Bhavana
-
వివాహాల గూఢచారి...భావనా పాలివాల్
గతంలో పెళ్లిళ్ల పేరయ్య ఏం చెప్తే అది. లేదా తెలిసిన వారి ఎంక్వయిరీతో సరి. ఇప్పుడు మాత్రం ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా గూఢచారుల రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఈ కాలం పెళ్ళిళ్లలో అబ్బాయి, అమ్మాయిల కాండక్ట్ను కనిపెట్టి చెబుతున్న ‘మ్యారేజ్ డిటెక్టివ్’లు పెరిగారు. ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? పెళ్లిళ్ల పరిశోధన ఎందుకు అవసరమని చెబుతోంది?పెళ్లి అనగానే ఖర్చులు రాసుకోవడం మొదలెడతారు ఇటు పక్షం వాళ్లు, అటు పక్షం వాళ్లు. కల్యాణ మంటపం, బట్టలు, నగలు, భోజనాలు... ఇప్పుడు మరో ఖర్చు కూడా చేరుతోంది. డిటెక్టివ్ ఖర్చు. ప్రేమ పెళ్ళిళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయినా ‘సరిగ్గా ఆచూకీ తీసి’ పెళ్లి చేయాలనే నిర్ణయం ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తోంది. మెట్రో నగరాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో. అందుకే 48 ఏళ్ల భావనా పాలివాల్ నిత్యం బిజీగా ఉంటోంది. ఈమెకు ఢిల్లీలో ‘తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ ఉంది. ఈమెకు రోజుకు 4 కేసులు వస్తాయి– డిటెక్టివ్ పని చేసి పెట్టమని. కావాల్సిన వివరాలను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీసు తీసుకుంటుందామె.నమ్మకం కోసం:‘ఊర్లలో పెళ్లిళ్ల పేరయ్యల, ఉమ్మడిగా తెలిసిన బంధువులో మిత్రులో చెప్పే మాటల వల్ల పెళ్ళిళ్లు ఖరారు అయ్యేవి. నగరంలో వివిధ మెట్రిమోనియల్ ఏజెన్సీల ద్వారా సంబంధాలు కలుపుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా పరిచయాలు పెళ్ళిళ్ల వరకూ వెళుతున్నాయి. అయితే ఎవరు ఎలాంటివారో తెలిసేది ఎలా అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అంటుంది భావనా పాలివాల్. ఢిల్లీలో ఈమెలాంటి వారు– మెట్రిమోనియల్ డిటెక్టివ్స్ లేదా వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఐదారుగురు ఉన్నారు. ‘జీతం ఎంత, వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నాయా, అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా’ అనేది వీళ్లు కనిపెట్టి చె΄్పాలి.పెళ్లికి ముందు జాగ్రత్త‘పెళ్లికి ముందు సరిగ్గా కనుక్కుంటే పెళ్లి తర్వాత సరిగ్గా కనుక్కోలేదే అనే బాధ ఉండదు. ఈ మధ్య వచ్చిన అమెరికా సంబంధంలో వరుడు సంవత్సరానికి 70వేల డాలర్లు సంపాదిస్తున్నానని చె΄్పాడు. మా ఎంక్వయిరీలో పావు వంతు కూడ లేదని తేలింది. సంబంధం కేన్సిల్ చేశాం. మరో కేసులో కూతురు ప్రేమించిన కుర్రవాడి మీద నిఘా పెట్టి రిపోర్ట్ ఇవ్వమని కూతురి తల్లి ఫీజు చెల్లించింది. దానికి కారణం ఆమె పెళ్లి విఫలమైంది. కూతురిది కూడా కాకూడదనే. ప్రేమ పెళ్లికి సమ్మతమే అయినా కుర్రాణ్ణి అన్ని విధాలుగా తెలుసుకునే ‘ఎస్’ అనాలని ఆ తల్లి ప్రయత్నం. మేం దానికి సహకరించాం’ అందామె. మరికొందరైతే కుర్రాడు హోమో సెక్సువల్ అవునా కాదా తేల్చి చెప్పమని అడుగుతారట. ‘అబ్బాయి హోమో సెక్సువల్ అయ్యి పెళ్లి వద్దు మొర్రో అంటున్నా సంఘం కోసం తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇలాంటి ఎంక్వయిరీలూ వస్తున్నాయి’ అని తెలిపింది భావన. గతంలో జర్నలిస్టుగా పని చేసిన భావన ఆ వృత్తిలో సంతృప్తి దొరక్క ఇలా డిటెక్టివ్గా మారానని అంటోంది.ఆధునిక పరికరాలుప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది. కాబట్టి వారు పని చేయవచ్చు. అయితే అనైతిక పద్ధతుల్లో పరిశోధన చేయకూడదు. అదీగాకప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డిటెక్టివ్లు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. కెమెరాలు, జిపిఎస్ ట్రాకర్లు, సూక్ష్మమైన మైక్లు... ఇవన్నీ నిజమేమిటో అబద్ధమేమిటో చెబుతాయి. ‘వధువరుల వయసు, చదువు, ఆస్తిపాస్తులు, గతంలో విఫల ప్రేమలు, ఎంగేజ్మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన సంబంధాలు, రెండో పెళ్లి... ఈ వివరాల్లో వీలున్నంత వరకూ తెలియచేసి పెళ్లికి వెళ్లాలి. లేకపోతే వాటిలోని అబద్ధాలు పెళ్లయ్యాక మెడకు చుట్టుకుంటాయి’ అంటుంది భావన.పెళ్లికి సిద్ధమయ్యి...అన్నింటికి మించి ఈ స్థితికి వధువరుల ఆమోదయోగ్యమైన సంసిద్ధత లేకపోవడమే గొడవలకు ముఖ్యకారణం అంటారు మానసిక నిపుణులు. ‘పెళ్లి వ్యవస్థను విశ్వసించి దానిలో అవసరమైన కమింట్మెంట్, సహనం, అడ్జస్ట్మెంట్, నిజాయితీ... వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో పరిణితి వచ్చాకే పెళ్లికి ఎస్ అనాలి వధూవరులు. లేకుంటే పెళ్లయిన వెంటనే గొడవలు మొదలవుతాయి. డిటెక్టివ్లు వాస్తవాలు తెలియచేస్తారు. కాని పెళ్లి నిలబడేది ప్రేమ, నమ్మకాల వల్లే. వాటిని తమలో బేరీజు వేసుకుని పెళ్లికి సంసిద్ధం కావాలి’ అని తెలియచేస్తున్నారు వారు. లేకపోతే భావన వంటి వారికి పని పెరుగుతూనే ఉంటుంది. -
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్ని కలవాలి. ఇంటర్నల్గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
అమ్మ పెట్టె నల్ల చుక్కలు.. స్నానమే చేయలేదనుకుంటారు: అనన్య పాండే (ఫోటోలు)
-
టీడీపీ నేత కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ నేత గోరంట్ల రవికుమార్కు చెందిన శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ కళాశాల టెర్రస్పై ఉన్న షెడ్డు కప్పునకు ఉన్న ఫ్యాన్కు తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరికి వేలాడుతున్న భావనను మంగళవారం ఉదయం విద్యార్థినులు చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి భావనను కిందకు దింపడంతో అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని ఆమె కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలనూ పోషిస్తోంది. కాగా, కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసి కూడా గోరంట్ల రవికుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్ఆర్ సురే‹Ù, కేర్ టేకర్ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్కు బదులుగా డీన్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
డెలివరీ టైమ్లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్లు అందరూ సపోర్టివ్గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
నేచురల్గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?
నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరాఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్ ఉండాలి. పాజిటివ్గా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని డీల్ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ రావచ్చు.బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్ పెరగొచ్చు. అయితే కరెక్ట్ డయాగ్నసిస్, ట్రీట్మెంట్తో వీటిని మేనేజ్ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్ పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్ వ్యాధి రిస్క్ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్లో యూరిన్లో సుగర్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ యూరిన్లో సుగర్ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్ సుగర్ టెస్ట్ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్ కన్సల్టేషన్తో మేనేజ్ చేస్తారు.సుగర్ కంట్రోల్ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ వస్తాయి. రెగ్యులర్గా బిడ్డ ఎదుగుదలను చెక్ చేస్తే స్కాన్స్ని రిఫర్ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్ చేస్తారు. బీపీ, సుగర్ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మానెయ్యాలి. ఇన్ఫెక్షన్స్ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్ని తగ్గించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో.. గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా?
నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సివియర్ గ్యాస్ట్రైటిస్తో డాక్టర్ దగ్గరకి వెళితే Hiatus Hernia అని డయాగ్నోస్ చేశారు. నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దీనివల్ల ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువవుతాయా? మందులు వాడకూడదు అంటారు కదా.. మరి ప్రెగ్నెన్సీలో గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా? – పేరు, ఊరు రాయలేదు.Hiatus Hernia అనేది చాలా కామన్. మామూలుగా పొట్టకి, ఆహారనాళానికి మధ్య డయాఫ్రమ్ అనే రెస్పిరేటరీ కండరం.. జంక్షన్ని టైట్గా క్లోజ్ చేసి పెడుతుంది. ఈ గ్యాప్ వదులైనప్పుడు పొట్టలోని యాసిడ్స్ ఆహారనాళంలో పైకి వచ్చి గ్యాస్, ఎసిడిటీ, వాంతులను ప్రేరేపిస్తాయి. అధిక బరువు, ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్లో ఈ గ్యాప్ ఎక్కువై గ్యాస్ ప్రాబ్లమ్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది వీక్ కూడా కావచ్చు.ప్రెగ్నెన్సీలో యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఇప్పటి నుంచే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీని మేనేజ్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో మందులు వాడే అవసరం తగ్గించుకోవాలి. ఎసిడిటీని పెంచే ఆహారం అంటే ఆరేంజ్ జ్యూస్, టొమాటో సాస్, సోడా వంటివి అవాయిడ్ చేయాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, వెనిగర్, చాక్లెట్స్, కాఫీలు తగ్గించాలి. కొంచెం కొంచెం ఆహారాన్ని నెమ్మదిగా.. ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకుండా.. మూడు నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తల కింద ఎత్తు పెట్టుకుని పడుకోవాలి. రాత్రి భోజనం పెందరాళే ముగించాలి. స్కాన్ చేసి.. హెర్నియా పెద్దగా ఉందని కనుక చెబితే.. కొంతమందికి డాక్టర్లు సర్జరీని సూచిస్తారు. లాపరోస్కోప్ ద్వారా చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో గుండెలో మంట, ఎసిడిటీ ఎక్కువుంటే సురక్షితమైన కొన్ని సిరప్లు, జెల్స్, మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు.మొదటి మూడునెలల్లో వీటి అవసరం ఎక్కువుంటుంది. యాంటాసిడ్ జెల్స్ చాలావరకు రిలీఫ్నిస్తాయి. జీవనశైలి మార్పులతోనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. నెలలు నిండే కొద్ది ముఖ్యంగా చివరి మూడు నెలల్లో బిడ్డ బరువుతో ఈ ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీకి ఇబ్బంది కలగొచ్చు. అలాంటప్పుడు భోజన వేళలను సర్దుబాటు చేసుకోవడంతో పాటు డైటీషియన్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలిప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.అవి శరీరంలోకి ఇన్సర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్ను విడుదల చేస్తూ బ్లీడింగ్ని తగ్గిస్తుంది.ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్ను సూచిస్తారు. అవుట్ పేషంట్గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, హైదారాబాద్ -
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, హైదారాబాద్ -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్తోనే డ్రెస్సింగ్ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్ను సింగిల్ డోస్గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??
నాకు 35 ఏళ్లు. చాలా రోజులుగా లోయర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? ఎక్సర్సైజెస్తో మేనేజ్ చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి.. ఎలాంటివి చేయకూడదు? – వి. శుభదా, హైదరాబాద్లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. స్పైన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ ఉండి.. దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కదలికలతోనే స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తే కదలికలు తగ్గి ఇంకా పెయిన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.రెండు రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. స్పెషలిస్ట్ని సంప్రదించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మొబిలిటి పెరిగే వ్యాయామాలు చేయాలి. జాయింట్స్ బిగుసుకుపోకుండా చూసుకోవాలి. జాయింట్స్ స్టిఫ్గా అయిపోతే బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువవుతుంది. యాక్టివ్గా ఉంటే కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్ వంటివి చేయొచ్చు. Knee రోలింగ్, Knee to Chest, పెల్విక్ టిల్ట్స్ వంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి.ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో ప్రయత్నించాలి. కొంచెం నొప్పి తగ్గాక బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్ల కిందిభాగంలో రెండు పిల్లోస్ని, బోర్లా పడుకునే అలవాటున్నవారు పొట్టకింద రెండు పిల్లోస్, పక్కకు తిరిగి పడుకునేవారు రెండు మోకాళ్ల మధ్యలో ఒక పిల్లోను సపోర్ట్గా పెట్టుకోవాలి. అలాగే కూర్చుని ఉన్నప్పుడు నడుము వెనకభాగంలో పిల్లోని సపోర్ట్గా పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్ సూచనలు కనిపించగానే వెంటనే సంబంధిత డాక్టర్ని సంప్రదించాలి.మూత్ర విసర్జన కష్టమవుతున్నా, మలమూత్రాల మీద నియంత్రణ తప్పినా, మల ద్వారం దగ్గర నంబ్నెస్ ఉన్నా.. కాళ్లు నిస్సత్తువగా అనిపించినా.. తిమ్మిర్లున్నా, బాలెన్స్ తప్పుతున్నా, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉన్నా దగ్గర్లోని ఫిజీషియన్ని లేదా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. అవసరమైన టెస్ట్లు చేస్తారు. పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎలాంటి చిట్కా వైద్యాలు చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.ఇవి చదవండి: విడిపోతామని భయంగా ఉంది! అసలు కారణమేంటి? -
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి) -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్ను సేఫ్గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్ని ఆపరేషన్తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్ని సెర్వైకల్ ఇన్కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్ని టైట్గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్క్లేజ్కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి
పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్కుమార్ కెరీర్లో ల్యాండ్మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024 -
Sarkaaru Noukari Review: ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ
టైటిల్: సర్కారు నౌకరి నటీనటులు: ఆకాశ్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు నిర్మాత: కె రాఘవేంద్ర రావు దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: శాండిల్య నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: గంగనమోని శేఖర్ ఎడిటర్: రాఘవేంద్ర వర్మ విడుదల తేది: జనవరి 1, 2023 ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన తొలి సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించడంతో చిన్న సినిమా అయినా సరే సర్కారు నౌకరిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేశాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు(జనవరి 1, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. సర్కారు నౌకరి కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1996లో సాగుతుంది. గోపాల్(ఆకాష్ గోపరాజు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి సర్కారు కొలువు(ప్రభుత్వ ఉద్యోగం) సాధిస్తాడు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి హెల్త్ ప్రమోటర్గా వెళ్తాడు. పెద్దరోగం (ఎయిడ్స్)పై అవగాహన కల్పిస్తూ, కండోమ్స్ పంచడం అతని డ్యూటీ. సర్కారు నౌకరోడని సత్య(భావన)అతన్ని పెళ్లి చేసుకుంటుంది. గోపాల్ని కొల్లాపూర్ గ్రామస్తులు మొదట్లో చాలా బాగా గౌరవిస్తారు. మండల ఆఫీస్లో పనిచేసే సార్ భార్య అంటూ సత్యకు కూడా ఊరి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ గోపాల్ చేసే పని కండోమ్లు పంచడం అని తెలిశాక.. ఊరంతా అతని ఫ్యామిలీని అంటరాని వాళ్లుగా పరిగణిస్తారు. బుగ్గలోడు అంటూ గోపాల్ని హేళన చేస్తారు. దీంతో అతని భార్య ఉద్యోగం మానేసి.. వేరే ఊరికి వెళ్దామని కోరుతుంది. గోపాల్ మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోనని చెబుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి సత్య పుట్టింటికి వెళ్తుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్ వ్యాధి మరింత వ్యాపించడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవైపు వరుస అవమానాలు..మరోవైపు భార్య గొడవ..అయినా గోపాల్ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేదు? పెద్దరోగంపై అవగాహన కల్పించేందుకు గోపాల్ ఎం చేశాడు? ఊరి సర్పంచ్(తనికెళ్ల భరణి)ని ఎలా వాడుకున్నాడు? ఎయిడ్స్పై అవగాహన కల్పించే ఉద్యోగాన్నే గోపాల్ ఎందుకు ఎంచుకున్నాడు? గోపాల్ గతమేంటి? కొల్లాపూర్తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సర్కారు నౌకరి చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1996లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్. అప్పట్లో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం చాలా ఉండేది. సరైన అవగాహన లేక ప్రజలు ఎయిడ్స్ బారిన పడేవారు. కండోమ్ల వాడకం కూడా తెలిసేది కాదు. వ్యాధి ఎలా వస్తుందో కూడా చాలా మందికి తెలిసేదికాదు. అంటూవ్యాధి అంటూ ఎయిడ్స్ బారిన పడిన వారిని ఊరి నుంచి వెలేసేవారు. అలాంటి సంఘటనలు కొల్లాపూర్ గ్రామంలో కూడా జరిగాయట. వాటినే కథగా మలుచుకొని సర్కారు నౌకరి చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఓ మంచి సందేశాన్ని కామెడీ, భావోద్వేగాలు రెండింటిని జొప్పించి కమర్శియల్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కథను తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా సహజంగా కథనం సాగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రేక్షకుల మూడ్కి పూర్తి విరుద్ధమైన కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకులంతా యానిమల్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సర్కారు నౌకరిలో అలాంటి సన్నివేశాలేవి ఉండవు. కానీ గ్రామీణ నేటివిటీ, మన చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు తెరపై కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఫస్టాఫ్ అంతా చాలా కామెడీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల పెళ్లి, రొమాన్స్.. అప్పట్లో పూర్లో ఉండే పరిస్థితులు, జనాల ప్రవర్తన ఇవన్నీ కాస్త నవ్వులు పంచుతాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలా ఎమోషనల్గా సాగుతుంది. గంగ(మధులత)-శివ(మహదేవ్)ల మధ్య వచ్చే సన్నివేశాలు..పాట ఆకట్టుకుంటుంది. అలాగే శివ పాత్ర ముగింపు, హీరో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్ కూడా గుండెల్ని పిండేస్తుంది. అయితే కథనం చాలా సహజంగా, చాలా ఎమోషనల్గా సాగినా..ప్రేక్షకులను ఫీల్ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎయిడ్స్పై అవగాహన కల్సించడం కోసం హీరో చేసే ప్రయత్నాల్ని తెరపై బలంగా చూపించలేకపోయాడు.కొన్ని చోట్ల కథనం స్లోగా సాగుతూ ఆర్ట్ ఫిల్మ్స్ని గుర్తు చేస్తుంది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్య చిత్రాలను ఇష్టపడేవారికి, నైంటీస్ జనరేషన్ వాళ్లకి సర్కారు నౌకరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సింగర్ సునీత కొడుకు ఆకాశ్ తొలి సినిమా ఇది. అయినా చాలా చక్కగా నటించాడు.తన పాత్రకు తగ్గట్టుగా హవభావాలను పలికించాడు. ఎమోషనల్ సన్నివేశాలల్లో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అనుభవలేమి కనిపించినా..మున్ముందు మంచి నటుడిగా రాణించే అవకాశం ఉంది. గోపాల్ భార్య సత్యగా భావన తనదైన నటనతో ఆకట్టుకుంది. గోపాల్ స్నేహితుడు శివగా మహదేవ్, అతని మరదలు గంగగా మధు లత తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక కొల్లాపూర్ సర్పంచ్గా తనికెళ్ల భరణి తన మార్క్ హాస్యంతో కొన్ని చోట్ల నవ్వించాడు. బలగం సుధాకర్ రెడ్డి, సాహితి దాసరి, సమ్మెట గాంధీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. శాండిల్య పాటలు ఆకట్టుకుంటాయి.శేకర్ గంగనమోని కెమెరా వర్క్ బాగుంది. అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
చిన్నపుడు మా అక్క నన్ను బాగా కొట్టింది: విరాట్ కోహ్లి
When Virat Kohli Revealed His sister beat him badly: ‘‘చిన్నపుడు నాకొక అలవాటు ఉండేది. పెద్ద వాళ్లను కూడా ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో పిలిచేవాడిని. మా అక్కతో మాట్లాడుతున్నపుడు కూడా ‘నువ్వూ.. నువ్వూ’ అంటూ సంభోదించేవాడిని. అలా ఏకవచనంతో పిలవడం మా అక్కకు నచ్చేది కాదు. ఓరోజు తనకు బాగా కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా మాట్లాడతావా అంటూ నన్ను బాగా కొట్టింది. అప్పటి నుంచి పెద్ద వాళ్లందరినీ .. ‘మీరు’ అని మర్యాదగా సంభోదించడం మొదలుపెట్టాను’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రితో సంభాషణ సందర్భంగా గతంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కోహ్లి.. చిన్నపుడు తను అల్లరిపిల్లాడిలా ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. రూ. 50 నోటు చూడగానే చించి పడేసి.. ‘‘పెళ్లి వేడుకలకు వెళ్లిన సమయంలో చాలా మంది నోట్లు గాల్లోకి ఎగురవేసి డ్యాన్సులు చేయడం చూశాను. అలా అది నా మైండ్లో ఉండిపోయింది. ఓరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. సరుకులు తెమ్మని మా అమ్మ నాకు 50 రూపాయలు ఇచ్చింది. ఆ నోటు చూడగానే పట్టరాని ఆనందంలో మునిగిపోయాను. ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నానో తెలియకుండానే.. మెట్ల మీదకు వెళ్లి నోటును చించి.. ముక్కలు పైకి ఎగురవేసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కాసేపటికి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాను’’ అంటూ సరదా సంఘటన గురించి పంచుకున్నాడు. తన అల్లరి కారణంగా.. చాలా మంది తమ్ముళ్లలాగే తాను కూడా అక్క చేతిలో దెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో కాగా సరోజ్- ప్రేమ్ కోహ్లి దంపతులకు జన్మించిన విరాట్ కోహ్లికి అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. ఇక క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లి.. ఇటీవల వరల్డ్కప్-2023 సందర్భంగా 50వ వన్డే శతకం బాది.. సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. కోహ్లి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సెంచూరియన్లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఈ ఢిల్లీ బ్యాటర్ 38 పరుగులు చేశాడు. చదవండి: #KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా View this post on Instagram A post shared by @Virat Kohli (@virat_kohli_era__18) -
కొత్త ప్రపంచాన్ని సృష్టించారు
‘‘సర్కారు నౌకరి’ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ మూవీ ద్వారా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భావన హీరోయి¯Œ . ఆర్కే టెలీషోపై కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ మూవీ ట్రైలర్ని హైదరాబాద్లో రిలీజ్ చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్లను హీరోలుగా పరిచయం చేశాను.. వారంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ‘సర్కారు నౌకరి’ తో పరిచయమవుతున్న ఆకాష్ కూడా వారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఆకాష్ ΄ాడగలిగినా నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో హీరోగా పరిచయవుతున్నాడు’’ అన్నారు సునీత. ‘‘నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు గంగనమోని శేఖర్. ‘‘నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాష్. -
సర్కారు నౌకరికి డేట్ ఫిక్స్
ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆర్కే టెలీ షో పై దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘సర్కారు నౌకరి’ని కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఘనంగా విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సహనిర్మాత: పరుచూరి గోపాలకృష్ణా రావు. -
మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య!
Who Is Bhawna Kohli Dhingra, The Only Sister Of Virat Kohli: విరాట్ కోహ్లి.. ఈ పేరు వినగానే రికార్డులే గుర్తుకువస్తాయి. ఆధునిక ప్రపంచ క్రికెట్లో మకుటం లేని మహరాజుగా కొనసాగుతున్న రన్మెషీన్ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. బ్యాట్ చేతబట్టి రికార్డుల అంతు తేల్చేందుకు సిద్ధమైన వేటగాడిలా రంగంలోకి దూకిన ఆటగాడు స్ఫురణకు వస్తాడు. మరి.. ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో పెరిగిన ఆ కుర్రాడు టీమిండియా రికార్డుల రారాజుగా ఎదిగేందుకు దోహదం చేసిన అంశాలేమిటి అంటే?.. ఆట పట్ల అంకితభావం, అసాధారణ ప్రతిభాపాటవాలు.. 35 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించే ఫిట్నెస్.. అభిమానుల నుంచి వచ్చే సమాధానాలు ఇవే. అవును ఇవన్నీ నిజమే.. అయితే, అన్నిటికి మించి చిన్ననాటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా కోహ్లిని ప్రోత్సహించిన కుటుంబానికే ఈ జాబితాలో పెద్దపీట వేయాల్సి ఉంటుంది. కోహ్లి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. భావనా, వికాస్, విరాట్. అందరిలో భావనా పెద్దది.. విరాట్ చిన్నోడు. PC: bhawna dhingra instagram తమ్ముడితో పాటు క్రికెట్ ఇద్దరు తమ్ముళ్లపై ఆ అక్కకు ప్రేమ ఎక్కువే. అయితే, చిన్నోడు కాబట్టి విరాట్ అంటే మరింత ఇష్టం. మూడేళ్లకే క్రికెట్ బ్యాట్ చేతబట్టి తండ్రి బౌలింగ్లో ముద్దుముద్దుగా విరాట్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే కుటుంబమంతా సంతోషపడిపోయేది. భావనా అయితే మరీనూ!! విరాట్తో కలిసి క్రికెట్ ఆడుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం. కొడుకును క్రికెటర్గా చూడాలనుకున్న తల్లిదండ్రుల నిర్ణయం కోహ్లి కెరీర్ను మలుపుతిప్పగా.. తోబుట్టువుగా తానేం చేయాలో అన్నీ చేసింది భావనా. తమ్ముడికి ఎల్లవేళ్లలా.. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత నైతికంగా మద్దతుగా నిలిచింది. కోహ్లి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదుగుతున్న క్రమంలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినప్పటికీ.. తల్లికి మద్దతుగా నిలుస్తూ తమ్ముడి గురించి అన్ని విషయాల్లో శ్రద్ధ వహించేది. తన తమ్ముడు రికార్డుల రారాజుగా ఎదిగినా తనకు మాత్రం ఇప్పటికీ చిన్నపిల్లాడే అని మురిసిపోతూ ఉంటుంది భావనా. కోహ్లిల ఏకైక ఆడపడుచు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె.. తల్లిదండ్రులతో తమ చిన్ననాటి ఫొటోలు పంచుకుంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తాము మనుషులుగా దూరంగా ఉంటున్నా తమ మనసులు మాత్రం దగ్గరే అంటూ సందర్భాన్ని బట్టి ఇద్దరు తమ్ముళ్ల పట్ల ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక వన్డే వరల్డ్కప్-2023 తర్వాత కూడా విరాట్ కోహ్లిని అనునయిస్తూ.. గెలిచినా ఓడినా అభిమానులంతా టీమిండియా వెంటే అంటే సందేశం ఇచ్చింది భావనా. ఈ నేపథ్యంలో వార్తల్లో నిలిచిన భావనా గురించి నెట్టింట ఆరా తీసే వారి సంఖ్య ఎక్కువైంది. వ్యాపారవేత్తతో వివాహం చిన్ననాటి నుంచి క్రికెట్పై మక్కువ ఉన్న భావనా ఢిల్లీలోని హన్స్రాజ్ మోడల్ స్కూళ్లో పాఠశాల విద్య పూర్తి చేసుకుంది. దౌలత్ రామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇక కోహ్లిల ఆడపడుచు అయిన భావనా వ్యాపారవేత్త సంజయ్ ధింగ్రాను పెళ్లాడి.. భావనా కోహ్లి ధింగ్రాగా మారింది. ప్రస్తుతం ఆమె ఎంటర్ప్రెన్యూర్గానూ రాణిస్తోంది. విరాట్ కోహ్లి ఫ్యాషన్ లేబుల్ వన్8సెలక్ట్తో భావనా కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. కేవలం విరాట్తోనే కాకుండా అతడి భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతోనూ ఆమెకు మంచి అనుబంధం ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. అన్నట్లు భావనా- సంజయ్ దంపతులకు మెహక్ , ఆయుష్ సంతానం. మేనమామ విరాట్ కోహ్లి రిసెప్షన్ సందర్భంగా వీళ్లిద్దరు అప్పట్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. చదవండి: వరల్డ్కప్-2023 తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. అభిమానులు ఖుషీ! -
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్లో.. భవిష్యత్లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
10 ఏళ్ల తర్వాత కోలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్
ఇంతకుముందు కోలీవుడ్లో చిత్తిరం పేసుదడి, దీపావళి చిత్రాల్లో కథానాయికగా నటించిన నటి భావన. మలయాళంలో హీరోయిన్గా రాణించిన ఈ మాలీవుడ్ భామ ఆ మధ్య తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటన కారణంగా నటనకు దూరం అయ్యారు. ఇటీవలే తిరిగి నటించడం ప్రారంభించిన భావన దాదాపు పదేళ్ల తర్వాత కోలీవుడ్కు రీఎంట్రీ ఇస్తున్నారు. నటుడు గణేశ్ వెంకట్రామన్ నెక్స్ట్ సినిమాలో భాగం కానున్నారు. గణేశ్ 'అభియుమ్ నానుమ్' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ మధ్య బిగ్బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇకపోతే తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో విలన్గా కీలకపాత్రను పోషించారు. వారిసు చిత్రం తరువాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పిన గణేశ్ తాజాగా నటి భావనతో కలిసి నటిస్తున్న చిత్రం గురించి మీడియాకు తెలిపారు. దీనికి జయంతి దేవ్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథ కొడైకెనాల్, చెన్నై నేపథ్యంలో సాగుతుందన్నారు. దీనికి గౌతమ్ జార్జ్ చాయాగ్రహణం అందిస్తున్నారని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: పూజాకు బ్యాడ్టైమ్.. ఫ్లాపుల మీద ఫ్లాపులు.. స్పందించిన హీరోయిన్ -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్ని, షేప్ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -
హీరోయిన్ లైంగిక దాడి కేసు, దిలీప్ భార్యను విచారించిన పోలీసులు
Kerala Police Investigate Accused Dileep Wife Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్ లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్టార్ నటుడు దిలీప్ కుమార్ భార్య కావ్య మాధవన్ను తాజాగా కేరళ క్రైం పోలీసులు విచారించారు. ఈ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఇటీవల బయటకు వచ్చిన కొన్ని ఆడియో క్లిప్స్తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్ బావ మరిది సూరజ్, శరత్లకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్లు బయటకు వచ్చాయి చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ దీంతో ఈ కేసులో దిలీప్ భార్య కావ్య మాధవన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఆలువాలోని తన నివాసంలో దాదాపు 4 గంటల పాటు ఆమెను విచారించారు. అయితే ఈ విచారణంలో కావ్య పోలీసులకు సహకరించలేదని తెలిసింది. పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆమె సంబంధం లేని సమాధానాలు ఇచ్చిందని, మరికొన్నింటికి గుర్తులేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే గతంలో కావ్యకు పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేయగా తాను చెన్నైలో ఉన్నందున విచారణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. చదవండి: నాన్న బయోపిక్లో నేను నటించలేను: మహేశ్ బాబు ఈ క్రమంలో ఇటీవల ఆమెకు మరోసారి సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారించగా తన నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్పై విడుదల కాగా... అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదంటారా?
