Australia vs New Zealand
-
T20 World Cup 2024: న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్తో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (40), ఎల్లిస్ పెర్రీ (30), అలైసా హీలీ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. బ్రూక్ హ్యలీడే, రోస్మేరీ మెయిర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మెగాన్ షట్, సదర్ల్యాండ్ తలో మూడు వికెట్లు తీసి కివీస్ను దెబ్బకొట్టారు. సోఫీ మోలినెక్స్ రెండు, జార్జియా వేర్హమ్, తహిళ మెక్గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్లో జార్జియా ప్లిమ్మర్ (29), సుజీ బేట్స్ (20), లియా తహుహు (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో ఆసీస్ గ్రూప్-ఏలో (పాయింట్ల పట్టిక) అగ్రస్థానానికి చేరింది. పాక్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా -
చరిత్ర సృష్టించిన ఆసీస్ వికెట్ కీపర్.. పంత్ రికార్డు బద్దలు
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు. ఇక ఈమ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్లో విజయవంతమైన ఛేజింగ్లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ క్లీన్ స్వీప్
టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(98 నాటౌట్), మిచెల్ మార్ష్(80) కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్,క్యారీ జట్టును అందుకున్నారు. ఆచతూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖరిలో మార్ష్ ఔట్ కావడంతో మ్యాచ్ కాస్త కివీస్ వైపు మలుపు తిరిగింది. కానీ క్రీజులో పాతుకుపోయిన క్యారీ, కెప్టెన్ కమ్మిన్స్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లు, మాట్ హెన్రీ రెండు, టిమ్ సౌథీ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 372 పరుగులు చేసిన కివీస్.. ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చదవండి:IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ -
రసవత్తరంగా కివీస్-ఆసీస్ రెండో టెస్టు..
క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17),మార్ష్(27) పరుగులతో ఉన్నారు. మాట్ హెన్రీ, సీర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్(9) రెండో ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్లో ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(82), టామ్ లాథమ్(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, లయోన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
NZ vs AUS: చెలరేగిన హాజిల్వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
భారత అంపైర్కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్లో ఇతను అంపైర్గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్ల వందో టెస్ట్ మ్యాచ్కు అంపైర్గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్లో కూడా అంపైర్గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్తో వంద టెస్ట్ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన లియోన్.. కివీస్ పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్ దాటికి న్యూజిలాండ్ కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్లను లియోన్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబరిచిన లియోన్ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్గా నాథన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఈ ఆసీస్ దిగ్గజం 10 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్తో అశ్విన్ రికార్డును లియోన్ బ్రేక్ చేశాడు. -
తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగాడు. 111/3 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. అదనంగా 85 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(59) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్తో పాటు హాజిల్వుడ్ రెండు, హెడ్, గ్రీన్ తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 204 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో కివీస్ ముందు 369 పరుగులు భారీ టార్గెట్ను ఆస్ట్రేలియా ఉంచింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్లు), హాజల్వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 & 196 ఫలితం: 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం -
చరిత్ర సృష్టించిన ఫిలిప్స్.. తొలి ఆటగాడిగా! 15 ఏళ్లలో
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్లో పార్ట్ టైమ్ బౌలర్గా ఎటాక్లోకి వచ్చిన ఫిలిప్స్ తన స్పిన్ మయాజాలంతో ఆసీస్ను ముప్పుతిప్పులు పెట్టాడు. ఫిలిప్స్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్లెన్.. కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అందులో 4 మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఫిలిప్స్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగిన ఫిలిప్స్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 15 ఏళ్లలో న్యూజిలాండ్ గడ్డపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి కివీ స్పిన్నర్గా ఫిలిప్స్ నిలిచాడు. ఆఖరిగా 2008లో బ్లాక్ క్యాప్స్ స్పిన్నర్ జీతన్ పటేల్ 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్లు), హాజల్వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రీన్.. తన విరోచిత పోరాటంతో జట్టుకు 383 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కాగా ఈ మ్యాచ్లో టెయిలాండర్ జోష్ హాజిల్వుడ్తో కలిసి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పదో వికెట్కు హాజిల్వుడ్తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో ఆసీస్కు న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు జాసన్ గిల్లెస్పీ , గ్లెన్ మెక్గ్రాత్ పేరిట ఉండేది. 2004 లో కివీస్తో జరిగిన ఓ టెస్టులో 10 వికెట్కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజాగా మ్యాచ్తో ఆల్టైమ్ రికార్డును గ్రీన్-హాజిల్వుడ్ జోడీ బ్రేక్ చేసింది. ఇక 279/9 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అదనంగా మరో 104 పరుగులు చేసింది.ఓవరాల్గా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 275 బంతులు ఎదుర్కొన్న గ్రీన్.. 23 ఫోర్లు, 5 సిక్స్లతో 174 పరుగులు చేశాడు. హాజిల్ వుడ్ 62 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు. ఆ తర్వాత కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. -
టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్న నాథన్ లయోన్ హవా.. వాల్ష్ రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ హవా కొనసాగుతుంది. తాజాగా అతను దిగ్గజ పేసర్, విండీస్ మాజీ బౌలర్ కోట్నీ వాల్ష్ రికార్డును బద్దలు కొట్టాడు. వాల్ష్ 1984-2001 మధ్యలో 128 టెస్ట్లు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో నాలుగు వికెట్లు పడగొట్టిన లయెన్.. తన టెస్ట్ వికెట్ల కౌంట్ను 521కి పెంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లయోన్.. వాల్ష్ను అధిగమించి, ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్ల్లో 500 వికెట్ల మార్కును తాకాడు. ప్రస్తుతం అతను 507 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) టాప్లో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (698), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (5), నాథన్ లయోన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (174 నాటౌట్) భారీ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 179 పరుగులకే ఆలౌటైంది. లయోన్ 4, హాజిల్వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (71) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
AUS vs NZ: కామెరాన్ గ్రీన్ విరోచిత శతకం..
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మొదలైంది. మొదటి రోజు ఆటలో కివీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆసీస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ మాత్రం అద్బుత సెంచరీతో అడ్డుగా నిలిచాడు. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ ఆసీస్ను 4 వికెట్లతో దెబ్బతీశాడు. అతడితో పాటు విలియం ఒరోర్కే, కుగ్గిలిజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్ను గ్రీన్ అదుకున్నాడు. 155 బంతుల్లో 16 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గ్రీన్తో పాటు మిచెల్ మార్ష్(40) పరుగులతో రాణించాడు. చదవండి: #Shreyas Iyer: అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా? -
రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండరీ అంపైర్..
దక్షిణాఫ్రికా లెజండరీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనంతరం 16 ఏళ్ల అంపైరింగ్ కెరీర్కు గుడ్బై చెప్పనున్నాడు. 2006లో జోహన్స్బర్గ్ వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్తో ఎరాస్మస్ అంపైర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కెరీర్లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20ల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్గా ఎరాస్మస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ అంపైర్గా ఎరాస్మస్ వ్యవహరించాడు.అదేవిధంగా మూడు సార్లు(2016, 2017, 2021) ఐసీసీ బెస్ట్ అంపైర్గా ఎరాస్మస్ నిలిచాడు. కాగా ఇప్పుడు ఎరాస్మస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్లో దక్షిణాఫ్రికా నుంచి అంపైర్గా అడ్రియన్ హోల్డ్స్టాక్ ఒక్కరే మిగలనున్నారు. -
NZ vs Aus: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్తో సిరీస్లో స్టీవ్ స్మిత్ ఓపెనర్గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది. ఆల్రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు. వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్ కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్వన్ బౌలర్ కావడం విశేషం. న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం -
శుభవార్త చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విలియమ్సన్ తెలిపాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ.. చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఇప్పుడిక ముగ్గురు.. ఈ ప్రపంచంలోకి వచ్చే క్రమంలో సురక్షితంగా నీ ప్రయాణం సాగినందుకు సంతోషం. అందమైన చిన్నారికి స్వాగతం’’ అని కేన్ విలియమ్సన్ కూతురి ఆగమనాన్ని తెలిపాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహ సహచర క్రికెటర్ల నుంచి విలియమ్సన్- సారాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్ విలియమ్సన్- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు. ఇక మూడో సంతానంగా వీరికి తాజాగా మరో కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు దూరమైన కేన్ విలియమ్సన్ టెస్టు సిరీస్తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గురువారం నుంచి ఆసీస్తో మొదలుకానున్న తొలి టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నాడు. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ.. View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) -
NZ Vs Aus: న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే! -
న్యూజిలాండ్కు ఘోర పరాభవం.. మళ్లీ ఆస్ట్రేలియానే
స్వదేశంలో న్యూజిలాండ్కు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా ఆసీస్తో జరిగిన మూడో టీ20లోనూ కివీస్ ఓటమి పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 0-3 తేడాతో న్యూజిలాండ్ వైట్వాష్కు గురైంది. ఆఖరి టీ20 విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత ఆసీస్ను బ్యాటింగ్కు అహ్హనించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 67-2(6.2 ఓవర్లు) వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే కొద్దిసేపుటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ మళ్లీ ఆరంభమైంది. కానీ 8.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టింది. అనంతరం వర్షం మళ్లీ తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ 118(10.4 ఓవర్లు) వద్ద వర్షం మళ్లీ ఆటకు బ్రేక్లు వేసింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ ఆసీస్ ఇన్నింగ్స్ మాత్రం 10. 4 ఓవర్లకే ముగిసిపోయింది. ఈ క్రమంలో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం కివీస్ టార్గెట్ను 10 ఓవర్లలో 126 పరుగులగా నిర్ణయించారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) ఆఖరివరకు పోరాడాడు. ఇక ఆసీస్ బౌలర్లలో జంపా, షార్ట్, జానెసన్ తలా ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షార్ట్(27), మాక్స్వెల్(20) పరుగులతో రాణించారు. చదవండి: Babar Azam: ఏయ్ దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం -
వావ్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో కివీస్ ఓపెనర్ విల్ యంగ్ను వేడ్ పెవిలియన్కు పంపాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో తొలి బంతిని యంగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ మిస్టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ వేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన యంగ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఫిబ్రవరి 25న జరగనుంది. pic.twitter.com/Wkw2LZb1JX — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఫెర్గూసన్ నిప్పులు చెరిగినప్పటికీ (3.5-0-12-4) న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఫెర్గూసన్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసి, 72 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. ఫెర్గూసన్తో పాటు ఆడమ్ మిల్నే (2/40), బెన్ సియర్స్ (2/29), మిచెల్ సాంట్నర్ (2/35) రాణించడంతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిడ్ హెడ్ (45) కాస్త పర్వాలేదనిపించాడు. కమిన్స్ (28), మార్ష్ (26), టిమ్ డేవిడ్ (17), స్టీవ్ స్మిత్ (11), నాథన్ ఇల్లిస్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మ్యాక్స్వెల్ (6), ఇంగ్లిస్ (5), మాథ్యూ వేడ్ (1), జంపా (1), హాజిల్వుడ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. జంపా మాయాజాలం.. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆడమ్ జంపా (4-0-34-4) మాయాజాలం దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ (2/16), హాజిల్వుడ్ (1/12), కమిన్స్ (1/19), మార్ష్ (1/18) కూడా రాణించారు. కివీస్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (42) చేశాడు. ఫిలిప్స్తో పాటు జోష్ క్లార్క్సన్ (10), బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫిన్ అలెన్ (6), విల్ యంగ్ (5), సాంట్నర్ (7), చాప్మన్ (2), మిల్నే (0), ఫెర్గూసన్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ డెవాన్ కాన్వే బ్యాటింగ్కు దిగలేదు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25న ఇదే ఆక్లాండ్లో జరుగనుంది. -
చితక్కొట్టేశాడు.. బౌల్ట్కు చుక్కలు చూపించాడు!
