Bipasha Basu
-
బాధ్యత లేదుగానీ ఒంటి నిండా విషమే..: సింగర్పై బిపాసా ఫైర్
సింగర్ మికా సింగ్ (Mika Singh) బాలీవుడ్ జంట కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)- బిపాసా బసు వల్ల దాదాపు రూ.10 కోట్లమేర నష్టపోయానన్నాడు. చిత్రవిచిత్రమైన డిమాండ్లతోపాటు తనకు ఏమాత్రం సహకరించలేదని ఆగ్రహించాడు. ముఖ్యంగా బిపాసా చేసిన డ్రామా వల్ల ఇంకోసారి నిర్మాణరంగంలోకే అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తనను అంతలా టార్చర్ పెట్టారు కాబట్టే ఇండస్ట్రీలో లేకుండా పోయారని సెటైర్లు వేశాడు.తాజాగా ఈ విమర్శలపై బిపాసా బసు (Bipasha Basu) స్పందించింది. ఒంటినిండా విషం నింపుకున్న కొందరు ఎప్పుడూ గొడవలు సృష్టించడానికే ఇష్టపడుతుంటారు. అవతలివారిని వేలెత్తి చూపుతుంటారు, నిందలు మోపుతారు. బాధ్యతగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. ఇలాంటి నెగెటివిటీకి, ద్వేషభావజాలానికి దూరంగా ఉంటే మంచిది. ఆ దేవుడు అందరినీ ఆశీర్వదించుగాక అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మికా సింగ్ను ఉద్దేశించే బిపాసా ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.చదవండి: ధనుష్ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది: సింగర్
టాప్ సింగర్ మికా సింగ్ (Mika Singh) ఆ మధ్య నిర్మాతగా తన లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా డేంజరస్ అనే వెబ్ సిరీస్ నిర్మించాడు. కానీ ఆ సీరిస్ షూటింగ్లో కరణ్ సింగ్ గ్రోవర్- బిపాసా బసు (Bipasha Basu)ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, వారి డిమాండ్లు కాదనలేక, ఆ ఇద్దరి డ్రామా, యాటిట్యూడ్ చూడలేక తలపట్టుకున్నాడు. ఇంకోసారి నిర్మాణరంగంలోకే రాకూడదని శపథం చేసుకున్నాడు.రూ.4 కోట్లు అనుకుంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మికా సింగ్ మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ (కరణ్-బిపాసా) ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా? పైన దేవుడన్నీ చూస్తున్నాడు. నిజానికి కరణ్ అంటే నాకిష్టం. తనను హీరోగా పెట్టి రూ.4 కోట్లతో ఓ సినిమా తీయాలనుకున్నాను. హీరోయిన్గా ఎవరైనా కొత్తవారిని తీసుకుందామనుకున్నాను. కానీ కరణ్ భార్య, నటి బిపాసా బసు తనే చేస్తానని పట్టుపట్టింది. లండన్లో షూటింగ్ చేశాం. బడ్జెట్ రూ.4 కోట్ల నుంచి రూ.14 కోట్లకు ఎగబాకింది. మూడు చెరువుల నీళ్లు తాగించారుబిపాసా చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. అనవసరంగా నిర్మాణ రంగంలోకి వచ్చానేంట్రా దేవుడా అని ఎంతో బాధపడ్డాను. భార్యాభర్తలిద్దరూ ఓ కిస్ సీన్లో నటించాలన్నాను. ఆమె తిట్లదండకం అందుకుంది. అలాంటివి నేనెందుకు చేస్తా? చేయనుగాక చేయను అని రాద్ధాంతం చేసింది. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టినా వారి పారితోషికం మాత్రం ఆలస్యం చేయకుండా సమయానికి ఇచ్చేశాను. అయినా సరే డబ్బింగ్ చెప్పడానికి కూడా నాతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒకసారి బిపాసా తన గొంతు బాలేదంటుంది. మరోసారి కరణ్ తన ఆరోగ్యం బాగోలేదంటాడు. ఇలా ఇద్దరూ నాతో ఆడుకున్నారు అని చెప్పుకొచ్చాడు. వెండితెరపై కనిపించని బిపాసాకరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు 2015లో ఎలోన్ సినిమా షూటింగ్లో కలుసుకున్నారు. 2016లో పెళ్లి చేసుకోగా 2022లో వీరికి దేవి అనే కూతురు జన్మించింది. టక్కరిదొంగ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన బిపాసా బసు హిందీలో అనేక సినిమాలు చేసింది. పూర్తిస్థాయిలో నటించిన చివరి చిత్రం ఎలోన్. 2018లో వచ్చిన వెల్కమ్ టు న్యూయార్క్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనేలేదు. 2020లో డేంజరస్ వెబ్సిరీస్తో ఓటీటీలో మెరిసింది.చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
Christmas 2024: బిపాసా సెలబ్రేషన్స్,‘బుజ్జెమ్మ’ ఎంత బావుందో!
-
పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్లు ఆపాలి!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్బీ అమితాబ్ బచ్చన్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలోనే అమితాబ్కు వైరస్ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి. దక్షిణాది టీవీ నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు. మాస్క్లు తదితర రక్షణ కవచాలు లేకుండానే నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా.. సహా నటులకు కోవిడ్ పరీక్షలు) మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్, కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్లో ప్రకంపనలు రేపింది. దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్లో మరో విషాదం) కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే. View this post on Instagram All necessary precautions are being taken, SOPs being followed. For us at Balaji, Health & Safety comes first, above all else! Take care. Jai Mata Di.🙏🏻 #Repost @balajitelefilmslimited with @make_repost A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 12, 2020 at 4:50am PDT -
'షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?
లాక్డౌన్ కారణంగా సినీ ప్రముఖులు జిమ్లకు వెళ్లలేని పరిస్థితి. అయితేనేం? ఇంట్లో ఉంటూ కూడా వర్కవుట్స్ చేయవచ్చు అని నిరూపిస్తున్నారు. దీని కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఫిట్నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు. ఆ మధ్య రకుల్ప్రీత్సింగ్ టీషర్ట్ ఛాలెంజ్ విసరగా, తాజాగా షూ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. నటి బిపాషా బసు ఈ ఛాలెంజ్ని పూర్తిచేసింది. దీని ప్రకారం.. ఒక కాలిపై షూని ఉంచి అది పడిపోకుండా వర్కవుట్ చేయాలి. డీన్ పాండే విసిరిన ఈ ఛాలెంజ్ను ఎంతో ఈజీగా పూర్తిచేసేసింది బిపాసా. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ. "హేహే..నేను కూడా ట్రాక్లో ఉన్నాను, షూ ఛాలెంజ్" అంటూ క్యాప్షన్ జోడించారు. టాలీవుడ్లోనూ ఛాలెంజ్ల హవా నడుస్తోంది. దర్శకుడు సందీప్రెడ్డి వంగా ప్రారంభించిన 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సామాన్యుల్లాగా ఇంటి పనులు చేస్తూ అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్ను పూర్తిచేశారు. లాక్ఢౌన్ అయిపోయే లోపు ఇంకెన్ని కొత్త ఛాలెంజ్లు పుట్టుకొస్తాయో చూడాలి మరి. -
పీఎన్బీ స్కాం: ఇద్దరు టాప్ హీరోయిన్లు
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగా స్కాంకు సంబంధించిన వార్తల్లోకి తాజాగా బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్, బిపాసా వచ్చి చేరారు. ఇప్పటివరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు ఈ స్కాంలో మారు మోగితే.. ఇపుడు ఈ కోవలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, బ్యూటీ క్వీన్ బిపాసా నిలిచారు. రూ.11, 400 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్మోదీ మామ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ తమకు సొమ్ము ఎగ్గొట్టాడంటూ ఆరోపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. గీతాంజలి జెమ్స్ కంపెనీ ఒప్పందంలో భాగంగా తమ రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని, భారీ ఎత్తున బకాయి పడిందని కంగనా ఆరోపించారు.. గీతాంజలి బ్రాండ్ నక్షత్ర బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంగనా ఒప్పందం ప్రకారం పూర్తి సొమ్ము చెల్లించలేదని ఆరోపించారని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. 2016నుంచి ఈ బకాయిలు చెల్లించలేదని కంగనా తెలిపింది. కాగా కంగనాకంటే ముందు ఈ కంపెనీకి ఐశ్వర్య, కత్రినా కైఫ్ ప్రచారకర్తలుగా ఉన్నారు. మరోవైపు గీతాంజలికే చెందిన మరో బ్రాండ్ గిలికు అంబాసిడర్గా ఉన్న బిపాసా కూడా మెహుల్ చోక్సీపై ఆరోపణలు గుప్పించారు. 2008లో కాంట్రాక్టు ముగిసిన తరువాత తన ఫోటోలను వార్తాపత్రికల్లో వాడుకున్నారని బిపాసా ఆరోపించారు. ఈ విషయంలో తన మేనేజర్ కంపెనీని సంప్రదించినప్పటికి ప్రయెజనం లేదన్నారు. దీని మూలంగా అనేక జ్యుయలరీ ఎండార్స్మెంట్లను తాను కోల్పోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం గిలి బ్రాండ్కు క్రితి సనన్ ప్రచార కర్తగా ఉన్నారు. కాగా కుంభకోణం నేపథ్యంలో గత ఏడాది ప్రారంభంలో బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన ప్రియాంక చోప్రా నీరవ్మోదీ డైమండ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రియాకంతో పాటు ప్రకటనల్లో కనిపించిన మరో నటుడు సిద్దార్థ మల్హోత్రా కంపెనీతో తన కాంట్రాక్టు గత ఏడాదే ముగిసినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రెండు జీన్స్ కొంటే.. ఒక బొచ్చె ఫ్రీ!
ముంబై : తొంగ్ జీన్స్.. ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న నయా ట్రెండ్. టోక్యో ఫ్యాషన్ వీక్లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ వింత మోడల్ జీన్స్పై దేశదేశాల సెలబ్రిటీలు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు బిపాషా బసూ, మలైకా అరోరా, సీనియర్ నటుడు రిషీ కపూర్లు తమదైన శైలిలో చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. నేకెడ్ జీన్స్ : డెనిమ్ అంటే తనకెంతో ఇష్టమన్న బిపాషా.. ఫ్యాషన్ పేరుతో జీన్స్ పరువు తీయకండంటూ డిజైనర్లను వేడుకున్నారు. ‘ఇది చాలా బాధాకరం. అసలక్కడ ఏముంది? నెకెడ్ జీన్స్ కాకుంటే!’ అని ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారు. మరో నటి మలైకా అరోరా.. బిప్స్ కామెంట్లను సమర్థించారు. రెండు కొంటే ఒక బొచ్చె ఫ్రీ : సెటైరికల్ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే సీనియర్ యాక్టర్ రిషీ కపూర్ను సైతం తొంగ్ జీన్స్ స్పందించేలా చేశాయి. ‘‘ఇలాంటివి రెండు జీన్స్ కొంటే అడుక్కుతినడానికి ఒక బొచ్చె ఫ్రీ.. త్వరపడండి!’ అంటూ రిషీ చేసిన ట్వీట్ వేల సార్లు రీట్వీట్ అయింది. తొంగ్ జీన్స్ పేరుతో డిజైనర్ మెయికో బాన్ రూపొందించిన ఈ దుస్తులను ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్ ఫ్యాషన్ వీక్లో ప్రదర్శించారు. ఫస్ట్లుక్లోనే చూపరులకు కిరాక్ పుట్టించిన తొంగ్ జీన్స్.. అప్పటి నుంచీ వార్తల్లో ఉంటూవస్తోంది.. -
భర్తతో హీరోయిన్ హాట్ యోగాసనాలు!
బాలీవుడ్ దంపతులు బిపాషా బస్సు-కరణ్ సింగ్ గ్రోవర్కు ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువ. నిత్యంలో ప్రేమలో మునిగిపోయే ఈ జంట తాము ఫిట్నెస్ కోసం చేసే వర్కౌట్స్ను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. అంతర్జాతీయ మూడో యోగా దినోత్సవం సందర్భంగా బిపాషా-కరణ్ జంటగా కొన్ని ప్రత్యేక ఆసనాలు వేశారు. ఇద్దరూ కలిసి జోడీగా చేసిన ఈ ఆసనాలు ఫొటోలు ఒకింత హాట్గా, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. -
ఎండాకాలమ్... ఎంజాయ్ చేద్దామ్...
సమ్మర్ అనగానే భయపడేవారే గానీ ఇష్టపడేవారుంటారా? అంటే మేమున్నాంగా అంటున్నారీ స్టార్స్. సమ్మర్ సీజన్లో కొద్దిపాటి జీవనశైలి మార్పులు చేసుకుంటే చాలు... వేడి కాలానికి హాయిగా వీడ్కోలు చెప్పేయవచ్చు అంటున్నారు. ఎండా కాలాన్ని ఆరోగ్యకరంగా ఆనందించేందుకు ఉపకరించే తమ లైఫ్స్టైల్ ఛేంజెస్ను ఇలా వివరిస్తున్నారు. తలకు క్యాప్... గోవా ట్రిప్ వేసవి సీజన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తా. నా యాన్యువల్ బీచ్ హాలిడేస్ టైమ్ అదే. ఈ టైమ్లో గోవా నేను ఎంచుకునే అత్యంత ప్రధానమైన డెస్టినేషన్. సన్బ్లాక్, సమ్మర్లో ఫెడొరా/బ్యాండేనా (తలకు పెట్టుకునే క్యాప్/ బ్యాండ్) లేకుండా బయటకు అడుగుపెట్టను. డీ హైడ్రేషన్ రాకుండా గ్రీన్ జ్యూసెస్, మంచి నీళ్లు అధికంగా తీసుకుంటాను. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోను. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దానిమ్మ... బాగా తీసుకుంటాను. – బిపాసా బసు రోజ్ వాటర్స్ప్రే.. బ్రౌన్రైస్ ఈ సీజన్లో లూజ్ ట్రెండీ క్లోత్స్ హ్యాపీగా ధరించవచ్చు. సమ్మర్లో ఫ్యాషన్ అంటే లూజ్ క్లోత్స్, లినెన్, కాటన్ వంటి సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్స్, షార్ట్ డ్రెస్సులు, ఫ్లోయీ స్కర్ట్స్, ఎక్కువ వైట్ కలర్వి వార్డ్రోబ్ నుంచి బయటకు తీస్తాను. నుదుటి మీద హెయిర్ పడితే చాలా చికాకుగా ఉంటుందీ సీజన్లో. అందుకని బొహెమెయిన్ హెయిర్ బ్యాండ్/ హెడ్ గేర్ ధరిస్తాను. స్పైసీ, ఆయిలీ ఫుడ్ని పూర్తిగా దూరం పెడతాను. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు రోటీస్, బ్రౌన్ రైస్ వాడతాను. కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, కోల్డ్ వాటర్ మిలన్ సలాడ్ వంటివి తీసుకుంటాను. తరచుగా ముఖాన్ని శుభ్రమైన నీళ్లతో కడుగుతాను. అలోవెరా మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తాను. రోజ్వాటర్ స్ప్రే చేసుకుంటే ఓహ్... ఎంత రిఫ్రెషింగ్! నా బ్యాగ్లో స్కిన్వైప్స్ (చర్మాన్ని శుభ్రపరచుకునేవి) తప్పకుండా ఉంటాయి. – రియా చక్రవర్తి నాన్ స్పైసీ ఫుడ్... కాటన్ డ్రెస్ వింటే మరీ విపరీతంగా అనిపిస్తోందేమో కానీ నేను వేసవి కాలాన్ని బాగా ఆస్వాదిస్తాను. అవుట్ డోర్ షూటింగ్ ఉంటే మన మేకప్ సామాన్లు సర్దుకోవడం, విభిన్న రకాల దుస్తులు ధరించడం వగైరా చికాకులు ఉంటాయి. అదేమీ లేకపోతే మాత్రం సమస్య లేదు. మామూలుగానే నేను కాటన్ దుస్తులు ధరిస్తా కాబట్టి... ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ మార్చనక్కర్లేదు. అలాగే ఎప్పుడూ తక్కువ ఆయిల్, నాన్ స్పైసీ డైట్ మాత్రమే తీసుకుంటాను. సో... డైట్ కూడా మార్చే అవసరం లేదు. అయితే ఎప్పటికన్నా ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటాను. అలాగే మంచినీరు క్వాంటిటీ పెంచుతాను. – కత్రినాకైఫ్ సలాడ్... హోమ్ ఫుడ్ ఎస్! హాట్ హాట్ సమ్మర్ని ఎంజాయ్ చేయాలంటే కూల్ కూల్ మార్పులు చేసుకుంటే సరి. నేనైతే ఈ సీజన్లో లేవగానే బొప్పాయి పండును నిమ్మరసం పిండుకుని తింటాను. దాంతోపాటే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగుతాను. ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ఆహారంలో చిరుధాన్యాలు, కూరగాయల వాడకం పెంచుతాను. మామూలుగా అయితే రోజూ వర్కవుట్ చేస్తా. కాని ఈ సీజన్లో పిలాటిస్, డ్యాన్స్ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడూ వాటర్ సిప్పర్ నాతోనే ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా తేలికపాటి దుస్తులు లేదా వైట్ షర్ట్, జీన్స్నే ధరిస్తాను. – జాక్వెలిన్ ఫెర్నాండెజ్ -
నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు త్వరలోనే తల్లి కాబోతోంది అంటూ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం ఆ నోట, ఈ నోట బిపాషా వరకు కూడా వెళ్లింది. కరణ్ సింగ్ గ్రోవర్ను పెళ్లి చేసుకున్న బిపాషా.. ఈ వార్తలను గట్టిగా ఖండించింది. ఈ విషయమై ఆమె వరుసపెట్టి మూడు ట్వీట్లు చేసింది. తాను గర్భవతిని అవ్వాలని చాలామందికి చాలా ఆత్రుతగా ఉందని, వాళ్ల ఆశాభావం బాగానే ఉంది గానీ, తనకు చికాకు కలిగిస్తోందని చెప్పింది. తాను గర్భం దాల్చాలని తొందర పడుతున్న వాళ్లను నిరాశ పర్చుతున్నందుకు సారీ అని తెలిపింది. ప్రస్తుతానికి తాము పిల్లలను కనాలని ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదని, ఒకవేళ అనుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తాము తమ శ్రేయోభిలాషులతో కూడా తప్పకుండా పంచుకుంటామని చెప్పింది. అయితే ప్రతిసారీ తాను గర్భవతిని అవుతున్నానంటూ గెస్ చేయడం మాత్రం సరికాదని, తాను బాగా ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి ఏమైనా ఉంటే చెప్పేస్తానని అంది. అందువల్ల ఈ విషయమై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని చెబుతూ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేసింది. The curiosity about me being pregnant...is sweet and a tad annoying. I am sorry to disappoint the ppl who are so eager for this to happen. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 We are not planning to have a baby right now.When we do plan..it will be joyous news which we will share with our well wishers then. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 The constant guessing game is tiring..as am more than straightforward person.So pls do not believe anything that gets written.Thank you all. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 -