►నాకిప్పుడు ఎనిదవ నెల. బిడ్డ ఎదురు కాళ్లతో ఉందని స్కానింగ్లో తేలింది. దీనివల్ల నాకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదంటారా? – నిరుపమ, కదిరి చాలా మంది గర్భిణీల్లో ఎదురు కాళ్లతో బిడ్డ ఉండడం చూస్తాం. అయితే తొమ్మిదవ నెలలో అంటే 36– 37వ వారానికీ బిడ్డ అదే పొజిషన్లో ఉంటే అప్పుడు చర్చించాలి. బిడ్డ కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు స్కానింగ్లో పొజిషన్ మారుతుంది. ప్రసవమప్పుడు అంటే తొమ్మిదవ నెల నిండినప్పుడు కూడా బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే అప్పుడు ప్రసవం కష్టమవుతుంది. అలా 36–37వ వారంలో కూడా బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే మీ డాక్టర్ చెక్ చేసి కొన్ని పరీక్షలు చేసి, ECV (ఎక్స్టర్నల్ సెఫాలిక్ వెర్షన్) అనే ప్రక్రియ ద్వారా బిడ్డ తల కిందకు వచ్చేటట్టు చేయగలుగుతారు. అలా చేయలేని పక్షంలో సిజేరియన్ చేయడమే మేలు. కొంత మంది గర్భిణీల్లో 36– 37వ వారం వచ్చేసరికి బిడ్డ తనంతట తానే హెడ్ పొజిషన్కు మారుతుంది. అప్పుడు నార్మల్ డెలివరీ చేయొచ్చు. వందలో ముగ్గురికి మాత్రమే 36–37వ వారానికి కూడా బిడ్డ ఎదురు కాళ్లతోనే ఉండిపోయి హెడ్ పొజిషన్కు రాదు. బిడ్డ ఎదురుకాళ్లతో ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్లెసెంటా కిందకు ఉన్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, కవలలు ఉన్నప్పుడు, తొలి చూలులో గర్భసంచిలో ఓ అడ్డుగోడలాంటిది ఏర్పడినప్పుడు బిడ్డ ఎదురు కాళ్లతో ఉండే స్థితి చూస్తాం. బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించడం వల్ల ఇటు తల్లికి, అటు బిడ్డకూ రిస్కే. ప్రసవమప్పుడు బిడ్డకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, తల బయటకు రావడంలో సమస్య ఎదురవడం, నొప్పులతో ఎక్కువ సేపు కష్టపడ్డం, అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి రావడం జరుగుతాయి. అందుకే తొమ్మిదవ నెల చివరిలో కూడా బిడ్డ ఎదురు కాళ్లతోనే ఉంటే సిజేరియన్ గురించి డాక్టర్.. పేషెంట్తో చర్చిస్తారు. ►నాకిప్పుడు ఎనిమిదవ నెల. ఒళ్లంతా దురదలు. మందులు వాడినా తగ్గడం లేదు. ఇది పొట్టలో బిడ్డ మీదేమైనా ప్రభావం చూపుతుందా? – శ్రీలక్ష్మి పెండ్యాల, వరంగల్ గర్భంతో ఉన్నప్పుడు చాలామందికి ఒంటి మీద దురద వస్తుంది. ఇది నెలలు నిండే కొద్దీ చర్మం సాగడం వల్ల, వేడి వల్ల కూడా వస్తుంది. కొన్ని రకాల మాయిశ్చరైజర్ క్రీమ్స్తో ఇది తగ్గుతుంది. కానీ వందలో ఒకరికి అబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు ఎన్ని క్రీములు రాసినా దురద తగ్గదు. గర్భంతో ఉన్నప్పుడు కాలేయం ప్రభావితమై శరీరంలోకి బైల్ యాసిడ్స్ విడుదలవుతాయి. అందువల్ల దురద వస్తుంది. ఇది ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో దీనికి కారణం తెలియదు. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవటం, జన్యు కారణాలూ కావచ్చు. ఇది తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. చాలామందికి 28 వారాలు (ఏడవ నెల)లో వస్తుంది. అరి చేతులు, అరి కాళ్లు, పొట్ట మీద ఎక్కువ దురద వస్తుంది. దద్దుర్లు ఉండవు. రాత్రివేళ ఎక్కువవుతుంది. దీనితో కొంతమందికి జాండీస్ రావచ్చు. ఆకలి తగ్గిపోతుంది. నీరసంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టలో బిడ్డకు కొంచెం రిస్క్ తలెత్తొచ్చు. బైల్ యాసిడ్స్ ఎక్కువ అవడంతో పొట్టలో బిడ్డ మల విసర్జన చేయడం, నెలలు నిండకుండా ప్రసవమవడం, ఊపిరాడకపోవడం వంటివి సంభవిస్తాయి. అందుకే దురద తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, బైల్ యాసిడ్స్ టెస్ట్ చేసి.. సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన మందులు ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను సంప్రదించి తగిన మందులు వాడితే దురద తగ్గుతుంది. ►నాకిప్పుడు అయిదవ నెల. ఆస్తమా ఉంది. ఇన్హేలర్స్ వాడాల్సి వస్తోంది. దీని వల్ల నాకు కానీ, నా బిడ్డకు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటుందా? – టి. అనూష, నిర్మల్ ఆస్తమా ఉన్నవాళ్లకు ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏ విధమయిన ఇబ్బందీ ఉండదు. మూడింట ఒకింత మందికి మాత్రం ఆస్తమా ఎక్కవై ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉండే ఎసిడిటీ వల్ల ఆస్తమా ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు. ఆస్తమా ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో ఆపకూడదు. మీ డాక్టర్ పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే మందులు, ఇన్హేలర్స్ కొనసాగించాలి. ఆస్తమా నియంత్రణలో ఉంటే మీకు, బేబీకి ఏ సమస్యా రాదు. అకస్మాత్తుగా మందులు ఆపేస్తే మీకు ఆస్తమా అటాక్ కావచ్చు. బిడ్డ కూడా తక్కువ బరువుతో అంటే లో బర్త్ వెయిట్తో పుడుతుంది. అందుకే మందులు ఆపకుండా కొనసాగించాలి డాక్టర్ పర్యవేక్షణలో. మందులతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పోషకాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎలర్జీ వచ్చే ఆహారం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుకి వెంటనే చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్టెరాయిడ్ ఇన్హేలర్ కూడా వాడాలి. ఆస్తమా ఉన్నా నార్మల్ డెలివరీకి ప్రయత్నించొచ్చు. ఇన్హేలర్ తీసుకుంటున్నా బిడ్డకు తల్లి పాలు పట్టొచ్చు. మీకు రాత్రి పూట ఆయాసం ఎక్కువ అయినా, ఇన్హేలర్ ఎక్కువసార్లు వాడవలసి వచ్చినా, ఊపిరాడకపోవడం వంటి సమస్య ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్ని సంప్రదించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఏడో నెల ప్రెగ్నెన్సీ.. విపరీతమైన నొప్పి.. ఏం చేయాలి డాక్టర్?
Gynecology Problems Solutions And Tips In Telugu: ప్రెగ్నెన్సీలో వ్యాయామాలు చేసినందువల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? – యామిని, వైజాగ్ ఆరోగ్యవంతమైన తల్లి–బిడ్డకి వ్యాయామాలు ప్రెగ్నెన్సీ పీరియడ్లో చాలా అవసరం. వారంలో కనీసం 150 నిమిషాలు ఒక మోస్తరు వ్యాయామాలు చేసినందువల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ వ్యాయామాలు చేయకపోతే, ప్రెగ్నెన్సీలో కొంచెం నెమ్మదిగా, చిన్నచిన్న వ్యాయామాలతో మొదలుపెట్టాలి. మీకు యోగా, ఆసనాలు, నడవడం వంటివి ముందే అలవాటు ఉంటే అవి కంటిన్యూ చేయొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేసినందువల్ల.. 1) ప్రెగ్నెన్సీలో కరెక్ట్ వెయిట్ గెయిన్ ఉంటుంది. 2) సుగర్, రక్తపోటు(బీపీ) వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 3) నిద్ర బాగా పడుతుంది. 4) ఉల్లాసంగా యాక్టివ్గా ఉండొచ్చు. ∙మీరు వ్యాయామాలు/యోగా వంటివి ఆన్లైన్లో మంచి ట్రైనర్ దగ్గర క్లాసులు అటెండ్ అవ్వచ్చు. దానిలో కనీసం వారానికి రెండు సార్లు మజిల్ స్ట్రెంగ్తెనింగ్ యాక్టివిటీస్ (కండరాలు బలపరుచుకునేందుకు) చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ∙ప్రతి చిన్న వ్యాయామం, బాడీ మూమెంట్ మీకు లాభం చేస్తుంది. ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేసినందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ∙మీ శరీరానికి సరిపడే వ్యాయామాలను అడాప్ట్ చేసుకోవాలి. ఇంట్లో మెట్లు ఎక్కి దిగడంతో పాటు యోగా చేసుకోవచ్చు. ∙బయటకు వెళ్లే అవకాశం ఉంటే.. లాంగ్ వాకింగ్ చేయడం, సైక్లింగ్కి వెళ్లడం మంచిదే. మీకు ఇష్టమయితే స్విమ్మింగ్, డాన్సింగ్ వంటివి కూడా చేయొచ్చు. ∙కొన్ని ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉన్నవారికి మీ డాక్టర్ 3వ నెలలోనే ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చో చెప్తారు. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ట్రైనర్ను సంప్రదిస్తే, ఎలాంటి వ్యాయామాలు సురక్షితమో వివరిస్తారు. మెనోపాజ్ అంటే ఏంటి? నాకు ఇప్పుడు యాభై ఏళ్లు. గత 6 నెలలుగా నెలసరి రావడం లేదు. చాలా చిరాకుగా ఉంటోంది. పరిష్కారం చెప్పగలరు? – లలిత, ఖమ్మం మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవటం. చాలా మందికి 45–55 సంవత్సరాల మధ్యలో నెలసరి ఆగిపోతుంది. దీనికి కారణం అండాలు విడుదల కాకపోవడమే. ఈ పరిస్థితిని కొంతమందిలో నలభై ఏళ్లలోపే చూస్తాం. నెలసరి ఆగినప్పుడు, శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చాలామందికి ఒంట్లో వేడిగా ఉండటం, చెమటలు ఎక్కువగా పట్టడం, యోని దగ్గర పొడిబారి ఉండటం, మూడ్ డిస్టర్బ్ కావడం, మజిల్స్, జాయింట్స్ పెయిన్ వస్తాయి. నెలసరి ఆగినప్పుడు ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ టెస్ట్తో మెనోపాజ్ వచ్చిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. ఈ టైమ్లో ఆహారంలో ఎక్కువ శాతం పళ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, సోయాబీన్స్, పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. రొటీన్ పాప్స్మియర్ టెస్ట్, థైరాయిడ్, సీబీపీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ మీకు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా ఉంటే.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)ని డాక్టర్ సూచిస్తారు. తక్కువ మోతాదులో ఈస్ట్రోజెన్ జెల్స్తో యోని డ్రైనెస్ తగ్గుతుంది. ఇబ్బందిగా ఉంటే మీ డాక్టర్ని సంప్రదించాలి. నాకు ఏడవ నెల ప్రెగ్నెన్సీ. నాకు విపరీతమైన నడుము, కాళ్ల నొప్పులు ఉన్నాయి. డాక్టర్ ఏ మందులు ఇచ్చినా, నొప్పి మాత్రం తగ్గడంలేదు. ఏం చేయాలి? – స్వరూప, మెహిదీపట్నం నడుము భాగం మూడు జాయింట్స్తో ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ ఆ బరువు ఈ జాయింట్స్ మీద పడి, బాగా స్ట్రెస్ అవుతుంది. ఇది ఐదుగురిలో ఒకరికి వస్తుంది. నడుము నొప్పి నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా రావచ్చు. దీనికి నిలబడే, కూర్చునే భంగిమ ప్రధానమైన కారణం. నిజానికి ఈ నొప్పి వల్ల బేబీకి ఏ ఇబ్బంది ఉండదు. కొన్ని చిన్న చిన్న మార్పులతో మీరు ఈ నొప్పి తగ్గించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం వల్ల, ప్రెగ్నెన్సీలో బాడీ అడాప్ట్ అవుతుంది. ∙నిటారుగా నిలబడాలి, వంగి నడవకూడదు. ∙ 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు. మధ్యలో లేచి నడవాలి. ∙రెండు కాళ్ల మీద సరిగ్గా బరువు పెట్టి నడవాలి. ∙తలగడని కాళ్ల మధ్యలో, నడుము వెనక పెట్టుకొని పడుకోవాలి. ∙ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్ వాడవచ్చు. ∙వంగి బరువులు ఎత్తకూడదు. ∙ఎక్కువసార్లు మెట్లు ఎక్కి దిగకూడదు. ∙పేరాసిటమల్ లాంటి తక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. లైఫ్స్టయిల్ చేంజెస్ చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి నడుము నొప్పి ఉన్నా నార్మల్ డెలివరీ చేయొచ్చు. అందుకు లేబర్ వార్డ్లో కొన్ని మార్పులు చేస్తాము. ఎక్కువసేపు బెడ్ మీద పడుకోకుండా, కొంచెం సపోర్ట్తో నడిపిస్తాము. ఈ నొప్పి డెలివరీ తర్వాత చాలామందికి తగ్గిపోతుంది. పదిమందిలో ఒకరికి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ ఫిజియోథెరపీతో నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ నొప్పి మళ్లీ తరువాత ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. అందుకే సరైన బరువుతో నెక్ట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కాన్పు తర్వాత ట్రైనర్ ద్వారా పొట్ట, నడుము భాగంలోని మజిల్ టైటెనింగ్ ఎక్స్సర్సైజ్ చేస్తే మళ్లీ ఈ నొప్పి వచ్చే అవకాశాలు చాలా అరుదు. పోషకాహారం తీసుకోవాలి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్లో కూడా ఏ పనిమీదా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – పల్లవి, మచిలీపట్నం మీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందికి నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి. పీఎంఎస్కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి. చదవండి: (వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు...) ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది. అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నా వయసు 67 సంవత్సరాలు. పదిహేను రోజులుగా నాకు మళ్లీ నెలసరి కనిపిస్తోంది. దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను హాస్పిటల్కి వెళ్లి, డాక్టర్కు చూపించుకోవలసి ఉంటుందా? – శ్యామల, భీమవరం నెలసరి నిలిచిపోయిన తర్వాత మళ్లీ స్పాటింగ్, బ్లీడింగ్ కనిపించడం ప్రమాదకరం. మీరు వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. దీనిని ‘పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. నెలసరి ఆగిపోయిన తర్వాత యోని లోపలిపొర పల్చగా మారడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. చాలా అరుదుగా పదిమందిలో ఒకరికి క్యాన్సర్ మార్పులు చోటు చేసుకోవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, పాప్స్మియర్, బయాప్సీ వంటి అవసరమైన పరీక్షలు చేసి, సమస్యకు గల కారణాన్ని కనిపెడతారు. ఈ పరీక్షలన్నీ ఔట్పేషెంట్గానే చేయించుకోవచ్చు. చాలాసందర్భాల్లో ‘ఈస్ట్రోజన్ వజైనల్ క్రీమ్’లాంటివి సూచిస్తారు. అంతకుమించి చికిత్స అవసరం ఉండదు. అరుదుగా మాత్రమే, క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు ఉంటే, పరిస్థితిని బట్టి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. డా. భావన కాసు గైనకాలజిస్ట్ & అబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు : 5ఏళ్ల తర్వాత స్పందించిన హీరోయిన్
Actress Bhavana Menon Opens Up On Assalut Case After 5 Years: ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్స్టార్ దిలీప్ కుమార్పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ భావన స్పందించింది. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్టును షేర్ చేసింది. 'బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానా అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. కాగా హీరోయిన్ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, నిప్పు వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bhavana Menon 🧚🏻♀️ (@bhavzmenon) -
ఒక చేత్తో స్కూటీ.. మరో చేత్తో ఆమెను అసభ్యంగా
ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా సరే అమ్మాయిలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే సంఘటనలు దేశంలో అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. మహిళలకు ధైర్యమిచ్చే ఘటన ఇటీవల గౌహతిలో జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంటున్న భావనా కశ్యప్ పని పూర్తిచేసుకొని రుక్మణి నగర్లో ఉంటున్న తన ఇంటికి బయల్దేరింది. అదేదో చీకటి పడ్డాక కాదు మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల సమయం. రోడ్ సైడ్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఆమె వెనకాల ఓ స్కూటీ వచ్చి ఆగింది. ‘సినాకి పథ్’కి ఎలా వెళ్లాలి? అడిగాడు ఆ స్కూటీ వ్యక్తి. ఆ స్థలం గురించి తనకు తెలియదని మరొకరిని అడిగి తెలుసుకోమని, ఆమె మళ్లీ నడక మొదలుపెట్టింది. అతను మాత్రం స్కూటీని అతి నెమ్మదిగా నడుపుతూ ఆమెనే అనుసరించడం మొదలుపెట్టాడు. మరొకసారి అతనికి చెప్పింది ఇంకెవరినైనా ఆ అడ్రస్ గురించి అడగమని. కానీ, అతను అదేమీ పట్టించుకోలేదు. మురికి మనిషి అతను ఆమె వెనకాల స్కూటీని నడుపుతూ ఉన్నాడు. భావన తన నడకలోని వేగం పెంచింది. అంతటితో ఊరుకోకుండా ఒక చేత్తో స్కూటీ నడుపుతూ, మరో చేత్తో ఆమెను అసభ్యంగా తాకి, వెళుతున్నాడు. ‘ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు. పిచ్చి కోపం వచ్చేసింది. అంత కోపంలోనూ నా రెండవ ఆలోచనను విడిచిపెట్టలేదు. నా బలమంతా ఉపయోగించి పరిగెట్టి, అతని స్కూటీని పట్టుకున్నాను. వెనుక టైర్ను ఎత్తి, అంతే బలంతో పక్కనే ఉన్న మురికి కాలువలోకి తోసేసాను. అతను కూడా ఆ కాలువలో పడేవాడే. కానీ, మిస్సయింది’ అని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కలిగిన బాధ తీవ్రతను పంచుకుంది. నిందితుడు రాజశేఖర్ తగిన శాస్తి అతను తప్పించుకునే వీలు తను కల్పించినట్లయితే మరికొందరి మహిళలను టార్గెట్ చేసేవాడు. ఇదేవిధంగా బాధించేవాడు. భావన అరుపులు, స్కూటీని డ్రైనేజీలోకి నెట్టేయడం చూసిన చుట్టుపక్కల వాళ్లు అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి భయపడి కాలువ నుండి స్కూటీని బయటకు తీయడానికి సహాయం చేయమని అక్కడ చేరినవారిని ప్రాధేయపడ్డారు. కానీ, అందరూ ఛీత్కరించుకున్నారు. ద్విచక్రవాహనం మీద వెళుతూ భావనను వేధించిన ఆ వ్యక్తి పేరు మధుసనా రాజ్కుమార్. అస్సామ్లోని పంజాబరిలో ఉంటున్నాడు. అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భావనా కశ్యప్ ఈ వివరాలను రాస్తూ ‘మహిళలు వీధుల్లో ఒంటరిగా తిరగరాదని, రక్షణ అవసరమని సమాజంలో పాతుకుపోయిన భావజాలం ఎంత మాత్రం సరైనది కాదు. ఈ మగవారి మానసిక అనారోగ్య జాడ్యాన్ని వదిలించే బాధ్యత స్త్రీయే తీసుకోవాలి. ఒంటరిగా ఉన్న మహిళ బలహీనంగా ఉండాల్సిన పనిలేదు. రక్షణా అవసరం లేదు’ అని చేసిన సోషల్మీడియా పోస్ట్కు ప్రశంసలు అందుతున్నాయి. -
ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి?