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు పునరాగమనంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కివీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్లో.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ చితక్కొట్టాడు. కాగా కివీస్ పర్యటనలో భాగంగా ఆసీస్ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి అక్లాండ్ వేదికైంది. ఈడెన్ పార్క్ మైదానంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన ట్రెంట్ బౌల్ట్కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. మొదటి ఓవర్ తొలి బంతినే ఫోర్గా మలిచిన హెడ్.. ఆ తర్వాత పరుగు తీయలేకపోయినా.. మరుసటి బంతికి సిక్సర్ బాదాడు. అదే జోరును కొనసాగిస్తూ వరుసగా మరో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఇలా బౌల్ట్ బౌలింగ్లో ఒక్క ఓవర్లోనే 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్లో బౌల్ట్ ఏకంగా 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా న్యూజిలాండ్తో రెండో టీ20లో ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 45), కెప్టెన్ మిచెల్ మార్ష్(26), ప్యాట్ కమిన్స్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. ఆడం మిల్నే, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ తలా రెండు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడే క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్ కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2022 నవంబరులో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన బౌల్ట్.. 2023లో వన్డే ఆడాడు. ఈ క్రమంలో ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా టిమ్ సౌతీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్తో కలుపుకుని 123 మ్యాచ్ల్లో న్యూజిలాండ్కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 32 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్లు ఉన్నాయి. కాగా రచిన్కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్రౌండర్ ఎంట్రీ
వెస్టిండీస్తో టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య కివీస్తో మూడు టీ20లు, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆసీస్ తలపడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్కు తమ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తాజాగా టెస్టు సిరీస్ జట్టును సైతం వెల్లడించింది. ఈ సిరీస్కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్ కోసం పేస్ ఆల్రౌండర్ మైఖేల్ నీసర్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అదే విధంగా కివీస్ సిరీస్లో ఆసీస్ జట్టు కెప్టెన్గా ప్యాట్ కమ్మిన్స్ వ్యవహరించనుండగా.. పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ స్ధానంలో మాథ్యూ రెన్షా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. ఫిబ్రవరి 29 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్లు మధ్య ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నేజర్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్ కివీస్తో టీ20 సిరీస్కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్కు ఛాన్స్
న్యూజిలాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. స్వదేశంలో వెస్టిండీస్తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న ఆసీస్ సీనియర్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ తిరిగి కివీస్ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డే, టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పిన డేవిడ్ వార్నర్కు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 21న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా బ్లాక్ క్యాప్స్తో కంగారులు ఆడనున్నారు. కాగా ఆసీస్ జట్టు ప్రస్తుతం విండీస్తో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. కివీస్తో టీ20 సిరీస్కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: IND vs ENG: రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్కు వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే? -
రచిన్ అరుదైన రికార్డు.. ప్రపంచకప్ చరిత్రలో సచిన్ తర్వాత అతడొక్కడే
‘‘ఇంతకుముందు చాలా సార్లు నన్ను ఈ ప్రశ్న అడిగారు. నేనేతై వందకు వంద శాతం కివీనే. అయితే, భారత సంతతి మూలాలు ఉండటం పట్ల కూడా గర్విస్తున్నా’’ అని న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అన్నాడు. ఇండియాలో ఆడటం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడి పడటం లేదని పేర్కొన్నాడు. కాగా బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి దంపతుల కుమారుడే రచిన్ రవీంద్ర. తనకు ఇష్టమైన భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కలిసి వచ్చేలా రవి తన కుమారుడికి రచిన్ రవీంద్రగా నామకరణంగా చేశాడు. ఇక న్యూజిలాండ్లో పుట్టిపెరిగిన రచిన్ అనంతపురంలో క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు. టీమిండియాతో 2012లో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తొలిసారి వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా మెగా టోర్నీ ఆడుతున్న రచిన్ ఆరంభ మ్యాచ్లో ఇంగ్లండ్కు చుక్కలు చూపించాడు. 123 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెండింగ్ చాంపియన్ ఓటమిని శాసించాడు. ఆ తర్వాత కూడా కివీస్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ ఆల్రౌండర్ శనివారం మ్యాచ్లోనూ బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ రచిన్ ఆట అభిమానులను ఆకట్టుకుంది. ఆసీస్తో మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన రచిన్ 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రచిన్ రవీంద్రకు ఇండియాలో మ్యాచ్ ఆడటం ఒత్తిడి కలిగిస్తోందా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘ఇక్కడ నేను కివీ(న్యూజిలాండ్ పౌరుడు అన్న ఉద్దేశం)గా అడుగుపెట్టాను. అయితే, నా తల్లిదండ్రులు పుట్టిపెరిగిన దేశం ఇది. మా కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఇక్కడే ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ఇక ఇండియాలో పిచ్ కండిషన్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయన్న రచిన్.. తన నైపుణ్యాలను రోజురోజుకీ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టానని తెలిపాడు. సచిన్ తర్వాత రచినే కాగా వన్డే వరల్డ్కప్-2023లో ఇప్పటి వరకు 406 పరుగులు సాధించిన రచిన్ రవీంద్ర.. 23 ఏళ్ల వయసులో ప్రపంచకప్ చరిత్రలో 400+ పరుగులు రాబట్టిన రెండో ప్లేయర్గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. -
న్యూజిలాండ్పై ఆసీస్ గెలుపు.. స్టార్క్ జైత్రయాత్రకు ముగింపు.. పలు రికార్డుల వివరాలు
ఆసీస్తో ఇవాళ (అక్టోబర్ 28) జరిగిన ఉత్కంఠ సమరంలో న్యూజిలాండ్ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన కివీస్.. ప్రత్యర్ధికి ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలైంది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి కివీస్ను గెలిపించినంత పని చేశారు. చివరి బంతికి ఆరు కావాల్సి ఉండగా.. స్టార్క్ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో కివీస్ కనీసం ఒక్క పరుగు కూడా రాబట్టలేక ఓటమిపాలైంది. ఆసీస్ గెలిచినా.. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలిచినా, ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం చెత్త గణాంకాలను నమోదు చేయడంతో పాటు వరల్డ్కప్లో తన వికెట్ల జైత్రయాత్రకు ముగింపు పలికాడు. ఈ మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 89 పరుగులు సమర్పించుకుని వరల్డ్కప్లో ఆసీస్ తరఫున అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ మరో చెత్త రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్కప్లో గత 23 మ్యాచ్లుగా సాగుతున్న తన వికెట్ల జైత్రయాత్రకు (మ్యాచ్లో కనీసం ఓ వికెట్ తీయడం) ఈ మ్యాచ్తో ఎండ్ కార్డ్ పడింది. పై రికార్డులతో పాటు ఈ మ్యాచ్లో నమోదైన పలు రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.. వరల్డ్కప్ మ్యాచ్ల్లో రెండో అత్యధిక సిక్సర్ల సంఖ్య (32) రికార్డు ఈ మ్యాచ్లో నమోదైంది. ఈ విభాగంలో 2019 వరల్డ్కప్ ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ టాప్లో ఉంది. ఆ మ్యాచ్లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. వరల్డ్కప్ మ్యాచ్ల్లో రెండో అత్యధిక బౌండరీల సంఖ్య (97) రికార్డు ఈ మ్యాచ్లో నమోదైంది. ఈ జాబితాలో టాప్లో ఇదే వరల్డ్కప్లో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో ఏకంగా 105 బౌండరీలు నమోదయ్యాయి. వన్డేల్లో ఛేదనలో నాలుగో అత్యధిక స్కోర్ (383/9) రికార్డును న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో నమోదు చేసింది. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ టాప్లో ఉంది. ఆ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించి సంచలనం సృష్టించింది. ఈ విభాగంలో 2009లో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. నాటి మ్యాచ్లో భారత్ నిర్ధేశించిన 415 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీలంక 411 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓటమిలో (వరల్డ్కప్లో) అత్యధిక స్కోర్ (383/9) చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. ఇదే వరల్డ్కప్లో లంకేయులు 344/9 స్కోర్ చేయగా.. పాక్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. వరల్డ్కప్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక క్యాచ్లు (3) అందుకున్న నాన్ వికెట్కీపర్ స్టార్క్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్ (నాన్ వికెట్కీపర్స్) కూడా వరల్డ్కప్ మ్యాచ్ల్లో 3 క్యాచ్లు పట్టారు. వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన విభాగంలో ఈ మ్యాచ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ (872) టాప్లో ఉండగా.. 2009 భారత్-శ్రీలంక మ్యాచ్ (825) రెండో స్థానంలో నిలిచింది. ఇవే కాక ఈ మ్యాచ్లో పలు చిన్నా చితక రికార్డులు కూడా నమోదయ్యాయి. -
389 పరుగుల భారీ లక్ష్యం.. నరాలు తెగే ఉత్కంఠ.. పోరాడి ఓడిన న్యూజిలాండ్
ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 28) జరిగిన రసవత్తర సమరంలో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆసీస్కు ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలయ్యారు. కివీస్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా నీషమ్ తన జట్టును గెలిపించేందుకు చివరి నిమిషం వరకు పోరాడి విఫలమయ్యాడు. ఆఖరి 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన తరుణంలో నీషమ్ లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. అయినా కివీస్ గెలిచేందుకు చివరి బంతికి కూడా అవకాశం ఉండింది. ఆఖరి బంతికి ఫెర్గూసన్ సిక్సర్ బాది ఉంటే న్యూజిలాండ్ సంచలన విజయం సాధించి ఉండేది. చివరి బంతిని స్టార్క్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్ వీరోచిత పోరాటం ముగిసింది. ఒకవేళ ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాధించి ఉంటే, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఛేదనగా మిగిలిపోయి ఉండేది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రచిన్, నీషమ్తో పాటు డారిల్ మిచెల్ (54) కూడా రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, హాజిల్వుడ్, కమిన్స్ తలో 2, మ్యాక్స్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. -
CWC 2023 AUS VS NZ: విరాట్ కోహ్లిని దాటేసిన రచిన్ రవీంద్ర
ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ భవిష్యత్తు తార రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్పై 82 బంతుల్లో శతకం) బాదిన రచిన్.. ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో మరో విధ్వంసకర శతకం బాది పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసీస్తో మ్యాచ్లో కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన రచిన్.. 116 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీ రచిన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 406 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రచిన్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ (5 మ్యాచ్ల్లో 354 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. రచిన్ ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో కోహ్లిని వెనక్కునెట్టాడు (ఐదో స్థానానికి). ఈ జాబితాలో క్వింటన్ డికాక్ (6 మ్యాచ్ల్లో 431 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. వార్నర్ (6 మ్యాచ్ల్లో 413) రెండు, మార్క్రమ్ (6 మ్యాచ్ల్లో 356) నాలుగో స్థానంలో నిలిచారు. కాగా, ఈ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 389 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పోరాడుతుంది. ఈ జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి లక్ష్యానికి 75 పరుగుల దూరంలో (42 బంతుల్లో) ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. -
రచిన్ రవీంద్ర మరో విధ్వంసకర శతకం.. ఆసీస్కు ముచ్చెమటలు
ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ భవిష్యత్తు తార రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్పై 82 బంతుల్లో శతకం) సాధించిన రచిన్.. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో మరో విధ్వంసకర శతకం బాదాడు. ఈ మ్యాచ్లో రచిన్ కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. రచిన్ శతకాన్ని సిక్సర్ బాది చేరుకోవడం విశేషం. ఆసీస్ నిర్ధేశించిన 389 పరుగుల లక్ష్య ఛేదనలో సహచరులంతా వెనుదిరుగుతున్నా రచిన్ ఒక్కడే ఒంటిపోరాటం చేస్తూ ఆసీస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. 38 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి లక్ష్యానికి 116 పరుగుల దూరంలో ఉంది. రచిన్తో పాటు నీషమ్ క్రీజ్లో ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. -
CWC 2023 AUS VS NZ: అతి భారీ సిక్సర్ నమోదు
2023 వన్డే ప్రపంచకప్లోకెళ్లా అత్యంత భారీ సిక్సర్ ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్లో నమోదైంది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ఫీట్ను సాధించాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్సర్ బాదాడు. మ్యాక్స్వెల్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్పై పడింది. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే అతి భారీ సిక్సర్. మ్యాక్స్వెల్కు ముందు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ పేరిట ఉండేది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అయ్యర్ 101 మీటర్ల సిక్సర్ బాదాడు. అయ్యర్కు ముందు డేవిడ్ వార్నర్ 98 మీటర్ల సిక్సర్, డారిల్ మిచెల్ 98 మీట్లర సిక్సర్, డేవిడ్ మిల్లర్ 95 మీటర్ల సిక్సర్లు బాదారు. Glenn Maxwell smashes the biggest six of the 2023 World Cup. 104M at the Dharamshala Stadium. pic.twitter.com/soR1PNxPNm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023 కాగా, కివీస్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగి 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతనికి ముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బౌల్ట్ చెరి 3 వికెట్లు, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (18), డారిల్ మిచెల్ (21) క్రీజ్లో ఉన్నారు. కివీస్ కోల్పోయిన 2 వికెట్లు హాజిల్వుడ్కు దక్కాయి. -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు
వన్డే వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తన మొదటి వరల్డ్కప్ మ్యాచ్లోనే హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 59 బంతుల్లోనే హెడ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 67 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 10 ఫోర్లు, 7 సిక్స్లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీతో చెలరేగిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది వరల్డ్కప్లో ఆఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో రోహిత్ రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు. చదవండి: WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా అంటే..? -
CWC 2023: ఆసీస్ ఓపెనర్లు ఊచకోత.. 2 బంతుల్లో ఊహకందని విధ్వంసం
న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. ఓ దశలో ఆసీస్ జోరు చూసి ఈ మ్యాచ్లో 500 పరుగుల స్కోర్ దాటడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆఖర్లో కివీస్ బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ 400 లోపు స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ ఆఖరి 4 వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడం విశేషం. 49 ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. ఆఖరి ఓవర్ రెండో బంతికి మ్యాట్ హెన్రీ.. స్టార్క్ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ సమాప్తమైంది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (10-0-37-3) నమోదు చేయగా.. బౌల్ట్ 3, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. కివీస్ బౌలర్లలో ఫిలిప్స్ తప్పించి మిగతావారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండు బంతుల్లో 21 పరుగులు.. ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓ అరుదైన ఫీట్ నమోదైంది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్లు వార్నర్, హెడ్లు 2 బంతుల్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నారు. ఓవర్ తొలి బంతిని వార్నర్ సిక్సర్గా మలచగా.. రెండో బంతిని అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. ఈ బంతికి వార్నర్ సింగిల్ తీశాడు. దీంతో స్ట్రయిక్లోకి వచ్చిన హెడ్కు ఫ్రీ హిట్ లభించింది. ఈ బంతిని కూడా హెన్రీ క్రీజ్ దాటి బౌలింగ్ చేయడంతో అంపైర్ మరోసారి నో బాల్గా ప్రకటించాడు. ఈ బంతిని హెడ్ సిక్సర్గా మలిచాడు. దీంతో రెండో బంతి పడకుండానే ఆసీస్ 15 పరుగులు పిండుకుంది. ఎట్టకేలకు హెన్రీ రెండో బంతిని సరిగ్గా బౌల్ చేసినప్పటికీ.. ఆ బంతిని కూడా హెడ్ సిక్సర్గా మలిచాడు. దీంతో ఆసీస్ 2 బంతుల్లో 21 పరుగులు సాధించింది. -
CWC 2023: న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. ఓ దశలో ఆసీస్ జోరు చూసి ఈ మ్యాచ్లో 500 పరుగుల స్కోర్ దాటడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆఖర్లో కివీస్ బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ 400 లోపు స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ ఆఖరి 4 వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడం విశేషం. 49 ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. ఆఖరి ఓవర్ రెండో బంతికి మ్యాట్ హెన్రీ.. స్టార్క్ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ సమాప్తమైంది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (10-0-37-3) నమోదు చేయగా.. బౌల్ట్ 3, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. కివీస్ బౌలర్లలో ఫిలిప్స్ తప్పించి మిగతావారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. వరల్డ్కప్ అరంగేట్రంలోనే!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన వన్డే వరల్డ్కప్ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. వన్డే ప్రపంచపకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో ఆస్ట్రేలియా తలపడుతోంది. తొలి ఐదు మ్యాచ్లకు గాయం కారణంగా దూరంగా ఉన్న హెడ్కు.. కివీస్తో మ్యాచ్లో మాత్రం చోటు దక్కింది. తన వరల్డ్కప్ తొలి మ్యాచ్లోనే హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కివీస్ బౌలర్లను హెడ్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లోనే హెడ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 67 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 10 ఫోర్లు, 7 సిక్స్లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా వార్నర్తో కలిసి తొలి వికెట్కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక తన తొలి వరల్డ్కప్ మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా వన్డే ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఐదో ఆసీస్ క్రికెటర్గా హెడ్ నిలిచాడు. చదవండి: WC 2023: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆస్ట్రేలియా ఓపెనర్ల విధ్వంసం.. వరల్డ్కప్ చరిత్రలోనే
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్.. ఆసీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బ్లాక్ క్యాప్స్ ప్రధాన బౌలర్లు మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ను వీరిద్దరూ టార్గెట్ చేశారు. పవర్ప్లేలో అత్యధిక స్కోర్.. వీరిద్దరి బ్యాటింగ్ జోరు ఫలితంగా తొలి పవర్ ప్లేలో ఆస్ట్రేలియా ఏకంగా 118 పరుగులు చేసింది. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక ఫస్ట్ పవర్ప్లే స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 2015 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్పై 116 పరుగులు తొలి పవర్ప్లేలో కంగారులు సాధించారు. తాజా మ్యాచ్తో ఆ రికార్డును ఆసీస్ అధిగమించింది. హెడ్, వార్నర్ ఇద్దరూ తొలి వికెట్కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 81 పరుగులు చేయగా.. హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లతో 109 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. చదవండి: World Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో బిగ్ షాక్..! View this post on Instagram A post shared by ICC (@icc) -
Aus vs NZ: గ్రీన్ అవుట్.. ట్రవిస్ హెడ్ వచ్చేశాడు! ఒక్క మార్పుతో కివీస్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ధర్మశాల వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగినట్లు కివీస్ సారథి టామ్ లాథమ్ తెలిపాడు. మార్క్ చాప్మన్ పిక్కల్లో నొప్పితో దూరంకాగా.. అతడి స్థానంలో జిమ్మీ నీషం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. మేము టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఈ మ్యాచ్లో కామెరాన్ గ్రీన్ స్థానంలో ట్రవిస్ హెడ్ తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు. ఇక కివీస్తో పోరు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుందన్న కమిన్స్.. ‘‘వాళ్లేంటో మాకు తెలుసు.. మేమేంటో వాళ్లకు కూడా బాగానే తెలుసు. భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో న్యూజిలాండ్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. మూడు గెలుపొందిన ఆసీస్ నాలుగో స్థానంలో ఉంది. తుదిజట్లు: న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
T20 World Cup 2022: ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా...
