anupama Parameswaran
-
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హైదరాబాద్లో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
'పరదా' టీజర్ లాంచ్ ఈవెంట్..ఈవిడ ఎవరో తెలుసా .? (ఫొటోలు)
-
నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్
అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్లో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను డిజిటల్గా రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్. హైదరాబాద్లో జరిగిన ‘పరదా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ‘పరదా’, ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్’అన్నారు. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు . ‘‘ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు సంగీత. ‘‘ఉమెన్ ఒరియంటెడ్ సినిమాలకు బిగ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రవీణ్. ‘‘ఈ సినిమా మలయాళం రైట్స్ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు’’ అన్నారు విజయ్ డొంకాడ. ‘‘ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ‘‘ఈ సినిమా తీయడం మాకు ‘బాహుబలి’లాంటి ప్రయత్నం’’ అని స్పష్టం చేశారు శ్రీధర్. -
అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో మోసపోయిందా?
తమిళసినిమా: మాలీవుడ్లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రేమవ్ు అనే చిత్రం ద్వారా ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా పరిచయమైన ఈమెను ఆ చిత్ర విజయం దక్షిణాది నటిగా మార్చేసింది. ఆ తర్వాత మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళం భాషల్లోనూ అవకాశాలు వరుసగట్టాయి. అయితే ఎక్కువగా తెలుగులోనే ఈమె నటించిన చిత్రాలు సక్సెస్ కావడంతో అక్కడ స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది. ఇకపోతే డీజే టిల్లు చిత్రానికి ముందు వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ చిత్రంలో అందాలను ఆరబోయడంతో పాటు లిప్లాక్ సన్నివేశాలలో నటించి తనలోని గ్లామర్ కోణాన్ని తెరపై విచ్చలవిడిగా ఆవిష్కరించింది. అయితే తమిళంలో ధనుష్ జంటగా కోడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. కోలీవుడ్లో ఈ అమ్మడికి ఆశించిన విజయాలు రాలేదు. ఇటీవల జయం రవి సరసన నటించిన సైరన్ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒక భేటీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.‘‘ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పడం శుద్ధ అబద్ధం. అదేవిధంగా నువ్వే నా ప్రాణం నువ్వు లేక నేను లేను అనే ప్రేమలో చిక్కుకున్న వారు వెంటనే అందులోంచి బయటపడండి’’ అని నటి అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు. దీంతో అమ్మడు ప్రేమలో మోసపోయిందా? ఆ చేదు అనుభవంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
Anupama Parameswaran: 2025లో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ పోస్ట్ ఇదే! (ఫోటోలు)
-
మెరిసే... మురిసే...
సిల్వర్ స్క్రీన్పై మెరుపులా మెరవడానికి మెరుపు తీగల్లాంటి కథానాయికలు జోరుగా హుషారుగా సినిమాలు చేస్తుంటారు. ఒకే ఏడాది మూడు ఆపై ఎక్కువసార్లు తెరపై మెరిసే చాన్స్ వస్తే వాళ్ల ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. ఈ ఏడాది అలా మినిమమ్ మూడు చిత్రాలతో తెలుగులో మెరిసి, కెరీర్ బాగున్నందుకు మురిసిపొయిన కథానాయికల గురించి తెలుసుకుందాం.2024లో తెలుగు తెరపై మీనాక్షీ చౌదరి హవా కనిపించింది. మహేశ్బాబు ‘గుంటూరు కారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో మీనాక్షీ చౌదరి వెండితెరపై కనిపించారు. అంతేనా... తమిళ హీరో విజయ్ ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఓ లీడ్ రోల్ చేశారు మీనాక్షి. ‘లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలు నెల రోజుల గ్యాప్లో విడుదల కావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, గోట్’ చిత్రాలు హిట్స్గా నిలిచాయి.మరోవైపు తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది మంచి జోరు కనబరిచారు. హారర్ మూవీ ‘తంత్ర’లో లీడ్ రోల్ చేసి, రూరల్ యాక్షన్ ఫిల్మ్ ‘΄÷ట్టేల్’లో గృహిణిగా భావోద్వేగభరితమైన పాత్ర చేశారు. ప్రియదర్శి–నభా నటేష్ లీడ్ రోల్స్లో నటించిన ‘డార్లింగ్’లోనూ డాక్టర్గా ఓ లీడ్ రోల్ చేశారీ బ్యూటీ. అలాగే నేడు విడుదలవుతోన్న ‘శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్’ చిత్రంలోనూ ఓ లీడ్ చేశారు. ఇలా అనన్య ఈ ఏడాది నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇక ముంబై బ్యూటీ కావ్యా థాపర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఈ ఏడాది తరచూ పలకరిస్తూ వచ్చారు.రవితేజ ‘ఈగిల్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ ‘విశ్వం’ చిత్రాల్లో కావ్యా థాపర్ కనిపించారు. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ను అలరించారు కావ్యా థాపర్. మరోవైపు హీరోయిన్గా పరిచయమైన తొలి ఏడాదే మూడు సినిమాలతో సత్తా చాటారు యువ హీరోయిన్ నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో హీరోయిన్గా చేశారీ బ్యూటీ.నయన్ చేసిన ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆమె కెరీర్కు బలం చేకూరినట్లయింది. ఇక హీరోయిన్గా కాదు కానీ... కథను ఇంపాక్ట్ చేసే పాత్రల్లో రుహానీ శర్మ కనిపించారు. వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, సుహాస్ ‘శ్రీరంగనీతులు’ చిత్రాల్లో రుహానీ మంచి పాత్రలు చేశారు. ‘లవ్ మీ’ చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్లో కూడా కనిపించారు రుహానీ. ఇలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను తరచూ పలకరించిన మరికొంతమంది హీరోయిన్లు ఉన్నారు.విలన్గానూ విజృంభించారు సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్క్వేర్’లో స్పై ఏజెంట్ లిల్లీ జోసెఫ్గా, రవితేజ ‘ఈగిల్’లో జర్నలిస్ట్ నలినీ రావుగా కనిపించారు అనుపమా పరమేశ్వరన్. అయితే ‘డీజే టిల్లు 2’లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనుపమ నటించడం విశేషం. ఈ తరహాలోనే మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న అప్సర ఆలియాస్ మాయ పాత్రను విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సిని మాలో చేశారు. ఈ బ్యూటీయే వెంకటేశ్ ‘సైంధవ్’లో మనోజ్ఞ అనే సెంటిమెంట్ రోల్లో కనిపించడం విశేషం. మహేశ్బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా చేసిన శ్రీలీల, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’లో మెరిశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగులో రష్మిక కనిపించిన చిత్రం ఇదొక్కటే. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో మృణాల్ ఠాకూర్ (‘కల్కి 2898 ఏడీ’లో ఓ గెస్ట్ రోల్ చేశారు), శర్వానంద్ ‘మనమే’లో ఐటీ ఉద్యోగిగా కృతీ శెట్టి, ఫ్యామిలీ డ్రామా ‘35: చిన్న కథ కాదు’లో గృహిణి సరస్వతిగా నివేదా థామస్ల నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అనుష్క, సమంత, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ వంటి హీరోయిన్లు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తెలుగులో కనిపించలేదు. ఇక ఈ ఏడాది దీపికా పదుకోన్, భాగ్యశ్రీ భోర్సే, రుక్మిణీ వసంత్... ఇలా దాదాపు 20మంది హీరోయిన్లు తెలుగుకు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్ (Vogue) కవర్ పేజీపై మెరిసిన నటి (ఫోటోలు)
-
ఓనమ్ స్పెషల్: కసావు చీర... కాటుక కళ్లు...
