bail petition
-
వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్లో పేర్కొన్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. తను బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక పిటిషన్.. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో తనకు బ్యారక్లో బెడ్ అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఇదిలా ఉండగా.. వంశీని కస్టడీకి కోరుతూ పటమట పోలీసుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్లో కోరారు. -
వంశీ అరెస్ట్ ముందస్తు వ్యూహమే
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను అరెస్ట్ ముందస్తు వ్యూహమే. ఆయన్ని∙అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్నిన కుట్ర మాత్రమే.వీటన్నింటినీ పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి’ అని వంశీ తరపున దాఖలు చేసిన బెయిల్పిటిషన్లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. ‘రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు. అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్ ఈ నెల 12న పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు చేసిన కిరణ్ను, బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్, ఎక్స్ట్రాక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది. అదే రోజు (12వ తేదీ) రాత్రే విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామునే బెడ్రూంలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్కు తెచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తరువాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే.పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్థన్తో పోలీసులు బలవంతంగా సెకండ్ ఏసీఎంఎం కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్లు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్ను బెదిరించేందుకు వంశీ, అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో, టెయిల్ బోన్ గాయంతో బాధపడుతున్నారు.కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. నేలపై కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి’ అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకు టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్లో అసిస్టెంట్ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ జ్యుడిíÙయల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ, అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. -
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కీలక అంశాలు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. మరోవైపు.. ఇప్పటికే వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.తన బెయిల్ పిటిషన్లో వంశీ కీలక అంశాలను వెల్లడించారు. బెయిల్ పిటిషన్లో భాగంగా వంశీ..‘తనపై రాజకీయ, వ్యక్తిగత కక్షతో కేసులు నమోదు చేశారు. సత్య వర్ధన్ను తాను కిడ్నాప్ చేశాననేది అక్రమంగా పెట్టిన కేసు. తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకి వచ్చినట్టు సత్య వర్ధన్ కోర్టుకు తెలిపాడు. గతంలో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు కోర్టు ఇస్తే సత్య వర్ధన్ వచ్చారు. కేసుతో తనకు సంబంధం లేదని తనను ఎవరూ తిట్టలేదని పోలీసులకు కూడా గతంలోనే సత్య వర్ధన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే విషయాన్ని మళ్లీ కోర్టుకు సత్య వర్ధన్ తెలిపారు తప్ప నా ప్రమేయం లేదు’ అని తెలిపారు.ఇక, మెడికల్ గ్రౌండ్స్లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరో పిటిషన్ దాఖలు చేశారు. వెన్నుపూస నొప్పి కారణంగా జైలులో తనకు బెడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే జైలు అధికారులతో తనకు వెన్నుపూస నొప్పి ఉందని మంచం కావాలని జైలు అధికారులను కోరారు. జైలు అధికారులు కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించడంతో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. -
‘సహ జీవన’ సంబంధాలకు తగు పరిష్కారం కనుగొనాలి
ప్రయాగ్రాజ్: సమాజం ఆమోదించకున్నా నేటి యువత సహ జీవన సంబంధాలకు మొగ్గు చూపుతోందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో నైతిక విలువలను కాపాడేందుకు తగు పరిష్కారం లేదా నిబంధనలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. వివాహం పేరుతో మహిళతో శారీరక సంబంధం కొనసాగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారణాసి వాసి ఆకాశ్ కేసరి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహ జీవనం వైపు యువతీయువకులు ఆకర్షితులవుతున్నారు. కొన్నాళ్లు కలిసున్నాక ఇష్టం లేకుంటే అతడు లేక ఆమె చాలా సులువుగా ఈ బంధం నుంచి బయటపడేందుకు అవకాశముంది. అందుకే, ఇలాంటి బంధాలకు యువత తొందరగా లొంగిపోతోంది. అందుకే, సమాజంలో నైతిక విలువలను పరిరక్షించేందుకు సహ జీవన సంబంధాలకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన సమయమిదే’అని పేర్కొన్నారు. ఓ మహిళతో ఆకాశ్ కేసరి ఆరేళ్లపాటు సహజీవనం చేశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించాడంటూ బాధిత మహిళ సార్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కేసరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆ మహిళ మేజర్ అనీ, అంగీకారంతోనే ఆమె సహజీవనం చేసిందని కేసరి లాయర్ వాదించారు. ఆమెకు కేసరి అబార్షన్ చేయించలేదని, పెళ్లి చేసుకుంటానని అతడు మాట కూడా ఇవ్వలేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసరికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్పై నేడు విచారణ