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ పోరు అనూహ్య ఫలితంతో మొదలైంది. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే భారీ పరాజయం ఎదురైంది. గత వరల్డ్ కప్ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ న్యూజిలాండ్ ఆతిథ్య జట్టును 89 పరుగుల తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. 2011 తర్వాత ఆసీస్ గడ్డపై కివీస్కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇదే తొలి విజయం కాగా, 15 ఓటముల తర్వాత 16వ మ్యాచ్లో గెలుపు దక్కింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఇచ్చిన శుభారంభం కూడా కివీస్ భారీ స్కోరుకు కారణమైంది. చివర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడి స్కోరును 200 పరుగులకు చేర్చాడు. హాజల్వుడ్కు 2 వికెట్లు దక్కగా, ఐదుగురు ఆసీస్ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేక, మరో 23 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలిపోవడం విశేషం. కివీస్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోయిన ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్వెల్ (20 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఫర్వాలేదనిపించారు. సాన్ట్నర్కు 3 వికెట్లు దక్కగా, 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన టిమ్ సౌతీ... అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (125) తీసిన బౌలర్గా నిలిచాడు. -
కోలుకోలేని దెబ్బ కొట్టారు.. నెట్ రన్రేటు దారుణం.. అదృష్టం కలిసొస్తేనే: ఫించ్
T20 World Cup 2022- NZ Vs Aus- Aaron Finch: ‘‘మొదటి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ ఓపెనర్లు అద్బుతంగా ఆడారు. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. లక్ష్య ఛేదనలో శుభారంభం చేయాలని భావించినా.. మేము ఆ పని చేయలేకపోయాం’’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. తొలి మ్యాచ్లో భారీ ఓటమి కారణంగా.. టోర్నీలో తమకు మిగిలి ఉన్న మ్యాచ్లలో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడ్డ ఆతిథ్య ఆసీస్కు ఘోర పరాభవం ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కంగారూలకు కివీస్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరి విజృంభణతో ఆరు ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఒక వికెట్ నష్టపోయి 65 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా న్యూజిలాండ్ బ్యాటర్లను ఆపడం ఆసీస్ బౌలర్ల తరం కాలేదు. దీంతో కివీస్ 200 పరుగుల మార్కు అందుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడంతో 17.1 ఓవర్లకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. 89 పరుగులతో ఓటమి పాలైంది. దీంతో భవిష్యత్తులో గనుక భారీ విజయాలు సాధించకపోతే రన్రేటుపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అదృష్టం కూడా కలిసిరావాలి ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఓటమికి సమిష్టి వైఫల్యం కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను కట్టడి చేయలేకపోయాం. లక్ష్య ఛేదనలోనూ ఆదిలోనే వికెట్లు కోల్పోయాం. నెట్ రన్రేటు కూడా దారుణంగా ఉంది. తదుపరి మ్యాచ్లో శ్రీలంకతో తలపడబోతున్నాం. మిగిలిన నాలుగు మ్యాచ్లలో మేము బాగా కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం కూడా కలిసిరావాలి’’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు. చదవండి: వరల్డ్కప్ గురించి ప్రశ్న.. అదిరిపోయే సమాధానం చెప్పిన ధోని View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కివీస్కు అపురూపం.. 13 ఏళ్ల తర్వాత దక్కిన విజయం
టీ20 వరల్డ్కప్-2022లో గతేడాది (2021) రన్నరప్ న్యూజిలాండ్కు శుభారంభం లభించింది. ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్లో విలియమ్సన్ సేన.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ను 89 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి, గతేడాది వరల్డ్కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ ఆల్రౌండర్ ప్రదర్శనతో చెలరేగి.. ఛాంపియన్ జట్టుకు షాకిచ్చింది. ఈ విజయం కివీస్కు అపురూప విజయంగా మిగిలిపోనుంది. ఎందుకంటే.. ఆ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో 13 ఏళ్ల తర్వాత ఆసీస్ను వారి సొంతగడ్డపై ఓడించింది. కివీస్.. 2009 ఫిబ్రవరిలో ఆసీస్ను చివరిసారిగా వారి సొంతగడ్డపై ఓడించింది. 2009 ఫిబ్రవరి 6న మెల్బోర్న్లో జరిగిన వన్డే మ్యాచ్లో కివీస్.. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కివీస్.. ఆసీస్ను వైట్బాల్ క్రికెట్లో వారి సొంతగడ్డపై ఓడించింది. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడ్డ ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ బౌలర్లు టిమ్ సౌథీ (3/6), ట్రెంట్ బౌల్ట్ (2/24), ఫెర్గూసన్ (1/20) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్పై ఎదురుదాడికి దిగగా.. సాంట్నర్ (3/31), ఐష్ సోధి (1/29) తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ ఆట కట్టించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో మ్యాక్స్వెల్ (28) టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్కు 2, ఆడమ్ జంపాకు ఓ వికెట్ దక్కింది. 92 పరుగులతో అజేయంగా నిలిచిన కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
WC 2022: కుప్పకూలిన టాపార్డర్.. మరీ ఇంత చెత్తగానా? అస్సలు ఊహించలేదు
T20 World Cup 2022 - New Zealand vs Australia: స్వదేశంలో భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్లోనే దారుణంగా విఫలమైంది. బౌలర్లు, బ్యాటర్ల సమిష్టి వైఫల్యం కారణంగా న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి సూపర్-12 ఆరంభం మ్యాచ్లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య కంగారూ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు ఫిన్ అలెన్(16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 పరుగులు- నాటౌట్) అద్భుత ఆరంభం అందించారు. వీరిద్దరి విజృంభణతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 200 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు ఒకటి, హాజిల్వుడ్కు రెండు వికెట్లు దక్కాయి. కుప్పకూలిన టాపార్డర్ న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు వార్నర్ 5, ఆరోన్ ఫించ్ 13.. వన్డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 16 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ చేసిన 28 పరుగులే ఆసీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. ఇక ఆఖర్లో ప్యాట్ కమిన్స్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్లోనే 89 పరుగులతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరీ చెత్తగా ప్రతిష్టాత్మక టోర్నీలో స్వదేశంలో ఆరంభ మ్యాచ్లోనే ఆసీస్ చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్, బ్యాటింగ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడ్డ ఫించ్ బృందంపై అభిమానులు మండిపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మరీ ఇంత చెత్తగా ఆడుతుందని ఊహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ పరిస్థితి ఇలా ఉంటే.. న్యూజిలాండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టి సమిష్టి కృషితో విజయం సాధించింది. చదవండి: T20 WC 2022: ఇదేం బ్యాటింగ్రా బాబు.. తొలి ఓవర్లోనే బౌలర్కు చుక్కలు! T20 WC 2022: ఫిలిప్స్ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ..! View this post on Instagram A post shared by ICC (@icc) -
NZ Vs Aus: దుమ్ములేపిన కివీస్ ఓపెనర్లు.. వరల్డ్కప్లో విలియమ్సన్ సేన రికార్డు
ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Australia- Super 12 Group 1: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్లు దుమ్ములేపారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో దంచికొట్టారు. కివీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఫిన్ అలెన్ 16 బంతుల్లో 42 పరుగులు సాధించగా.. డెవాన్ కాన్వే సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 23 పరుగులు చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు సాధించాడు. జేమ్స్ నీషమ్ ఆఖర్లో మెరుపులు(13 బంతుల్లో 26 పరుగులు- నాటౌట్) మెరిపించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో న్యూజిలాండ్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో ఐర్లాండ్, బంగ్లాదేశ్ మీద 190 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన కివీస్.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్పై ఈ మేరకు రాణించడం గమనార్హం. టీ20 ప్రపంచకప్లో కివీస్ అత్యధిక స్కోర్లు సిడ్నీ- 2022- ఆస్ట్రేలియా మీద- 200/3 నాటింగ్హాం- 2009- ఐర్లాండ్ మీద- 198/5 పల్లకెలె- 2012- బంగ్లాదేశ్ మీద- 191/32 ఇక ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మెగా టోర్నీ పవర్ప్లేలోనూ తమ అత్యధిక స్కోరు(65/1) నమోదు చేసింది న్యూజిలాండ్ జట్టు. ఆసీస్తో గత మ్యాచ్లలో పవర్ప్లేలో కీవీస్ నమోదు చేసిన స్కోర్లు 2018- అక్లాండ్లో- 67/0 2018- అక్లాండ్లో-63/2 చదవండి: T20 WC 2022: టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా NZ Vs Aus: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్! కొత్తగా ఎవరంటే? View this post on Instagram A post shared by ICC (@icc) -
కాన్వే అరుదైన ఘనత.. బాబర్తో కలిసి సంయుక్తంగా
న్యూజిలాండ్ ఓపెనర్ డెవన్ కాన్వే టి20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టి20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా బాబర్ ఆజంతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కాన్వే ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్లో 59 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు వెయ్యి పరుగుల మార్క్ను క్రాస్ చేశాడు. కాగా కాన్వేకు వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేందుకు 26 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. బాబర్ ఆజం కూడా 26 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. వీరిద్దరి కంటే ముందు ఇంగ్లండ్ స్టార్ డేవిడ్ మలాన్ 24 ఇన్నింగ్స్ల్లోనే వెయ్యి పరుగుల మార్క్ను అందుకొని తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: IND Vs PAK: అభిమానులకు గుడ్న్యూస్.. ఆ భయాలేమి అక్కర్లేదట! -
NZ Vs Aus: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్!
ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Australia- Super 12 Group 1: టీ20 ప్రపంచకప్-2021లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏకంగా టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్ మీద 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి... తద్వారా తొలిసారిగా పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది ఆరోన్ ఫించ్ బృందం. ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న వరల్డ్కప్-2022లో ఫేవరెట్గా మారిన ఆసీస్.. సూపర్-12 తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో పోటీ పడుతోంది. ఇందులో భాగంగా.. ఒకే ఒక్క మార్పు మినహా నాడు ఫైనల్ ఆడిన అదే జట్టుతో బరిలోకి దిగింది. మరోవైపు.. కివీస్ సైతం నాలుగైదు మార్పులతో మైదానంలో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్-2022: సూపర్ 12 న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. టీ20 ప్రపంచకప్-2021: ఫైనల్లో తుది జట్లు న్యూజిలాండ్ మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. చదవండి: Gautam Gambhir: వ్యక్తిగతంగా కాదు.. జట్టుకు భజన చేయండి; ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి ఇదే ప్రధాన కారణం Rohit Sharma: తొమ్మిదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.. అయితే ఈసారి మాత్రం.. -
ఆసీస్ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. 89 పరుగుల తేడాతో ఘన విజయం
New Zealand vs Australia, 13th Match, Super 12 Group 1- Updates: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 89 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమి చెందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, సౌథీ మూడు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా.. బౌల్ట్, ఫెర్గూసన్, సోధి తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మ్యాక్స్వెల్ 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓటమికి చేరువలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో సూపర్-12 తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓటమికి చేరవైంది. 16.3 ఓవర్లకు 109 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన కివీస్ పేసర్ వరుసగా స్టార్క్, జంపాను పెవిలియన్కు పంపాడు. గ్లెన్ మాక్స్వెల్ అవుట్ ఆసీస్ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు టాప్ స్కోరర్గా ఉన్న గ్లెన్ మాక్స్వెల్ (28) సైతం పెవిలియన్ చేరాడు. దీంతో కంగారూ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. భారీ లక్ష్యం ముందున్న వేళ టాపార్డర్ కుప్పకూలడంతో 14 ఓవర్లు ముగిసే సరికి కనీసం వంద(91-7) పరుగులు కూడా చేయలేకపోయింది. ఫెర్గూసన్కు తొలి వికెట్ ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్లో మాథ్యూ వేడ్ పెవిలియన్ చేరాడు. స్కోరు: 86/6 (12.4) ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ హిట్టర్ టిమ్ డేవిడ్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో అతడు పెవిలియన్ చేరాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. స్టొయినిస్ అవుట్ సాంట్నర్ బౌలింగ్లో స్టొయినిస్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అద్బుత క్యాచ్తో అతడికి షాకిచ్చాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్లు సౌతీ, సాంట్నర్ ఇప్పటి వరకు చెరో రెండు వికెట్లు తీశారు. తొమ్మిది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 54-4 మూడో వికెట్ డౌన్.. మిచెల్ మార్ష్ అవుట్ ఆరంభంలోనే ఆసీస్కు చుక్కలు చూపిస్తున్నారు కివీస్ బౌలర్లు. సౌతీ .. వార్నర్, మిచెల్ మార్ష్లను పెవిలియన్కు పంపగా.. సాంట్నర్.. ఫించ్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 34-3 ఆరోన్ ఫించ్ రూపంలో రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 4 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు- 30/2 View this post on Instagram A post shared by ICC (@icc) ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వార్నర్ అవుట్ 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన డెవిడ్ వార్నర్.. సౌథీ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. కాన్వే అద్భుత ఇన్నింగ్స్.. కివీస్ స్కోరెంతంటే ఓపెనర్లు ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్ కాన్వే (92 పరుగులు- నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 17 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు- 161/3 మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 15.6 ఓవర్ వద్ద కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 144/2 కాన్వే 70, గ్లెన్ ఫిలిప్స్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్లో విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 బంతులు ఎదుర్కొన్న అతడు 23 పరుగులు చేశాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న కాన్వే ఆసీస్తో ఆరంభ మ్యాచ్లో కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీ సాధించాడు. 13వ ఓవర్ మొదటి బంతికి జంపా బౌలింగ్లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 97-1 కాన్వే 42, విలియమ్సన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.(28) పవర్ ప్లే ముగిసే సరికి కివీస్ స్కోరు: 69/1 కెప్టెన్ కేన్ విలియమ్సన్ 4, ఓపెనర్ డెవాన్ కాన్వే 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కివీస్ ఫిన్ అలెన్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులతో జోరు మీదున్న అలెన్ను హాజిల్వుడ్ తన అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే క్రీజులో ఉన్నారు. 4.1 ఓవర్లలో కివీస్ స్కోరు- 56/1. దంచి కొడుతున్న ఫిన్ అలెన్ ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్ జట్టుకు ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. అలెన్ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 42 పరుగులు సాధించాడు. కాన్వే 9 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 14 పరుగుల వద్ద ఉన్నాడు. వీరిద్దరి విజృంభణతో 4 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 56 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్-2022 అసలైన సమరానికి తెరలేచింది. సూపర్-12 ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా- రన్నరప్ న్యూజిలాండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. చదవండి: Rohit Sharma: తొమ్మిదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.. అయితే ఈసారి మాత్రం.. -
Aus Vs NZ: అసలైన పోరుకు ముందు కివీస్కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ అవుట్
T20 World Cup 2022- Aus Vs NZ: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధ్రువీకరించాడు. వరల్డ్కప్-2022 సూపర్ 12 దశ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్- గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్న విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా శనివారం(అక్టోబరు 22) ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. డారిల్ మిచెల్ గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. డారిల్ దూరం ఈ మేరకు.. ‘‘డారిల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, జట్టులో మిగతా వాళ్లంతా ఫిట్గా ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో ట్రై సిరీస్కు ముందు డారిల్ మిచెల్ చేతి వేలికి గాయమైంది. దీంతో ఆ సిరీస్కు దూరమైన అతడు.. ఇప్పుడు కీలక మ్యాచ్ కూడా ఆడలేకపోతున్నాడు. ఇక గత ప్రపంచకప్ ఈవెంట్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో అదరగొట్టిన ఈ 31 ఏళ్ల ఆల్రౌండర్.. సెమీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆరోజు దురదృష్టవశాత్తూ ఇదిలా ఉంటే.. గత ప్రపంచకప్ ఫైనల్ నాటి జ్ఞాపకాలను కేన్ విలియమ్సన్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆరోజు మ్యాచ్ గొప్పగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ మేము ఓడిపోయాం. ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక రేపటితో అసలైన టోర్నీ మొదలుకాబోతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే పట్టు బిగించడం ముఖ్యం. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడటం చాలెంజింగ్గా ఉంటుంది’’ అని కేన్ విలియమ్సన్ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై తమ రికార్డు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మేము ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోము. ఆస్ట్రేలియా ఎంతో పటిష్టమైన జట్టు. మాకు గట్టిపోటీనిస్తుంది. అయితే, అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు’’ అని పేర్కొన్నాడు. కాగా 2009 తర్వాత కివీస్.. ఆసీస్లో ఏ ఫార్మాట్లోనూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ -
T20 WC: జోష్ ఇంగ్లిస్ అవుట్.. టీమిండియాతో సిరీస్లో చెలరేగిన యువ ప్లేయర్ జట్టులోకి
T20 World Cup 2022- Australia Updated Squad: ఆస్ట్రేలియా బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమయ్యాడు. గోల్ఫ్ ఆడుతూ గాయపడిన అతడు.. గాయం తీవ్రతరం కావడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిస్ స్థానంలో కామెరూన్ గ్రీన్ జట్టులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఓపెనర్గా కామెరూన్ గ్రీన్ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. టీమిండియాతో సిరీస్లో హిట్ ముఖ్యంగా భారత పర్యటనలో టీమిండియాతో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మొదటి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన గ్రీన్.. మూడో మ్యాచ్లో 21 బంతుల్లో 52 పరుగులతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్ అందుబాటులోకి రావడంతో ఓపెనర్గా స్థానం కోల్పోయాడు 23 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్రౌండర్. ఇక ఇప్పుడు ఇంగ్లిస్ గాయపడటంతో స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆడే జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. మరోవైపు.. ఇంగ్లిస్ దూరం కావడంతో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్పై అదనపు భారం పడనుంది. కాగా అక్టోబరు 22న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సూపర్-12లో న్యూజిలాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్లో ఆసీస్ ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2022: ఆస్ట్రేలియా జట్టు(అప్డేటెడ్): ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్,టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా. చదవండి: Predicted Playing XI: పాక్తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! T20 WC SL Vs NED: సూపర్-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్ ఇంటికి; అద్భుతం జరిగితే తప్ప He's in! #T20WorldCup — cricket.com.au (@cricketcomau) October 20, 2022 -
స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీ.. కివీస్ను ఊడ్చేసిన ఆసీస్
స్వదేశంలో కివీస్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో స్టీవ్ స్మిత్ (105) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 25 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్మిత్ సెంచరీ, మార్నస్ లబూషేన్ (52), అలెక్స్ క్యారీ (42 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగుల చేసింది. ఆఖర్లో కెమరూన్ గ్రీన్ (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, సౌథీ, ఫెర్గూసన్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కివీస్ మరో బంతి మిగిలుండగానే 242 పరుగల వద్ద ఆలౌటైంది. ఫిన్ అలెన్ (35), గ్లెన్ ఫిలిప్ (47), జేమ్స్ నీషమ్ (36), మిచెల్ సాంట్నర్ (30) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్ల ఏ ఓక్క బ్యాటర్ను కుదురుకోనివ్వలేదు. సీన్ అబాట్ (2/31), కెమరూన్ గ్రీన్ (2/25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కివీస్పై ఒత్తిడి పెంచారు. ఆఖర్లో స్టార్క్ (3/60) చెలరేగి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. హేజిల్వుడ్, జంపా తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో హాఫ్ సెంచరీ, సెంచరీతో రాణించిన స్టీవ్ స్మిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. కాగా, సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఆసీస్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆసీస్ తదుపరి టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. చదవండి: స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు! -
స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు!
ఇటీవలే ఆసియా కప్ టోర్నీలో అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి 71వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్తో మ్యాచ్లో సెంచరీ కొట్టి తన నాలుగేళ్ల కరువు తీర్చుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో స్మిత్ 127 బంతుల్లో వంద పరుగుల మార్క్ను అందుకొని వన్డే కెరీర్లో 12వ సెంచరీ అందుకున్నాడు. అయితే సెంచరీ సాధించాడు అని మనం పొగిడేలోపే స్మిత్ చేసిన ఒక పని అతన్ని చిక్కుల్లో పడేసింది. మరి ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడా అని విషయం తెలుసుకున్న తర్వాత కచ్చితంగా పేర్కొంటారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 38వ ఓవర్ జేమ్స్ నీషమ్ వేశాడు. అప్పటికే గ్రౌండ్ చుట్టూ చూసిన స్మిత్ ఒక పొరపాటును గమనించాడు. వన్డే నిబంధనల ప్రకారం 40 ఓవర్లకు ముందు 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ ఈ విషయాన్ని మరిచిపోయి ఐదుగురు ఫీల్డర్లను ఉంచాడు. స్మిత్ చెప్పాలనుకుంటే బంతి పడకముందే చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా జేమ్స్ నీషమ్ వేసిన తొలి బంతిని స్క్వేర్లెగ్ దిశగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ తర్వాత లెగ్ అంపైర్వైపు తిరిగిన స్మిత్.. ''సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లకు బదులు ఐదుగురు ఉన్నారు.. అది నోబాల్ ఒకసారి పరిశీలించండి'' అంటూ చేతులతో సైగ చేశాడు. దీంతో తప్పిదాన్ని గమనించిన అంపైర్ రూల్స్ ప్రకారం నోబాల్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఫ్రీహిట్ రాగా.. నీషమ్ బౌన్సర్ వేశాడు. భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించి స్మిత్ విఫలమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ స్మిత్పై మండిపడ్డారు. స్మిత్ మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు.. ఒకప్పుడు బాల్ టాంపరింగ్.. ఇప్పుడు అంపైర్ను చీటింగ్.. నువ్వు మారవా.. అంటూ కామెంట్లు చేశారు. ఇక స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్ 105, లబుషేన్ 52 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ 42 పరుగులతో నాటౌట్గా నిలవగా.. చివర్లో కామెరాన్ గ్రీన్ 12 బంతుల్లో 25 పరుగులు నాటౌట్గా నిలిచాడు. Steve Smith launching a filthy slog over the fence because he knew it was a no-ball due to the number of fielders outside the circle 🤯#AUSvNZ #PlayOfTheDay pic.twitter.com/T3LFFjsCB8 — cricket.com.au (@cricketcomau) September 11, 2022 చదవండి: Kane Williamson: కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..! బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం..
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకొని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. తొలి ఓవర్లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఔటయ్యాడు. గప్టిల్ తర్వాత కేన్ విలియమ్సన్ క్రీజులో అడుగుపెట్టాడు. ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు. ఆ తర్వాత కూడా పెద్దగా ఆడలేదనుకోండి.. కానీ జట్టు టాప్ స్కోరర్గా మాత్రం నిలిచాడు. మిచెల్ స్టార్కవేసిన బంతిని విలియమ్సన్ కవర్స్లోకి ఆడి నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న డెవన్ కాన్వేను పట్టించుకోకుండానే వచ్చశాడు. అప్పటికే ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబాట్కు బంతి దొరకలేదు. ఆ సమయంలో ఇద్దరు బ్యాటర్లు నాన్స్ట్రైక్ ఎండ్ వైపు పరుగు తీశారు. బంతిని అందుకోవడంలో అబాట్ మళ్లీ విఫలమయ్యాడు. అయితే ఈసారి ఇద్దరు బ్యాటర్లు గమ్మత్తుగా స్ట్రైకింగ్ ఎండ్వైపు పరుగులు తీశారు. అయితే బంతిని అందుకున్న కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు కొట్టడంలో సఫలం కాలేకపోయాడు. దీంతో కివీస్ కెప్టెన్ కేన్ మామ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాప్స్కోరర్గా నిలవగా.. మ్యాక్స్వెల్ 25 పరుగులు చేశాడు. అయితే 150 పరుగుల మార్క్ను దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో మిచెల్ స్టార్క్(45 బంతుల్లో 38 నాటౌట్), జోష్ హాజిల్వుడ్(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్గా నిలిచాడు. ఇరు జట్లఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న(ఆదివారం) జరగనుంది. Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD — cricket.com.au (@cricketcomau) September 8, 2022 చదవండి: AUS Vs NZ 2nd ODI: ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా!
