేయగలగడం దీనికి కారణం. ఏరోజెల్ను ఎండలో ఉంచినప్పుడు దాని పనితీరు మరింత మెరుగ్గా ఉందని, సేకరించిన ఆవిరిలో 95 శాతాన్ని నీరుగా మారుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ హో గిమ్ వీ తెలిపారు. పంటకు పూత.. చీడకు చెక్! చీడపీడలు ఆశిస్తే పంట నాశనమవుతుంది. రసాయనాలతో క్రిమికీటకాలను చంపేసి పంటను కాపాడుకుందామంటే.. పర్యావరణానికి ముప్పు కలుగుతుం ది. అయితే దీనికి క్రాప్కోట్(పంట పూత)ను ప్రత్యామ్నాయంగా పేర్కొంటోంది కాలిఫోర్ని యాకు చెందిన స్టారప్ కంపెనీ క్రాప్ ఎన్హ్యాన్స్మెంట్! ఈ కంపెనీ తయారు చేసిన పదార్థాన్ని పంటలపై పిచికారీ చేస్తే.. చీడపీడలకు పంట అస్సలు కనపడకుండా పోతుందట! క్రాప్ ఎన్హ్యాన్స్మెంట్ కంపెనీ చెట్ల నుంచి వెలికితీసిన ఒక పదార్థాన్ని నీటితో కలిపి వాడుతుందట. పంటలపై ఈ పదార్థాన్ని పిచికారి చేస్తే.. 12 నుంచి 24 గంటల్లో నీరు మొత్తం ఆవిరైపోతుంది. చెట్ల నుంచి వెలికితీసిన పదార్థపు పూత పంటలపై నిలిచిపోతుంది. ఈ పూత కాస్తా మొక్కలను చీడపీడలకు కనపడకుండా చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఎలా అన్న ప్రశ్నకు కంపెనీ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కానీ... ప్రత్యేక పదార్థపు పూత పూసిన మొక్కల ఉపరితలాలను ఆహారంగా, పునరుత్పత్తి కేంద్రాలుగా క్రిమికీటకాలు గుర్తించడం లేదన్న విషయం తమకు స్పష్టమైందని కంపెనీ సీటీవో దామియన్ హాడుక్ తెలిపారు. క్రిమి కీటకాలను బట్టి పరిస్థితి మారుతోందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి తాము అభివృద్ధి చేసిన పూత 6 వారాల పాటు పనిచేస్తుందని వివరించారు. మొక్కలకు, జంతువులకు నష్టం లేదు! ప్రత్యేక పదార్థపు పూత పూసినప్పటికీ మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హాడుక్ చెప్పారు. మొక్కకు, మనుషులకు, జంతువులకు ఈ పూత ద్వారా ఎలాంటి నష్టమూ ఉండదన్నారు. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఇండోనేసియా, ఆఫ్రికా, యూరప్లలో తాము క్షేత్ర స్థాయి పరిశీలనలు నిర్వహించామని చెప్పారు. -
ఇచట గాలి నుంచి నీరు తయారు చేయబడును
వాషింగ్టన్ : వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అంటారు. రెండోదాని సంగతి ఏమిటోగానీ వాన రాకడను మనమే డిసైడ్ చేసే రోజులు రానున్నాయనేదానికి ఈ వాటర్ జనరేటర్ చిన్న ఉదాహరణ. అడ్వాన్స్డ్ ఎయిర్–టు–వాటర్ టెక్నాలజీతో గాలి నుంచి నీరు తయారు చేసే యంత్రానికి రూపకల్పన చేసింది కాలిఫోర్నియాకు చెందిన స్కైసోర్స్, స్కై వాటర్ అలయెన్స్. వెడ్యు (వుడ్–టు–ఎనర్జీ డిప్లాయబుల్ ఎమర్జెన్సీ వాటర్)అనే ఈ యంత్రం నుంచి మంచినీరు తయారు చేయడానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. సింపుల్గా మనకు అందుబాటులో ఉన్న ఎండుపుల్లలు, ఎండిన పండ్లతొక్కలు, ఎండిన కొబ్బరి పెంకులు, పొట్టు....మొదలైనవి యంత్రంలో వేసి వేడెక్కిస్తే నీటి ఆవిరి ద్వారా జనరేటర్ స్వచ్ఛమైన మంచినీటిని తయారు చేస్తుంది. ఈ మొబైల్ వాటర్ జనరేటర్ను ఎలాంటి వాతావరణంలోనైనా ఉపయోగించవచ్చు. సోలార్, బ్యాటరీ సిస్టంతో కూడా ఈ యంత్రం పని చేస్తుంది. రోజుకు రెండు వేల లీటర్ల స్వచ్ఛమైన నీటిని తయారు చేసే ఈ వాటర్ జనరేటర్ను ప్రస్తుతం శరాణార్థి శిబిరాలు, కరువు ప్రభావిత ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు. (చదవండి: సముద్రపు నీరు మంచి నీరుగా..) -
ఇంటి మీద బెంగ తీర్చే ‘ఎయిర్ బాటిల్’
లండన్ : వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్ చూశాం.. వాడుతున్నాం కూడా. కానీ గాలి బాటిల్స్(గాలితో నింపిన) గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు కదా. అయితే ఇది చదవండి. యూకేలోని ఓ కంపెనీ ఈ వినూత్న ఆలోచన చేసింది. హోమ్సిక్ ఫీలవుతున్న వారి కోసం ఈ గాలి బాటిళ్లని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. హోమ్సిక్కి, ఈ గాలి బాటిల్కి సంబంధం ఏంటో ఆ కంపెనీ మాటల్లోనే వినండి.. ‘కొత్త కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇక మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే చాలా దేశాలు ప్రయాణాలపై బ్యాన్ విధించాయి. దాంతో చాలా మంది ఇంటికి దూరంగా విదేశాల్లో చిక్కుకుకుపోతున్నారు. రోజుల తరబడి ఇలా స్వస్థలానికి దూరంగా ఉంటే ఇంటి మీద బెంగ పెట్టుకుంటారు. ఇంటి వాసనను మిస్ అవుతారు. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి ప్రాంతానికే చెందిన గాలిని ఇలా బాటిళ్లలో నింపి వారికి అందిస్తాం. ఇక ఇల్లు గుర్తుకొచ్చిన ప్రతి సారి ఈ గాలి వాసనను పీల్చితే.. ఇంటి మీద బెంగ తీరుతుంది’ అని తెలిపింది. (చదవండి: కొబ్బరి నూనె... బుల్లెట్ కాఫీ.. ) ‘ఇక దీనిలో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన గాలిని 500 మిల్లిలీటర్లు, లీటరు బాటిళ్లలో నింపుతాం. సొంత ఊరి గాలి పీల్చాలని భావించే వారు ఆర్డర్ చేస్తే వారికి ఈ బాటిల్స్ని డెలివరి చేస్తాం. ఇక ఆఫ్ లీటర్ గాలి బాటిల్ ధర వచ్చి 33 అమెరికన్ డాలర్లు (2,434 రూపాయలు) మాత్రమే’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నుంచి "ప్రామాణికమైన" గాలి బాటిళ్లను విక్రయిస్తోంది. విదేశాలలోని యూకే నివాసితులకు ఇంటి సువాసనను అందిస్తుంది. ఇక దీన్ని ఎలా వాడాలి అంటే బాటిల్ మీద కార్క్ స్టాపర్ ఉంటుంది. ఇంటి మీదకు ధ్యాస మళ్లితే.. దాన్ని తీసి.. ఆ వాసనలు పీల్చితే సరి. ఇక కస్టమర్ అభ్యర్థనల మేరకు దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన గాలిని అయినా సరే ఇలా బాటిల్లో నింపి డెలివరి చేస్తాం అంటుంది సదరు కంపెనీ. ఇక ఇప్పటికే కెనడియన్ కంపెనీ విటాలిటీ ఎయిర్ రాకీ పర్వతాల తాజా గాలిని చైనా కొనుగోలుదారులకు అందిస్తుంది. రెండు 8 లీటర్ బాటిల్స్ ధర వచ్చి 52.99 డాలర్లు(4,129.97 రూపాయలు). ఇక మరో స్విస్ కంపెనీ స్విస్బ్రీజ్ సెంట్రల్ యూరోపియన్ దేశాల గాలిని 20 డాలర్లకి(1,475 రూపాయలు)విక్రయిస్తుంది. మొత్తానికి ఈ గాలి బాటిళ్ల వ్యాపారం బావుంది కదా. -
ఇవి తగినంత ఉంటే కరోనాకు చెక్
సాక్షి.హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలతో పోల్చితే గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనే వెల్లడైన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో జనం గుమిగూడినప్పుడు మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా వెలువడే తుంపర్లు సమీపంలో ఉన్న వారిని తొందరగా చేరుకుంటాయి. ఫలితంగా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. అయితే, ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్–19’అధ్యయనంలో వెల్లడైంది. ఇదీ అధ్యయనం: గాలి ద్వారా ‘ఏరోసోల్స్’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్ మోడల్ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలు జనసమూహాలు ఉండే ప్రదే శాల్లోనూ కోవిడ్ మహమ్మారి నియంత్రణకు ఉపయోగపడతాయని వారు పేర్కొంటున్నారు. చదవండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు -
గాల్లో కరోనా వ్యాప్తిపై సీసీఎంబీ శోధన
హైదరాబాద్: కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఆసుపత్రి వాతావరణంలో ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సిద్ధమ య్యారు. వైరస్ గాలి ద్వారా ఎంత దూరం ప్రయాణించగలదు? ఎంత సమయం గాల్లో ఉండగలదు? వైరస్ బారిన పడ్డ వ్యక్తి నుంచి వెలువడ్డవి ఎంత సమయం ఉండగలవు? అన్న అంశాలన్నింటినీ ఈ పరిశోధనల ద్వారా తెలుసుకోనున్నారు. సుమారు పది రోజుల క్రితమే ఈ పరిశోధన మొదలైంది. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించగలదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఓ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం తాము ఆసుపత్రి వాతావరణంలో వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్నామని, దీని ఫలితాల ఆధారంగా బ్యాంకు, షాపింగ్మాల్స్ వంటి ప్రాంతాలపై పరిశోధనలు చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆసుపత్రి వాతావరణంలో జరిగే పరిశోధన కోసం ఐసీయూ, కోవిడ్ వార్డు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పరికరం సాయంతో గాలి నమూనాలు సేకరిస్తామని రోగికి రెండు నుంచి ఎనిమిది మీటర్ల దూరం నుంచి సేకరించిన నమూనాలతో పరిశోధనలు చేస్తామని వివరించారు. వైరస్ ఎంత దూరం ప్రయాణించగలదో నిర్వచించగలిగితే ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కల్పించే విషయంలో మార్పులు చేర్పులు చేయవచ్చునని చెప్పారు. -
తేమ నియంత్రణతో కరోనా కట్టడి
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం, మాస్కులు తొడుక్కోవడంతో పాటు భవనాల్లోపలి గాల్లోని తేమను నియంత్రించడం కూడా ముఖ్యమని భారత్ – జర్మనీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, బస్సులు, రైళ్లు వంటి రవాణా వ్యవస్థల్లో గాల్లోని తేమ శాతాన్ని 40 – 60 శాతానికి పరిమితం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చునని ఇరు దేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ద్వారా తెలిసింది. సీఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, జర్మనీలోని లిబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రోపోస్ఫియర్ రీసెర్చ్లు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ఏరోసాల్ అండ్ ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గాల్లోని తేమశాతం ఐదు మైక్రోమీటర్ల కంటే తక్కువ సైజున్న తుంపర్లలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతుందని, ఉపరితలాలపై వైరస్ ఉనికికి, అది నిర్వీర్యమయ్యేందుకూ కీలకమని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ‘‘గాల్లోని తేమ 40 శాతం కంటే తక్కువ ఉంటే కోవిడ్ బారిన పడ్డ వారు వదిలే తుంపర్లలోని కణాలు తక్కువ నీటి కణాలను ఆకర్షిస్తాయి. ఫలితంగా తేలికగా ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీనివల్ల ఇతరులకు సోకే అవకాశమూ ఎక్కువ అవుతుంది’’అని లిబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రోపోస్ఫియర్ రీసెర్చ్ శాస్త్రవేత్త అజిత్ వివరించారు. గాల్లో తేమ తక్కువగా ఉంటే ముక్కు లోపలి పొరలు కూడా పొడిగా మారతాయి, వైరస్ ఎక్కువగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. తేమశాతం ఎక్కువగా ఉంటే తుంపర్లు వేగంగా బరువెక్కి నేల రాలిపోతాయన్నారు. -
గాలి ద్వారా కరోనా.. !?