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు. జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్గా స్టిల్ ఇచ్చినా సూపర్గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు. -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ మామూలుగా లేరు!
మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఓనం వచ్చేసింది. కేరళలో అందరూ వేడుకగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరీ మలయాళ బ్యూటీస్ ఊరుకుంటారా? పద్ధతైన చీరల్లో మెరిసిపోయారు. అందమే అసూయపడేలా ధగధగాలాడిపోయారు. అనుపమ, అమలాపాల్, కల్యాణి ప్రియదర్శన్, మాళవిక మోహనన్, హనీరోజ్, మమిత బైజు.. ఇలా అందరూ తమ అందంతో మాయ చేసేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు లుక్కేసేయండి.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by @studio.omal View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by NAMITHA PRAMOD (@nami_tha_) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Sanjana Singh (@actresssanjana) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anjali Nair (@ianjali.nair) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Femina⚡️George (@feminageorge_) -
Anupama Parameswaran: కొంగు చాటు అందాలతో అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
Anupama Parameswaran: ఉఫ్.. వర్షంలోనూ చెమటలు పట్టిస్తున్న బ్యూటీ (ఫోటోలు)
-
లిప్లాక్కు రెడీ!
ఈతరం కథానాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో ఉన్నారు. అవకాశాలు వచ్చేవరకు వాటి కోసం తంటాలు పడుతున్నారు. అవకాశాలు వస్తుంటే పారితోషకాలు పెంచే ఆలోచనలో ఉంటున్నారు. పైకి మాత్రం పాత్రలు నచ్చితేనే అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎలాంటిదైనా వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. చాలామంది హీరోయిన్లది ఇదే తంతు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇందుకు అతీతం కాదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా పరిచయమైన నటి బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీగా మారారు. అయితే ఆరంభంలో మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించి పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్నారు. అలా తెలుగులో కార్తికేయ 2 చిత్రం వరకు అనుపమ పరమేశ్వరన్ తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో అందాల ఆరిబోతకు గేట్లు ఎత్తేశారు. అలా ఇటీవల ఈమె టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాలారబోతలో విజృంభించేశారు. ఇక లిప్లాక్ సన్నివేశాల్లోనూ రక్తి కట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాతకు అనుపమ పరమేశ్వరన్ గట్టిగానే షాక్ ఇచ్చారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక చిత్రంలో కథానాయకగా నటించడానికి నిర్మాత అనుపమ పరమేశ్వరన్ను సంప్రదించగా, కనీసం కథ కూడా వినకుండా. పాత్ర ఎలాంటిదైనా సరే పారితోషికం మాత్రం కోటి కావాలంటూ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాత అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. అనుపమాకు తెలుగులో హిట్ చిత్రాలు ఉన్నాయి, కానీ తమిళనాడు మాత్రం ఇంకా మంచి సక్సెస్ కోసం పోరాడుతున్న నటినే. అలాంటి నటి కోటి పారితోషికం డిమాండ్ చేస్తే ఏ నిర్మాత అయినా చేసే పని ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. -
థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు అడుగులు వేస్తున్నారు. చివరిగా బాలీవుడ్లో ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్ నాయుడు చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, తాజాగా #BSS11 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్ను ఆయన పట్టాలెక్కించారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు. గతంలో వారిద్దరూ 'రాక్షసుడు' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నారు. 'చావు కబురు చల్లగా' అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8 పేరుతో సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో #BSS11 ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించేలా ఉంది. హారర్-మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
జెట్ స్పీడ్తో...
తమిళంలో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ . ఇప్పటికే ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం ‘బైసన్ ’, ‘లాక్డౌన్ ’ అనే రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘లవ్టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘డ్రాగన్ ’లో ఓ హీరోయిన్ గా అనుపమ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కాలేజీలో ప్రదీప్–అనుపమల మధ్య చిత్రీకరిస్తున్న రొమాంటిక్ సన్నివేశాల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుపమ నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్’, పరదా’ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), బెల్లకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లో ఆమె నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అరడజనుకుపైగా సినిమాలతో అనుపమా జెట్ స్పీడ్తో దూసుకెళుతున్నారు. -
ఈ నెలలోనే లాక్డౌన్!
ఈ నెలలోనే లాక్డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్.కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్. -
అనుపమ 'లాక్డౌన్' టీజర్ విడుదల
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్పై హాట్గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్డౌన్,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్డౌన్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం విడుదలైన లాక్డౌన్ టీజర్ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్ కాలమాదన్' అనే తమిళ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. -
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
ఇలాంటి మసాజ్ కావాలంటూ ఫోటో షేర్ చేసిన అనుపమ
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్పై ఒక హాట్గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్ను తెరపై చూపించింది. దీంతో గ్లామర్ పాత్రలకే అనుపమ పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు మించి త్వరలో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'పరదా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనుపమ తన గ్లామర్ ఫోటోలతో కిక్ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఫోటో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు చికిత్స ఏదైతే బాగుండూ అంటూనే రోడ్ రోలర్తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో పరదా అనే సినిమాలో అనుపమ నటిస్తుంది. ఇదొక భిన్నమైన న్యూఏజ్ ట్రావెల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్రన్తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Ananda Media (@anandamediaofficial) -
నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలుసా?
టిల్లు స్క్వేర్తో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తూ పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకుంది. అయితే ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్కు గేట్లెత్తేసింది. గ్లామర్కు ఓటేసిన బ్యూటీటిల్లు స్క్వేర్ చిత్రంలో లిప్లాక్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. అదేమంటే గ్లామర్ రోల్ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. ఈ మూవీ సక్సెస్తో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరిన్ని అవకాశాలు తలుపులు తడుతున్నాయి. చీర ధరెంతో తెలుసా?దీంతో ఈ కేరళ బ్యూటీ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రూ.కోటి తీసుకుంటున్న ఈ జాణ టిల్లు స్క్వేర్ నుంచి దాన్ని రెండింతలు చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. తాజాగా నీలి రంగు చీరలో ఉన్న ఫోటోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో సింపుల్గా కనిపిస్తున్న ఈ బనారస్ చీర ధర రూ.15000 అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్పుల్ దర్శకుడు మారి సెల్వరాజ్ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.ఇదే సినిమాలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్ వైరల్)As powerful and fierce as it could get! Unleashing #Bison 🦬#BisonKaalamaadan All the best @mari_selvaraj #DhruvVikram @anupamahere @nivaskprasanna and team 💥💥💥@Tisaditi @ApplauseSocial @NeelamStudios_ pic.twitter.com/0D9pLnw2AD— pa.ranjith (@beemji) May 6, 2024 -
లాక్ డౌన్లో ఏం జరిగింది?
ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నాలుగైదు సినిమాలు అంగీకరించి, ఫుల్ ఫామ్లో ఉన్నారు అనుపమా పరమేశ్వరన్. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి ‘బైసన్’ టైటిల్ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది. అనుపమ లీడ్ రోల్లో రూపొందనున్న మరో చిత్రం ‘లాక్ డౌన్’ ప్రకటన కూడా వచ్చింది.ఈ చిత్రాన్ని ప్రకటించి, ‘‘భావోద్వేగాలతో కూడిన కథను చూడ్డానికి సిద్ధం అవ్వండి’’ అంటూ అనుపమా పరమేశ్వరన్ పస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ‘లాక్ డౌన్’లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఈ రేంజ్లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), కౌశిక్ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అనుపమ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని కోలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘ఈగల్’, ‘టిల్లు స్వే్కర్’, ‘సైరన్’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
అనుపమ పరదా
అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘పరదా’ అనే టైటిల్ ఖరారైంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను నటి సమంత, దర్శక–నిర్మాతలు రాజ్ అండ్ డీకే షేర్ చేశారు. ‘పరదా’ కాన్సెప్ట్ వీడియోలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే శ్లోకం వినిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది.ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్తో పాటు ఆ పరిసర గ్రామాల్లో ఇప్పటివరకు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘‘మేలో హైదరాబాద్లో జరగనున్న కొత్త షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు ప్రవీణ్. ‘‘ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణమే మా చిత్రం’’ అన్నారు విజయ్ డొంకాడ. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. -
'టిల్లు స్క్వేర్' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ విడుదల
డీజే టిల్లుకు సీక్వెల్గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్కు బాగా దగ్గరైంది. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు. -
చీరలో అనుపమ మరింత క్యూట్.. శ్రీముఖి మాత్రం ఎప్పట్లానే!
చీరలో మరింత క్యూట్ గా 'హనుమాన్' హీరోయిన్ అమృత పద్ధతైన కేరళ చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్.. చూస్తే అంతే మోడ్రన్ మహాలక్ష్మిలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి తెలుగమ్మాయిలా మారిపోయిన హీరోయిన్ రుహానీ శర్మ చూపులతో మత్తెక్కించేస్తున్న 'నా సామి రంగ' ఆషికా రంగనాథ్ ప్యూర్ వైట్ శారీలో మరింత అందంగా హీరోయిన్ అనంతిక ఇంట్లో పూజ చేయించిన అనసూయ.. రీజన్ మాత్రం సస్పెన్స్ View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
Anupama Parameswaran: చీరలో ‘టిల్లుగాడి’ లవర్ లిల్లీ హోయలు (ఫొటోలు)
-
అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!
అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో అడుగుపెట్టిన కొంతకాలానికే ఇక్కడి ప్రేక్షకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకుండా పర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది అనుపమ. అందుకే ఆడియన్స్కు తెగ నచ్చేసింది. కానీ ఎంతకాలమని గిరి గీసుకుని బతకాలి? గ్లామర్ పాత్రలు కూడా ఓసారి చేసి చూస్తే పోలా? అనుకుంది. అలా టిల్లు స్క్వేర్లో భాగమైంది. డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ తొలిసారి బోల్డ్గా నటించింది. ఇంకేముంది అభిమానులు హర్టయ్యారు, తనను ట్రోల్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అనుపమకు ఇలాంటి పరిస్థితా? టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవగా, కొద్ది రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా సోమవారం నాడు టిల్లు స్క్వేర్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనుపమ స్టేజీపైకి వచ్చి మాట్లాడబోతుంటే అక్కడున్న జనాలు వద్దని గోల చేశారు. అది గమనించిన అనుపమ మాట్లాడకుండా వెళ్లిపోవాలా? అని సైగ చేసింది. అయినా సరే ఎవరూ నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించలేదు. మాట్లాడొచ్చా? వద్దా? అని అడగ్గా వద్దని చెప్పారు. దీంతో హర్టయిన అనుపమ.. సరే వెళ్లిపోతాను అనేసింది. కనీసం ఒక్క నిమిషం దీంతో యాంకర్ సుమ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను తిరిగి స్టేజీపైకి తీసుకొచ్చింది. ఒక రెండు నిమిషాలైనా మాట్లాడొచ్చా? అని అనుపమ రిక్వెస్ట్ చేయగా దానికీ నిరాకరించారు. కనీసం ఒక్క నిమిషం మాట్లాడతానని అభ్యర్థిస్తూ ప్రసంగం మొదలుపెట్టింది. ముందుగా స్పెషల్ గెస్ట్గా వచ్చిన తారక్కు కృతజ్ఞతలు తెలియజేసింది. నాకేం బాధ లేదు.. అభిమానుల ఎమోషన్స్ అర్థం చేసుకోగలను.. ఆ ఎగ్జయిట్మెంట్లో నేనూ అలాగే ప్రవర్తిస్తాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ముగించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా చాలామంది అక్కడి అభిమానుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. హీరోయిన్ను అలా కించపరచడం తప్పని కామెంట్లు చేస్తున్నారు. 🤦♂️ Our Crowd! pic.twitter.com/dLF2rj2JEG — Christopher Kanagaraj (@Chrissuccess) April 9, 2024 చదవండి: అమాయకుడైన చైని మోసం చేశావ్.. ఇచ్చిపడేసిన సామ్ -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్స్టార్లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్ను, పోలీస్ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
అనుపమ అలాంటి పోజులు.. మరింత హాట్గా బాలీవుడ్ భామ!
హాట్ లుక్స్లో జియా శంకర్ హోయలు.. బ్లూ శారీలో టిల్లు స్క్వేర్ భామ అనుపమ.. వైజాగ్లో శ్రద్దాదాస్ అలాంటి లుక్స్.. బాలీవుడ్ భామ రియా చక్రవర్తి హాట్ పోజులు.. బర్త్ డే ముద్దుగుమ్మ రష్మిక అలాంటి వీడియో.. View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jiya Shankar (@jiyaashankarofficial) -
జానకిగా వచ్చేస్తున్న 'అనుపమ పరమేశ్వరన్'
'టిల్లు స్క్వేర్'తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్గా మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్స్టాలో పంచుకుంది. 'నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తైంది' అంటూ అందులో రాసుకొచ్చింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా.. ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
బెంచ్ మార్క్ దగ్గర్లో 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్
డీజే టిల్లుకు సీక్వెల్గా విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. ఇంకేముంది కేవలం ఆరు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. వంద కోట్ల బెంచ్ మార్క్కు దగ్గర్లో ఉంది ఈ చిత్రం. నేటి కలెక్షన్స్తో ఆ మార్క్ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్టె చేశారు. ఈ మూవీలో సిద్ధు హీరో పాత్రతో పాటు రచన, స్క్రీన్ప్లేలో భాగమయ్యారు. ఓటీటీలో ఎప్పుడంటే.. మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. #TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥 All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎 Our Starboy 🌟 shattering records all over! 🤘 - https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4 — Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024 -
ఫోటో షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. ఆమె ఎవరో తెలుసా?