ఆస్ట్రేలియా పర్యటనలో న్యూజిలాండ్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో కివీస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాప్స్కోరర్గా నిలవగా.. మ్యాక్స్వెల్ 25 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కనీసం 150 పరుగుల మార్క్ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో మిచెల్ స్టార్క్(45 బంతుల్లో 38 నాటౌట్), జోష్ హాజిల్వుడ్(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, మాట్ హెన్రీ 3, సౌథీ, సాంట్నర్ చెరొక వికెట్ తీశారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బ్యాటింగే దారుణమనుకుంటే.. న్యూజిలాండ్ బ్యాటర్లు అంతకన్నా ఘోరంగా ఆడడం గమనార్హం. కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్గా నిలిచాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. సీన్ అబాట్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న(ఆదివారం) జరగనుంది. -
క్యారీ, గ్రీన్ల అద్భుత పోరాటం.. ఆసక్తికర పోరులో కివీస్ను ఓడించిన ఆసీస్
3 వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ కెయిన్స్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 6) తొలి వన్డే ఆడింది. చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ (99 బంతుల్లో 85; 8 ఫోర్లు, సిక్స్), కెమరూన్ గ్రీన్ (92 బంతుల్లో 89 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్)లు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా గ్రీన్ చివరి నిమిషం వరకు క్రీజ్లో ఉండి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (68 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ విలియమ్సన్ (71 బంతుల్లో 45; 3 ఫోర్లు, సిక్స్), వికెట్కీపర్ టామ్ లాథమ్ (57 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్వెల్ 4, హేజిల్వుడ్ 3, స్టార్క్, జంపా తలో వికెట్ పడగొట్టారు. Wow, that was some contest! Cameron Green (89no), Alex Carey (85) and Glenn Maxwell (4-52) impress in the Chappell-Hadlee series opener in Cairns #AUSvNZ pic.twitter.com/rxXnwpeb7Y— Cricket Australia (@CricketAus) September 6, 2022 అనంతరం 233 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అలెక్స్ క్యారీ, కెమరూన్ గ్రీన్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్ను గెలిపించారు. గ్రీన్ తొమ్మిదో వికెట్కు ఆడమ్ జంపాతో (13 నాటౌట్) కలిసి 26 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రెంట్ బౌల్ట్ (4/40), మ్యాట్ హెన్రీ (2/50)లు ఆసీస్ను వణికించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్ 8న జరుగనుంది. చదవండి: రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం -
ఇంగ్లండ్ కెప్టెన్ అద్భుత విన్యాసం.. నోర్లెళ్లబెట్టిన ప్రత్యర్ధులు.. రెప్పపాటులోనే..!
NZW VS ENGW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆతిధ్య న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 20, ఆదివారం) జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ వికెట్ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ఆల్రౌండర్ నతాలీ స్కివర్ (108 బంతుల్లో 61; 5 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు మ్యాడీ గ్రీన్ (52) అజేయమైన అర్ధశతకంతో రాణించడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోరైనా చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చేసిన ఓ అద్భుతమైన విన్యాసం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్లో న్యూజిలాండ్ పవర్ హిట్టర్ లీ తహుహు భారీ షాట్కు ప్రయత్నించగా.. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ను అందుకుంది. రెప్పపాటు సమయంలో నైట్ చేసిన ఈ విన్యాసాన్ని చూసి మైదానంలో ఉన్న వాళ్లంతా నోర్లెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్ విజయం.. న్యూజిలాండ్కు ఇక కష్టమే! -
అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్హిట్తో మ్యాక్సీ విన్నింగ్ షాట్
Maxwell Swith Hit Winning Shot Became Viral.. టి20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్లో రారాజుగా ఉన్న ఆస్ట్రేలియాకు పొట్టి ఫార్మాట్ అంతగా కలిసిరాలేదు. 2007 తొలి టి20 ప్రపంచకప్ నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 2010 టి20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరినప్పటికి ఇంగ్లండ్ చేతిలో పరాభవం ఎదురైంది. తాజా ప్రపంచకప్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్ ఏకంగా కప్ను ఎగురేసుకుపోయింది. ఇక మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ మెరుపులతో సులువుగానే లక్ష్యం దిశగా నడిచింది. ఇక చివర్లో మ్యాక్స్వెల్ స్విచ్హిట్తో విన్నింగ్ షాట్ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించడం హైలెట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
T20 World Cup 2021 Winner Australia: ఆసీస్కు అందిన ద్రాక్ష
సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్ను దశాబ్దాలు శాసించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. వన్డే క్రికెట్లో ఐదుసార్లు జగజ్జేతగా నిలిచినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టి20 క్రికెట్ ప్రస్తావన రాగానే ఇంతకాలం ఆస్ట్రేలియా గురించి చెప్పే ఒకే ఒక్క మాట ఇది... ఆస్ట్రేలియా టీమ్ గురించి ఇకపై అలాంటి మాటకు అవకాశమే లేదు. 2007 నుంచి తొలి టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న కంగారూలు ఎట్టకేలకు 14 ఏళ్ల ‘జైలు గోడలను’ బద్దలు కొట్టారు. టి20 ప్రపంచకప్లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచి ఇంతకాలంగా అందని ట్రోఫీని తమ ఖాతాలో వేసుకొని సగర్వంగా నిలిచారు. టోర్నీ ఆరంభానికి ముందు ఎలాంటి అంచనాలు లేని, ఫేవరెట్ అంటూ ఎవరూ చెప్పని జట్టు చివరకు చాంపియన్ తరహా ఆటతో సత్తా చాటింది. నాకౌట్ మ్యాచ్లలో కనిపించే ఒత్తిడి, ఆందోళన తమ దరికి రావని చాటి చెబుతూ అద్భుత ప్రదర్శనతో టైటిల్ను అందుకుంది. సెమీస్లో సూపర్ ఆటతో పాక్ను చిత్తు చేసిన టీమ్ తుది పోరులోనూ అదే స్థాయిని ప్రదర్శించింది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై ముందుగా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన ఆసీస్... ఛేదనలో ఎక్కడా తడబడలేదు. బౌలింగ్లో హాజల్వుడ్ అదరగొట్టగా... బ్యాటింగ్లో మిచెల్ మార్ష్, వార్నర్ ద్వయం చెలరేగింది. మెల్బోర్న్లో సోమవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయం అవుతుండగా, తమ అభిమానులకు తీపి వార్త అందించింది. పాపం న్యూజిలాండ్... ఫైనల్ మ్యాచ్ ఫలితం చూసిన తర్వాత ఇలా స్పందించని క్రికెట్ అభిమాని ఉండడేమో! 2019 వన్డే ప్రపంచకప్లో కూడా ఫైనల్ చేరి ‘బౌండరీ కౌంట్’తో గుండె పగిలిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఓడి విషాదంలో మునిగింది. 2015 వన్డే వరల్డ్కప్ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలోనే ఓటమి పాలైన టీమ్... గత రెండేళ్ల వ్యవధిలో రెండు మెగా టోర్నీ తుది సమరాల్లోనూ దురదృష్టవశాత్తూ తలవంచింది. అసలు సమయంలో చెలరేగిన కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి చుక్కానిలా జట్టు ఇన్నింగ్స్ను నడిపించినా... ఇతర బ్యాట్స్మెన్ వైఫల్యం కివీస్ను దెబ్బ తీసింది. చివరకు మరోసారి రన్నరప్గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. T20 World Cup 2021 Winner Australia: టి20 ప్రపంచకప్లో కొత్త చాంపియన్గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి తొలిసారి ఈ ఫార్మాట్లో వరల్డ్ టైటిల్ అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుతంగా ఆడగా... హాజల్వుడ్ (3/16) బౌలింగ్లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్‡్ష (50 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రెండో వికెట్కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. బౌలర్ల జోరు... భారీ స్కోరు సాధించేందుకు శుభారంభం చేయాల్సిన న్యూజిలాండ్ పవర్ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. 6 ఓవర్లలో 32 పరుగులే చేయగలిగిన ఆ జట్టు డరైల్ మిచెల్ (8 బంతుల్లో 11; సిక్స్) వికెట్ కోల్పోయింది. ముఖ్యంగా పేసర్ హాజల్వుడ్ ప్రత్యర్థిని కట్టి పడేశాడు. తన 3 ఓవర్ల స్పెల్లో అతను 14 ‘డాట్’ బంతులు వేయడం విశేషం. ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని నిలువరించింది. విలియమ్సన్ బాగా నెమ్మదిగా ఆడగా, గప్టిల్ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) కూడా పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 57 మాత్రమే! 6 ఓవర్లలో 79 పరుగులు... విరామం తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటికి 21 బంతులు ఆడిన విలియమ్సన్ 21 పరుగులతో ఉన్నాడు. స్టార్క్ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ను హాజల్వుడ్ వదిలేశాడు. ఆ బంతికి ఫోర్ రాగా, తర్వాతి రెండు బంతులను కూడా కేన్ బౌండరీకి పంపించాడు. మరుసటి ఓవర్లో గప్టిల్ అవుటైనా... మ్యాక్స్వెల్ బౌలింగ్లో కివీస్ కెప్టెన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. జంపా ఓవర్లో ఫిలిప్స్ (17 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) ఒక సిక్స్, ఫోర్ కొట్టగా... స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లో విలియమ్సన్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 0, 4, 4 కొట్టడం విశేషం. 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన విలియమ్సన్... ఒక్క స్టార్క్ బౌలింగ్లోనే 12 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 39 పరుగులు రాబట్టాడు. అయితే కీలక సమయంలో విలియమ్సన్ను అవుట్ చేయడంతో పాటు చివరి నాలుగు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... కివీస్ను కొంత వరకు కట్టడి చేయడంలో సఫలమైంది. భారీ భాగస్వామ్యం... ఫామ్లో లేని కెప్టెన్ ఫించ్ (5) మరోసారి నిరాశపరుస్తూ ఆరంభంలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఛేదన మొదలైంది. అయితే వార్నర్, మార్ష్ భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. మిల్నే ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4తో తన ఖాతా తెరిచిన మార్ష్ చివరి వరకు అదే జోరును కొనసాగించగా, సెమీస్ తరహాలో మళ్లీ మెరుపు ప్రదర్శనతో వార్నర్ దూసుకుపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులు కాగా... సోధి ఓవర్లో వార్నర్ కొట్టిన 2 ఫోర్లు, సిక్స్తో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 82 పరుగులకు చేరింది. కివీస్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు.ఎంతో నమ్ముకున్న స్పిన్నర్లు సాన్ట్నర్, సోధి కూడా పేలవంగా బౌలింగ్ చేయడంతో కంగారూలకు ఎదురు లేకుండా పోయింది. ఆసీస్ దూసుకుపోతున్న సమయంలో లక్ష్యానికి 66 పరుగుల దూరంలో వార్నర్ను బౌల్డ్ చేసి బౌల్ట్ కొంత ఆశలు రేపాడు. అయితే నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాక్సీ అండతో మరింత చెలరేగిన మార్ష్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడిన మార్ష్ , మ్యాక్స్వెల్ 39 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సౌతీ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని రివర్స్ స్వీప్తో మ్యాక్స్వెల్ బౌండరీకి తరలించడంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది. ఇది చాలా పెద్ద విజయం. టి20 ప్రపంచకప్ నెగ్గిన తొలి ఆసీస్ జట్టు మాదే కావడం గర్వంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో బంగ్లాదేశ్పై సాధించిన విజయం కీలక మలుపు. టీమ్ ప్రదర్శనతో పాటు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఈ గెలుపును అందించాయి. కొన్నాళ్ల క్రితం వార్నర్ను కొందరు లెక్కలోకి తీసుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. నా దృష్టిలో జంపా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. –ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్ మేం సాధించిన స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ ఆసీస్ అద్భుతంగా ఆడి ఛేదించింది. ఈ రోజు మాకు కలిసి రాలేదు. అయితే మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో బాగా ఆడి ఎన్నో అంచనాలతో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కొంత బాధ సహజం. –విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్ స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) స్టొయినిస్ (బి) జంపా 28; మిచెల్ (సి) వేడ్ (బి) హాజల్వుడ్ 11; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 85; ఫిలిప్స్ (సి) మ్యాక్స్వెల్ (బి) హాజల్వుడ్ 18; నీషమ్ (నాటౌట్) 13, సీఫెర్ట్ (నాటౌట్) 8, ఎక్స్ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–28; 2–76; 3–144; 4–148. బౌలింగ్: స్టార్క్ 4–0–60–0; హాజల్వుడ్ 4–0–16–3; మ్యాక్స్వెల్ 3–0–28–0; కమిన్స్ 4–0–27–0; జంపా 4–0–26–1; మిచెల్ మార్‡్ష 1–0–11–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) బౌల్ట్ 53; ఫించ్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 5; మార్‡్ష (నాటౌట్) 77; మ్యాక్స్వెల్ (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–15; 2–107. బౌలింగ్: బౌల్ట్ 4–0–18–2; సౌతీ 3.5–0–43–0; మిల్నే 4–0–30–0; సోధి 3–0–40–0; సాన్ట్నర్ 3–0–23–0; నీషమ్ 1–0–15–0. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ట్రోఫీతో వార్నర్, విలియమ్సన్ మ్యాక్స్వెల్తో మిచెల్ మార్ష్ సంబరం -
సంగక్కర తర్వాత కేన్ విలియమ్సన్ మాత్రమే
Kane Williamson 2nd Captain To Score Half Century T20 WC Finals.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శ్రీలంక కెప్టెన్గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్గా నిలిచాడు. ఇక విలియమ్సన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. -
T20 WC 2021 Final: ఎడమ పక్కన నిల్చున్న కెప్టెన్దే ట్రోఫీ