జెనీవా/ న్యూయార్క్: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కొట్టిపారేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన స్వరం మార్చింది. వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంటోంది. దీనిపై మరిన్ని బలమైన ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందంది. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం కరోనా సూక్షా్మతి సూక్ష్మ క్రిములు (5 మైక్రాన్ల కంటే చిన్నవి) గాలిలో ఒక మీటర్ పరిధిలో విస్తరించి చాలా ఎక్కువ సేపు ఉంటాయని, ఆ గాలి పీల్చే వారికి వైరస్ సోకుతుందని డబ్ల్యూహెచ్ఓకి ఒక లేఖ రాశారు. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ టెక్నికల్ లీడ్ బెనెడెట్టా అలెగ్రాంజి గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు మాత్రమేనన్నారు. వైరస్ గాలిలో ఎంతసేపు ఉంటుందో, ఆ సమయంలో మరొకరికి సోకే అవకాశం ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉందని చెప్పారు. ఒకవేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశమే ఉంటే డబ్ల్యూహెచ్ఓ తన మార్గదర్శకాలను సవరించుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు కోవిడ్ రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మి నప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఒ చెబుతున్న విషయం తెలిసిందే. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్లో కోవిడ్ విజృంభిస్తున్న వేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్ఒ చేసిన ప్రకటన ప్రభుత్వం, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని రుజువైతే మాస్కులు ధరించడం అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధరించే ఎన్–95 మాస్కులు సాధారణ ప్రజలు కూడా వాడాల్సిన అవసరం రావచ్చునని, జనం గుమిగూడే కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాపిస్తుందన్న అధ్యయనాలివే.. ► వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని మొదటిసారిగా నేచర్ పత్రిక ప్రచురించింది. ఆస్పత్రిలో కారిడార్లలో కంటే చిన్న గదుల్లో, టాయిలెట్లలో గాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ► అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఈజేఎం) ఏప్రిల్లో నిర్వహించిన అధ్యయనంలో వైరస్ గాలిలో మూడు గంటల వరకు ఉంటుందని తేలింది. ► రోగులు మాట్లాడేటప్పుడు అత్యధికంగా తుంపర్లు బయటకు వస్తే గాల్లో ఎక్కువ సేపు వైరస్ ఉంటోందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మేలో చేసిన అధ్యయనంలో తేలింది. -
కరోనాపై మరో బాంబు పేల్చిన ఆరోగ్య సంస్ధ
-
గాలి ద్వారానూ కరోనా?
న్యూయార్క్: కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. దగ్గు, తుమ్ముల నుంచి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకూ చెబుతూండగా.. గాలి ద్వారా సోకుతుందని, అతి సూక్ష్మ స్థాయి కణాలూ వైరస్ను మోసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు ప్రకటించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలింపుతో ప్రజలు బార్లు, కార్యాలయాలు, మార్కెట్లలో గుమికూడటం ఎక్కువైందని, దంతో రోగుల వారి సమూహాలు పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్నిబట్టి కరోనా వైరస్ గాల్లో ఎక్కువకాలం మనగలగడమే కాకుండా ఇతరులకు సోకుతోందని అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్వో ఇచ్చే సలహా, సూచనల్లో మార్పులు చేయాలని వారు కోరారు. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్ఓ అది కేవలం దగ్గు, తుమ్ముల ద్వారా తుంపర్లతోనే ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పడం తెల్సిందే. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ను నియంత్రించవచ్చునని ఆ సంస్థ అందరికీ సూచనలు కూడా చేసింది. అయితే గత నెల 29న మాత్రం వైద్య ప్రక్రియల సమయంలో వెలువడే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ సైజున్న తుంపర్ల ద్వారా వైరస్ సోకే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భవనాల లోపల కూడా, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ద్వారా సోకుతుందన్న సమాచారానికి ప్రాధాన్యమేర్పడింది. భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలకు సాధారణ మాస్కుల స్థానంలో అతిసూక్ష్మమైన కణాలను అడ్డుకోగల ఎన్95 మాస్కులు ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో వెంటిలేషన్ వ్యవస్థలను సరిచేసుకోవాల్సి ఉంటుందని, అతినీలలోహిత కిరణాల సాయంతో భవనాల్లోపల శుద్ధి చేసుకోవడం మేలని డాక్టర్ బెనెడెట్టా అలెగ్రాంజీ తెలిపారు. -
గాలిలోని తేమతో విద్యుత్తు!
గాల్లోని తేమను నీటిగా మార్చే యంత్రాల గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు. ఇవి మారుమూల ప్రాంతాల్లోనూ ఎడారుల్లోనూ ప్రజల దాహార్తిని తీర్చగల సామర్థ్యం ఉన్నవి. అయితే గాల్లోని ఈ తేమను నీటిగా కాకుండా విద్యుత్తుగా మార్చవచ్చునని అంటున్నారు మసాచూసెట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఎయిర్ జెన్ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీలో నానోస్థాయి తీగలున్న పలుచటి పొరలాంటిది ఉంటుంది. మిల్లీమీటర్లో పదివేల వంతులు తక్కువ సైజుండే పొరకు ఇరువైపులా రెండు ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఒకవైపున ఉన్న ఎలక్ట్రోడ్ పొరలో కొంతభాగం మాత్రమే ఉంటే మిగిలినది గాల్లో ఉంటుంది. మరోవైపు జియోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రొటీన్లతో తయారైన నానో తీగలు విద్యుత్తు వాహకాలుగా పనిచేస్తాయి. ఈ యంత్రంలోకి గాలి ప్రవేశించినప్పుడు అందులోని తేమ, నానోతీగలపై ఉండే సూక్ష్మ రంధ్రాల కారణంగా రెండు ఎలక్ట్రోడ్ల మధ్య కరెంటు పుడుతుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన నమూనా పరికరం ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పనిచేయించవచ్చునని, సహారా వంటి ఎడారి ప్రాంతాల్లోనూ ఇది సాధ్యమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డెరెక్ లవ్లీ తెలిపారు. తాజాగా తాము ఈ–కోలీ బ్యాక్టీరియా ద్వారా మరింత ఎక్కువ ప్రొటీన్ను ఉత్పత్తి చేయగలిగామని, దీనిద్వారా స్మార్ట్ఫోన్లలోని బ్యాటరీలకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయవచ్చునని అంచనా వేస్తున్నట్లు డెరెక్ తెలిపారు. అంతిమంగా భారీసైజున్న విద్యుదుత్పత్తి పరికరాలను తయారు చేయడం తమ లక్ష్యమన్నారు. -
ఆకాశవాణిలో దొంగలు పడ్డారు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ఢిల్లీ కేంద్రంలో దొంగలు పడ్డారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ని ఆకాశవాణి కేంద్రంలో విలువైన రాగి వైర్లను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. 300 ఎకరాలలో విస్తరించి ఉన్న ఆల్ ఇండియా రేడియో హై పవర్ ట్రాన్స్మిషన్ ఏరియల్ ఫీల్డ్ వద్ద రాగి తీగను దొంగిలించిన కేసులో షాన్ మొహమాద్ (24), షాజాద్ (26), అభిషేక్ (22) అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వద్ద నుంచి మొత్తం 200 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కొట్టేసిన వైర్లను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్క్రాప్ డీలర్ మొహమద్ (26) ను కూడా అరెస్టు చేశారు. అతని నుండి రాగి తీగల కట్టలను స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలు దాడులు నిర్వహించిన తరువాత ఉమేద్ (33), అక్షయ్ (22) అనే మరో ఇద్దర్ని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఏఐఆర్లో రాగి తీగలను దొంగిలించి, తక్కువ ధరలకు స్క్రాప్ డీలర్లకు విక్రయించడమే వీరి పని అనీ, మరో ముగ్గురు వ్యక్తుల కోసం వేట కొనసాగుతోందని, దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