సిమ్ కార్డులను విసిరికొట్టిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించిందని ఫ్యాషన్ షో నిర్వాహకులు ఆరోపించారు. ముందుగా తమ దగ్గర డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో షోలో పాల్గొనకుండా డుమ్మా కొట్టిందని వాపోయారు. ఇండియా పాకిస్తాన్ లండన్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు తమకు ఎన్నో షరతులు పెట్టినా ఒప్పుకున్నామని చివరకు బిపాసా గైర్హాజరైందని షో నిర్వాహకులు రోణిత శర్మ రేఖీ వాపోయారు. 'బిపాసా తనతో పాటు భర్త కరణ్ ను లండన్ తీసుకురావాలని కోరడంతో ఒప్పుకున్నాం. అంతేకాదు లండన్ లో ఉండేందుకు మేఫెయిర్ హోటల్ లో ఆమెకు గదులు కూడా బుక్ చేశాం. అయితే షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు ఉండడంతో మరో ఫైవ్ స్టార్ హోటల్ లో గదులు బుక్ చేయాల్సి వచ్చింది. ఆమెకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశాం. బిపాసాకు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. లండన్ లో దిగిన వెంటనే రెండు లోకల్ సిమ్ కార్డులు అందజేశాం. వాటిలో ఐదు పౌండ్లు మాత్రమే రీచార్జి ఉందన్న కారణంతో సిమ్ కార్డులను మా ముఖంపై విసిరికొట్టింది. మా చుట్టూ 20 మంది ఇదంతా చూశారు. మేము ఇవన్నీ మర్చిపోయి షోకు రావాలని ఆమెను బతిమాలినా వినిపించుకోలేదు. ర్యాంప్ నడిచేందుకు ససేమీరా అంది. ఆమె కారణంగా నిర్వాహకులకు 7800 పౌండ్ల నష్టం వాటిల్లింది. దీంతో పాటు ప్రయాణ ఖర్చులకు నగదు రూపంలో ఎయిర్ పోర్టులో ఆమెకు ఇచ్చాం. ఈ డబ్బును హనీమూన్ మనీగా వాడేసుకుంది. మాకు అన్నివిధాలా నష్టం కలిగించిన బిపాసాపై పోరాడతామ'ని రోణిత వాపోయారు. ఈ ఆరోపణలను బిపాసా తోసిపుచ్చారు. 15 ఏళ్ల తన కెరీర్ లో ఎప్పుడూ అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించలేదని వివరణయిచ్చింది. -
జాన్ హ్యాండ్సమ్
→ జాన్ అబ్రహం రాత్రి తొమ్మిదింటికి నిద్రపోతాడు. ఉదయం నాలుగు Výæంటలకి లేచి ఎక్సర్సైజులు చేస్తాడు. → జాన్కు తల్లి మీద అభిమానం ఎక్కువ. అనుక్షణం ఆమె తన వెంట ఉండాలని కోరుకుంటాడు. → జాన్ ప్రతి 2 గంటలకు ఒకసారి భోజనం చేస్తాడు. ‘మద్రాస్ కెఫె’ చిత్రం కోసం కేరళలో షూటింగ్లో ఉండగా బ్రేక్ఫాస్ట్లో 26 ఆప్పవ్ులు తినేసేవాడు. ఏ క్షణమైనా సరే రెండు కిలోల కాజూ బర్ఫీ ఒక్క దమ్మున తినేయగలడు. → జాన్ అంటే సల్మాన్ఖాన్కు ఎందుకనో సదభిప్రాయం లేదు. → జాన్ ఆల్కహాల్ ముట్టడు. డ్రగ్స్ వాడడు. మాంసాహారం కూడా అప్పుడప్పుడే. → జాన్ ‘పెటా’ సభ్యుడు. మూగజీవాలపై హింసను వ్యతిరేకిస్తాడు. జాన్ అబ్రహం సెట్కు రాగానే సాధారణంగా ప్రతి డైరెక్టర్ అరిచే అరుపు– ‘జాన్... ముందు ఆ చొక్కా విప్పి పడేయ్’... ఎస్. జాన్ చొక్కా విప్పేయాలి. కండలు చూపించాలి. నలుగురిని చావబాదాలి. ప్యాకప్ చెప్పి వెళ్లిపోవాలి. ‘ఒరి వెధవా. నాక్కూడా బుర్రుందిరా. చదువుంది. జ్ఞానం ఉంది. విషయ పరిజ్ఞానం ఉంది. నన్నొక మనిషిగా చూడవా నువ్వూ.’ 1991 మే 21న రాజీవ్గాంధీ హత్య జరిగింది. అందుకు కారకులెవరో తేల్చడానికి ఆ తర్వాత జస్టిస్ జైన్ ఆధ్వర్యంలో కమిషన్ నియుక్తమైంది. కమిషన్ విచారణ చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత 3000 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. దానిని ఎంతమంది చదివారో లేదో కానీ జాన్ అబ్రహం చదివాడు. రాజీవ్ గాంధీ మరణం ఒక సాధారణ మరణం కాదు. దేశాన్ని మలుపు తిప్పిన మరణం. దీనిని వార్తా పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. కాని పాపులర్ మీడియా అయిన సినిమాలో కూడా ఈ ఉదంతం రికార్డ్ చేయాలి. దీనిని సినిమాగా తీయాలి. జైన్ కమిషన్ ఆధారంగా జాన్ అబ్రహం ఈ సినిమా తీయాలనుకున్నాడు. తనే హీరోగా అంటే సినిమాలో విచారణ అధికారిగా నటించాలనుకున్నాడు. స్క్రిప్ట్ తయారైంది. స్టూడియోలకు ఎక్కే గడప దిగే గడపగా తిరగడం మొదలుపెట్టాడు. ‘ఇదేం స్క్రిప్ట్’ అని ఒకరు, ‘ఇందులో మసాలా ఏముంది’ అని ఒకరు, ‘ఇందులో నువ్వు చొక్కా విప్పవు కదా ఏం ఆడుతుంది’ అని ఇంకొకరు, ‘చివరలో నువ్వు చచ్చిపోతావా? అయితే వేస్ట్’ అని మరొకరు – ఇలా జాన్ను ఛీ కొట్టారు. జాన్ మాత్రం ఆ సినిమా తీయాలని పట్టుబట్టాడు. చివరకు తీశాడు. ‘మద్రాస్ కెఫే’. జాన్ను నిర్మాతగానే కాదు బుర్రున్న ఒక మనిషిగా, నటుడిగా కూడా ఈ సినిమా నిలబెట్టింది. అరె.. జాన్ పుట్టింది కేవలం చొక్కా విప్పడానికి కాదా అని ఒకరిద్దరు పాత డైరెక్టర్లు ఆశ్చర్యపోయారు. దీనికి ముందు కూడా జాన్కు బుర్ర ఉందని నిరూపితం అయ్యింది. ఒక కథ. ఏమిటంటే ఒక కుర్రాడు తన వీర్యాన్ని అమ్ముతూ ఉంటాడు. దాని వల్ల నిజ జీవితంలో సమాజ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు అనేది చూపించాలి. దీనిని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అసలు వీర్యం అనే మాటను సినిమాలో ఎలా పలకడం. కాని జాన్ అబ్రహం ధైర్యం చేశాడు. తానే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చాడు. సినిమా తయారైంది. పేరు– ‘విక్కీ డోనర్’. చిల్లర డబ్బుతో తీసిన ఆ సినిమా కోట్లు సంపాదించింది. ఇటీవల తెలుగులో ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ కూడా అయ్యింది. జాన్ మీద తండ్రి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన మలయాళీ. ముంబయ్లో ఆర్కిటెక్ట్గా చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. అక్కడే ఒక జొరాష్ట్రియన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. జాన్ పెద్ద కొడుకు. తల్లి అతడికి ఫర్హాన్ అనే పేరు పెట్టుకుంది. తండ్రి జాన్ అని పెట్టుకున్నాడు. చివరకు జాన్ అబ్రహంగా స్థిరపడింది. చిన్నప్పుడు జాన్ క్లాస్లో బుద్ధిగా చదువుకునేవాడు. చూట్టానికి బాగుండేవాడు. కాని కాలేజీ వయసుకు వచ్చేసరికి ముఖమంతా మొటిమలే. వాటిని వదిలించుకోలేక సిగ్గుపడేవాడు. అద్దం చూసుకోవడానికే భయం. కానీ తెర మీద ఎలా చూసుకోగలిగాడు? ఒకసారి ఒక సినిమా వచ్చింది. హాలీవుడ్ సినిమా. అందులో హీరో యమాగా ఉన్నాడు. తీర్చిదిద్దిన కండలతో ఉన్నాడు. మనిషి కూడా గొప్ప అందగాడు. రాకెట్ లాంచర్ పేల్చాడంటే విలన్ డెన్ తుక్కు తుక్కు కావాల్సిందే. జాన్ కాలేజీ చదువుతుండగా ఆ సినిమా వచ్చింది. వెళ్లి థియేటర్లో చూశాడు. చూశాక ఏమనిపించిందంటే ఇప్పటికిప్పుడు ఆ హీరోలా తయారవ్వాలని. హాలు నుంచి బయటకు వస్తే అరటిపండ్ల బండి కనిపించింది. వెంటనే వెళ్లి ఒక డజను పండ్లు తినేశాడు. అరటి పండ్లు తింటే కండలొస్తాయి మరి. కండలు రాలేదు కాని మనసులో హీరో కావాలనే కోరిక మాత్రం పుట్టింది. ఆ తర్వాత నిజంగానే హీరో అయ్యాడు. అందుకు అతడు ఆ హాలీవుడ్ హీరోకు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. అతడి పేరు – సిల్వర్స్టర్ స్టాలెన్. జాన్ది తండ్రి పోలిక. చూడటానికి చక్కగా ఉంటాడు. ఫొటోలకు సరిపడినట్టుగా ఆ ముక్కు ఉంటుంది. ‘గ్లాడరాక్స్’ అనే మేగజీన్ ఏదో కుర్రాళ్ల పోటీ పెడితే అందులో జాన్ పాల్గొన్నాడు. ఫొటోలు బయటికొచ్చాయి. ఒక ఏజెన్సీ వాళ్లు చూసి ‘లెవీ జీన్స్’ కోసం పేపర్ యాడ్ చేయమంటే చేశాడు. పెద్ద హిట్. ఆ తర్వాత అలాంటివే చాలా యాడ్స్ వచ్చాయి. ఫ్యాషన్ షోస్... ర్యాంప్ వాక్స్. అయితే ఏ వృత్తిలో అయినా ఆ వృత్తికి సంబంధించిన చీకాకులు ఉంటాయి. ఒకసారి ఢిల్లీలో ర్యాంప్ వాక్ ఉందని కబురు చేశారు. మరో మోడల్ డినో మోరియాతో కలిసి వెళ్లాడు. ర్యాంప్ వాక్కు సిద్ధమయ్యాక తెలిసింది అదో అండర్ వేర్ కంపెనీకి సంబంధించిన వాక్ అనీ... అండర్ వేర్ ధరించి అందరి ముందు నడవాలనీ. సిగ్గుతో చచ్చి సున్నమయ్యాడు. అయితే అలా నడిచినా సరే... అతడు గ్రీకు శిల్పంలా ఉన్నాడని మార్కులు పడ్డాయి. హాలీవుడ్లో ఆల్రెడీ ఒక కండల వీరుడు ఉన్నాడు.... సల్మాన్ ఖాన్. మరో యాక్షన్ హీరో ఉన్నాడు.... అక్షయ్ కుమార్. రొమాంటిక్ హీరోలు... షారుఖ్, ఆమిర్ ఉన్నారు. జాన్ లాంటి కొత్త హీరోలకు చోటు లేదు. కాని తను హీరో కావాలనుకున్నాడు. ఎలా? ఇండస్ట్రీలో ఏ అండా లేని వారికి భట్ కుటుంబమే అండ. మహేశ్ భట్, అతని కుమార్తె పూజా భట్ కలిసి నిర్మిస్తున్న సినిమా– ‘జిస్మ్’ (2003)లో ఛాన్స్ వచ్చింది. ఆడవాళ్లంటే పడి చచ్చే ఒక తిరుగుబోతు పాత్ర అది. ఒక వివాహితతో సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకొనే పాత్ర. ఆ పాత్ర హిట్ అయ్యింది. అందులోని ‘జాదూ హై నషా హై’... పాట కూడా. అయితే ఆ వెంటనే వచ్చిన అవకాశాలు పెద్దగా లాభించలేదు. లాభం ఏదైనా ఉంటే అది బిపాషా బసూయే. ఆమె ‘జిస్మ్’ హీరోయిన్. అప్పుడే అయిన తాజా పరిచయం. జాన్ అబ్రహంను, బిపాషా బసును ఇండస్ట్రీలో ‘సూపర్ కపుల్’ అని పిలిచేవారు. వారి అనుబంధం, ‘లివ్ ఇన్ రిలేషన్’ ఇవాళ ఉండి, రేపు పోయేది కాదు. దాదాపు 8 సంవత్సరాలు కొనసాగింది. ‘ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇక మీదట కూడా కలిసే ఉంటాం. మేం విడిపోయే సమస్యే లేదు’ అని బిపాష ఒక సందర్భంలో అంది. కాని ఆమె నమ్మకం తప్పని తేలింది. 2011లో వాళ్లిద్దరూ విడిపోయారు. ఇండస్ట్రీలో పెద్ద గోల అయ్యింది. ఎందుకు ఎందుకు... అని అందరూ ఆరా తీశారు. కాని జాన్ అబ్రహం నోరు మెదపలేదు. తన జీవితంలో 8 ఏళ్ల పాటు కలిసి జీవించిన జీవితాన్ని ఇచ్చిన స్త్రీని గౌరవించాలని అతనికి తెలుసు. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఇప్పటికీ. ఎక్కడా. ఆమె కూడా సంయమనం పాటించింది. చాలా మర్యాదకరంగా వారిరువురూ విడిపోయారు. ఆ తర్వాత జాన్ ఫైనాన్స్ అనలిస్ట్ అయిన ప్రియా రుచల్ను (2014)లో, బిపాషా టీవీ నటుడైన కరణ్ సింగ్ గ్రోవర్ (2016)ను వివాహం చేసుకున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్కు ఇదివరకే రెండు సార్లు పెళ్లయ్యిందనేది కేవలం అదనపు సమాచారం. జాన్ అబ్రహంకు బైక్ అంటే తెగ పిచ్చి. మన ఇళ్లల్లో బైక్స్ ఎప్పుడైనా గమనించారా? 100 సిసి, 125 సిసి ఇలా ఉంటాయి. జాన్ దగ్గర ఉన్న బైక్ కేవలం 1700 సిసి మాత్రమే. అలాంటి బైక్ తీసుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టని సమయంలో రాత్రి పూట అతడు చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఇలాంటి బైక్ పిచ్చే అతడికి యశ్చోప్రా ‘ధూమ్’లో అవకాశం ఇచ్చింది. ఆ సినిమా కలెక్షన్లలో దుమ్ము రేపింది. రాత్రికి రాత్రి జాన్ పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియదర్శన్ దర్వకత్వంలో వచ్చిన ‘గరం మసాలా’ (2005), నానా పటేకర్తో నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) జాన్ను బాలీవుడ్లో స్థిరమైన హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘దోస్తానా’ (2008) జాన్ను కథకు అనుగుణమైన పాత్రలు వేసే హీరో ఇమేజ్ వచ్చింది. దోస్తానాలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్ తమ పొట్ట కూటి కోసం ‘గే’ అవతారాలెత్తి నవ్వులు పండిస్తారు. పురుషుల కండల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి కరణ్ జోహార్ ఈ సినిమాలో జాన్ను అరమరికలు లేకుండా చూపించి, అభిమానులకు కనువిందు చేయించాడు. 2016లో జాన్ అబ్రహంవి 3 సినిమాలు వచ్చాయి. ‘రాకీ హ్యాండ్సమ్’, ‘డిషూమ్’, ‘ఫోర్స్ టు’. మొదటిది ఒక మోస్తరుగా ఆడినా మిగిలిన రెండు పెద్ద హిట్టయ్యాయి. ఇంకా చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. హీరోగా, నిర్మాతగా, ఫుట్బాల్ టీమ్ యజమానిగా జాన్ చాలా పనుల్లో ఉన్నాడు. సినిమా అతడి జీవితంలో ఒక భాగం మాత్రమే. మనిషిగా బాధ్యత గల పౌరుడిగా ఉండటమే ముఖ్యమని అతడు భావిస్తాడు. జాన్ డిఫరెంట్. ఆ సంగతి కాలం గడిచే కొద్దీ అందరికీ అర్థమైంది. మిగిలిన హీరోల్లా అవార్డు ఫంక్షన్లకు వెళ్లడు. పార్టీలకు వెళ్లడు. డబ్బున్న వాళ్ల పెళ్లిళ్లకు వెళ్లి చిల్లర కోసం డాన్సులు చేయడు. పెద్దగా కాంట్రవర్సీల్లో ఇరుక్కోడు. తను.. తన పని.. అంతే. ఒకప్పుడు జాన్ వచ్చిన వెంటనే డైరెక్టర్ ‘జాన్... చొక్కా విప్పెయ్’ అనేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ వెండితెరకు కొత్త సంస్కారాన్ని కుట్టే పాత్ర కోసం జాన్ను ఎంచుకుంటున్నారు.జాన్– ఇప్పుడు ఒక రెస్పెక్టబుల్ హీరో.రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. రెస్పెక్ట్ ఊరికనే మాత్రం రాదు. – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
కోడిగుడ్ల కోసం అప్పు చేశా: హీరోయిన్
పెద్ద నోట్లు రద్దు చేయడంతో సామాన్యుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కష్టాలంటే ఏంటో ఒక్కసారిగా తెలిసొచ్చాయి. సాధారణంగా పది రూపాయల నోట్లతో అవసరం కూడా పడని సినిమా హీరోయిన్లకు.. 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు అనేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుది కూడా ఇదే పరిస్థితి. ఆమె కోడిగుడ్లు వండుకోవాలని అనుకుంది. కానీ ఇంట్లో గుడ్లు లేవు. పోనీ తెప్పించుకుందాం అని చూస్తే.. తన దగ్గర వెయ్యి, 500 తప్ప వేరే నోట్లు ఏమీ లేవు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో తాను అప్పు చేసినట్లు బిపాషా బసు ట్వీట్ చేసింది. స్టార్వరల్డ్ రాకీ వద్ద నుంచి తాను డబ్బులు అప్పు తీసుకున్నట్లు చెప్పింది. ఎలాంటి రోజు వచ్చింది దేవుడా అంటూ బాధపడింది. మరోవైపు.. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్నట్లు కూడా ఆమె చెప్పింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి అత్తవారింటికి ఢిల్లీ వెళ్లడంతో.. అక్కడి కాలుష్యం బారిన పడి గొంతునొప్పి తెచ్చుకుంది. తిరిగి ముంబై చేరుకునేసరికి తనకు భరించలేని గొంతునొప్పి వచ్చిందని తెలిపింది. ఢిల్లీలో బయటి పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్పిందీ భామ. Just borrowed money from @RockyStarWorld to buy eggs what a day! — Bipasha Basu (@bipsluvurself) 9 November 2016 Help! #delhismog ! Came back from Delhi with a horrible throat pain! It's really scary the… https://t.co/QVvjJFfGB7 — Bipasha Basu (@bipsluvurself) 8 November 2016 -
'ఇవ్వకుండానే ఇచ్చారంటే ఎలా'
బాలీవుడ్ డస్కీ బ్యూటి బిపాషా బసు మరోసారి మీడియాపై ఫైర్ అయ్యింది. బిప్స్ పెళ్లి మొదలు...ఏదో ఒక సందర్భంలో మీడియాలో వస్తున్న వార్తలు, ఈ హాట్ బ్యూటీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ల పెళ్లి సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించిన బ్లాక్ బ్యూటీ ఈ మధ్య కాలంలో తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇలాంటి గిఫ్ట్ ఎవరిచ్చినా తాను తీసుకోనంటూ తేల్చి చెప్పింది. గిఫ్ట్ ఇవ్వకుండా ఇచ్చారంటూ ప్రచారం చేస్తే ఎలా అంటూ సీరియస్ అయ్యింది. మరి బిపాషా స్టేట్ మెంట్తో అయినా ఈ రూమర్స్కు తెరపడుతుందేమో చూడాలి. This is the biggest hogwash that I have ever read. Why would I take a gift like this ever from anyone?!?? https://t.co/Et1ccoNeUE — Bipasha Basu (@bipsluvurself) 16 June 2016 -
ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు..