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి.. ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండిసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంబటి పిటిషన్లో పూర్తి వివరాలివ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు. -
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
రాజకీయ దురుద్దేశాలతోనే కేవీ రావు తప్పుడు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) రాజకీయ దురుద్దేశాలతోనే తనపై సీఐడీకి ఫిర్యాదు చేశారని వైవీ విక్రాంత్రెడ్డి హైకోర్టుకి నివేదించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణను తోసిపుచ్చుతున్నట్టు విక్రాంత్రెడ్డి తెలిపారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీయాలన్న అజెండాతోనే కేవీ రావు నాపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా అనుచిత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు. నాపై చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారం చూపలేదు. తద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో నిర్ణయం వెలువరించేందుకు అత్యావశ్యకమైన పలు కీలక విషయాలను ఆయన తొక్కిపెట్టారు. వాటాల బదిలీ జరిగిన నాలుగేళ్ల తరువాత సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఆయన ఎక్కడా చెప్పలేదు. వాటాల బదిలీ ప్రక్రియలో, మూల్యాంకనంలో, ఒప్పందాల తయారీలో కేవీ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంతో నాకున్న రాజకీయ సంబంధాల దృష్ట్యా నా ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ దురుద్దేశాలతో ఆయన ఫిర్యాదు చేశారు. కేవీ రావు తన స్వీయ చర్యల నుంచి దృష్టిని మరల్చేందుకే, తన తప్పులను కప్పించుకునేందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తను బాధితుడినంటూ చెప్పుకుంటున్న కేవీరావు అందుకు ప్రాథమిక ఆధారాలను చూపడంలో విఫలమయ్యారు. న్యాయ సలహాదారులు, ఆడిటర్ల సమక్షంలోనే వాటాల బదిలీ జరిగింది’ అని విక్రాంత్రెడ్డి వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించాలని కోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయదలచుకుంటే చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేయడంతో విక్రాంత్రెడ్డి తన వాదన వినిపిస్తూ సోమవారం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా
-
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
‘రిమాండ్’ను కొట్టివేయలేం
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి జిల్లాకోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పట్నం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావం ఉండబోదని ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. పిటిషన్ను కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు డాకెట్(రిమాండ్) ఆర్డర్ను క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గత నెల తీర్పు రిజర్వు చేశారు. పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అయితే, బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టు చేసిన వ్యాఖ్యలను నరేందర్రెడ్డి న్యాయవాది జస్టిస్ కె.లక్ష్మణ్ దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లు తమ పరిధిలోకి రావని స్పెషల్ కోర్టు చూస్తుందని వెల్లడించిందన్నారు. దీంతో స్పెషల్ కోర్టు వివరాలు తెలపాలని న్యాయమూర్తి నరేందర్రెడ్డి న్యాయవాదిని ఆదేశించారు. గత నెల 13న నరేందర్రెడ్డిని అరెస్టు చేయగా, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్రెడ్డి అందజేసిన అఫిడవిట్ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్పై రేపు విచారణ నరేందర్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. -
ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు
ఢిల్లీ: లైంగిక దాడుల కేసుల్లో కర్ణాటక నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భంగపాటు ఎదురైంది. బెయిల్ విజ్ఞప్తిని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇంతకు ముందు.. కర్ణాటక హైకోర్టు కూడా ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. -
జానీ మాస్టర్కు భారీ షాక్
-
నేషనల్ అవార్డు తీసుకోవాలి బెయిల్ ఇవ్వండి..