అనుపమ పరమేశ్వరన్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి. మన పక్కింటి పిల్లలా సరదాగా మనందరిలో కలిసిపోయిందీ అమ్మాయి. 'ప్రేమమ్'తో పరిచయమై తెలుగువారి ప్రేమను గెలుచుకుంది. తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో దాగి ఉన్న మరో టాలెంట్ను ప్రేక్షకులకు చూపించింది. సినిమా చూసిన వారందరూ లిల్లీ పాప దుమ్మురేపింది రా.. అంటూ కామెట్లు చేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన అమ్మగారు అయిన సునీత ఫోటోను షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 3) సునీత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అనుపమ శుభాకాంక్షలు తెలిపింది. అనుపమ మాదిరే సునీత కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. దీంతో నెటిజన్లు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరైతే ఏకంగా అత్తమ్మా.. హ్యాపీ బర్త్డే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అత్తమ్మో.. నీ కూతురు జాగ్రత్త అని మరికొందరూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో పుట్టిన అనుపమ.. ఇంటర్ వరకు మాత్రమే చదివి సినిమాల మీద ఆసక్తితో వెండితెరపై అడుగుబెట్టి విజయం సాధించింది. నాన్న పరమేశ్వరన్, అమ్మ సునీత, సోదరుడు అక్షయ్ ఉన్నారు. తన బలం అమ్మే అంటూ చెబుతున్న అనుపమ అప్పడప్పుడు ఆమెను ఆటపట్టిస్తుంది కూడా.. ఒక్కోసారి పలు కార్టూన్స్తో తన తల్లి గురించి చెబుతూ పోస్ట్ వేసి అందరినీ నవ్వించేస్తోంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనుపమకు నేడు తన అమ్మగారి పుట్టినరోజు కావడంతో తన ఆనందం డబుల్ అయిందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
టిల్లుతో మ్యాజిక్ సక్సెస్ : లిల్లీ అదిరిపోయే లుక్స్ (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)
-
కలెక్షన్స్తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే
'టిల్లు స్క్వేర్'తో థియేటర్లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు గాడు.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మరోసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్ యాక్టింగ్తో అదరగొట్టేశాడు. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన వారిని టిల్లు గాడు విపరీతంగా నవ్వించడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ను పంచాడు. అలా బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ర్యాంపేజ్ ఆడించారు. ఓటీటీలో ఎప్పుడంటే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా కూడా 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్తో దూసుకుపోతుంది. మార్చి 29న వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. సినిమాకు మంచి టాక్ వస్తుంది కాబట్టి మరో 20రోజుల తర్వాత ఓటీటీ ప్రకటన అధికారికంగా రావచ్చు. 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్ టిల్లుగాడి డీజేకు యూత్ బాగా ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రోజులకు రూ.45.3 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకున్న నిర్మాతకు ఈ సినిమా అంతకు మించి కలెక్షన్స్ తెచ్చిబెట్టే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నేడు(మార్చి 31) ఆదివారం కాబట్టి మరింత భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. Tillanna Box-office RAMPAGE Continues, grosses over 𝟒𝟓.𝟑 𝐂𝐑 in 𝟐 𝐃𝐚𝐲𝐬 🔥🔥 Our Starboy 🌟 continues to shatter records all over! 💥💥 - https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo pic.twitter.com/Y3TeL0adtG — Sithara Entertainments (@SitharaEnts) March 31, 2024 -
‘టిల్లు స్క్వేర్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టిల్లు- 3 గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపిన నాగ వంశీ
'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు. ఇప్పుడు కూడా అంతే రేంజ్లో నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు.. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశాడు. హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథను రాశాడు. అందుకే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకు వస్తున్నారు. మార్చి 29న విడుదలైన ‘టిల్లు స్క్వేర్’కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'డీజే టిల్లు తీస్తున్నప్పుడే నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్ కావడంతో సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. నేను నటుడి కంటే ముందు ఈ సినిమాకి రచయితను. ఎంతో నిజాయతీగా కథ ఉండాలని రాశాను. ఎక్కువ, తక్కువలు అనే అభిప్రాయాలు లేకుండా ప్రతి పాత్రని డిజైన్ చేశాను. వాస్తవంగా అనుపమను వంద శాతం ఊహించి కథ రాస్తే.. తన నటనతో వెయ్యి శాతం 'టిల్లు స్క్వేర్'లో ప్రభావం చూపించింది. ఈ సినిమాలో కథ ప్రభావం ఎంతమేరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉంది.' అని ఆయన అన్నారు. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి తొలి షో నుంచే మంచి టాక్ వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 'టిల్లు స్క్వేర్' రూ.వంద కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పాడు. త్వరలో మూడో భాగాన్ని కూడా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
Tillu Square: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ
టైటిల్: టిల్లు స్వ్కేర్ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం:మల్లిక్ రామ్ నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 29, 2024 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్తో పాటు యూత్లో కల్ట్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టిల్లు స్వ్కేర్ కథేంటంటే.. రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'డీజే టిల్లు' సక్సెస్కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్ప్రైజింగ్గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది. 'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్గా, సినిమాటిక్గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Tillu Square Movie: ‘టిల్లు స్క్వేర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నెగెటివ్ కామెంట్స్.. హర్టయిన అనుపమ, అందుకే డుమ్మా!
హీరోయిన్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అనుపమ కూడా ఇలా తయారైందేంటని కోపంతో ఊగిపోయారు. ఇవన్నీ అవసరమా? అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పినా ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది పెట్టొద్దు బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజీపైనే స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. అతడు మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ నుంచి లేటెస్ట్గా ఓ పోస్టర్ రిలీజైంది. దానికింద చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించినే ఏది పడితే అది అనేయడం అనడం కరెక్ట్ కాదు! మీకు మాట్లాడే హక్కు ఉంది.. నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. హర్ట్ అవడం వల్లే? తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. నెగెటివ్ కామెంట్స్కు హర్ట్ అయినందువల్లే అనుపమ ఈవెంట్కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది. చదవండి: లండన్లో కొత్త ఇల్లు? -
సిద్దు నా దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలియదు
-
అమ్మాయిలు అందరూ డేంజరే అని ఒప్పుకున్నా అనుపమ
-
ఆ గుర్తింపు కోసమే అలాంటి క్యారెక్టర్ చేశా
-
అనుపమ ని ఒక ఆట ఆడుకున్న సిద్దు
-
'జై హనుమాన్' ప్రాజెక్ట్ను పక్కనపెడుతున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఇదేనా?