Team Captain Who Stands Title Left Side Won Final Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ విషయం పక్కనపెడితే ఫైనల్లో తలపడనున్న జట్ల కెప్టెన్లలో ఎవరైతే ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చుంటారో వారిదే విజయం అని జోస్యం చెబుతున్నారు. వినడానికి సిల్లీగా ఉన్నా చరిత్ర మాత్రం ఇదే చెబుతుంది. వన్డే వరల్డ్కప్, టి20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఇది చోటుచేసుకుంది. ఒకసారి వాటిని పరీశిలిద్దాం. చదవండి: David Warner: రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్ ముంగిట అరుదైన రికార్డు ► 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ టీమిండియా, శ్రీలంక మధ్య జరిగింది. అక్కడ ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ధోనికి విజయం వరించింది. ► 2015 వన్డే ప్రపంచకప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చును మైకెల్ క్లార్క్ విజయం అందుకున్నాడు. ► 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న డారెన్ సామి టైటిల్ అందుకున్నాడు. ► 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పాకిస్తాన్, టీమిండియా మధ్య జరిగింది. ట్రోఫీకి ఎడమపక్కన నిల్చున్న సర్ఫరాజ్ అహ్మద్ విజేతగా నిలిచాడు. చదవండి: T20 WC 2021: 'దుబాయ్' చేజింగ్ కింగ్; టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం ► 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్ సందర్భంగా ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ఇయాన్ మోర్గాన్ను విజయం వరించింది. ► 2021లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న కేన్ విలియమ్సన్ విజయం సాధించాడు. A team captain who stands at the left side of the trophy have won the final. Exception -2014.#AUSvsNZ pic.twitter.com/IZJoa4EV3X — Akshat Om (@AkshatOM3) November 13, 2021 -
AUS vs NZ: మార్ష్ విధ్వంసం.. టి20 ప్రపంచకప్ 2021 విజేత ఆస్ట్రేలియా
సమయం: 23:00.. టి20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మిచెల్ మార్ష్ (46 బంతుల్లో 78 పరుగులు, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)మరోసారి మెరవడంతో ఆసీస్ సులువుగానే విజయం సాధించింది. మిచెల్ మార్ష్ మెరుపులు.. 16 ఓవర్లలో 149/2 మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 69 పరుగులతో మెరుపులు మెరిపిస్తుండడంతో ఆసీస్ విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 149 పరుగుల చేసింది. మ్యాక్స్వెల్ 10 బంతుల్లో 21 పరుగులతో సహకరిస్తున్నాడు. వార్నర్ అర్థశతకం.. 11 ఓవర్లలో 97/1 డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ను అందుకున్నాడు. వార్నర్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు మిచెల్ మార్ష్ కూడా 26 బంతుల్లో 40 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. సమయం: 22:02.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(42) మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫించ్ ఔటైన అనంతరం వార్నర్ దూకుడు చూపిస్తుండడంతో ఆసీస్ స్కోరుబోర్డు పరుగుపెడుతుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఫించ్(5) ఔట్.. 6 ఓవర్లలో ఆస్ట్రేలియా 43/1 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్(5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. వార్నర్ 19, మిచెల్ మార్ష్ 17 పరుగులతో ఆడుతున్నారు. విలియమ్సన్ విధ్వంసం.. 20 ఓవర్లలో కివీస్ 172/4 కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(85 పరుగులు, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి 57/1 గా ఉన్న న్యూజిలాండ్ స్కోరు 16 ఓవర్లలో 132 పరుగులకు చేరింది. 6 ఓవర్లలో 75 పరుగులు సాధించిందంటే అదంతా కేన్ విలియమ్సన్ మాయే అని చెప్పొచ్చు. ఇక స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో 4,4,6,0,4,4తో విలియమ్సన్ విశ్వరూపం చూపించాడు. కేన్ విలియమ్సన్(85) ఔట్.. న్యూజిలాండ్ 149/4 దూకుడుగా ఆడుతున్న కేన్ విలియమ్సన్(85) హాజిల్వుడ్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.. అయితే ఈ న్యూజిలాండ్ కెప్టెన్ తన శైలికి విరుద్ధంగా దూకుడుగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 48 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. అంతకముందు అతనికి సహకరిస్తున్న గ్లెన్ ఫిలిప్స్(18) హాజిల్వుడ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మూడో వికెట్ కోల్పోయింది. కేన్ మామ ఫిఫ్టీ.. న్యూజిలాండ్ 13 ఓవర్లలో 97/2 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో కేన్ విలియమ్సన్ అర్థసెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్ జంపా బౌలింగ్లో స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్లలో న్యూజిలాండ్ 57/1 సమయం: 20:13.. 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ వెనుదిరిగిన తర్వాత గప్టిల్(27), విలియమ్సన్(17)లు ఆచితూచి ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ సమయం: 19:50.. డారిల్ మిచెల్(11) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ ఐదో బంతికి షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ వేడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. గప్టిల్ 16, విలియమ్సన్ 0 పరుగులతో ఆడుతున్నారు. సమయం: 19:39.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 10, మిచెల్ 3 పరుగులతో ఆడుతున్నారు. దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మహాసంగ్రామం మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్కు చేరింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ అనుహ్య విజయం సాధించింది. మరో వైపు రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్పై అద్బుత విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ రెండు జట్లలో ఏది విజయం సాధించిన.. ఈసారి ట్రోఫిని కొత్త జట్టు ముద్దాడబోతోంది. కాగా ఈ రెండు జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. దీంతో టైటిల్ ఫేవరేట్ ఏ జట్టు అనేది అంచనా వేయడం కష్టమే. కాగా టీ20ల్లో 14 మ్యాచ్ల్లో ఇరు జట్లు ముఖా ముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 9 మ్యాచ్ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ కేవలం నాలుగు మ్యాచ్ల్లో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్ ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్ -
రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్ ముంగిట అరుదైన రికార్డు
David Warner Waiting For 2 Milestones Vs NZ Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒక టి20 ప్రపంచకప్ ఎడిషన్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు వార్నర్ కేవలం 30 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ల్లో 236 పరుగులు సాధించాడు. కివీస్తో జరగనున్న ఫైనల్లో 30 పరుగులు చేస్తే వార్నర్ అరుదైన ఘనత అందుకుంటాడు. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ చేసిన 265 పరుగులే ఆ జట్టు తరపున అత్యధిక స్కోరుగా ఉంది. ఆ తర్వాత షేన్ వాట్సన్ 2012 టి20 ప్రపంచకప్లో 249 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ టి20 ప్రపంచకప్లో దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల్లో వార్నర్ ఇప్పటివరకు 14 సిక్స్ర్లు కొట్టాడు. మరో రెండు సిక్స్లు కొడితే షాహిద్ అఫ్రిదిని(15 సిక్సర్లు) దాటి తొలి స్థానంలో నిలవనున్నాడు. చదవండి: T20 WC 2021: 'దుబాయ్' చేజింగ్ కింగ్; టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం -
'దుబాయ్' చేజింగ్ కింగ్.. 12లో 10సార్లు గెలుపే
Toss Winning Team Won T20 World Cup 2021 Title.. టి20 ప్రపంచకప్ 2021 ఆఖరి అంకానికి చేరుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు మరికొద్ది గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మ్యాచ్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా ఫెవరెట్గా కనిపిస్తున్నప్పటికీ దానికి మించి టాస్ మరింత ఫెవరెట్గా మారింది. దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే. చదవండి: 'యువీ నువ్వుంటే బాగుండేది'': కోహ్లి.. అనుష్క రియాక్షన్ వైరల్ ఈ టి20 ప్రపంచకప్లో దుబాయ్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్లు ఇదే రుజువు చేస్తున్నాయి. ఇక్కడ జరిగిన 12 మ్యాచ్ల్లో మొదట బౌలింగ్ చేసిన జట్లు 11 సార్లు విజయం సాధించగా.. ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. ఇక టాస్ గెలిచిన జట్లు 10 సార్లు విజయం అందుకోగా.. రెండుసార్లు మాత్రమే ఓటమి పాలయ్యాయి. ఓవరాల్గా ప్రపంచకప్లో సెమీఫైనల్స్ సహా మొత్తం 44 మ్యాచ్లు జరగ్గా.. 29 సార్లు టాస్ గెలిచిన జట్లు విజయం సాధించడం విశేషం. విన్నింగ్ శాతం 65.9% ఉంది. ఇంకో విషయమేంటంటే దుబాయ్ వేదికగా రాత్రి జరిగిన తొమ్మిది మ్యాచ్లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. రాత్రి మ్యాచ్ల్లో చేజింగ్ సమయంలో మంచు ప్రభావం ఉండడంతో 9 మ్యాచ్ల్లో బౌలర్లు కేవలం ఎనిమిది వికెట్లే పడగొట్టగలిగారు. ఈ ప్రపంచకప్ మాత్రమే కాదు 2014, 2016లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం.. లేదా చేజింగ్ టీమ్లే విశ్వవిజేతలుగా నిలవడం విశేషం. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్లో టాస్ ఎవరు గెలిస్తే వాళ్లు బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే Now for the main event 💥 New Zealand and Australia are in the final… and they’re ready 💪 Are you? https://t.co/VISgYpY6QE#T20WorldCup pic.twitter.com/p5nH9o5VxR — ICC (@ICC) November 13, 2021 -
Adam Zampa: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ...
T20 World Cup 2021- Adam Zampa Says He Has Always Been Underestimated: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపా. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆసీస్ను సెమీ ఫైనల్ చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదు పాకిస్తాన్తో కీలకమైన సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీసి ఆసీస్ తుదిపోరుకు అర్హత సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నవంబరు 14న న్యూజిలాండ్తో ఫైనల్లో ఆడేందుకు ఆడం జంపా సన్నద్ధమవుతున్నాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియాకు కీలకంగా మారి సత్తా చాటుతున్న ఆడం జంపా.. తనను ఎల్లప్పుడూ తక్కువగానే అంచనా వేస్తానని అంటున్నాడు. వరల్డ్కప్ ఆరంభానికి ముందు కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన తాను స్థానిక టీనేజర్లకు బౌలింగ్ చేస్తూ ప్రాక్టీసు చేశానని తెలిపాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెప్పుడూ అండర్ఎస్టిమేట్ చేస్తారనుకుంటాను. పదిహేను, పదహారేళ్ల కుర్రాడిగా ఉన్ననాటి నుంచి... నా కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగల వాళ్లు ఉన్నారని భావిస్తా. అంతెంతుకు ఈ టోర్నమెంట్ తర్వాత కూడా... మరో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనూ ఇలాగే జరుగుతుంది. తద్వారా నన్ను నేను మరింత మెరుగుపరచుకోగలను’’ అని జంపా చెప్పుకొచ్చాడు. ఇక తన బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి టీ20 వరల్డ్కప్లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సెమీస్ హీరో మార్కస్ స్టొయినిస్ ఆడం జంపా గురించి చెబుతూ... అతడిని అత్యంత నిజాయితీ గల ఆటగాడిగా అభివర్ణించాడు. పాకిస్తాన్తో సెమీ ఫైనల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. కాగా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన జంపా.. కీలకమైన బాబర్ ఆజమ్ వికెట్ తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్వన్ కాకపోవచ్చు.. టీమిండియాను ఓడిస్తేనే -
రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్ 10) న్యూజిలాండ్ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీస్లో ఆసీస్ ఇదే మార్జిన్(5 వికెట్ల తేడా)తో పాక్పై విజయం సాధించింది. తొలి సెమీస్లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కూడా పాక్పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. రెండు సెమీ ఫైనల్స్లో కివీస్, ఆసీస్ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్ల్లో కివీస్, ఆసీస్ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 14న జరిగే తుది సమరంలో ఆసీస్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్ను నెగ్గలేదు. చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు -
T20 World Cup 2021 Final Nz Vs Aus: ఈసారి ఎవరు గెలిచినా..
T20 World Cup 2021 Final New Zealand Vs Australia: ‘ట్రాన్స్ టాస్మన్’ జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరడంతో టి20 ప్రపంచ కప్లో కొత్త జట్టు చాంపియన్గా నిలవడం ఖాయమైంది. ఆస్ట్రేలియా ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ సాధించినా 2007నుంచి టి20 వరల్డ్ కప్ ఆ టీమ్ను ఊరిస్తూనే ఉంది. 2010లో ఫైనల్ చేరిన ఆసీస్...తుది పోరులో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. మరో వైపు న్యూజిలాండ్కు టి20 ప్రపంచ కప్లో ఇదే తొలి ఫైనల్. 2015, 2019 వన్డే వరల్డ్ కప్లలో ఫైనల్ చేరినా... ఓటమికి పరిమితమైన కివీస్ తొలి ప్రపంచ కప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. జూన్లోనే టెస్టు వరల్డ్ చాంపియన్గా నిలిచిన విలియమ్సన్ సేన ఐదు నెలల వ్యవధిలో మరో ఫార్మాట్లో విజేతగా నిలిస్తే అది గొప్ప ఘనతగా భావించవచ్చు! ఇక తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్ను.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ను ఓడించి ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. దాయాది జట్లు రెండూ కూడా ప్రత్యర్థులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి మరీ తుది పోరుకు అర్హత సాధించడం విశేషం. సెమీ ఫైనల్ స్కోర్లు: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఇంగ్లండ్- 166/4 (20) న్యూజిలాండ్- 167/5 (19) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ పాకిస్తాన్- 176/4 (20) ఆస్ట్రేలియా- 177/5 (19) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా -
ఆ జాబితాలో ఫించ్ కూడా చేరాడు..