-
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదించారు. ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.సింఘ్వీ వాదనలు..ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది. మూడు కోర్టు ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా బీమా అరెస్టు కింద( ఆకస్మిక) సీబీఐ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుంది. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ జైలులో ఉంచవచ్చని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.41ఏ కింద కేజ్రీవాల్ను నిందితుడిగా విచారించాలని సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అరెస్ట్ చేయాలని ముందుగా అనుకోలేదు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పుడు కేవలం ఆయన్ను విచారించేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది.41ఏ దరఖాస్తు ప్రకారం సీబీఐ సీఎంను మూడు గంటలు విచారించారు. కానీ వారి దగ్గర 41ఏ నోటీసు లేదు. మరి అంత అకస్మాత్తుగా కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట చేశారు. ఇది బీమా అరెస్ట్, హడావిడి అరెస్ట్ కాకుంటే మరెంటీ?కేజ్రీవాల్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడా? అతను సాక్షులను ప్రభావితం చేస్తాడా? సుప్రీంకోర్టు మూడు ప్రశ్నల గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి.సీబీఐ అరెస్టుకు ప్రధాన కారణం కేజ్రీవాల్ సహకరించకపోవడమే. ఒక వ్యక్తి తనను తాను నేరారోపణ చేసుకోవాలని ఎలా అనుకుంటారు.అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఎక్కడికి పారిపోలేడు. ట్యాంపరింగ్ కుదరదు, లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఐదు చార్జిషీట్లు దాఖలయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండదు. బెయిల్ కోసం మూడు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నాయి.కేజ్రీవాల్కు రెండుసార్లు బెయిల్ పొందారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద సుప్రీంకోర్టు ఓసారి బెయిల్ ఇచ్చింది. కేవలం ఇన్సురెన్స్ (ముందస్తు, హడావిడీ) అరెస్టు మాత్రమే. అతని అరెస్ట్ను సమర్ధించేందుకు అంతకుముంచి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఈ కేసులో మిగతా నిందితులందరూ(విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చి బాబు, సంజయ్ సింగ్, కవిత) విడుదలయ్యారు.లిక్కర్ పాలసీకి సబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఒకరు కస్టడీలో ఉన్నప్పుడు .. మళ్లీ అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్లో ఏదో ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.సీబీఐ సెక్షన్ 41, 41ఏ లను పాటించకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది.సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం ముందు మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం తిరిగి ట్రయల్ కోర్టుకు వెళ్లండి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన కేసులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.కేజ్రీవాల్ ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించాడు. ఇది నా ప్రాథమిక అభ్యంతరం. మెరిట్ల దృష్ట్యా ట్రయల్ కోర్ట్ దీనిని మొదట విచారించాల్సి ఉంది. అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుంది. సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.కేజ్రీవాల్ ముందు సుప్రీంకోర్టుకు వచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు, ఇప్పుడు ఇక విషయాన్ని ఈ కోర్టు నిర్ణయించాలి. ఈ మేరకు కవిత కేసును ప్రస్తావిస్తూ.. ముందుగా ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ తిరస్కరణ ఎదురవ్వడంతో హైకోర్టు మెట్లెక్కారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.ఎస్పీ రాజు వాదనలపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ..ఒకరిని ట్రయల్ కోర్టుకు పంపాలనుకుంటే అప్పుడే హైకోర్టు నిర్ణయాత్మకంగా ఆలోచించాల్సి ఉండేది. ఇక్కడ మెయింటెనబిలిటీకి సంబంధించిన ప్రశ్న కూడా నిర్ణయించుకోవాలి.చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ ప్రత్యేక వ్యక్తులు కారు. ఏ వ్యక్తికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు. కేవలం ముఖ్యమంత్రి కావడం వల్లే కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ ప్రజలు ట్రయల్ కోర్టుకు వెళతారు. వారంతా సుప్రీంకోర్టుకు రాలేరు.కేజ్రీవాల్ రిమాండ్ దరఖాస్తును అందించాం, అందులో అరెస్టుకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసిప్పుడు లేదా సాక్షులను బెదిరించినప్పుడు. వారెంట్ లేకుండా సరైన దర్యాప్తు కోసం అరెస్టు చేయవచ్చు. ఈ కేసు ఆ వర్గంలోకి వస్తుంది.అరవింద్ కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ కాపీని జతచేయలేదు. దానిని దాచినందున అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, అది ఢిల్లీ హైకోర్టును నిలదీసినట్టే’ అంటూ వాదనలు వినిపించారు.అయితే లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో సీఎంకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ కేసులోనూ సుప్రీం ముఖ్యమంత్రి బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. -
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసన హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను వ్యతిరేకిస్తూ.. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కోట్టివేసింది. ఈ క్రమంలో బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక్క సయన్ లాహిరినే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ‘‘ ఇది బెయిల్ ఇచ్చే కేసు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే విషయంలో విద్యార్థి నేత తల్లి దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తెలిపింది’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.‘‘చలో సెక్రటేరియట్’’ మార్చ్ నిర్వహించిన రోజు రాత్రి ఛత్ర సమాజ్ నిర్వాహకుల్లో ఒకరైన సయన్ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సుప్రీంకోర్టులో కాసేపట్లో కవిత బెయిల్ - పిటిషన్పై విచారణ