భారీ సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి రేసులో విన్నర్గా నిలిచిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే హనుమాన్ సినిమాకు సీక్వెల్గా 'జై హనుమాన్' ఉంటుందని.. అది 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. 'హనుమాన్' సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఇప్పుడు 'జై హనుమాన్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తీయబోయే సినిమా 'జై హనుమాన్' ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ ప్రాజెక్ట్కు సంబంధించి ఆయన అనుకున్న నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందని సమాచారం. దీంతో ఆయన డైరెక్ట్ చేసి పెండింగ్లో ఉన్న మరో ప్రాజెక్ట్ను మళ్లీ పట్టాలెక్కించాలని ఉన్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'ఆక్టోపస్' సినిమాపై ఆయన ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్తో తెరకెక్కనుందని టాక్. ఇందులో ఐదుగురు మహిళా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్తుందని గతంలో ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు జై హనుమాన్ ప్రాజెక్ట్కు కాస్త బ్రేక్ ఇచ్చి 'ఆక్టోపస్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం ఎవరికీ తెలియదు. అనుపమ కూడా గతంలో లేడి ఓరియెంటెడ్ చిత్రమైన బటర్ ఫ్లై ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.. త్వరలో ఆమె డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే లైన్లో ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ చిత్రం కూడా త్వరగా పూర్తి చేసుకుని థియేటర్లోకి వస్తే ఈ బ్యూటీకి మరో కొన్ని ప్రాజెక్ట్లు వచ్చే ఛాన్స్ ఉంది. -
ట్రెండింగ్లో ‘అనుపమ పరమేశ్వరన్’ (ఫొటోలు)
-
బోల్డ్నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్
కొందరు హీరోయిన్లని చూస్తే కుందనపు బొమ్మల్లా కనిపిస్తుంటారు. అందుకు తగ్గ పాత్రలే చేస్తుంటారు. 'అఆ','శతమానం భవతి' తదితర చిత్రాల్లో క్లాస్గా కనిపించిన అనుపమ.. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కోసం మాత్రం రెచ్చిపోయింది. ముద్దు సన్నివేశాలు, గ్లామర్ విషయంలో ఎలాంటి అడ్డు చెప్పలేదని టీజర్, పాటల్లాంటివి చూస్తే అర్థమైపోయింది. అయితే ఇలా ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయం ఇప్పుడు బయటపెట్టింది. మార్చి 29న 'టిల్లు స్క్వేర్' మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా 'ఓ మై లిల్లీ' అనే పాట రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా.. టీమ్ అంతా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మిగతా వాటి సంగతి పక్కనబెడితే అనుపమ.. బోల్డ్ క్యారెక్టర్లు గురించి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అయిపోయాయి. (ఇదీ చదవండి: సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని) 'యాక్టర్గా ఇన్నేళ్లలో చేసిన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ చేస్తుంటే బోర్ కొడుతుంది. ఈ మూవీలో లిల్లీ పాత్ర వదులుకోవడం అనేది పిచ్చి పని అవుతుంద. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో అమ్మాయికి ఇంత మంచి పాత్ర దొరకదు. అందుకే వదులుకోవాలని అనుకోలేదు' అని అనుపమ చెప్పుకొచ్చింది. అయితే ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్లీ అనుపమకు ఇలాంటి ప్రశ్ననే వచ్చేసరికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. అలానే ఇంట్లో ప్రతిరోజూ బిర్యానీ తింటారా? లేదు కదా అలానే నేను కూడా ప్రతిరోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు కూడా డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి అన్నీ కావాలి' అని 'టిల్లు స్క్వేర్' సినిమాలో తను చేసిన గ్లామర్ పాత్ర గురించి పరోక్షంగా కౌంటర్స్ ఇచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: కారు ప్రమాదం.. ఆ రూమర్స్ గురించి నమ్మొద్దు: సింగర్ మంగ్లీ) -
నడుము అందాలతో అనుపమ.. కేతికని ఇలా చూస్తే అంతే!
చీరలో కనిపించి టెంప్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ పలుచటి చీరలో గ్లామర్ చూపిస్తున్న భవనీ శ్రీ సెల్ఫీ స్మైల్తో పడేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీల లంగా ఓణీలో మరింత అందంగా 'మ్యాడ్' బ్యూటీ అనంతిక చీరలో సాయంత్రం పూట మత్తెక్కించేలా సిమ్రాన్ చౌదరి జిగేలుమనే డ్రస్సులో ధగధగలాడిపోతున్న శ్రీముఖి డిఫరెంట్ ఔట్ఫిట్తో వావ్ అనిపిస్తున్న శ్రద్ధా దాస్ అందాల విందు చేస్తున్న హాట్ హీరోయిన్ కేతిక శర్మ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sonarika Bhadoria (@bsonarika) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
బహుమతి లాంటి సినిమా: హీరోయిన్ అనుపమ
విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించనున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ధృవ్కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటించనున్నట్లు మంగళవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. రజనీకాంత్తో ‘కాలా’, ‘కబాలి’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘నా కెరీర్కు ఓ మంచి బహుమతిలా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘కబడ్డీ ఆట మూలాలను తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. మా టీమ్ సభ్యుల కెరీర్లో ఓ మైల్స్టోన్లా ఈ చిత్రం ఉంటుంది’’ అని మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. -
ధ్రువ్కు జోడీగా..?
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ను తీసుకున్నారట. అనుపమాకి ఇటీవల మారి సెల్వరాజ్ ఈ కథను వినిపించగా, ఈ బ్యూటీ ఆల్మోస్ట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మరి.. ధ్రువ్ విక్రమ్కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 15న తమిళనాడులోని తూత్తుకూడిలో ప్రారంభం కానుందని సమాచారం. -
దీన్ని గిఫ్ట్ ఇస్తే.. నేను మీ సొంతమవుతా: హీరోయిన్ అనుపమ
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ బంపరాఫర్ ఇచ్చింది. తనకు ఒకదాన్ని బహుమతిగా ఇస్తే మీ సొంతం అయిపోతానని చెప్పేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే అనుపమ లాంటి అమ్మాయి ఆఫర్ ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. కచ్చితంగా ఆ గిఫ్ట్ కొనిచ్చేస్తారుగా. ఇంతకీ అనుపమ ఏం చెప్పింది? అసలేం జరిగింది? (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) మలయాళ 'ప్రేమమ్'తో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన అనుపమ.. 'అఆ' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే', 'కార్తికేయ 2' తదితర చిత్రాలు చేసింది. రీసెంట్గా రవితేజ 'ఈగల్'లో కీలక పాత్రలో కనిపించింది. ఈమె సూపర్ హాట్గా నటించిన 'టిల్లూ స్క్వేర్' త్వరలో థియేటర్లలోకి రానుంది. సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటే అనుపమ.. అభిమానులతో టచ్లో ఉంటుంది. తాజాగా ఓ ఖడ్గమృగం పిల్లకి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి, దీన్ని ఎవరైనా తనకు బహుమతిగా ఇస్తే తను వాళ్ల సొంతమైపోతానని చెప్పింది. అంటే డేటింగ్ లేదా పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా చెప్పింది. ఇప్పుడీ క్యాప్షన్పై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. మరి గిఫ్ట్ ఇచ్చే ఆలోచన మీకేమైనా ఉందా? (ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు) -
ఈగల్కు ఓటీటీ డేట్ దొరికినట్లేనా..?
రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. సినిమా విడుదల సమయంలో ఈగల్కు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో.. ఇప్పుడు ఓటీటీ విడుదల విషయంలో కూడా పలు సమస్యలు ఎదురు అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలు వచ్చాక సినిమాకు కొంత అదనపు బిజినెస్ ఉంటుంది. కానీ పలు కారణాల వల్ల ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రావు. ఉదాహారణకు 'ది కేరళ స్టోరీ' చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా విడుదలయైన పది నెలలకు ఓటీటీలో విడుదల అయింది. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 9న విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామితో డీల్ కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లో ఈగల్ సందడి దాదాపు ముగిసిందని చెప్పవచ్చు. సినిమాపై మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత ఫర్వాలేదు అనే టాక్ రావడంతో మళ్లీ కలెక్షన్స్ పెరిగాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ఓటీటీ డీల్ సెట్ కాలేదు అనేది రవితేజ ఫ్యాన్స్తో పాటు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈగల్తో డిస్నీ ప్లస్ హాట్స్టార్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డీల్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అయితే అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. -
ప్రతి అడుగులో నా తోడున్నారు: అనుపమ
దక్షిణాది సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయమైన కేరళ బ్యూటీ అందులో పాఠశాల విద్యార్థినిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ దక్షిణాదిన టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 28వ బర్త్డే ఈ మూడు భాషల్లోనూ నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ సాధ్యమైనంత వరకు గ్లామర్కు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈమె తమిళంలో జయం రవి సరసన నటించిన సైరన్ చిత్రం గత వారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఇటీవలే ఈ భామ తన 28వ పుట్టినరోజు జరుపుకుంది. మొరిషియల్ దీవిలో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కలల జీవితానికి 10 ఏళ్లు పూర్తి అందులో తన కలల జీవితానికి దశాబ్దం ముగిసిందని పేర్కొంది. నటిగా తన ప్రతి అడుగులోనూ మీరు (ప్రేక్షకులు) వెన్నంటి ఉండి ఉత్సాహపరుస్తున్నారంది. 18 ఏళ్ల ప్రాయంలోనే నటిగా పరిచయం అయ్యానని చెప్పింది. మీ ప్రేమ, అభిమానాలు తనను ఒక శక్తిగా మారుస్తున్నాయంది. అందమైన జీవితాన్ని గడపడానికి, ధైర్యంగా కలలు కనడానికి, తానేమిటో తెలుసుకోవడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: ప్రేమ పేరుతో సోదరుడు మోసం.. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ -
'టిల్లు 2'లో అనుపమ గ్లామర్ షో..
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 'డీజే టిల్లు 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అందరికీ ఒక్క నిమిషం మతి పోయింది. ఎందుకంటే హీరో సిద్ధుతో ఓ సీన్లో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. అలానే లుక్స్ అన్నీ కూడా హాట్గానే ఉన్నాయి. చూస్తుంటే అస్సలు తగ్గినట్లు కనిపించట్లేదు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటోందట. కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్తో ముద్దు సన్నివేశాలు చేసి షాకిచ్చింది. దీని తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్గా కనిపించింది. ఇప్పుడు 'డీజే టిల్లు 2' పూర్తిగా రెచ్చిపోయింది. హాట్గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుపమ.. 'టిల్లు స్వ్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
మహేశ్ రూట్లోనే భార్య నమ్రత.. జాన్వీ కపూర్ కేక అంతే!
తిరుపతిలో భక్తి మోడ్లో హీరోయిన్ శ్రీలీల మత్తెక్కించే పోజుల్లో మైమరపిస్తున్న నభా నటేశ్ చీరలో బిగ్బాస్ బ్యూటీ సోనియా సోయగాలు బర్త్ డే స్పెషల్.. క్రేజీ ఫొటోలు పోస్ట్ చేసిన అనుపమ అందాలన్నీ చూపిస్తూ కాక రేపుతున్న జాన్వీ కపూర్ ఎలా మేకప్ అవుతానో చూపించిన అషూరెడ్డి జిమ్లో చెమటలు చిందిస్తున్న మహేశ్ భార్య నమ్రత View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Soniya Bansal (@soniyaofficial123) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Madhuri Vissamsetti - Makeup artist in Melbourne (@madhurimakeupandhair_artist) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) -
అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మలయాళ సినిమాతో నటిగా మారినప్పటికీ వరసగా తెలుగు సినిమాలు చేసి ఇక్కడ సెటిలైపోయింది. అయితే ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు పెద్దగా రావడం లేదు. అలానే ఉన్న ఒకటి రెండు ప్రాజెక్టుల్లోనూ సరికొత్తగా కనిపిస్తూ అందరూ అవాక్కయ్యాలే చేస్తోంది. తాజాగా ఈమె అభిమాని కూడా అదే ఫీలయ్యాడు. ఎందుకు అలా చేస్తున్నారంటూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు. ఇంతకీ ఏం చెప్పాడు? 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయిన అనుపమ.. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శతమానం భవతి, ఉన్నది ఒకటి జిందగీ, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాల్లో పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఈ మూవీస్ వల్ల ఈమెకి క్లాస్ ఇమేజ్ అయితే వచ్చింది గానీ పెద్దగా ఛాన్సులేం తీసుకురాలేదనో ఏమో గానీ రూట్ మార్చింది. 'రౌడీ బాయ్స్' సినిమాలో ముద్దు సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) తాజాగా 'డీజే టిల్లు 2' ట్రైలర్లో అనుపమని కూడా చాలామంది షాకయ్యారు. ఎందుకంటే లిప్ కిస్ చేయడంలో హద్దులు దాటేసినట్లే కనిపిస్తుంది. అలానే సినిమాలోనూ హాట్ హాట్గా కనిపించబోతుందని అందరికీ అర్థమైపోయింది. అయితే ట్రెండ్కి తగ్గట్లు అనుపమ మారే ప్రయత్నం చేస్తుండగా.. కొందరు అభిమానులు మాత్రం దీన్ని తీసుకోలేకపోతున్నారు. తాజాగా ఓ కుర్రాడు ఏకంగా అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు. 'నా ఆటోలో మీ ఫొటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి. ప్రేమమ్, అఆ, శతమానం భవతి మూవీస్ చేసిన మీరు.. ఇప్పుడు రౌడీబాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారిలానే సినిమాలు మీరు చేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేం నచ్చడం లేదండి' అని వీడియోలో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) #TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA — Actual India (@ActualIndia) February 18, 2024 -
బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
తాళిబొట్టుతో షాకిచ్చిన హీరోయిన్ అనుపమ.. ఇంతకీ ఏమైంది?
హీరోయిన్లు ఈ మధ్య వరసపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో చేస్తున్న పలువురు ముద్దుగుమ్మలు నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాళిబొట్టుతో ఉన్న కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు తొలుత షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అలా రిలాక్స్ అయిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) మలయాళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వీటితోపాటు తమిళ, కన్నడ మూవీస్లోనూ యాక్ట్ చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఈమె చేతిలో పెద్దగా ఛాన్సులైతే లేవు. అలానే గతంలో క్రికెటర్ బూమ్రాతో ప్రేమలో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ అతడికి పెళ్లయిపోవడంతో ఆ తర్వాత అనుపమ పెళ్లి గురించి ఎలాంటి గాసిప్స్ ఏం రాలేదు. కానీ తాజాగా పెళ్లి చీరతో మెడలో తాళిబొట్టు ఉన్న ఫొటోల్ని అనుపమ.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది తమిళ సినిమా 'సైరన్'లోని ఓ పాట కోసం రెడీ చేసిన లుక్ అని క్లారిటీ వచ్చేసింది. అంతే తప్ప అనుపమ పెళ్లి ఏం చేసుకోలేదు. కావాలంటే దిగువన ఉన్న ఈ పాట చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు హీరోయిన్) -
గ్లామర్ బెండు తీస్తున్న అనుపమ.. అలా నవ్వేస్తూ అనసూయ మాయ!
కంట్రోల్ తప్పిలా కాక రేపుతున్న అనుపమ పరమేశ్వరన్ కలర్ఫుల్ డ్రస్సుల్లో ధగధగా మెరిసిపోయిన సమంత సొంతూరిలో క్లాస్ లుక్లో కేక పుట్టిస్తున్న పూజాహెగ్డే జస్ట్ అలా నవ్వుతో చంపేస్తున్న యాంకర్ అనసూయ టైట్ ఫిట్ డ్రస్తో కుర్రాళ్లని అరిపించిన హనీరోజ్ బర్త్ డే మెమెరీస్ ఫొటోల్ని బయటపెట్టిన నమ్రత క్యూట్ పోజులిచ్చిన వీడియోని పోస్ట్ చేసిన మాళవిక పొట్టి నిక్కర్లో నాభి అందాలతో ముద్దుగుమ్మ నభా నటేశ్ ఒంపుసొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న అమైరా దస్తూర్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Krésha Bajaj (@kreshabajajofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Anahita (@officialanahita) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) -
డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!
కోలీవుడ్ స్టార్ జయంరవి, కీర్తీసురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ చిత్రంలో జయంరవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటిస్తున్నారు. (ఇది చదవండి: నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!) అయితే థియేటర్లలో రిలీజ్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సైరెన్ త్వరలోనే తెరపైకి రానుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జయంరవి అభిమానులకు షాకి ఇచ్చే విధంగా ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించారు. -
Eagle Movie HD Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
#EagleTrailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
విధ్వంసం ఆపేవాడు దేవుడు!
‘తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా... అది పట్టుకున్న వాణ్ణి తాకినప్పుడు...’ అంటూ నటుడు నవదీప్ చెప్పిన డైలాగ్తో ‘ఈగల్’ ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు’ అంటూ హీరో రవితేజ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ–‘‘ఈగల్’ సినిమా చాలా బావుంటుంది. కార్తీక్ రూపంలో ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ ప్రొడక్షన్ లాంటింది. విశ్వ ప్రసాద్గారితో మరొక చిత్రం చేయబోతున్నా. జనవరి 13న థియేటర్స్లో కలుద్దాం.. కుమ్మేద్దాం’’ అన్నారు. ‘‘గత ఏడాది రవితేజ గారికి ‘ధమాకా’ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాం. ‘ఈగల్’తో మరో బ్లాక్ బస్టర్కి రెడీ అవుతున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘ఈగల్’ పండక్కి గొప్ప థియేట్రికల్ అనుభూతి ఇచ్చే చిత్రం. జనవరి 13న థియేటర్స్లో చూడండి’’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని. ఈ వేడుకలో అనుపమ, కావ్యా థాపర్, నటులు నవదీప్, శ్రీనివాస్ అవసరాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: డేవ్ జాంద్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ΄్లాకి, కర్మ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. -
రూట్ మార్చిన అనుపమ.. ఆ సీన్స్కి కూడా నో ప్రాబ్లమ్!
మలయాళ బ్యూటీ అనుపమ.. ప్రస్తుతం స్లో అయిపోయింది. తెలుగులో రెండు మూవీస్ చేస్తోంది. ఇది రాబోయే రెండు నెలల్లో థియేటర్లలోకి రానున్నాయి. ఇవి కాకుండా తమిళం, మలయాళంలో ఒక్కో చిత్రం చేస్తోంది. ఇవి తప్పితే మరో ఛాన్స్ లేదు. చెప్పాలంటే ఈమెకు అవకాశాలు రావట్లేదు. దీంతో రూట్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) మలయాళంలో 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయిన అనుపమ.. 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత చాలా చిత్రాల్లో నటించింది కానీ 'శతమానం భవతి', 'కార్తికేయ 2' మాత్రమే ఈమెకు కొద్దో గొప్పో పేరు తీసుకొచ్చాయి. దిల్రాజు వారసుడు ఆశిష్ హీరోగా చేసిన 'రౌడీ బాయ్స్'లో లిప్ కిస్ సీన్స్లోనూ నటించి అందరూ అవాక్కయ్యేలా చేసింది. 'డీజీ టిల్లు' సీక్వెల్లోనూ కాస్తంత బోల్డుగానే అనుమప నటించింది. కొన్నాళ్ల ముందు రిలీజైన పాట ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇదేదో ఒకటో రెండు మూవీస్ విషయంలో కాదని.. ఇకపై మరింత బోల్డ్ తరహా పాత్రలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ అయినా సరే నటించడానికి అనుపమ సిద్ధమైపోయిందట. అవకాశాలు తగ్గుతుండటం వల్లే ఇలా రూట్ మార్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) -
ఈగల్: రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'ఆడు మచ్చా' సాంగ్ విన్నారా?
రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ , కావ్వా థాపర్ హీరోయిన్లుగా, నవదీప్, మధుబాల కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆడు మచ్చా..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. దావ్జాంద్ స్వరకల్పనలో కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ‘‘రవితేజ మల్టీషేడ్స్లో నటించిన చిత్రం ఇది. ఓ గ్రామీణ పండగ నేపథ్యంలో ‘ఆడు మచ్చా..’ పాట వస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఎలా సహాయపడగలను రాధిక
‘‘చెప్పు రాధిక.. ఏం కావాల నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు చెప్పు’’ అని సిద్ధు చెప్పే డైలాగ్తో ‘రాధిక..’ పాట ఆరంభమవుతుంది. ‘‘రాధిక ఎవరు.. నా పేరు రాధిక కాదు.. నా పేరు లిల్లీ’’ అంటుంది అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘టిల్లు స్క్వేర్’లోని రెండో పాట ‘రాధిక..’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు రామ్ మిరియాల ‘రాధిక..’ పాటను స్వరపరచి, పాడారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘రాధిక..’ పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
వెక్కిరింతలతో ఆత్మహత్య.. అనుపమ, చిన్మయి భావోద్వేగం!
పొగడ్త పన్నీరు వంటిది.. వాసన చూసి వదిలేయాలి అంటుంటారు. విమర్శ కూడా అంతే.. వినీవినపడనట్లు వదిలేయాలే కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవకూడదు. కానీ ఇక్కడ చెప్పుకునే మేకప్ ఆర్టిస్ట్ ప్రన్షు విమర్శలను తట్టుకోలేకపోయాడు. ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్లకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 'నా కొడుకు మేకప్ వేయడం సొంతంగా నేర్చుకున్నాడు. అతడిని చూసి నేను గర్వపడ్డాను. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నాను. 2019లో నేను విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గతేడాది నుంచి వింతగా గతేడాది నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా.. నేను అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానన్నాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్ పేరెంట్గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్ నుంచి మేకప్ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్ చార్లెస్ను చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు. అదే చివరి ఫోన్ కాల్.. ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత కామెంట్లను ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్ ఉండటంతో ట్యూషన్ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు. ఇంత పగ, ద్వేషమా? తను ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి అని ప్రన్షు తల్లి ఎమోషనలైంది. ఈ నోట్ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు అని మండిపడింది. ఈ పోస్ట్పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ గుండె బద్ధలైందని రాసుకొచ్చింది. చీర కట్టుకుని వీడియో కాగా ప్రన్షు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని తన నివాసంలో నవంబర్ 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండగ సమయంలో ప్రన్షు చీర కట్టుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశాడు. దీనికి విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ ట్రోలింగ్ను తట్టుకోలేకే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎల్జీబీటీక్యూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by 𝙋𝙧𝙖𝙣𝙨𝙝𝙪. (@glamitupwithpranshu) నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ.. -
రవితేజ ఈగల్ కౌంట్డౌన్ స్టార్ట్.. వేట మొదలైంది
మాస్ మహారాజ రవితేజ 'ఈగల్'గా సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్లు కనిపించనున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్డౌన్ మొదలైందని మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. సంక్రాంతి అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ.. ఈ ఆనంద సమయంలో కుటుంబం మొత్తం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది. అందుకే ఇండస్ట్రీలో చాలా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వస్తాయి. రవితేజ ఈగల్ కూడా జనవరి 13న విడుదల కానుంది. మరో 50 రోజుల్లో ఈగల్ వచ్చేస్తుందని కౌంట్డౌన్ పోస్టర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. అందులో రవితేజ డెస్క్పై చాలా ఆయుధాలతో కనిపించారు. రవితేజ కెరియర్లోనే ఇదొక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథగా రూపొందుతోందని గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈగల్పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. -
అనుపమ స్పెషల్ పచ్చబొట్టు.. విష్ణుప్రియని ఇలా చూస్తే మాత్రం!
వంగి మరీ అందాలు చూపిస్తున్న యాంకర్ విష్ణుప్రియ షైనింగ్ ఔట్ ఫిట్లో ధగధగా మెరిసిపోతున్న శివాత్మిక బిగ్బాస్ భాను శ్రీ బ్లాక్ డ్రస్సులో వయ్యారాలు వెకేషన్లో చిల్ అవుతున్న యాంకర్ రష్మీ గౌతమ్ టూర్ ఫొటోలు పోస్ట్ చేసిన హీరోయిన్ ప్రణీత హాట్నెస్ పెంచి మరి టెంప్ట్ చేస్తున్న అనుపమ సండే స్పెషల్.. అలాంటి స్టిల్స్తో రెచ్చగొడుతున్న మలైకా ఎద అందాలతో మెల్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ దిశా పటానీ ఆరెంజ్ డ్రస్లో వావ్ అనిపిస్తున్న శ్రద్ధాదాస్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
Eagle Movie Teaser Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
ఈగల్ టీజర్లో రవితేజ విధ్వంసం.. ఎలా ఉందో చూసేయండి
రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి. జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈగల్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియో వైరల్.. వారిని శిక్షించాలని డిమాండ్) కొండలో లావాను కిందకు పిలవకు. ఊరు ఉండదు. నీ ఉనికి ఉండదు అంటూ రవితేజ చెప్పిన పంచ్ డైలాగ్తో టీజర్ ఇంట్రెస్టింగ్గా ప్రారంభమైంది. అడవిలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. కనిపించడు. కానీ వ్యాపించి ఉంటాడు.. వెలుతురు వెళ్లే ప్రతిచోటకు వాడి బుల్లెట్ వెళుతుంది అంటూ రవితేజ క్యారెక్టర్ గురించి ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్స్ టీజర్కు హైలైట్గా నిలిచాయి. ఈగల్ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన నిఖిల్తో 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో మెప్పించాడు.. కార్తిక్ ఘట్టమనేనికి ఇది రెండో సినిమా. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు టీజర్లో ప్రకటించారు. ఇటీవల 'టైగర్ నాగేశ్వరరావు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్శీను, బలుపు, క్రాక్ వచ్చాయి. -
Anupama Parameswaran : ఫ్రెండ్స్తో ట్రిప్కు చెక్కేసిన కేరళ కుట్టి (ఫోటోలు)
-
టిల్లు డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’కి సహనిర్మాత: సాయి సౌజన్య. -
Anupama Parameswaran: గ్లామర్ డోస్ పెంచిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
హీరో రామ్తో అనుపమ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి!
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు భలే ఇంట్రస్ట్.. వారు ఏయే సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్గా కనిపిస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలా అన్నింటినీ ఆరా తీస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి జీవితంలోకి తొంగి చూడాలనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు గాసిప్రాయుళ్లు సెలబ్రిటీల గురించి లెక్కలేనన్ని పుకార్లు సృష్టిస్తుంటారు. అందులో లేటెస్ట్ రూమర్ ఒకటి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోతో ప్రేమలో బ్యూటీ? బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారట! త్వరలోనే వీరు ఏడడుగులు వేయనున్నారట! ఈ మేరకు ఓ వార్త నెట్టింట కోడై కూస్తోంది. సాధారణంగా ఇలాంటి గాసిప్స్ను అనుపమ లైట్ తీసుకుంటుంది. అయితే ఈ రూమర్లు విని విసుగు పుట్టిన అనుపమ తల్లి సునీత సదరు పుకార్లపై స్పందించినట్లు తెలుస్తోంది. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో పిసరంత నిజం కూడా లేదని కొట్టిపారేసిందట! ఇది చూసిన ఫ్యాన్స్.. హమ్మయ్య, మా అనుపమ ఇంకా సింగిలే అంటూ ఎగిరి గంతేస్తున్నారు. సినిమాల సంగతి.. కాగా అనుపమ, రామ్.. రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో వీరు కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ విషయానికి వస్తే.. తెలుగులో రవితేజ ‘ఈగిల్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ డైరెక్షన్లోనూ ఓ మూవీ చేస్తోంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్.. బ్యూటీ రియాక్షన్ చూశారా?