వెల్లింగ్టన్: ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఫించ్ విధ్వంసకర వీరుల జాబితాలో చేరాడు. టీ20ల్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 135 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. హిట్మ్యాన్ రోహిత్శర్మ (127) రెండో స్థానంలో, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (113) మూడో స్థానంలో, న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో (107) నాలుగులో, విండీస్ యోధుడు గేల్ (105) ఐదో స్థానంలో ఉన్నారు. తాజాగా ఫించ్ వీరి సరసన చేరాడు. కాగా, టీ20 ఫార్మాట్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఫించే కావడం విశేషం. ఫించ్ 70 ఇన్సింగ్స్ల్లో రెండు సెంచరీలు, 14 అర్థ సెంచరీల సాయంతో 2,310 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా. సహచర ఆటగాడు వార్నర్ 81 మ్యాచ్ల్లో సెంచరీ, 18 అర్ధ సెంచరీల సాయంతో 2,265 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్లో ఫింఛ్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 పరుగుల తేడాతో కివీస్పై విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో ఆసీస్ 2-2తో సమంగా నిలిచింది. -
'మేం బాగానే ఉన్నాం.. మీ పని చూసుకోండి'
సిడ్నీ: ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తాజగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో 12 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో ఫించ్ దంపతులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ట్రోల్స్ చేశారు. అంతేగాక ఫించ్ భార్య ఎమీపై లైంగిక వేధింపులతో పాటు అసభ్యకరమైన సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఫించ్ భార్య ఎమీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను ట్రోల్ చేసిన వారిపై మండిపడింది. 'ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదా. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి.. అంతేకాని ఇలా అసభ్య సందేశాలు పంపించి మీ పరువు తీసుకోకండి. నా భర్త ఒక్క మ్యాచ్లో సరిగా ఆడనందుకు ఇలాంటి చెత్త విమర్శలు చేస్తారా? ఫించ్ ఆటగాడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్నాడు. అతని ఆటతీరును తప్పుపట్టేందుకు మీకు అర్హత లేదు. అయినా మా వైవాహిక జీవితంలో మేం బాగానే ఉన్నాం.. ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెట్టేకంటే మీ పని చూసుకుంటే బాగుంటుంది.'అంటూ హెచ్చరించింది. ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా తరపున 132 వన్డేల్లో 5232 పరుగులు, 68 టీ20ల్లో 2162 పరుగులు, 5 టెస్టుల్లో 278 పరుగులు చేశాడు.కాగా కివీస్తో సిరీస్కు ముందు ఫించ్ 29 టీ20 మ్యాచ్లాడి 495 పరుగులు సాధించాడు. వీటిలో ఐపీఎల్, బిగ్బాష్ సహా పలు అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి. ఇక కివీస్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో రెండు మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం వెల్లింగ్టన్లో జరగనుంది. చదవండి: 'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి' మహిళా క్రికెటర్తో ట్వీటర్ క్లాష్: ఈసీబీ వార్నింగ్ -
న్యూజిలాండ్దే రెండో టి20
డ్యునెడిన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్టిన్ గప్టిల్ (50 బంతుల్లో 97; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా, జిమ్మీ నీషమ్ (16 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. చివరి 7 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన స్టొయినిస్ (37 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డాన్ స్యామ్స్ (15 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి 40 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... వీరిద్దరు అవుట్ కావడంతో 10 పరుగులే వచ్చాయి. -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ రద్దు
సిడ్నీ: ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్తో జరిగే తదుపరి రెండు వన్డేలతోపాటు మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను కూడా అర్ధంతరంగా రద్దు చేసింది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. మోచేతులను తాకించుకుంటూ అభినందించుకున్నారు. -
కరోనా ఎఫెక్ట్ : ఆసీస్-కివీస్ సిరీస్ రద్దు
సిడ్నీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్తో పాటు మూడు టీ20ల సిరీస్ను న్యూజిలాండ్ అర్థంతరంగా రద్దు చేసుకుంది. దేశంలో కోవిడ్-19ను అరికట్టడానికి ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్కు వచ్చేవారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కాగా ఆదివారం అర్థరాత్రి తర్వాత నుంచి వచ్చినవారిని ఏయిర్పోర్ట్లోనే నిర్బంధంలోకి తీసుకొని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆసీస్ పర్యటనలో ఉన్న కివీస్ జట్టు మేనేజ్మెంట్ అలర్ట్ అయింది. న్యూజిలాండ్లో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు అమలుకాకముందే తమ దేశానికి వెళ్లిపోవాలని కివీస్ జట్టు అనుకుంది. దీంతో ఆదివారం జరగాల్సిన రెండో వన్డేతో పాటు మిగిలిన టీ20 సిరీస్ను కూడా వాయిదా వేసుకొని బయలుదేరనుంది. (ఐపీఎల్ 2020 వాయిదా) అంతకుమందు శుక్రవారం కివీస్తో జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్ అనంతరం కివీస్ పేస్ బౌలర్ లోకి ఫెర్గూసన్ పొడి దగ్గుతో బాధపడుతుండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా పరీక్షల నిమ్మితం ఐసోలేషన్ వార్డుకు తరలించింది. ఇదే విషయమై న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ' మ్యాచ్ ముగిసిన అనంతరం లోకి ఫెర్గూసన్ పొడి దగ్గుతో బాధపడుతుండడంతో అతన్ని హోటల్ రూంలోనే ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచాం. 24 గంటల పాటు అతను అబ్జర్వేషన్లో ఉండనున్నాడు. కరోనా వైరస్ సోకిందా లేదా అన్నది అతని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందని' పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్ ఆల్రౌండర్ కేన్ రిచర్డ్సన్కు కరోనా సోకిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చా చెప్పింది. అతని రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత కరోనా నెగిటివ్ అని తేలిందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. (భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు!) The Black Caps will return home due to the New Zealand government's tighter #COVID19 border restrictions https://t.co/GF493FicXL pic.twitter.com/YXEh9QwVFg — cricket.com.au (@cricketcomau) March 14, 2020 కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో భారత్లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగతా రెండు వన్డేలను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. (రిచర్డ్సన్కు కరోనా లేదు) -
భయంతో షేక్హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు
సిడ్నీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం క్రీడలకు పాకిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫుట్బాల్, క్రికెట్, ఇతర క్రీడలకు చెందిన పలు సిరీస్లు కోవిడ్ ప్రభావంతో రద్దయ్యాయి. ఒకవేళ మ్యాచ్లు జరిగినా మైదానంలో ప్రేక్షకులు లేకుండా ఆడాల్సి వస్తుంది. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో టాస్ వేసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్,కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అయితే వెంటనే ఫించ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఉదంతంతో ఇరు కెప్టెన్ల ముఖాల్లో నవ్వు వెల్లివిరిసింది. తర్వాత కేన్ విలియమ్సన్, ఫించ్లు తమ మోచేతులతో ట్యాప్ చేసుకున్నారు. (ఆసీస్ క్రికెటర్కు ‘కరోనా’ టెస్టులు.. వన్డేకు దూరం!) షేక్హ్యాండ్ ఇచ్చుకోవడానికి భయపడుతున్నారంటే కరోనా వైరస్ ఎంతలా ప్రభావం చూపిస్తుందో తెలుస్తూనే ఉంది.ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా కేవలం 'నమస్తే'తోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ర్టేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. 'క్రికెట్లో హ్యాండ్ షేక్ బాగా అలవాటైపోయింది.. ఇప్పుడు మోచేతితో అంటే కష్టమే అంటూ ఇరు కెప్టెన్లు అనుకుంటున్నట్లుగా' కాప్షన్ పెట్టారు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసీస్ బౌలర్ కేన్ రిచర్డ్సన్కు కరోనా సోకిందని అనుమానం రావడంతో మ్యాచ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం రిచర్డ్సన్కు కోవిడ్కు సంబంధించిన టెస్టులు పూర్తి చేశామని, వాటి రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా ఆసీస్- న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. శుక్రవారం మొదటి వన్డేలో భాగంగా టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా ప్రభావంతో ఇరు జట్ల మధ్య జరగనున్న సిరీస్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరగడం విశేషం. ('కోహ్లి నా దగ్గర సలహాలు తీసుకునేవాడు') A handshake out of habit, and then a quick joke, between the skippers 🤝#AUSvNZ pic.twitter.com/QJcsA4Bv0X — cricket.com.au (@cricketcomau) March 13, 2020 -
ఆసీస్ క్రికెటర్కు కరోనా?
-
ఆసీస్ క్రికెటర్కు కరోనా.. మ్యాచ్కు దూరం?!
సిడ్నీ: తమ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ అనారోగ్యం పాలైన నేపథ్యంలో.. అతడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిని క్వారంటైన్కు తరలించినట్లు వెల్లడించింది. దీంతో శుక్రవారం నాటి ఆసీస్- కివీస్ తొలి వన్డే మ్యాచ్కు అతడు దూరమయ్యాడు. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత కేన్ 14 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అతడు గొంతుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు మా వైద్య సిబ్బంది పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జట్టుకు దూరంగా ఉంచుతున్నాం. టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత.. అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంటాం’’అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు!) ఇక కరోనా వ్యాప్తి భయంతో మొదటి వన్డేను క్లోజ్డ్ డోర్స్లో నిర్వహించనున్నట్లు సీఏ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్... బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్19’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. దీంతో కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఐపీఎల్ నిర్వాహకులను కూడా ఈ వైరస్ భయం గడగడలాడిస్తోంది. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) JUST IN: Aussie quick Kane Richardson will miss today's #AUSvNZ ODI with results of COVID-19 test still pending. DETAILS: https://t.co/jNsxVLgRGc pic.twitter.com/SZRYEnQcJd — cricket.com.au (@cricketcomau) March 13, 2020 -
బుల్లి అభిమానికి వార్నర్ సర్ప్రైజ్ గిఫ్ట్
-
ఇది కదా వార్నర్ అంటే..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆటతోనే కాకుండా అంతకుమించిన గొప్ప మనసుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. బేసిక్గా వార్నర్కు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. దీంతో మైదానం వెలుపల, బయట తనకు తారసపడే బుల్లి అభిమానులకు ఎదో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. కొన్ని సార్లు ఎవరి ఊహకందని గిప్ట్లు, సర్ప్రైజ్లు ఉంటాయి. గతంలో షర్ట్స్, గ్లవ్స్, హెల్మెట్, ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్స్ అంటూ తనకు నచ్చిన, తోచినవి ఇస్తూ వారిని సంభ్రమశ్చార్యాలకు గురిచేస్తుంటాడు. తాజాగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి టెస్టులో ఆఖరి రోజు ఆట చూడటానికి మైదానానికి వచ్చిన ఓ చిన్నారి అభిమానికి వార్నర్ జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు వార్నర్ మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్కు వెళుతున్న సమయంలో తననే తదేకంగా చూస్తున్న ఓ అభిమానికి వార్నర్ తన బ్యాట్ను బహుకరించాడు. ఇలా ఊహించని పరిణామం ఎదురవడంతో ఆ బాలుడు కాసేపు షాక్లోనే ఉండిపోయాడు. అనంతరం ఎగిరిగంతేశాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘వార్నర్ అంటే ఇది కదా!’, ‘గట్సే కాదు దిల్ ఉన్నోడు’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత వార్నర్ ఆటలో వ్యక్తిత్వంలో చాలా మార్పులు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిషేధ సమయంలో ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. అయితే ఈ అవమానకర ఘటనల నుంచి కోలుకోవడానికి తన కుటంబమే కారణమని ముఖ్యంగా తన సతీమణి కష్ట కాలంలో తోడుగా ఉందని వివరించిన సంగతి విదితమే. నిషేధం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన వార్నర్ చాలా పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. ఇక కివీస్తో జరిగిన చివరి టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. -
'ఆ ఫోటో చూసి షాక్కు గురయ్యా'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేసి ఆస్ట్రేలియా ప్రజలకు ఒక సందేశాన్నిచ్చాడు. కాగా ఈ పోస్టులో ఒక వ్యక్తి తన కుక్కతో పాటు సముద్రం బీచ్ ఒడ్డున కూర్చొని ఎదురుగా మంటల్లో కాలిపోతున్న చెట్లను చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రోజు రోజుకి మంటల తీవ్రత పెరిగిపోతుంది. తాజాగా ఈ మంటలు సిడ్నీ పరిసర ప్రాంతాల అడవులకు కూడా వ్యాపించాయి. కాగా శుక్రవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోను షేర్ చేస్తూ తన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'నేను ఇప్పుడే ఒక వ్యక్తి తన కుక్కతో పాటు బీచ్లో కూర్చొని చెలరేగుతున్న మంటలను తదేకంగా చూస్తున్న ఫోటో ఒకటి చూశాను. నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు దేశాన్ని విపత్కర పరిస్థితులకు నెట్టేసింది. దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి, వాలంటీర్లను మనం గౌరవించాలి. శుక్రవారం జరగనున్న మ్యాచ్ ప్రారంభానికి ముందు మాతో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసి వచ్చి వారు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తారని ఆశిస్తున్నా. దేశం రక్షణ కోసం పోరాడుతున్న మీకు మేము, మా కుటుంబాలు అండగా ఉంటాయి. దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన మీరే నిజమైన హీరోలంటూ' వార్నర్ భావోద్వేగ పోస్టును పెట్టాడు. వార్నర్ పెట్టిన పోస్టుకు అతని అభిమానుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. View this post on Instagram I just saw this pic and I’m still in shock. When we go out to play tomorrow, not just the Australian team, but New Zealand as well, we never forget how privileged we are to live where we do and to do what we do. My heart, my family's heart, are with you. These fires are beyond words. To every Firefighter, volunteer to every family, we are with you. You are the real heroes. You do us proud. A post shared by David Warner (@davidwarner31) on Jan 1, 2020 at 11:01pm PST ప్రస్తుతం సిడ్నీలో నెలకొన్న పరిస్థితులతో మ్యాచ్కు అంతతరాయం కలిగే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆపరేషన్ హెడ్ పీటర్ రోచ్ వెల్లడించారు. అయితే మ్యాచ్కు ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు కార్చిచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారని తెలిపారు. (చదవండి : ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. ముగ్గురు మృతి) -
మైదానంలో మరోసారి రచ్చచేసిన స్మిత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్ డే టెస్టు’తొలి రోజు చిన్నపాటి వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ సీనియర్ అంపైర్ నిగెల్ లాంగ్ తీరుపై ఆసీస్ స్టార్ బ్యాట్స్మన స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్లో ఉన్న షేన్ వార్న్ సైతం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని ఎద్దేవాచేశాడు. అయితే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే స్మిత్ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆసీస్ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ అనే విషయం ఈ ఒక్క సంఘటన నిరూపితమైందని మరి కొంత మంది పేర్కొంటున్నారు. ‘టెస్టు క్రికెట్లో ఒక్క పరుగు కోసం అది కూడా న్యాయబద్దం కాని దాని కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్మన్ స్మిత్’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ పరుగుల వేట ప్రారంభించింది. అయితే ఆరంభంలేనే ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ తగిలింది 61 పరుగులకే వార్నర్, బర్స్న్ వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్మిత్, లబుషేన్లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ 26వ ఓవర్(బ్రేక్కు ముందు ఓవర్) సందర్భంగా కివీస్ బౌలర్ వాగ్నర్ వేసిని షార్ట్ పిచ్ బాల్ స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో సింగిల్ తీసే ప్రయత్నం చేశారు. అయితే బ్యాట్స్మెన్ సింగిల్ తీసే ప్రయత్నాన్ని అంపైర్ నిగేల్ లాంగ్ అడ్డుకున్నాడు. ఎందుకంటే అ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్మన్ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్ అవుతుందని.. ఇదే విషయాన్ని స్మిత్కు అంపైర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అంతకుముందు ఓవర్లో కూడా జరగడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే కామెంటరీ బాక్స్లో ఉన్న షేన్ వార్న్ అంపైర్ తీరును తప్పుపట్టారు. అంపైర్ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. షార్ట్ పిచ్ బంతికి బ్యాట్స్మన్ శరీరంలో ఎక్కడ తగిలినా పరుగు తీయవచ్చనే నిబందన ఉందని పేర్కొన్నాడు. ‘నాకు తెలిసి అంపైర్కు ఐసీసీ నిబంధనల బుక్ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్ సమయంలో ఎవరైనా ఇవ్వండి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఈ వివాదంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. You make the call - should this be a dead ball? #AUSvNZ pic.twitter.com/CMp4Q9AHvW — #7Cricket (@7Cricket) December 26, 2019 Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1 — Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019 -
అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్!
పెర్త్: ఆస్ట్రేలియా టెస్టు సారథి, వికెట్ కీపర్ టిమ్ పైన్ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పైన్ చేసిన చిన్న తప్పిదానికి అతడిపై ఆసీస్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ చెత్త కీపంగ్తో కివీస్ బ్యాట్స్మన్ వాట్లింగ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కివీస్ బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ స్టార్ వేసిన 35వ ఓవర్ ఐదో బంతిని రాస్ టేలర్ కవర్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ తీశాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న వాట్లింగ్, టేలర్ వద్దని వారించినా రెండో పరుగు కోసం సగం క్రీజు వరుకు చేరుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లియోన్ బంతిని వేగంగా అందుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి విసిరిడు. ఆ సులువైన బంతిని అందుకోవడంలో పైన్ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్కు పైన్ రూపంలో జీవనధారం లభించింది. సులువైన బంతిని అందుకోడంలో విఫలమైన టిమ్ పైన్ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. అయితే ఈ రనౌట్ మిస్సయినప్పటికీ ఆసీస్కు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే వాట్లింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే చాలా సులువైన బంతిని అందుకోవడంలోనే పైన్ తడబడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ‘అసలు పైన్ జట్టులో ఎందుకో నాకర్థం కావడం లేదు. కీపింగ్లో ఎలాంటి గొప్పతనం, కొత్తదనం లేదు.. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం కెప్టెన్గా ఉన్నందునే జట్టులో ఇంకా కొనసాగుతున్నాడు. యువ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చి.. స్మిత్కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి టిమ్ పైన్ను జట్టు నుంచి సాగనంపడం బెటర్’అంటూ ఓ నెటజన్ కామెంట్ చేయగా.. ‘ప్రపంచంలోనే చెత్త కీపర్ టిమ్ పైన్’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో కివీస్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఆసీస్ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాట్స్మన్ ధాటిగా ఆడటంతో 217 పరుగులకే ఆలౌటైంది.(గాయం కారణంగా హేజిల్వుడ్ బ్యాటింగ్కు దిగలేదు). దీంతో కివీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి: ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు.. ‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్ డిసైడర్’ An early chance goes by! Paine fumbles with Watling out of the frame! #AUSvNZ live: https://t.co/0Uay6Vh9fg pic.twitter.com/mjZUiWrrqH — cricket.com.au (@cricketcomau) December 14, 2019 -
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
పెర్త్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాళ్ల గాయాల బెడడ తప్పటం లేదు. రొజుకొకరు చొప్పున గాయపడటం ఇరు జట్లను కలవరపెడుతోంది. తొలి రోజు కివీస్ బౌలర్ ఫెర్గుసన్ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ గాయంతో ఈ సిరీస్కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మూడో రోజు ఆటలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్కు అంపైర్గా విధులు నిర్వర్తిస్తున్న పాకిస్తాన్ సీనియర్ అంపైర్ అలీమ్ దార్ గాయపడ్డాడు. గాయంతో విలవిల్లాడిన ఆయన మైదానంలో కుప్పకూలాడు. అలీమ్ దార్కు గాయం జరిగిన తీరు చూశాకా ఈ టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపించాయి. అనంతరం ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తిరిగి అంపైరింగ్ చేశాడు. దీంతో కథ సుఖాంతమైంది. అసలేం జరిగిందంటే? ఆస్ట్రేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టిమ్ సౌథీ వేసిన బంతిని మార్నస్ లబుషేన్ డిఫెన్స్ ఆడాడు. ఇదే సమయంలో మరో ఎండ్లో ఉన్న నాన్ స్ట్రైకర్ బర్న్స్ సింగిల్ తీసే ప్రయత్నంలో సగం క్రీజు వరకు వెళ్లాడు. ఈ క్రమంలో బంతి అందుకున్న బౌలర్ టిమ్ సౌథీ వికెట్లపై విసిరాడు. ఆ బంతి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అలీమ్ దార్, ఇదే క్రమంలో ఆ బంతిని అందుకోవాలని కివీస్ ఆల్రౌండర్ సాంట్నర్ చేసిన ప్రయత్నంలో వీరిద్దరూ ఢీ కొట్టకున్నారు. అయితే సాంట్నర్ అలీమ్ను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదర్లేదు. చికిత్స అనంతరం అలీమ్ దార్ అంపైరింగ్ చేయడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ‘400 నాటౌట్.. 434 ఛేజింగ్ చూశా’ మూర్ఖులు అర్థం చేసుకోలేరు -
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
-
ఫెర్గుసన్కు గాయం.. వాన్ కొత్త ప్రతిపాదన
పెర్త్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలి మ్యాచ్లో పర్యాటక న్యూజిలాండ్ జట్టును కష్టాలు వెంబడిస్తున్నాయి. తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ పేస్ బౌలర్ ఫెర్గుసన్ కాలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. కేవలం 11 ఓవర్లు వేసిన అనంతరం ఫెర్గుసన్ మైదానం వీడటంతో ఒక బౌలర్ లోటుతోనే కివీస్ తొలి ఇన్నింగ్స్ను గట్టెక్కించింది. ఫెర్గుసన్ గాయం తీవ్రత దృష్ట్యా అతడు తొలి టెస్టులో బౌలింగ్ చేయకపోవడమే మంచిదని అయితే బ్యాటింగ్కు దిగొచ్చని డాక్టర్లు పేర్కొన్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు తొలుత ఓ ప్రకటన చేసింది. అనంతరం ఫెర్గుసన్కు తొలి టెస్టుకు విశ్రాంతి నివ్వడమే మంచిదని డాక్డర్లు సూచించినట్లు మరో ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెర్గుసన్ గాయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఫెర్గుసన్ మైదానంలోకి దిగినా బౌలింగ్ చేసే అవకాశమే లేదని కివీస్ బోర్డు నిర్దారణకు వచ్చింది. దీంతో ఒక బౌలర్ లోటు తోనే తొలి టెస్టును నెట్టుకురావాల్సిన పరిస్థితి విలియమ్స్ సేనకు ఏర్పడింది. అయితే ఈ సందర్భంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. మిగతా నాలుగు రోజులు కివీస్ ఒక ప్రధాన బౌలర్ సేవలను కోల్పోనుందని, ఇది ఏ జట్టుకైన ఇబ్బందేనని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి తరుణంలో కాంకషన్ సబ్స్టిట్యూట్ మాదిరిగానే ‘ఇండిపెండెంట్ డాక్టర్ ఆన్ సైట్’ అనే ప్రతిపాదనను ఐసీసీ ముందుంచాడు. మ్యాచ్ సందర్భంగా ఆటగాడు గాయపడితే మైదానంలో ఉన్న నియమిత డాక్టర్ అతడిని పరీక్షించిన అనంతరం ఆ క్రికెటర్ మ్యాచ్ ఆడే వీలులేదని ప్రకటిస్తే మరో ఆటగాడిని జట్టులోకి తీసుకునే వెసులుబాటును కల్పించాలన్నాడు. దీంతో ఏ జట్టు నష్టపోదని వాన్ అభిప్రాయపడుతున్నాడు. మరి ఈ ప్రతిపాదనపై క్రికెట్ దేశాలు, ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. -
న్యూజిలాండ్పై ఆసీస్ విజయం
-
ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్.. ఆసీస్ విజయం
లండన్: ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న కంగారూ జట్టు.. మరో విజయాన్నందుకుంది. శనివారం బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్లో ఆ జట్టు.. 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగులు చేసిన కెప్టెన్ విలియమ్సనే ఆ జట్టులో టాప్స్కోరర్. మిచెల్ స్టార్క్ (5/26) నిప్పులు చెరిగే బంతులతో కివీస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడు బెరెన్డార్ఫ్ (2/31) కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. అంతకుముందు బౌల్ట్ (4/51), ఫెర్గూసన్ (2/49), నీషమ్ (2/28)ల ధాటికి ఆసీస్ ఒక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఖవాజా (88; 129 బంతుల్లో 5×4), కేరీ (71; 72 బంతుల్లో 11×4)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (4/51) హ్యాట్రిక్కు తోడు నీషమ్ (2/28), ఫెర్గూసన్ (2/49) రాణించడంతో శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ కట్టడి చేసింది.ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బౌల్ట్ విజృంభించి ఖాజా, స్టార్క్ (0), బెహ్రెన్డార్ఫ్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఈ ప్రపంచ కప్లో భారత పేసర్ మొహమ్మద్ షమీ తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్ బౌల్ట్. హ్యాట్రిక్ సాధించిన క్రమం... ఇన్నింగ్స్ 50వ ఓవర్ మూడో బంతి – ఖాజా (బి) బౌల్ట్ నాలుగో బంతి – స్టార్క్ (బి) బౌల్ట్ ఐదో బంతి – బెహ్రన్డార్ఫ్ (ఎల్బీడబ్ల్యూ) బౌల్ట్ వన్డే కెరీర్లో రెండో హ్యాట్రిక్ సాధించిన బౌల్ట్... ప్రపంచ కప్లో ఈ ఘనత నమోదు చేసిన తొలి న్యూజిలాండ్ బౌలర్గా రికార్డులకెక్కాడు. -
ఆసీస్ను కివీస్ నిలువరించేనా?
లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మెగా టోర్నీలో ఒక్క భారత్తో మినహా మిగిలిన ఆరు మ్యాచ్ల్లో గెలుపొందిన ఆసీస్.. మొత్తం 12 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్కు చేరిన తొలిజట్టుగా నిలిచింది. ఫించ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లో బలీయంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. మరోవైపు టోర్నీలో అపజయమే ఎరుగకుండా సాగుతున్న కివీస్కు గత మ్యాచ్లో పాకిస్తాన్ షాకిచ్చింది. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న కివీస్ నాకౌట్లో ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో జరిగే మ్యాచ్ల్లో ఒకదాంట్లో గెలవాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను పరిశీలిస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్గా చెప్పుకోవచ్చు. రెండు జట్లు గత వరల్డ్కప్ ఫైనల్లో తలపడినప్పుడు ఆసీస్ జయకేతనం ఎగురవేసింది. దాంతో ఆస్ట్రేలియాను కంగుతినిపించి గత పరాభవానికి విలియమ్సన్ సేన బదులు తీర్చుకుంటుందా.. లేక మరోసారి ఆసీస్దే పైచేయి అవుతుందా అన్నది చూడాలి.