-
బెయిల్పై ఉత్కంఠ.. ఢిల్లీకి KTR
-
కవితకు బెయిల్ వచ్చేనా?
-
బెయిల్ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.మంగళవారం కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్లు న్యాయవాది మోహిత్రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండిపీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.పీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
కవితకు మళ్లీ నిరాశే!
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్కు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.Supreme Court posts the hearing for August 27 on the plea of BRS leader K Kavitha seeking bail in corruption and money laundering cases linked to the alleged Delhi excise policy scam. pic.twitter.com/0Klk3lvDJV— ANI (@ANI) August 20, 2024మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హూకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది.చదవండి: నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
-
కవిత బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
నేడు కవిత బెయిలుపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బెయిలు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటి షన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖ లు చేసిన పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కు కూడా బెయిలు దక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయి లు ఇచ్చిన సమయంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిలు అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు నేడే
ఢిల్లీ:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టిన తీర్పును ఇవాళ(సోమవారం) ఇవ్వంది. లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ‘‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. -
కేజ్రీవాల్ బెయిల్పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
వైఎస్సార్సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. -
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు
-
కవిత బెయిల్ తీర్పు.. ఉత్కంఠ
-
సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను అనవసరంగా వాయిదా వేయకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.కాగా తన బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ తేదీ అయిన జులై 9న పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇలాంటి కేసుతో తన పిటిషన్ను ట్యాగ్ చేయాలన్న జైన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.ఇక 28న జైన్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈడీ స్పందన కోరింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్పై 2017లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను 2022లో మే 20న అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019లో సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్షీట్లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
కేజ్రీవాల్కు మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. కాగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. -
ప్రచారానికి కేజ్రీవాల్ ఆరోగ్యం అడ్డురాలేదా?: కోర్టులో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సాధారణ బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయస్థానం మద్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యతిరేకించింది. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆయన ఆరోగ్యం అడ్డురాలేదని పేర్కొంది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారని .. అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన బెయిల్ ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్లో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్కు ఆయన ఆరో గ్యం ఆటంకం కలిగించలేదని అన్నారు. ‘ఇప్పటి వరకు సీఎం చాలా ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషయంలో బెయిల్ దాఖలు చేశారు. అయన ప్రవర్తన బెయిల్కు అర్హత కాదు’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదపరి విచారణను జూన్1కు వాయిదా వేసింది.కాగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాలని ఆదేశించింది.అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్కు విచారణార్హత లేదని వివరించింది. దీంతో ఈ కేసులో మధ్యంతర, సాధారణ బెయిల్ను కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
సీజేఐ పరిశీలనకు.. కేజ్రీవాల్ పిటిషన్
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్
-
పిన్నెల్లి బెయిల్పై నేడే తీర్పు
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై నేడు(మంగళవారం) ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది. ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్కి హైకోర్టుని మరోసారి పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. చదవండి: చంద్రబాబు సేవలో బదిలీ బలగాలు!హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు. -
కవిత బెయిల్ పై ఉత్కంఠ
-
కవిత కేసులో నేడు ఏం జరగనుందో?