కాస్ట్ కటింగ్ సెగ : ఆకాశవాణి జాతీయ ఛానెల్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో జాతీయ చానల్కు కాస్ట్ కటింగ్ సెగ తాకింది. ఆకాశవాణి జాతీయ ఛానల్ ప్రసారాలు హేతుబద్దీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్) జాతీయ ఛానల్ను మూసివేయాలని ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి నిర్ణయించింది. ఈ మేరకు ప్రసారభారతి తన నిర్ణయాన్నిడిసెంబరు 24న ఎఐఆర్ డైరెక్టరేట్కు తెలిపింది. ఇందుకోసం గత ఏడాది పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించింది. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఐదు నగరాలు, అహ్మదాబాద్ హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేయనుంది. జాతీయ చానెల్ ద్వారా భద్రపరిచే కార్యక్రమాల ఆర్కైవ్స్ను, డిజిటలైజేషన్కోసం ఢిల్లీలోని సెంట్రల్ ఆర్కైవ్స్ సెంటర్కు పంపించాలని జనవరి 3, 2019 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. జాతీయ ఛానల్కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు బలహీనంగా ఉండటం కూడా మూసివేతకు కారణమని ఏఐఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నాగపూర్లో ఉన్న ఒకే ఒక ట్రాన్స్మీటరు మాత్రమే ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. అలాగే పటిష్టమైన శ్రోతల ప్రాతిపదిక లేని ఛానల్లో పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని సీనియర్ నిర్వాహకులు భావించారని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్ వెబ్సైట్ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐఆర్లోని కొన్ని విభాగాలు ఈ నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఛానల్ ప్రసారాలు చాలా ముఖ్యమైన భాగమని, మొత్తంగా దాన్ని మూసివేయడం కంటే ఖర్చులను తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి కాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు జాతీయ ప్రసారాలు ప్రసారమయ్యే నేషనల్ చానల్ 1987లో ప్రారంభమైంది. 31 సంవత్సరాలకుపైగా జాతీయ వార్తలను, కీలక అంశాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన కీలక పాత్ర పోషించింది. -
ఆత్మతత్త్వమే దైవత్వం
‘ముండకోపనిషత్తు‘లో చెప్పినట్లుగా ప్రాణం, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి భగవంతునిలో రూపుదిద్దుకున్నాయి. ఆ రూపాల్లో అతనే నిబిడీకృతమై ఉన్నాడు. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడైనా పదార్థం పుడుతుంది.అవి తిరిగి శక్తిని వెదజల్లుతూ పదార్థ రూపాన్ని కోల్పోతాయి.ఉదహరణకు కర్రను తీసుకుని, జ్వలింపజేస్తే ఉష్ణం, కాంతి, శబ్దం, వాయువు తదితరాలుగా విఘటనం చెందుతూ వివిధ శక్తి రూపాలలోకి మారిపోతుంది.జీవ పదార్థాలు పంచభూతాల మేలిమి కలయిక అనుకున్నాం. ఉదాహరణకు నాచును తీసుకుంటే, సముద్రం లోపల కాంతి ప్రసరించే స్థలంలోనే నాచు ఏర్పడుతుంది. అక్కడే ఏర్పడటానికి కారణం సూర్యరశ్మి, జలం, భూమి, వాయువు, వీటిలో అంతర్లీనంగా ఉన్న ఆకాశం. ఇదే విషయాన్ని భౌతిక పదార్థాలు, శక్తుల విషయంలో అన్వయించుకుంటే, విద్యుచ్ఛక్తి ప్రసరిస్తేనే బల్బులు వెలుగుతాయి. విద్యుచ్ఛక్తి ఆగిపోతే బల్బులు వెలగడం మానేస్తాయి. విద్యుచ్ఛక్తి, బల్బులు అనేవి భౌతిక పదార్థాలైన నిర్జీవాలు.కానీ, జీవి విషయంలో విద్యుచ్ఛక్తి లాంటి శక్తి జీవి జీర్ణాశయంలో తయారౌతూ ఉంటుంది.ఆ శక్తి ప్రసారం కావడానికి రక్తం లాంటి అవయవాలు తోడ్పడతాయి.బల్బులో ఫిలమెంట్ తెగిపోతే వెలగదు. అలాగే జీవిలో ముఖ్య అవయవాలు పనిచేయకపోతే ప్రాణం నిలవదు. అంతేగాని, ప్రాణం ఎక్కడికో వెళ్లదు. అది ఒకానొక శక్తిరూపం.‘కేనోపనిషత్తు‘ మెరుపులోనున్న శక్తిలో, జీవిలోనున్న ప్రాణశక్తిలో ఉన్నది ఆత్మేకదా అంటుంది. ప్రాణం అనేది విద్యుచ్ఛక్తి, కాంతి శక్తి, ఉష్ణశక్తుల లాంటి ఒకానొక శక్తిరూపం మాత్రమే. అది శరీరమనే పదార్థంలో నిండుగా ఉంటుంది. ఇక్కడ శరీరమే ప్రాణశక్తిని తయారు చేసుకుని జీవనం సాగిస్తుంది. ముదిమిలో అలసిన శరీరం ప్రాణశక్తిని సృష్టించుకోలేక నిశ్చలమైపోయి, పంచ భూతాలుగా విఘటనం చెందుతుంది. అంతేగాని, ప్రతీ జీవికో ప్రత్యేక ఆత్మ అనేది ఉండదు. కర్మఫలాలను మన ప్రాణం మోసుకెళ్లలేదు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న సాధకుడు తనలోని అంతర్యామి, తనను ఆవరించి ఉన్న సర్వాంతర్యామి అభేదమని గుర్తెరిగి తోటిజీవులన్నింటి పట్లా ప్రేమను, ఆరాధ్య భావననూ కలిగి, ఆనందాన్ని గ్రోలుతూ ఉంటాడు. – గిరిధర్ రావుల -
#మీటూ సెగ ఆకాశవాణికి
భోపాల్: మీటూ ఉద్యమం ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ని తాకింది. స్టేషన్ మధ్యప్రదేశ్ షాదోల్ రేడియో స్టేషన్లో తొమ్మిది మంది మహిళా క్యాజువల్ ఉద్యోగులు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. సహాయక డైరెక్టర్ (ప్రోగ్రామింగ్) రత్నాకర్ భారతిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో వీరు బహిరంగంగా వెలుగులోకి వచ్చారు. అయితే నిందితులపై చర్యలకు బదులుగా ఫిర్యాదు చేసిన మహిళలపై వేటు వేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతవుతుండగా ఏఐఆర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొమ్మది మంది క్యాజువల్ బ్రాడ్కాస్టర్స్ రత్నాకర్పై సంబంధిత ఏఐఆర్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏఐఆర్ అంతర్గత విచారణ కమిటీ రత్నాకర్ను దోషిగా తేల్చింది. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఉద్యోగ సంఘం ఆరోపించింది. పైగా ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన తొమ్మిది మంది మహిళలపై వేటు వేయడం అన్యాయమని వాదించింది. ధర్మశాల, ఓబ్రా, సాగర్, రాంపూర్,కురుక్షేత్ర, ఢిల్లీ స్టేషన్లలో కూడా లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇక్కడ కూడా దాదాపు ఇలాంటి చర్యలే రిపీట్ అయ్యాయని ఏఆఐర్ ట్రేడ్ యూనియన్ వాదన. నేరస్తులకు చిన్నపాటి హెచ్చరిక చేసి వదిలేశారు. అలాగే క్యాజువల్ బ్రాడ్కాస్టర్స్ను రిజైన్ చేయమని కోరారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఫయాజ్ షెహ్రార్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రతి ఫిర్యాదును ఇంటర్ కంప్లైంట్స్ కమిటీ విచారించిందని తెలిపారు. ఈ క్రమంలో షాదోల్ ఫిర్యాదులను విచారించి రత్నాకర్ను బదిలీ చేశామని ఫయాజ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన డీజీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన కఠినమైన నిఘా పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. అలాగే మహిళా ఉద్యోగుల తొలగింపునకు, లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. వారి ఫెర్ఫామెన్స్ వార్షిక సమీక్ష ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇది ఇలావుంటే ఈ వ్యవహారంపై స్పందించిన ఆల్ ఇండియా రేడియో ట్రేడ్ యూనియన్ మరో అడుగు ముందుకేసింది. షాదోల్తో పాటు ఇతర 6 స్టేషన్లలో వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతోపాటు తొలగించిన మహిళా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రసారభారతి సీఈవో శశిశేఖర్ వెంపటికి ఒక లేఖ రాసింది. -
మీ ఇల్లు చల్లగుండ
ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉండాలి. ఖర్చు ఎక్కువ కాకుండానే వీచే గాలి హాయి గొలపాలి. వేసవి ఎండల్లో ఇంట్లోని ఉక్కపోతకు, వడ గాడ్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి. ♦ ఎండ వేళలో కిటికీలకు మందంగా ఉండే కర్టెన్లను వాడాలి. దీని వల్ల 30 శాతం వేడి గాలిని నిరోధించవచ్చు. ♦ వాడకంలో లేని గదులను, వాటి తలుపులను మూసి ఉంచాలి. దీని వల్ల చల్లదనం త్వరగా తగ్గిపోదు. ♦ టేబుల్ ఫ్యాన్ ముందు (గాలికి ఎదురుగా) ఐస్ ముక్కలు వేసి ఉన్న పాత్ర ఒకటి ఉంచితే దాని మీదుగా వీచే గాలి చల్లగా ఉంటుంది. గది కూడా చల్లబడుతుంది. ♦ రెడీమేడ్ పరుపులు, దిండ్లు వాటి మీద వాడే సింథటిక్ దుప్పట్లు కూడా వేడిని పెంచుతాయి. వీటి స్థానంలో కాటన్ పరుపులు, దుప్పట్లను చేర్చాలి. ♦ కూలర్ గాలి నేరుగా ఒంటికి కాకుండా నేలకు తగిలేలా సెట్ చేసుకోవడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. అలాగే నేల మీద పడక వేడిని తగ్గిస్తుంది. ♦ క్యాండిల్స్, ఫ్లోరోసెంట్ బల్బులను ఈ కాలం వాడకపోవడం ఉత్తమం. ♦ చివరిగా.. మీ ఇంట్లో మొక్కలున్నాయా? పెరట్లోవి సరే. ఇంట్లో కిటికీల దగ్గర, కర్టెన్ల దగ్గర! వాటి వల్ల కూడా మీ ఇల్లు కూల్గా ఉంటుంది. -
వాయువు ఆయువు తీస్తోందా?
గుండెల నిండా గాలి పీల్చుకోవాలంటే భయం.. ముఖానికి మాస్క్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే వణుకు.. ప్రాణాధారమైన వాయువే.. ఆయువు తీసేస్తుందేమోనన్న ఆందోళన.. ఎందుకో తెలుసా..? అంతా కాలుష్యం మరి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా జాబితా ప్రకారం.. భూమ్మీద వాయు కాలుష్యం అధికంగా ఉన్న 20 నగరాల్లో 14 భారత్లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే తెలిసిపోతుంది. మరి గాలిలో ఉండే కాలుష్యాలు ఏమిటి, ఏ కాలుష్యంతో ఏం ప్రమాదమో తెలుసుకుందామా.. ఓజోన్ వాహనాల పొగ నుంచి వచ్చే నైట్రస్ ఆక్సైడ్లు, సూర్యరశ్మి సమక్షంలో కొన్ని రకాల వాయువులతో కలిసినప్పుడు ఓజోన్ ఏర్పడుతుంది. భూమి చుట్టూ ఆవరించి రక్షణ ఛత్రంగా ఉపయోగపడే ఈ ఓజోన్.. ఇక్కడ మాత్రం ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దానివల్ల ఆస్తమా ఇబ్బందులు ఎక్కువైపోతాయి. గొంతు సమస్యలు కలుగుతాయి. దగ్గు, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.. చివరికి అకాల మరణాలకూ అది కారణమవుతోంది. ఓజోన్తో మొక్కలు, పంటలకూ నష్టమే. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల నుంచి, కలప, బొగ్గులు మండించినప్పుడు వెలువడే వాయువు కార్బన్ మోనాక్సైడ్. వాహనాల ఇంజిన్లు పాడైనా, వాటి నిర్వహణ సరిగా లేకున్నా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ వాయువు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది. దీనికి ఎక్కువగా ఎక్కువ పీల్చుకుంటే విపరీతమైన తలనొప్పి. తలతిరగడం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి. ఎక్కువ గాఢత కలిగిన కార్బన్ మోనాక్సైడ్ను పీల్చితే మరణానికీ దారి తీస్తుంది. గుండెజబ్బు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. సీసం.. పురాతనమైన పైపులు.. కొన్ని పారిశ్రామిక వ్యర్థాలు, కొన్ని రకాల కృత్రిమ రంగుల నుంచి వెలువడుతుంది. కొంతకాలం కిందటి వరకు పెట్రోలియం ఉత్పత్తుల్లోనూ ఉండేదిగానీ.. ప్రస్తుతం సీసాన్ని తొలగించి శుద్ధి చేస్తున్నారు. సీసం భారలోహం. ఇది పసిపిల్లల్లో మేధోశక్తిని తగ్గిస్తుంది. కొన్నిసార్లు కిడ్నీ సమస్యలకూ కారణమవుతుంది. పెద్దవాళ్లలో గుండెజబ్బులకు కారణం. అతిసూక్ష్మ ధూళికణాలు గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళికణాలను పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) అంటారు. పరిమాణాన్ని బట్టి ఇది పీఎం 10, పీఎం 2.5 అని రెండు రకాలు. వీటిలో పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి, రోడ్ల నిర్మాణాల సమయంలో, శిలాజ ఇంధనాల్ని మండించినప్పుడు ఈ పీఎం 2.5 కణాలు గాలిలోకి చేరుతాయి. శ్వాస తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దీంతో శ్వాసకోశ, ఉబ్బసం సమస్యలు ఎక్కువవుతాయి. క్షయ వంటి వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంటుంది. ఆర్సెనిక్ కలపను శుద్ధి చేసేందుకు, కొన్ని ఇతర పారిశ్రామిక అవసరాలకు ఆర్సెనిక్ను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోని భూగర్భజలాల్లోనూ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకారి. తాకితే చాలు.. శరీరంలోకి చేరిపోతుంది. నాడీ మండలం, జీర్ణ వ్యవస్థలతోపాటు పునరుత్పత్తి వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతుంది. ఆస్బెస్టాస్ వాహనాల్లోని క్లచ్లు, బ్రేక్ లైనింగ్లతోపాటు భవన శిథిలాల ద్వారా ఆస్బెస్టాస్ కణాలు గాలిలోకి విడుదలవుతుంటాయి. దీర్ఘకాలం ఈ కాలుష్యానికి గురైతే ఆస్బెస్టోసిస్ వ్యాధి వస్తుంది. ఊపిరితిత్తుల కేన్సర్తోపాటు మెసోథెలియోమా వ్యాధికీ ఆస్బెస్టాస్ కారణమవుతుంది. తాగేనీటి లో కలసి శరీరంలోకి చేరితే.. పేగులు, కడుపు, ఆహార నాళ కేన్సర్లకు దారితీస్తుంది. బెంజీన్ పొగాకు ఉత్పత్తులు, గ్యాస్ స్టేషన్ల నుంచి బెంజీన్ విడుదలవుతుంది. జిగురు తయారీతోపాటు, ప్లాస్టిక్, నైలాన్లోనూ ఇది ఉంటుంది. ఫర్నిచర్ను మెరిపించేందుకు వాడే మైనంలోనూ బెంజీన్ ఉంటుంది. ఇది ఎముక మజ్జలో ఉత్పత్తయ్యే ఎర్ర రక్త కణాలను తగించడంతో రక్తహీనత ఏర్పడుతుంది. తెల్ల రక్త కణాలను, యాంటీబాడీలను కూడా చంపేస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్ శిలాజ ఇంధనాల వినియోగంతో సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశముంది. దీన్ని పీలిస్తే ఉబ్బసం సమస్య తీవ్రతరమవుతుంది. సల్ఫర్ తాలూకు ఆక్సైడ్లు ఇతర పదార్థాలతో కలసి శరీరం లోలోపలికి చొచ్చుకుపోగల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మీథేన్ చెత్తతో కూడిన ప్రతీచోట మీథేన్ ఉత్పత్తి అవుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్నచోట కూడా ఇది వెలువడుతుంది. మిథేన్ను అధికంగా పీలిస్తే ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. శ్వాస వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 5 శాతం కంటే ఎక్కువ గాఢతతో ఉండే మీథేన్ వాయువుకు మండే స్వభావం అధికంగా ఉంటుంది. -
గాలి కోసం.. విమానం కిటికీ తెరిచాడు
బీజింగ్ : గాలి ఆడట్లేదని కిటికీ తెరిచాడో విమాన ప్రయాణికుడు! ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్జియావో ఎయిర్పోర్ట్లో ఏప్రిల్ 27న చోటు చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. దీని ప్రకారం చెన్(25).. విమానంలోని అత్యవసర ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు. సరిగ్గా విమానం టేకాఫ్ అవుతుందనగా ఉన్నట్లుండి కిటికీ తెరిచాడు. అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా తెరచుకొని లోపలికి గాలి చొచ్చుకొచ్చింది. దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్ధాంతరంగా ఆపేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన సమాధానం పోలీసులను ఆశ్చర్యపరిచింది. తనకు అవగాహన లేకే కిటికీ తెరిచానని, అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా ఓపెన్ అయ్యిందని వెల్లడించాడు. 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70 వేల యెన్లను జరిమానా విధించినట్లు సమాచారం. -
చల్లగాలి కోసం.. బుల్లి యంత్రం!
ఇప్పుడంటే చలికాలం. ఇంకో నాలుగు నెలలు పోనివ్వండి.. ఫ్యానెక్కడ? ఏసీ పనిచేస్తోందా? కూలర్లోకి ఐస్ ఎప్పుడేద్దాం? అని నానా హైరానా పడిపోతాం. వేసవి తాపం అలాంటిది మరి. ఇప్పుడు పై ఫొటో చూడండి. ఈ బుల్లి యంత్రం మీ దగ్గరుంటే ఉక్కపోత అస్సలు ఉండదు. పైగా ఎంత వేడి వాతావరణంలో తిరిగినా ఒళ్లు మాత్రం చల్లగానే ఉంటుంది. పేరు ‘బ్లో’. ఏం మాయ చేస్తుంది ఈ యంత్రం అంటున్నారా? చాలా సింపుల్. మోటార్ కార్లలో సువాసనలు వెదజల్లేందుకు వాడే డిఫ్యూజర్లా ఉంటుంది ఇది. మోటార్ పనిచేసేందుకు ఓ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. కార్లలో మాదిరిగానే డిఫ్యూజర్లో పిప్పర్మెంట్ నూనెను వాడారనుకోండి. సహజంగానే చల్లదనాన్ని ఇచ్చే పిప్పర్మెంట్ నూనెకు గాలి కలిసి ఒళ్లంత చల్లగా అయిపోతుందన్నమాట. షర్ట్ కు తగిలించుకోగలగడం, రీఛార్జిబుల్ బ్యాటరీ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని వాడుకోవచ్చు. బయటి ఉష్ణోగ్రత కంటే కనీసం ఆరు డిగ్రీలు తక్కువ చేస్తుంది ఈ యంత్రం. ముగ్గురు యువకుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ బుల్లి ఏసీ యంత్రం ప్రస్తుతానికి మార్కెట్లోకి రాలేదు. అయితే వాణిజ్యస్థాయి అభివృద్ధికి 5000 డాలర్లు కావాలని కిక్స్టార్టర్లో పిలుపునిచ్చారు. ఆ వెంటనే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిపడటం, ఈ ఉత్పత్తిపై అందరి ఆసక్తి ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
గాల్లోంచి స్వచ్ఛ జలం
యంత్రంతో నీళ్లు పుట్టిస్తారా..? అయ్యే పనేనని.. అనుకుంటున్నారా? ఆలోచన ఉండాలిగానీ.. సాధ్యం కానిదేమీ లేదంటున్నారు ఇజ్రాయెల్కు చెందిన వాటర్ జెన్ వ్యవస్థాపకుడు మాక్సిమ్ పాసిక్! తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ జెన్ కంపెనీ ఓ వినూత్నమైన యంత్రాన్ని సృష్టించింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం జరిగే ఓ కార్యక్రమంలో పాసిక్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ జెన్ అవసరం, ప్రత్యేకతల గురించి ‘సాక్షి’ కథనం.. గాల్లోని తేమను ఒడిసిపట్టి.. తాగునీటి సమస్య పరిష్కారానికి చాలా కంపెనీలు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు, లేదంటే కలుషితమైన నీటిని శుభ్రం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు అభివృద్ధి చేస్తున్నాయి. వాటర్జెన్ మాత్రం అన్నింటికంటే భిన్నంగా.. వినూత్నంగా గాల్లోంచే నీటిని పుట్టించే యంత్రాన్ని అభివృద్ధి చేసింది. గాల్లో రకరకాల వాయువులతోపాటు నీటి ఆవిరి కూడా ఉంటుందన్నది తెలిసిందే. వాటర్ జెన్ యంత్రాలు ఈ తేమను ఒడిసిపట్టి, శుభ్రం చేసి అందిస్తాయి. కొద్దిపాటి కరెంటుతో గాలిని పీల్చుకుని.. అందులోని మలినాలు, ఉష్ణాన్ని తీసేయడం ద్వారా ఈ యంత్రం నీళ్లను సృష్టిస్తుంది. ‘కలుషితమైన నీటిని శుభ్రం చేయడం కంటే.. గాలిని శుభ్రం చేయడం చౌక. అందుకే మేం ఈ టెక్నాలజీని ఎన్నుకున్నాం’ అని మాక్సిమ్ పాసిక్ చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ.. వాటర్ జెన్ యంత్రాలు మన అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల సైజుల్లో లభిస్తాయి. కుటుంబ అవసరాల కోసం రోజుకు 20 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయగల యంత్రంతోపాటు రోజుకు 600, 4,500–6 వేల లీటర్ల నీటిని తయారు చేయగల యంత్రాలను సిద్ధం చేసినట్లు పాసిక్ తెలిపారు. గాల్లోని తేమశాతాన్ని బట్టి ఒక్కో లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు రూ.2 మించదని అంచనా. ఉదాహరణకు 30 డిగ్రీల ఉష్ణోగ్రత.. గాల్లో తేమశాతం 70 శాతం వరకూ ఉన్న ప్రాంతాల్లో నీటి ఉత్పత్తి ఖర్చు లీటర్కు రూపాయికి మించదు. అంతేకాదు.. గాల్లోని ధూళి, ఇతర కాలుష్యాలను మొత్తం తొలగించేందుకు అత్యాధునిక ఏర్పాట్లు ఉన్న కారణంగా ఈ యంత్రం ద్వారా ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని కూడా పొందవచ్చు. ఓజోన్ వాయువుతో శుద్ధి చేయడం ద్వారా నీళ్లు మరింత ఎక్కువ కాలం తాజాగా ఉండటంతోపాటు వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ల సమస్య ఉండదు. యంత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు నెలకు రూ.300 వరకూ ఉంటుందని అంచనా. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో జనాన్ని ఆదుకునేందుకు లారీలోనూ ఒద్దికగా అమరిపోతుంది వాటర్ జెన్ యంత్రం. వీటితోపాటు మిలటరీ అవసరాల కోసం మొబైల్ యంత్రాన్ని, ఎయిర్ కండీషనర్ల నుంచి విడుదలయ్యే నీటిని శుద్ధి చేసేందుకు, గాల్లోని తేమను తొలగించడం ద్వారా పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు కూడా ఈ కంపెనీ ప్రత్యేకంగా యంత్రాలను తయారు చేసింది. భారత్లోని చెన్నైతోపాటు అనేక ఇతర దేశాల్లో ప్రస్తుతం వాటర్జెన్ యంత్రాలు దాదాపు పది వేలు పనిచేస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని సగం మందికి వాటర్ జెన్ ద్వారా తాగునీరు అందించేందుకు వాటర్జెన్ ప్రయత్నిస్తోంది. ఈ యంత్రాల కోసం భారత్తోపాటు అనేక ఇతర దేశాల నుంచి డిమాండ్ ఉంది. అతితక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా సామాన్యుల ప్రాణాలు కాపాడాలన్నది మా లక్ష్యం. – మాక్సిమ్ పాసిక్ – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాలుష్యం మారింది..‘కాలింక్’గా!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కాలుష్య సమస్యకు బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు పరిష్కారాన్ని కొనుగొన్నారు. కాలుష్యాన్ని ఎలాగూ అరికట్టలేకపోతున్నాం.. అలాంటప్పుడు దానిని రోజూ ఉపయోగించే వస్తువుగా మార్చేస్తే ఎలా ఉంటుందన్న వారి ఆలోచన నుంచి పుట్టిందే ‘కాలింక్’.. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును ఇది సరికొత్త ఆవిష్కరణే.. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కధ్యాన్లు ‘చిక్కనైన నల్లటి సిరా’గా మార్చివేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాక్టరీల చిమ్నీలు, జనరేటర్లు, కార్ల ఎగ్జాస్ట్ పైపుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని, మసిని సేకరించి అనంతరం శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఇంక్ రూపంలోకి మారుస్తున్నారు. ఈ చిక్కటి ఇంక్ ప్రింటర్ల కాట్రిడ్జ్లు, స్క్రీన్ ప్రింటింగ్, చిత్రకళకు కాలిగ్రాఫి పెన్లు, వైట్బోర్డు మార్కర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. 2016 జూన్లో బెంగళూరులో నెలకొల్పిన ‘గ్రావికీ లాబ్స్’ ద్వారా ఈ ఇంక్ తయారీని కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక, ఇతర కాలుష్య వ్యర్థాల్ని శుద్ధిచేసి వర్ణ ద్రవ్యాలుగా, సిరాగా మార్చడంతో పాటు వివిధదేశాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలోని రోడ్లకు ఈ ఇంక్ను ప్రయోగాత్మకంగా ఉపయోగించబోతున్నారు.ఈ ప్రక్రియలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్ని కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు రీసైకిల్ చేయడం విశేషం. విదేశాల్లోను ఎయిర్ ఇంక్కు ప్రాచుర్యం ప్రస్తుతానికి వీధులు, కూడళ్లలో గోడలపై చిత్రాలు గీసే కళాకారులు, డిజైనర్లకు ఈ ఎయిర్ ఇంక్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. విదేశాలతో సహా మన దేశంలోనూ గోడ, వీధి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఇంక్ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అనిరుధ్ అండ్ కో ప్రయత్నిస్తోంది. కళారంగం ద్వారానే ఈ ఇంక్కు మరింత ప్రచారం తీసుకురావాలని భావిస్తున్నారు. 45 నిమిషాల కాలుష్యంతో 30 మి.లీ. ఇంక్ ఎయిర్ ఇంక్కు 2013లో అనిరు«ధ్శర్మ పెట్టినపేరు కాలింక్. వాతావరణంలోకి కాలుష్యం చేరకముందే దాన్ని ఎలా బంధించాలన్న అన్న ఆలోచన నుంచి వచ్చిందే కాలింక్ ప్రయోగం.తర్వాత అనిరుధ్, కౌషిక్లు కలిసి ‘సిలిండ్రికల్ మెటల్ కాంట్రాప్షన్’ను రూపొందించారు. వాటిని కార్ల పొగ గొట్టాలకు, పారిశ్రామిక చిమ్నీలకు ఏర్పాటుచేసి కాలుష్య రూపంలో ఉన్న ముడిపదార్థాన్ని సేకరించారు. 45 నిమిషాలు వెలువడే కాలుష్యంతో ఒక ఎయిర్ ఇంక్లో పట్టే 30 మిల్లీలీటర్ల ఇంక్ను తయారు చేయవచ్చని గుర్తించారు. కిక్ స్టార్టర్ అనే వెబ్సైట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి ఎయిర్ ఇంక్ ఉత్పత్తికోసం పదిరోజుల్లో 14 వేల డాలర్ల(రూ.9 లక్షలు)కు పైగా సేకరించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలతో సహా, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సంస్థలకు పెద్దమొత్తంలో కాలింక్ను సరఫరా చేసే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు కౌషిక్ చెప్పారు. పలువురు భారతీయ చిత్రకారులతో కూడా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు. గ్రావికీ ఆన్లైన్ స్టోర్స్ ద్వారా త్వరలో ఇంక్ను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వాటి కంటే ఎయిర్ ఇంక్ మార్కర్ల మన్నిక ఎక్కువని, ఇందులో వేరే రంగుల్ని జతచేసుకోవచ్చని కౌషిక్ చెప్పారు. -
అతిచవకధరలో మరో స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధర రూ. 3,999 వద్ద 'ఎయిర్' పేరుతో 4 జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఎయిర్ ను ఫస్ట్ టైం స్మార్ట్ఫోన్ యూజర్లనుద్దేశించి రూపొందించామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. మాఫే ‘ఎయిర్’ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 4 అంగుళాల డిస్ప్లే 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్ట్రం ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 2 జీబి ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ 32 జీబీకి విస్తరించుకునే అవకాశం 5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2ఎంపీ సెల్ఫీ కెమెరా 2000ఎంఏహెచ్ బ్యాటరీ , పది గంటల టాక్ టైమ్ -
గాల్లోంచి ముడిచమురు
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ టెక్నాలజీ చేతిలో ఉంటే మాత్రం గాల్లోంచి ముడిచమురు పుట్టించవచ్చు! అదెలా అనుకుంటున్నారా.. ఫిన్లాండ్లోని వీటీటీ టెక్నికల్ రీసెర్చ్ సెంటర్, లాపెన్రాంటా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు (ఎల్యూటీ) సంయుక్తంగా ఇప్పుడీ విషయాన్ని నిరూపించాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ టెక్నాలజీ ఏదో మనమూ తెచ్చేసుకుంటే పోలా? బోలెడంత కలిసొస్తుంది అనుకుంటున్నారా? దానికి ఇంకా టైముంది లెండి. రోజుకు 200 లీటర్ల ముడిచమురుకు సమానమైన ఇంధనాన్ని తయారు చేసే ఓ నమూనా యంత్రాన్ని ఈ రెండు యూనివర్సిటీలు ఇటీవలే ఏర్పాటు చేశాయి. గాల్లోని కార్బన్డయాక్సైడ్, నీటిని వేరు చేసి, ఆ నీటిని మళ్లీ విడగొట్టి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం, కార్బన్డయాక్సైడ్, హైడ్రోజన్ను కలిపి ముడిచమురు లాంటి ఇంధనాన్ని తయారు చేయడం ఈ ప్లాంటు ఉద్దేశం. ఈ టెక్నాలజీతో గాల్లోని కార్బన్డయాక్సైడ్నే మళ్లీ మళ్లీ వాడతారు కాబట్టి.. ఇది పర్యావరణ సమతుల్యానికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. థర్మల్పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ను ఒడిసిపట్టి ఇంధనంగా మారిస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చని ఎల్యూటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జెరో అహోలా చెబుతున్నారు. -
గాలీ వాన బీభత్సం
- విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - నేలమట్టమైన అరటి, పాలీహౌస్లు, నర్సరీలు రాప్తాడు / పెనుకొండ రూరల్ / సోమందేపల్లి / పుట్లూరు / నార్పల / శింగనమల / కూడేరు : జిల్లాలో మంగళవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో గాలీవానకు భారీ చెట్లతో పాటు 150 దాకా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు వంద ఎకరాల్లో అరటి, బొప్పాయి చెట్లు నేలమట్టమయ్యాయి. పాలీహౌస్లు, నర్సరీలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. రాప్తాడు మండలం బుక్కచెర్లలో వడగండ్ల వాన కురిసి దాదాపు 50 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. సుమారు రూ.50 లక్షల మేరకు నష్టం సంభవించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, బి.నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, ఎలక నాగేంద్ర, చౌడక్క, నల్లమ్మ, నాగేంద్రరెడ్డి, జి.నారాయణరెడ్డి, పురుషోత్తంరెడ్డి, లక్ష్మయ్య, బి.ఎన్.నారాయణరెడ్డి, గొవర్ధన్రెడ్డి సాగుచేసిన అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు బోరున విలపించారు. అలాగే రైతులు నాగేశ్వరమ్మ, నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్న పాలిహౌస్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కీరాదోస పంటతో పాటు దాదాపు రూ.65 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. అలాగే ఐదెకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగింది. అంతేకాక బుక్కచెర్ల, భోగినేపల్లి, పాలచెర్ల, ఎం.బండమీదపల్లి, పాలవాయి, ఎం.చెర్లోపల్లి తదితర గ్రామాల్లో దాదాపుగా 60 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో దాదాపు రూ.ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్కో డివిజన్ డీఈ నారాయణస్వామి నాయక్, ఏఈ నారాయణస్వామి తెలిపారు. ఏడు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపోయిందని, రాత్రికి రాత్రే నాలుగు గ్రామాల్లో విద్యుత్ను పునరుద్ధరించామన్నారు. అలాగే రైతుల్ని ఆదుకుంటామని ఉద్యానవన హెచ్ఓ దస్తగిరి తెలిపారు. ఆయన నేలకూలిన పంటపొలాల్ని పరిశీలించారు. ఇక పెనుకొండ మండలం మావుటూరులో మైలారప్పకు చెందిన రేషం షెడ్డు కూలిపోవడంతో పాటు బాధితుడికి స్వల్పగాయాలయ్యాయి. సోమందేపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుట్లూరు మండలం ఎల్లుట్ల, మడ్డిపల్లి, జంగంరెడ్డిపేట గ్రామాల్లో 15ఎకరాల్లో అరటిì తోటలు నేలకొరిగాయి. అలాగే నార్పల మండలం నాయనపల్లి, మద్దలపల్లి, నాయనపల్లి క్రాస్, వెంకటాంపల్లి గ్రామాల్లో పెనుగాలులకు పెద్ద వృక్షాలు విరిగి వాహనాలపై పడ్డాయి. షెడ్లు గాలికి ఎగిరి పోయాయి. అరటి, మామిడి చెట్లు విరిగాయి. నాయనపల్లి క్రాస్లో నర్సరీలకు అపారనష్టం జరిగింది. అలాగే శింగనమల మండలం సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామంలో దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. నాయనపల్లి క్రాస్ వద్ద దాదాపు 60 విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు ట్రాన్స్కోఏఈ ప్రసాద్ తెలిపారు. ఈ గ్రామంలోనే బోరువెల్ జీపుపై చెట్టు పడి నుజ్జునుజ్జయింది. విద్యుత్ స్తంభాలు ఇంటి మీదకు కూలిపోయాయి. పుట్లూరు,నార్పల మండలాల్లో దాదాపు 4 వేల వరకు అరటి చెట్లు కూలిపోయాయి. కూడేరు మండలం రామచంద్రాపురంలో రైతు తిమ్మారెడ్డికి చెందిన ఐదెకరాల అరటి నేలకొరిగింది. -
గాలివాన బీభత్సం
► నగరంలో రెండు గంటల పాటు భారీ వర్షం ►పలుచోట్ల రాలిన వడగండ్లు ► గాలులకు నేలవాలిన విద్యుత్ స్తంభాలు ► విద్యుత్ సరఫరాకు అంతరాయం.. అంధకారంలో నగరం ► విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి హోరుగాలి.. జోరువాన.. గుంటూరును అతలాకుతలం చేశాయి. శనివారం సాయంత్రం రెండు గంటలపాటు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. యార్డులో మిర్చి బస్తాలు తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాక్షి, గుంటూరు: గుంటూరులో గాలివాన శనివారం బీభత్సం సృష్టించింది. హోరుగాలితో రెండు గంటల పాటు వడగళ్లవాన కురిసింది. దీంతో నగరవాసులు కొన్ని గంటలపాటు అతలాకుతలమయ్యారు. మధ్యాహ్నం జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఊహించని రీతిలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. గాలులకు నగరంలో పలు చోట్ల విద్యుత్ తీగలు కిందపడగా కొన్నిచోట్ల స్తంభాలు నేలవాలాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇంకొన్ని చోట్ల భారీ హోర్డింగ్లు భవనాల నుంచి కిందపడ్డాయి. ఏయే ప్రాంతాల్లోనంటే..! నగరంలోని చుట్టుగుంట సెంటర్, కిడాంబీనగర్, చిలకలూరిపేట రోడ్డులోని వై–జంక్షన్, అరండల్పేట, బ్రాడీపేట, ఏటీ అగ్రహారం, మంగళదాస్నగర్, పాత గుంటూరుతో పాటు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కంకరగుంట ఆర్యూబీ, మూడు వంతెనల సెంటర్ పూర్తిగా జలమయం కావడంతో వాహన దారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్శాఖకూ నష్టం.. గాలివాన సృష్టించిన బీభత్సానికి విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. నగరానికి ఐదు ప్రధాన ఫీడర్ల ద్వార విద్యుత్ సరఫరా అవుతుండగా గాలివానకు అవన్నీ బ్రేక్ డౌన్ అయ్యాయి. దీంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచి అంధకారం నెలకొంది. చుట్టుగుంట సెంటర్ వద్ద భారీ హైటెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. విద్యుత్శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించడానికి రంగంలోకి దిగారు. 33, 11 కేవీ విద్యుత్ తీగలను సవరించేందుకు రాత్రంతా పనిచేశారు. మిర్చి రైతులకు కన్నీరే దిక్కు.. ఒకవైపు ధరలు లేక మిర్చి రైతులు ఇబ్బంది పడుతుంటే అకాల వర్షాలు కూడా వారిని నిండా ముంచుతున్నాయి. యార్డులో నిల్వ ఉంచిన వెయ్యి బస్తాల మీర్చి నీటి పాలై ఇప్పటికే రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లింది. విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి.. గాలివాన వచ్చిన సమయంలో వస్త్రలత కాంప్లెక్సులో పనిచేస్తున్న నల్లచెరువుకు చెందిన షేక్ బషీర్ (25) విధుల్లో భాగంగా కాంప్లెక్స్ పైభాగానికి వెళ్లగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఆకాశంలో స్విమ్మింగ్
-
చూపరులను అబ్బుర పరచిన సుడిగాలి
-
ఆ గాలి పీల్చితే 40 సిగరెట్లు కాల్చినంత!
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత దారుణంగా ఉంది. దివాలి అనంతరం ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్య పొగలు, ఇప్పటికీ వదలడం లేదు. రాజధానిని, దాన్ని పరిసర ప్రాంతాలను మరింత అతలాకుతలం చేస్తున్నాయి. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యంత అధ్వానమైన పరిస్థితిని ఢిల్లీ ఎదుర్కొంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ గాలి పీల్చడం ఒక్క రోజులో 40 సిగరెట్లు స్మోక్ చేసినంతకు సమానమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే గాలిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 200 పైగా పిటిషన్లు నమోదయ్యాయి.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గణాంకాల బట్టి గురువారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో దట్టమైన కాలుష్యం, పొగమంచు కారణంగా విజిబిలిటీ 400 నుంచి 500 మీటర్స్గా ఉంది. గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని రక్షించడానికి వెంటనే ఎమర్జెన్సీ చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అసలకే వాహన కాలుష్యం దీనికి తోడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వంటి ప్రాంతాల్లో ఎడతెగకుండా వరికుంచెలు తగులబెట్టడం, దివాలి బాణాసంచా కాల్చడం వంటివి కాలుష్య పొగలను అసాధారణ స్థాయిలకి తీసుకెళ్లాయని నిపుణులు పేర్కొంటున్నారు. దివాలి అనంతరం వరి కుంచెలను కాల్చడం మరింత ఎక్కువైందని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాటిలైట్ ఫోటోలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకుని, ఢిల్లీలో గాలి శుభ్రతకు పరిష్కరం కనుగొనాలని, 200 పైగా పిటిషన్లు నమోదయ్యాయని చేంజ్.ఆర్గ్ పేర్కొంది. 24 గంటల్లోనే ఇన్ని పిటిషన్లు నమోదైనట్టు తెలిపింది. సమర్థవంతమైన కాలుష్య ఉపశమన పథకాలు ఢిల్లీకి కావాలని, తక్షణం చర్యలు తీసుకోకపోతే, ఈ శీతాకాలంలో పొగమంచుతో పాటు కాలుష్యం మరింత పెరిగి, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. -
గండం గట్టెక్కినట్టే
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 420 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 550 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకతమైంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
గాలి పందిరి... గమ్మత్తు లోగిలి...
ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందంటే ఒకటో రెండో షామియానాలు వేయించాలి కదా... కానీ అదేం అంత సులభం కాదు. టెంట్హౌస్కు చెప్తే వాళ్లు వెంటనే వచ్చేస్తారన్న గ్యారంటీ లేదు. గడియకోసారి ఫోన్ చేయాలి... వాళ్లు వచ్చి షామియానాలు వేయడానికి నానా అవస్థలు పడాలి. పైగా... గాలి కొడితే అవి కూలి పోకుండా హైరానా పడాలి. ఈ న్యూసెన్స్ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే పక్కనున్న ఫొటో చూడండి. ఇవి కూడా షామియానాలే. కాకపోతే గాలి షామియానాలు. అత్యంత పలుచనైన, దృఢమైన ప్లాస్టిక్తో తయారు చేశారు వీటిని. స్పెయిన్కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ డోసిస్ వీటి రూపకర్త. చిన్న చిన్న మోటార్లతో నిమిషాల వ్యవధిలో గాలి నింపితే ఫొటోల్లో ఉన్నట్టుగా తయారవుతాయి. 4300 చదరపు అడుగుల విశాలమైన, ఎనిమిది అడుగుల ఎత్తై ఫంక్షన్ హాల్గా మారిపోతాయి. మొత్తం ఒకే హాల్లా కాకుండా అక్కడక్కడా ప్రత్యేకమైన గదులు కూడా ఉండటం వీటిలోని విశేషం. ఈ మధ్యనే ఈ వినూత్న షామియానాను లండన్లోని ఓ విశాలమైన పార్క్లో ‘షఫల్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వినియోగించారు. చిన్న స్క్రీన్లపై సినిమాలు ప్రదర్శించడంతోపాటు కొన్ని వర్క్షాప్లు, సైన్స్ ప్రయోగాలు కూడా నిర్వహించారు. పైకప్పు ఉండటం వల్ల వానొస్తుందన్న భయం లేదు. గాలి వేగం ఎక్కువైతే అందుకు తగ్గట్టుగా ఈ షామియానా తన షేపును మార్చుకుంటుంటే తప్ప కూలిపోయి రభస సృష్టించదు. బాగుంది కదూ ఈ గాలి షామియానా... టెక్నాలజీ నజరానా. -
పీల్చే విషం కన్నా... తినే విషమే ఎక్కువ!
పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు ప్రమాదకర స్థాయుల్లో కలుషితమైపోతున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపించవచ్చు గాక, లోలోపల మనిషిని ఈ కులుషిత శక్తులు పీల్చి పిప్పిచేస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరేం చెయ్యాలి? అంతా విషమయం అయిపోయినప్పుడు అమృతం ఎక్కడ దొరుకుతుంది? వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే చోటు నుంచి మకాం మారిస్తే, పచ్చని పరిసరాల్లో నివాసం ఏర్పరచుకుంటే కొంతవరకు బతికి బట్టకట్టొచ్చనేది జీవ , పర్యావరణవేత్తల సలహా. కానీ గాలి నుంచి తప్పించుకుంటే సరిపోతుందా? ఆహారం మాటేమిటి? ద్రవరూపంలో, ఘనరూపంలో, పండ్లు, పాలు, కూరగాయలు, మాంసాహారం వంటి రకరకాల పదార్థాల రూపంలో ఒంట్లోకి చేరుతున్న విషరసాయనాల నుంచి ఎలా తప్పించుకోవడం? సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన, సహజమైన ఉత్పత్తులను వాడడం మినహా దారి లేదు. గాలిలోంచి, నీటిలోంచి.. పంటల్లోకి! టాక్సిక్స్ లింక్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మనదేశంలో ఉంది. ఆ సంస్థ కొన్ని నెలల క్రితం యమునా నదీ పరీవాహక ప్రాంతంలో పండే కాయగూరలు, ధాన్యపు గింజల్ని ప్రయోగశాలలో పరీక్షించి మరీ, మానవ జీవితానికి అవెంతో ప్రమాదకరం అని తేల్చింది. యమున పరిసరాల్లోని వాయు కాలుష్యం, యమున నీటిలోని కాలుష్యం. సీసం, క్రోమియం, ఆర్సెనిక్, మెర్క్యురీ వంటి భార లోహాలు ఆ నీటితో పండుతున్న పంటల్లో చేరి వాటిని దాదాపు విష ఉత్పత్తులుగా మార్చేస్తున్నాయని టాక్సిక్స్ లింక్ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. జీవిస్తున్నామా? ఏదో బతికేస్తున్నామా? ఇదే విషయమై 2013 అక్టోబరులో ఢిల్లీ కోర్టుకు అందిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఆరోగ్యకరమైన ఆహారం లభ్యం కావడం కూడా మనిషి జీవించే హక్కులోని ఒక భాగమే’’ అని అన్నారు. దీనిని బట్టి మనం ఉంటున్న పరిసరాలు గానీ, మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులుగానీ కలుషిత రహితంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి నిజంగా జీవిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. లేదా జీవచ్ఛవం కిందే లెక్క. ఇప్పుడంతా మార్కెట్మయం అయిపోయింది. ప్రతిదీ మనకు సూపర్మార్కెట్ నుంచే అందమైన ప్యాకింగులతో, ఆకర్షణీయమైన ప్రకటనలతో దొరుకుతోంది. వాటిపైన ఉత్పత్తి తేదీలు ఉంటాయి. గడువు తేదీలూ ఉంటాయి. అంతమాత్రాన అవన్నీ స్వచ్ఛమైనవని కాదు. ప్రమాదరహితమైనవనీ కాదు. నిర్దేశించిన గడువులోపల ఉత్పత్తులు పాడు కాకుండా ఉండడానికి ఆయా కంపెనీలు నిల్వకారకాలను కలుపుతాయి. అలాగే రుచికోసం అని, వాసన కోసం అని మరికొన్నిటిని జోడిస్తాయి. ఇదిగో ఇలా కలిపే, జోడించే పదార్థాలే ఆరోగ్యానికి హానికరంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింగ్స్, పిల్లలు ఇష్టపడే కంటెయినర్ ఫుడ్ విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. కలుషితమా? కల్తీనా? ఆహార ఉత్పత్తులు... అవి ఏవైనా సరే ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాయంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సహజ ఉత్పత్తి ప్రక్రియలో అవి కలుషితం కావడం. రెండోది కృత్రిమంగా అవి కల్తీ అవడం. అయితే వీటిని వేర్వేరుగా చూడలేమని, నాణేనికి ఇవి రెండు వైపుల వంటివని డాక్టర్ సీమా గులాటీ అంటారు. న్యూఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్ ఒబేసిటీ అండ్ కొలెస్టరాల్ ఫౌండేషన్లో న్యూట్రిషన్ రిసెర్చ్ విభాగానికి ఆమె అధిపతి. మరెలా ఈ విపత్తు నుంచి వినియోగదారులు తప్పించుకోవడం? ఉత్పత్తి సంస్థలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, క్వాలిటీ కంట్రోల్ విషయంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న చట్టాలను మరింత పదును తేల్చి, శిక్షలను కఠినతరం చేయడం తప్ప మరో మార్గం లేదని సీమా గులాటీ అంటున్నారు. ఈ చట్టాలు, హెచ్చరికలు ఎలా ఉన్నా, ముందైతే వినియోగదారులుగా మన కు మనం అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇందుకోసం వినియోగదారుల చట్టం గురించి అవగాహన ఏర్పచుకోవడంతోపాటు, ఉత్పత్తుల కొనుగోలు సమయంలో మరికాస్త జాగ్రత్తగా ఉండాలి. ధరను, గడువు తేదీని మాత్రమే కాదు, అందులో ఏమేమి పదార్థాలు, ఎంత శాతంలో కలిసి ఉన్నాయో కూడా చూడడం అలవాటు చేసుకోవాలి. అవి పరిమితంగా ఉన్నాయా, అపరిమితంగా ఉన్నాయా అన్నది పత్రికల్లో వచ్చే వ్యాసాలను బట్టి, ప్రజాహితార్థం జారీ అయ్యే ప్రభుత్వ ప్రకటలను బట్టి తేలిగ్గానే తెలిసిపోతుంది. అప్పుడు మన నిర్ణయం మనం తీసుకోవచ్చు. వినియోగదారులు జాగృతమైతే, ఉత్పత్తిదారులూ దారిలోకి వస్తారు. ఉత్తిపుణ్యానికి అనారోగ్యం తెచ్చుకుని వైద్యుల దగ్గరికి పరుగులు తీసే బాధా తగ్గుతుంది. -
ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా కోరుతూ ఆకాశవాణి కేంద్రం ఎదుట ధర్నా హాజరైన వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు ముగ్గురు మోసగాళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం విజయవాడ (లబ్బీపేట) : ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ, ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. పదేళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రులను నట్టేట ముంచుతున్నారన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్యాకేజీ.. హోదా.. అంటూ పూటకో మాట చెబుతూ చంద్రబాబు గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చడంతో వైఎస్సార్ సీపీతోపాటు వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన గురువారం స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని ఆకాశవాణి కేంద్రం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర విభజన సమయం నుంచి డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఒకవైపు విభజన చేయాలని లేఖ ఇచ్చి, మరోవైపు సమైక్యాంధ్రా పేరుతో ఉద్యమం చేయించారని విమర్శించారు. ఇప్పుడు హోదా సంజీవిని కాదని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చివరకు హోదా లేదు.. ప్యాకేజీ లేదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ తాము పోరాటం చేస్తామన్నారు. అరుణ్ జైట్లీ ప్రకటనలో కొత్తదనం లేదు : మధు అరుణ్ జైట్లీ ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించిన అంశాల్లో కొత్తదనమేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రత్యేక హోదాను నిరాకరిస్తున్నట్లు ప్రకటించడమే కొత్త విషయమన్నారు. పోలవరానికి జాతీయ హోదాను ఎప్పడో ప్రకటిస్తే, దాన్ని మళ్లీ ప్రస్తావించారని పేర్కొన్నారు. కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో సైతం స్పష్టత లేదని, సహాయం చేస్తామని మాత్రమే చెబుతున్నారన్నారు. -
ఇక స్నాప్డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు
♦ ఈ తరహా సేవలందిస్తున్న ♦ తొలి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఇదే న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్ ద్వారా ఇక నుంచి విమాన, బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా హోటల్ రిజర్వేషన్లు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వంటి సర్వీసులు కూడా పొందవచ్చని స్నాప్డీల్ తెలిపింది. ఈ తరహా ఆన్లైన్ సర్వీసులందిస్తున్న తొలి ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ తమదేనని స్నాప్డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రోహిత్ బన్సాల్ చెప్పారు. జొమాటొ, క్లియర్ట్రిప్, అర్బన్క్లాప్, రెడ్బస్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలందిస్తున్నామని ఆయన వివరించారు. వినియోగదారుల అన్ని రకాలైన అవసరాలకు తగిన సేవలందిస్తున్నామని, స్నాప్డీల్ ద్వారా మరింత విస్తృతమైన సేవలను అందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని బన్సాల్ పేర్కొన్నారు. 2020 నాటికల్లా 2 కోట్ల రోజువారీ లావాదేవీలు జరిపే యూజర్లున్న ఆన్లైన్ మార్కెట్ ప్లేస్గా అవతరించాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. ఈ తరహా ఆన్లైన్ సర్వీసులందించడం ద్వారా ఆ లక్ష్య సాధనకు చేరువ కాగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా, స్నాప్డీల్ భాగస్వామ్యంలో మరింతమందికి చేరువ కాగలమని జొమాటొ సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు. -
గాలికి రూ.లక్ష!
శ్రీకాకుళం టౌన్: జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఖరీదైన గాలిని అనుభవిస్తున్నా రు. నెలకు లక్ష రూపాయలు అద్దె చెల్లించి పెడస్టల్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకున్నారు. జెడ్పీ కార్యాలయాన్ని ఆధునికీకరించడానికి అధికారులు నిర్ణయించారు. అన్ని గదుల్లో నూ సీలింగ్ పనులు చేయడానికి పూనుకున్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులకు పనులు కూడా పురమాయించారు. దీంతో వారు కూడా అంచనాలు సిద్ధం చేశా రు. మొత్తం పనులన్నీ చేయడానికి రూ.40 లక్షలు కావాలని నివేదించారు. ఈ మేరకు టెండర్లు పిలవడంతో విశాఖకు చెందిన కాం ట్రాక్టరు ఈ పనులు దక్కించుకున్నారు. పనులు ఆరంభమైన తర్వాత గదుల్లోని ఫ్యాన్లను తొలగించారు. ఉద్యోగులు పనిచేసేం దుకు వీలుగా తాత్కాలికంగా పెడస్టల్ ఫ్యాన్లు అమర్చారు. విద్యుత్ సరఫరా కోసం తాత్కాలిక బోర్డులను అమర్చి వాటికి వి ద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. కార్యాలయం మొత్తమ్మీద తాత్కాలిక పద్ధతిలో 50 పెడస్టల్ ఫ్యాన్లను అమర్చి నెలకు రూ. లక్ష అద్దె సమర్పిస్తున్నారు. ఇప్పటికే పనులు ఆరంభమై మూడు నెలలు గడిచింది. ఇవి పూర్తి కావడానికి మరో నాలుగు నెలలైనా పడుతుంది. అంతవరకు నెలకు రూ.లక్ష చొ ప్పున చెల్లించాలి. పనుల్లో జాప్యం జరిగితే మరో లక్ష కూడా పెరగవచ్చు. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మెరుగైన సౌకర్యాల కోసం... కార్యాలయ నిర్వహణలో భాగంగా ఉద్యోగులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ఆధునికీకరణ పనులు చేపట్టాం. అందులో భాగంగానే తాత్కాలి కంగా సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. వేసవి తీవ్రత వల్ల కార్యాలయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. అందుకే తాత్కాలికంగా ఫ్యాన్లను ఏర్పాటు చేశాం. పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నాం. పనులు వేగంగా పూర్తి చేస్తే ఫ్యాన్లకు అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. - బి.నగేష్, సీఈఓ, జిల్లాపరిషత్ -
చెదిరిన పచ్చబొట్టు... గాలివేటు...
ఈదురుగాలులతో చెట్లకు చేటు నగరంలో ఇటీవల కుప్పకూలిన మూడువేల వృక్షాలు పర్యావరణానికి ముప్పు నేలకూలిన చెట్లలో 90 శాతం కొండ తంగేడు రకానివే.. నేల స్వభావాన్ని బట్టి చెట్లు పెంచాలంటున్న నిపుణులు సిటీబ్యూరో: చిన్నపాటి గాలి దుమారానికే గ్రేటర్లో భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. కొద్దిరోజులుగా నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో వీస్తోన్న ఈదురుగాలులకు మహానగరం పరిధిలో వేలకొలది చెట్లు కుప్పకూలడంతో..ఉన్న కొద్దిపాటి హరితం కనుమరుగవుతోంది. 625 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 30 శాతం గ్రీన్బెల్ట్ (హరిత వాతావరణం) ఉండాల్సి ఉండగా... కేవలం 8 శాతమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరుణంలోపులిమీద పుట్రలా ఉన్న చెట్లు కూడా ఇటీవలి ఈదురుగాలులకు నేలమట్టం అవుతుండడం సర్వత్రా కలచివేస్తోంది. జీవవైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు బాసటగా నిలవడంతోపాటు...నగరంలోని రాతి నేల స్వభావానికి అనుగుణంగా పెరిగేవి, బలమైన వేరు, కాండం వ్యవస్థ ఉన్న చెట్లు కాకుండా.. గతంలో అందం..ఆకర్షణ, పైపై సొబగుల కోసం పెంచిన అలంకరణ వృక్షాలే ఇటీవల కుప్పకూలినట్లుశాస్త్రవేత్తలు చెబుతుండడం గమనార్హం. చెట్లు ఎందుకు కుప్పకూలుతున్నాయంటే.. నగరంలో ఇటీవల భారీగా వీచిన ఈదురుగాలులు, జడివానలకు భారీ సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. సుమారు మూడు వేల వరకు వృక్షాలు నేలకొరిగినట్లు అంచనా. కూలిన చెట్లలో 90 శాతం వరకు కొండ తంగేడు(పెల్టోఫామ్) జాతికి చెందినవి. మిగతా వాటిల్లో వేప, రావి, కానుగ, పొగడ తదితరమైనవి ఉన్నాయి. చెట్ల వేర్లకు అడుగు దూరం మేర ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. కానీ నగరంలో చెట్ల వేర్లను ఆనుకునే రోడ్లు వేశారు. దాంతో వేర్లు అభివృద్ధి చెందలేదు. తత్ఫలితంగా చెట్టు బలంగా నిలబడలేక చిన్నపాటి దుమారానికే కొమ్మలు విరిగిపడి కాండం నేలకొరుగుతోంది. చెట్ల మధ్య దూరం పది మీటర్ల మేర ఉండాల్సి ఉండగా, ఎక్కడా ఆ నియమం పాటించిన దాఖలాలు లేవు. చెట్టు పైభాగం (క్రౌన్) గాలి వాలుకనుగుణంగా ఎటు వైపైనా తిరగ గలిగినంత ఖాళీ ప్రదేశం ఉండాలి. కానీ నగరంలో ఎక్కడా ఆ పరిస్థితి లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. {sీ ట్రైనింగ్ అండ్ ట్రిమ్మింగ్ను కూడా పట్టించుకోలేదని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంటే చెట్ల కొమ్మల్ని నిర్ణీత కాలవ్యవధుల్లో కత్తిరించాలి. కానీ ఇష్టానుసారంగా తొలగిస్తున్నారు. విద్యుత్ తీగలు ఉన్న వైపు మాత్రమే కత్తిరిస్తుండడంతో ఒక వైపే కొమ్మల భారం పెరిగి ఈదురుగాలులకు విరిగిపడుతున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో కనివినీ ఎరగని రీతిలో బలమైన గాలులు వీయడం కూడా ఎక్కువ చెట్లు నేలకొరగడానికి కారణమని చెబుతున్నారు. కానుగ, రావి, మద్ది వంటి చెట్లు పెరిగేందుకు దాదాపు 15 సంవత్సరాలు పడుతుందన్న ఉద్దేశంతో 1998-2004 మధ్య కాలంలో అందం,ఆకర్షణ, అలంకరణ కోసమంటూ పెద్దఎత్తున కొండ తంగేడు రకానికి చెందిన మొక్కలు నాటారు. ఇవి ఆరేడు సంవత్సరాల్లోనే పెరుగుతాయన్న ఉద్దేశంతో వీటికే ప్రాధాన్యతనిచ్చారు. ఇవి ఇటీవల కుప్పకూలుతున్నాయి. నగరంలో జీవితకాలం అధికంగా ఉండేవి, రాతినేల స్వభావానికి అనుగుణంగా ఉన్న చెట్లు పెంచితే అవి ఈదురుగాలులకు చెక్కు చెదరకుండా ఉంటాయని వృక్షశాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలగించాల్సిన చెట్ల రకాలివే.... పార్కు చుట్టూ ఉన్న చెట్లలో సైకస్, మహాఘని, చాంపియన్పామ్, బాటిల్బ్రష్, బహున్ల, నెమలినార, రావి, తెల్లమద్ది, బిగ్నీనియా, ఉల్లింత, రేల తదితరమైనవి ఉన్నాయి. హరితహారంలో 25 లక్షల చెట్లు నాటడమే లక్ష్యం..! నగరంలో భారీగా చెట్లు నేలకొరగడం, హరితం కనుమరుగవుతుండడంతో ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. రాబోయే వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇందులో 50 ఏళ్లకు పైగా జీవితకాలం ఉన్నవే అధికంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నాటబోయే చెట్లలో రావి, కానుగ, బాదాం,నేరుడు, పొన్న, వేప, సిల్వర్ ఓక్, అశోక, మిల్లింగ్ టోనియా, స్పాథోడియా, పగోడా, టెకోమా అర్జెంటియా, బహునియా పుర్పూరియా, టెకోమా గౌడిచౌడి, కదంబ, మహాగణి, టబేబియా, టబేబియా రోజియా, టెర్మినేలియా అర్జున, బర్రింగ్టోనియా, అల్స్టోనియా, చంపక, పెల్టోపోరం, రాయల్పామ్, గుల్మోహర్, కేసియా ఫిస్టులా, చిన్నబాదం, బాదాం, పనాస, పొన్న రకాలున్నాయి. పలు మెట్రో నగరాల్లో హరిత తోరణం ఇలా.. హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్బెల్ట్ ఉందని జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో సుమారు 8 శాతమే హరిత వాతావరణం ఉందన్నమాట. ఇక మన పొరుగునే ఉన్న బెంగళూరు మహానగరంలో 13 శాతం (97 చదరపు కిలోమీటర్ల) మేర గ్రీన్బెల్ట్ ఉండడం విశేషం. దేశంలో ప్రణాళికా నగరంగా పేరొందిన ఛండీగడ్ నగర విస్తీర్ణం 114 చదరపు కిలోమీటర్లు కాగా..ఇందులో 30 శాతం భూమిలో హరిత తోరణం విస్తరించి ఉండడంతో ఈ నగరం హరితనగరం విషయంలో దేశంలోని అన్ని మెట్రోనగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 5.95 శాతం( 88.4 చదరపు కిలోమీటర్లు), చెన్నైలో 2.01 శాతం(24 చదరపు కిలోమీటర్లు), ముంబాయిలో 5.11 శాతం( 86 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో హరితతోరణం ఉంది. -
ఎలిజబెత్ కు ఎయిర్ ఇండియా స్మారక ఆల్బమ్!
లండన్: క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఎయిర్ ఇండియా ఓ అధికారిక స్మారక ఆల్బమ్ ను వెలువరించనుంది. ప్రచురణకర్త సెయింట్ జేమ్స్ హౌస్ ద్వారా ఆల్బమ్.. ఈ వారం విడుదల కానుంది. లండన్ లోని విండర్స్ కాసిల్ హోం పార్క్ లో మే 12-15 మధ్య జరిగే రాయల్ ఈవెంట్స్ సందర్భంలో పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. క్వీన్ ఎలిజబెత్ రాచరికపు జీవితంపై లండన్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో కామన్వెల్త్, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆమె అంకితమైన తీరు, సాయుధ దళాలపై సారించిన దృష్టి, గుర్రాలపై చూపించిన ప్రేమ తదితర విషయాలు ప్రముఖంగా ఉంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలకు స్మారక ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సెయింట్ జేమ్స్ హౌస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ ఫ్రీడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర అధిపతులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఈ పుస్తకాల కాపీలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బమ్ సంపాదకీయ భాగస్వాముల కోసం వెతుకుతున్నపుడు తమకు ఎయిర్ ఇండియా యూకె సహకరించేందుకు ముందుకు వచ్చిందని, అదే తమకు మైలురాయిగా చెప్పాలని ఫ్రీడ్ తెలిపారు. క్వీన్ పుట్టినరోజు వేడుకల సందర్భంలో భారతదేశానికి బ్రిటన్ తో ఉన్న బలమైన సంబంధాలు మరోసారి వ్యక్తమౌతున్నాయని, సెయింట్ జేమ్స్ హౌస్.. ఎయిర్ ఇండియా యూకె ను మంచి సంపాదకీయులుగా గుర్తించి చారిత్రక ఉత్సవాలకు ఆహ్వానించడం ఎంతో గర్వంగా చెప్పుకోవాలని బ్రిటన్ లోని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ తారా నాయుడు అన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా బ్రిటన్ తో చారిత్రక సంబంధాలు కలిగి ఉందని, అందుకు 1948 జూన్ 8న నాలుగు ఇంజన్ల తో కూడిన మొదటి విమానాన్ని కెయిరో జెనీవాల మీదుగా లండన్ కు పంపడమే పెద్ద ఉదాహరణగా చెప్పాలని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశంనుంచి ఐదు రోజువారీ విమానాలను ఎయిర్ ఇండియా లండన్ బర్మింగ్ హామ్ కు నడుపుతోన్నట్లు తెలిపారు.