‘‘మా తమ్ముడికి అన్న లేడు. అక్కను మాత్రమే ఉన్నాను. తమ్ముడికంటే ముందు పుట్టిన కారణంగా, వాడికంటే ముందే చదువు పూర్తి చేసి ఉన్న కారణంగా నేను తమ్ముడికి చాలా విషయాల్లో మార్గదర్శనం చేయగలిగాను. వాడి అప్లికేషన్ నింపినప్పుడు నేను ఆడపిల్లనే కదా! వాడి పెళ్లిలో పెద్దన్న పాత్ర నేను పోషిస్తే తప్పేంటి’’ అని ప్రశ్నించిందో అమ్మాయి. ‘‘మా తమ్ముడికి అక్కనైనా, అన్ననైనా నేనే’’ అని స్పష్టం చేసింది. ఆమె వాదన పెళ్లి నిర్ణయంలో కానీ, పెళ్లి నిర్వహణలో కానీ పెత్తనం చేయడం కోసం కాదు. పురాతన పద్ధతుల కోసం పాకులాడడం ఎంత వరకు సమంజసం అని మాత్రమే. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు ఆమోదించారు. తమ్ముడు స్వాగతించాడు. తమ్ముడి అత్తింటి వారు అంగీకరించారు. ఇంకేం కావాలి? పెళ్లిలో వరుడి అన్న చేతుల మీదుగా నిర్వహించాల్సిన ‘గుర్హతి’ ప్రక్రియ వరుడి అక్క చేతుల మీదుగా జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఇలాంటి మార్పుకు నాంది పలికిన తొలి పెళ్లి ఇది. మగవాళ్లే ఎందుకు? బీహార్ పెళ్లిళ్లలో గుర్హతి అనే సంప్రదాయ విధానం ఒకటి ఉంది. వధూవరులు పెళ్లి మండపంలోకి వచ్చిన తర్వాత అత్తింటివారు వధువుకి చీరలు, నగలు బహుమతిగా ఇస్తారు. ఈ బాధ్యతను వరుడి అన్న చేతి మీదుగా నిర్వర్తిస్తారు. వధువుకి భద్రత కల్పించే బాధ్యత ఇక నుంచి తమదేనని భరోసానిస్తారు. వరుడికి అన్న లేకపోతే వరుసకి అన్న అయ్యే వ్యక్తి ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. ఈ పనిని మగవాళ్లే ఎందుకు చేయాలని, తానెందుకు చేయకూడదని ప్రశ్నించింది మీమాంస శేఖర్ అనే యువతి. తమ్ముడి పెళ్లిలో వధువుకి అత్తింటి తరఫున ఇవ్వాల్సిన బహుమతులను తన చేతుల మీదుగా అందించింది. ఈ క్రతువును దగ్గరుండి జరిపించడానికి పురోహితుడు మాత్రం కొంచెం సంశయించాడు. మీమాంస సంధించిన ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేకపోవడంతో తలూపాల్సి వచ్చింది. ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్షులు పెళ్లికి హాజరైన అతిథులందరూ. వీరిలో సంప్రదాయవాదులు నొసలు చిట్లించారు. అభ్యుదయ వాదులు హర్షం వ్యక్తం చేశారు. వరుడి తల్లి భావన శేఖర్ మాత్రం ‘‘ఈ తరం ఆడపిల్లలకు మగవాళ్లు రక్షణ కల్పించడం నిజంగా అవసరమా’’ అని ప్రశ్నించారు. (చదవండి: గుడ్ టచ్ బ్యాడ్ టచ్) కొత్త ఆచారం ‘‘కాలం మారింది. జీవనశైలి మారింది. ఆచార వ్యవహారాలను గుడ్డిగా ఆనుసరించకుండా ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆడవాళ్లు గడపదాటడానికి ఆంక్షలు ఉన్న రోజుల్లో రూపుదిద్దుకున్న ఆచారాలను ఇంకా కొనసాగించడం ఎందుకు? నేను టీచర్గా పాఠ్యపుస్తకాల్లో ఉన్న జ్ఞానంతోపాటు సామాజిక చైతన్యాన్ని కూడా విద్యార్థులకు అందించాను. పన్నెండేళ్లుగా రచయితగా నా ఆలోచనలకు అక్షర రూపమిచ్చాను. ఈ రోజు నా కొడుకు పెళ్లిలో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టాను’’ అన్నారు మీమాంస తల్లి భావన. ఆచారం అనాదిగా వస్తుంటుంది. కొత్తగానూ రూపుదిద్దుకుంటుంది. ఏ ఆచారమైనా దానికి ప్రాసంగికత ఉన్నంత కాలం మనుగడలో ఉంటుంది. అవసరం లేని వస్తువు అటకెక్కినట్లుగానే అవసరం లేని ఆచారం కూడా రూపు మార్చుకోవాలి. (చదవండి: ఆమె ఒక నడిచే గ్రంథాలయం) In Bihari weddings, "Gurhathi" is done by groom's elder brother, where he presents the gifts to bride (bhabhi). My parents decided to break the patriarchal ritual & made me perform it at my younger brother's wedding. Read my mom's post to know how it happened 👇@thebetterindia pic.twitter.com/ypDaN9dOD1 — Mimansa Shekhar (@mimansashekhar) December 23, 2020 -
భలే భజరంగీ
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘భజరంగీ 2’. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భావన కథానాయికగా నటించారు. జయన్న ఫిలిమ్స్ బ్యానర్పై జయన్న, భోగేంద్ర నిర్మించారు. శివరాజ్ కుమార్ పుట్టినరోజు (జూలై 12) సందర్భంగా ఆదివారం ‘భజరంగీ–2’ టీజర్ విడుదల చేశారు. 2013లో ఘనవిజయం సాధించిన ‘భజరంగీ’ చిత్రానికి సీక్వెల్గా ‘భజరంగీ–2’ తెరకెక్కింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ స్పందన చూసి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక–నిర్మాతలు. టీజర్కు వచ్చిన స్పందన గురుంచి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన స్పందనకి అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
అక్షర సందేశం
శివాజీ రాజా, జాకీ, గుండు సుదర్శన్, సీవీఎల్ నరసింహారావు, భావన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్షరం’. జాకీ తోట దర్శకత్వంలో నటుడు లోహిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా భీమినేని ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి పతాకంపై ఈ నెల 26న విడుదలవుతోంది. లోహిత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందరికీ అన్నీ ఉచితంగా ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాలను, మోయలేని బరువులు పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే చిత్రమిది. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే చిత్రం కూడా. నేడు మనం చదువుకోవడం లేదు.. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించింది’’ అన్నారు. -
భార్య ఫిర్యాదు: ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
-
భార్య ఫిర్యాదు: ట్రైనీ ఐపీఎస్పై వేటు
సాక్షి, హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ శిక్షణ నుంచి సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డి తనను మోసం చేశాడంటూ భావన బిరుదల గతంలో హోంశాఖతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో పోలీసులు మహేశ్వరరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్తో భావనకు పరిచయం... ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. ఏడాదిన్నర క్రితం మహేశ్వరరెడ్డి, భావన కీసర రిజిస్ట్రర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే మహేశ్వరరెడ్డి ఐపీఎస్గా ఎంపిక అయిన తర్వాత తనను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు, మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని..విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
హృతిక్రోషన్ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి
చెన్నై,పెరంబూరు: అన్నదానం, రక్తదానం, నేత్రదానం దాటి ఇప్పడు వీర్యదానం వరకూ వచ్చింది. ఒక ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి బాలీవుడ్ క్రేజీ నటుడు హృతిక్రోషన్ వీర్యదానం చేయాలన్న డిమాండ్ను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్ క్రీడాపోటీల్లో పాల్గొన్న భావన అనే క్రీడాకారిణి బాలీవుడ్ క్రేజీ నటుడు హృతిక్ రోషన్ నటించిన వార్ చిత్రాన్ని చూసి విశ్లేషిస్తూ తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. అందులో మగ అభిమానులు చిత్రంలోని ఫైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు చూసి ఆనందిస్తున్నారన్నారు. మహిళలు మాత్రం నటుడు హృతిక్రోషన్, మరో నటుడు టైగర్ను చూసి ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు. నటుడు హృతిక్ రోషన్ తన వీర్యాన్ని దానం చేయాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయం వార్తగా మారింది. -
టాలెంట్ ఉంటే దాచుకోవద్దు
అనంతపురం కల్చరల్: బాలనటిగా హీరోలు సూపర్స్టార్ కృష్ణ, నటకిరీటి రాజేంద్రప్రసాద్, అర్జున్ వంటి వారి సరసన నటించి తర్వాతి కాలంలో హీరోయిన్గా కూడా చక్కటి వేషాలు వేసి మెప్పించింది నటి భావన. జిల్లాకు చెందిన ర్యాంబో అస్లాం దర్శకత్వంలో వస్తున్న ఓ లఘు చిత్రంలో నటించడానికి శుక్రవారం ఆమె అనంతపురానికి విచ్చేశారు. ప్రస్తుతం ప్రజాధరణ పొందుతున్న సీరియల్స్ కల్యాణ వైభోగం, పౌర్ణమిలలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న భావన అనేక స్టేజ్ షోలు కూడా చేశారు. కళ్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన షూటింగ్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు. ఇదే తొలిసారి అనంతపురం జిల్లాకు రావడం నేనిదే మొదటిసారి. అయితే గతంలో రెండుసార్లు జిల్లా మీదుగా తిరుపతికి వెళ్లినా ఇక్కడకు రాలేకపోయాను. లేపాక్షి, పుట్టపర్తి ప్రాంతాలు చూడమని చాలా మంది చెప్పేవారు. ఈసారి కూడా చూసే అవకాశం వస్తుందో రాదో కానీ అనంతకు రావడం మాత్రం నాకు ఆనందంగా ఉంది. కళ్యాణదుర్గంలో జరిగే ఓ ప్రాయోజిత కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం భక్తిభావాన్ని పెంచింది. బాలనటిగానే ప్రయాణం నేను మూడేళ్ల వయసు నుండే చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. హీరో అర్జున్ నటించిన కుట్ర సినిమాతో ప్రారంభమైన నా సినీ ప్రయాణం రాజేంద్రప్రసాద్, ఆలీ, చిరంజీవి, శోభన్బాబు, కృష్ణ వంటి పెద్ద నటుల వద్ద వాళ్ల కూతురుగా నటించిన నేనే వారి సరసన హీరోయిన్గా కూడా చేసే దాకా కొనసాగింది. విజృంభన, లాయర్ సుహాసిని, అమ్మాయి బాగుంది, చిక్కడు–దొరకడు, కన్యాదానం, మానవడు–దానవుడు వంటి సినిమాల్లో నటించాను. అదేవిధంగా తమిళ సినిమాల్లో కూడా జెమినీ గణేశన్, కమలహాసన్ వంటి హీరోలతో దేవరమగన్, మహానది సినిమాల్లో నటించాను. ప్రాధాన్యత ఉంటే ఏ పాత్ర అయినా ఒకే.. చాలా మంది నటీనటులు గిరి గీసుకుని చట్రంలో ఉండిపోవడం వల్ల త్వరగా షేడ్అవుట్ అయిపోయిన సందర్భాలను చూశాను. అలాగని ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించాలని కాదు. నా వరకు నా రోల్కు ఇంపార్టెన్స్ ఉందంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నాను. ఆ క్రమంలో హీరోయిన్గానే కాదు ఇతర పాత్రలూ ధరించాల్సి వస్తోంది. అయితేనే ఆ పాత్రలే మలుపు తిప్పేవిగా ఉండాలని నేను భావిస్తాను. ప్రస్తుతం కల్యాణ వైభోగం సీరియల్లో యంగ్ చార్మింగ్ మదర్గా నటిస్తున్నాను. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. టీవీ క్రేజ్ అంతా ఇంతా కాదు ఈ రోజుల్లో సినిమాలకు, టీవీ షోలు, సీరియల్స్ ఆదరణ సమానంగా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే టీవీ క్రేజ్ ఇంతా అంతా కాదు. నిత్యం ఏదో ఒక చానెల్లో వచ్చే సీరియల్లో కనిపిస్తుండడం వల్ల ఇంట్లో సభ్యులుగా మారిపోయాము. నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘అందం’ సీరియల్లో నటించిన తర్వాత ఆ పాత్ర పేరుతోనే పిలుస్తున్నారు. కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును కూడాగెలుచుకున్నాను. టాలెంట్ ఉంటే దాచుకోవద్దు టాలెంట్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అందరికీ సాధ్యం కాని కళలు మనలో ఉన్నప్పుడు వాటిని ప్రదర్శించుకునే అవకాశం కోసం ఎదురు చూడాలి. చాలా మంది యూత్ ఒక్కసారిగా పెద్దస్థాయికి వెళ్లిపోదామనుకుంటూ కలలు కంటుంటారు. తప్పులేదు. కానీ అవి నెరవేరకపోతే నిరుత్సాహం పడొద్దు. ఇండస్ట్రీలో ఎంతో మంది నానా అవస్థలు పడి స్టార్డమ్కు వచ్చారు. ఆ విజయం వెనుక అంతులేని శ్రమ కృషి ఉంటాయి. వాటిని గమనించాలి కానీ పైౖపై మెరుగులను చూసి కాదు. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి అవకాశాలను టీవీలందిస్తున్నాయి. సక్రమమైన పద్ధతుల్లో రాకపోతే మోసపోయే ప్రమాదముంది. -
అలా అమ్మ అయ్యాను
చైల్డ్ ఆర్టిస్ట్గా, టీవీ నటిగా భావన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణవైభోగం ద్వారా మోడ్రన్ మదర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆట, మాట, నటనలతో బోర్ లేకుండా రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి అంటూ తన మనసులోని ముచ్చట్లను పంచుకున్నారు భావన. ఇప్పుడు చేస్తున్న సీరియల్స్? కళ్యాణ వైభోగం, పౌర్ణమి సీరియల్స్లో హీరోయిన్స్కి మదర్గా నటిస్తున్నాను. ఓ కుకరీ షోకి యాంకరింగ్ చేస్తున్నాను. డ్యాన్స్ షోస్లో పాల్గొంటున్నాను. వేటికవి భిన్నంగా అలాగే లుక్లోనూ డిఫరెంట్గా ఉండటంతో ఎక్కడా బోర్ అనేది లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. చేస్తున్న పని వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది. టీవీ హీరోయిన్ నుంచి అమ్మ క్యారెక్టర్కి మారడం? (నవ్వుతూ) కొంచెం కష్టమే. అయితే, అమ్మ అనగానే ఇలాగే ఉంటుందనే ఒకలాంటి పిక్చర్ మన కళ్లముందు నిలుస్తుంది. దీనికి పూర్తి భిన్నంగా నేను చేసే సీరియల్స్లో అమ్మ వెస్ట్రన్ లుక్తో అందంగా ఉంటుంది. కళ్యాణవైభోగం సీరియల్లో నాది తల్లి పాత్ర అయినా హీరోయిన్ – నేను సిస్టర్స్లా ఉంటాం. హీరో, హీరోయిన్, తల్లి .. ఈ ముగ్గురి చుట్టూ కథ తిరుగుతుంది. అమ్మగా ఎలా మొదలు? ఏడేళ్ల క్రితం పుత్తడిబొమ్మ సీరియల్ నుంచి మదర్ క్యారెక్టర్ స్టార్ట్ అయ్యింది. మా ఇంట్లోవాళ్లు కూడా నన్ను తల్లి పాత్రల్లో అంగీకరించడానికి కొంత టైమ్ పట్టింది. అయితే కావాలని అమ్మ పాత్రలను నేను ఎంచుకోలేదు. అనుకోకుండా పుత్తడిబొమ్మ సీరియల్లో హీరోయిన్ చిన్నప్పుడు అమ్మగా ఉండటానికి ఓకే చేశాను. తర్వాత ఆ పాప పెద్దయ్యింది. అలా మదర్గా నేనే కంటిన్యూ అయ్యాను. దీంతో అమ్మ పాత్రలు చేస్తున్నాను. అలాగని బాధ లేదు. వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇండస్ట్రీకి ఎంట్రీ? చైల్డ్ ఆర్టిస్ట్గా నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. మా నాన్నగారి ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఉండేవారు. వాళ్ల ద్వారా నా ఎంట్రీ సులువు అయ్యింది. చిక్కడు దొరకుడు, భారతంలో బాలకృష్ణుడు, స్వయంకృషిలో సుమలత చిన్నప్పుడు, విజృంభణ, లాయర్ సుహాసినిగా చిన్నప్పుడు.. ఇలా పద్నాలుగు సినిమాలు చేశాను. ఆ తర్వాత సీరియల్స్ చేస్తూ వచ్చాను. భవిష్యత్తు నటన గురించి? బాగా మాస్ క్యారెక్టర్ చేయాలని ఉంది. అలా అని అదొక కల కాదు. కాకపోతే అలా కూడా ప్రేక్షకుల్ని మెప్పించాలి అని ఉంది. నన్ను ఇప్పటివరకు పాజిటివ్గా – నెగిటివ్గా చూశారు. భావన మాస్గా కూడా బాగా నటించగలుగుతుందని తెలుస్తుంది. వర్క్లో ఇన్వాల్వ్మెంట్? మా భార్యా–భర్త ఇద్దరిలో ఎవరూ ఎవరి వర్క్ని డిస్ట్రబ్ చేసుకోం. ముందుగా ప్లాన్ చేసుకుంటాం. సజెషన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండవు. అమ్మ, అత్తయ్య మాత్రం ఎమోషన్ సీన్స్ చేసినప్పుడు ఎలా యాక్ట్ చేశానో చెబుతారు. ముఖ్యంగా మా అత్తయ్య అలాంటి సీన్ చూసిన వెంటనే ఫోన్ చేస్తుంటుంది. పిల్లల ఆలనా పాలనా? నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు స్కూల్కి వెళ్లడం కుదరలేదు. దీంతో ఇంట్లో ఉండే ప్రైవేట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. అందుకే మా పిల్లలకు చదువు మీదే కాన్సంట్రేషన్ చేస్తాను. గతంలో ఏదైనా ఇంగ్లీష్ మూవీకి వెళ్లినా మా వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇప్పుడు నా కూతురు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. షాపింగ్కి ఏదైనా మర్చిపోతానేమో అని గతంలో నేను లిస్ట్ రాసుకునేదాన్ని. ఇప్పుడా పని మా అమ్మాయి చేస్తుంది. చాలా విషయాల్లో నా పిల్లలు నాకు తోడుంటున్నారు. నా ప్రపంచం వాళ్లే. ఉదయం షూటింగ్కి తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు గోల చేస్తే కొద్దిగా అరిచేస్తాను. అదే వాళ్లు అమ్మవాళ్లింటికి వెళ్లి, ఒక్కరోజు చూడకపోయినా బెంగ పెట్టేసుకుంటాను. సీరియల్స్ అన్నీ ఒకేలా.. జనాల చేతిలో రిమోట్ ఉంది. నచ్చలేదు అంటే చానెల్ మార్చేస్తారు. కానీ, ఎవరూ అలా చేయడం లేదు కదా! సీరియల్ని తిట్టుకుంటూనైనా చూసేస్తున్నారు. సీరియల్లో ఆ క్యారెక్టర్కి ఏది అవసరమైతే అదే చూపిస్తారు డైరెక్టర్. అత్త, అమ్మ క్యారెక్టర్లు ముందు విలన్ అన్నారు. ఇప్పుడు పాజిటివ్గా మారుతున్నాయి. – నిర్మలారెడ్డి ఇంట్లో అమ్మగా..? నాకు ఇద్దరు కూతుళ్లు. మా పెద్ద పాప పేరు గాయత్రి. రెండవది సరయు. ఇద్దరూ చదువుకుంటున్నారు. నెలలో 15–20 రోజులు షూటింగ్స్తో బిజీగా ఉన్నా మిగతా రోజులు పిల్లలతోనే ఉంటాను. మా వారు విజయ్కృష్ణ డైరెక్టర్. ప్రస్తుతం కథలో రాజకుమారికి వర్క్ చేస్తున్నారు. నాకు షూటింగ్స్ ఉన్నప్పుడు మా అత్తగారు, అమ్మ వాళ్ల సాయం ఉంటుంది. -
బాలీవుడ్ పిలుస్తోంది!