ముంబయి: ఇటీవల పెళ్లి చేసుకున్నారన్న వార్తలతో బాలీవుడ్ జోడీ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఏప్రిల్ 30న బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారు కొన్ని రోజుల పాటు హనీమూన్ కు వెళ్లి, అక్కడ దిగిన ఫొటోలను నెట్ లో పెట్టి అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాపులర్ కామెడీ ఈవెంట్ 'ద కపిల్ శర్మ షో' లో నూతన దంపతులు పాల్గొన్నారు. అయితే బిపాసకు సగటు భార్య చేసే పనులు ఏవైనా తెలుసా.. లేదా అని ఆడియన్స్ ఆమెకు పరీక్ష పెట్టారు. వారితో పాటు భర్త కరణ్ కూడా ఆమెను కాస్త ఆటపట్టించాడు. ఇంట్లో ఏమేం పనులు చేస్తారని అభిమానులు అడగగా వాటికి సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీ భర్త షర్ట్ కు ఎప్పుడైనా బటన్ కుట్టారా అని మరో ప్రశ్న సంధించారు. తన భర్తకే కాదు ఎవరి డ్రెస్ కు బటన్స్ కుట్టను. ఎందుకంటే స్టిచింద్ వర్క్ రాదని అసలు విషయాన్ని చెప్పింది. అభిమానుల ఇచ్చిన ఉత్సాహంతో బిపాసను కరణ్ కూడా టెస్ట్ చేశాడు. టై కట్టమని ఆర్డర్ వేయగా, బిపాస మొత్తానికి భర్తకు టై అడ్జస్ట్ చేసింది. భార్య టై కడుతున్నప్పుడు దర్జాగా హోదాలో ఉన్నట్లుగా ఫీలవుతూ కరణ్ కాసేపు నవ్వుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, భర్త బిపాసకు పరీక్ష పెట్టినట్లయింది. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఓ స్క్రీన్ మీద కనిపించడం ఇదే తొలిసారి. -
హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు
ముంబై: 'దిల్ వాలే' నటనకు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 2016 ఘంటా అవార్డుల్లో వరస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చెత్త సినిమాగా నిలిచింది. ఏడాది కాలంలో బాలీవుడ్ లో విడుదలైన వాటిలో చెత్తవాటికి ఘంటా అవార్డులు ఇస్తుంటారు. సూరజ్ బరజాత్య దర్శకత్వం వహించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' అత్యధిక చెత్త అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాలో నటించిన సోనమ్ కపూర్ చెత్త నటిగా ఎంపికైంది. టైటిల్ ట్రాక్ కూడా వరస్ట్ సాంగ్ గా నిలిచింది. సల్మాన్ సోదరుడిగా నటించిన నితిన్ ముఖేశ్ చెత్త సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. షాహిద్ కపూర్-అలియా భట్ సినిమా 'షాందార్'ను తెరకెక్కించిన వికాస్ బహల్ చెత్త దర్శకుడిగా ఎంపికయ్యాడు. సూరజ్ పంచోలి కొత్తగా పరిచయమైన చెత్త నటుడిగా నిలిచాడు. 'బాంబే వెల్వెట్' లో కరణ్ జోహార్ విలన్ గా నటించడాన్ని వరస్ట్ మిస్ కాస్టింగ్ గా తేల్చారు. 'అలోన్' డ్యుయల్ రోల్ చేసిన బిపాసా బసు వరస్ట్ కఫుల్ అవార్డు దక్కించుకుంది. -
హనీమూన్: రాళ్లలో, ఇసుకల్లో..
'రాళ్లలో ఇసకల్లో రాసాము ఇద్దరిపేర్లు.. కళ్ళు మూసి తిన్నగ కలిపి చదువుకో ఒక్కసారి' అని జాలీగా పడుకుంటూ హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది బిపాసా బస్సు, కరణ్ సింగ్ గ్రోవర్ జంట. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట మాల్దీవుల్లో ప్రస్తుతం హనీమూన్లో చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సముద్రం కెరటాల్లో, ఇసుక తిన్నెల్లో, సంధ్యసాయంత్రాల్లో హాయిహాయిగా గడిచిపోతున్న తమ హనీమూన్ గురించి ఎప్పటికప్పుడు ఈ కొత్త జంట సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తోంది. ఆ ఫొటోలనూ పంచుకుంటోంది. వారి డ్రీమీ ఫొటోలు అభిమానుల్ని కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ జంట ఇసుకలో రాళ్లతో తమ పేరు రాసుకొని మురిసిపోయింది. నీలిసముద్ర తీరంలో తెల్లని గులకరాళ్లతో 'మంకీ లవ్ <3' అని రాసి ఆ వీడియోను తాజాగా బిపాసా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇంతకు మంకీ అంటే తెలియదా? 'మంకీలవ్' హ్యాష్ట్యాగ్తోనే తమ పెళ్లిఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మంకీ' అనేది ఈ జంట నిక్నేమ్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో బిపాసా అందమైన హనీమూన్ ఫొటోలను, హాట్ బికినీ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
'హనీమూన్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటా'
హనీమూన్ ఎలా చేసుకుంటే మీకెందుకని కొత్త పెళ్లి కూతురు బిపాసా బసు రుసరుసలాడుతోంది. ఎవరి లైఫ్ తో వాళ్లు సంతోషంగా ఉంటే మంచిది సలహా కూడా ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే... భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బిపాసా హనీమూన్ కు వెళ్లింది. అక్కడితో ఆగకుండా మేమంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో చూడంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిపై నెగెటివ్ కామెంట్లు రావడంతో కొత్త పెళ్లి కూతురికి కోపం వచ్చింది. తమ ఫొటోలపై కొంతమంది చేసిన కామెంట్లు హాస్యాస్పదంగా ఉన్నాయని ఈ బెంగాలీ బ్యూటీ మండిపడింది. 'ఇలాంటి కామెంట్లు చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తారో తెలియదు. నేను పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్యూటీఫుల్ టవల్ ఆర్ట్ ను ఎందుకు గుర్తించరు. హౌస్ కీపింగ్ ప్రతిభకు టవల్ ఆర్ట్ అద్దం పడుతోంది. ఏదీ మారాలి. నాకు పెళ్లైంది కాబట్టి టవల్ ఆర్ట్ ను ఇష్టపడకూడదా? ఇది హాస్యాస్పదం. ఇతరుల జీవితాల్లో తప్పులు వెదికొద్దు. మీ జీవితంతో మీరు సంతోషంగా ఉండండి. మరిన్ని టవల్ ఆర్ట్ ఫొటోలు పోస్టు చేస్తా. ఎందుకంటే ఐ లవ్ ఇట్. ఇలాంటి ప్రతిభను అభినందించే వాళ్లు చాలా మంది ఉన్నారని భావిస్తున్నానని' బిపాసా క్లాస్ పీకింది. -
హనీమూన్: నా భార్య దేవత అంటున్న హీరో
'నా భార్య దేవత' అంటూ బాలీవుడ్ నటి బిపాషా బస్సును ఆమె భర్త కరణ్సింగ్ గ్రోవర్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ కొత్తజంట ఇప్పుడు హనీమూన్లో మునిగితేలుతోంది. అందమైన సముద్రతీరమైన మాల్దీవుల్లో తమ వైవాహిక జీవితపు తొలినాళ్లను ఎంజాయ్ చేస్తున్నది. సముద్ర ఒడ్డున ఇసుకలో తమ హనీమూన్ సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నది ఈ జంట. తాజాగా కరణ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భార్య బిపాషా ఫొటోను పెట్టి.. 'నా భార్య దేవత. నేను అదృష్టవంతుడిని కాక మరేమిటి' అంటూ కామెంట్ పెట్టాడు. దీనిని రీపోస్టు చేసిన బిపాషా.. 'థాంక్యూ హాటీ.. బోథ్ గాట్ లక్కీ' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అందమైన సముద్రం ఒడ్డున హనీమూన్లో సేదదీరుతున్న ఈ జంట తమ అనుభూతులకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పడు అభిమనులతో పంచుకుంటున్నారు. -
ఇక ఎలోన్ కాదు
శుభముహూర్తంలో చేసే పనులన్నీ శుభంగా జరుగుతాయంటారు. బహుశా బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి అంగీకరించిన ముహూర్తం బాగుండి ఉంటుంది. ఎందుకంటే ఇక ఎప్పటికీ వాళ్లు ఎలోన్ కాదు. జాన్ అబ్రహాంతో సహజీవనం చేసి, విడిపోయాక బిపాసా ఒంటరి జీవితం గడిపారు. మొదటి భార్య శ్రద్ధా నిగమ్ నుంచి విడిపోయి, జెన్నిఫర్ వింగెట్ను పెళ్లి చేసుకుని, ఆమె నుంచి విడాకులు తీసుకుని కరణ్ కూడా ఎలోన్గా మిగిలిపోయారు. ఈ ఒంటరితనమే బిపాసా, కరణ్లను దగ్గర చేసి ఉంటుంది. త్వరగానే ప్రేమలో పడ్డారు. అంతే త్వరగా విడిపోతారని చాలామంది ఊహించారు. కానీ, తమ బంధం చాలా గట్టిదని నిరూపిస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముంబైలో వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట రిసెప్షన్కి మాత్రం అందర్నీ ఆహ్వానించారు. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్, సుస్మితాసేన్, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రా, జెనీలియా, ఆమె భర్త రితేష్, మాధవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నట్లు.. బిపాసా బసు తెలుగులో ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. -
నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్
ముంబై: నవ దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసులకు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కరణ్-బిపాసా శనివారం సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ కు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు సినిమా తారలు హాజరయ్యారు. రిసెప్షన్ కు వెళ్లలేకపోయిన వారు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు. ప్రియాంక చోప్రా: కంగ్రాట్యులేషన్స్ బిపాసా-కరణ్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. మీకు వివాహ శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసుండాలని ఆకాంక్షిస్తున్నాను. అభిషేక్ బచ్చన్: బిపాసా-కరణ్ లకు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఒక్కటవడం ఆనందదాయకం. వివాహితుల క్లబ్ లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నా. శిల్పాషెట్టి: పరస్పర విశ్వాసం, ప్రేమ, స్నేహం, సెలబ్రేషన్ తో బిపాసా-కరణ్ వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా. మధు బండార్కర్, షమితా షెట్టి, ఫరాఖాన్, విశాల్ పాండ్యా, రమేశ్ తౌరణి తదితరులు బిపాసా-కరణ్ దంపతులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
మాజీ భర్తకు పెళ్లి విషెష్ చెప్పిన నటి
తన మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లిపై బాలీవుడ్ నటి జెన్నిఫర్ వింగెట్ మౌనం వీడింది. హారర్ క్వీన్ బిపాసా బసును పెళ్లాడబోతున్న కరణ్ కు ఆమె విషెస్ చెప్పింది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించింది. బిపాసా, కరణ్ శనివారం(ఏప్రిల్ 30) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపింది. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపాసా-కరణ్ పెళ్లి గురించి జెన్నిఫర్ ను అడగ్గా... 'ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనసులు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. వారికి దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రేమ అనేది ఓ అద్భుతం. ఎవరిపైన అయిన మనకు ప్రేమ పుడితే అది గొప్ప విషయమే' అని బదులిచ్చింది. కాగా, జెన్నిఫర్ ను పెళ్లి చేసుచేసుకుని తప్పు చేశానని కరణ్ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన అతడు ఇప్పుడు బిపాసాతో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అయ్యాడు. -
పెళ్లి గురించి అడిగితే మైక్ విసిరికొట్టిన హీరో
ప్రేమలు పలు విధములు. వ్యక్తీకరణలు(ఎక్స్ ప్రెషన్స్) బహువిధములు. మనసు దోచిందనో, మాయ చేసిందనో, మోసంతో వంచన చేసిందనో లేక విధికి తలవంచి వీడిపోయిందనో.. మాజీ ప్రియురాళ్లపై ప్రియులు లేదా మాజీ ప్రియులపై ప్రియురాళ్లు అప్పుడప్పుడూ నోరుపారేసుకోవటం లేదంటే ఆగ్రహం వ్యక్తం చేయటం(నిజానికి ఇవి కూడా ప్రేమ వ్యక్తీకరణలే) లాంటివి చేస్తుంటారు. ఇప్పడు వంతు బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో జాన్ అబ్రహామ్ ది. ఏళ్లకిందటే ప్రేమ పెళ్లి చేసుకుని సెటిల్(వైవాహికంగా) అయిపోయిన జాన్.. మాజీ ప్రేయసికి సంబంధించిన ప్రశ్నను ముల్లులా భావించాడు. 'బిపాషా బసూ పెళ్లి చేసుకోబోతోందికదా.. మీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగిన పాపానికి విలేకరిపై అంతెత్తు ఎగిరిపడ్డాడు. కోపంగా మైక్ విసిరికొట్టి, ఆగ్రహంతో వెళ్లిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన జరిగింది. హీరో ప్రదర్శించిన అసహనం అఅక్కడున్న కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తే, మరికొంత మంది మాత్రం 'ప్రేమ పలు విధములు.. వ్యక్తీకరణలు బహువిధములు..' అనుకున్నారట! 'డ్రీమ్ కపుల్'గా ముద్రపడ్డ జాన్ అబ్రహాం, బిపాషా బసులు తొమ్మిదేళ్లపాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జాన్ అబ్రహాం.. తన స్నేహితురాలు ప్రియా రాంచల్ను ప్రేమ వివాహం చేసుకోగా, ఇప్పుడు బిపాషా తన సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను ప్రేమించి పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 30వ తేదీన వీరి వివాహం జరుగనుంది. వివాహానికి సంబంధించిన వేడుకల్లో మునిగి తేలుతుంది పెళ్లికూతురు. మొహమాటానికైనా జాన్కు ఇన్విటేషన్ పంపలేదట బిపాషా బసు. ఇదిలాఉంటే బిప్స్ మరో మాజీ ప్రేమికుడు డినోమారియా మాత్రం 'తను పిలవకపోయినా బిపాషా పెళ్లికి వెళతాను'అని మరో తరహా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
పిలువకున్నా పెళ్లికెళ్తానంటున్న బాయ్ ఫ్రెండ్!
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ల వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మరో 17 రోజుల్లో నా వివాహం అంటూ పేద్ద లవ్ కోట్ను కూడా బిపాసా గురువారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక్క జాన్ అబ్రహంతో తప్ప తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరితోనూ ఇప్పటికీ మంచి రిలేషన్ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు.. ఈ వివాహా ఉత్సవానికి వీరిని ఆహ్వానించి కరణ్ మనసు నొప్పించాలనుకోవడంలేదట. అయినప్పటికీ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ డినో మోరియా మాత్రం పెళ్లికి వెళ్తానని మంకు పట్టు పడుతున్నాడు. బిప్స్ పిలువకపోయినా సరే వెళ్లి ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఇక లాభం లేదనుకుందో ఏమో బిపాసానే డినోను ఆహ్వానించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలకు వెళ్లడానికి డినో ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ నందితా మెహతాని కూడా సిద్ధమౌతోందట. కరణ్ సింగ్ గ్రోవర్ కూడా తన ఈ మూడో పెళ్లి వేడుకలకు అతని మాజీ భార్యలైన శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింజెట్లను ఆహ్వానించడం లేదటలెండి. -
ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి
బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టు ఉంది. అసిన్, ప్రీతి జింటా, ఊర్మిళ.. ఇప్పుడు బిపాసా బసు. గత కొన్ని రోజులుగా బిపాసా బసు.. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని పెళ్లాడబోతుందంటూ వినిపించిన వార్తలు త్వరలో నిజం కానున్నాయి. బిపాసా, కరణ్ల వివాహం ఏప్రిల్ 30వ తేదీన జరుగనుందని అధికారిక సమాచారం. అయితే పెళ్లి వధూవరులకు అత్యంత సన్నిహితులైనవారి మధ్య జరగనుంది. 2015లో రిలీజ్ అయిన హారర్ సినిమా 'ఎలోన్'లో కలిసి నటించినప్పటి నుంచి బిపాసా, గ్రేవర్ డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28న మెహందీ ఫంక్షన్, 29న రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్కు బాలీవుడ్ ప్రముఖులను, స్నేహితులను ఆహ్వానించనున్నారు. పెళ్లికి మాత్రం అత్యంత సన్నిహితులే హాజరయ్యే అవకాశం ఉంది. కాగా బిపాషా పెళ్లి వార్త తెలియగానే మరో బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా ట్విట్టర్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. స్నేహితురాలికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. I'm truly so happy for my friend @bipsluvurself n her handsome bridegroom to be @Iamksgofficial Ure a golden heart..u deserve so much n more — PRIYANKA (@priyankachopra) 7 April 2016 -
స్మాల్ స్క్రీన్కు బిగ్ స్క్రీన్కు పెళ్లంట
బాలీవుడ్కు ఇది బ్రేకప్ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ నుంచి కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీకి అనుష్కా శర్మ దూరమై, వార్తల్లో నిలిచారు. అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా కూడా తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. విడిపోయాం కానీ, విడాకులు తీసుకోలేదని ఇద్దరూ పేర్కొన్నారు. ఈ బ్రేకప్ లిస్ట్లో ప్రేమపక్షులు కరణ్సింగ్ గ్రోవర్-బిపాసా బసులు కూడా ఉంటారని చాలా మంది భావించారు. గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరి లవ్ లైఫ్లో కూడా ఏవో చిన్నపాటి మనస్పర్థలు నెలకొన్నాయనే వార్తలు వచ్చాయి. బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్తో వివాహబంధాన్ని తెంచుకున్న కరణ్ మళ్లీ పెళ్లి చేసుకోవడం, అది కూడా బిపాసా బసును పెళ్లాడటం అతని తల్లికి ఇష్టం లేదని టాక్. ఒకవేళ బిప్స్ని పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి కూడా రానివ్వనని చెప్పారట కూడా. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పెళ్లి కష్టమేనని చాలా మంది అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా కరణ్ గ్రోవర్- బిప్స్ తమ పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో బెంగాలీ స్టయిల్లో వచ్చే నెల 29న వీళ్లిద్దరి పెళ్లి జరగనుందట. ముంబైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఈ పెళ్లి జరగనుందని భోగట్టా. రిసెప్షన్కు మాత్రం సినిమా రంగానికి చెందినవారిని ఆహ్వానించారట. -
పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన బాయ్ఫ్రెండ్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బిపాసా, కరణ్కు నిశ్చితార్థం అయిందని, ఏప్రిల్ 30న ముంబైలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన బిపాసాను మీడియా ప్రతినిధులు పెళ్లి విషయంపై ప్రశ్నించగా.. పెళ్లి ఎప్పుడు జరిగితే, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పింది. కాగా కరణ్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నాడు. -
ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ప్రియుడు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ముంబైలో ఓ ప్రముఖ హోటల్లో పెళ్లాడబోతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. కరణ్ తల్లి ఈ డస్కీ బ్యూటీని కోడలుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వారి వివాహ తేదీ, వేదికలను ధ్రువీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 30న ముంబైలోని సబర్మన్ హెటల్లో అంగరంగ వైభవంగా జరగనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిబాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సొట్టబుగ్గల సుందరి, ప్రీతి జింటా, ఊర్మిళ పెళ్లిచేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇపుడు బిపాసా కూడా నెలరోజుల్లోనే రియల్ లైఫ్లో పెళ్లికూతురుగా అవతరించబోతోందన్నమాట. ఇటీవల బిపాసా, కరణ్సింగ్ గ్రోవర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో ప్రత్యక్షమ్యాయి. వాళ్లిద్దరికి ఎంగేజిమెంట్ కూడా అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో బిపాసా, కరణ్ల వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లిందని బీ టౌన్ లో వార్తలు హల్చల్ చేశాయి. ప్రియుడి పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేసిన భామ ఆ ఫొటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇవన్నీ గాసిప్స్ అని బిపాసాబసు గతంలో కొట్టిపారేసింది. ఈ వ్యవహారాన్ని హాట్ టాపిక్గా మార్చొద్దంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులను రిక్వెస్ట్ చేసింది. కాగా కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొన్నాడు. మరి ఈ సస్సెన్స్కు తెరపడాలటే... బిపాసా బసు నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. -
'నా పెళ్లిని హాట్ టాపిక్ చేయవద్దు'
గత కొన్ని రోజుల కిందట సాగర తీరంలో రొమాన్స్ చేస్తూ బాలీవుడ్ తార బిపాషాబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ దిగిన ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. హాలిడే ట్రిప్స్లో హాట్హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరిగింది. తాజాగా బిపాషాబసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల వివాహం జరిగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కనీసం వారికి ఎంగేజ్ మేంట్ అయినా అయ్యుంటుంది అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై బిపాషా కాస్త ఘాటుగానే స్పందించింది. తన పెళ్లి, జీవితం గురించి కొన్ని వివరాలు చెబుతూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి ఇప్పుడే నిర్ణయానికి రాలేదని, ఇది తన జీవితమని అంటోంది. తనను ప్రేమించేవాళ్లకు ఇది తన విజ్ఞప్తి అంటూ ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయవద్దని కోరింది. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానంది. తమ వ్యవహారాన్ని హాట్ టాపిక్ గా మారుస్తున్నారని చెప్పింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చియించుకుంటే ఆ విషయాన్ని మీకు కచ్చితంగా చెబుతాను అని పేర్కొంది. అయిస్తే కాస్త ఓపిక పట్టాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ఈ అమ్మడు. తనకు సహకరించేవారికి ధన్యవాదాలు అంటూ ట్విట్ లో రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ నటి. గతంలో జాన్ అబ్రహాంతో ఓ రేంజ్లోనే ప్రేమ కథ నడిపి, అతడి నుంచి విడిపోయింది బిపాషా. జాన్తో ఉన్నట్లు కాకపోయినా ఆ తర్వాత హర్మన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి అతడికి గుడ్ బై చెప్పేసింది. ఇకపోతే కరణ్సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. Wait for me 2announce my wedding when I want to n if I want to.Please stop treating it frivolously. — Bipasha Basu (@bipsluvurself) March 6, 2016 For years I have dealt with this constant discussion.Please be patient. After all it's my life:) Thank you all. — Bipasha Basu (@bipsluvurself) March 6, 2016 -
ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!
సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. హాలిడే ట్రిప్స్లో హాట్హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. జాన్ అబ్రహాంతో ఈ రేంజ్లోనే ప్రేమ కథ నడిపి, అతన్నుంచి విడిపోయారు బిపాసా. జాన్తో అంత కాకపోయినా ఆ తర్వాత హర్మాన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి, విడిపోయారు. సో.. బిపాసా ఈ హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక ఈసారైనా తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళతారా? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పరిశ్రమ అంతా వీరిద్దరి బంధం గురించి కోడై కూస్తుంటే... ఇక సన్నిహితులు చూస్తూ ఊరుకుంటారా? అసలు విషయం తేల్చేశారట. క రణ్సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. కానీ, భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్నారు. చట్టప్రకారం మొదటి భార్య నుంచి విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే వీలు లేదు. అందుకని, ఇప్పటికి బిపాసా, కరణ్ల బంధం ప్రేమ వరకూ ఓకే కానీ.. అది పెళ్లి దాకా వెళ్లడం కష్టం అని తెలుస్తోంది. మరి.. జెన్నిఫర్ నుంచి కరణ్ విడాకులు తీసుకుంటారా? లేక కాపురాన్ని నిలబెట్టు కుంటారా?... రెండోది జరిగితే బిపాసా హిస్టరీ రిపీటే. -
సాగర తీరంలో సరసాలు!
కొన్ని విషయాలు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరంలేదు.. సైగల ద్వారానో, ఫొటోల రూపంలోనే చెప్పేయొచ్చు. ఫొటోల్లో ఉన్న పోజులను బట్టి, అందులో ఉన్నవారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ఊహించేయొచ్చు. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్తో తాను కలిసి దిగిన ఫొటోలను బయటపెట్టడం ద్వారా తమ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పీ చెప్పక చెప్పేశారు బిపాసా బసు. 2015కి వీడ్కోలు పలుకుతూ చివరి రోజున కరణ్ సింగ్, బిపాసా సాగర తీరంలో చేతిలో చెయ్యేసుకుని మరీ ‘స్వీట్ నథింగ్స్’ చెప్పుకున్నారు. అలాగే, ఈత కొట్టి సరసాలాడారు. ఎంతో రొమాంటిక్గా ఉన్న ఆ ఫొటోలను బిపాసా తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. ‘‘2015 నాకు చాలా స్పెషల్. ఓర్పుగా ఉండటం, ప్రేమించడం, ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మడం.. ఇవన్నీ నేర్పించింది. అన్నింటికన్నా మించి నా జీవితంలో సంతోషాన్ని నింపింది’’ అని బిపాసా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ మధ్య కరణ్తో బిపాసా అనుబంధం చెడిందనే వార్త వచ్చినప్పటికీ, ఈ ఫొటోల ద్వారా ఇద్దరూ బాగానే ఉన్నారని స్పష్టమైంది. -
రెస్టారెంట్లో రచ్చ.. రచ్చ...
ఇప్పుడు బాలీవుడ్లో జోరుగా షికారు చేస్తున్న వార్తల్లో బిపాసా బసుకి సంబంధించిన వార్త ఒకటి. ఈవిడగారు ఓ రెస్టారెంట్లో చేసిన రచ్చ గురించి అందరూ చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. విషయం ఏంటంటే... తాజా ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి బిపాసా ఓ రెస్టారెంట్కి వెళ్లారట. అక్కడ లైట్గా మద్యం కూడా పుచ్చుకున్నారట. ఆ మాత్రానికే బిపాసా నిషాతో గట్టి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారని బోగట్టా. కరణ్ సింగ్ గ్రోవర్ ఆమెను కంట్రోల్ చేయడానికి నానా పాట్లు పడ్డారని సమాచారం. ‘బిపాసా కంట్రోల్ యువర్ సెల్ఫ్’ అని వార్నింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. చేసేదేం లేక బిపాసాను అర్జంటుగా కరణ్ అక్కణ్ణుంచి తీసుకెళ్లారని చూసినవాళ్లు చెప్పుకుంటున్నారు. ఈ తతంగం ఆ నోటా ఈ నోటా వీర విహారం చేస్తోందట. -
బిపాసా... మళ్లీ నిరాశ ?
‘అలోన్’... ఏడాది క్రితం ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు బిపాసా బసు పర్సనల్ స్టేటస్ సింగిల్. షూటింగ్ మొదలయ్యాక కూడా తనేంటో తన పనేంటో అన్నట్లుగానే ఉండేవారు. కొన్ని రోజులు గడిచింది. ఎలా మొదలైందో కానీ, ఆ చిత్రంలో హీరోగా నటించిన బుల్లితెర నటుడు కరణ్సింగ్ గ్రోవర్, కథానాయిక బిపాసా మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ స్పాట్లో ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం దగ్గర్నుంచీ, పేకప్ చెప్పాక కలిసి వెళ్లడం వరకూ బాలీవుడ్లో బోల్డన్ని వార్తలు హల్చల్ చేశాయి. మొత్తం మీద ‘అలోన్’ సినిమా పూర్తయ్యేసరికి బిపాసా సోలో లైఫ్కి ఫుల్స్టాప్ పడిపోయింది. విహార యాత్రలూ, విందులు అంటూ ఇన్నాళ్లూ ఎంజాయ్ చేసిన ఈ జంట ఇప్పుడు దూరం పాటిస్తున్నారట. దానికి కారణం ‘జరీన్ ఖాన్’ అని సమాచారం. కత్రినా కైఫ్ పోలికలతో ఉన్న ఈవిడగార్ని ‘వీర్’ ద్వారా వెండితెరకు పరిచయం చేశారు సల్మాన్ ఖాన్. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. జరీన్ కెరీర్ కూడా పెద్దంతగా పుంజుకోలేదు. ఇప్పుడు కరణ్సింగ్ గ్రోవర్తో కలిసి ‘హేట్ స్టోరీ 3’లో నటించింది జరీన్ఖాన్. ‘ఆలోన్’లో నటించి బిపాసా ఒంటరితనాన్ని పోగొట్టిన కరణ్ ఇప్పుడు ‘హేట్ స్టోరీ’లో నటించడం మొదలుపెట్టాక ఆమెను హేట్ చేయడం మొదలుపెట్టాడట. జరీన్తో ప్రేమలో పడ్డాడని సమాచారం. ఆల్రెడీ బిపాసాతో ప్రేమాయణం సాగిస్తూ, తనతో లవ్లో పడాడ్డని జరీన్కి తెలిసినప్పటికీ, దాన్ని పెద్దగా మైండ్కి ఎక్కించుకోకుండా కరణ్ కంపెనీని ఎంజాయ్ చేస్తోందట జరీన్. ఇక, బిపాసా గురించి చెప్పాలంటే... బిపాసా తొలి ప్రేమ జాన్ అబ్రహాంతో మొదలైంది. అతగాడితో బిపాసా తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, విడిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో హర్మాన్ బవేజాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కొద్ది రోజులకే పరిమితమైంది. ఆ విధంగా రెండో లవ్ కూడా బిపాసాని నిరాశపరిచింది. ఆ నిరాశలోంచి బయట పడుతున్న సమయంలోనే కరణ్సింగ్కి దగ్గరయ్యిందామె. ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలనుకుందట. కానీ, కరణ్ మాత్రం బిప్స్ని లైట్ తీసుకున్నాడని బిపాసా సన్నిహితులు అంటున్నారు. వాస్తవానికి కరణ్కి ప్లేబోయ్ ఇమేజ్ ఉంది. 2008లో శ్రద్ధా నిగమ్ని పెళ్లి చేసుకుని, పది నెలలకే విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత జెన్నిఫర్ వింగెట్ అనే బుల్లితెర నటిని పెళ్లి చేసుకుని, ఏడాదిన్నరకే ఆమెకు దూరమయ్యాడు. అనంతరం బిపాసాకి దగ్గరయ్యాడు. ఇప్పుడు బిపాసాని కాదని జరీన్తో జతకట్టాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం బిపాసా తప్పని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా బిపాసాకి మూడోసారి కూడా చేదు అనుభవం ఎదురైంది. మరి.. జరీన్ పరిస్థితి ఏంటో? -
సివంగీ...స్
పోలీస్ పాత్రల్లో కనబడ్డ నలుగురు సివంగులు ఈ బాలీవుడ్ భామలను అందరూ గ్లామర్ డాల్స్ అంటారు. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారు అనుకుంటారు. కానీ ఒక్కసారి వీళ్లని ఖాకీ డ్రెస్సులో చూస్తే తెలుస్తుంది... వారిలో ఎంత కరకుదనం ఉందో! బిపాసా బసు... గ్లామర్ క్వీన్. హాట్ బ్యూటీ. అందాలతో మత్తెక్కిస్తుంది. సోయగాలతో మైమరపిస్తుంది. ‘గునాహ్’ సినిమా చూసేవరకూ ఇలాగే మాట్లాడుకున్నారు బిప్స్ గురించి. కానీ ఆ సినిమాలో యూనిఫామ్లో రఫ్గా కనిపించిన ఆమెను చూసి గతుక్కుమన్నారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్గా హుందాగా కనిపించిన బిపాసాను చూసి సూపర్బ అన్నారు. ఆ తర్వాత ‘ధూమ్ 2’లో కూడా పోలీసు పాత్రలో నటించి మెప్పించింది బిప్స్! సోహా అలీ ఖాన్ అమ్మ షర్మిలా ఠాగూర్ అందాన్ని, అన్న సైఫ్ అలీ ఖాన్ స్టైల్ని పుణికి పుచ్చుకుంది సోహా అలీ ఖాన్. కొత్త కొత్త ఫ్యాషన్లను అనుసరించడం, వీలైనంత గ్లామరస్గా కనిపించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని. కానీ ‘మిస్టర్ జో భీ కర్వాలో’ చిత్రం చూస్తే ఈమె సోహాయేనా అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ శాంతిప్రియా ఫడ్నిస్గా యూనిఫామ్లో ఎంతో డిఫరెంట్గా కనిపిస్తుంది సోహా. తుపాకులు పేలుస్తూ, రౌడీల మక్కెలు విరగదన్నుతూ యాక్షన్ హీరోలను మరిపించింది. ఇషా గుప్తా హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీకి చెల్లెలేమో అనిపిస్తుంది ఇషా గుప్తాని చూస్తే. తన గ్లామర్తో బాలీవుడ్ వారి మతులు పోగొట్టేసిన ఈ సుంద రాంగికి పోలీసు పాత్రలో నటించాలనేది డ్రీమ్. ఆ కలను ‘చక్రవ్యూహ్’ సినిమా తీర్చింది. అందులో ఐపీఎస్ ఆఫీసర్ రియా మీనన్గా జీవించి మార్కులు కొట్టేసింది ఇషా. చాన్స్ దొరికితే మళ్లీ యూనిఫామ్ వేయడానికి రెడీ అనేంత పిచ్చి ఆమెకు పోలీసు పాత్ర అంటే! షమితాశెట్టి ‘మొహొబ్బతే’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శిల్పాశెట్టి చెల్లెలు షమితాశెట్టి. కానీ పాపం కెరీర్ అనుకున్నంతగా సాగలేదు. పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే తన పేరు చెబితే గుర్తొచ్చే పాత్రలు కొన్ని చేసింది షమిత. ‘క్యాష్’, ‘జెహెర్’ చిత్రాల్లో స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీసా ఫీరుగా ఆమె నటనను మెచ్చుకుని తీరాలి. ఓ పక్క కూల్గా కనిపిస్తూనే ఖాకీ డ్రెస్సులో కరకుదనాన్ని ప్రదర్శించి అదరగొట్టేసింది! -
కరీనా అంటే కస్సుమనే ప్రియాంక.. బిపాసా
ప్రియాంకా చోప్రా, బిపాసా బసుల పేరు ఎత్తితే కరీనాకి పట్టరానంత కోపం వచ్చేస్తుంది. బిపాసాతో కరీనా వైరం ముందు వృత్తిపరమైనది.. తర్వాత వ్యక్తిగతంగా కూడా మొదలైంది. బిపాసా, కరీనా పోటీ పడి సినిమాలు చేసేవాళ్లు. అసూయతో ఓ సందర్భంలో ‘ఆ నల్ల పిల్లి’ అంటూ బిపాసాను ఉద్దేశించి బహిరంగంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అది మాత్రమేకాదు బిపాసా బోయ్ఫ్రెండ్ (ఇప్పుడు మాజీ) జాన్ అబ్రహాం అసలు నటుడే కాదని కూడా విమర్శించారు. ఇన్ని మాటలన్న తర్వాత బిపాసా ఊరుకుంటారా? ‘ఆ తెల్ల మొహంలో హావభావాలు పలకవు..’ అని కరీనాను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇప్పటికీ ఈ ఇద్దరికీ మధ్య స్నేహం లేదు. ఇక, ప్రియాంకా చోప్రా, కరీనా గురించి చెప్పాలంటే.. హిందీ రంగంలో పెద్ద కుటుంబానికి చెందిన కరీనాను మహారాణీలా చూస్తారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన ప్రియాంకా చోప్రాకి అంత రాయల్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం లేదు. ఆ విషయంలో కరీనా అంటే ప్రియాంకాకు కొంత అసూయ ఉండేదని పరిశీలకులు అంటుంటారు. అలాగే, సినిమా అవకాశాలు దక్కించుకునే విషయంలో కూడా ఇద్దరూ పోటీపడేవారట. చివరికి షాహిద్ కపూర్ కారణంగా ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా కూడా శత్రువులయ్యారు. షాహిద్, కరీనా ప్రేమించుకున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఈ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మొదలైనప్పుడు షాహిద్కు ప్రియాంక దగ్గరయ్యారట. దాంతో కరీనా, ప్రియాంక మధ్య బద్ధ శత్రుత్వం మొదలైంది. ఈ ప్రపంచంలో ఎవరూ నిత్య మిత్రులుగా ఉండరు.. అలాగని శత్రవులుగానూ ఉండిపోరు. ఇవాళ ఉన్న కోపం రేపు ఉండకపోవచ్చు. కానీ, ఈ ముద్దుగుమ్మలు మాత్రం ఎప్పటికీ శత్రువులుగానే మిగిలిపోతారన్నది బాలీవుడ్వారి అభిప్రాయం. -
అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్!
గాసిప్ జాన్ అబ్రహాంతో పదేళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత విడిపోయిన బిపాషా బసు ఇప్పుడు బుల్లితెర ఫేం కరణ్ సింగ్ గ్రోవర్తో ప్రేమ విహారాల్లో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కరణ్ సింగ్తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారామె. ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఈ బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటేనని కొందరు జోక్లు వేసుకుంటున్నారు. కరణ్తో బిపాషా వ్యవహారం ఆమె తల్లికి ఏ మాత్రం రుచించట్లేదట. దీనికి కారణం లేకపోలేదు. కరణ్ సింగ్ ఇప్పటి వరకూ శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింగెట్లను పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరికీ విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బిపాషాతో ప్రేమను ఆస్వాదిస్తున్నారు కరణ్. ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న కరణ్ సింగ్ గ్రోవర్తో కూతురు అంత చనువుగా ఉండటాన్ని బిపాషా తల్లి ఏ మాత్రం సహించలేకపోతున్నారట. కూతురి మీద ఫైర్ అయ్యారని సమాచారం. దాంతో కరణ్తో తనకు స్నేహం మాత్రమే ఉందని, వేరే ఏమీ లేదని తల్లికి వివరణ ఇచ్చుకున్నారట బిపాషా. ఏదో తల్లిని కూల్ చేయడానికి అలా అని ఉంటుందని ఈ తల్లీ కూతుళ్లు గిల్లికజ్జాలు తెలిసినవాళ్లు అంటున్నారు. -
అమీపై అంత కోపమేల బిప్స్!
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బుంగమూతి పెట్టింది. కదిలిస్తే చాలు కస్సుబుస్సులాడుతోంది. ఆ కోపం ఎవరి మీదనేగా? ఇంకెవరు... ఎవడు, ఐ చిత్రాలతో మనకు పరిచయమైన అమీ జాక్సన్ మీదే. దాంతో కొందరు... కొంపదీసి బాలీవుడ్లో అతి సహజమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీళ్ల మధ్య కూడా చిచ్చుపెట్టిందా ఏంటి అంటూ ఆరాలు తీస్తున్నారు. అయితే నిజానికి అమీపై బిప్స్ అలగడానికి కారణం ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ యూనిట్. వాళ్లు తాజాగా ఆ చిత్ర పోస్టర్స్ను విడుదల చేశారు. వాటిలో అక్షయ్, అమీలు మాత్రమే కనిపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ అయిన బిపాసా కనిపించడం లేదు. దాంతో అమీపై అక్కసుతో రగిలి పోతోందట బిప్స్! -
మనశ్శాంతి కోసం...!
వృత్తి మీద ఎంత ప్రేమ ఉన్నా.. విశ్రాంతి లేకుండా పని చేస్తే విసుగు చెందడం ఖాయం. మరి.. బిపాసా బసు అలానే విసిగిపోయారో ఏమో కానీ.. ఇటీవల హిమాలయాలకు వెళ్లారు. అక్కడి ‘ఆనందాశ్రమం’ అనే ఆధ్యాత్మిక కేంద్రంలో పదకొండు రోజులు గడిపారు. యోగా చేశారు. గంటలు గంటలు ధ్యానం చేశారు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి.. మనసుకి హాయినిస్తున్నాయనీ ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తెల్లటి దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని.. ఓ సాధ్విలా అగుపించారు బిపాసా. హిమాలయాల నుంచి తిరిగొచ్చేటప్పుడు.. తన మనసు ప్రశాంతంగా మారిపో యిందనీ, నూతనోత్తేజం పొందినట్లుగా అనిపించిందనీ బిపాసా పేర్కొన్నారు. -
బిపాసా... గోగోగో.. గోవా
బాలీవుడ్ హాట్ బ్యూటీ గర్ల్ బిపాసబసు తన బాయ్ఫ్రెండ్ కరన్ సింగ్ గ్రోవర్తో కలిసి గోవా బీచుల్లో షికార్ల కోసం వెళ్లిందట. ఇటీవల ఈ జంట బాగా సన్నిహితంగా ఉంటున్నారని బాలీవుడ్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తన రెండో భార్యతో విడిపోయిన కరన్ సింగ్ ఈ ఫిబ్రవరి 23న పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నాడు. అయితే, బిపాస అతను కలిసి ఈ మధ్య ఎలోన్ అనే హిందీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఈ సినిమాలో చాలా చక్కగా కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని కొందరు దర్శకులు కితాబిచ్చారట. ఫలితంగా వారిద్దరి మధ్య చనువు అతిగా పెరిగిందంటున్నారు కొందరు. దీంతో గోవా బీచుల్లో అర్థరాత్రి కరన్తో కేక్ కట్ చేయించేందుకు తన స్నేహితులు డిజైనర్ రాకీ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డియానే పాండే, మరో మోడల్ క్యాండిస్ పింటోతో కలిసి రయ్మని దూసుకెళ్లే కారులో రోడ్డు వెంట బీచులో షికారుకెళ్లిందట.. గతంలో ఈ అమ్మడు జాన్ అబ్రహాం, హార్మన్ భవేజాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. -
కుటుంబ కథలో... హారర్ క్వీన్
అందచందాలతో అందరినీ ఆకర్షిస్తూ వచ్చిన బిపాసా బసు ఈ మధ్య వరుసగా హారర్ కథా చిత్రాలకే పరిమితమవుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ పాత్రలు బిపాసాకు కూడా బోర్ కొట్టినట్లున్నాయి. తాజాగా ఆమె తన రూటు మారుస్తున్నారు. ‘‘ఇప్పుడు హారర్ కథా చిత్రాలకు కాస్తంత విరామం ఇస్తూ, ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా’’ అని 36 ఏళ్ళ బిపాసా వెల్లడించారు. ఈ కొత్త చిత్రం గురించి ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మాటే చెబుతూ, ‘‘ఇక నుంచి ఎప్పుడూ హారర్ కథా చిత్రాలే చేస్తారేంటి అన్న ప్రశ్నకు ఇక దూరంగా ఉండచ్చు ’’ అని ఈ బాలీవుడ్ హారర్ క్వీన్ నవ్వేశారు. ఆమె నటించిన తాజా హారర్ చిత్రం ‘ఎలోన్’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘‘నిజానికి, హారర్ చిత్రాలలో నటించకూడదని ఆ మధ్య అనుకున్నా. అందుకే ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి సంకోచించాను. కానీ స్క్రిప్ట్ చదివాక నో చెప్పాలని అనిపించలేదు’’ అని ఆమె చెప్పుకొచ్చారు. -
అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు
ముంబై: కరణ్ సింగ్ గ్రోవర్తో కలసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి ఇబ్బందీ పడలేదని బాలీవుడ్ బామ బిపాషా బసు చెబుతోంది. బిపాషా, కరణ్ నటించిన హర్రర్, రోమాంటిక్ సినిమా 'అలోన్' బిపాషా, కరణ్ ఘాటైన సన్నివేశాల్లో నటించారు. ఇటీవల విడుదలైన అలోన్ ట్రైలర్ యూ ట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. భూషన్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమాలో బిపాషా అవిభక్త కవలలుగా నటించారు. అలోన్తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా అనిపించలేదని బిపాషా చెప్పారు. కేరళలో షూటింగ్ చిత్రీకరణకు వెళ్లేముందు అతనితో ఏర్పడిన స్నేహమే దీనికి కారణమి అంది. కాగా అవిభక్త కవలలుగా నటించడానికి కష్టపడ్డానని బిపాషా చెప్పింది. -
బిపాసా సెలవు వైభోగం..
ఈ మధ్యకాలంలో అలోన్ సినిమా షూటింగ్తో బిజీబిజీగా ఉన్న బిపాసాబసు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వీలు కుదరడంతో ఎగిరి గంతేస్తోంది. ‘ఛుట్టీ మిల్గయా.. యాహూ’ అంటూ ట్విట్టర్లో కూసింది. హారర్ థీమ్తో వస్తున్న అలోన్ మూవీ కోసం బిపాసా అవిశ్రాంతంగా పని చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం జనవరిలో స్క్రీన్ మీదకు రావాల్సి ఉంది. అయితే న్యూ ఇయర్ కోసం నాలుగు రోజులు సెలవు తీసు తీసుకుంది. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆమె ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడాలి. -
ఔను... మేమిద్దరం విడిపోయాం!
జాన్ అబ్రహమ్తో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, అతడి నుంచి విడిపోయారు బిపాసా బసు. ఆ తర్వాత హీరో హర్మాన్ బవేజాతో ఆమె ప్రేమలో పడ్డారు. ‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆ మధ్య బిపాసా తన సన్నిహితులతో అన్నట్లు వార్త కూడా వచ్చింది. మూడు, నాలుగు నెలల్లో ఈ ప్రేమికులు భార్యా, భర్తలవుతారనే ఊహాగానాలు ఉండగా, ‘మేమిద్దరం విడిపోయాం’ అని బిపాసా బహిరంగంగా ప్రకటించేశారు. ఎందుకు విడిపోయామనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. బిపాసా ఇంకా చెబుతూ -‘‘హర్మాన్ కుటుంబమంటే నాకు గౌరవం. అతనికీ మా ఫ్యామిలీ అంటే గౌరవం ఉంది. మేం విడిపోయినా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. హర్మాన్నుంచి ప్రియురాలిగానే విడిపోయా. అతనితో ఎప్పటికీ స్నేహంగా ఉంటాను’’ అన్నారు. ఇది ఇలా ఉండగా, నటుడు కరణ్సింగ్ గ్రోవర్కి దగ్గర కావడం వల్లే హర్మాన్కి బిపాసా దూరమయ్యారనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, బిపాసా ఆ వార్తలో నిజం లేదంటున్నారు. -
‘అలోన్’ అతివ..
బోల్డ్బ్యూటీ బిపాసా బసు హీరోయిన్గా హర్రర్ చిత్రం ‘అలోన్’ త్వరలోనే తెరకెక్కనుంది. ఆమె సరసన టీవీ నటుడు, మోడల్ కరణ్సింగ్ గ్రోవర్ నటించనున్నట్లు బాలీవుడ్ భోగట్టా. కరణ్పై ప్రత్యేక అభిమానం గల బిపాసా, ఈ సినిమా కోసం అతడిని సిద్ధం చేస్తోంది. మీడియా ముందు ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి వంటి ప్రతి చిన్న అంశాన్నీ ఆమె ప్రత్యేక శ్రద్ధతో అతడికి నేర్పిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
బిపాసా బసుతో రొమాన్స్ చేయనున్న రానా
అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కూడా తళుక్కుమంటున్న దగ్గుబాటి రానా ఇప్పుడు బాలీవుడ్ నల్లకలువ బిపాసా బసుతో రొమాన్స్ చేయనున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా ఉండి, తర్వాత దర్శకుడిగా మారిన విక్రమ్ ఫడ్నిస్ తాను రూపొందిస్తున్న కొత్త సినిమా 'నియా'లో వీళ్లిద్దరినీ హీరో హీరోయిన్లుగా తీసుకున్నారు. తన సినిమా జీవితాన్ని పండగలా చేసుకోవడం గురించే ఉంటుందని, రానా.. బిపాసాలు ఇంతకుముందు చేసిన 'దమ్ మారో దమ్' చిత్రంతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని విక్రమ్ ఫడ్నిస్ చెప్పారు. విక్రమ్ ఫడ్నిస్ తీసిన మొదటి సినిమా అంతగా ఆడలేదు. అయితే.. తాను కేవలం డబ్బు కోసమే సినిమాలు తీయడంలేదని, వందకోట్ల క్లబ్బులో చేరకపోయినా తాను లక్ష్యపెట్టేది లేదని ఫడ్నిస్ అన్నారు. తాను స్క్రిప్టు రాసిన మాట వాస్తవమే గానీ, అసలు డైరెక్టర్ టోపీ పెట్టుకుంటానని మాత్రం ఎప్పుడూ భావించలేదన్నారు. మంచి సినిమా రాశానని, ఎవరైనా దర్శకత్వం వహిస్తారేమో అనుకున్నానని, కానీ ఎవరూ దాన్ని తాను అనుకున్నట్లు అర్థం చేసుకోకపోవడంతో తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టానని చెప్పారు. కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టి, ఫ్యాషన్ డిజైనర్గా మారి, ఇప్పుడు దర్శకుడైన ఫడ్నిస్.. తన జీవితయానం ఓ రోలర్ కోస్టర్ లాంటిదని అంటారు. -
బాలీవుడ్ చిత్రంలో జంటగా రానా, బిపాసా!
ముంబై: మరోసారి దగ్గుబాటి రానా, బిపాసాబసు జంటగా బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి 'నియా' అని పేరును ఖారారు చేశారు. 'నియా' అంటే ఉద్దేశం అని అర్ధం. జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను కొత్తగా ఆవిష్కరించనున్నట్టు దర్శకుడు వెల్లడించారు. సున్నితమైన ప్రేమకథలోని పాత్రలకు రానా, బిపాసాలు సరిపోతారనే ఉద్దేశంతోనే తాను వారిని ఎంపిక చేశామన్నారు. గతంలో రానా, బిపాసాలు 'దమ్ మారో దమ్' చిత్రంలో నటించారు. -
ఫడ్నిస్ తొలిచిత్రంలో బిపాసా..!
డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న చిత్రంలో బిపాసా బసు హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. బిపాసా నటించిన చాలా చిత్రాలకు డిజైనర్గా పనిచేసిన ఫడ్నిస్కు ఆమెతో సన్నిహిత పరిచయుం ఉంది. ఆ చనువుతోనే తన సినిమాలో హీరోరుున్గా నటించమని కోరాడని, ఆమె కూడా అందుకు అంగీకరించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ వచ్చే జనవరి నుంచి ఆస్ట్రేలియూలో ప్రారంభం కానున్నట్లు ఫడ్నిస్ సన్నిహితుడు ఒకరు చెప్పారు. -
గాయాలను లెక్కచేయని హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసుకు పని మీద ఆసక్తి, చిత్తశుద్ధి చాలా ఎక్కువ. తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిర్మాతకు, దర్శకుడికి, ఇతర నటీనటులకు ఇబ్బంది కలగకూడదని ఆమె భావిస్తుంటుంది. అందుకే.. చీలమండకు గాయం అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేస్తానని ముందుకు వస్తోంది. 'ఎలోన్' అనే సూపర్ నేచురల్ సినిమాలో ఆమె ప్రస్తుతం నటిస్తోంది. దాంతోపాటు భూషణ్ పటేల్ దర్శకత్వంలో కరణ్ సింగ్ గ్రోవర్ హీరోగా వస్తున్న సినిమాలోనూ బిపాసా చేస్తోంది. ఈ రెండు సినిమాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాలు వాచినా కూడా పట్టించుకోకుండా షూటింగులకు హాజరవుతోంది. కాలికి ఓ బ్యాండేజి కట్టుకుని నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తెలియజేసింది. కాలు నొప్పి పెడుతున్న మాట వాస్తవమేనని, అయినా షూటింగుకు మాత్రం ఇబ్బంది అవకూడదని చెప్పింది. ఇంతకుముందు విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన 'క్రీచర్ 3డి' అనే సినిమాలో బిపాషా నటించింది. -
ఛీ.. ఛీ...సహజీవనమా?
ఎవరి నోటి నుంచి ఎలాంటి మాట వినిపిస్తే.. ఆశ్చర్యం కలుగుతుందో ఇటీవల బిపాసా బసు అలాంటి మాటే అన్నారు. జాన్ అబ్రహాంతో ఆమె దాదాపు ఏడెనిమిదేళ్లు సహజీవనం చేసి, అనంతరం విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమాయణం సాగిస్తున్నారు. మీ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారా? అని ఎవరో అడిగితే.. ‘ఛీ.. ఛీ.. సహజీవ నమా? సమస్యే లేదు. కొన్నాళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం విజయవంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే. వివాహ బంధం పటిష్టంగా ఉండాలంటే భార్యా, భర్తల మధ్య మంచి అవగాహన అవసరం. మా అమ్మా, నాన్నల వైవాహిక జీవితం సూపర్ సక్సెస్. నా మ్యారీడ్ లైఫ్ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే సహజీవనం జోలికి వెళ్లను’’ అని చెప్పారు బిపాసా బసు. ఓసారి సహజీవనం ఇచ్చిన చేదు అనుభవంవల్లే ఆమె ఇలా మాట్లాడి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. త్వరలో హర్మాన్ బవే జాతో మూడు ముళ్లు వేయించుకోవడానికి బిపాసా సిద్ధపడుతున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఈ జంట అనుకుంటోందని బాలీవుడ్ సమాచారం. -
పెళ్లికిప్పుడు తొందరేంలేదు
బెంగాలీ బ్యూటీ ఇదివరకటి రెండు సినిమాలు ఆత్మ, హమ్షకల్స్ బోల్తాపడ్డా.. తాజాగా విడుదలైన క్రియేచర్ 3డి సినిమా బాగానే ఆడుతోంది. ఆత్మ పరాజయం ఎంతగానో బాధపెట్టిందని చెప్పింది. అందులో తల్లిగా కనిపించడాన్ని ప్రేక్షకులు అంగీ కరించలేదని వివరించింది. సరైన ప్రచారం లేకపోవడం వల్ల కూడా ఈ సినిమా వారికి చేరలేదని చెప్పింది. అయితే ఈ బ్యూటీ హమ్షకల్స్ ప్రచారానికి కూడా దూరంగా ఉంది. ఆ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో వెళ్లలేదు. ‘హమ్షకల్స్ సిని మాను అంగీకరించడం తప్పే. దాని కథేంటో ముందు నాకు తెలియదు. నా పాత్రేంటో అదెలా మలుపు తిరుతుతుందో కూడా తెలియదు. కాబట్టి ఆ సినిమా ప్రచారానికి నేను ఎందుకు వెళ్లాలి ?’ అని ప్రశ్నించింది. 2001లో అజ్నబీ సినిమాతో బాలీవుడ్లోకి వచ్చిన 35 ఏళ్ల బిపాసా తదనంతరం జిస్మ్, రాజ్, కార్పొరేట్, అపహరణ్, ధూమ్ 2, లమ్హా, ఆక్రోశ్ వంటి సినిమాలు చేసింది. బాలీవుడ్లోకి కొత్తతరం రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. అన్న ప్రశ్నకు బదులుగా సినీరంగంలో తనకంటూ ఒక స్థానం ఉన్నందున భయపడాల్సిందేమీ లేదంది. తానెంతో శ్రమించి ఈ స్థాయి చేరుకున్నానని, బిపాషా మాదిరిగా వేరే ఎవరూ ఉండలేరని స్పష్టం చేసింది. ఏదో పేరు, డబ్బు కోసం కాకుండా మనసుకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడమే తనకిష్టమని చెప్పింది. ఇక తాజా బిపాసా బసు విక్రమ్ భట్ తాజా సినిమాలోనూ నటిస్తోంది. టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ఇందులో హీరో. ఇదిలా ఉంట.. ప్రియుడు హర్మన్ బవేజాతో నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించినప్పుడు బిప్స్ నవ్వేసింది. పెళ్లికిప్పుడు తొందరేంలేదని, కెరీర్పై దృష్టిపెడుతున్నానని చెప్పింది. ‘పెళ్లికి ఇంకా గడువుంది. కాస్త మెల్లగానే చేసుకుంటాను. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి’ అని ఈమె పీటీఐ ఇంటర్వ్యూలో వివరించింది. -
పరాజయం బాధించింది
ముంబై: బెంగాలీ బ్యూటీ ఇదివరకటి రెండు సినిమాలు ఆత్మ, హమ్షకల్స్ బోల్తాపడ్డా.. తాజాగా విడుదలైన క్రియేచర్ 3డి సినిమా బాగానే ఆడుతోంది. ఆత్మ పరాజయం ఎంతగానో బాధపెట్టిందని చెప్పింది. అందులో తల్లిగా కనిపించడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదని వివరించింది. సరైన ప్రచారం లేకపోవడం వల్ల కూడా ఈ సినిమా వారికి చేరలేదని చెప్పింది. అయితే ఈ బ్యూటీ హమ్షకల్స్ ప్రచారానికి కూడా దూరంగా ఉంది. ఆ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో వెళ్లలేదు. ‘హమ్షకల్స్ సినిమాను అంగీకరించడం తప్పే. దాని కథేంటో ముందు నాకు తెలియదు. నా పాత్రేంటో అదెలా మలుపు తిరుతుతుందో కూడా తెలియదు. కాబట్టి ఆ సినిమా ప్రచారానికి నేను ఎందుకు వెళ్లాలి ?’ అని ప్రశ్నించింది. 2001లో అజ్నబీ సినిమాతో బాలీవుడ్లోకి వచ్చిన 35 ఏళ్ల బిపాసా తదనంతరం జిస్మ్, రాజ్, కార్పొరేట్, అపహరణ్, ధూమ్ 2, లమ్హా, ఆక్రోశ్ వంటి సినిమాలు చేసింది. బాలీవుడ్లోకి కొత్తతరం రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. అన్న ప్రశ్నకు బదులుగా సినీరంగంలో తనకంటూ ఒక స్థానం ఉన్నందున భయపడాల్సిందేమీ లేదంది. తానెంతో శ్రమించి ఈ స్థాయి చేరుకున్నానని, బిపాషా మాదిరిగా వేరే ఎవరూ ఉండలేరని స్పష్టం చేసింది. ఏదో పేరు, డబ్బు కోసం కాకుండా మనసుకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడమే తనకిష్టమని చెప్పింది. ఇక తాజా బిపాసా బసు విక్రమ్ భట్ తాజా సినిమాలోనూ నటిస్తోంది. టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ఇందులో హీరో. ఇదిలా ఉంట.. ప్రియుడు హర్మన్ బవేజాతో నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించినప్పుడు బిప్స్ నవ్వేసింది. పెళ్లికిప్పుడు తొందరేం లేదని, కెరీర్పై దృష్టి పెడుతున్నానని చెప్పింది. ‘పెళ్లికి ఇంకా గడువుంది. కాస్త మెల్లగానే చేసుకుంటాను. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి’ అని ఈమె పీటీఐ ఇంటర్వ్యూలో వివరించింది. -
నాకా.. పెళ్లా.. అప్పుడేనా?
నాకా.. పెళ్లా.. అప్పుడేనా.. అంటూ బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు నవ్వేస్తోంది. బోయ్ ఫ్రెండు హర్మన్ బవేజాతో తనకు నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వచ్చిన కథనాలను బిపాసా కొట్టిపారేసింది. ఇప్పుడప్పుడే తన పెళ్లికి వచ్చిన తొందరేమీ లేదని, ప్రస్తుతం తాను నటన మీదే దృష్టి సారించానని చెబుతోంది. పెళ్లిని తాను చాలా గౌరవిస్తానని, కానీ దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పింది. తాను చాలా ప్రశాంతంగా ఆ పని చేస్తానంది. ఇప్పుడు తాను చేయాల్సిన సినిమాలున్నాయని, కేవలం నటనే కాక ఇంకా చాలా ఇతర పనులు కూడా చేయాలని, వాటి గురించి ఇప్పుడు మాత్రం చెప్పలేనని బిపాసా అంటోంది. తాజాగా విడుదలైన 'క్రీచర్ 3డి' సినిమా విజయాన్ని ప్రస్తుతం ఆమె ఆస్వాదిస్తోంది. ఇంతకుముందు ఆమె నటించిన 'ఆత్మ', 'హమ్షకల్స్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ప్రేక్షకులు తనను తల్లిపాత్రలో చూసేందుకు ఇష్టపడలేదని, అందుకే ఆత్మ సినిమా పెద్దగా ఆడలేదని అంటోంది. 35 ఏళ్ల బిపాసా బసు 2001లో 'అజ్నబీ' సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. -
మందారం లాంటి బుగ్గలపై...
ఆ రోజు ఎప్పటిలానే బిపాసా బసు షూటింగ్కి రెడీ అయ్యారు. ఆ రోజు షూటింగ్ ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తూ, లొకేషన్లోకి అడుగుపెట్టారు. ఎందుకంటే, ఆ రోజు ఆమె పాల్గొనగా క్లిష్టమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి విక్రమ్ భట్ ప్లాన్ చేశారు. ఆయన దర్శకత్వంలో బిపాసా నటించిన చిత్రం ‘క్రియేచర్ త్రీడీ’. ఇదంతా ఊటీ షూటింగ్ ముచ్చట్లు. అక్కడే భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించినప్పుడు బిపాసాకు చాలా దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా బుగ్గ మీద బాగా గీరుకుపోయిందట. ఆ రోజు ఎలాగో షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్నారు ఈ బ్యూటీ. ఆ మర్నాడు ఆమెకు సంబంధించిన క్లోజప్ షాట్స్ తీయాలనుకున్నారట విక్రమ్భట్. కానీ, ఆమె మందారం లాంటి బుగ్గలపై ఉన్న గీట్లు కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో మునుపటికన్నా మేకప్ డోస్ పెంచారు బిపాసా. దాంతో ఒక్కసారిగా చర్మం మండిందట. ఈ విషయం గురించి బిపాసా చెబుతూ -‘‘ఫైట్స్ సీన్స్ చేయడానికి నేనెప్పుడూ వెనకాడలేదు. దెబ్బలు తగిలినా ఖాతరు చేయలేదు. సినిమా కోసం నా శరీరాన్ని ఏ స్థాయిలో అయినా కష్టపెట్టడానికి నేను రెడీ’’ అని చెప్పారు. -
ఐస్ బకెట్ చాలెంజ్ కు 'రైస్ బకెట్' సవాల్!
హైదరాబాద్:ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఐస్ బకెట్ చాలెంజ్ లో మునిగి తేలుతుంటే.. ఒక తెలుగు మహిళ ఆ చాలెంజ్ కే సవాల్ విసిరింది. అసలు ఐస్ బకెట్ ఛాలెంజ్ కంటే రైస్ బకెట్ ఛాలెంజే ముద్దు అంటోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఒక వైరస్ లా విస్తరించిన సమయంలో రైస్ బకెట్ ఛాలెంజ్ ను ఆరంభించడానికి సిద్ధమయ్యారు మంజు లతా కళానిధి. దీనికి ఫేస్ బుక్ ను వారధిగా ఎంచుకున్నారు. దీనికి అంతా కలిసి రావాలని విన్నవించారు. ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు సాయం చేసే అవకాశం దక్కుతుందని ఆమె ఆశిస్తున్నారు. ఎవరైతే పేద ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నారో వారు రైస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొనాలని తెలిపారు. ప్రస్తుతం ఈ రైస్ బకెట్ చాలెంజ్ ఇప్పడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. ఈ ఛాలెంజ్ తో ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చి ఆ వ్యాధి పరిశోధనకు విరాళాలే సేకరించడమే ఈ చాలెంజ్ ప్రధాన ఉద్దేశం. అయితే.. రైస్ బకెట్ చాలెంజ్ ఉద్దేశం మాత్రం పేదలకు భోజన సదుపాయంతో పాటు, రోగులకు మందులు సమకూర్చడమే. దీనికి ఆమె ఫేస్ బుక్ ద్వారా స్నేహితుల సాయం కోరుతున్నారు. ఆ ఆహారాన్ని సొంతంగా తయారు చేసి కానీ, కొనుగోలు చేసి అయినా కానీ పేదలకు అందజేయవచ్చు. ఒకవేళ రోగులకు సాయం చేయాలనుకుంటే మాత్రం ఒక్కొక్కరూ కనీసం రూ.100 తక్కువ కాకుండా మందులను ఇవ్వొచ్చు. సామాజిక చైతన్యం కల్గించడానికి ఎన్ని చాలెంజ్ లు ప్రవేశపెట్టినా ఫర్వాలేదు గానీ.. మరి సాయం చేయడానికి ఎన్ని చేతులు కలుస్తాయో వేచి చూడాల్సిందే. -
క్రీచర్-3డీ హారర్ మూవీ కాదట...
విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘క్రీచర్-3డీ’ హారర్ మూవీగానే ఇప్పటి వరకు ప్రచారం పొందింది. ఇందులో కీలకపాత్ర పోషించిన బిపాసా బసు మాత్రం ఇది హారర్ మూవీ కానే కాదంటోంది. జురాసిక్ పార్క్, అనకొండ మాదిరిగా ఇది కూడా యాక్షన్ ఓరియెంటెడ్ అడ్వంచరస్ మూవీ అని చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘క్రీచర్-3డీ’ వచ్చేనెల 12న విడుదల కానుంది. -
కూల్ ఛాలెంజ్
నెత్తి మీద నుంచి బకెట్తో నీళ్లు పోసుకోమంటే హ్యాపీ. అయితే ఆ నీళ్లు పొగలు కక్కేంత కూలింగ్తో ఉండాలని కండిషన్ పెడితే.. వామ్మో అంటాం కదా.. మరదే చాలెంజ్ అంటే! ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోందీ.. ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్. అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. అమెరికాకు చెందిన బేస్బాల్ ప్లేయర్ పెటె ఫ్రేట్స్ దీని బారిన పడ్డాడు. వ్యాధిపై అందరికీ అవగాహన కలిగించేందుకు కొత్త పంథా ఎన్నుకున్నాడు. గత నెలలో ఓ రోజు.. ఐస్కోల్డ్ వాటర్ను తల మీద నుంచి పోసుకున్నాడు(ఈ వ్యాధి కలిగించే బాధ నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు ఐస్వాటర్ ట్రీట్మెంట్ కూడా ఒక మార్గమట). ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టి.. ఇలా మీరు చేయగలరా? అంటూ చాలెంజ్ చేశాడు. దీనిని స్వీకరించినవారు 24గంటల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో 100 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది పార్టిసిపెంట్స్ పెద్దమనసుతో చాలెంజ్ పూర్తి చేసి కూడా డబ్బు చెల్లిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఈ చాలెంజ్ను నెట్స్క్రీన్కి ఎక్కించాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలను అందరినీ బకెట్ బాట పట్టించాయి. యూట్యూబ్లోని వారి వీడియోలకు అడ్వర్టయిజ్మెంట్స్ రూపంలో డబ్బులు రాసాగాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎఎల్ఎస్ ఫౌండేషన్ దీనిని ఒక పూర్తిస్థాయి ప్రాజెక్ట్గా చేపట్టింది. వ్యాధి నివారణ గురించిన పరిశోధనలకు నిధుల సమీకరణ కోసం మార్గంగా మార్చింది. ఈ చాలెంజ్ ఇప్పటికే దాదాపు 10 దేశాలను చుట్టేసింది. 15.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే వ్యాధిపై పరిశోధనకు మరింత మొత్తం అవసరం అంటున్నారు ఫౌండేషన్ ప్రతినిధులు. లాస్ ఏంజెలిస్ నుంచి సిటీ వరకు.. డేవిడ్ బెక్హామ్, సత్య నాదెళ్ల, బిల్గేట్స్.. క్రిస్టియానో రొనాల్డొ, జస్టిన్ టింబర్లేక్, జిమ్మీ ఫాలన్.. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఐస్ బక్కెట్కి సై అన్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్కుమార్, రితేష్ దేశ్ముఖ్, బిపాసా బసు, అభిషేక్ బచ్చన్, సోనాక్షి సిన్హా.. వంటివారంతా సై సై అన్నారు. తాజాగా ఈ చాలెంజ్ సిటీకి వచ్చింది. ఇక్కడి సెలిబ్రిటీలను కూడా కదిలించింది. ఈ ఎఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్ను నగరానికి తీసుకొచ్చిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ హన్సిక మోత్వాని. తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో పాటు ఫ్యాన్స్ను కూడా చాలెంజ్కు నామినేట్ చేసింది. ఆమెతో పాటు సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, హీరో హర్షవర్ధన్ రాణే, నితిన్, ఉజ్వల్ భల్లా తదితర సెలబ్రిటీలు చాలెంజ్లు అందుకోవడమే ఆలస్యం.. బకెట్లతో ఐస్నీళ్లను నెత్తి మీద కుమ్మరించుకుంటూ యూ ట్యూబ్లో హల్ చల్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రాణేను గుత్తా జ్వాల చాలెంజ్ చేస్తే.. రంగం ఫేమ్ కార్తీకను, రానా దగ్గుబాటి తదితరులను హర్ష చాలెంజ్ చేశాడు. సిటీకి జస్ట్ ఇప్పుడే ఎంటరైన ఈ బకెట్ మేనియా మరెంతమంది నెత్తి మీద నాట్యం చేస్తుందో చూడాలి. ..:: ఎస్.సత్యబాబు -
తప్పదు.. తేడాలుంటాయ్
ముంబై: హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కే పారితోషికాలు తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. బెంగాలీ బ్యూటీ బిపాసా బసు ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పకుంది. పారితోషికాలు ఇలాగే కొనసాగుతాయని, ఈ విషయంలో మార్పు సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. దీని గురించి ఆలోచించడం కూడా వృథాయేనంటూ కుండబద్దలు కొట్టింది. సల్మాన్ ఖాన్ వంటి హీరోకు కత్రినా వంటి హీరోయిన్ జోడీగా ఉంటేనే ఆ సినిమా భారీ హిట్ కొట్టే అవకాశముంటుందని, అయినా పారితోషికాల్లో మాత్రం తేడాలు ఉంటాయని చెప్పింది. దీని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఒరిగేదీ లేదంటూ నిట్టూర్పు విడిచింది. అయితే పాత్రల విషయంలో మాత్రం సానుకూల మార్పులు వస్తున్నాయని, కథానాయికలకు కూడా సత్తా ఉన్నవి దొరుకుతున్నాయని చెప్పింది. ‘మాకు పరిశ్రమలో మంచిస్థానం దొరుకుతోంది. ఇదివరకైతే ఆడిపాడడానికే హీరోయిన్లు పరిమితమయ్యే వాళ్లు. పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలు మహిళలకూ వస్తున్నాయి. అన్ని వయసుల మహిళా నటులకు కూడా ఆసక్తికర పాత్రలు దొరుకుతున్నాయి’ అని చెప్పిన బిప్స్ 2001 నుంచి బాలీవుడ్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తాజా సినిమా క్రియేచర్ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. అంతేకాదు దీనిని 3డీ సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన బాబీ జాసూస్ వంటి మహిళల ఆధారిత చిత్రాల కథలు ఎంతో బాగున్నాయని ప్రశంసించింది. అయితే బిప్స్ తాజాగా నటించిన షమ్షకల్స్ బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అంతేగాక ఇందులో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే కాదు.. బిప్స్ కంటే చాలా జూనియర్ అయిన తమన్నాకు ప్రధాన హీరోయిన్ పాత్ర ఇచ్చారు. దీంతో బిపాసా బసు సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. -
తప్పదు.. తేడాలుంటాయ్
హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కే పారితోషికాలు తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. బెంగాలీ బ్యూటీ బిపాసా బసు ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పకుంది. పారితోషికాలు ఇలాగే కొనసాగుతాయని, ఈ విషయంలో మార్పు సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. దీని గురించి ఆలోచించడం కూడా వృథాయేనంటూ కుండబద్దలు కొట్టింది. సల్మాన్ ఖాన్ వంటి హీరోకు కత్రినా వంటి హీరోయిన్ జోడీగా ఉంటేనే ఆ సినిమా భారీ హిట్ కొట్టే అవకాశముంటుందని, అయినా పారితోషికాల్లో మాత్రం తేడాలు ఉంటాయని చెప్పింది. దీని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఒరిగేదీ లేదంటూ నిట్టూర్పు విడిచింది. అయితే పాత్రల విషయంలో మాత్రం సానుకూల మార్పులు వస్తున్నాయని, కథానాయికలకు కూడా సత్తా ఉన్నవి దొరుకుతున్నాయని చెప్పింది.‘మాకు పరిశ్రమలో మంచిస్థానం దొరుకుతోంది. ఇదివరకైతే ఆడిపాడడానికే హీరోయిన్లు పరిమితమయ్యే వాళ్లు. పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలు మహిళలకూ వస్తున్నాయి. అన్ని వయసుల మహిళా నటులకు కూడా ఆసక్తికర పాత్రలు దొరుకుతున్నాయి’ అని చెప్పిన బిప్స్ 2001 నుంచి బాలీవుడ్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తాజా సినిమా క్రియేచర్ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. అంతేకాదు దీనిని 3డీ సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన బాబీ జాసూస్ వంటి మహిళల ఆధారిత చిత్రాల కథలు ఎంతో బాగున్నాయని ప్రశంసించింది. అయితే బిప్స్ తాజాగా నటించిన షమ్షకల్స్ బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అంతేగాక ఇందులో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే కాదు.. బిప్స్ కంటే చాలా జూనియర్ అయిన తమన్నాకు ప్రధాన హీరోయిన్ పాత్ర ఇచ్చారు. దీంతో బిపాసా బసు సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. -
హర్మన్తో బిపాసా అఫైర్
కండల వీరుడు జాన్ అబ్రహాంతో ప్రేమాయణం సాగించిన బాలీవుడ్ భామ బిపాసా బసు, ఇప్పుడు హర్మన్ బవేజాతో అఫైర్ సాగిస్తోంది. హర్మన్తో తనకు సంబంధం ఉన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే, తానెప్పుడు స్థిరపడేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె అంటోంది. స్థిరపడటానికి తనపై తాను ఎలాంటి ఒత్తిడిపెంచుకోబోనని చెబుతోంది. దర్శకత్వం వైపు దియా మీర్జా చూపు నటిగానే కాకుండా, నిర్మాతగానూ తనను తాను విజయవంతంగా నిరూపించుకున్న దియా మీర్జా, త్వరలోనే ఏదైనా సినిమాకు దర్శకత్వం కూడా చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దర్శకత్వం చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరికగా ఉందని, అయితే, ఎప్పుడు దర్శకత్వం వహించేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె చెబుతోంది. మంచి కథ దొరికితే దర్శకత్వం గురించి ఆలోచిస్తానని అంటోంది. పంజాబీ చిత్రంతో మళ్లీ తెరపైకి ధర్మేంద్ర నిన్నటితరం హీరో ధర్మేంద్ర సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్నాడు. ‘డబుల్ ది ట్రబుల్’ పేరిట రూపొందుతున్న పంజాబీ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పంజాబీ హీరో జిప్పీ గ్రీవల్ కూడా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రంలోని ‘26 బన్గయీ’ పాట యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. -
జన్మలో మళ్లీ సాజిద్తో చేయను: బిపాషా
తాను ఈ జన్మలో మళ్లీ సాజిద్ ఖాన్ దర్శకత్వంలో నటించబోనని నల్ల కలువ బిపాషా బసు తేల్చిచెప్పేసింది. 'హమ్షకల్స్' సినిమాలో ఉన్న ఆరు కీలక పాత్రల్లో బిపాషాది కూడా ఒకటి. అయితే, ఈ సినిమా అంతగా ఆడలేదు. సినిమా నిర్మాతలు వాషు భగ్నానీ, ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో మాత్రం తనకు ఇబ్బంది ఏమీ లేదని.. సాజిద్ఖాన్ దర్శకత్వంలో మాత్రం నటించబోనని ఆమె చెబుతోంది. సినిమా ఫలితం చూసి తాను చాలా డిస్ట్రబ్ అయ్యానని, తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు నిజంగానే తెలియదని తెలిపింది. నిర్మాతలు ఈ సినిమాను నమ్ముకుని చాలా డబ్బు పెట్టారని, అయితే తనకు అబద్ధాలు చెప్పడం రాదు కాబట్టే వేదికల మీదకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పింది. తాను పరిశ్రమలో చాలాకాలం నుంచి ఉన్నానని, చాలామందితో కలిసి పనిచేసిన ఎప్పుడూ ఎవరూ తనకు వ్యతిరేకంగా లేరని, ఈసారే ఇలా జరిగిందని వాపోయింది. సినిమాలో తాను కేవలం ఆరు నిమిషాలే ఉన్నానని, ఏం చేస్తున్నానో కూడా తనకు తెలియలేదని చెప్పింది. ఈ సినిమాలో బిపాషాతో పాటు సైఫ్ అలీఖాన్, రామ్ కపూర్, రితేష్ దేశ్ముఖ్, తమన్నా, ఈషాగుప్తా ఉన్నారు. -
జిమ్కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్!
‘‘భవిష్యత్తు కోసం మనం డబ్బులు వెనకేసుకోవాలనుకుంటాం. దానికోసం పరుగులుపెట్టి సంపాదిస్తాం. కానీ, ఆరోగ్యంగా లేకపోతే ఏం లాభం’’ అని బిపాసా బసు అంటున్నారు. ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇచ్చే బిపాసా దానికి సంబంధించిన డీవీడీలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే జీవితాన్ని ఆస్వాదించలేం అంటున్నారు ఈ బ్యూటీ. అందుకే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండని సూచిస్తున్నారు. తన దగ్గర కేశాలంకార నిపుణురాలిగా చేస్తున్న అమ్మాయి చాలా బరువుగా ఉంటుందట. ఏవో సలహాలిచ్చి, తను సన్నబడేలా చేశారు బిపాసా. బరువు తగ్గిన తర్వాత మునుపటికన్నా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని ఆ హెయిర్ స్టయిలిస్ట్ అంటున్నారు. ఇక, ఇంట్లో వాళ్లకి బిపాసా ఇచ్చే సలహాలు అన్నీ ఇన్నీ కావట. ప్రతిరోజూ తన తల్లితో జాగింగ్ చేయిస్తుంటానని పేర్కొన్నారామె. ఇక, తన సోదరినైతే రోజూ జిమ్కెళ్లమంటారట. ఎప్పుడైనా జిమ్కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్ అని బెదిరిస్తుంటారట. ఒక్కరోజు వ్యాయామం చేయకపోతే ఆరోగ్యపరంగా వెనకబడ్టట్లే అంటున్నారు ఈ బెంగాలీ బ్యూటీ. మనం ఇప్పుడు చేసే వ్యాయామం ఆరోగ్యపరంగా మన భవిష్యత్తుకి మంచి పెట్టుబడివంటిదని బిపాసా చెబుతున్నారు. -
అవిభక్త కవలలుగా బిపాసా
ఏ ఆర్టిస్ట్కైనా మంచి పాత్ర చేసే అవకాశం వస్తే, అందులో ఒదిగిపోవడానికి శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ప్రస్తుతం బిపాసా బసు ఆ పని మీదే ఉన్నారు. తన పదమూడేళ్ల కెరీర్లో చేయనటువంటి విభిన్నమైన పాత్రను ఆమె చేయనున్నారు. ఈ పాత్ర ద్వారా నటిగా తన దాహం కొంత మేరకు తీరుతుందని సన్నిహితులతో చెబుతున్నారట బిపాసా. ఆ పాత్ర విషయానికొస్తే.. థాయ్ చిత్రం ‘ఎలోన్’ ఆధారంగా హిందీలో ఓ చిత్రం రూపొందనుంది. అవిభక్త కవలల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో కవలల పాత్రను బిపాసా చేయనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘సవాళ్లను ఎదుర్కోవడం నాకిష్టం. అందుకే ఈ సినిమా అంగీకరించాను. శారీరకంగా ఒకే విధంగా ఉండే కవలలు, మానసికంగా విభిన్నంగా ఉంటారు. అతుక్కుని పుట్టినా, మనస్తత్వాలు వేరు. ఈ రెండు కోణాలకు వ్యత్యాసం కనబర్చడానికి శాయశక్తులా కృషి చేస్తాను. అవిభక్త కవలల గురించి పత్రికల్లో చదివాను. టీవీల్లోనూ చూశాను. కానీ, వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూడలేదు. అందుకే, వారికి సంబంధించిన కొన్ని లఘు చిత్రాలు చూస్తున్నా. ఈ నెల 20న షూటింగ్ ఆరంభం కానుంది. కచ్చితంగా నా కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ‘ఎలోన్’ చిత్రం ఆధారంగా దక్షిణాదిన రూపొందిన ‘చారులత’లో ప్రియమణి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ప్రియమణికి మంచి పేరొచ్చింది. మరి బిపాసాకి ఎలాంటి అనుభూతి మిగులుతుందో. -
మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు!
‘‘ఇది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో నక్షత్రంలా మెరిసిపోవాలని, పోటీలో ముందుండాలని అందరికీ ఉంటుంది. ఆ పోటీ కారణంగా మనస్పర్థలు రావడం సహజం’’ అంటున్నారు తమన్నా. బిపాసా బసు, ఇషా గుప్తా, తమన్నా నాయికలుగా రూపొందిన ‘హమ్ షకల్స్’ ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రదర్శకుడు సాజిద్ఖాన్తో తమన్నాకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందుకని మిగతా ఇద్దరు తారలకన్నా తమన్నాకి ప్రాధాన్యం ఇస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ఈ కారణంగా తమన్నాపై బిపాసా ఆగ్రహంగా ఉన్నారని బాలీవుడ్ టాక్. ఈ విషయం గురించి, ఈ సినిమాలో తన పాత్రకున్న ప్రాధాన్యం గురించి తమన్నా చెబుతూ - ‘‘నేనో సినిమా అంగీకరించేటప్పుడు కథ, నా పాత్ర గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటాను. ‘హమ్ షకల్స్’లో నా పాత్ర నిడివి, ప్రాధాన్యం గురించి సాజిద్ ఖాన్ ఏదైతే చెప్పారో అలానే తీశారు. అందుకని, నాకెలాంటి అసంతృప్తీ లేదు. ఇద్దరు, ముగ్గురు కథానాయికలు కలిసి నటించినప్పుడు ఎవరి పాత్ర బాగుంటుంది? ఎవరికి ఎక్కువ పేరొస్తుంది? అని ఆలోచించడం సహజం. ఈ క్రమంలో మనస్పర్థలు నెలకొనడం, కొన్ని సందర్భాల్లో మాటా మాటా అనుకోవడం జరుగుతుంది. పోటీ ప్రపంచంలో జరిగే ఇలాంటి విషయాలను బయటివాళ్లు చిలవలు పలవలు చేసేస్తారు. వాస్తవానికి బిపాసా, నేను మాటా మాటా అనుకున్నది లేదు. గొడవ పడిందీ లేదు. మా కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలు లేవు. అందుకని, మా మధ్య స్నేహం పెరగలేదు. కానీ, తనతో కలిసి షూటింగ్ చేసినప్పుడు, నాకెలాంటి అసౌకర్యం కలగలేదు. బిపాసా మంచి కో-స్టార్. నాకెవరితోనూ గొడవలు లేవు. ఎందుకంటే, నాకసలు అభద్రతాభావమే లేదు’’ అని స్పష్టం చేశారు. -
ఆ ముగ్గురి మధ్య నిశ్శబ్ద యుద్ధం?
ఇద్దరు కథానాయికలతో సినిమా తీస్తే, ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉండేలా చూడటంతో పాటు, షూటింగ్ లొకేషన్లో కల్పించే సౌకర్యాల విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపొతే వారు అలుగుతారు. ఆ అలక వల్ల షూటింగ్ అటకెక్కే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీలైనంతవరకూ ఇద్దరు ముద్దుగుమ్మల మనసు నొప్పించకుండా జాగ్రత్త వహిస్తారు. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్కి ఈ విషయం తెలిసే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ తమన్నాకి ప్రాధాన్యం ఇచ్చి, బిపాసా బసు, ఇషా గుప్తాలను తక్కువ చేశారట. ఈ ముగ్గురూ కథానాయికలుగా సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్ముఖ్, రామ్కపూర్ కథానాయకులుగా ఆయన దర్శకత్వం వహించిన ‘హమ్ షకల్స్’ వచ్చే నెల 20న విడుదల కానుంది. సాజిద్ దర్శకత్వంలో రూపొందిన ‘హిమ్మత్వాలా’లో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచే సాజిద్, తమన్నాల మధ్య మంచి స్నేహం కుదిరిందనే వార్త ప్రచారం అయ్యింది. కొంతమంది అది స్నేహం కాదు.. ప్రేమ అని కూడా అంటున్నారు. కానీ, ‘తమన్నా నా చెల్లెలు లాంటిది’ అని ఆ మధ్య సాజిద్ ఓ ప్రకటన చేశారు. అయినప్పటికీ ఈ తమన్నాతో ఆయన ప్రవర్తిస్తున్న తీరు సందేహాలకు తావిస్తోందని హిందీ సినీవర్గాలు అంటున్నాయి. దానికి తగ్గట్టు ‘హమ్ షకల్స్’ షూటింగ్ సమయంలో తమన్నాకి ఇచ్చినంత ప్రాధాన్యం బిపాసాకూ, ఇషాకూ ఇవ్వలేదనే వార్త బయటకు వచ్చింది. చివరికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లోనూ తమన్నాదే హవా అట. దాంతో బిపాసా, ఇషాల మనసులు గాయపడ్డాయని సమాచారం. తమన్నాను నెత్తి మీద పెట్టుకుంటున్నాడని, తమను లెక్క చేయడం లేదని సన్నిహితుల దగ్గర వాపోయారట. సాజిద్ మీదే కాదు.. తమన్నా మీదా కోపం పెంచుకున్నారట. మొత్తం మీద ఈ ముగ్గురి నాయికల మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందని టాక్. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది కాబట్టి ఫర్వాలేదు.. లేకపోతే సాజిద్కి ఈ ఇద్దరూ చుక్కలు చూపించేవారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సినిమా రిలీజ్కు మరో 25 రోజులే ఉంది. ఈలోపు చిత్ర ప్రచార కార్యక్రమాలకు బిపాసా, ఇషా దూరంగా ఉంటారనే ఊహాగానాలూ ఉన్నాయి. ఏమవుతుందో మరి. -
బికినీలో ముగ్గురు బ్యూటీలు
ముగ్గురు ముద్దుగుమ్మలు... అదీ బికినీలో... మరి కుర్రాళ్లకు కనువిందు ఖాయం. నిద్ర ఖరాబు కావడం అంతకన్నా ఖాయం. దర్శక నిర్మాత సాజిద్ ఖాన్ 'హమ్ షకల్' లో డస్కీ బ్యూటీ బిపాశా బసు, నటి మోడల్ ఈశా గుప్తా, మిల్కీ బ్యూటీ తమన్నాలు బికినీలో కనిపించనున్నారు. అయితే ఈ అందాల ఆరబోతంతా సినిమాలోని ఒక సీనులో మాత్రమేనట. ఈ ముగ్గురమ్మలూ తమ శరీరాకృతికి సరిపోయే బికినీలు తామే సెలక్ట్ చేసుకుంటున్నారట. అంతే కాదు సెలెక్ట్ చేసుకున్న బికినీలకు తగిన శరీరాకృతిని సాధించుకునే పనిలో పడ్డారట. తన ప్రతి సినిమాలోనూ ఒక బికినీ సీనును తప్పనిసరిగా ఉంచే సాజిద్ ఈ సినిమాలోనూ అదే ఆచారాన్ని పాటించాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ లు హీరోలు. సినిమాను వాశూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20 న విడుదలవుతుంది. -
చర్చనీయాంశమైన లిప్లాక్
పాశ్చాత్య పోకడలు బాలీవుడ్లో రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే సహజీవనం అని కొందరు, పెళ్లికి ముందే శృంగారం అంటూ మరి కొందరు, మరోవైపు తెరపై విశృంఖలంగా లిప్లాక్లు ఇలా దాదాపు హాలీవుడ్ సంప్రదాయాలకు దగ్గరగా వెళ్లిపోతోంది బాలీవుడ్. నిజానికి మన భారతీయ సంస్కృతికి ఈ విధానం పూర్తి విరుద్ధం. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు, మళ్లీ మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని గౌరవించే రోజులు వస్తాయిలే అని ఆశావహులందరూ ఎదురు చూస్తున్న ఈ సమయంలో... వారి ఆకాంక్షలపై నీళ్లు జల్లుతూ... ఇటీవల జరిగిన ఐఫా వేడుకలో కరీనా కపూర్, బిపాసా బసు మరో వికృతమైన కొత్త పోకడకు తెర లేపారు. సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కరచాలనం చేసుకోవడం, మరీ క్లోజ్ ఫ్రెండ్సయితే ఆలింగనం చేసుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరు స్నేహితురాళ్లు ఐఫా వేడుకల్లో కలుసుకొని ఒక్కసారిగా అందరూ ‘హవ్వ..’ అనుకునేలా లిప్లాక్ చేసేసుకున్నారు. ఆ వేడుకలో వీరి లిప్లాక్ సర్వత్రా చర్చనీయాంశమైంది. హలీవుడ్లో లీసా, కేటీఫెర్రీ... ఇలాగే గతంలో లిప్లాక్ చేసుకున్నారు. అక్కడ ఇవన్నీ సహజం. కానీ మనది భారతదేశం. ఇక్కడ ఇలాంటివి చేయడం అంత చిన్న విషయం మాత్రం కాదు. ‘అందరూ సిగ్గు పడేలా ఇలా ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి, మన సంస్కృతికే వీరిద్దరూ మచ్చ తెచ్చారు’ అని ఆ వేడుకలో పలువురు బాహాటంగానే విమర్శించారట. ప్రస్తుతం హిందీ చిత్రసీమ అంతా ఈ లిప్లాక్ గురించే చెప్పుకుంటున్నారు. -
రెండు రోజుల పాత్రకు 28 లక్షలా?
మూడు పదుల వయసులో కూడా కుర్రకారు హాట్ ఫేవరెట్గా భాసిల్లుతున్న బాలీవుడ్ తార బిపాసాబసు. గతంలో ఉన్నంత హవా ఇప్పుడు లేకపోయినా... ఖాళీగా అయితే లేరు ఆమె. ‘టక్కరి దొంగ’ తర్వాత దక్షిణాదిలో బిపాసా ఏ సినిమా చేయలేదు. ఆమెను దక్షిణాదిలో నటింపజేయాలని పలు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. ఇటీవలే అలాంటి ఓ విఫలయత్నం జరిగింది. కన్నడం నుంచి బిప్స్కి ఓ ఆఫర్ వచ్చింది. సినిమా పేరు ‘మమ్ము టీ అంగడి’. ఇందులో ఓ అతిథి పాత్ర ఉంది. రెండు రోజులు మాత్రమే షూటింగ్. దానికే 28 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామని సదరు చిత్ర దర్శక, నిర్మాతలు బిప్స్ ముందు భారీ ఆఫర్ ఉంచారట. నిజానికి అంత చిన్న పాత్రకు ఆ స్థాయి పారితోషికం ఎవ్వరూ ఇవ్వరు. కన్నడంలో హీరోయిన్లకు కూడా ఇవ్వనంత పారితోషికం అది. అయితే... అంతటి ఆఫర్నీ సున్నితంగా తిరస్కరించారు బిపాసా. ఈ ఆఫర్ని బిప్స్ తిరస్కరించడానికి కారణం పారితోషికం నచ్చకనే అని బాలీవుడ్ టాక్. తన పారితోషికం రెండు కోట్ల పై మాటేనని, తాను అతిథి పాత్ర చేస్తే యాభై లక్షలైనా ఇవ్వడం న్యాయమని బిప్స్ తన సహచరులతో ఉన్నట్లు సమాచారం. 28 లక్షలంటే సాధారణమైన విషయం కాదని, పైగా రెండు రోజుల్లో అంత మొత్తం ఇస్తామంటే వదులుకోవడం సరైన పని కాదని సన్నిహితులు నచ్చజెప్పినా బిపాసా ససేమిరా అంటున్నారట. నేను నటిస్తే ఆ సినిమాకు క్రేజ్ రాదా? అమ్మేటప్పుడు నా పేరు వాడుకోరా? అలాంటప్పుడు నాకు యాభై లక్షలిస్తే తప్పేంటట అనేది బిపాసా వాదన. బిపాసా వాదనలో కూడా నిజం లేకపోలేదు. ఏమంటారు? -
తన గురించి ఒక్క వాక్యం కూడా చెప్పను!
గలగలా పారే గోదావరిలా బిపాసా బసు చాలా యాక్టివ్గా ఉంటారు. నాన్స్టాప్గా మాట్లాడటం ఆమెకు చాలా ఇష్టం. కానీ, ఈ మధ్య మాటలు తగ్గించేశారు. ముఖ్యంగా తన లవ్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. నటుడు హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించేశారు కూడా. జాన్ అబ్రహాంతో దాదాపు పదేళ్లు సహజీవనం చేసిన ఆమె, హర్మాన్తో బంధాన్ని మూడు ముళ్లతో పటిష్టం చేసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్గా తను ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తే తన జీవిత భాగస్వామి కాబోతున్నాడని, తనకన్నా హర్మాన్ మంచి మనిషి అని బిపాసా ట్విట్టర్లో పెట్టారు. హర్మాన్ గురించి ఇతర విశేషాలేమైనా చెబుతారా? అని ఇటీవల ఓ విలేకరి అడిగితే.. అస్సలు చెప్పనని నిర్మొహమాటంగా చెప్పారట బిపాసా. తమ బంధం గురించి ఏదైతే చెప్పాలనుకున్నానో అది ట్విట్టర్లోనే చెప్పేశానని, వేరే ఏ విషయలూ చెప్పనని, ప్రస్తుతానికి నిశ్శబ్దమే శ్రేయస్కరమని అన్నారట. జాన్తో ఎఫైర్ సాగించినప్పుడు, దాని గురించి ఎక్కువగా మాట్లాడేవారు బిపాసా. ఆ బంధం బెడిసికొట్టింది కాబట్టి, హర్మాన్తో అలా జరగకూడదనే ఆచి తూచి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారని ఊహించవచ్చు. -
లెజెండ్లో ఐటంసాంగ్ చేస్తోన్న బిపాసా...?
-
ఆట హంసానందినితోనే!
బాలకృష్ణతో అండర్ప్లే చేయిస్తే.. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించిన చిత్రం ‘సింహా’. కోడి రామకృష్ణ, బి.గోపాల్, వి.వి.వినాయక్ తర్వాత బాలకృష్ణను అంత జనరంజకంగా చూపించింది నిజంగా బోయపాటి శ్రీనే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘లెజెండ్’ సినిమా ప్రారంభం నుంచీ బోయపాటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సినిమాను ఆయన చకచకా పూర్తి చేసిన వైనం... కథపై తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ ఒక్కపాటను ఈ నెల 5 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో తెరకెక్కించనున్నారు. అయితే.. బాలీవుడ్ భామ బిపాసాబసు ఈ పాటలో నర్తిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదట. ఈ ప్రత్యేకగీతంలో బాలయ్యతో కాలు కదిపే తార హంసానందిని. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్న ఈ పాటలో హంసానందినితో పాటు ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన సోనాలీ చౌహాన్, మరికొందరు తారాగణం కూడా పాల్గొంటారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేసి, సినిమాను ఈ నెల 28న విడుదల చేయనున్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. రాధికా ఆప్టే ఓ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి కొర్రపాటి. -
రోమ్లో సరదాగా..!
బిపాసా బసు గత జీవితంలో కీలక ఘట్టం జాన్ అబ్రహాంతో చేసిన తొమ్మిదేళ్ల సహజీవనం. అప్పట్లో అది మధురంగా అనిపించిన బిప్స్కి, ఇప్పుడది పీడకలలా తయారయ్యింది. జాన్ నుంచి విడిపోయిన తర్వాత అతని జ్ఞాపకాలను చెరిపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయ్యారామె. కానీ, ఇటీవల జాన్ అబ్రహాం పెళ్లి చేసుకోవడంతో మరోసారి గతంలోకి వెళ్లిపోయి, దిగులుగా ఉంటున్నారట బిపాసా. ఆమె బాధను తాజా ప్రియుడు హర్మాన్ బవేజా చూడలేకపోతున్నారట. బిపాసాని ఆ మూడ్ నుంచి బయటపడేయడానికి ఎక్కడికైనా విహారయాత్రకు తీసుకెళితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారని వినికిడి. రోమ్ అంటే బిపాసాకి చాలా ఇష్టం అట. అందుకని, అక్కడికి తీసుకెళితే బిపాసా మామూలు మనిషి అవుతుందన్నది హర్మాన్ అభిప్రాయం. వీలు చూసుకుని ప్రేయసితో రోమ్ చెక్కేయాలనుకుంటున్నారట. -
నేను మంచి భార్యను అవుతాను!
హాట్ గాళ్ బిపాసా బసు యాక్ట్ చేయడం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు పదిహేనేళ్లయ్యింది. అయినా, ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వచ్చినట్లనిపిస్తోందంటున్నారు బిప్స్. ఇంకా తన కెరీర్లో చేయాల్సిన పాత్రలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారామె. ఒకవేళ రిటైర్ అవ్వాల్సి వస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్న బిపాసా ముందుంచితే -‘‘కలలో కూడా ఆ ఊహ రానివ్వను. ఎంతో కష్టపడి పైకొచ్చాను. చాలామంది అభిమానులను సంపాదించుకున్నాను. ఇండస్ట్రీలోనూ నన్ను అభిమానించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రేమాభిమానాలకు దూరం కాలేను. నటన అనేది ఓ వ్యసనంలాంటిది. దానికి నేను పూర్తిగా బానిసయ్యాను. భవిష్యత్తులో ఒకవేళ సినిమాలకు దూరం కావల్సి వస్తే... నేను తట్టుకోలేనేమో. ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. నా జీవితాంతం సినిమాల్లోనే ఉండాలన్నది నా కోరిక’’ అన్నారు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘తెలియదు. ఈ ప్రశ్న విన్నప్పుడల్లా నేను ఒత్తిడికి గురవుతుంటాను. కానీ, ఏదో రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే, నేను మంచి భార్యని అవుతానని నా నమ్మకం. నాకు ఇద్దరు బిడ్డలు ఉండాలని మా అమ్మ కోరిక. ఓ మంచి తల్లికి కావాల్సిన లక్షణాలన్నీ నాలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా. అమ్మనవుతా. ఇది కనుక మా అమ్మ చదివితే చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే, నా పెళ్లి కోసం ఆమె ఎన్నో కలలు కంటోంది’’ అని చెప్పారు బిపాసా బసు. -
ఎట్టకేలకు ఓ ఇంటివాడైన జాన్ అబ్రహం!
ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓ ఇంటివాడయ్యాడు. బిపాసా బసుతో విడిపోయాకా గత కొద్దికాలంగా మరో యువతితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకలో తన స్నేహితురాలు ప్రియా రాంచల్ ను జాన్ అబ్రహం వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి గురించి స్వయంగా జాన్ అబ్రహం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు అని జాన్ అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ప్రియాతో కలిసి జాన్ అబ్రహం అమెరికాలో పర్యటిస్తున్నారు. ముంబైలో ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసే ప్రియా, జాన్ అబ్రహంల మధ్య ప్రేమ వ్యవహారం 2010 నుంచి నడుస్తోంది. గతంలో సుమారు 9 సంవత్సరాల పాటు బాలీవుడ్ తార బిపాసా బసుతో జాన్ రిలేషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. -
ముంబైలో బ్లాక్ బ్యూటీ బిపాసా సందడి
-
జంతు సంక్షేమం కోసం బిపాసాబసు విరాళం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసాబసు తన జంతు ప్రేమను మరోసారి నిరూపించుకుంది. జంతు సంక్షేమం కోసం నిధులు సేకరిస్తున్న పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్(పేటా) సంస్థ సభ్యులకు వేలం కోసం తాను సంతకం చేసి ఇచ్చిన ‘బీబీ లవ్ యువర్సెల్ఫ్’ టీ షర్ట్, రెండు ఫిట్నెస్ డీవీడీలను అందజేసింది. ఈ వస్తువులన్నీ ఈబే డాట్కామ్ ద్వారా వేలం వేయబడతాయి. ఈ నిధులు ఏనిమల్ రహత్ అనే స్వచ్ఛంద సంస్థకు చేరతాయి. ఈ సందర్భంగా బిపాసా మాట్లాడుతూ..‘ నోరులేని జీవాలైన జంతువుల సంక్షేమానికి అహర్నిశలు పనిచేస్తున్న ఏనిమల్ రహత్కు మద్దతు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను..’ అని అన్నారు. ఏనిమల్ రహత్ సంస్థ మహారాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా గుర్రాలు, ఎడ్లు, గాడిదలతో బలవంతంగా పనిచేయించడాన్ని ఈ సంస్థ వ్యతిరేకిస్తోంది. -
బాగ్ దిల్లీ బాగ్
సాక్షి, న్యూఢిల్లీ: వారాంతాల్లో ఆలస్యంగా నిద్రలేచే రాజధాని నగరం ఆదివారం వేకువ జామున్నే పరుగు మొదలు పెట్టింది. ఎయిర్టెల్ హాఫ్ మారథాన్, ఆ వెంటనే బీజేపీ రన్ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడంతో ఆదివారాల్లో నిర్మానుష్యంగా ఉండే సెంట్రల్ ఢిల్లీ రోడ్లు కిక్కిరిశాయి. జవరహర్లాల్నెహ్రూ స్టేడియం నుంచి ఉదయం ఏడు గంటలకు మొదలైన హాఫ్ మారథాన్లో ఢిల్లీవాసులు ఉత్సాహం పాల్గొన్నారు. మొత్తం 31వేల ఒక వంద మంది హాఫ్ మారథాన్లో పాల్గొన్నారు. దీనిలో భారతీయులతోపాటు 309 మంది విదేశీయులు పాల్గొనడం విశేషం. విజేతకు 210,000 యూఎస్ డాలర్లు ప్రైజ్మనీకింద అందజేశారు. పురుషుల కేటగిరిలో ఇతోఫియాకి చెందిన టెస్గే 59 నిమిషాల 12 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు. కెన్యాకి చెందిన ఫ్లొరెన్స్కి పాల్గత్ మహిళల విభాగంలో గంట ఏడు నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేసి మొదటి బహుమతి గెలుచుకున్నారు. మారథాన్లో పాల్గొనేందుకు వచ్చిన వందలాదిమందితో స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. మిల్కాసింగ్, నటి బిపాసబసు ప్రత్యేక అతిథులుగా పాల్గొని పరుగెత్తేవారిని ఉత్సాహపరిచారు. సంగీతానికి అనుగుణంగా మిల్కాసింగ్ కాసేపు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. పరుగుపందెంలో పాల్గొనేవారి కోసం నిర్వాహుకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పరుగుపందెం వెళ్లే మార్గాల్లో మంచినీళ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఏడు అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా 1,200 మంది వలంటీర్ల నియమించడంతోపాటు 25చోట్ల సీసీటీవీల కెమెరాలను ఏర్పాటు చేశారు. పరుగు విజయవంతం కావడంపై ఢిల్లీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. -
మళ్లీ ప్రేమలో పడింది
బిపాసా బసు మళ్లీ ప్రేమలో పడిందా?... అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. జాన్ అబ్రహాంతో బిపాసా దాదాపు తొమ్మిదేళ్లు ఎఫైర్ సాగించిన విషయం తెలిసిందే. అతన్ని పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని బిపాసా అభిప్రాయం. కానీ, జాన్ అబ్రహాం ఇప్పుడప్పుడే పెళ్లికి సుముఖత చూపకపోవడంతో అతన్నుంచి విడిపోయింది బిపాసా. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. కొన్నాళ్లు ఒంటరిగా ఉండి, సోలో లైఫ్ బాగుందని చెప్పుకుంటూ వచ్చింది బిపాసా. కానీ, ఆ తర్వాత తోడొకరుండిన మహాభాగ్యము అనుకుందో ఏమో.. హర్మాన్ బవేజాకి మనసిచ్చేసింది. ఈ ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. కానీ, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నలుగురి దృష్టిలోనూ పడ్డారు. ఇటీవల శిల్పాశెట్టి ఇచ్చిన ఓ పార్టీకి ఇద్దరూ జాయింట్గా హాజరయ్యారట. అలాగే, ఈ జనవరిలో తన బర్త్డేని హర్మాన్తో కలిసి గోవాలో జరుపుకుంది బిపాసా. అప్పుడు ఈత కొలనులో వీళ్లు చేసిన సందడి తాలూకు ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఇన్నాళ్టికి తనకు ‘మిస్టర్ రైట్’ దొరికాడనే భావనలో బిపాసా ఉందట. ఈ ముద్దుగుమ్మ తల్లి, సోదరీమణులకు కూడా హర్మాన్ అంటే మంచి అభిప్రాయం ఉందని, బిప్స్కి తగిన వరుడు అతనేనని కూడా ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ టాక్. అలాగే హర్మాన్ సోదరి, బిపాసా మధ్య కూడా మంచి అనుబంధం మొదలైందట. దాంతో వీరి ప్రేమకు పెద్దల అనుమతి కూడా లభించేసిందని, ఇక ఆ పెళ్లి ముచ్చట జరగడమే ఆలస్యం అని బాలీవుడ్ భోగట్టా.