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్ తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారామె. పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్తో ఊరట ఇవ్వాలని పిటీషన్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదన్నారు.అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్ పిటిషన్పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్ పిటిషన్పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. జూన్ 3 వరకు కవిత జ్యూడీషియల్ రిమాండ్ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు. -
ఢిల్లీ హైకోర్టు: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో ఆమె ప్రస్తావించింది.హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్లో వెల్లడించారు.1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు గురువారం 1,149 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ స్యూర్యకాంత శర్మ శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు (రౌజ్ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్ పిటిషన్ను నిరాకరిస్తూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
కవిత బెయిల్పై మే మొదటి వారంలో తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.ఈడీ వాదనలుపీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాంఅక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదుఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.ఈ పాలసీలో ఇండో స్పిరిట్కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అసాధారణ లాభాలు గడించారు.బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదు.ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.అందులో 25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.ఎల్ 1 లైసెన్స్లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారు.బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్లో ఈ సాక్షాలు దొరికాయి.మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారుఅనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారుకోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారుఅప్రూవర్ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. అప్రూవర్లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.అనేక సార్లు అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారుకవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారుదీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారుపబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చిందికవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారుకవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారుఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారువిచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడుఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారుహవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారుకవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారుఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదుతన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారుపని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారుసాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారుకాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.బెయిల్ పిటిషన్పై మంగళవారం నాటి వాదనలు..ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.డీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. ఇండో స్పిరిట్స్లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్గ్రూప్నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. కవిత బెయిల్పై వాదనలు లిక్కర్ స్కాంలో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్పై ఈడి వాదనలు కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు దీని అర్థం అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కాంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని తమకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు ఈడి జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్ లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచాము పిఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5% అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాలు ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు అని గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి సాక్ష్యాలున్నాయి కవిత తరపు లాయర్ వాదనలు మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. -
నేడు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్ను విత్ డ్రా చేసుకున్నారు.నలుగురు నిందితులపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ఠ్ కింద కేసు నమోదు చేయగా.. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలన్న నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. కాగా గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. ఇక ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. -
కవిత లిక్కర్ కేసు లో దూకుడు పెంచిన సీబీఐ
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
-
Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4న చేపడతామని తెలిపింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పారు. ఈ సందర్భంగా అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ అంశాలను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన తొమ్మిది స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్మెంట్ పూర్తి విరుద్దంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అడిషనల్ చార్జ్ షీట్లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’ :::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్ ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. బెయిల్పై వాదనల సందర్భంగా.. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. ఇదీ చదవండి- అప్రూవర్గా మారను.. క్లీన్గా బయటకొస్తా: కవిత కవిత మేనల్లుడి అరెస్ట్కు రంగం సిద్ధం? మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. -