సినిమా: దక్షిణాది కథానాయికలు బాలీవుడ్లోకి అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ ఎంతో క్రేజ్ తెచ్చుకుంటేగానీ అది సాధ్యం కాదు. అలాంటిదిప్పుడు నటి భావనారావుకు అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. కన్నడ నటి భావనారావు. మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళంలోనూ పరిచయమైంది. ఇక్కడ కొలకొలయా ముందిరిక్కా, విణ్మీన్గళ్, వనయుద్ధం చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడంలో 2017లో నటించిన సత్యహరిచంద్ర చిత్రం ఆమెకు అభినందనలు, అవార్డులను తెచ్చిపె ట్టింది. ప్రస్తుతం శివరాజ్కుమార్, సుధీప్, ఎమీజాక్సన్ నటిస్తున్న విలన్ అనే చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇలా కన్నడం, తమిళం భాషల్లో నటిస్తున్న భావనారావ్ను బాలీవుడ్ పిలిచింది. హిందీలో నీల్ నితిన్ ముఖేశ్కు జంటగా బైపాస్ రోడ్డు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ గురించి భావనారావ్ తెలుపుతూ తాను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, హిందీ, తెలుగు, ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. అలా ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నమన్ నితీశ్ దర్శకత్వం వహిస్తున్న బైపాస్ రోడ్డు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఈ చిత్రం ఊహించని మలుపులతో సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. దర్శకుడు కథ చెప్పగానే అందులో తన పాత్ర చాలా నచ్చిందని చెప్పింది. ఈ చిత్రంలో చాలా బలమైన పాత్ర అని, నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర కావడంతో సవాల్గా తీసుకుని నటిస్తున్నట్లు చెప్పింది. నటిగా తనకు నూతన సంవత్సరం చాలా ఆనందంగా ప్రారంభమైందని చెప్పింది. తొలిసారిగా బాలీవుడ్కి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందని అంది. హిందీలోనూ మంచి నటిగా రాణిస్తాననే నమ్మకం తనకుందని భావనారావ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా భరతనాట్య కళాకారిణి అయిన భావనారావ్ నటనలోనూ శిక్షణ పొందడంతో బాలీవుడ్లోనూ రాణిస్తుందనే నమ్మకాన్ని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. -
‘అమ్మ’కు రాజీనామా!
నటి భావనపై వేధింపుల విషయంలో జైలుకు వెళ్లారు మలయాళ నటుడు దిలీప్. ఆయన బెయిల్ మీద బయటకు రాగానే ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ’ (అమ్మ)లో తిరిగి ఆయన్ను సభ్యుడిగా తీసుకోవడంపై కొందరు మలయాళ నటీమణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అతన్ని అసోసియేషన్లోకి ఎలా తీసుకుంటారు? అసోసియేషన్ నుంచి తొలగించాలి? అని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇటీవల డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్) సభ్యులందరూ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సమాధానంగా దిలీప్ అసోసియేషన్ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది ‘అమ్మ’. ‘‘దిలీప్ను రాజీనామా చేయమని కోరాం. ఇది డిసిప్లినరీ యాక్షన్గా చేసింది అనుకోవచ్చు. ఒకవేళ దిలీప్ రాజీనామా చేయకపోతే అసోసియేషన్ నుంచి మేమే తొలగించేవాళ్లం’’ అని ‘అమ్మ’ కమిటీ పేర్కొంది. అవకాశలు తగ్గిపోయాయి ‘‘ఎప్పుడైతే డబ్ల్యూసీసీ ఏర్పాటు చేశానో అప్పటి నుంచి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి’’ అని పేర్కొన్నారు జాతీయ అవార్డు అందుకున్న మలయాళ నటి పార్వతి. మలయాళ అసోసియేషన్ ‘అమ్మ’ వైఖరికి ఎదురుగా నిలబడి మాట్లాడారు ఈ హీరోయిన్. ఇలా ధైర్యంగా నిలబడినందుకే నాకు అవకాశాలు తగ్గాయన్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇలా బాహాటంగా మాట్లాడినందుకు ఇండస్ట్రీలో నన్ను ఒక్కదాన్ని చేసేశారు. వేరేవాళ్లు నాతో మాట్లాడటానికి కూడా సంకోచించేలా చేస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ర క్షణ ఉంటుందో లేదో అని కంగారుగా ఉంది. గత నాలుగేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్సే. కానీ ఇటీవల ఒకే ఒక్క సినిమాకి అవకాశం వచ్చింది. కేవలం పేపర్లోనే కేరళ మోడరన్ సంప్రదాయాలతో ఉండే రాష్ట్రం. కానీ విషాదకర నిజమేంటంటే జనాలు ఇంకా గుడ్డి నమ్మకాలతోనే బ్రతుకుతున్నారు’’ అని పేర్కొన్నారు. -
భవిష్యత్తు బాగుండాలనే...
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీ సమానత్వం కోసం, సురక్షితంగా పనిచేసే వాతావరణం ఏర్పాటు కోసం ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్ (డబ్లు్యసీసీ)’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో రేవతి, పార్వతి, రమ్య నింబసేన్, పద్మ ప్రియా ముఖ్య సభ్యులు. తాజాగా ఈ కమిటీ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)’ అధ్యక్షుడు మోహన్లాల్ వైఖరిని ఖండిస్తూ ప్రెస్మీట్ నిర్వహించారు. లైంగిక వేధింపుల కేస్ ఉన్న దిలీప్ను ఎందుకు కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నటి భావనపై లైంగిక దాడి కేసులో దిలీప్ను అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి ‘అమ్మ’ సభ్యత్వం తొలగించారు. మళ్లీ బెయిల్ మీద బయటకు రాగానే ఆ సభ్యత్వం పునరుద్ధరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బాధితులను సపోర్ట్ చేయకుండా అసోసియేషన్ నిందితులవైపు ఉండటమేంటి? అని ప్రశ్నించారు రేవతి. స్త్రీలను ఇండస్త్రీలో సమానంగా ట్రీట్ చేయాలని ఈ మీటింగ్లో కోరారు. ‘‘ఈ పోరాటమంతా భవిష్యత్తులో మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సురక్షితంగా పని చేసుకోవడం కోసం’’ అని పేర్కొన్నారామె. -
కౌసల్యజ
అచ్చుగుద్దినట్లు పోలికలొస్తే..‘నోట్లోంచి ఊడిపడింది’ అంటారు!అలాగైతే.. ఈ అమ్మాయి.. భావనను‘నడకల్లోంచి ఊడిపడింది’ అనాలి.అమ్మ నేర్పిన నడకలు... అమ్మను చూసి నేర్చుకున్న నడకలు!కూచిపూడిలో గొప్ప డాన్సర్... భావన. అంతకన్నా గొప్ప.. కౌసల్య కూతురిగా ‘కౌసల్యజ’ అనే భావన! ‘‘నడక, నాట్యం రెండూ ఒకేసారి నేర్చుకున్నాను’’ అన్నారు భావనారెడ్డి. నాట్యం ఆమెకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందనిపిస్తుంది. కానీ భావన మాత్రం అమ్మానాన్నల జన్యువుల్లోంచే వచ్చిందంటారు. ‘‘ఫలానా వయసులో నాట్యసాధన మొదలు పెట్టాను... అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే... నడకతోపాటే నాట్యం కూడా అలవడింది. నడక రాకముందు నుంచే నాట్యాన్ని చూస్తున్నాను. మా ఇంట్లో రోజూ నాట్యసాధన జరుగుతుండేది. ఇంటి వెనుక వైపు విశాల స్థలంలో డాన్స్ క్లాసులు జరుగుతుండేవి’’ అని చెప్పారు. నాలుగున్నర ఏళ్లకు తొలి ప్రదర్శన ఇచ్చిన భావన ఖజురహో, కోణార్క్, కాళిదాస సమరోహ్లలో జరిగే డాన్స్ ఫెస్టివల్స్లో కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చారు. ఢాకాలో జరిగిన బెంగాల్ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్, లండన్లోని సాడ్లర్స్ వెల్స్ ఫెస్టివల్స్తోపాటు అమెరికా, కెనడా, యూరప్, యునైటెడ్ ఎమిరేట్స్, ఆసియా ఖండాల్లో విస్తృతంగా పర్యటించి లెక్కకు మించిన ప్రదర్శనలిచ్చారు. ప్రధానమంత్రులు, వేల్స్ యువరాజుతోపాటు అనేకమంది విదేశీ ప్రముఖుల సమక్షంలో మన తెలుగు కళను ప్రదర్శించి మెప్పు పొందారు. ఇవన్నీ మూడు పదుల లోపే. విదేశాల్లో యంగ్ఉమన్ అచీవర్స్ అవార్డు, నార్త్ పవర్లిస్ట్ అవార్డు, టెక్సాస్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నుంచి లైఫ్టైమ్ అవార్డులు అందుకున్నారు. అన్నింటికంటే తనకు మనదేశంలో సంగీత నాటక అకాడమీ నుంచి అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన ‘బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2017’ అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారామె. న్యూయార్క్, న్యూ ఢిల్లీలో ప్రదర్శనల తర్వాత కొంత విరామం తీసుకుని అమ్మమ్మను చూడటానికి ఆదిలాబాద్కి వెళ్లారామె. ఆదిలాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తూ సోమవారం రోజు హైదరాబాద్లో అక్క యామిని దగ్గర ఆగారు. ఆ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. టీనేజ్కి వచ్చాకే స్టేజ్ ఫియర్! భావన ప్రఖ్యాత కూచిపూడి నాట్యకారులు పద్మభూషణ్ రాజారెడ్డి, కౌసల్య (రాధారెడ్డి చెల్లెలు)ల పుత్రిక. నడకలో అడుగులు, నాట్యపు అడుగుల మధ్య తేడా తెలియని వయసులోనే వేదికనెక్కడంతో స్టేజ్ ఫియర్ అనేది తెలియనే లేదామెకి. ఇంట్లో జరిగే డాన్సు క్లాసుకి, వేదిక మీద ప్రదర్శనకి మధ్య తేడా తెలియని వయసది. అయితే బాల్యంలో లేని స్టేజి ఫియర్ టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఆవరించింది. నలుగురి ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏదో తెలియని సిగ్గు కలవరపెట్టేది. దానిని అధిగమించి ప్రదర్శన ఇవ్వడానికి తనకు తానే ధైర్యం చెప్పుకునేదాన్నంటారామె. స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత ప్రేక్షకులు చూస్తున్నారనే భావనను అదిమిపెట్టి తాను ప్రదర్శిస్తున్న పాత్ర మీదనే మనసు లగ్నం చేసేదాన్నని, క్రమంగా వయసు పరిణతితో అధిగమించగలిగానని చెప్పారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బి.కామ్. ఆనర్స్ చదివిన భావన.. నాట్య ప్రదర్శనల కోసం తరచూ విదేశాలకు వెళ్లొస్తుంటారు. ఒకే ఒక ఉత్తరం ‘‘ఏడేళ్ల వయసులో అమ్మతోపాటు పెర్ఫార్మ్ చేశాను. అమ్మ కౌసల్య... రాముడి తల్లి కౌసల్య పాత్ర చేస్తోంది, నేను రాముడి పాత్ర చేశాను. వేదిక మీద తల్లి పాత్రలో సొంత తల్లితో నాట్యం చేయడం మరచిపోలేని అనుభూతి. ఆ ప్రదర్శన పూనాలో జరిగింది. ఆ ప్రదర్శనలో నా నాట్యాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీలో మా ఇంటికి నా పేరుతో ఉత్తరం వచ్చింది. నాకు వచ్చిన ఒకే ఒక్క ఫాన్మెయిల్ అది. అమ్మ పాత్రలో అమ్మతో కలిసి చేయడం ఒక సంతోషమైతే, అదే పెర్ఫార్మెన్స్కి నా పేరుతో ఉత్తరం రావడం తీపి జ్ఞాపకం. ఇంకా బాగా చేయాల్సింది కృష్ణుడి పాత్రలో నటించడం చాలా ఇష్టం. అప్పుడే టీనేజ్లో కొచ్చాను. వారణాసిలో కాళీయమర్దన రూపకాన్ని ప్రదర్శించాను. యశోద పాత్రను అమ్మ ప్రదర్శించింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలే వచ్చాయి, నిపుణుల నుంచి కూడా ఎటువంటి విమర్శలూ రాలేదు, కానీ నాకే ఎందుకో ‘ఇంకా బాగా చేయాల్సింది’ అని పదే పదే అనిపించింది. కృష్ణుడిగా ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉండింది. పూర్తిగా న్యాయం చేయలేకపోయానేమోనని ఏడ్చాను. నాకు కృష్ణుడి మీదున్న ఇష్టం వల్లే అలా అనిపించిందో ఏమో కానీ ఆ ప్రదర్శన ఇప్పటికీ గుర్తు ఉంది. బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన ఏదని ఎవరడిగినా సరే, నాకు అసంతృప్తిని మిగిల్చిన ఆ ప్రదర్శనే మనసులో మెదలుతుంది. అమ్మానాన్నలేమో ‘నీకు బాగా చేయలేదనిపిస్తే... బాగా చేస్తున్నాను అనే తృప్తి కలిగే వరకు ప్రాక్టీస్ చేయడమే పరిష్కారం. మన పెర్ఫార్మెన్స్ మీద మనకు సంతృప్తి కలిగితేనే ప్రేక్షకులను సమాధానపరచగలుగుతాం. అదే గీటురాయి’ అన్నారు. విరామమన్నదే లేదు రోజూ ఒక గంట యోగా, రెండు గంటలు డ్యాన్స్, ఓ గంట కీళ్ల పటుత్వాన్ని పెంచే ఎక్సర్సైజ్ చేస్తాను. ఆహార నియమాలు పెద్దగా పాటించను. నేను మంచి భోజన ప్రియురాలిని. డ్యాన్స్ చేస్తాను కాబట్టి కేలరీలు ఎప్పటికప్పుడు బర్న్ అయిపోతుంటాయి. ఇన్నేళ్లలో డ్యాన్స్కి ఒక్క వారం కూడా విరామం రాలేదు. మూడు రోజులు దాటితే కాళ్లుచేతులు లాగినట్లవుతాయి’’ అంటూ తన చేతి వేళ్లతో నాట్య ముద్రలను చూపిస్తూ నవ్వారు భావన. పాడటం... ఆడటం హాబీ కూచిపూడి నాట్యం నా జీవితంలో భాగమైపోయిందనడం తప్పు, అదే నాకు జీవితం. పాటలు పాడటం, బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం. సినిమాలు బాగా చూస్తాను. ఇంగ్లిష్ పాటలు, కర్ణాటక సంగీతంలో పాడాను.హాలీవుడ్ సినిమాల్లో పాడటం, ఇంగ్లిష్ పాటలకు కూచిపూడి నాట్యంలో కొరియోగ్రఫీ చేయడం హాబీగానే చేశాను. ప్రొఫెషన్గా తీసుకోవడం లేదు. కూచిపూడి నాట్యానికి ఇప్పటి తరం కనెక్ట్ అయ్యేటట్లు భామాకలాపం రూపకాన్ని చేశాను. ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేయాలని ఉంది. అందుకు నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నాన్న, అమ్మల దగ్గర నేర్చుకున్న జ్ఞానమే. ఇంకా శాస్త్రీయంగా నేర్చుకోవడానికి కూచిపూడి గ్రామంలోని కూచిపూడి యూనివర్సిటీలో డ్యాన్స్ కోర్సు చేయాలనుకుంటున్నాను. – భావనారెడ్డి, కూచిపూడి కళాకారిణి – వాకా మంజులారెడ్డి -
అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా?
ఈ ప్రపంచంలో ఎవరు మన మేలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ‘అమ్మ’. తప్పు చేసినా క్షమించే గుణం అమ్మకి ఉంటుంది. మరి.. అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ ‘అమ్మ’ వేరు. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ). కేరళ నటీనటుల సంఘం అన్నమాట. కథానాయిక భావనపై జరిగిన లైంగిక దాడిలో జోక్యం ఉందనే కారణంగా నటుడు దిలీప్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనివల్ల ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వం రద్దయింది. బెయిల్ మీద బయటికొచ్చిన దిలీప్ని మళ్లీ అసోసియేషన్లో చేర్చుకోవాలని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్లాల్, ఇతర సభ్యులు నిర్ణయం తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నటీమణుల్లో రమ్యా నంబీసన్ ఒకరు. బాధిత నటికి అండగా ఉండటం కోసం ‘అమ్మ’కు ఆమె రాజీనామా చేసిన వెంటనే రమ్యా నంబీసన్, రీమా కల్లింగల్ వంటి తారలు తామూ రాజీనామా చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గుటున్నట్లు అనిపించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యా నంబీసన్ పేర్కొన్నారు. ‘‘అమ్మ’ నుంచి బయటికొచ్చాక అభద్రతాభావం ఏర్పడింది. అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించాను. అది మాత్రమే కాదు.. నేను షూటింగ్స్కి సరిగ్గా రానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, అందుకని నన్ను తీసుకోకూడదనీ ప్రచారం చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదు. ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తోటి నటీమణులతో కలసి వ్యతిరేకించాను కానీ నేను ఏం మాట్లాడినా అది మొత్తం మగవాళ్లందర్నీ వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా. ఒక సమస్య ఉంది.. పరిష్కరించండి అన్నాం. అది తప్పా’’ అని రమ్యా నంబీసన్ అన్నారు. నిజమే కదా. నిర్భయంగా మాట్లాడితే లేనిపోని నిందలు వేయడం న్యాయమా? -
అమ్మ చేసింది తప్పు
... అని కమల్హాసన్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అంటే మలయాళం నటీనటుల సంఘం అని అర్థం. గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనకాల నటుడు దిలీప్ హస్తం ఉందని భావన ఆరోపించారు. ఆమె ఫిర్యాదుని పరిశీలించి, పోలీసులు దిలీప్ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్పై బయటకు రావడం జరిగాయి. కాగా, ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చారు ఇటీవల ‘అమ్మ’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్లాల్. ఈ నిర్ణయంపై బాధితురాలు భావనతో సహా పలువురు కథానాయికలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ సభ్యత్వం ఎలా ఇస్తారు? అని ‘అమ్మ’ని నిలదీశారు. ఈ విషయం గురించి కమల్హాసన్ స్పందించారు. ‘‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్ని క్షమించాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చు. అయితే ఓ అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం ఉండాలి. దిలీప్ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ‘అమ్మ’లో ఉన్న పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి, బాధిత నటికి అన్యాయం చేశారు. ఆర్టిస్టులందరి కలయికతో ఏర్పడేదే ఆర్టిస్ట్స్ అసోసియేషన్. అది సజావుగా సాగాలంటే అందరి సహకారం కావాలి’’ అన్నారు కమల్. చిత్రసీమలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ – ‘‘మిగతా చిత్రపరిశ్రమలతో పోల్చితే మలయాళంలో లింగ వివక్ష తక్కువ’’ అన్నారు కమల్. -
నేనూ బాధితురాలినే: నటి
సాక్షి, సినిమా: నటి పార్వతీ మీనన్ నేనూ అలాంటి బాధితురాలినే అని అంటున్నారు. పూ, బెంగుళూర్ డేస్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అంతకు ముందు సంఘం నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్ కూడా ఉంది. నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ.. సహ నటి కిడ్నాప్నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, హెచ్చరికగానూ మసలుకోవాలని పార్వతీమీనన్ హితవు పలికారు. -
అసోసియేషన్ నుంచి వైదొలిగిన నటీమణులు
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి భావన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మళయాళం మావీ ఆర్టిస్ట్స్) నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆమెతో పాటు నటిమణులు రిమా కలింగల్, రమ్య నంబిసన్, గీత్ మోహన్దాస్లు కూడా అమ్మకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. గతేడాది భావనపై నటుడు దిలీప్ లైగింక వేధింపు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దిలీప్ను అరెస్ట్ చేయడంతో అమ్మ అతనిపై నిషేధం విధించింది. తాజాగా అతనిపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో వీరు నలుగురు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అ నటుడి వల్ల గతంలో నేను ఎన్నో అవకాశాలు కొల్పోయాను.. కానీ అమ్మ ఏం చేయలేకపోయిందని భావన తెలిపారు. అమ్మలో కొనసాగడం అనవసరమంటూ ఆమె పేర్కొన్నారు. అమ్మ మహిళల కోసం ఏ విధమైన చర్యలు చెప్పట్టడం లేదని రిమా చెప్పారు. -
మార్పు రావాలి
‘‘హీరోల చుట్టూ తిరిగే కథల్లాగే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఎక్కువ రావాలి. బాలీవుడ్లాగా మాలీవుడ్లోనూ మార్పు రావాలి’’ అని పేర్కొన్నారు మలయాళ బ్యూటీ భావన. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ గురించి భావన మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీలో మార్పు రావాలి. కమర్షియల్ సినిమాల్లో కథ ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతుంటుంది. హీరోయిన్స్కు ఎక్కువ స్కోప్ ఉండదు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా హీరోయిన్ వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంటే అన్ని ఫీమేల్ స్టోరీలు డైరెక్ట్గా తనకే వెళ్లిపోతుంటాయి. కానీ బాలీవుడ్లో అలా కాదు. టాప్ యాక్ట్రెస్ అందరికీ సమానమైన అవకాశాలు వస్తుంటాయి. మన దగ్గర కూడా అలా జరగాలి’’ అని పేర్కొన్నారు భావన. -
వివాహిత ఆత్మహత్య
పెర్కిట్(ఆర్మూర్): అత్తారింటి వేధింపులు తాళ లేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ర్మూర్ పట్టణంలో చేసుకుంది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. మెండోరా మండలం సా వెల్ గ్రామానికి చెందిన దీపిక అలియాస్ భావన(23)కు ఆర్మూర్ పట్టణంలోని కాశీహన్మాన్ వీధికి చెందిన హన్మాండ్లుతో తొమ్మిది నెలల క్రి తం వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతో దీపిక మ నస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం దీపిక సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురా లి తల్లి లింబాయి ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శతమానం భవతి
కోరుకున్నవాణ్ణి పెళ్లి చేసుకోవటమే కదా ఏ ఆడపిల్లైనా ఆశపడేది. అది సాధారణ అమ్మాయి అయినా సరే హీరోయిన్ అయినా సరే. ఇప్పుడు భావన ఆ ఆనందంలోనే ఉన్నారు. ‘ఒంటరి, మహాత్మ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ కుట్టి తన ప్రేమికుడు నవీన్తో ఏడడుగులు వేశారు. నిన్న ఉదయం కేరళ త్రిస్సూర్లో ‘నవీన్’ను కేరళ స్టైల్లో పెళ్లి చేసుకున్నారు భావన. నవీన్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత. వధూవరుల కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా కొద్దిమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. భావన ఫ్రెండ్స్, కథానాయికలు రమ్య నంబీసన్, నవ్య నాయర్, భామ ఈ పెళ్లిలో సందడి చేశారు. ఈ కొత్త జంటకు ఇండస్ట్రీకు చెందిన పలువురు సెలబ్రిటీలు ‘శతమానం భవతి’ అని శుభాకాంక్షలు తెలిపారు. త్రిస్సూర్లోని లూలూ కన్వెన్షన్ సెంటర్లో ఇండస్ట్రీ మరియు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. -
ఘనంగా హీరోయిన్ భావన వివాహం
-
ఒక్కటైన భావన, నవీన్
హీరోయిన్ భావన్, నిర్మాత నవీన్ ల వివాహం ఈరోజు ఉదయం కేరళలోని త్రిసూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులు బందు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన భావన ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. భావన హీరోయిన్ గా నటించిన ఓ సినిమాను నవీన్ నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. భావన తెలుగులోనూ మహాత్మా, ఒంటరి లాంటి సినిమాలతో అలరించింది. -
నటి పెళ్లి సందడి మొదలైంది.. వైరల్
సాక్షి, త్రిసూర్: దక్షిణాది నటి భావన మరికొన్ని గంటల్లో చిరకాల మిత్రుడు, శాండిల్వుడ్ ప్రొడ్యూసర్ నవీన్ను వివాహం చేసుకోనున్నారు. నటి కుటుంబంలో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి రెండు రోజుల ముందు కొందరు సన్నిహితుల సమక్షంలో శనివారం భావన మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో మేలిమి బంగారంలా భావన ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతేడాది మార్చి 9న నవీన్, భావనల ఎంగేజ్మెంట్ జగిన సంగతి విదితమే. కాగా చాలాకాలం తర్వాత కేరళలోని త్రిసూర్ లో 'లులు కన్వెన్షన్ సెంటర్'లో రేపు (జనవరి 22న) వీరి వివాహం జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. వీరి మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా త్రిసూరు చేరుకుంటున్నారు. మెహందీ ఫంక్షన్ నటి భావన స్వగృహంలో చేసినట్లు సమాచారం. సోమవారం భావన వివాహ రిసెప్షన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొందరిని మాత్రమే వివాహానికి ఆహ్వానించామని, చాలా సింపుల్గా శుభకార్యం నిర్వహించనున్నట్లు నటి కుటుంసభ్యులు తెలిపారు. -
ఆ హీరోయిన్ పెళ్లి ముహూర్తం ఖరారు
లైంగిక వేధింపుల కేసుతో ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ దక్షిణ భారత సినీ హీరోయిన్ భావన( కార్తికా మీనన్)పెళ్లి తేదీ ఖరారైంది. చిరకాల మిత్రుడు, శాండిల్వుడ్ ప్రొడ్యూసర్ నవీన్తో భావన మార్చి 9న ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి విదితమే. నిశ్చితార్థం జరిగి ఇన్నాళ్ల గ్యాప్ తరువాత జనవరి 22న వీళ్ల వివాహం బెంగళూరులో జరగనుంది. త్రిసూర్ లోని 'లలు కన్వెన్షన్ సెంటర్'లో వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నిహిత మితృలకు, బంధువులకు ఆహ్వానాలు అందాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లోనటించిన భావన నమోదు చేసిన నటుడు దిలీప్పై లైంగిక వేధింపుల కేసు కేరళ చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పెళ్లిని సినీ పరిశ్రమకు దూరంగా జరుపుకోనున్నారు. కేవలం కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. -
భావన లైంగికదాడి కేసు.. ఇంకో ట్విస్ట్
సాక్షి, తిరువనంతపురం : నటి భావన లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కున్న నటుడు దిలీప్ పేరును దర్యాప్తు బృందం మార్చేసింది. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో దిలీప్ను 8వ నిందితుడిగా పేర్కొనటం విశేషం. ఫిబ్రవరి 17న కొయంబత్తూరులో భావనపై లైంగిక దాడి జరిగిన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పల్సర్ సునీ, మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నటుడు దిలీప్ను జూలై 10న అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ సమయంలో దిలీప్ను ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. దాదాపు 80 రోజుల తర్వాత అక్టోబర్ 3న బెయిల్పై బయటకు వచ్చిన దిలీప్ షరతులపై సడలింపు కోరుతూ కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దర్యాప్తులో ఈ స్టార్ హీరోకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలేవీ లభించకపోవటంతో ఆయన పేరును 8వ నిందితుడిగా ఇప్పుడు మార్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిలీప్ పాత్రపై ప్రాధాన్యం తగ్గుతున్న వేళ నెమ్మదిగా కేసు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని భావన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. దిలీప్కు అదే పెద్ద సమస్య... నిందితులు పల్సర్ సునీ, విజీశ్లు దిలీప్ పాత్ర గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. ఛార్లీ మాత్రం దిలీప్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తుండటంతో పోలీసులు దిలీప్ పేరును ఇప్పట్లో ఛార్జ్ షీట్ నుంచి తొలగించే ఆస్కారం లేకుండా పోయింది. కాగా, ఛార్లీ ఘటన తర్వాత సునీ, విజీశ్లకు ఆశ్రయం కల్పించాడు. అంతేకాదు భావనపై జరిపిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను నిందితులు తనకు చూపించారంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. -
మాజీ భార్యే స్కెచ్ వేసి ఇరికించింది
సాక్షి, తిరువనంతపురం : భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఉదంతంలో నటుడు, ఎమ్మెల్యే పీసీ జార్జ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిలీప్ అమాయకుడని.. అతన్ని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అంటున్నారు. మనోరమ ఆన్లైన్ ఇంటర్వ్యూలో జార్జీ మాట్లాడుతూ.. అతని మాజీ భార్య మంజూ వారియర్ దీనంతటికి కారణమన్నారు. ‘‘ఆమెకు దిలీప్ నుంచి విడిపోవటం ఇష్టం లేదు. కానీ, వేరే మార్గం లేక విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవకాశం దొరకటంతో పథకం పన్ని దిలీప్ను ఇరికించి ప్రతీకారం తీర్చుకుంది. మంజు మంచి నటే కావొచ్చు. కానీ, అంతకు మించి కఠిన హృదయం కలది’’ అని జార్జ్ చెప్పారు. దిలీప్కు ఇంత అండగా ఎందుకు నిలుస్తున్నారన్న ప్రశ్నకు... ఏ తప్పు చెయ్యని ఓ వ్యక్తి 90 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. ధర్మం గెలిచి తీరాలన్న ఒకే ఉద్దేశ్యంతో తాను అతని తరపున నిల్చున్నానని.. అందు కోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానని జార్జ్ బదులిచ్చారు. కాగా, జార్జ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని మంజు అంటున్నారు. పుంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఈ కేసులో మొదటి నుంచి దిలీప్కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతకు నటి భావనను లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల దాడి చేశారు. అంత పెద్ద దాడి జరిగితే మరుసటి రోజు షూటింగ్ కు వెళ్లటమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో భావన తనను జార్జ్ అవమానిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఓ లేఖ రాసింది. -
పటేల్ సర్తో మరో హీరోయిన్
కొంత కాలంగా విలన్, క్యారెక్టర్ రోల్స్కు మాత్రమే పరిమితమైన సీనియర్ స్టార్ జగపతిబాబు, మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి నిర్మాణంలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై పటేల్ సర్ సినిమాలో నటిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమలో జగ్గుభాయ్ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. ఈ సినిమాతో వాసు పరిమి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓపెనింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కుసూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే సినిమాలో నటించే నటీనటులకు ప్రస్తుతం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా మలయాళీ భామ భావనను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరో కీలక పాత్రకు అప్పట్లో ఒకడుండేవాడు ఫేం తాన్య హోపే ఫైనల్ చేశారు. ప్రస్తుతం వర్క్షాప్ పాల్గొంటున్న ఈ భామ పటేల్ సర్లో క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపు తీసుకువస్తోదని నమ్ముతోంది. -
అనుకోకుండా జరిగిపోయింది: భావన
హైదరాబాద్: కన్నడ నిర్మాత నవీన్తో తన నిశ్చితార్థం అనుకోకుండా జరిగిందని మలయాళీ నటి భావన చెప్పారు. ఎలాంటి ప్రకటన లేకుండా నిశ్చితార్ధం చేసుకోవడంపై మళయాళీ మీడియా భావనను ప్రశ్నించింది. వాటికి స్పందించిన భావన.. నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి తనను చూడటానికి సంప్రదాయ ప్రకారం వచ్చారని చెప్పారు. ఇరు కుటుంబాలు ఒకేచోట కలవడంతో అప్పటికప్పుడు నిశ్చితార్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దాంతో అనుకోకుండా నిశ్చితార్ధం జరిగినట్లు చెప్పారు. స్నేహితులను కూడా నిశ్చితార్ధానికి పిలవలేకపోయానని తెలిపారు. భావన-నవీన్ల నిశ్చితార్ధపు ఫోటోలు కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. భావన, నవీన్ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. వీరి వివాహ వేడుకను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు సమాచారం. -
కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...
-
కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...
మలయాళ నటి భావనను కారు డ్రైవర్లు వేధింపులకు గురి చేయడం, ఆమె పోలీసు లకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒక చేదు అనుభవం ఎదుర్కొన్న భావన ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కన్నడ నిర్మాత నవీన్తో ఆమె నిశ్చితార్థం జరిగింది. గురువారం కేరళలోని కొచ్చిలో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరు లో వివాహం జరుగుతుందట. 2012లో భావనతో నవీన్ ‘రోమియో’ అనే సినిమా తీశారు. అప్పుడే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. -
రహస్యంగా నటి భావన నిశ్చితార్థం.. ఇదిగో ఫొటో!
మలయాళం నటి భావన కన్నడ నిర్మాత నవీన్ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వారి నిశితార్థం గురువారం గోప్యంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. భావన నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిశ్చితార్థం సందర్భంగా భావన ఆప్తమిత్రురాలు, మాలీవుడ్ నటి మంజు వారియర్ కొత్తజంటతో కలిసి ఫొటో దిగారు. భావన- నిర్మాత నవీన్ పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. నవీన్తో కొంతకాలంగా భావనకు అనుబంధం ఉంది. వీరు 2014లోనే పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ ఇరువురి బిజీ షెడ్యూల్ వల్ల పెళ్లి వాయిదా పడింది. భావన ప్రస్తుతం పృథీరాజ్ హీరోగా నటిస్తున్న ఆదమ్ చిత్రంలో నడిస్తోంది. Actress #Bhavana got engaged to Kannada Producer #Naveen at a simple ceremony earlier today.. Wedding date yet to be fixed.. Congratulations pic.twitter.com/5r3Zmo4TrC — Ramesh Bala (@rameshlaus) March 9, 2017 -
సేవ్ శక్తి అంటున్న వరలక్ష్మీ శరత్కుమార్
నటి భావనపై అత్యాచారయత్న సంఘటన చిత్ర వర్గాలో్లనూ, మహిళలపై ప్రభావం చూపిందనే చెప్పాలి. ముఖ్యంగా కథానాయికల్లో చాలా మంది అలాంటి అరాచకాలను ఇకపై సాగనీయరాదన్న ధృడ నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా నటి వరలక్ష్మీ శరత్కుమార్ నడుం బిగించారు. అందులో భాగంగా సేవ్ శక్తి నినాదంతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి భద్రత కలిగించే విధంగా అడుగులు వేస్తున్నారు. సేవ్శక్తి పేరుతో ఒక సంఘాన్ని ప్రారంభించనున్నారు. మహిళా దినోత్సవం(మార్చి 8)న స్త్రీల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చెనై్నలో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక ట్వీట్ చేశానన్నారు. అందులో ఒక మహిళగా తన భావాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. అందుకు కారణం సమాజంలో మార్పు రావాలన్న ఆకాంక్షేనని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా సమాజంలో మార్పు తీసుకురాకపోతే, ఇక అది కలగానే మిగిలిపోతుందన్నారు. దీనికి తన వంతు ప్రయత్నంగా సేవ్శక్తి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళల సంతకాలను సేకరించి వాటిని ప్రభుత్వానికి విన్నపంగా అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు రెండు అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రతి తాలుకాలో మహిళా కోరు్టను ఏర్పాటు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరు నెలలో్లగా తీర్పు రావాలన్నారు. అప్పుడే లైంగిక వేధింపులకు గురైనవారు ఆ గాయాలను మరచి నూతన భవిష్యతు్తకు బాటలు వేసుకోగలరు. ఈ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ నెల 8న స్థానిక రాజరత్నం హాలులో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేం ఘనత కాదు : ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో మహిళలకు రక్షణ ఎకు్కవే. మహిళలపై అత్యాచారాలు అరుదుగానే జరుగుతున్నాయి. అంతమాత్రాన దీన్ని ఘనతగా చెప్పుకోలేం అన్నారు. అలాంటి దుస్సంఘటనలే జరగకుండా చూసుకోవాలి. న్యాయవాదులతో చర్చించా : మహిళలపై లైంగిక వేధింపులకు తగిన శిక్షల గురించి ప్రముఖ న్యాయవాదులతో చర్చించా. చట్టంలో లోపాలేమీ లేవు, వాటిని అమలు పరచడంలోనే ఉంది చిక్కంతా అన్నారు. అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి : వేధింపులకు గురైన మహిళలు దాని గురించి మాట్లాడకూడదు అనే సమాజంలో మార్పు రావాలి. అన్యాయాన్ని ఎదిరించి గొంతు విప్పాలి. లేకుంటే స్త్రీలు ఎప్పటికీ ఆట వస్తువుగానే మిగిలిపోతారు. నేను ఈ పోరాటానికి సిద్ధం కావడానికి ఒక ప్రముఖ నటి బాధింపునకు గురవడం కారణం కాదు. ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు, ఇకపై ఏ మహిళ లైంగిక వేధింపులకు గురి కాకూడదు. అప్పటివరకు తన పోరాటం చేస్తా. స్త్రీ సంఘం ఏర్పాటు : ఇక సినిమాకు చెందిన మహిళల కోసం ఏమి చేయనున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని, ఈ విషయంపై ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య)కు విజ్ఞప్తి చేయనున్నాం. స్త్రీల కోసం ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆ విన్నపం. అందులో సినీ నటీమణుల నుంచి ఏ శాఖకు చెందిన మహిళలైనా సభ్యులుగా చేరవచ్చు. వారి సమస్యలను ఆ సంఘానికి చెప్పుకుని వెంటనే పరిష్కారం పొందవచ్చు. అయితే ఆ సంఘానికి సినిమాకు చెందిన వారు కాకుండా ఒక విశ్రాంత న్యాయమూర్తి, ఐపీఎస్ అధికారి లాంటి వారిని అ«ధ్యక్షుడిగా నియమించాలనుకున్నాం. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది. -
అది క్షమించరాని నేరం!
భారత దేశంలో స్త్రీలకు రక్షణ కరువైందా? ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది మహిళా లోకం నుంచి. ఈ ఆధునిక యుగంలో స్త్రీలు మగవారికి ఎందులోనూ తీసిపోనంతగా రాణిస్తున్నారు. అయినా కొందరు మానవ మృగాలు స్త్రీని ఒక ఆట వస్తువుగానే చూస్తున్నారు. వారి అఘాయిత్యాలకు మహిళలు బలైపోతూనే ఉన్నారు. అన్ని రకాలుగా బలపడిన స్త్రీలు కూడా ఒక్కోసారి మగవాడి పైశాచికత్వం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇందుకు నటి భావన ఉదంతమే ఒక నిదర్శనం. ఆమెకు జరిగిన అఘాయిత్యాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఖండిస్తున్నారు.అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని గళమెత్తున్నారు.చాలా మంది నటీమణులు భావనకు అండగా నిలుస్తున్నారు.నటి వరలక్ష్మీశరత్కుమార్, స్నేహ, సంధ్య ఇలా పలువురు భావనపై అత్యాచారయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.తాజాగా నటి శ్రుతీహాసన్ స్పందిస్తూ విదేశాల్లో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. భారతదేశంలో మాత్రం ఇంకా అభద్రతాభావంతో గడుపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు మానవ రక్షణ కరవైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నటి భావనపై లైంగికయత్నం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు.అలాంటి అఘాయిత్యాయలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.అప్పుడు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టపడుతుందని మంగళవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి శ్రుతీహాసన్ అన్నారు. -
నీకు పులి దొరికిందని చరణ్ అన్నాడు!
పెళ్లి తర్వాత నా లైఫ్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు టైమ్కి ఇంటికి వెళ్తున్నాను. పెళ్లి విషయంలో నేను లక్కీ. నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నా. ‘నేను ఆర్టిస్ట్ని. నాకు డబ్బు సేవ్ చేయడం రాదు. రేపు పరిస్థితి తేడా వస్తే.. చేయి చాచి ఒకర్ని డబ్బులు అడగను. చిన్న అపార్ట్మెంట్, గుడిసెకు వెళ్లాలంటే రెడీనా?’ అని పెళ్లికి ముందు ప్రణతిని అడిగా. ‘నీతో ఎక్కడికైనా వస్తా’ అని చెప్పింది. ప్రణతి మూవీ లవర్. ఓ ఫ్రెండ్లా సలహాలు ఇస్తుంది. ‘‘చిన్నప్పట్నుంచీ డాడీ సక్సెస్లు, ఫెయిల్యూర్లు చూస్తూ, పెరిగా. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అప్పుడు మేమంతా నాన్నగారి వెనకాలే ఉన్నాం.హిట్ వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఎన్ని కార్లున్నాయి? ఫ్లాప్ టైమ్లో ఎన్ని ఆగాయనేది తెలుసు. ఆ వాతావరణంలో పెరిగినోళ్లపై జయాపజయాల ప్రభావం ఏముంటుంది?’’ అన్నారు మంచు మనోజ్. ఆయన హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ మార్చి 3న విడుదలవుతోంది. మనోజ్ చెప్పిన ముచ్చట్లు... ► ‘గుంటూరోడు’ పక్కా హీరోయిజమ్ ఉన్న సినిమా. హీరోకి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేడు. కళ్ల ముందు అన్యాయం జరిగితే వాడి చేతికి దురద వస్తుంది. సింపుల్ కథకు మాంచి యాక్షన్ జోడించి సత్య అద్భుతంగా తీశాడు. వెంకట్ సూపర్ ఫైట్స్ కంపోజ్ చేశాడు. ► వాయిస్ ఓవర్ ఇవ్వమని ముందు రామ్ చరణ్ని అడిగా. తనప్పుడు వేరే ఊరిలో ఉన్నాడు. హైదరాబాద్ రావడానికి పది రోజులు పడుతుందన్నాడు. తర్వాతి రోజు చిరంజీవి అంకుల్ వాళ్లింటికి నాన్నగారు బ్రేక్ ఫాస్ట్కి వెళుతుంటే నేనూ వెళ్లాను. ‘అంకుల్.. నేనో మాస్ కమర్షియల్ సినిమా చేశా. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాల’ని అడగ్గానే ఓకే చెప్పారు. నెక్స్›్టడే కాల్ చేసి ‘మను... డబ్బింగ్ చెప్పేశా. ఓసారి చూసుకో. కరెక్షన్స్ ఉంటే మళ్లీ చెబుతా’ అన్నారు. ఆయన చెప్తే కరెక్షన్స్ ఏముంటాయి! ‘చిన్న బిడ్డ కోసం వచ్చావు. నీకు పులి దొరికింది’ అని రామ్చరణ్ అన్నాడు. ► సినిమా హిట్టూ ఫ్లాపులకు ఈరోజుల్లో కారణాలెన్నో ఉంటాయి. ఉదాహరణకు... పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు బ్లాక్ చేసి, మా థియేటర్లలో మా సినిమాలు వేసుకుంటామంటారు. బాగున్న చిన్న సినిమాకు ఇవ్వమన్నా ఇవ్వరు. పండగలు, మంచి సీజన్లు పెద్దోళ్లు తీసుకుని, ఎగ్జామ్స్ టైమ్ను చిన్న సినిమాలకు ఇస్తున్నారు. సరైన విడుదల తేదీ దొరక్క కొన్ని చిన్న సినిమాలు ఆడడం లేదు. ‘గుంటూరోడు’ను ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, సరిపడా సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. సినిమా కూడా రెడీ కాలేదు. మార్చి 3న పోటీ ఉన్నప్పటికీ మేలో నా ‘ఒక్కడు మిగిలాడు’ విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే, మార్చి 3న రిలీజ్ చేస్తున్నాం. ► నటి భావన ఘటన తర్వాత ఆడవాళ్లకు జరుగుతోన్న అన్యాయాలపై ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నారులపై అఘాయిత్యాలు అనే వార్తలు చూస్తుంటే కత్తితో కోయాలనిపిస్తుంది. అమ్మాయిలంటే మా ఫ్యామిలీకెంతో ప్రేమ. అందుకే, దేవుడు మాకు ఎక్కువ ఆడపిల్లల్ని ఇచ్చాడనుకుంటున్నా. -
వారికి ఉరి శిక్ష విధించాలి!
నటి భావన లైంగికవేధింపుల సంఘటన దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్యాప్తులో ఆమె కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.మంత్రి కొడుకుల హస్తం ఉందని, ప్రముఖ నటుడికి ఈ దురాగతంలో భాగం ఉందని, మరో మహిళా వ్యాపారవేత్తే ఈ ఘటనకు సూత్రధారి అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు మాత్రం ముమ్మరంగా సాగుతోంది. కాగా భావన లైంగికవేధింపులకు గురైన విషయాన్ని నటి రెజీనా ముందుకు తీసుకురాగా తానూ అడ్జెస్ట్మెంట్ వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని అన్నారు.ఈ బ్యూటీ సందీప్కిషన్, శ్రీలతో కలిసి నటించిన మానగరం చిత్రం మార్చి 10వ తేదీన తెరపైకి రానుంది. విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన రెజీనాను భావన సంఘటనపై స్పందించాల్సిందిగా అడిగినప్పుడు సినిమాలో మనతో నటించే యూనిట్పై నమ్మకం కలగాలన్నారు.ఇది చాలా క్లిష్టవైున పరిస్థితి అని పేర్కొన్నారు.సెన్సిటివ్ అయిన ఈ అంశం గురించి తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు.అయితే అత్యాచారయత్నానికి పాల్పడ్డ వారికి ఉరి శిక్ష లాంటి దండన విధించాలన్నారు. లేదా వారిని పెట్టే టార్చర్కు మరెవరూ మహిళలపై అత్యాచారం చేయడానికి భయపడేలా ఉండాలన్నారు. ఏదేవైునా స్త్రీలు తమ రక్షణ విషయంలో తరచూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.తాను ఆరంభంలో తమిళ చిత్రాల్లో నటించానని,ఆ తరువాత తెలుగు చిత్రాల వైపు దృష్టి సారించానన్నారు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు తనకు ఫోన్ చేసి తమిళ చిత్రంలో నటించడానికి కాల్షీట్స్ అడిగారన్నారు. తరువాత అడ్జెస్ట్మెంట్ అనే పదాన్ని ఉపయోగించారని, దాంతో తానా చిత్రంలో నటించలేదని తెలిపారు.ఆ తరువాత తనకలాంటి సంఘటనలు ఎదురవ్వలేదని చెప్పారు.ఏ రంగంలో అయినా మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఎవరి సాయం అవసరం లేకుండా సురక్షితంగా ఉండవచు్చనని అంటున్నారా ఉత్తరాది భామ. -
నేనైతే చంపేసుంటా!
అలాంటి పరిస్థితి నాకు ఎదురై ఉంటే వారిని చంపేసేదాన్ని అంటోంది నటి రకుల్ప్రీతిసింగ్. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా అంటున్నారో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇటీవల నటి భావన ఎదుర్కొన్న లైంగికవేధింపుల సంఘటన చిత్ర వర్గాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఆమెపై లైంగికవేధింపులకు పాల్పడ్డ మృగాల్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సహ నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. భావనకు జరిగిన సంఘటన గురించి నటి రకుల్ప్రీతిసింగ్ స్పందిస్తూ తనకే అలాంటి పరిస్థితి ఎదురైతే వారిని అక్కడే చంపేసేదానినని అంది. భావనకు జరిగిన సంఘటన తనను చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని .. అది సిగ్గుమాలిన చర్యగా పేర్కొంది. తాను షూటింగ్కు బయలుదేరే ముందు అమ్మ జాగ్రత్తగా వెళ్లిరా అని చెబుతుండేదని, కారు డ్రైవర్ తోడుండగా తనకు భయమేమిటని భావించేదానినని చెప్పింది. అలాంటి డ్రైవర్లే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అని పేర్కొంది. మొదట్లో కోలీవుడ్లో నిరాదరణకు గురైన రకుల్ప్రీతిసింగ్ ఆనక టాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా కోలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయి. విశాల్, కార్తీల సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఇప్పుడు నటుడు సూర్యతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం సూర్య విఘ్నేశ్శివ దర్శకత్వంలో కీర్తీ సురేశ్తో కలిసి డ్యూయెట్లు పాడుతున్న విషయం తెలిసిందే. తదుపరి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి రకుల్ప్రీతిసింగ్ నటించనున్నారు. డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం జూన్ లో సెట్ పైకి రానుందని సమాచారం. -
వారికి శిక్ష పడే వరకు సినిమాల్లో నటించను
నేరస్తులకు శిక్ష పడే వరకు నేను సినిమాల్లో నటించనని నటి భావన శపథం చేశారు. తన మాజీ కారు డ్రైవర్ సహా ఆరుగురు నటి భావనను కిడ్నాప్నకు పాల్పడిన సంఘటన దక్షిణాది చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి స్నేహ సహా పలువురు నటీమణులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భావన కిడ్నాప్ సంఘటన గురించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికరవైున అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే కిడ్నాప్నకు పాల్లడ్డ వ్యక్తుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్ల ద్వారా భావన కిడ్నాప్ సంఘటనలో ఒక ప్రముఖ నటుడు, ఒక రాజకీయనాయకుడి ఇద్దరు కొడుకులు వారితో పలుమార్లు మాట్లాడినట్లు, నేరస్థుల వాగ్మూలంలో ఈ సంఘటనకు రూ.50 లక్షలు బేరం జరిగినట్లు బయట పడింది. ఈ వ్యవహారంలో ఓ మలయాళ నటుడు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నటి భావన కిడ్నాప్ కేసులో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు. అయితే ఆ మళయాళ నటుడి మాజీ భార్యకు నటి భావనకు మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. భర్తతో తనకు ఎదురైన చేదు అనుభవాలను భావనతో పంచుకున్నారని, భావన ఈ విషయాలను ప్రముఖ నటులకు, కొందరు రాజకీయనాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం జరిగేలా పోరాడినట్లు ప్రచారం జరిగింది. దీంతో 2014 తరువాత ఆమెకు మలయాళంలో అవకాశాలు లేవు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన భావన అక్కడ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.దీంతో మళ్లీ మలయాళంలో అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్కు జంటగా ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే తనను కిడ్నాప్ చేసిన దోషులకు తగిన శిక్ష పడేవరకూ తాను సినిమాల్లో నటించనని భావన శపథం చేసినట్లు నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా నటి భావనను లైంగికంగా వేధించిన దృశ్యాలను సెల్ఫోన్ లో చిత్రీకరించిన వ్యక్తులు వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
భావన కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
కోచి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి భావనపై వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, సహనిందితుడు వీపీ విగీశ్లను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారు ఎర్నాకులం స్థానిక కోర్టులో లొంగిపోవడానికి వచ్చినపుడు హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణం నుంచే నిందితులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అంతకు ముందు పోలీసుల కళ్లుగప్పి వారిద్దరు లాయర్ల దుస్తుల్లో కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించా రు. ఇది గమనించిన లాయర్లు పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తరువాత నిందితులిద్దరినీ ప్రశ్నించడానికి ఆలువా పోలీస్ క్లబ్కు తరలించారు. కోర్టు రూం నుంచే తమ క్లయింట్లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారంటూ నిందితుల తరఫు లాయర్లు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కు ఫిర్యాదుచేశారు. నిందితులను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలన్న లాయర్ల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. -
అరచేతిలో ప్రాణాలు
-
భావన కేసులో కనిపించని పురోగతి
కొచ్చి: మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో విచారణ కొనసాగుతున్నప్పటికీ పురోగతి కనిపించడం లేదు. ఈ ఉదంతానికి సూత్రధారిగా భావిస్తున్న పల్సర్ సునీల్తోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే కుట్రకు సహకరించాడనే ఆరోపణలపై నటి డ్రైవర్ మార్టిన్ ను అరెస్టుచేశారు. షూటింగ్ ముగించుకొని వెళ్తున్న నటిని దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకొని వేధింపులకు గురి చేశారు. నిందితులు సునీల్తో సహా మరో ముగ్గురి ఆచూకీ కోసం అలప్పుజ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేసినా ఫలితం శూన్యం. -
కారు డ్రైవర్లే కాలనాగులు!
ఎవర్ని నమ్మాలో... ఎవర్ని నమ్మకూడదో... ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకరు మాజీ.. ఇంకొకరు తాజా.. ఇద్దరూ కారు డ్రైవర్లే. హీరోయిన్ భావన పట్ల కాలనాగులుగా మారారు. తెలుగులో ‘ఒంటరి’, ‘మహాత్మ’ పాటు పలు మలయాళ, కన్నడ చిత్రాల్లో భావన హీరోయిన్గా నటించారు. స్వతహాగా ఆమె మలయాళీ. శుక్రవారం రాత్రి కేరళలోని ఎర్నాకుళంలో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు ఆమె కారును అడ్డుకున్నారు. తర్వాత అందులోకి ఎక్కి భావనను లైంగిక వేధింపులకు గురి చేశారు. సుమారు గంటన్నర పాటు అనుచితంగా ప్రవర్తించి, ఫొటోలు, వీడియో లు తీసుకుని ఆ తర్వాత వదిలేశారు. అక్కణ్ణుంచి దగ్గరలోని ఓ నిర్మాత ఇంటికి వెళ్లిన భావన.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు... భావన మాజీ కారు డ్రైవర్ సునీల్కుమార్ కావడం గమనార్హం. తన గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నాడనే ఉద్దేశంతో కొంతకాలం క్రితం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించారు భావన. ఈ మాజీ డ్రైవర్కిSతాజా డ్రైవర్ మార్టిన్ సహకారం అందించాడని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత సమాజంలో అమ్మాయిల భద్రత పట్ల పలువురు హీరోయిన్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
త్వరలో పెళ్లికూతురు కానున్న భావన
నటి భావన త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. మిష్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్తిరం పేసుదడి చిత్రం ద్వారా కోలీవుడ్కు నాయకిగా పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ భావన. తొలి చిత్రంతోనే సక్సెస్ను అందుకున్న ఆ భామకు ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. దీపావళి, వెయిల్, కిళక్కుకడర్కరైశాలై, ఆర్య చిత్రాల్లో నటించిన భావన ఎక్కువ కాలం ఇక్కడ నిలదొక్కుకోలేక పోయారు. అయితే ఆ తరువాత కొంత కాలం టాలీవుడ్ చేయూత నిచ్చింది. ప్రస్తుతం మలయాళం, కన్నడ చిత్రాల్లోనే నటిస్తున్నారు. భావన ఒక కన్నడ నిర్మాత ప్రేమలో పడ్డారన్న ప్రచారం చాలా కాలంగా హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని భావన అంగీకరించారు. అయితే తన ప్రియుడైన ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయంలో తన ప్రియుడి పేరును వెల్లడిస్తానని పేర్కొన్నారు. భావన, కన్నడ నిర్మాత డీప్గా ప్రేమించుకుంటున్నారట.పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట. నిజానికి వీరి పెళ్లి ఇప్పటికే జరిగి ఉండాల్సిందని, అయితే నటి భావన తండ్రి ఆ మధ్య మరణించడంతో పెళ్లి వాయిదా పడిందని ఆమె స్నేహితురాళ్ల సమాచారం. తాజాగా భావన పెళ్లికి సిద్ధం అయినట్లు, వచ్చే ఏడాది ఏప్రిల్లో తన చిరకాల ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. కేరళ రాష్ట్రం,తిరువనంతపురానికి చెందిన భావన పెద్దగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులే వారి పెళ్లికి అతిథులు కానున్నారని సమాచారం. -
సరైన అవకాశాలు రాలేదు
చెన్నై : తమిళంలో నాకు సరైన అవకాశాలు రాలేదు అంటోంది నటి భావన. 2002లోనే మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన ఈ కేరళకుట్టి ఆ తరువాత తమిళం, కన్నడం, తెలుగు తదితర దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. తమిళంలో 2006లో చిత్తిరం పేసేదడి చిత్రంతో అడుగు పెట్టింది. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇక్కడ భావన ఒక రౌండ్ చుట్టేస్తుందని కోడంబాక్కం వర్గాలు భావించాయి. అలాగే జయం రవితో దీపావళి, యువ నటులతో నటించే అవకాశాలను దక్కించుకుంది. అజిత్తో అసల్ చిత్రంలో కూడా నటించింది. అయితే అధిక అవకాశాలను కోలీవుడ్లో ఈ కేరళ కుట్టి రాబట్టుకోవడంలో ఫెయిలైందని అన్నవారూ లేక పోలేదు. ఇక్కడ విజయాలు ఈమెకు అంతంత మాత్రమే. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్పై దృష్టి సారించింది. అక్కడ వరుసగా అవకాశాలను రాబట్టుకున్నా ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. తమిళంలో భావన నటించిన చివరి చిత్రం అసల్. అది 2010లో విడుదలైంది. ప్రస్తుతం మాతృభాష అయిన మలయాళంలోనే నటిస్తోంది. అయితే ఇటీవల తమిళ చిత్ర అవకాశాలను భావన అంగీకరించడం లేదనే ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం. అందుకు కారణం లేక పోలేదు. విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశాన్ని భావన అందుకోలేదనే ప్రచారం జరిగింది. దీనికి స్పందించిన భావన తాను తమిళంలో నటించి ఐదేళ్లయిందని గుర్తు చేసుకుంది. అయితే మలయాళం, కన్నడం చిత్రాలలో నటిస్తూ ఇప్పటికీ బిజీగానే ఉన్నానని అంది. అసల్ చిత్రం తరువాత తమిళంలో కొన్ని కథలు విన్నాననీ, తనకు సరైన పాత్రలు అమరక పోవడంతో నటించలేదని వివరించింది. అయితే తమిళ చిత్రాలలో నటించనని ఎప్పుడూ చెప్పలేదని అంది. ఇకపోతే పులి చిత్రంలో విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిన మాట నిజమేనని అంది. ఆ సమయంలో ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆ అవకాశాన్ని అంగీకరించలేక పోయానని, తనకు నప్పే పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని భావన అంటోంది. -
తనని తప్పుగా అనుకుంటున్నారని..
పెనుకొండ: చుట్టుపక్కల వాళ్లు తన గురించి తప్పుగా అనుకుంటున్నారనే బాధతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన భావన(15) స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో పెనుకొండకు చెందిన ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాలిక తిరిగి ఇంటికి చేరింది. ఈ విషయం పై తన గురించి చుట్టుపక్కల వాళ్లు తప్పుగా అనుకుంటున్నారని మనస్థాపానికి గురైన భావన శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రపోయిన తర్వాత చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్పీడ్ పెంచిన మల్లూబ్యూటీస్
-
ఇళయదళపతిని మిస్సయ్యా
ఇళయదళపతి విజయ్తో నటించే అవకాశా న్ని మిస్ అయ్యానని నటి భావన చింతిస్తున్నారు. ఈ కేరళ కుట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రము ఖ హీరోయిన్గా వెలుగొందుతూ చిత్తిరం పేసుద డి చిత్రం ద్వారా కోలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ చి త్ర విజయంతో ఇక్కడ వరుసగా అవకాశాలు రాబట్టుకున్నారు. ఆ తరువాత దీపావళి, కూడల్ నగర్ చిత్రా ల్లో నటించారు. అలా నటుడు అజిత్కు జంటగా అసల్ చిత్రంలో నటించే స్థాయికి చేరుకున్న భావనకు ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టా యి. దీంతో తెలుగు, మలయాళం భాషల్లో దృష్టి సారించారు. అలాంటిది ఆ మధ్య విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశం వచ్చినా అందుకోలేక పోయిందట. దీని గురించి భావ న తెలుపుతూ విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అయితే ఆ సమయంలో మలయాళ చిత్రంలో నటించ డం వలన కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించడానికి అంగీకరించలేదని వివరించారు. అదే కాదు తన రీ ఎంట్రీకి చా లా తమిళ చిత్రాల అవకాశాలను నిరాకరిం చానని అవన్నీ సూపర్హిట్ అయ్యాయని అన్నారు. అయినా ఎలాంటి చింతా లేదని అయితే విజయ్ చిత్రానికి చేజార్చుకోవడమే కాస్త బాధగా ఉందని భావన అన్నారు. -
ఆ చిత్రంలో అతిథి నేనే
చిత్ర పరిశ్రమలో అంతు పట్టని ఒక పెద్ద ప్రశ్నార్థకం... ఇక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ..? ఎలా స్పందిస్తారో..? తెలియదు. కానీ, తనకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన నటి పాత్రల్లో నటించడానికి సంకోచిస్తారు. ఇంకా చెప్పాలంటే భయపడతారు కూడా. అలాగని అందర్నీ ఒకేలా జమకట్టలేం. నటి మల్లిక తమళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి మంచి గుర్తిం పు పొందారు. అలాంటి ఆమె నటిగా రాణించాలంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనాలో అనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించి పరిశ్రమలో కలకలం రేపారు. ఆమె ఇప్పుడు తెర వెనుక వెళ్లి సినిమాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు. తన అనుభవాలు ఏమోగానీ, సినిమా పరిశ్రమలో సహాయ నటీమణులు ఎదుర్కొనే సమస్యలను యథార్థంగా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్గా భావన నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వార్త చెవిన పడగానే, అయ్యయ్యో అంటూ భావన విస్మయంలో పడ్డారు. అయ్యయో...స్నేహం కోసం నటి మల్లిక కోరగా ఆమె దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానని భావన పేర్కొన్నారు. అయితే, ఆ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రం కాదు అని ఓ చిన్న అతిథి పాత్రను పోషించనున్నట్టు స్పష్టం చేశారు. తనను హీరోయిన్ పాత్రగా చిత్రీకరించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం తాను మలయాళంలో బిజీగా ఉన్నట్టు తెలిపారు. కాగా, పులి చిత్రంలో నటించమని చిత్ర యూనిట్ తనను అడిగారని, అయితే, తాను వారికి ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదని భావన పేర్కొన్నారు. -
ఆటోగ్రాఫ్ నటి మల్లిక గుర్తు ఉందా?
ఆటోగ్రాఫ్ నటి మల్లిక గుర్తు ఉందా? ఇటీవల సెక్స్ వేధింపులు అంటూ ప్రకటనలు చేసి కలకలం సృష్టించిన ఈ భామ ఇప్పటి వరకు తెర ముందు పలు అనుభవనాలను చవి చూశారు. ఆ అనుభవాలతో ఇకపై కెమెరా వెనుక కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టు కోలీవుడ్ సమాచారం. మల్లిక తమిళంలో ఆటోగ్రాఫ్, తిరుప్పాచ్చి తదితర చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా మలయాళంలో పలు చిత్రాలను చేసిన ఈమె తాజాగా, దర్శకత్వంపై మొగ్గు చూపుతున్నారు. ఆమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో భావన నటిస్తున్నట్టు తెలిసింది. మల్లిక, భావన గతంలో మలయాళ చిత్రంలో కలిసి నటించారు. ఆ పరిచయంతోనే మల్లిక దర్శకత్వంలో నటించేందుకు భావన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ చిత్ర కథ కథనాలను ప్రముఖ మలయాళ రచయిత తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు చిత్తిరం పేసుదడి, దీపావళి, తదితర చిత్రాల్లో నటించిన భావన ఆ తర్వాత ఆశించిన అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్, మాలీవుడ్లపై దృష్టి పెట్టారు. ఆమె కోలీవుడ్లో నటించిన చివరి చిత్రం అసల్. మల్లిక చిత్రంతో మరో సారి కోలీవుడ్లో పాగా వేయాలని భావన భావిస్టున్నట్టు సమాచారం. -
అలా చేస్తే చిరంజీవులవుతాం!
మనం ఏం సాధించాం? అందుకు గుర్తుగా ఏం వదలి వెళ్తున్నామన్నది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఈ లోకం విడిచి వెళ్తున్నప్పుడు మన అవయవాలు అవసరమైన వారికి దానం చేయడం ఓ మంచి పని. అందుకే నా పుట్టినరోజు (మార్చి, 13) సందర్భంగా అవయవ దాన పత్రాల మీద సంతకం పెట్టాను. నేనీ లోకంలో లేకపోయినా, ఈ దానం ద్వారా బతికే ఉంటాను. ఇక, నా పుట్టినరోజు విషయానికొస్తే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నాను. విందులు, వినోదాలు అస్సలు నచ్చదు. ఆ ఖర్చుతో ఇతరులకు సాయం చేయొచ్చన్నదే నా భావన. - పార్వతీ ఓమనకుట్టన్ (బిల్లా-2, మరియన్ తదితర తమిళ చిత్రాల కథానాయిక)