Delhi: సత్యేంద్రజైన్ వెంటనే లొంగిపోవాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జెయిన్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చ్ 18) కొట్టివేసింది. జైన్ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బేలా ఎమ్. త్రివేది, పంకజ్ మిట్టల్లతో కూడిన ధర్మాసనం జైన్ బెయిల్ పిటిషన్ను విచారించింది.‘బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం, పిటిషనర్ వెంటనే లొంగిపోవాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అనారోగ్య కారణాల వల్ల తన క్లైంట్ లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సత్యేంద్ర జైన్ తరపు న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. గత సంవత్సరం మే 26 నుంచి సత్యేంద్రజైన్ మధ్యంతర మెడికల్ బెయిల్పై బయటే ఉన్నారు. ఈయనకు గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్ జరిగింది. కాగా, 2015 నుంచి 2017 వరకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారన్న అభియోగాలపై 2022 జైన్ అరెస్టయ్యారు. ఇదే కేసుకు సంబంధించి జైన్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్కు పాల్పడి అక్రమ లావాదేవీలు చేశారని ప్రాథమికంగా తేల్చిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్లు.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్ -
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
-
చంద్రబాబు జైలు.. లోకేష్ బెయిల్: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
-
చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకరణ
-
సెక్షన్ 17A వర్తిస్తుందన్న చంద్రబాబు తరపులాయర్లు
-
పల్లవి ప్రశాంత్ బెయిల్ పై హైకోర్టులో కీలక వాదనలు
-
దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై నేడు విచారణ
-
భర్త చేసినా అత్యాచారమే
అహ్మదాబాద్: ‘అత్యాచారం ఎవరు చేసినా అత్యాచారమే. భర్త అత్యాచారానికి పాల్పడినా అది నేరమే’ అని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. మహిళలపై లైంగిక హింస పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరముందని న్యాయమూర్తి జస్టిస్ దివ్యేశ్ జోషి అన్నారు. ఓ మహిళ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోడలి పట్ల క్రూరత్వం, నేరపూరిత ప్రవర్తన కారణంగా పిటిషనర్కు బెయిలిచ్చేందుకు నిరాకరించారు. భర్త, కొడుకు కలిసి కోడలిపై అత్యాచారం చేస్తూ వాటిని వీడియోలు తీసి పోర్నోగ్రఫీ సైట్లలో పెట్టి డబ్బు సంపాదిస్తున్నారని తెలిసినా ఆమె మిన్నకుండిపోవడంపై జడ్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
టీడీపీ నేత నారాయణ ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ
-
చంద్రబాబుకు సుప్రీం కోర్ట్ నోటీసులపై పొన్నవోలు కామెంట్స్
-
ఐటెం నెంబర్ 64..సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
-
చంద్రబాబు నాయుడు: తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
-
బాబు షూరిటీ..జైలు గ్యారెంటీ..చంద్రబాబు కొత్త ప్రోగ్రాం: గోరంట్ల మాధవ్
-
500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
-
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
-
140 మంది సాక్షులను విచారించింది
-
చట్ట ప్రకారం విచారించాలని సూచించిన హైకోర్టు
-
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్రావు ఇవాళ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని తెలిపిన హైకోర్టు.. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చవని, సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యుషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని, ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారని, కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదని హైకోర్టు పేర్కొంది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారన్న హైకోర్టు.. కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది. చంద్రబాబు బెయిల్ ఆర్డర్లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చంద్రబాబు బెయిల్ ఆర్డర్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదని పేర్కొంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందన్న సీఐడీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇది బెయిల్ పిటిషన్ మాత్రమే కాబట్టి స్కిల్ స్కామ్ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న హైకోర్టు.. ట్రయల్ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయని తెలిపింది. ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ను చట్ట ప్రకారం విచారించాలని హైకోర్టు సూచించింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణాలు చూపించడంతో మానవతా కోణంలో ఏపీ హైకోర్టు బాబుకి అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్పై వాదనలు సాగాయిలా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు సీల్డ్కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. స్కిల్ స్కామ్ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్, కన్వేల్కర్ మెస్సేజ్ల ఆధారంగా డబ్బు హైదరాబాద్కు చేరినట్లు తెలిసింది. స్కిల్ స్కామ్లో మెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్ సెక్రటరీ తన లెటర్లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు. చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయి. బెయిల్పిటిషన్పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్ ఎథిక్స్కు విరుద్ధం. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, ఆ పని చేయం. పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు. -
బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు..