brian lara
-
భారత జట్టు కెప్టెన్గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్పూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
‘అతడిని లారా, సచిన్ అన్నారు.. ఒక్కరు కన్నెత్తి చూడలేదు.. తగిన శాస్తే’
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్ఎఫ్ బ్యాట్ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలిఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమిముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు. కాగా 2018లో ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా.. -
జో రూట్ అరుదైన ఘనత.. లారా ఆల్టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో లారా ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి. -
సచిన్, నేనూ కాదు.. అత్యుత్తమ క్రికెటర్ అతడే: లారా
క్రికెట్ ప్రపంచంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా రికార్డుల రారాజులుగా వెలుగొందారు. తమ తరంలోని ఆటగాళ్లకు సాధ్యం కాని అరుదైన ఘనతలెన్నో సాధించారు.అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాల వీరుడిగా సచిన్ చెక్కు చెదరని రికార్డుని సొంతం చేసుకుంటే.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400) బాది రికార్డుల్లో తన పేరును పదిలం చేసుకున్నాడు లారా.ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం గౌరవ, మర్యాదలతో మెలగడమే కాకుండా చిరకాల స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినపుడల్లా సచిన్పై ప్రశంసలు కురిపించే బ్రియన్ లారా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తామిద్దరి కంటే కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు వేరొకరు ఉన్నారంటూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లారా చెప్పిన క్రికెటర్ మరెవరో కాదు ఆల్రౌండర్ కార్ల్ హూపర్. విండీస్ మాజీ కెప్టెన్.ఈ విషయం గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన లారా.. ‘‘కార్ల్ వంటి అత్యుత్తమ ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. టెండుల్కర్ గానీ, నేను గానీ ప్రతిభ విషయంలో అతడికి దరిదాపుల్లో కూడా లేమంటే అతిశయోక్తి కాదు.కెప్టెన్గానూ కార్ల్ కెరీర్ ఎంతో మెరుగ్గా ఉంది. సారథిగా ఉన్న సమయంలోనూ సగటున 50కి పైగా పరుగులు సాధించాడు. నిజానికి వివియన్ రిచర్ట్స్కి నాకంటే కూడా కార్ల్ అంటేనే ఎక్కువ ఇష్టం.అతడి ఆటను ఇష్టపడేవాడు. తనపైనే ప్రేమను కురిపించేవాడు’’ అని పేర్కొన్నాడు. కాగా 1987- 2003 మధ్య కాలంలో వెస్టిండీస్కు ప్రాతినిథ్యం వహించాడు కార్ల్ హూపర్.కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. కెరీర్లో మొత్తంగా 102 టెస్టులు ఆడిన హూపర్ 5762 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇక 114 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 227 వన్డేల్లో ఏడు సెంచరీల సాయంతో 5761 రన్స్ చేసిన కార్ల్ హూపర్.. 193 వికెట్లు పడగొట్టాడు. కాగా 1999 వరల్డ్కప్ టోర్నీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన హూపర్.. 2001లో కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. 22 టెస్టుల్లో విండీస్కు అతడు సారథిగా వ్యవహరించాడు.కెప్టెన్ కాకముందు హూపర్ బ్యాటింగ్ సగటు 36.46గా ఉంటే.. నాయకుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 46కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే లారా హూపర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
వాళ్లిద్దరికే ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది: లారా
క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇంత వరకు 400(నాటౌట్) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ లారా. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా.. ఫస్ట్క్లాస్ క్రికెట్ ఏకంగా 501(నాటౌట్) రన్స్ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.దూకుడైన ఆటగాళ్లు తక్కువేఈ నేపథ్యంలో బ్రియన్ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.‘‘నేను క్రికెట్ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్గా ఆడుతున్నారు.వీరిద్దరికే ఆ సత్తా ఉందిఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్ లారా డైలీ మెయిల్తో వ్యాఖ్యానించాడు.కాగా టీమిండియా భవిష్య కెప్టెన్గా పేరొందిన ఓపెనర్ శుబ్మన్ గిల్కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించాడు. చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8 మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్కప్లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లను ఓడించి సెమీస్కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్పై లారా వ్యాఖ్యలు
టీమిండియాను ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో లీగ్ దశలో రాణిస్తున్నా.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే భారత జట్టు నాకౌట్ మ్యాచ్లలో తేలిపోతోందన్నాడు.జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉన్నా టైటిల్ గెలవకపోతే ఏం లాభమని పెదవి విరిచాడు. కనీసం ఈసారైనా బలహీనతలు అధిగమించి వరల్డ్కప్ ట్రోఫీ గెలిచేలా వ్యూహాలు రచించాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు లారా సూచించాడు.పదకొండేళ్లుగా నిరీక్షణకాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. పదకొండేళ్లుగా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.ఇక హెడ్కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేక టైటిల్ వేటలో వెనుకబడింది.మరో అవకాశంఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో వీరిద్దరు తమను తాము నిరూపించుకునే మరో అవకాశం వచ్చింది. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు.వ్యూహాలే లేవుటీమిండియాను కలవరపెడుతున్న అంశాలేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గత టీ20, వన్డే వరల్డ్కప్ ఈవెంట్లలో భారత జట్టును గమనిస్తే.. వారి వద్ద టోర్నీలో ముందుకు సాగేందుకు సరైన ప్రణాళికలు లేవని అనిపించింది.మీ దగ్గర వరల్డ్కప్ గెలిచే వ్యూహాలు లేనపుడు.. జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉంటే ఏం లాభం? ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి అన్న విషయాలపై స్పష్టత ఉండాలి కదా!ఈసారైనా ద్రవిడ్ఈసారి రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రపంచకప్ గెలిచే ప్లాన్ చేస్తాడనే ఆశిస్తున్నా’’ అని లారా ఐసీసీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్కప్ టోర్నీలో.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్తో కలిసి View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
T20 WC: ఆసీస్ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలుకానుంది.అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్కప్లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్-8 జట్ల మధ్యే ఉండనుంది.ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లుటీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.ఊహించని పేరు చెప్పిన లారామెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పేర్లు చెప్పగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ జట్టుకు తన టాప్-4లో స్థానమిచ్చాడు.గావస్కర్ టాప్-4 జట్లు ఇవేఅండర్డాగ్స్గా టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టే అఫ్గన్.. ఈసారి కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్ సునిల్ గావస్కర్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈసారి సెమీస్ చేరతాయని జోస్యం చెప్పాడు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ను టాపార్డర్కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్తో మ్యాచ్తో తాజా వరల్డ్కప్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్లోనే బ్యాటింగ్కు పంపాలి. వన్డౌన్లోనే అతడు ఆడాలి.టాపార్డర్లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్డౌన్లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే.. -
T20 వరల్డ్కప్కు లారా భారత జట్టు ఇదే.. ఊహించని ప్లేయర్కు ఛాన్స్
టీ20 వరల్డ్కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో 48 గంటల్లో ప్రకటించనుంది. ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకున్నారు. వరల్డ్కప్ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు ఉండే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్, నయా ఫినిషర్ రింకూ సింగ్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్కు ఛాన్స్ ఇచ్చాడు. అదే విధంగా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, రిషబ్ పంత్లను లారా ఎంపిక చేశాడు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబేలకు చోటు దక్కింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్ సంచలనం మయాంక్ యాదవ్కు సైతం లారా అవకాశమిచ్చాడు.వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లకు ఫాస్ట్ బౌలర్లగా బ్రియాన్ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు. -
కోహ్లిని ఓపెనర్గా పంపితే అంతే సంగతులు!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ను పంపితేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అలా కాదని విరాట్ కోహ్లిని గనుక ఓపెనర్గా ప్రమోట్ చేస్తే టీమిండియాకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి ఏకంగా 316 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఈ క్రమంలో పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సైతం ప్రస్తుతానికి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. నాలుగు మ్యాచ్లలో కలిపి 118 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారత టీ20 జట్టుకు దూరం కాగా.. యువ ఆటగాళ్లు వరుసగా అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, రోహిత్ ,కోహ్లి ఇటీవలే రీఎంట్రీ ఇవ్వగా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఐపీఎల్లో మాత్రం అదరగొడుతూ ఇక ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్-2024 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తరుణంలో కోహ్లికి భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. యువ ఆటగాళ్లకు చోటిచ్చే క్రమంలో కోహ్లికి ఛాన్స్ రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బ్యాట్తోనే విమర్శకులకు సమాధానమిస్తున్నాడు కోహ్లి. మరోవైపు.. ఈసారి కూడా రోహిత్ శర్మనే ఈ వరల్డ్కప్లో భారత జట్టును ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా స్టార్ స్పోర్ట్స్ షోలో ‘విరాహిత్’ ద్వయం గురించి తన ఆలోచనలు పంచుకున్నాడు. ‘‘ఈసారి వెస్టిండీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వెళ్తారేమో అనిపిస్తోంది. జట్టును ఎంపిక చేసేటపుడు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తారు. అయితే, ప్రతి ఒక్కరికి తమదైన స్థానంలో రాణించే సత్తా ఉంటుంది. దాని ఆధారంగానే జట్టు కూర్పు ఉండాలి. ఒకవేళ పవర్ ప్లేలో 70-80 పరుగులు కావాలనుకుంటే దూకుడుగా ఆడే వాళ్లు ఉండాలి. నా దృష్టిలో రోహిత్, విరాట్.. ఇద్దరూ గొప్ప ప్లేయర్లే. అయినా.. వీరిలో ఒక్కరినే ఓపెనర్గా పంపాలి. అంటే రోహిత్ ఎప్పటి నుంచే ఈ పని చేస్తున్నాడు. కాబట్టి తనకి జోడీగా యువ ఆటగాడినే పంపాలి. ఎందుకంటే ఒకవేళ కోహ్లిని గనుక ఓపెనర్గా పంపితే.. ఆరంభంలోనే వీరిద్దరు అవుటైతే మిడిలార్డర్లో ఉన్న వాళ్లపైనే భారం పడుతుంది. అది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి కోహ్లిని ఓపెనర్గా పంపాలనే ఆలోచన పక్కనపెట్టి మూడో స్థానంలో పంపితేనే బాగుంటుంది’’అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. -
వాళ్లు సచిన్ కంటే లారా బెటర్ అనుకుంటారు.. కానీ: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండుల్కర్. పదహారేళ్ల వయసులో.. 1989లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ‘మాస్టర్ బ్లాస్టర్’ 2013లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఇరవై నాలుగేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు లెక్కకుమిక్కిలి ఘనతలు సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న ఈ లెజెండ్.. అత్యధిక పరుగుల వీరుడిగానూ చెక్కు చెదరని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీటితో పాటు మరెన్నో అరుదైన ఫీట్లు నమోదు చేసి అత్యుత్తమ క్రికెటర్గా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, ఆస్ట్రేలియన్లు మాత్రం వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారానే సచిన్ కంటే మెరుగైన ఆటగాడని భావిస్తారట. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బచర్ ఈ మాట అంటున్నాడు. అయితే, తన దృష్టిలో మాత్రం సచిన్.. లారా కంటే ఎంతో గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా అని పేర్కొన్నాడు. అందుకే సచిన్ గొప్ప బ్యాటర్ అంటాను ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘సచిన్ టెండుల్కర్ అసాధారణ ఆటగాడు. అందరిలా కాకుండా.. అతడు వేరొక గ్రహం నుంచి వచ్చాడనే అనుకుంటా. అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ఎన్నో చూశాను. అయితే, వాటన్నింటి కంటే కూడా వ్యక్తిగా అతడు మిగత వారి కంటే ఎంతో ఉత్తముడు. అతడు మైదానంలోపల లేదంటే వెలుపల.. ఎవరితోనైనా వాదనకు దిగడం చూశారా? నేనైతే ఎప్పుడూ అలాంటివి చూడలేదు. అందుకే అతడు మిగతా వాళ్లకంటే గొప్పవాడు. ఆనందజీవి అని చెబుతాను. మీకు తెలుసా.. ఆస్ట్రేలియన్లు సచిన్ కంటే లారా బెటర్ అని భావిస్తారు. నేనైతే ఆ మాటను రబ్బిష్ అని కొట్టిపారేస్తా. బ్రియన్ లారా నాలుగు మిలియన్ల మంది ముందు ఆడితే.. ఈ మనిషి(సచిన్ను ఉద్దేశించి) 1.4 బిలియన్ల మంది కోసం ఆడాడు. అలాంటపుడు అతడిపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? అదీ అతడి గొప్పతనం’’ అని అలీ బచర్.. సచిన్ టెండుల్కర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా అలీ సౌతాఫ్రికా తరఫున పన్నెండు టెస్టు మ్యాచ్లు ఆడాడు. పరుగుల వీరుడు సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ కెరీర్ సచిన్ టెండుల్కర్ టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 18426 రన్స్ తీశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? -
నా ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసే సత్తా గిల్కు మాత్రమే ఉంది: లారా
టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునిక తరం క్రికెటర్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడాడు. తన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగల సత్తా కేవలం గిల్కు మాత్రమే ఉందంటూ అతడిని ఆకాశానికెత్తాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయిన శుబ్మన్ గిల్.. టెస్టు, వన్డే, టీ20లలో ఇప్పటికే సెంచరీలు నమోదు చేశాడు. తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ పంజాబీ బ్యాటర్.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్లలో నాలుగు అద్భుత అర్ధ శతకాల సాయంతో 354 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్మెషీన్ విరాట్ కోహ్లిల తర్వాత ఈ జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆనంద్బజార్ పత్రికతో మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కాకుండా టెస్టుల్లోనూ గిల్ ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అంచనా వేశాడు. ‘‘నా పేరిట ఉన్న రెండు ప్రపంచ రికార్డులను శుబ్మన్ గిల్ తప్పక బద్దలు కొడతాడు. ప్రస్తుత తరంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో గిల్ ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలే సత్తా ఉన్నవాడు. నా మాటలు గుర్తుపెట్టుకోండి.. రాసిపెట్టుకోండి అతడు నా రికార్డులను బ్రేక్ చేస్తాడు. గిల్ ఒకవేళ కౌంటీ క్రికెట్ ఆడితే నా 501 నాటౌట్ రికార్డును.. అదే విధంగా టెస్టుల్లో నా అత్యధిక స్కోరు 400 పరుగులను అతడు దాటేస్తాడు. వరల్డ్కప్-2023లో గిల్ సెంచరీ చేయకపోవచ్చు. కానీ అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్ ఇప్పటికే ఆడేశాడు. ప్రతి ఫార్మాట్లోనూ అతడు సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్లోనూ ఒంటిచేత్తో ఎన్నోసార్లు తన జట్టును గెలిపించాడు. భవిష్యత్తులో గిల్ కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్లు గెలుస్తాడు’’ అని లారా 24 ఏళ్ల శుబ్మన్ గిల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా సౌతాఫ్రికా టూర్లో భాగంగా గిల్ టీ20, టెస్టు సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. చదవండి: Ind vs SA: సౌతాఫ్రికాపై గెలవడం అంత సులువేం కాదు.. అక్కడ నెగ్గాలంటే: ద్రవిడ్ -
WC 2023: ఒకేరోజు కోహ్లి- రోహిత్ సరికొత్త చరిత్ర.. లారా, ఏబీడీ రికార్డులు బ్రేక్
ICC ODI WC 2023- Virat Kohli- Rohit Sharma: వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపునకు పునాది వేస్తే.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం(53)తో దానిని మరింత బలపరిచాడు. ఇక వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లి.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(34- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) రోహిత్ దూకుడు.. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ ఇలా పుణెలో బంగ్లాతో మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెడితే.. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కోహ్లి విజయంగా మలిచి మరోసారి ఛేజింగ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో.. రన్మెషీన్ కోహ్లి పలు అరుదైన రికార్డులు సాధించగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ సైతం కోహ్లితో కలిసి ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్కప్ చరిత్రలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల లిస్టులో ‘విరాహిట్’ ద్వయం ఒకేరోజు(అక్టోబరు 19) టాప్-5లోకి చేరుకోవడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) లారా, ఏబీడీ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో కోహ్లి, రోహిత్.. వరుసగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ను అధిగమించారు. ఈ జాబితాలో ఓవరాల్గా నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి.. భారత బ్యాటర్లలో సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్తో జట్టు విజయాన్ని ఖరారు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వన్డే వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►సచిన్ టెండుల్కర్(ఇండియా)- 2278 రన్స్- 44 ఇన్నింగ్స్లో ►రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 1743 రన్స్- 42 ఇన్నింగ్స్లో ►కుమార్ సంగక్కర- 1532 రన్స్- 35 ఇన్నింగ్స్లో ►విరాట్ కోహ్లి- 1286 రన్స్- 30 ఇన్నింగ్స్లో ►రోహిత్ శర్మ- 1243 రన్స్- 21 ఇన్నింగ్స్లో ►బ్రియన్ లారా- 1225 రన్స్- 33 ఇన్నింగ్స్లో ►ఏబీ డివిలియర్స్- 1207 రన్స్- 22 ఇన్నింగ్స్లో. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..
Sachin Tendulkar- history Test cricket: క్రికెట్లో రికార్డులకు మారుపేరు సచిన్ టెండుల్కర్. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ లెక్కనేనన్ని ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా నేటికీ కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుత తరం బ్యాటర్లలో ఎవరు ఏ రికార్డు సాధించినా అందులో సగం వరకు సచిన్ పేరుతో ముడిపడి ఉంటాయంటే ఈ టీమిండియా లెజెండ్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ను పెద్దగా ఇష్టపడని వాళ్లకు సైతం ఆయన పేరు సుపరిచితమే. మరి అలాంటి.. మన క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో అక్టోబరు 17కు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా? సరిగ్గా ఇదే రోజు.. 2008లో సరిగ్గా ఇదే రోజు.. మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా సచిన్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా.. కంగారూ జట్టు పేసర్ పీటర్ సిడెల్ బౌలింగ్లో.. గల్లీ దిశగా బంతిని తరలించాడు సచిన్. లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్ ఈ క్రమంలో మూడు పరుగులు సాధించిన లిటిల్ మాస్టర్.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ ముందు వరకు 11,953 పరుగులతో లారా అగ్రస్థానంలో ఉండేవాడు. ఇక 2006లోనే ఈ విండీస్ లెజెండ్ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పగా.. 2008లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా సచిన్ టెస్టుల్లో ఆల్టైమ్ లీడ్ రన్స్కోరర్గా అవతరించాడు. ఆసీస్ ఆటగాళ్ల అభినందనలు ఇక కెరీర్లో అరుదైన ఘనత సాధించిన సచిన్ టెండుల్కర్కు నాడు మొహాలీ ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. నాటి ఆసీస్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సహా ఇతర ఆటగాళ్లు సచిన్ దగ్గరకు వచ్చి అభినందనలు తెలిపారు. వంద శతకాల వీరుడు.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఘనుడు కాగా 152 టెస్టులో సచిన్ టెండుల్కర్ 11955 పరుగులతో లారాను అధిగమించగా.. లారా 131 మ్యాచ్లలోనే 11953 రన్స్ సాధించాడు. అప్పటికి సచిన్ అత్యుత్తమ స్కోరు 248 నాటౌట్ కాగా.. లారా స్కోరు 400- నాటౌట్. ఇక తన 24 ఏళ్ల కెరీర్లో సచిన్ టెండుల్కర్ మొత్తంగా 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోరు 248 కాగా.. వన్డేల్లో 200. టెస్టు సెంచరీలు 51. వన్డే సెంచరీలు 49. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్కు భారీ షాక్! RECORDULKAR "Success is a process & during that journey sometimes there're stones thrown at you & you convert them into milestones"#OnThisDay in 2008 at 2.31pm, @sachin_rt became the Highest Run Scorer when he went past Lara's tally of 11,953 Test runspic.twitter.com/5VOdLBrdZu — Cricketopia (@CricketopiaCom) October 17, 2023 -
'అతడొక సంచలనం.. కచ్చితంగా ప్రపంచ క్రికెట్ను ఏలుతాడు'
టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ప్రపంచక్రికెట్ను ఉమ్రాన్ మాలిక్ శాసిస్తాడని లారా కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గత రెండు సీజన్లగా ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాప్లో లారా కూడా భాగంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్కిల్స్ను లారా దగ్గర నుంచి చూశాడు. మాలిక్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్తో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో కూడా చోటు దక్కలేదు. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లారా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఉమ్రాన్ ఒక పేస్ బౌలింగ్ సంచలనం. కానీ పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని మాలిక్ వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు బంతితో అద్బుతాలు చేసే విధంగా ఉండాలి. అతడు ఇంకా తన బౌలింగ్ స్కిల్స్ను పెంచుకోవాలి. అయితే ఉమ్రాన్కు ఇప్పుడు కేవలం 23 ఏళ్ల మాత్రమే. ఇంకా అతడికి చాలా భవిష్యత్తు ఉంది. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్తో పాటు కొన్ని ట్రిక్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో డేల్ స్టెయిన్తో కలిసి పనిచేశాడు. కాబట్టి అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఉమ్రాన్ వరల్డ్క్రికెట్ను ఏలుతాడని" జోస్యం చెప్పాడు. చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్ -
IPL 2024: సన్రైజర్స్లో కీలక పరిణామం.. హెడ్ కోచ్కు ఉద్వాసన..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి. ఫ్లవర్ను తప్పించి లాంగర్ను ఎంచుకున్న లక్నో.. లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్కు చేరింది. బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్రైజర్స్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్రైజర్స్ గత సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. ఫ్లవర్కు భలే గిరాకి.. లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్కు ఐపీఎల్లో భలే గిరాకి ఉంది. కోచ్గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్సీబీలో కీలక మార్పులు.. 2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్గా నియమించుకుంది. -
Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి!
India Tour Of West Indies: అనిల్ కుంబ్లే.. ఈ రైట్ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. తన సుదీర్ఘ కెరీర్లో మేటి జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ కర్ణాటక బౌలర్.. భారత్ తరఫున 132 టెస్టులాటి 619 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా స్టార్ టెస్టు స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. 1990లో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుంబ్లే.. భారత జట్టు సారథిగానూ సేవలు అందించాడు. కెరీర్లో ఎదురైన సవాళ్లంటినీ అధిగమించి మేటి బౌలర్గా ఎదిగాడు. ఇక కుంబ్లేకు వెస్టిండీస్తో మ్యాచ్ అంటే చాలు పూనకాలే! బ్రియన్ లారా వంటి దిగ్గజాలను పెవిలియన్కు పంపితే ఆ మజానే వేరని భావించేవాడట! దవడ పగిలినా దవడ విరిగిపోయినా మైదానం వీడక బౌలింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా టీమిండియా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అనిల్ కుంబ్లే 2002 నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వా టెస్టు సందర్భంగా మెర్విన్ ధిల్లాన్ షార్ట్ డెలివరీ కారణంగా బంతి బలంగా తాకి అనిల్ కుంబ్లే దవడ పగిలింది. దీంతో మ్యాచ్కు దూరమవ్వాల్సి పరిస్థితి. విరామ సమయంలో తన భార్య చేతనకు ఫోన్ చేసి విషయం చెప్పాడు కుంబ్లే. సర్జరీ కోసం ఇంటికి వస్తున్నానని ఆమెతో అన్నాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి దిగాడు. 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్రియన్ లారా వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ విషయం గురించి కుంబ్లే జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘నా భార్య చేతనకు కాల్ చేసి.. సర్జరీ చేయించుకోవాలి ఇంటికి వస్తున్నా అని చెప్పాను. జోక్ చేస్తున్నా అనుకుంది అందుకోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేస్తానని తను నాతో అంది. ఇక కాల్ కట్ చేసే ముందు.. ‘‘నేను వెళ్లి బౌలింగ్ చేస్తాను’’అని తనతో అన్నాను. కానీ చేతన నమ్మలేదు. నేను జోక్ చేస్తున్నా అనుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు తాను బౌలింగ్ కొనసాగించడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. 2002 నాటి ఐదు మ్యాచ్ల సిరీస్ను విండీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా పర్యటనలో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. విండీస్పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించింది ఇతడే! జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్ -
టీమిండియాతో వరుస సిరీస్లు.. వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం!
భారత వేదికగా జరగున్న వన్డే ప్రంపచకప్-2023కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిల్లో ఓటమి పాలై కరీబియన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్లో వెస్టిండీస్కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ ఆడనుంది. ఇక క్వాలిఫయర్స్ ముగిసిన వెంటనే విండీస్ జట్టు స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టనుంది. స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ మల్టీ ఫార్మాట్ సిరీస్లో విండీస్ జట్టు తలపడనుంది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ సిరీస్ ప్రారంభం కానుంది. మెంటార్గా బ్రియాన్ లారా ఇక గత కొంత కాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న విండీస్ జట్టును చక్కదిద్దే పనిలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పడింది. టీమిండియాతో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీస్లలో విండీస్ జట్టు మెంటార్గా దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారాను నియమించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విండీస్ ప్రాక్టీస్ సెషన్స్కు లారా హాజరవుతోన్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో మునిగి తెలుతోంది. వెస్టిండీస్తో టెస్టు 'సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: భారత జట్టు హెడ్కోచ్గా ముజుందార్.. త్వరలోనే ప్రకటన -
అమెరికాలో.. దిగ్గజ క్రికెటర్లతో సంజూ శాంసన్! ఫొటో వైరల్
Sanju Samson In USA: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య చారులతతో కలిసి యూఎస్ఏలో పర్యటిస్తున్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని యూఎస్ఏ ట్రిప్లో తన సతీమణితో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య చారులతతో పలు ఫొటోలు షేర్ చేసిన సంజూ.. తాజాగా ఇద్దరు క్రికెటర్ దిగ్గజాలతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్, వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశాడు. ‘గ్రేట్ కంపెనీ’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. స్టైలిష్ లుక్ ఇందులో షేన్ బాండ్, లారా నడుమ నిలబడ్డ సంజూ స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్నాడు. కాగా షేన్ బాండ్, బ్రియన్ లారా ఐపీఎల్-2023లో భాగమైన విషయం తెలిసిందే. బాండ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించగా.. లారా సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్కోచ్గా సేవలు అందించాడు. మరోవైపు.. సంజూ.. రాజస్తాన్ రాయల్స్ సారథిగా జట్టును ముందుకు నడిపిన విషయం తెలిసిందే. గత సీజన్లో రాజస్తాన్ను ఫైనల్కు చేర్చిన సంజూ.. ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. విండీస్తో వన్డేలకు ఇక మొత్తంగా 14 మ్యాచ్లలో 362 పరుగులు సాధించాడు ఈ కేరళ బ్యాటర్. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటనకు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో సంజూకు చోటు దక్కింది. విండీస్తో వన్డేలకు అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. 2015లో తొలిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ శాంసన్.. ఇప్పటి వరకు 11 వన్డేలు, 17 టీ20 మ్యాచ్లు ఆడాడు. వరుసగా 330, 301 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు భారత జట్టు వెస్టిండీస్ టూర్తో బిజీ కానుంది. వెస్టిండీస్తో వన్డేలకు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్. చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత.. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) -
ఔను.. ఇంగ్లండ్లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 విజేతగా పాట్ కమ్మిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. మరోవైపు ఐసీసీ టైటిల్ సాధించి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేనకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. అంతకుముందు 2021లో ఇదే ఇంగ్లండ్లో న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా భారత జట్టు ఓటమి చవిచూసింది. కాగా డబ్ల్యూటీసీ-2025 కూడా ఇంగ్లండ్లోనే జరగనుండడం గమనార్హం. అయితే ఈ చాంపియన్షిప్ ఫైనల్ను కేవలం ఇంగ్లండ్లోనే నిర్వహించడం సరికాదని పలువరు మాజీలు మొదటి నుంచే అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త ఆసహనం వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. "ఫైనల్కు ఇంగ్లండ్లోనే నిర్వహించాలనే రూల్ కూడా ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ మ్యాచ్ నిర్వహించవచ్చు. అది కూడా జూన్లోనే షెడ్యూల్ చేయాలని లేదు కాదా. సీసీ ట్రోఫీ గెలవడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఈ ఓటమితో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరు తీవ్ర నిరాశకు గురయ్యారు" అని అన్నాడు. తాజాగా రోహిత్ వాఖ్యలతో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా ఎకీభవించాడు. తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్ను తన స్వదేశం బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో నిర్వహించాలని లారా అభిప్రాయపడ్డాడు. "డబ్ల్యూటీసీ-2025ను బార్బడోస్లో నిర్వహించాలని నేను భావిస్తున్నాను. అది కూడా జూన్లో కాకుండా మార్చిలో జరగాలి. ఫైనల్కు చేరే రెండు జట్ల ఐస్లాండ్స్ అందాలను ఆస్వాదించాలని" ఓ యూజర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టుకు లారా రిప్లే ఇచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ (2023–25) సైకిల్లో భాగంగా భారత జట్టు తమ తొలి సిరీస్లో వెస్టిండీస్తో తలపడనుంది. విండీస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జులై 12–16 మధ్య తొలి టెస్టు (డొమినికాలో), జులై 20–24 మధ్య రెండో టెస్టు (ట్రినిడాడ్)లో జరుగుతాయి. చదవండి: #RAshwin: బాధ కలిగిన మాట నిజమే.. -
SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు!
IPL 2023 SRH Vs MI- Brian Lara Comments: తమ జట్టు మిడిలార్డర్ను మరింత పటిష్టం చేయాల్సి ఉందని.. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నామని సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చగల ఫినిషర్ల అవసరం ఉందని పేర్కొన్నాడు. తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు సన్రైజర్స్లో కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్.. ముంబై ఇండియన్స్తో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అలా కథ ముగిసింది టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. దీంతో 14 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో రైజర్స్ గెలుపొందాలంటే 20 పరుగులు అవసరమైన వేళ.. రోహిత్ శర్మ..అర్జున్ టెండుల్కర్ చేతికి బంతినిచ్చాడు. అప్పటికి భువనేశ్వర్ కుమార్తో పాటు క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్.. చివరి ఓవర్ రెండో బంతికి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మయాంక్ మార్కండే క్రీజులోకి రాగా.. రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు రాగా.. మరుసటి బంతికి అర్జున్.. భువీని పెవిలియన్కు పంపడంతో సన్రైజర్స్ కథ ముగిసింది. వాళ్లలాంటి ఆటగాళ్లు కావాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రైజర్స్ కోచ్ లారా మాట్లాడుతూ.. ‘‘మేము ఆ విషయం(మిడిలార్డర్)లో ఇంకా కసరత్తులు చేస్తున్నాం. మ్యాచ్ చివరి వరకు ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో ఉండాలి. తెవాటియా, మిల్లర్ లాంటి ప్లేయర్ల అవసరం మాకు ఉంది. ఒత్తిడిలోనూ మ్యాచ్ను ఎలా ఫినిష్ చేయాలో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్లను తయారు చేసుకోగలగాలి. మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈరోజైతే మేము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడిపోయాం అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఫినిషర్లుగా అద్భుత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో సన్రైజర్స్ పరాజయాల సంఖ్య మూడుకు చేరగా 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదోస్థానానికి పడిపోయింది. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ SRH Vs MI: టెస్టు ప్లేయర్తో ఇట్లనే ఉంటది మరి! ‘టాప్ స్కోరర్’ అయితే ఏంటి? Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally. Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్!
Lucknow Super Giants vs Sunrisers Hyderabad: ‘‘వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి మ్యాచ్లో మొదటి ఓవర్లోనే వికెట్లు కోల్పోయాం. ఈరోజు ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. కచ్చితంగా మా బ్యాటర్ల ఆట తీరు మెరుగుపడాల్సి ఉంది. లోపాలు సరిచేసుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబడుతూ ముందుకు సాగే వీలు ఉంటుంది’’ అని సన్రైజర్స్ హెడ్కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఐపీఎల్-2023లో బ్యాటర్ల దారుణ వైఫల్యమే తొలి రెండు మ్యాచ్లలో ఓటములకు కారణమైందని పేర్కొన్నాడు. పేలవమైన ప్రదర్శనతో రైజర్స్ వరుస ఓటములు ఇప్పటికైనా తమ బ్యాటింగ్ విభాగం పొరపాట్లు సరిచేసుకోవాలని, ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపడతామని లారా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ను ఎనిమిదో స్థానంతో ముగించిన సన్రైజర్స్.. పదహారో ఎడిషన్నూ పేలవంగా ఆరంభించింది. సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన రైజర్స్... శుక్రవారం నాటి మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్లలోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఎయిడెన్ అన్న.. హ్యారీ బ్రూక్ మరీ ఘోరంగా తొలి మ్యాచ్లో టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా.. లక్నోలో మ్యాచ్లో 50/1తో పర్వాలేదనిపించినా.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ కాగా.. హ్యారీ బ్రూక్(3) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి స్వల్ప లక్ష్యం విధించిన హైదరాబాద్ జట్టుపై రాహుల్ సేన ఘన విజయం సాధించింది. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి వచ్చి చేరింది. వాళ్లిద్దరు అవుట్ అవడం దెబ్బతీసింది ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లారా మాట్లాడుతూ.. అన్మోల్ప్రీత్ సింగ్ అవుటైన తర్వాత.. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్, హ్యారీబ్రూక్ వెనువెంటనే పెవిలియన్ చేరడం తమను చావు దెబ్బతీసిందన్నాడు. కనీసం 150- 160 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పిచ్ను నిందిస్తూ ఓటమికి సాకులు వెతుక్కోబోమని.. తమ బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని లారా చెప్పుకొచ్చాడు. చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
IPL 2023: ‘పవర్ ప్లే’లోనే ఓడిపోయాం! టాస్ విషయంలో మా నిర్ణయం సరైందే!
IPL 2023 SRH Vs RR- సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తమ ఓటమికి రెండు ‘పవర్ ప్లే’లలో ప్రదర్శనే కారణమని సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ‘ముందుగా రాజస్తాన్ పవర్ప్లేను అద్భుతంగా వాడుకొని 85 పరుగులు చేసింది. అదే మా వంతు వచ్చేసరికి పవర్ప్లేలో పరుగులే చేయలేకపోయాం. 200కుపైగా స్కోరు ఛేదిస్తూ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే’ అని లారా అన్నాడు. అయితే, తమ జట్టు స్టార్ పేసర్ నటరాజన్ ప్రదర్శన పట్ల లారా సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన నటరాజన్.. తన రెండో ఓవర్ నుంచి పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన తీరును ప్రశంసించాడు. ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఆఖరి ఎనిమిది ఓవర్లలో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఒకానొక సమయంలో రాజస్తాన్ రాయల్స్ 225 పరుగుల స్కోరు చేస్తుందని భావిస్తే.. 200 రాబట్టడానికి కూడా ఇబ్బంది పడేలా చేశారని లారా పేర్కొన్నాడు. అనేక ప్రతికూలతల నడుమ ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్కుమార్ నిర్ణయాన్ని లారా సమర్థించాడు. ‘‘ఉప్పల్ పిచ్పై మేము ప్రాక్టీసు చేశాం. వికెట్ కాస్త బౌన్సీగా ఉన్నట్లు అనిపించింది. పేస్కు అనుకూలిస్తుందని భావించాం. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఒక్క మ్యాచ్లో ఓటమితో కుంగిపోము. మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతాం’’ అని లారా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు! Nattu in death overs 👉 Always 🔥#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvRR pic.twitter.com/DIErNzIWxm — SunRisers Hyderabad (@SunRisers) April 3, 2023 -
సన్రైజర్స్ సరికొత్తగా...
రెండేళ్ల క్రితం ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్లో ఎనిమిదో స్థానం... గత ఏడాది పది జట్లు పాల్గొన్న ఐపీఎల్లోనూ ఎనిమిదో స్థానం... ఆట మెరుగుపడలేదని అనుకోవాలా లేక తమకంటే రెండు జట్లు కింద ఉన్నాయి కాబట్టి బాగానే ఆడినట్లా! 2016లో చాంపియన్గా నిలిచాక తర్వాతి నాలుగు సీజన్లలో టాప్–4లో ఉంటూ నిలకడ ప్రదర్శించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆట గత రెండేళ్లు పూర్తిగా గతి తప్పింది. సమష్టి వైఫల్యంతో పాటు వార్నర్ వివాదం టీమ్ను బాగా ఇబ్బంది పెట్టాయి. 2019 ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇప్పుడే రైజర్స్ తమ సొంత మైదానం హైదరాబాద్లో మ్యాచ్లు ఆడబోతోంది. పలువురు ఆటగాళ్ల మార్పులతో పాటు సహాయక సిబ్బందిలోనూ స్వల్ప మార్పుచేర్పులతో కొత్త సీజన్కు సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కొత్త కెపె్టన్గా ముందు నిలబడగా, ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడైన బ్రియాన్ లారా ఈసారి పూర్తి స్థాయిలో జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం కొత్త సీజన్ వేలానికి ముందు హైదరాబాద్ 2022లో ఆడిన వారి నుంచి 12 మంది ఆటగాళ్లను వదిలేసుకుంది. వీరిలో ‘కేన్ మామా’ అంటూ అభిమానులు పిలుచుకున్న విలియమ్సన్తో పాటు నికోలస్ పూరన్ తదితరులు ఉన్నారు. మరో 12 మందిని కొనసాగించగా అందులోంచే దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్క్రమ్ను కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా టి20 లీగ్లో సన్రైజర్స్ యాజమాన్యానికే చెందిన ఈస్టర్న్ కేప్ టీమ్ మార్క్రమ్ సారథ్యంలోనే విజేతగా నిలిచింది. కాబట్టి నాయకత్వం విషయంలో ఫ్రాంచైజీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉన్నా... మార్క్రమ్పైనే యాజమాన్యం విశ్వాసం ఉంచింది. జట్టు తరఫున గత ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతను 12 ఇన్నింగ్స్లలో 139.05 స్ట్రయిక్రేట్తో 381 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. ఈసారి అతడి బ్యాటింగ్తో పాటు కెపె్టన్సీ బాధ్యతలు కూడా జట్టుకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ‘హోం గ్రౌండ్’ ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 మ్యాచ్ల కోసం జట్టులో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలిగి విజయాలు సాధిస్తే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బ్రూక్ చెలరేగుతాడా... సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లో ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న ఆటగాడు ఇంగ్లండ్కు చెందిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 99 టి20ల్లో విధ్వంసకర స్ట్రయిక్రేట్ 148.32తో 2432 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో బ్రూక్ బ్యాటింగ్ రైజర్స్కు ‘బూస్ట్’ ఇవ్వగలదు. అయితే భారత గడ్డపై తొలిసారి ఆడనున్న అతను పరిస్థితులను ఎలా వాడుకుంటాడనేది చూడాలి. మిడిలార్డర్లో అతనితో పాటు మార్క్రమ్, వికెట్ కీపర్లు ఫిలిప్స్, క్లాసెన్ (ఇద్దరిలో ఒకరు), ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన మయాంక్ అగర్వాల్ ఇప్పుడు సన్రైజర్స్కు ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. గత సీజన్ టీమ్ టాప్ స్కోరర్ అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు టాపార్డర్లో వేగంగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇతర జట్లతో పోలిస్తే తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడే విధ్వంసక ఓపెనర్ హైదరాబాద్ వద్ద లేడనేది స్పష్టం. పేసర్ల బృందం... బ్యాటింగ్తో పోలిస్తే మరోసారి హైదరాబాద్ బౌలింగ్ కాస్త పదునుగా కనిపిస్తోంది. గత సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లోనూ ‘ఫాస్టెస్ట్ బాల్’ విసిరిన ఉమ్రాన్ మలిక్ ఇప్పుడు కూడా కీలక బాధ్యత పోషించాల్సి ఉంది. పైగా ఈ ఏడాది కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో అతని ఆట మెరుగవడంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. బౌలింగ్లో మునుపటి వాడి లోపించడంతో భారత జట్టు చోటుతో పాటు బోర్డు కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన భువనేశ్వర్ ఈసారి ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం. అయితే నటరాజన్, కార్తీక్ త్యాగి, జాన్సెన్, ఫజల్ హఖ్లతో పేస్ బృందం పెద్దదిగానే ఉంది. ఆల్రౌండర్ సుందర్ ఆఫ్ స్పిన్ జట్టుకు సానుకూలాంశం కాగా, రెగ్యులర్ స్పిన్నర్గా ఆదిల్ రషీద్ కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున గత కొన్నేళ్లుగా వన్డేలు, టి20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రషీద్ అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటే గతంలో రషీద్ ఖాన్ తరహాలో లెగ్స్పిన్తో ప్రత్యర్థిపై పైచేయి సాధించవచ్చు. దేశవాళీ లెగ్స్పిన్నర్ మయాంక్ మర్కండే కూడా టీమ్లో ఉన్నాడు కానీ గత రెండు సీజన్లుగా అతను రాణించలేకపోయాడు. అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లు మినహా కొత్తగా జట్టులోకి వచ్చి న యువ ఆటగాళ్లలో మరీ చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడినా ఇప్పటి వరకు కీలక దశలో సమద్పై పూర్తి నమ్మకం ఉంచలేని పరిస్థితి. కాబట్టి తుది జట్టులో వీరిలో ఎవరికి స్థానం దక్కుతుందనేది సందేహమే. సన్రైజర్స్ జట్టు వివరాలు మార్క్రమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ హఖ్ ఫారుఖీ, హ్యారీ బ్రూక్, క్లాసెన్, ఆదిల్ రషీద్, అకీల్ హొసీన్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, నటరాజన్, ఉమ్రాన్ మలిక్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మర్కండే, వివ్రాంత్ శర్మ, మయాంక్ డాగర్, సమర్థ్ వ్యాస్, సన్వీర్, ఉపేంద్ర సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి. సహాయక సిబ్బంది బ్రియాన్ లారా (హెడ్ కోచ్), డేల్ స్టెయిన్ (పేస్ బౌలింగ్ కోచ్), ముత్తయ్య మురళీధరన్ (స్పిన్ బౌలింగ్ కోచ్), ర్యాన్ కుక్ (ఫీల్డింగ్ కోచ్), సైమన్ హెల్మెట్ (అసిస్టెంట్ కోచ్). -
కీలక పదవిలో బ్రియాన్ లారా.. గాడిన పెట్టేందుకేనా!
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారాను కీలక పదవి వరించింది. దశ దిశ లేకుండా ఉన్న విండీస్ జట్టును గాడిన పెట్టేందుకు లారాను పర్ఫార్మెన్స్ మెంటార్(Performance Mentor)గా బాధ్యతలు అప్పజెప్పింది. కొన్నాళ్లుగా విండీస్ జట్టు ప్రదర్శన నాసిరకంగ తయారైంది. చిన్న జట్ల చేతిలోనూ అనూహ్యంగా పరాజయాలు చవిచూస్తూ అవమానాలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే విండీస్ను గాడిన పెట్టేందుకే లారాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) పేర్కొంది. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టు, బోర్డు అకాడమీ కోసం పనిచేయనున్నాడు. ఆటగాళ్లకు వ్యూహాత్మక సలహాలను అందించడంలో, వారి గేమ్ సెన్స్ను మెరుగుపరచడంలో ప్రధాన కోచ్లకు సహాయం చేయడమే లారా పని అని బోర్డు తెలిపింది. ''ఆస్ట్రేలియాలోని ఆటగాళ్లు, కోచ్లతో సమయం గడిపాను. సీడబ్ల్యూఐతో చర్చించాను. గేమ్ విషయంలో ఆటగాళ్లకు సహాయం చేయగలనని నేను నమ్ముతున్నా. అలాగే వారి వ్యూహాలను మరింత విజయవంతంగా అమలు చేసేలా సాయం చేయగలను. వారితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా'' అని లారా పేర్కొన్నాడు. వచ్చే వారంలో జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ముందుగా టెస్ట్ టీమ్ తో కలిసి లారా పనిచేయనున్నాడు. క్రికెట్లో దిగ్గజంగా పేరు పొందిన లారా తన కెరీర్లో విండీస్ తరపున 131 టెస్టులు ఆడి 52.88 సగటుతో 11,953 పరుగులు చేశాడు. వన్డేల్లో 10,405 పరుగులు కొట్టాడు. 2004లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగులు కొట్టి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 400 రన్స్(క్వాడ్రపుల్ సెంచరీ) కొట్టింది లారా ఒక్కడే. 19 ఏళ్లు దాటినా ఇప్పటికి లారా రికార్డు చెక్కుచెదరలేదు. Brian Lara joins the West Indies management as a performance mentor.#BrianLara #WestIndies pic.twitter.com/CnRGFffyWc — 100MB (@100MasterBlastr) January 27, 2023 చదవండి: మహిళల టి20 వరల్డ్కప్: కివీస్పై గెలుపు.. ఫైనల్లో భారత్ క్రిస్టియానో రొనాల్డోకు అవమానం.. -
ఇద్దరు దిగ్గజాలు కలిసిన వేళ..
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. ఇద్దరు ఇద్దరే. సమకాలీన క్రికెట్లో పరుగులు సాధించడంలో పోటీ పడ్డారు. సచిన్ రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టులు) ఎదురులేకుండా సాగితే.. లారా మాత్రం టెస్టుల్లో సచిన్కు ధీటుగా నిలిచాడు. అంతేకాదు ఎవరికి సాధ్యం కాని క్వాడ్రపుల్ సెంచరీ(400 పరుగులు)ని లారా అందుకున్నాడు. సచిన్ వంద సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకున్నప్పటికి ట్రిపుల్ సెంచరీ, క్వాడ్రపుల్ సెంచరీలు తీరని కలగానే మిగిలిపోయాయి. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిస్తే చూడడానికి ఆ ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంటుంది. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్కు హాజరైన వీరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు తమ గురించి అభిమానులకు కొన్ని వాస్తవాలను తెలియపరిచారు. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు..తమ ట్రేడ్ మార్క్, నిరాశలో కూరుకున్నప్పుడు ఎలా ఉన్నారు లాంటి విషయాలను వెల్లడించారు. ఎగ్జిబిషన్ మ్యాచ్లో సచిన్, లారా కలిసి బ్యాటింగ్ చేయడం గురించి కునాల్ అడిగారు. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్లతో లాంటి స్టార్లు ఉన్న పాకిస్థాన్ లైనప్ను ఎలా కూల్చివేశారో సచిన్, లారా వివరంగా తెలియజేశారు. సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా గుర్తు చేసుకున్నాడు. ప్రతి అభిమానివ వలే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. అలాగే లారా పరుగుల దాహం, నిలకడం, నైపుణ్యం గురించి సచిన్ ప్రశంసించాడు. కరెబియన్ దిగ్గజం కిట్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. టి20 రాకతో క్రికెట్ చాలా మారిపోయిందని ఇద్దరు మాజీలు తెలియజేశారు.ఇప్పటి బ్యాటర్లు తమ వినూత్న 360 డిగ్రీల షాట్లతో బ్యాటింగ్లో విప్లవాత్మక మార్పులు చేశారని.. కొంతమంది వారిని ఎగతాళీ చేసినప్పటికీ.. వారి వైవిధ్యమైన ఆటతీరు గేమ్ను మంచిగా మార్చివేసిందని లారా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలాకష్టమని.. కొంతమంది టెస్టుల్లో కష్టపడుతుంటే.. కొంతమంది మాత్రం టి20 ఫార్మాట్లో సవాలు ఎదుర్కొంటున్నారని తెలిపాడు. పాకిస్థాన్కు మెరుగైన జట్టు ఉందని లారా అభిప్రాయపడ్డాడు. మరోవైపు సచిన్ ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్కు కలిసొస్తుందని, అందుకని బట్లర్ జట్టు గెలిచే అవకాశముందని స్పష్టం చేశాడు. మొత్తంమీద సచిన్, లారా ఇద్దరూ మరోసారి తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. -
RSWS 2022 Final: వెస్టిండీస్కు పరాభవం.. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్
RSWS 2022- Sri Lanka Legends vs West Indies Legends, Semi-final 2: సమిష్టి ప్రదర్శనతో శ్రీలంక లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్(ఆర్ఎస్డబ్ల్యూఎస్)- 2022 ఫైనల్కు చేరుకుంది. వెస్టిండీస్ లెజెండ్స్ను 14 పరుగుల తేడాతో ఓడించి.. ఇండియా లెజెండ్స్తో తుదిపోరుకు సిద్ధమైంది. ఆల్రౌండర్లు ఇషాన్ జయరత్నె(19 బంతుల్లో 31 పరుగులు), నువాన్ కులశేఖర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఛత్తీస్గడ్లోని రాయ్పూర్లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఆర్ఎస్డబ్ల్యూఎస్ సెమీఫైనల్-2లో శ్రీలంక లెజెండ్స్- వెస్టిండీస్ లెజెండ్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాణించిన జయరత్నె బ్రియన్ లారా బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది దిల్షాన్ సేన. ఓపెనర్లు మహేల ఉదవటె(15), సనత్ జయసూర్య(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ మాత్రం(12 బంతుల్లో ఏడు పరుగులు) విఫలమయ్యాడు. ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఇషాన్ జయరత్నె మెరుపులు మెరిపించగా.. జీవన్ మెండిస్ 25 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. పాపం నర్సింగ్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ టాపార్డర్ రాణించినప్పటికీ.. మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో వన్డౌన్ బ్యాటర్ నర్సింగ్ డియోనరైన్ ఒంటరి పోరాటం(39 బంతుల్లో 63 పరుగులు) వృథాగా పోయింది. 158 పరుగులకే విండీస్ ఆలౌట్ కాగా.. శ్రీలంక 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. కీలక వికెట్లు పడగొట్టిన నువాన్ కులశేఖర(4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక శ్రీలంక లెజెండ్స్ శనివారం(అక్టోబరు 1) నాటి ఫైనల్లో ఇండియా లెజెండ్స్తో తలపడనుంది. చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు -
Bigg Boss 6: నేహా కోసం రంగంలోకి లారా.. క్రికెట్ దిగ్గజం ప్రయత్నం ఫలించేనా?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఆరో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్ మొదలు.. కెప్టెన్సీ టాస్క్ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. మూడో వారంలో వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ నామినేషన్లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో నుంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఎలాగైనా బిగ్బాస్ హౌస్లో కొనసాగాలనే పట్టుదలతో కసిగా గేమ్ ఆడుతున్నారు ఈ తొమ్మిది మంది. తమ ఆట తీరుతో ఆడియన్స్ ఓట్లను సంపాదించుకునేందుకు బిగ్బాస్ హౌస్లో తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు తమకు నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్స్కు ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారి వారి సపోటర్స్. అయితే ఇదంతా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయింది. కానీ తాజాగా ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్న నేహా చౌదరి కోసం మాత్రం ఏకంగా క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా రంగంలోకి దిగాడు. ఆమెకు ఓట్లు వేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. బ్రియన్ లారా లాంటి పెద్ద ఆటగాడు నేహా చౌదరికి సపోర్ట్ చేయడం ఏంటని అంతా షాకవుతున్నారు. వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందని నెటిజన్స్ చర్చిస్తున్నారు. విషయం ఏంటంటే... బిగ్బాస్లోకి వెళ్లిన నేహా చౌదరి యాంకర్, స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా మంచి గుర్తింపు ఉంది. ఇండియా క్రికెట్ మ్యాచులకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఒకరు. ఆ కారణంగానే లారాతో నేహకు పరిచయం ఏర్పడింది. అందుకే ఆమె కోసం లారా తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు. మరి లారా ప్రయత్నం ఫలించి నేహా హౌస్లో కొనసాగుతుందో లేదో ఆదివారం తెలిసిపోతుంది. -
ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో ఎడిషన్ (2022)లో భాగంగా ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జట్ల మధ్య కాన్పూర్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ రద్దైంది. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్.. తాజాగా లభించిన ఒక్క పాయింట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలుపొందిన శ్రీలంక (4 పాయింట్లు) టేబుల్ టాపర్గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ (3), సౌతాఫ్రికా (2), ఇంగ్లండ్ (0), బంగ్లాదేశ్ (0), ఆస్ట్రేలియా (0), న్యూజిలాండ్ (0) జట్లు వరుసగా మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సౌతాఫ్రికాను 61 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో భాగంగా రేపు (సెప్టెంబర్ 15) జరుగబోయే మ్యాచ్లో బంగ్లాదేశ్ లెజెండ్స్ జట్టు.. న్యూజిలాండ్ లెజెండ్స్ను ఢీకొట్టనుంది. -
సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు..
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. పరిచయం అక్కర్లేని పేరు. ధోని హయాంలో టీమిండియాలో రైనా ఒక వెలుగు వెలిగాడు. కొన్నాళ్ల పాటు తనదైన ఆటతో ప్రత్యేక ముద్ర వేసిన రైనా.. ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన రోజునే(ఆగస్టు 15, 2020).. రైనా కూడా వీడ్కోలు పలకడం విశేషం. ధోనితో ప్రత్యేక అనుబంధం ఉన్న రైనా ఇటీవలే(సెప్టెంబర్ 6న) అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. అయితే రైనా మళ్లీ తిరిగి వస్తున్నాడు. రోడ్ సేఫ్టీ లీగ్ వరల్డ్ సిరీస్లో ఆడేందుకు రైనా సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ జట్టుతో జాయిన్ అయ్యాడు. శనివారం(సెప్టెంబర్ 10న) కాన్పూర్ వేదికగా ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు రైనా తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో రైనా తన జెర్సీ నెంబర్ అయిన '48' ధరించి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ''రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్కు అంతా సిద్ధం.. టీమిండియా లెజెండ్స్ తరపున ఆడేందుకు తిరిగి వస్తున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. రైనా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఫన్నీగా స్పందించాడు. ''వస్తే వస్తున్నావు కానీ మమ్మల్ని మాత్రం ఈజీగా తీసుకో ప్లీజ్'' అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేశాడు. View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) చదవండి: Road Safety World Series 2022: ఇండియా లెజెండ్స్తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ' -
టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అనుకోని అతిధి.. ఏం చేశాడో చూడండి..!
విండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం గెలుపు సంబురాల్లో ఉన్న టీమిండియా సభ్యులను పలకరించేందుకు ఓ అనుకోని అతిధి భారత డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్కు వేదిక అయిన ట్రినిడాడ్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు స్వస్థలం కావడంతో అతను మ్యాచ్ను వీక్షించేందుకు మైదానానికి వచ్చాడు. ఈక్రమంలో స్టాండ్స్లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను కలిసిన లారా.. అనంతరం భారత జట్టు సభ్యులను విష్ చేసేందుకు డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చాడు. Look who came visiting the #TeamIndia dressing room 👏 👏The legendary Brian Charles Lara! 👍 👍#WIvIND | @BrianLara pic.twitter.com/ogjJkJ2m4q— BCCI (@BCCI) July 23, 2022 డ్రెస్సింగ్ రూమ్లో లారా కనిపించడంతో టీమిండియా సభ్యులు చహల్, కెప్టెన్ ధవన్, శ్రేయస్ అయ్యర్లు అతనితో మాట కలిపేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ ముగ్గురితో కాసేపు ముచ్చట్లు పెట్టిన లారా అనంతరం అక్కడి నుంచి బయల్దేరాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. అంతకుముందు లారా కోచ్ ద్రవిడ్తో కలిసి దిగిన ఫోటోను కూడా బీసీసీఐ ట్వీటర్లో షేర్ చేసింది. 'టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్' అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. ఇదిలా ఉంటే, బ్రియాన్ లారా ప్రస్తుతం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Two Legends, One Frame! 🙌 🙌#TeamIndia | #WIvIND pic.twitter.com/CdCUj6Y2Rp— BCCI (@BCCI) July 23, 2022 చదవండి: రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్ -
19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. అభినందించిన బ్రియాన్ లారా
టెస్టుల్లో తన రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాను వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అభినందించాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో బుమ్రా ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అంతకుమందు 2003లో జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్.పీటర్సన్ బౌలింగ్లో బ్రియన్ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు బుమ్రా దాదాపు 19 ఏళ్ల లారా రికార్డు బద్దలు కొట్టాడు. “టెస్ట్లలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టినందుకు అభినందనలు. అద్భుతంగా ఆడావు బుమ్రా" అంటూ లారా ట్వీట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానకి వస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. పంత్(146),రవీంద్ర జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జో రూట్ (31) టాప్ స్కోరర్గా నిలవగా...ప్రస్తుతం బెయిర్స్టో (12 బ్యాటింగ్), స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. Join me in congratulating the young @Jaspritbumrah93 on breaking the record of Most Runs in a Single Over in Tests. Well done!🏆#icctestchampionship #testcricket #recordbreaker pic.twitter.com/bVMrpd6p1V — Brian Lara (@BrianLara) July 2, 2022 -
లారా వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నాడా?
ఐపీఎల్ 2022లో బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్, ఎస్ఆర్హెచ్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం అందుకుంది. 197 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. తెవాటియా, రషీద్ ఖాన్లు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఒక దశలో మ్యాచ్ ఎస్ఆర్హెచ్వైపు మొగ్గుచూపినప్పటికి.. రషీద్ వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటికే దాటిగా ఆడుతున్న తెవాటియాకు(21 బంతుల్లో 40*, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రషీద్ ఖాన్ తోడవ్వడంతో గుజరాత్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ స్థానాన్ని ఆక్రమించింది. అయితే రషీద్ ఖాన్ 11 బంతుల్లోనే 4 సిక్సర్ల సాయంతో 31* పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్తో పాత జట్టైన ఎస్ఆర్హెచ్ను విజయానికి దూరం చేశాడు. ఒక రకంగా రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్పై ప్రతీకారం తీర్చుకున్నాడంటూ అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటి రషీద్ ఎస్ఆర్హెచ్పై పగ తీర్చుకోవడం ఏంటిని ఆలోచిస్తున్నారా. విషయంలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కోచ్ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రషీద్ ఖాన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా రషీద్ ఖాన్ పెద్ద టేకర్ ఏమీ కాదని, అతనికి మించిన బౌలర్లు ప్రస్తుతం సన్రైజర్స్లో ఉన్నారని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ లేకున్నా తాము మ్యాచ్లు గెలుస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించాడు. రషీద్ ఖాన్ ఆడిన తీరు చూస్తుంటే లారా వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నట్లుగా అనిపించింది. తన బ్యాటింగ్ పవర్ను ఎస్ఆర్హెచ్కు రుచి చూపించి.. ఒక రకంగా లారాకు కౌంటర్ ఇచ్చాడంటూ అభిమానులు అభిప్రాయపడ్డారు. రషీద్ ఇన్నింగ్స్.. మ్యాచ్ గెలిచిన తర్వాత అతని హావభావాలు చూస్తే మనకు కూడా ఇది నిజమే అనిపిస్తుంది. ఏదైతే అది.. రషీద్కు ఎలా అనిపించిందో తెలియదు కానీ.. ఎస్ఆర్హెచ్, గుజరాత్ టైటాన్స్ పోరు ఈ సీజన్కే హైలైట్ అని మాత్రం చెప్పొచ్చు. చదవండి: SRH Vs GT: సన్రైజర్స్కు షాకిచ్చిన రషీద్ ఖాన్, తెవాటియా WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 -
రషీద్ ఖాన్కు అంత సీన్ లేదు.. సన్రైజర్స్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు తరలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్పై సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా రషీద్ ఖాన్ పెద్ద టేకర్ ఏమీ కాదని, అతనికి మించిన బౌలర్లు ప్రస్తుతం సన్రైజర్స్లో ఉన్నారని సంచలన కామెంట్స్ చేశాడు. రషీద్ ఖాన్ లేకున్నా తాము మ్యాచ్లు గెలుస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించాడు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్తో లారా మాట్లాడుతూ.. రషీద్ ఖాన్పై తనకు చాలా గౌరవం ఉందని, ప్రస్తుతం అతను తమతో లేకున్నా పెద్ద నష్టమేమీ లేదని అన్నాడు. రషీద్ బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ ఆడాలనుకుంటారని, అదే వారు వికెట్ సమర్పించుకునేలా చేస్తుందని, ఇందులో రషీద్ ఖాన్ గొప్పేమీ లేదని పేర్కొన్నాడు. అయితే, రషీద్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడని, టీ20ల్లో ఓవర్కు 5-6 పరుగులు మాత్రమే ఇవ్వడం చాలా గొప్ప విషయమని కితాబునిచ్చాడు. ఇదిలా ఉంటే, 2017 నుంచి 2021 సీజన్ వరకు రషీద్ సన్రైజర్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. రకరకాల కారణాల చేత ఆరెంజ్ ఆర్మీ అతన్ని ఈ ఏడాది తిరిగి దక్కించుకోలేకపోయింది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్తో మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా రషీద్ ఐపీఎల్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. డ్వేన్ బ్రావో (179), లసిత్ మలింగ (170), సునీల్ నరైన్ (149) తర్వాత 100 వికెట్లు తీసిన నాలుగో విదేశీ ప్లేయర్గా రషీద్ రికార్డుల్లోకెక్కాడు. చదవండి: భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంతా అతని వల్లే జరిగిందన్న పూరన్.. ఆర్సీబీతో మ్యాచ్పై హస్సీ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్ను ఓటమిని పరిచయం చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఫ్రాంచైజీ.. అరంగేట్రంలోనే హ్యాట్రిక్ విజయాలు సాధించి దూసుకుపోతుండగా, సన్రైజర్స్ జీటి విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. భువీ (2/37), నటరాజన్ (2/34), మార్కో జన్సెన్ (1/27), ఉమ్రాన్ మాలిక్ (1/39) రాణించడంతో గుజరాత్ టైటాన్స్ను 162 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఛేదనలో సన్రైజర్స్కు ఓపెనర్లు అభినవ్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) శుభారంభాన్ని అందించగా, ఆఖర్లో పూరన్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (8 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) చెలరేగి ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చారు. Finishing in style ✅ The Brian Lara influence 🙌 2⃣ wins in a row 🔥 The player-coach duo of @nicholas_47 & the legendary @BrianLara chat after @SunRisers' successful run-chase against #GT. 👍 👍 - By @ameyatilak Full interview 📹 🔽 #TATAIPL | #SRHvGT https://t.co/VPyVK8aiKp pic.twitter.com/AGZmrGWjWk — IndianPremierLeague (@IPL) April 12, 2022 ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పూరన్, మ్యాచ్ అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ ప్రస్థానంపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన జట్టు తిరిగి గాడిలో పడటానికి బ్యాటింగ్ కోచ్ లారానే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. A face-off with familiar faces! 📹 Once we cross the line, it's bat v ball challenge! Watch the match preview with Huss!#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 @amazonpay pic.twitter.com/XmfVV5T03l — Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022 ఈ వీడియోతో పాటు ఇవాళ (ఏప్రిల్ 12) ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఏమన్నాడో (ప్రివ్యూ) చూడొచ్చు. ఇందులో సీఎస్కే ఆటగాళ్ల ప్రాక్టీస్, ఇతరత్రా దృశ్యాలు ప్రధానంగా ఆకట్టుకోగా, జట్టు మాజీ సభ్యుడు డుప్లెసిస్ను సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసిక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్రైజర్స్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్క మ్యాచ్కే పక్కనబెట్టారు.. దిగ్గజ ఆటగాడిని గుర్తుచేస్తూ!
ఐపీఎల్ 2022లో సీఎస్కే తరపున డెవన్ కాన్వే ఒక్క మ్యాచ్కే పరిమితమయ్యాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కాన్వే కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల్లో కాన్వేకు అవకాశం రాలేదు. అతని స్థానంలో మొయిన్ అలీ తుది జట్టులోకి రావడంతో కాన్వేకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాన్వే జట్టులోకి రావడానికి ప్రాక్టీస్ సెషన్లో తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగానే కాన్వే విండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారాను గుర్తు చేస్తూ అతని షాట్లతో మెప్పించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్కే తన ట్విటర్లో పంచుకుంది. '' అచ్చం లారాను తలపిస్తూ షాట్ ఆడానా అని కాన్వే ప్రశ్న వేయగా.. ఈరోజు మరోసారి మేము లారాను చూస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కేకేఆర్తో మ్యాచ్ ఓటమి తర్వాత సీఎస్కే లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్తో ఆడింది. లక్నో చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన సీఎస్కే పంజాబ్తో మ్యాచ్లో దారుణ ఆటతీరు కనబరిచింది. టాపార్డర్ అంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మధ్యలో శివమ్ దూబే అర్థసెంచరీతో మెరిసినప్పటికి.. ధోని మినహా మిగతావారు సహకరించడంలో విఫలం కావడంతో ఓటమిపాలైంది. ధోని నుంచి కెప్టెన్ బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా అటు కెప్టెన్గా.. బ్యాట్స్మన్గా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇక మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 9(శనివారం) ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. చదవండి: IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే! “Did I pull it off like B C Lara?” Yes, We C Lara here! 🦁#Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/NHoHRVKsiY — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2022 -
మన్కడింగ్పై నిషేదం.. విండీస్ దిగ్గజ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు
మన్కడింగ్ను నిషేధించడంతో పాటు క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్కు రావడం, బంతికి లాలాజలాన్ని పూయడం వంటి పలు క్రికెట్ చట్టాలను మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవలే సవరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై దిగ్గజ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఎంసీసీ నిబంధనలను స్వాగతించగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం ఎంసీసీ కొత్త నిబంధనలపై విమర్శలు గుప్పించాడు. మన్కడింగ్ను నిషేదించడంపై లారా స్పందిస్తూ.. బౌలర్ బంతి విసిరే క్రమంలో నాన్ స్ట్రైకింగ్లో ఉన్న బ్యాటర్ పరుగు కోసం క్రీజ్ను వదలడం సహజమేనని, అలాంటి తరుణంలో బౌలర్ బెయిల్స్ను పడగొట్టి ఔట్కు అప్పీల్ చేయడం (ఈ తరహా రనౌట్ అప్పీల్ను మన్కడింగ్ అంటారు) క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఎంసీసీ తాజాగా ఇలాంటి అప్పీల్స్కు చట్టబద్దత కల్పిస్తూ రనౌట్గా పరిగణించడం ఎంత మాత్రం సబబు కాదని మండిపడ్డాడు. లారాకు ముందు న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఎంసీసీ నూతన నిబంధనలపై ధ్వజమెత్తాడు. క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్కు రావడం అనే రూల్పై నీషమ్ స్పందిస్తూ.. ఎంసీసీ ఈ అనవసర నిబంధన ఎందుకు అమల్లోకి తేవాలనుకుంటుందో అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మన్కడింగ్ను నిషేదిస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెటర్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో ఈ తరహా రనౌట్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసీసీ మన్కడ్ పేరుతో చలామణి అవుతున్న మన్కడింగ్ పదాన్ని నిషేధించి, ఆ తరహా ఔట్ను సాధారణ రనౌట్గా పరిగణించాలని నిర్ణయించింది. చదవండి: కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు -
సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్లోనే చెత్త ప్రదర్శన సన్రైజర్స్ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్రైజర్స్ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్కు హెడ్ కోచ్గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్ను స్పిన్ బౌలింగ్ కోచ్గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
IPL 2022- SRH: సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే
ఐపీఎల్-2022 నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్గా నియమించుకుంది. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ను అసిస్టెంట్ కోచ్గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ ఫ్రాంఛైజీకి సంబంధించిన కొత్త సిబ్బంది వివరాలను ట్విటర్ వేదికగా వీడియో రూపంలో వెల్లడించింది. ఇక ఎస్ఆర్హెచ్కు తొలి టైటిల్ అందించిన హెడ్కోచ్ టామ్ మూడీని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని పేర్కొంది. అదే విధంగా ప్రొటిస్ లెజండ్ డేల్ స్టెయిన్ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించుకున్నట్లు సన్రైజర్స్ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్ -2022: సన్రైజర్స్ సిబ్బంది హెడ్కోచ్- టామ్ మూడీ అసిస్టెంట్ కోచ్- సైమన్ కటిచ్ బ్యాటింగ్ కోచ్- బ్రియన్ లారా ఫాస్ట్ బౌలింగ్ కోచ్- డేల్ స్టెయిన్ స్పిన్ బౌలింగ్ కోచ్- ముత్తయ్య మురళీధరన్ ఫీల్డింగ్ కోచ్, స్కౌట్- హేమంగ్ బదాని Introducing the new management/support staff of SRH for #IPL2022! Orange Army, we are #ReadyToRise! 🧡@BrianLara #MuttiahMuralitharan @TomMoodyCricket @DaleSteyn62 #SimonKatich @hemangkbadani pic.twitter.com/Yhk17v5tb5 — SunRisers Hyderabad (@SunRisers) December 23, 2021 -
కోహ్లి.. అప్పుడూ ఇలాగే.. కేకేఆర్ మ్యాచ్లో కూడా అంతే: లారా
Brian Lara Comments On RCB: ఐపీఎల్-2021 సీజన్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతానన్న విరాట్ కోహ్లి ప్రకటన జట్టు జయాపజయాలను ప్రభావితం చేయకపోవచ్చని విండీస్ దిగ్గజం బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. ఆటకు ఈ విషయానికి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. అయితే, అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ను ఆర్సీబీ ఈ ఏడాది సాధించాలని భావిస్తోందని, అలాగే కోహ్లి కూడా ఘనంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించడం సహజం అన్నాడు. ఇక కేకేఆర్తో సోమవారం నాటి మ్యాచ్లో కోహ్లి ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో మాదిరే మరోసారి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడన్న లారా.. కుడిచేతి వాటం గల చాలా మంది బ్యాట్స్మెన్ ఎదుర్కొనే ప్రధాన సమస్యనే తానూ ఎదుర్కొన్నాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలోని తమ తొలి మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఓపెనర్గా వచ్చిన సారథి కోహ్లి(5), హిట్టర్స్ మాక్స్వెల్(10), డివిల్లియర్స్(0) విఫలం కావడంతో 92 పరుగులకే చాప చుట్టేసిన పరిస్థితి. దీంతో ఆర్సీబీ ఆట తీరుపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. వచ్చే సీజన్లో ఆర్సీబీ పగ్గాలు వదిలేస్తానన్న కోహ్లి ప్రకటన ఆటగాళ్లపై ఒత్తిడి పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా క్రికెట్.కామ్తో మాట్లాడుతూ... ‘‘ఆర్సీబీ ప్రదర్శన ఘోరంగా ఉంది. తొలి దశలో వెనుకబడిన కేకేఆర్ పుంజుకోగా.. ఆర్సీబీ మాత్రం చేతులెత్తేసింది. అయినా కోహ్లి ప్రకటనకు ఆటకు సంబంధం ఉందని అనుకోను. ఒక్కసారి బెంగళూరు ఆటగాళ్లు విజృంభిస్తే వారిని ఆపటం ఎవరితరం కాదు’’ అని చెప్పుకొచ్చాడు. అప్పుడు కూడా అలాగే.. ‘‘ప్రపంచ కప్-2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనూ కోహ్లి ఇలాగే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత షాట్ ఆడినపుడు కోహ్లి హెడ్ పొజిషన్ గమనిస్తే... మనకు విషయం అర్థమవుతుంది. తదుపరి డెలివరీలోనూ బంతి తలకు చేరువగా వచ్చింది. లైన్ కూడా డిఫరెంట్గా ఉంది. కానీ కోహ్లి హెడ్ పొజిషన్ మాత్రం మారలేదు. కుడిచేతి వాటం గల చాలా మంది బ్యాట్స్మెన్ ఎదుర్కొనే సమస్యే తనకూ ఎదురైంది. కాస్త బాలెన్స్ చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేది’’ అని కోహ్లి అవుట్ అయిన తీరుపై లారా స్పందించాడు. కాగా కేకేఆర్ బౌలర్ ప్రసిధ్ క్రిష్ణ ఇన్- స్వింగర్కు కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. Game Day: KKR v RCB Dressing Room Talk Mike Hesson and Virat Kohli address the team after a forgettable outing, urge them to put this loss behind them & turn up better for the next game v CSK on 24th. All this & more on @myntra presents Game Day.#PlayBold #IPL2021 #KKRvRCB pic.twitter.com/6bB0LcfSe3 — Royal Challengers Bangalore (@RCBTweets) September 21, 2021 -
'అలా చూసుకుంటే డికాక్ను తీసేయాల్సిందే'
ఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్కు ముంబై తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే ఇషాన్ కిషన్ను పక్కకు తప్పించడంపై విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తప్పబట్టాడు. బ్యటింగ్ సరిగా లేదని ఇషాన్ను తీసేస్తే.. డికాక్ను కూడా తీసేయాల్సిందే అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ.. '' ఇషాన్ కిషన్ను రాజస్తాన్తో మ్యాచ్కు పక్కకు తప్పించడం ఆశ్చర్యపరిచింది. అతనిలో మంచి హిట్టర్ దాగున్నాడు. రానున్న మ్యాచ్ల్లో అతను మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెపాక్ పిచ్లపై ఇషాన్ దారుణ ప్రదర్శన కనబరిచాడని జట్టులో నుంచి తొలిగించారంటే సమంజసం కాదు. అలా చూసుకుంటే క్వింటన్ డికాక్ను కూడా తొలగించాల్సిందే. Courtesy: IPL Twitter అతను నాలుగు ఇన్నింగ్స్ల్లో వరుసగా 2,40,2,3 పరుగులతో మొత్తం 47 పరుగులు మాత్రమే చేశాడు. డికాక్ స్థానంలో క్రిస్ లిన్కు అవకాశం ఇస్తే బాగుండేది. డికాక్ గైర్హాజరీలో తొలి మ్యా,చ్ ఆడిన లిన్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాతి మ్యాచ్ల్లో అతనికి అవకాశాలు ఇవ్వలేదు. వరుసగా విఫలమవుతూ వస్తున్న డికాక్ను ఆడిస్తూనే ఉన్నారు. ఇషాన్ కిషన్ విషయంలో ముంబై ఇండియన్స్ వ్యవహరించిన తీరు తప్పు '' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ ఈ సీజన్లో ముంబై తరపున ఐదు మ్యాచ్లాడి 14.60 సగటుతో 73 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రమే కాదు ముంబై మిడిలార్డర్ అనుకున్నంత గొప్పగా ఏం లేదు. మిడిలార్డర్ బలం లేకనే ముంబై ఓటములను కొని తెచ్చకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో 2 గెలిచి.. మూడింట ఓడింది. ఇక రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 8 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. డికాక్ 35, సూర్యకుమార్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటింగ్లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. చదవండి: 'చహర్ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్ను చూడు' 'కెప్టెన్సీ అతనికి కొత్త.. నా సలహాలు ఎప్పుడు ఉంటాయి' -
అలా అయితే ధోని సేనదే టైటిల్: బ్రియన్ లారా
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ మెరుగ్గా ఉందని, ఇలాంటి సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. జట్టులోని బ్యాట్స్మెన్ అంతా మంచి ఫాంలో ఉన్నందువల్ల ధోని బ్యాటింగ్ సేవలకు విరామం ఇవ్వాలని సూచించాడు. ఐపీఎల్-2021లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొయిన్ అలీ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు, జడేజా, డుప్లెసిస్, రాయుడు, బ్రావో రాణించడంతో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ... ‘‘ధోని బ్యాటింగ్ సేవల గురించి మరీ ఎక్కువగా ఆశించడం సరికాదు. వికెట్ కీపర్గా తను స్టంపింగ్స్ చేస్తున్నాడు. క్యాచ్లు పడుతున్నాడు. తన శైలే వేరు అన్న సంగతి అందరికీ తెలుసు. నిజానికి ఇప్పుడు సీఎఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. కాబట్టి ధోని విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. తను ఫాంలో ఉండాలని అందరూ కోరుకోవడం సహజమే. తను ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని(ఫొటో: బీసీసీఐ), బ్రియన్ లారా అయితే, ఇప్పుడు జట్టులో సామ్ కరన్(బౌలింగ్ ఆల్రౌండర్) వంటి ఎంతో మంది మెరుగైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందుకే ధోని రెస్ట్ తీసుకున్నా ఫరవాలేదు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక ప్రస్తుతం సీఎస్కే జట్టు పరిపూర్ణంగా కనిపిస్తోందన్న లారా.. ‘‘చెన్నైకి ధోని వంటి స్పూర్తిమంతమైన నాయకుడు ఉన్నాడు. ఒకవేళ తను గనుక అందరు కెప్టెన్సీపై మరింత దృష్టిసారించి, ప్రతీ ఆటగాడి సేవలను పూర్తిగా వినియోగించుకుని, ఇదే స్థాయి ప్రదర్శన ఇవ్వగలితే విజయం వారిదే’’ అంటూ ధోని సేన నాలుగో ఐపీఎల్ టైటిల్ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండింటిలో గెలుపొందిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. చదవండి: IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్... ఎప్పుడూ నా ఫోకస్ అదే: ధోని -
'ఆ చిన్న లోపాలు సరిచేసుకో.. మిగతాదంతా సూపర్'
ముంబై: ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ గతేడాది ఐపీఎల్ సీజన్లో ఆ జట్టు తరపున టాప్ స్కోరర్గా నిలిచిన సంగతి తెలిసిందే. 15 మ్యాచ్లాడిన పడిక్కల్ 473 పరుగులు సాధించగా.. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్లో ముంబైతో మ్యాచ్కు ముందు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషనలో ఉన్న అతన్ను ముంబైతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే ఎస్ఆర్హెచ్తో జరిగిన రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చిన పడిక్కల్ 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పడిక్కల్ ఆటతీరుపై కీలకవ్యాఖ్యలు చేశాడు.''పడిక్కల్లో మంచి టాలెంట్ దాగుంది. గతేడాది ఐపీఎల్ సీజన్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేగాక గత ఐదు నెలలుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న పడిక్కల్ విజయ్ హజారే ట్రోపీలో 700 పరుగులకు పైగా సాధించాడు. అతని బ్యాటింగ్లో ఉన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటే ఈ సీజన్లో సెంచరీ మార్క్ సహా పలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను చెన్నై వేదికగా రేపు కేకేఆర్తో తలపడనుంది. చదవండి: చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్ మాత్రం -
నిర్లక్ష్యమే కేకేఆర్ కొంపముంచింది: లారా
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 103 పరుగులతో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ ఆ తర్వాత రాహుల్ చహర్ మాయలో ఇరుక్కొని పరుగులు చేయలేకపోయింది. ఓపెనర్లు గిల్, రానాలు జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు సరిగా ఆడకపోవడం.. ఒక దశలో పూర్తి ఒత్తిడికి లోనయ్యి ఓటమిని చవిచూసింది. ఇదే విషయమై విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా స్పందిస్తూ..కేకేఆర్ను వారి నిర్లక్ష్యమే కొంపముంచిందంటూ పేర్కొన్నాడు. ''ముంబై ఇండియన్స్ సరైన సమయంలో సరైన బౌలర్ను ఉపయోగించి విజయం దక్కించుకుంది. అయితే కేకేఆర్ నిర్లక్ష్యం కూడా ముంబైకి కలిసొచ్చింది. సాధారణంగానే చెన్నై పిచ్ కాస్త మందకొడిగా ఉండడంతో పరుగులు రావడం కష్టమైంది. ముంబై ఇన్నింగ్స్ సమయంలోనే ఈ విషయం స్పష్టంగా కనిపించింది. 145- 150 మధ్య స్కోరు చేస్తే మ్యాచ్ను కాపాడుకునే అవకాశం ఉన్న చోట.. కేకేఆర్ తప్పుచేసింది. ముంబై ఇచ్చిన టార్గెట్ను చేధించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. దానిని ఉపయోగించుకొని పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని బ్యాటింగ్ చేసి ఉంటే కేకేఆర్ సునాయస విజయాన్ని దక్కించుకునేది. నితీష్ రానా అవుట్ తర్వాత మోర్గాన్, కార్తీక్లు ఇన్నింగ్స్ను నడపాల్సింది పోయి అనవసర షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నారు. పరోక్షంగా వారి నిర్లక్ష్యమే కొంపముంచింది.ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన బుర్రకు పదును పెట్టి రాహుల్ చహర్తో బౌలింగ్ చేయించడం కలిసొచ్చింది. అంతేగాక ఏడేళ్ల తర్వాత రోహిత్ బౌలింగ్ చేయడం.. దాదాపు షకీబ్ వికెట్ తీసినంత పని చేశాడు. ఇన్నేళ్ల తర్వాత రోహిత్ బౌలింగ్ చేయడం వెనుక ముంబై గేమ్ ప్లాన్ ఏంటో అర్థమైంది. ఈ విజయంతో ముంబైలో జోష్ వచ్చినట్లు తెలుస్తుంది. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో తొలుత ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్లో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. రసెల్ (5/15) ముంబైని అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఇక్కడా టాపార్డరే ఆడింది. నితీశ్ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణిస్తే మిగతా వారెవరూ కనీసం పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ చహర్ (4/27) తన స్పిన్తో కోల్కతాను తిప్పేశాడు. చదవండి: ఒక్క విజయం.. అంతే హోటల్ రూంకు వేగంగా పరిగెత్తా ఏడేళ్ల తర్వాత రోహిత్.. ఇది వ్యూహం కాదంటారా? -
సామ్సన్ తప్పు లేదు.. అతను చేసింది కరెక్టే
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో సోమవారం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదైన సంగతి తెలిసిందే. తొలుత పంజాబ్ ఫోర్లు, సిక్సర్లతో బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించగా.. తామేం తక్కువ తినలేదన్నట్లు రాజస్తాన్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. అయితే అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి నాలుగు బంతులకు 8 పరుగులు వచ్చాయి. అందులో నాల్గో బంతిని సంజూ సామ్సన్ సిక్స్గా కొట్టడంతో ఇంకా రెండు బంతుల్లో 5 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఐదో బంతికి పరుగు రాలేదు. డీప్ ఎక్స్ట్రా కవర్లో షాట్ కొట్టినా సామ్సన్ కనీసం పరుగు కోసం కూడా ప్రయత్నం చేయలేదు. చివరి బంతికి సిక్స్ కొడితేనే గెలుస్తారు. సామ్సన్ ప్రయత్నించాడు.. కానీ సిక్స్ రాలేదు.. ఇంచుమించు బౌండరీ లైన్ వద్దే దీపక్ హుడా క్యాచ్ పట్డడంతో సామ్సన్ ఓటయ్యాడు. రాజస్తాన్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన సామ్సన్పై ప్రశంసల జల్లు కురిపించినా.. అతను సింగిల్ తీయకపోవడంపై పలువురు నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా సామ్సన్కు మద్దతుగా నిలిచాడు. క్లిష్ట సమయంలో సామ్సన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. అప్పటికే కెప్టెన్ ఇన్నింగ్స్తో క్రీజులో పాతుకుపోయిన సంజూ సిక్స్ కొడితే విజయం సాధిస్తామని భావించి సింగిల్కు అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయలేదు. ఐదో బంతికి ఫోర్ కొడుదామని భావించిన సామ్సన్ వ్యూహం ఫలించలేదు. అలా అని మోరిస్కు స్ట్రైక్ వచ్చి ఉంటే అతను కొడుతాడో లేదో అనుమానం కూడా ఉంటుంది. అందుకే సామ్సన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయంలో కచ్చితంగా సామ్సన్ తప్పులేదు అంటూ చెప్పుకొచ్చాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్లు) హైలైట్స్ చూపించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్ రాయల్స్ జడిసిపోలేదు. హిట్టర్ స్టోక్స్ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. పంజాబ్ కింగ్స్కు దడపుట్టించింది. కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయి రాజస్తాన్ పరాజయం చెందింది. చదవండి: సామ్సన్ చేసింది కరెక్టే కదా..! ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్ భావోద్వేగం -
వయసు పైబడినా వన్నె తగ్గలేదు..
రాయ్పూర్: అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఏళ్లు గడిచినా.. దిగ్గజ ఆటగాళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్ సేఫ్టీ సిరీస్లో భాగంగా మొన్న బంగ్లా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. నిన్న విండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రియాన్ లారా (49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఉపుల్ తరంగ(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్)లు సత్తా చాటాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక లెజెండ్స్.. విండీస్ లెజెండ్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా(53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరో వికెట్ తీశారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(53 నాటౌట్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తరంగాకు తోడుగా తిలకరత్నే దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ అడిన తరంగాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆదివారం జరుగనున్న తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ లెజెండ్స్తో, బంగ్లా దిగ్గజాలు తలపడనున్నారు. -
రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్ దిగ్గజాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు మరో సారి బరిలోకి దిగి పేక్షకులకు కనువిందు చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్లో భాగంగా రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్లీ, తిలకరత్నె దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్లకు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు పాల్గొనున్నారు. ఈ టోర్నీ మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది ఈ సిరీస్(నాలుగు మ్యాచ్ల అనంతరం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో ఆటగాళ్లు తమ మునుపటి ఫామ్ను ప్రదర్శిస్తూ పేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ఈ సిరీస్కు కమిషనర్గా వ్యవహరిస్తుండగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. -
ఒక్క మ్యాచ్.. రెండు రికార్డులు
అడిలైడ్ : అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరగనున్న మొదటిటెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజాలుగా పిలవబడే సచిన్ టెండూల్కర్,బ్రియాన్ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లికి వచ్చింది. ఆ రికార్డులు ఏంటనేది ఒకసారి పరిశీలిస్తే.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అడిలైడ్ వేదికగా ఆసీస్పై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. అడిలైడ్ వేదికలో 4 మ్యాచ్లాడిన లారా 76.25 సగటుతో 610 పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కోహ్లి అడిలైడ్ వేదికగా 71.83 సగటుతో 431 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. కోహ్లి లారా రికార్డును బ్రేక్ చేసేందుకు మరో 179 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి కోహ్లి ఆ పరుగులు చేస్తే లారా పేరిట ఉన్న రికార్డును చెరిపేసి తాను నంబర్వన్ స్థానాన్ని అధిగమిస్తాడు. (చదవండి : మీ అభిమానానికి థ్యాంక్స్ : కేఎల్ రాహుల్) ఇక రెండో రికార్డు చూసుకుంటే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా తరపున ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డపై 20 మ్యాచ్ల్లో 6 సెంచరీలు సాధించాడు. ఈ ఐకానిక్ ప్లేయర్ ఆసీస్ గడ్డపై 20 మ్యాచ్ల్లో 1809 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి కూడా సచిన్తో సమానంగా ఆరు సెంచరీలు సాధించాడు. అడిలైడ్లో కోహ్లి ఒక్క సెంచరీ సాధించినా సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. ఇక కోహ్లి ఆసీస్ గడ్డపై 12 మ్యాచ్లాడి 1274 పరుగులు సాధించాడు. అలా కోహ్లికి ఒకే మ్యాచ్లో రెండు రికార్డులు సాధించే అరుదైన అవకాశం లభించింది. కాగా కోహ్లి మొదటి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు. (చదవండి : 'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం') -
లారా మెచ్చిన యంగ్ క్రికెటర్ అతనే!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఇప్పుడు ఉన్న ఇండియన్ యంగ్ క్రికెటర్లలలో తనకు ఎవరు ఇష్టమో ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐదుగురు యంగ్ క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ వారంటే తనకు ఎందుకు అంత ఇష్టమో పేర్కొన్నారు. లారాకు ఇష్టమైన క్రికెటర్లలో సంజూ సామ్సన్ ముందు వరుసలో ఉన్నాడు. తనకు ఇష్టమైన ప్లేయర్ల గురించి అడగగా ఆయన మొదట సంజూ పేరునే ప్రస్తావించారు. ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న సంజూ రెండు మ్యాచ్ల్లో 16 సిక్స్లు కొట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఆ తరువాత మ్యాచ్ల్లో దానిని కొనసాగించలేకపోయాడు. లారా, సంజూ గురించి మాట్లాడుతూ, ‘నాకు సంజూ సామర్థ్యం అంటే చాలా ఇష్టం. అతనికి మంచి టైమింగ్, సామర్థ్యం ఉంది. అతను ఉన్నత స్థాయికి చేరుతాడు’ అని అన్నారు. ఇక లారాకు ఇష్టమైన మరో క్రికెటర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్. ఈయన ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడి 461 పరుగులు చేశాడు. సరాసరి 41.90 పరుగులు. ‘ఒక వేళ టీంలో బెస్ట్ ప్లేయర్లు ఓపెనర్లుగా లేనప్పుడు సూర్యకుమార్ను నెంబర్ 3గా దించాలి. ఓపెనర్లు ఆడటంలో విఫలమైన ఇతను నిలకడగా ఆడి టీంని గెలిపించే అవకాశాలు ఉన్నాయి’ అని లారా పేర్కొన్నారు. ఇక తనకిష్టమంటూ లారా చెప్పిన మరో పేరు దేవ్దత్ పడిక్కల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్న దేవ్దత్ ఈ సీజన్లో ఆర్సీబీ జట్టులో ఎక్కువ రన్స్ చేశాడు. ఇక ఇతని గురించి లారా మాట్లాడుతూ, ‘దేవ్దత్కు చాలా సామర్థ్యం ఉంది. అయితే అతను కొన్ని విషయాలను మార్చుకోవాలి. నేను అతను కేవలం టీ20, ఐపీఎల్లో మాత్రమే ఆడాలని కోరుకోవడం లేదు. అతను టెస్ట్లలో కూడా ఆడాలి. దానికి కొన్ని టెక్నిక్లను తెలుసుకోవాలి’ అని అన్నారు. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తనకు ఇష్టమైన ఆటగాళ్లలో ఉన్నాడంటూ లారా చెప్పారు. ‘అతను కచ్ఛితంగా ఒక మంచి ఆటగాడు. అతని గురించి ఇంతకి మించి ఏం చెప్పగలను’ అని లారా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఆటగాడు, అండర్ -19 మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా లారా దృష్టని ఆకర్షించాడు. ‘నాకు తెలిసి ప్రియమ్ గార్గ్కు చాలా సామర్థ్యం ఉంది’ అని అన్నారు. ఇక సన్రైజర్స్ జట్టులోని మరో ఆటగాడు, జమ్ము- కశ్మీర్ ఆల్ రౌండర్ అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడుతున్నాడు అంటూ లారా కితాబిచ్చాడు. చదవండి: ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా -
'ముంబైతో మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలే'
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో లీగ్ మ్యాచ్లు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఆఖరి లీగ్ పోరు జరగనుంది. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే 18 పాయింట్లతో టాప్ లేపి ప్లేఆఫ్కు చేరగా.. ఎస్ఆర్హెచ్కు మాత్రం ఈ మ్యాచ్ చావోరేవో అనే పరిస్థితి. ముంబైతో మ్యాచ్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుంది.. ఓడిపోతే కేకేఆర్ వెళుతుంది. అయితే విండీస్ దిగ్గజం.. మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా మాత్రం ముంబైతో జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలు చేయనుందని అంటున్నాడు. (చదవండి : ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్) ' ముంబై.. ఈ మ్యాచ్లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్లో దుమ్మురేపే ప్రదర్శనతో టాప్ స్థానంలో నిలిచి ప్లేఆఫ్కు అడుగుపెట్టిన ముంబై ఈ మ్యాచ్ను పెద్దగా పట్టించుకోదనే అనుకుంటున్నా.ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు ముంబై తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎస్ఆర్హెచ్కు లాభం చేకూర్చనుంది. దీనిని వినియోగింకొని ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుందనే అనుకుంటున్నా. 'అంటూ లారా చెప్పుకొచ్చాడు. (చదవండి :‘ధోని 400 పరుగులు చేయగలడు’) -
‘గేల్ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో సతమవుతున్నా కింగ్స్ పంజాబ్ తన సెలక్షన్లో పెద్దగా మార్పులేమీ చేయకపోవడంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పెదవి విరిచాడు. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్కు సైతం పించ్ హిట్టర్ క్రిస్ గేల్కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లకు జతగా క్రిస్ గేల్ కూడా ఉండి ఆ జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుందన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుస మ్యాచ్లను చేజార్చుకుంటున్న తరుణంలో గేల్ను ఆడించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు.(ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్ కార్తీక్..) క్రిస్ గేల్ అనేవాడు ప్రత్యర్థి జట్టును భయభ్రాంతులకు గురి చేస్తాడనేది కాదనలేని వాస్తవమన్నాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్లో పైచేయి సాధించాలంటే గేల్ జట్టులో ఉంటేనే అది సాధ్యమవుతుందన్నాడు. ఈ ఐపీఎల్లో జోర్డాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వడం ఇక్కడ సరైనది కాదన్నాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్లో క్రిస్ గేల్ ఉంటే ఆ బలమే వేరుగా ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కేకేఆర్తో మ్యాచ్కు ముందు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన లారా.. గేల్ను మరొకసారి తీసుకోలేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ ఆడిన గత మ్యాచ్లో గేల్కు అవకాశం ఉంటుందని చివరి వరకూ ఊరించారు. కానీ ఆఖరి నిమిషంలో గేల్కు ఫుడ్ పాయిజన్ అయిందనే కారణంతో తప్పించామని కోచ్ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా, కేకేఆర్తో మ్యాచ్కు గేల్ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్న మరొకసారి వచ్చింది. కేకేఆర్తో మ్యాచ్లో ఫామ్లో లేని మ్యాక్స్వెల్ స్థానంలో గేల్ను ఆడించాలని విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు. -
ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా
ఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో ఎంఎస్ ధోని పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ధోని పేలవ బ్యాటింగ్ ప్రదర్శన చెన్నై జట్టును కలవరపెడుతుంది. ఈ విషయమై వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాట్లాడారు. 'ధోని అద్భుతమైన 'ఫినిషర్', అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అతడికి అనుకూలంగా లేవు. ఛేదనలో మునుపటి ధోనిలా ఆడలేకపోతున్నాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 11(12) పరుగులే చేయగలిగాడు. ఆ మ్యాచ్లో జడేజా బాగా ఆడాడు. డ్వేన్ బ్రావోకు కూడా ఆ జట్టులో సరైన అవకాశం లభించడం లేదు. ఫినిషింగ్ బాధ్యతలు వేరొకరికి ఇస్తే బాగుంటుంది' అని లారా అభిప్రాయపడ్డారు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్కతా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే 'మిడిల్ ఆర్డర్' పూర్తిగా విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయగలిగింది. (ఇదీ చదవండి: నేను రన్స్ ఇవ్వడం కాదు.. వారు కొడుతున్నారు!) -
ఆ విషయాన్ని పంత్ గ్రహించాడు: లారా
దుబాయ్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా ప్రశంసలు కురిపించాడు. పంత్ తన ఆట తీరును మొత్తం మార్చేశాడని కొనియాడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో పంత్ ఆటను చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థమవుతుందన్నాడు. గతంలో ఆఫ్ సైడ్ ప్లే ఆడటంలో ఎంతో బలహీనంగా ఉండే పంత్ ఇప్పుడు దాన్ని అధిగమించాడన్నాడు. ఒకప్పుడు పంత్ ఆన్సైడ్ ఆటనే ఎక్కువగా ఆడేవాడని, అది ఇప్పుడు ఛేంజ్ చేసుకున్నాడన్నాడు. తాను ఆన్సైడ్ ప్లేలో ఒకే తరహా షాట్లు కొడుతూ వికెట్ సమర్పించుకుంటున్న విషయాన్ని తొందరగా గ్రహించాడన్నాడు. ఒకే తరహా పోనీ ట్రిక్ షాట్లను వదిలిపెట్టి, గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతుండటం కనిపిస్తుందన్నాడు. పంత్ బ్యాటింగ్ మారడంతో అది బౌలర్లకు చాలెంజ్గా మారిందన్నాడు. (సీఎస్కే బ్యాట్స్మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) ఈ ఐపీఎల్ సీజన్లో పంత్ బ్యాటింగ్ ఆకర్షణీయంగా సాగుతుందని లారా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షో మాట్లాడిన లారా.. ‘ పంత్ అంతకముందు కొన్ని షాట్లు ఆడేవాడు కాదు. ఇప్పుడు అది లేదు. గ్రౌండ్ అన్ని వైపులా ఆడుతున్నాడు. ఇది వరకు లెగ్సైడ్ షాట్లనే పంత్ ఆడేవాడు. అది అతనికి శాపంగా మారింది. ఈ ఐపీఎల్లో ఆఫ్ సైడ్ షాట్ల కూడా బాగా ఆడుతున్నాడు. ఆన్సైడ్లో ఒకే రకమైన షాట్ల వల్ల ఉపయోగం లేదనే విషయాన్ని పంత్ గ్రహించాడు. ఓవరాల్గా గతంలో పంత్ ఎక్కువ ఆడలేని ఎక్స్ట్రా కవర్, ఓవర్ పాయింట్, పాయింట్ ముందు షాట్లలో కూడా బాగా మెరుగయ్యాడు. ఇది అతని ‘ఆల్రౌండ్’ బ్యాటింగ్ ఉపయోగపడుతుంది. ఆ యువ క్రికెటర్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న పంత్ ఇప్పటివరకూ ఐదు గేమ్లు ఆడి 171 పరుగులు సాధించాడు. ఇక్కడ అతని స్టైక్రేట్ సుమారు 140.00గా ఉంది. -
ఆ నలుగురు నా ఫేవరెట్స్.. మరి ఫేవరెట్?
న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకడు. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను భారత్కు అందించిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఇటీవల తన వీడ్కోలుపై యువీ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనేది సరైన దిశలో సాగకపోవడం బాధించిందన్నాడు. భారత్ క్రికెట్కు ఎన్నో సేవలందించిన సెహ్వాగ్, జహీర్ఖాన్ వంటి క్రికెటర్లకు కూడా రిటైర్మెంట్ అనేది సాధారణంగానే జరిగిపోయిందన్నాడు. ఇక్కడ బీసీసీఐ వ్యవహరించే తీరు దారుణమంటూ విమర్శించాడు. ఆట నుంచి రిటైర్మెంట ప్రకటించిన క్రికెటర్లను గౌరవించడంపై బీసీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.(‘ట్రిపుల్ సెంచరీ’ హీరోకు కరోనా!) కాగా, ఆగస్టు 13 అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ దినోత్సవం సందర్భంగా యువీ ఒక ట్వీట్ చేశాడు. తనకు ఇష్టమైన లెఫ్ట్ హ్యాండర్ల పేర్లను అభిమానులతో పంచుకున్నాడు. వీరిలో బ్రియాన్ లారా(వెస్టిండీస్), సౌరవ్ గంగూలీ(భారత్), ఆడమ్ గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా), మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. నాకు ఇష్టమైన ఈ నలుగురు లెఫ్ట్ హ్యాండ్ దిగ్గజాలు క్రికెట్కు పరిచయం అయినందుకు తానిచ్చే ఇదే గొప్ప నివాళి అంటూ వారి ఫోటోలను షేర్ చేశాడు. ఇక మీకు ఇష్టమైన లెఫ్ట్ హ్యాండర్ ఎవరో తనతో షేర్ చేసుకోవాలంటూ పేర్కొన్నాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో గెలిచిన రెండు వరల్డ్కప్లు(టీ20 వరల్డ్కప్, వన్డే వరల్డ్కప్) యువీ కీలక పాత్ర పోషించాడు. 2007లో జరిగిన వరల్డ్కప్లో బ్యాట్తో మెరిసిన యువీ.. భారత్కు కప్ గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ప్రత్యేకంగా ఇంగ్లండ్పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు తన బ్యాటింగ్లో పవర్ చూపించాడు. ఇక 2011లో ఆల్ రౌండ్ షో అదరగొట్టి భారత్ వరల్డ్కప్ గెలవడానికి దోహదపడ్డాడు. అంతకుముందు 2002లో ఇంగ్లండ్తో జరిగిన నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో యువీ తన మార్కుతో ఆకట్టుకుని టైటిల్ గెలవడంలో సహకరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యువీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు మరుపురాని విజయాలను అందించి పెట్టాడు. కాకపోతే ఒకానొక సందర్భంలో క్యాన్సర్ బారిన పడటంతో యువీ కెరీర్ సాఫీగా సాగలేదు. క్యాన్సర్తో పోరాడి గెలిచినా మునపటి ఫామ్ను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. చాలాకాలం పాటు రీఎంట్రీ కోసం ఎదురుచూసినీ యువీకి నిరాశే ఎదురైంది. దాంతో గత సంవత్సరం జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. తన రిటైర్మెంట్ను భారంగానే చెప్పిన యువీ.. సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ తీరు సరిగా లేదని మండిపడ్డాడు. (ఈసారి హెలికాప్టర్ షాట్లతో పాపులర్..!) Here’s a tribute to some of the greatest left handed legends the game has produced. Add on to this golden list and share with me your favorite left-handed batsmen #InternationalLeftHandersDay pic.twitter.com/wovMFYSQoR — Yuvraj Singh (@YUVSTRONG12) August 13, 2020 -
పరిస్థితి ఎలా ఉంది.. మీరేం చేస్తున్నారు?: లారా
ఆంటిగ్వా: తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ రూమర్లు పుట్టించడంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా మండిపడ్డాడు. ఏదొక న్యూస్ కోసం ఏదైనా రాసేస్తారా అంటూ ధ్వజమెత్తాడు. కేర్లెస్గా ఒక తప్పుడు సమాచారాన్ని ఎలా వ్యాప్తి చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ హాయ్.. నాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు చదివాను. ఈ రూమర్లను ఎందుకు పుట్టిస్తున్నారు. నేను చేయించుకున్న టెస్టులో నెగిటివ్ వచ్చింది. మరి అటువంటప్పుడు పాజిటివ్ అని రాయడం అవసరమా.. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. (‘ఫ్యాబ్-4 బ్యాటింగ్ లిస్టులోకి వచ్చేశాడు’) కేవలం మీరు రాసింది తప్పుడు సమాచారం అని చెప్పడమే కాదు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా..ఇటువంటి తరుణంలో తప్పుడు వార్తలు రాయడం ఎంత వరకూ కరెక్ట్. పరిస్థితి ఏమిటి.. మీరు ఏమి చేస్తున్నారు. ఒక బాధ్యతలేని, అవసరం లేని సమాచారంతో నా సర్కిల్లో గందరగోళం సృష్టించారు. తప్పుడు సమాచారంతో నాకు చెడు ఏమీ జరగదు.. కానీ రూమర్లను నిజాలుగా చిత్రీకరించకండి’ అంటూ లారా మండిపడ్డాడు. ఏదైనా నెగిటివ్ యాంగిల్ ఒక వార్తను తీసుకుని దాన్ని హంగులు దిద్దడం సెన్సాషన్ కోసం కాకపోతే మరి ఏమిటి అని లారా కౌంటర్ ఇచ్చాడు. సమీప భవిష్యత్తులో ప్రతీచోటా కరోనా వైరస్ వ్యాప్తిని చూస్తామని, మనమంతా దాన్ని అధిగమించి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నట్లు లారా పేర్కొన్నాడు. (కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్ కెప్టెన్) -
లారా ఆ రికార్డు సాధించి 26 ఏళ్లు..
జమైకా : క్రికెట్ ప్రపంచానికి బ్రియాన్ లారా పరిచయం అవసరం లేని పేరు. సమాకాలీన క్రికెట్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ధీటుగా పరుగులు సాధించిన వ్యక్తి. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400*నాటౌట్) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అలాంటి లారా తన ఫస్ట్క్లాస్ కెరీర్లోనూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 501*పరుగులు సాధించి క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ అద్భుతం జరిగి నేటికి 26 ఏళ్లవుతుంది.(ఫుట్బాల్ మ్యాచ్కు 30,000 మంది..) జూన్ 6, 1994లో వార్విక్షైర్ తరపున ప్రాతినిధ్యం వహించిన లారా ఎడ్జ్బాస్టడ్ వేదికగా దుర్హమ్తో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్లో ఈ రికార్డును సాధించాడు. అప్పటివరకు ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో పాకిస్తాన్కు చెందిన హనీఫ్ మహ్మద్ పేరిట ఉన్న 499 పరుగుల రికార్డును లారా బద్దలుకొట్టాడు. మొత్తం 474 నిమిషాల పాటు క్రీజులో ఉన్న లారా 427 బంతులెదుర్కొని 501 పరుగులు చేశాడు. కాగా ఇన్నింగ్స్ మధ్యలో లారా 12, 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభతర క్యాచ్లను అప్పటి వికెట్ కీపర్ క్రిస్ స్కాట్ వదిలివేయడం ఆ జట్టుకు శాపంగా మారింది. ఫలితంగా లారా జాన్ మోరిస్ బౌలింగ్లో కవర్డ్రైవ్ కొట్టి ఈ ఫీట్ను సాధించడం విశేషం. అంతేగాక ఆ సీజన్లో వార్విక్షైర్ తరపున లారా 8 ఫస్ట్క్లాస్ ఇన్నింగ్స్లలో 7 శతకాలతో 89.82 సగటుతో మొత్తం 2006 పరుగులు సాధించాడు. అయితే అప్పటికే విండీస్ జట్టులో సభ్యుడైన లారా రెండు నెలల క్రితం ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. సిరీస్లో చివరి టెస్టులో లారా 538 బంతులెదుర్కొని 375 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో 45 ఫోర్లు ఉన్నాయి. సమకాలీన క్రికెట్లో అద్భుత బ్యాట్స్మెన్గా పేరు సంపాదించిన లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్థశతకాలు ఉన్నాయి. కాగా 299 వన్డేల్లో 10,405 పరుగులు చేసిన లారా 261 ఫస్ట్క్లాస్ కెరీర్లో 22,156 పరుగులు సాధించాడు. ఇందులో 65 శతకాలు, 88 అర్థసెంచరీలు ఉన్నాయి.(గల్లీ క్రికెట్: గేల్కు పాండ్యా ఛాన్స్) -
ఆరు బంతుల్ని ఒకే ప్లేస్లో వేసినా..
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీలది ప్రత్యేక స్థానం. తమ శకంలో వీరిద్దరూ ఫాస్టెస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను హడలెత్తించిన సందర్భాలు అనేకం. అప్పట్లో సచిన్-బ్రెట్ లీ మధ్య పోరు, సచిన్-అక్తర్ల మధ్య పోటీ అనేది ఎక్కువగా ఉండేది. ఈ ఇద్దరిలో బ్రెట్ లీ కాస్త భిన్నం. బంతిని వేయడానికి రనప్ను తక్కువ తీసుకున్నా వేగంలో మాత్రం మార్పు ఉండేది కాదు. 1999లో భారత్పై అరంగేట్రం చేసిన బ్రెట్ లీ.. అనతికాలంలోనే ఆసీస్ జట్టులో ప్రధాన బౌలర్గా మారిపోయాడు. కచ్చితమైన పరుగుతో అత్యంత వేగంగా బంతుల్ని సంధించడంలో దిట్ట బ్రెట్ లీ. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా, జాక్వస్ కల్లిస్, కుమార సంగక్కరా, ఇంజమాముల్ హక్, పీటర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లుకు బౌలింగ్ చేసినా, తన క్రికెట్ కెరీర్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లు ముగ్గురే ఉన్నారంటున్నాడు బ్రెట్ లీ. వారిలో తొలి స్థానం సచిన్కు ఇవ్వగా, రెండో స్థానాన్ని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాది కాగా, ఇక మూడో స్థానం దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్ది. వీరినే తాను ఎందుకు ఎంపిక చేసుకున్నాననే దానిపై బ్రెట్ లీ వివరణ ఇచ్చాడు.(‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ భేష్’) సచిన్లా ఎవరూ బ్యాటింగ్ చేయలేరు ‘సచిన్ తరహాలో ఎవరూ బ్యాటింగ్ చేయడం నేను చూడలేదు. ఎక్స్ట్రా టైమ్ తీసుకుని షాట్లు ఆడుతుంటాడు. క్రీజ్లో వచ్చాక నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. క్రీజ్లో కుదురుకున్నాడంటే ఈజీగా షాట్లు కొడతాడు. వరల్డ్లో సచినే అత్యుత్తమ బ్యాట్స్మన్’ అని లీ తెలిపాడు. ఆరు బంతుల్ని ఒకే ప్లేస్లో వేసినా.. ఇక లారా గురించి మాట్లాడుతూ.. ‘ లారా ఒక విభిన్నమైన లెఫ్ట్ హ్యాండర్. లారా హిట్టింగ్ బాగుంటుంది. ముఖ్యంగా సిక్స్లు కొట్టడంలో లారా దిట్ట. ఒక బౌలర్ ఆరు బంతుల్ని ఒకే ప్లేస్లో సంధించినా వేర్వేరు డైరెక్షన్లో సిక్స్లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. అతను క్రికెట్ ఆడే కాలంలో చూపరులను ఇట్టే ఆకట్టుకునే వాడు’ అని తెలిపాడు. కల్లిస్ కంప్లీట్ క్రికెటర్ ‘జాక్వస్ కల్లిస్ కంప్లీట్ క్రికెటర్. బ్యాట్స్మన్గా ఎంతలా రాణిస్తాడో, బౌలర్గా అదే స్థాయిలో రాణించే ఆటగాడు కల్లిస్. అవసరమైతే ఓపెనింగ్ బ్యాట్స్మన్గా దిగగలడు, ఓపెనింగ్ ఓవర్ను కూడా వేయగలడు. ఫీల్డర్గా కూడా కల్లిస్ది ప్రత్యేక స్థానం. స్లిప్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్లు అందుకున్న చరిత్ర కల్లిస్ది. నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్ కల్లిస్. సచిన్ తాను చూసిన బెస్ట్ బ్యాట్స్మన్ అయితే కల్లిస్ బెస్ట్ క్రికెటర్’ అని బ్రెట్లీ పేర్కొన్నాడు. -
'అబ్బా.. కొడుకు కలిసి డ్యాన్స్ ఇరగదీశారు'
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన కొడుకు జొరావర్తో తెగ అల్లరి చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో ఆటకు విరామం దొరకడంతో భార్య అయేషాతో కలిసి బాక్సింగ్ క్లాసులు నేర్చుకోవడం, పలు బాలీవుడ్ గీతాలకు డ్యాన్స్లు చేస్తున్నాడు. దొరికిన ప్రతీ మూమెంట్ను ఎంజాయ్ చేస్తున్న ఈ గబ్బర్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. ('ఆ నిర్ణయం నా కెరీర్ను ముంచేసింది') తాజాగా ఈ మధ్యనే టిక్టాక్లో యమక్రేజ్గా మారిన 'సైరన్ బీట్ చాలెంజ్' డ్యాన్స్ను ధవన్ ట్రై చేశాడు. అయితే ధావన్ సీరియస్గా స్టార్ట్ చేద్దామనుకున్న ప్రతీసారి జొరావర్ అడ్డుగా వచ్చాడు. సైరన్ బీట్కు సంబంధించి రెండు స్టెప్స్ వేసిన ధావన్ తన కొడుకు జొరావర్ మరోసారి మధ్యలో రావడంతో కొడుకుతో కలిసి సంప్రదాయ పంజాబీ డ్యాన్స్ను చేశాడు. దాంతో ఈ వీడియోలో జొరావర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు.' డ్యాన్స్కీ అసలీ జోడి లైక్ ఫాదర్, లైక్ సన్' అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఈ వీడియోపై ధావన్ అభిమానులతో పాటు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా లాఫింగ్ ఎమోజీతో తన ఇన్స్టాలో స్పందించగా.. మిగతా టీమిండియా బ్యాట్స్మెన్లు కూడా ఎమోజీలతో కామెంట్లు పెట్టారు. ధావన్ అభిమానులు మాత్రం.. ' అబ్బా.. కొడుకు కలిసి డ్యాన్స్ ఇరగదీశారు'..' గబ్బర్ నువ్వుంటే చాలా అభిమానం.. ' అంటూ కామెంట్లు చేశారు. ('తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా') -
లారాతో ఉన్న యువకుడిని గుర్తుపట్టారా?
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రముఖ ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందిన వెస్టిండిస్ మాజీ క్రికెటర్ బ్రియన్లారా ఇన్స్టాగ్రామ్లో 2003లో ఓ అభిమానితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఎవరీ యువకులు? ఫ్యాన్ మూమెంట్ అని నాకు అర్థమైంది. అతడే తర్వాతి కాలంలో ఓ స్పెషల్ ఆటగాడిగా మారాడు. అతనెవరో మీరే చెప్పండి అంటూ అభిమానులతో 2003నాటి ఫోటోను పంచుకున్నాడు. ఇంతకీ ఆ స్పెషల్ ఆటగాడు ఎవరో మీరు గుర్తుపట్టారా? ఇంకా లేదా అయితే మీకోసం మరో క్లూ. నాటి అండర్19 జట్టు(క్రింది ఫోటో)లో సర్కిల్ చేసిన యువకుడే అతను. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన నాటి భారత అండర్19 జట్టు అతనెవరో కాదు, భారత స్టైలీష్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా. బ్రియన్లారా పోస్ట్కు సురేష్ రైనా బదులిస్తూ.. నిజానికి నాకే చాలా ప్రత్యేకమైన సందర్భం. నా అభిమాన క్రికెటర్తో దిగిన మధుర క్షణం అది. అండర్ 19 జట్టుకు ఆడే సమయంలో మేమందరం హెతిరో విమానాశ్రయంలో దిగాము. మా ముందే ఉన్న దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారాను చూసి నమ్మలేకపోయా. ఆరోజు మిమ్మల్ని కలవడం, మీతో కలిసి ఫోటో దిగడం, నాలో నూతన ఉత్తేజాన్ని ఇచ్చినట్టయింది. ఆరోజు నుంచి వెనక్కుతిరిగి చూసుకోలేదు. దేశం కోసం ఆడటం, ఉత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టిపెట్టా అంటూ రీపోస్ట్ చేసి కామెంట్ చేశాడు. ఇక ఈ ఫోటోకు నైస్ క్లిక్ అంటూ మరో భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ కామెంట్ చేశాడు. సురేష్ రైనా ఇటీవలి ఫోటో -
అతనికి గాయం.. నాకు ఒక జ్ఞాపకం!
కరాచీ: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటకు 160 కి.మీ వేగంతో బంతుల్ని సంధించడంలో అక్తర్ దిట్ట. తన హయాంలో ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీతో పోటీ పడి బౌలింగ్ చేసే వాడు అక్తర్. అప్పట్లో వీరిద్దరే ఫాస్టెస్ట్ బౌలర్లు. వీరి బౌలింగ్లో ప్రపంచ దిగ్గజ బ్యాట్స్మెన్స్ సైతం గాయపడిన సందర్భాల్లో ఎన్నో. వారి బౌలింగ్ను అంచనా వేయడంలో ఏమాత్రం విఫలమైనా అది ఎక్కడో చోట గాయపరచడం ఖాయమన్నట్లు ఉండేది. ఇలా తన బౌలింగ్లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా గాయపడిన క్షణాలను అక్తర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ('బ్రెట్ లీ బ్యాటింగ్ అంటే భయపడేవాడు') 2004లో చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భాగంగా విండీస్తో జరిగిన మ్యాచ్లో అక్తర్ షార్ట్ పిచ్ బంతిని వేగంగా సంధించాడు. అయితే ఆ బంతిని షాట్ కొడదామని ముందుగా ఫిక్స్ అయిన లారా.. చివరి దశలో తన ఆలోచనను మార్చుకున్నాడు. కానీ ఆ బంతి వేగంగా వచ్చి హెల్మెట్పై నుంచి దూసుకుపోవడంతో లారా విలవిల్లాడిపోయాడు. ఆ క్రమంలోనే లారా తలను పట్టుకుని పిచ్లోనే కూలబడిపోయాడు. అవి నిజంగా భయంకరమైన క్షణాలే. లారాకు ఏమైందో అనే కంగారు అటు పాక్ శిబిరంలోనూ, ఇటు విండీస్ శిబిరంలోనూ నెలకొంది. అది లారాకు గాయం మాత్రమే చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోను షోయబ్ అక్తర్ తాజాగా తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘ క్రికెట్ గేమ్లో ఒక లెజెండ్ లారా. ఆనాడు లారాను గాయపరిచిన మూమెంట్.. నా కెరీర్లో ఒక జ్ఞాపకం. అతని శకంలో ఉత్తమ బ్యాట్స్మన్ లారా. లారాతో ఆటను ఎప్పుడూ ఆస్వాదించే వాడిని’ అని అక్తర్ పేర్కొన్నాడు. ('నాపై ఒత్తిడి తెచ్చుంటే అక్రమ్ను చంపేవాడిని') A memory with one of the legends of the game. Best batsman of his era @BrianLara I wish i played more against him. #BrianLara #WestIndies #Legend pic.twitter.com/zdOPrU005c — Shoaib Akhtar (@shoaib100mph) April 22, 2020 -
16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు
సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 12, 2004)లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అప్పటివరకు టెస్టుల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించడమే రికార్డుగా ఉండేది. కానీ ఒక్కడు మాత్రం ఎవరు ఊహించని రీతిలో క్వాడ్రపుల్ సెంచరీ(400* పరుగులు) నమోదు చేసి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ఇప్పటికి ఆ రికార్డు సాధించి పదహారేళ్లు అవుతున్నా దాన్ని ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. ఆ రికార్డును సాధించిన ఆటగాడెవరో ఈ పాటికే మీకు అర్థమయిందని అనుకుంటున్నాం. ఆ ఆటగాడు మరెవరో కాదు.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా. అంతకుముందు వరకు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బ్యాట్స్మెన్ గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పదేళ్ల తర్వాత లారా 375 పరుగులతో అధిగమించాడు. అయితే లారా చేసిన 375 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హెడెన్ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. (ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు) అయితే ఏడాది తిరగకుండానే హెడెన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును లారా సవరించడమే గాక టెస్టుల్లో అనితరసాధ్యమైన (400 నాటౌట్) సాధించాడు. లారా రికార్డును అందుకోవాలని చాలా మంది ఆటగాళ్లు ప్రయత్నించారు. ఇక భారత్ నుంచి రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్వాడ్రపుల్ సెంచరీని మాత్రం సాధించలేకపోయాడు. అప్పటినుంచి ఈ 400 పరుగుల రికార్డు అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఇన్నింగ్స్కు 16 ఏళ్లు నిండడంతో మరోసారి ఆ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందాం. 2004 ఏప్రిల్లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్లో పర్యటించింది. నాలుగు టెస్టు సిరీస్లో భాగంగా మొదటి మూడు మ్యాచ్ల్లో లారా ఘోరంగా విఫలమయ్యాడు. 3 టెస్టుల్లో కలిపి కేవలం 100 పరుగులు చేయడంతో లారా ఫామ్పై అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సెయింట్ జాన్స్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం క్రికెట్ చరిత్రలో ఎవరు అందుకోలేని 400 పరుగుల రికార్డును సాధించి తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. లారా భారీ ఇన్నింగ్స్తో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 751/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకే ఆలౌటై.. ఫాలో ఆన్ ఆడినా ఓటమి నుంచి గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 422/5 రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. (‘ఇమ్రాన్ కంటే భారత్ గురించే ఎక్కువ తెలుసు’) లారా వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జట్టుకు విజయం అందించాలనేది పక్కనపెట్టి కేవలం తన రికార్డుల కోసం ఆరాటపడ్డాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విండీస్.. తమ సొంతగడ్డపై జరిగిన నాలుగు టెస్ట్ల సిరీస్లో 0-3తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగోటెస్టులో మాత్రం లారా ఇన్నింగ్స్తో డ్రాగా ముగిసింది. లారా ఆటతీరుపై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికి అతను చేసిన 400 పరుగుల రికార్డు 16 ఏళ్లయినా బద్దలు కాకపోవడమనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే లారా రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనేది వేచి చూద్దాం. -
'ప్రపంచకప్ గెలిచే సత్తా ఆ మూడు జట్లకే ఉంది'
ముంబై : అక్టోబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లకే ఎక్కువుగా ఉన్నాయని విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. అంతేగాక రానున్న ప్రపంచకప్ ఒక అద్బుతమైన ప్రపంచకప్గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ.. ' నా దృష్టిలో ఇండియా టీ20 ప్రపంచకప్ను ఘనంగానే ఆరంభిస్తుందనే ఆశిస్తున్నా. టీమిండియాకు కప్ను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాకు సొంతగడ్డ కావడం ఆ జట్టుకు బలం చేకూర్చే విషయమే. అయితే ఎంత సొంత గడ్డైనా ప్రదర్శన బాగుంటేనే ఫలితం లభిస్తోంది. ఇక మా జట్టు విషయానికి వస్తే పరిమిత ఓవర్ల ఆటతీరు ఎలా ఉన్నా టీ20ల్లో మాత్రం దుమ్మురేపే ప్రదర్శననే నమోదు చేస్తోంది. అయితే జట్టుకు సుస్థిరత లేకపోవడం వల్ల ప్రపంచకప్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా రానున్న ప్రపంచకప్లో రసవత్తరమైన పోరుకు మాత్రం కొదువ ఉండదు' అని లారా తెలిపాడు. కాగా విండీస్ పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచపకప్ టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. భారత్ విషయానికి వస్తే 2007 టీ20 ప్రపంచకప్ను గెలవగా, ఆసీస్ ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవకపోవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18న మొదలుకానుంది. (కోహ్లి, రోహిత్లు కాదు.. రాహులే గ్రేట్!) లారా ప్రసుత్తం రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రోడ్సేప్టీపై అవగాహన కల్పించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ఈ సిరీస్ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే బ్రియాన్ లారా వెస్టిండీస్ లెజెండ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ముంబై క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్లన్నింటిని రద్దు చేస్తున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా మ్యాచ్లన్నీ కొత్తగా రీషెడ్యూల్ చేసి డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) (ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన పఠాన్) -
కోహ్లి, రోహిత్లు కాదు.. రాహులే గ్రేట్!
ముంబై: ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాది ప్రత్యేక స్థానం. సెలబ్రిటీ క్రికెటర్లలో ఒకడైన లారా క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో 400 పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు. కాగా, ప్రస్తుత క్రికెటర్లలో ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని లారాను అడిగిన ప్రశ్నకు కాస్త భిన్నంగా బదులిచ్చాడు. ఇక్కడ పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలను పక్కన పెట్టేసిన లారా.. కేఎల్ రాహుల్కు ఓటేశాడు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ రాహుల్ అని పేర్కొన్నాడు. (సెహ్వాగ్ అదే బాదుడు) ప్రత్యేకంగా తాను రాహుల్ బ్యాటింగ్కు అభిమానినని తెలిపాడు. ‘ రాహుల్ ఒక గొప్ప ఎంటర్టైనర్.. గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం కలవాడు. అతని బ్యాటింగ్ను చూడటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. అతనొక క్లాస్ ప్లేయర్’ అని లారా తెలిపాడు. ఇక నాలుగు రోజుల టెస్టుల ప్రతిపాదనపై లారాను అడగ్గా.. మనం ఆడేది ఐదు రోజుల టెస్టా లేక నాలుగు రోజుల టెస్టా అనేది సమస్య కాదన్నాడు. ప్రతీ మ్యాచ్ ఫలితం వచ్చేలా ఉంటే అప్పుడు ఎన్ని రోజులు అనేది విషయం కాదన్నాడు. మ్యాచ్లో ఆసక్తికరం అనేది ఉంటేనే అభిమానులు ఎక్కువగా ఆదరిస్తారన్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్ జట్టుకు లారా సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్లో భాగంగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్-వెస్టిండీస్ లెజెండ్స్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా లెజెండ్స్ విజయం సాధించారు. ఈ మ్యాచ్లో సెహ్వాగ్ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
వారిదే టీ20 వరల్డ్కప్: లారా
న్యూఢిల్లీ: తాను టెస్టు ఫార్మాట్లో నెలకొల్పిన 400 పరుగుల రికార్డు ఏదో ఒక రోజు బ్రేక్ అవడం ఖాయమని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత తరంలో పలువురు క్రికెటర్లు దూకుడుగా ఆడుతుండటంతో పాటు నిలకడగా ఆడుతున్న కారణంగా తన రికార్డు బద్ధలు కొడతారన్నాడు. తన రికార్డును బ్రేక్ చేసే వారిలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందన్నాడు. ఇక ఆసీస్ నుంచి డేవిడ్ వార్నర్కు తన రికార్డును బద్ధలు కొట్టే సత్తా ఉందన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన రికార్డును వారి పేరిట లిఖించుకోవడానికి ఎంతో సమయం పట్టదన్నాడు. వీరిలో వార్నర్, రోహిత్లు ఓపెనర్లే కాకుండాహిట్టర్లు కూడా కావడంతో వారు క్రీజ్లో సుదీర్ఘ సమయం నిలదొక్కుకుంటే తన రికార్డును సునాయాసంగానే బద్ధలు కొడతారన్నాడు. కోహ్లి ఎక్కువగా ఫస్ట్ డౌన్లో రావడంతో అతనికి కూడా చాన్స్ ఉందన్నాడు. కాకపోతే స్టీవ్ స్మిత్కు మాత్రం తన రికార్డును బ్రేక్ చేయడం సాధ్యం కాకపోవచ్చన్నాడు. అతను నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చే కారణంగా 400 పరుగుల్ని చేరుకోవడం కష్టమన్నాడు. 2004లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో లారా 400 వ్యక్తిగత పరుగులు చేశాడు. ఇదే టెస్టుల్లో నేటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ రికార్డుకు మాథ్యూ హేడెన్ ఒకానొక సమయంలో దగ్గరగా వచ్చినప్పటికీ దాన్ని అందుకోలేకపోయాడు. ఇటీవల డేవిడ్ వార్నర్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఆసీస్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేయడంతో అది సాధ్యం కాలేదు. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్కప్ ఫేవరెట్లలో టీమిండియానే ముందు వరుసలో ఉంటుందన్నాడు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టుకు టీ20 వరల్డ్కప్ను గెలిచే అవకాశం ఉంద్నాడు. వరల్డ్కప్తోనే భారత్కు స్వదేశానికి తిరుగి వస్తుందని ధీమాగా చెప్పాడు. ప్రస్తుత భారత జట్టులో ప్రతీ ఒక్కరూ తమ తమ టార్గెట్లు ఏమిటో తెలుసుకుని జట్టును పటిష్టం చేశారన్నాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ వంటి మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లకు భారత్ ఎదురుపడితే అది అవతలి జట్టుకు సవాలే అవుతుందన్నాడు. -
26 ఏళ్ల రికార్డును మిస్ చేసుకున్నాడు..
కటక్: వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్ ఒక చారిత్రక రికార్డును మిస్ చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక వన్డే పరుగులు సాధించే రికార్డును షాయ్ హోప్ స్వల్ప దూరంలో కోల్పోయాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 1993లో 1349 పరుగులు సాధించాడు. అది ఇప్పటివరకూ విండీస్ తరఫున వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. దాన్ని హోప్ జస్ట్లో మిస్ అయ్యాడు. భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో హోప్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఫలితంగా ఈ క్యాలెండర్ ఇయర్లో 1345 పరుగులు సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. భారత్తో రెండో వన్డేలో కోహ్లిని దాటేసిన హోప్.. ఓవరాల్గా విండీస్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగుల్ని నమోదు చేయడంలో విఫలమయ్యాడు. లారా రికార్డుకు నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. విండీస్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో లారా, హోప్ల తర్వాత డేస్మాండ్ హేన్స్(1232పరుగులు-1985లో), వివ్ రిచర్డ్స్(1231పరుగులు-1985), క్రిస్ గేల్(1217 పరుగులు- 2006)లు వరుస స్థానాల్లో ఉన్నారు. -
ఆశలు ఉన్నవాళ్లు
కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్లు కొట్టాలని, క్యాచ్లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా? బ్రియాన్ లారా వెస్టిండీస్ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్ ఐ ఎంటర్టైన్?’ అని అడిగినందు వల్లా.. క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. రిటైర్ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం. పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్లో లోకల్ స్కూల్ ఒకటి ఉంది. హార్వార్డ్ కోచింగ్ క్లినిక్. ఆ క్లినిక్.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్ జోసెఫ్స్ రోమన్ కేథలిక్ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్ జువాన్ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్ కోచ్ హ్యారీ రామ్దాస్ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్హ్యాండెడ్ బ్యాట్స్మన్గా, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్ బాయ్స్ లీగ్లో ఇన్నింగ్స్కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక ఊహ మాత్రమే అయ్యేది. సాకర్ అన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్ లారా. ఢిల్లీలో బ్లైండ్ ఉమెన్ డొమెస్టిక్ నేషనల్ క్రికెట్ లీగ్ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్ అసోసియేషన్’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇవాళ ఫైనల్స్. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్ కెప్టెన్ అంకితాసింగ్ని, తక్కిన టీమ్లను, టీమ్ మేట్స్నీ కలిసి విష్ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్ నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్ మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ‘‘నా కెరియర్ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్ లేడీస్ అండ్ దెయిర్ టోర్నమెంట్ జస్ట్ అప్రోచింగ్’’ అన్నాడు. అప్రోచింగ్ అంటే నాట్ కంపేరబుల్ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది. -
‘లారా.. నీ రికార్డును ఏదో ఒక రోజు బ్రేక్ చేస్తా’
అడిలైడ్: టెస్టు క్రికెట్లో విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా చేసిన 400 పరుగుల వ్యక్తిగత స్కోరును బద్దలు కొట్టే రోజు తనకు మళ్లీ వస్తుందని ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. పాక్తో జరిగిన రెండో టెస్టులో వార్నర్ 335 పరుగులతో అజేయంగా నిలువగా... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడంతో లారా రికార్డును చెరిపేసే అవకాశాన్ని కోల్పోయాడు. టెస్టు జరిగిన సమయంలో లారా వ్యాపార పనులమీద అడిలైడ్లోనే ఉన్నాడు. అప్పుడే విండీస్ లెజెండ్ స్పందిస్తూ వార్నర్ తన రికార్డును బద్దలు కొడతాడని ఆశించానన్నాడు. 300 చేసిన బ్యాట్స్మన్కు 400 చేయడమెలాగో తెలుసని ఉత్తేజపరుస్తూ వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో లారాతో కలిసి దిగిన ఫొటోనూ తాజాగా వార్నర్ ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. ‘దిగ్గజ బ్యాట్స్మెనే స్వయంగా నన్ను కలవడం గొప్ప విషయం. అతని రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఏదో ఒక రోజు వస్తుంది’ అని ఆ ఫొటోకు వ్యాఖ్య జతచేశాడు. తమ వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ చేసిన 365 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును 36 ఏళ్ల తర్వాత లారా ఇంగ్లండ్ (1994)పై బద్దలు కొట్టాడు. ఈ స్కోరును మాథ్యూ హేడెన్ (381 – జింబాబ్వేపై) అధిగమించగా...కొద్ది రోజులకే 2004లో ఇంగ్లండ్పైనే 400 పరుగులతో లారా కొత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది. -
రోహిత్ ‘400’ కొట్టగలడు
అడిలైడ్: పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ 335 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ సమయంలో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును వార్నర్ బద్దలు కొట్టగలడని అనిపించింది. అయితే అనూహ్యంగా ఆసీస్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం కొంత వివాదం రేపగా, భారీగా చర్చ సాగింది. అయితే వార్నర్ దీనిపై స్వయంగా స్పందించాడు. ‘నా ఆట గురించి నేనే చెప్పగలను. మైదానంలో బౌండరీలు చాలా పెద్దవి. వేగంగా పరుగులు చేయడం అంత సులువు కాదు. తీవ్రంగా అలసిపోయిన తర్వాత మరింతగా శ్రమించడం, ఏదోలా పరుగుల కోసం ప్రయత్నించడం కష్టంగా మారిపోతుంది. చివర్లో నేను బౌండరీలు కొట్టలేక సింగిల్స్ తీస్తూ పోయాను. అయితే 400 పరుగుల ఘనతను సాధించగల ఆటగాడు ఎవరైనా ఉన్నారా అని నన్నడిగితే రోహిత్ శర్మ పేరు చెబుతాను’ అని వార్నర్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలోనే తాను టెస్టు ఆటగాడిగా ఎదగగలనని నమ్మకం పెంచిన వ్యక్తి సెహ్వాగ్ అని వార్నర్ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో సెహ్వాగ్తో కలిసి అతను ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడాడు. టి20లు, వన్డేల్లో ఆసీస్కు ఆడిన మూడేళ్ల తర్వాత గానీ అతనికి తొలి టెస్టు అవకాశం రాలేదు. ‘నేను మంచి టెస్టు ఆటగాడిగా ఎదగగలనని సెహా్వగ్ చెబితే పిచ్చోడిని చూసినట్లు చూశాను. కానీ అతను టెస్టుల్లో ఉండే ఫీల్డింగ్ వ్యూహాలు నాలాంటి ఆటగాడికి సరిగ్గా సరిపోతాయని విశ్లేషించడం నాకింకా గుర్తుంది’ అని వ్యాఖ్యానించాడు. ►వార్నర్ నా రికార్డును అందుకునే వరకు ఆట కొనసాగిస్తారని భావించాను. నేను తన రికార్డును అధిగమించినప్పుడు సోబర్స్ కూడా ఆ ఘనతను ఆస్వాదించారు. రికార్డులనేవి ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కాక తప్పదు. దూకుడైన, వినోదం పంచే ఆటగాళ్లు అది సాధించినప్పుడు మరింత అద్భుతంగా అనిపిస్తుంది. –వార్నర్ స్కోరుపై బ్రియాన్ లారా వ్యాఖ్య -
'క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో టీమిండియా'
ముంబయి : వెస్టీండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. గతంలో స్వదేశంలో మాత్రమే మంచి ప్రదర్శనను కనబరిచిన భారత జట్టు ప్రసుత్తం విదేశాల్లోనూ నిలకడగా రాణిస్తూ అత్యంత శక్తివంతమైన జట్టుగా తయారైందంటూ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ముంబయిలో గురువారం జరిగిన ఓ ఈవెంట్కు లారా హాజరయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత జట్టు వరుసగా 11 టెస్టు సిరీస్లను గెలవడమే కాకుండా, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా వరుసగా నాలుగు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అందులో రెండు విజయాలు విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో లారా స్పందిస్తూ.. 'ఒకప్పుడు టీమిండియా స్వదేశంలో మాత్రమే మంచి ప్రదర్శన ఇస్తూ, విదేశాల్లో మాత్రం చతికిలబడేది. కానీ ప్రస్తుతం విదేశాల్లోనూ అద్బుత విజయాలు నమోదు చేస్తూ అత్యంత శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది . గతంలో విండీస్ 70, 80వ దశకాల్లో, ఆస్ట్రేలియా 90వ దశకం, 20వ శతాబ్దం మొదట్లో క్రికెట్ ప్రపంచాన్నిశాసించాయి. అలాగే ప్రస్తుత క్రికెట్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు మాత్రమే టీమిండియా విజయాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. 2016లో టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించిన టీమిండియా అప్పటి నుంచి ఆ స్థానాన్ని కాపాడుకోవడం వెనుక బ్యాటింగ్, బౌలింగ్ వనరుల నైపుణ్యం తెలుస్తుందని' పేర్కొన్నాడు. విండీస్ తరపున ప్రాతినిధ్యం వహించిన బ్రియాన్ లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు, 299 వన్డేల్లో 10,405 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ మీద తాను నమోదు చేసిన 400 పరుగుల రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉండడం విశేషం. -
రోడ్ సేఫ్టీ టి20 లీగ్
-
సచిన్, సెహ్వాగ్ మళ్లీ కలిసి...
ముంబై: క్రికెట్కు గుడ్బై చెప్పిన మాజీలతో కొత్త లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 లీగ్ పేరుతో ఈ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఈ టోర్నీ ముంబై, పుణే వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీ వివరాలను గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్ పాల్గొన్నారు. లీగ్కు దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఇండియా లెజెండ్స్, ఆ్రస్టేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపు 75 మంది రిటైర్డ్ క్రికెటర్లు ఇందులో ఆడనున్నట్లు సమాచారం. ఈ లీగ్లో 10 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. భారత్కు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తుండగా... జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్లు ఆడనున్నారు. విండీస్కు బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికాకు జాంటీ రోడ్స్, శ్రీలంకకు దిల్షాన్, ఆ్రస్టేలియాకు బ్రెట్ లీ కెపె్టన్లుగా ఉండబోతున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వస్ కలిస్, ఆ్రస్టేలియా రిటైర్డ్ ప్లేయర్లు బ్రాడ్ హాగ్, సైమండ్స్ పాల్గొంటున్నారు. ఈ లీగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రోడ్డు భద్రత అవగాహన కోసం పని చేస్తున్న ‘శాంత్ భారత్ సురక్షిత్ భారత్’ అనే సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. -
‘అత్యధిక పరుగులు చేసేది అతడే’
బర్మింగ్హామ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో విజయం ఇంగ్లండ్దే అని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ను కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ను సొంతం చేసుకుంటుందని పేర్కొన్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు...‘ యాషెస్ 2019లో విజేత ఇంగ్లండ్. అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్మెన్ జో రూట్, అత్యధిక వికెట్లు తీసే ఆటగాడు క్రిస్ వోక్స్’ అని లారా ట్వీట్ చేశాడు. కాగా ఇంగ్లండ్ బౌలర్ల జోరు... ఆసీస్ బ్యాట్స్మెన్ పోరాటం మధ్య చరిత్రాత్మక యాషెస్ సిరీస్ ఆసక్తిగా ప్రారంభమైంది. టాంపరింగ్ వివాదం, సస్పెన్షన్ అనంతరం తొలి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్ గురువారం నాటి మ్యాచ్లో శతకంతో పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. కెరీర్లో 24వ శతకం ((219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్లు)) సాధించాడు. ఇక ఎడ్జ్బాస్టన్ మైదానంలో మొదలైన టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. స్మిత్కు లోయర్ ర్డర్ బ్యాట్స్మెన్ పీటర్ సిడిల్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58) ధాటికి 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్ తక్కువ స్కోరే చేసేలా కనిపించింది. అయితే, స్మిత్ సెంచరీతో ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. My Predictions for the Ashes @icc 🔶 Ashes 2019 Winners: #england Most Runs: @root66 Most Wickets: @chriswoakes#ashes #lovecricket #cricket #icc #engvsaus #testcricket pic.twitter.com/8AB4W0nHmj — Brian Lara (@BrianLara) August 1, 2019 -
కోహ్లికి... మిగతా బ్యాట్స్మెన్కు ఎంతో తేడా!
ముంబై: ఏ ఫార్మాట్లో చూసినా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లికి మిగతా బ్యాట్స్మెన్కు మధ్య చాలా అంతరం ఉందని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా అన్నాడు. గురువారం ఇక్కడి డీవై పాటిల్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న లారా... ఈ తరంలో కోహ్లి అత్యుత్తమం అంటూనే తన ఆల్ టైం ఫేవరెట్ బ్యాట్స్మన్గా మాత్రం సచిన్ టెండూల్కర్కే ఓటేశాడు. ‘రోహిత్ ఈ ప్రపంచ కప్లో నాలుగు శతకాలు చేసి ఉండొచ్చు. బెయిర్ స్టోనో ఇంకెవరో రాణిస్తుండవచ్చు. కానీ, కోహ్లి ఓ పరుగుల యంత్రం. టి20, వన్డేలు, టెస్టులు ఇలా ఏది చూసినా అతడికి ఇతరులకు పోలికే లేదు’ అని లారా విశ్లేషించాడు. ఇప్పుడు భారత బ్యాట్స్మెన్ విదేశాల్లోనూ రాణిస్తున్నారంటే దానికి సచిన్ ఇచ్చిన ఆత్మవిశ్వాసమే మూలమని అతడు పేర్కొన్నాడు. ‘సచిన్ ప్రభావం నమ్మశక్యం కానిది. అతడు మినహా గతంలో భారత బ్యాట్స్మెన్ అంతా విదేశాల్లో సాధారణంగా కనిపించేవారు. నేడు టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడుతున్నారు. వారికి సచిన్ స్ఫూర్తిగా నిలిచాడు’ అని లారా ప్రశంసించాడు. -
‘నాకైతే కోహ్లి కంటే సచినే మేటి’
ముంబై: భారత్ క్రికెట్లో ఇప్పుడు విరాట్ కోహ్లి శకం నడుస్తోంది. అటు కెప్టెన్ గానూ, ఇటు బ్యాట్స్ మన్ గానూ ఘన విజయాలు అందుకుంటూ అత్యుత్తమ దశలో ఉన్నాడు కోహ్లి. దేశంలో ఇప్పుడు ఎక్కువమంది అభిమానించే క్రికెటర్ కోహ్లినే. ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో సచిన్ కంటే కూడా కోహ్లినే అత్యుత్తమ క్రికెటర్ అని దిగ్గజ క్రికెటర్లు ప్రశంసించారు కూడా. కాగా, బ్రియాన్ లారా మాత్రం కోహ్లి కంటే సచిన్ టెండూల్కరే మేటి అంటూ కొనియాడాడు. నీరుల్లోని డీవై పాటిల్ యూనివర్శిటీలో జరిగిన డాక్టరేట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన లారాకు విద్యార్థులు అడిగిన ఒక ప్రశ్నకుసచినే తన ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అంటూ బదులిచ్చాడు .క్రికెట్ గేమ్పై సచిన్ ఒక చెరగని ముద్ర వేశాడన్నాడు. ‘సచిన్ ఆడిన కాలంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. భారత ఆటగాళ్లు విదేశీ పిచ్లపై ఆడలేరనే అపవాదు ఉండేదో దాన్ని సచిన్ చెరిపేశాడు. ప్రపంచ క్రికెట్లో ఉన్న ప్రతీ పిచ్పై సచిన్ మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాని కొనసాగింపే ప్రస్తుత భారత క్రికెటర్లు ప్రతీ చోట రాణించడానికి కారణం. సచిన్ అనే పుస్తకంలో ఒక పేజీ మాత్రమే మిగతా క్రికెటర్లు’ అని లారా కొనియాడాడు. -
బ్రియాన్ లారాకు అస్వస్థత
ముంబై : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన లారా ఉన్నట్లుండి ఛాతి నొప్పితో బాధపడ్డారు. దాంతో ఆయనను ముంబై పరెల్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘కోహ్లి తర్వాత అతనే అత్యుత్తమ ఆటగాడు’
లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా దిగి హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడు కేఎల్ రాహుల్పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత కేఎల్ రాహులే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. రాహుల్ కొత్త బంతితో ఆడటంలో తడబడతాడన్న వ్యాఖ్యలపై లారా విభేదించాడు. అతనికి కొత్త బంతితో ఎటువంటి ఇబ్బంది ఉండదని వెనకేసుకొచ్చాడు. అతనికున్న బ్యాటింగ్ టెక్నిక్కు కొత్త బంతి అసలు సమస్య కాదన్నాడు. ‘విరాట్ కోహ్లి తర్వాత రెండో అత్యుత్తమ భారత బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతడు ఓపెనర్. టీమిండియా ఇప్పటికే అతడిని నాలుగో స్థానంలో ఆడించింది. ఆ స్థానంలో అతడు ఓపెనింగ్ బ్యాట్స్మన్ తరహాలో అదరగొట్టాడు. రాహుల్ ఓపెనింగ్ అవకాశాన్ని కచ్చితంగా అందిపుచ్చుకుంటాడు. అతడికున్న టెక్నిక్కు కొత్త బంతిని ఎదుర్కోవడం అసలు సమస్యే కాదు’ అని లారా అన్నాడు. గాయంతో శిఖర్ ధావన్ జట్టుకు దూరమవ్వడంతో పాక్ మ్యాచ్లో రోహిత్కు జోడీగా రాహుల్ ఓపెనింగ్ చేశాడు. 78 బంతుల్లో 57 పరుగులు చేసి శుభారంభం అందించడంలో సహకరించాడు. -
రంగంలోకి మరో వీరేంద్రుడు..
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ అంటే తెలియని వారుండరు. అతడు క్రీజ్లో ఉంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టేవి.. వీరేంద్రుడి వీర బాదుడికి బలైన బౌలర్లెందరో ఉన్నారు. సెహ్వాగ్ ఆటకు సెలవు ప్రకటించాక అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. కాని మళ్లీ ఇన్నాళ్లకు సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్ను గుర్తు చేస్తూ..అతని వారసుడొచ్చాడు. ఆ సంచలనం పేరే పృథ్వీ షా.. సెహ్వాగే మళ్లీ ఆడుతున్నడా ? అన్నట్లు తలపించే అతని ఆటతీరు ప్రముఖ క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. పృథ్వీ షా బ్యాటింగ్ చేసే తీరు, అతని టెక్నిక్ సెహ్వాగ్ను గుర్తుచేస్తున్నాయని, ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా తాను ఆడే విధానం అద్భుతంగా ఉందని ప్రముఖ క్రికెట్ దిగ్గజం, విండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా కొనియాడారు. పృథ్వీ షా, ఆడిన తొలి టెస్ట్లోనే చాలా పరుగులు చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ భారత గడ్డ మీద చాలా బాగా ఆడాడు. అతని వయస్సు 19 సంవత్సరాలే అయినప్పటికీ.. ఐపీఎల్లో గత రెండు సీజన్ల నుంచి ఆడుతున్నందు వల్ల బాగా అనుభవం సంపాదించాడని ప్రశంసించారు. తన మీద ఉన్న అంచనాలకు తగ్గట్లు, జట్టు అవసరాల మేరకు పృథ్వీషా రాణిస్తాడని బ్రియన్ లారా ఆశాభావం వ్యక్తం చేశారు. పృథ్వీషా గత ఆక్టోబర్లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ ద్వారా ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్లో పృథ్వీ సెంచరీ చేయడం లారాను ఎంతగానో ఆకట్టుకుంది. అతని నాయకత్వంలోనే 2018లో అండర్-19 భారత జట్టు నాలుగోసారి వరల్డ్కప్ను గెలుచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
సచిన్ కంటే కోహ్లినే గొప్పోడు!
హైదరాబాద్: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే ప్రసుత టీమిండియా సారథి విరాట్ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే కేవలం వన్డే క్రికెట్లో మాత్రమే కోహ్లి అత్యుత్తమ ఆటగాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా పరుగుల యంత్రం తన మైమరిపించే ఆటతో అనేక కొత్త రికార్డులను కొల్లగొడుతున్నాడని వాన్ ప్రశంసలు జల్లు కురిపించాడు. దీంతో వన్డేల్లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు ఆగ్రస్థానంలో ఉన్న సచిన్, బ్రియన్ లారాలను కోహ్లి వెనక్కి నెట్టాడని వివరించాడు. ప్రస్తుతం మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. గత కొద్ది నెలలుగా కోహ్లి, సచిన్లలో ఎవరు గొప్ప అనే అంశం అటు అభిమానుల్లో ఇటు క్రికెట్ పండితుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి తన 41వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. అయితే కోహ్లి శతకం టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ఈ సిరీస్లో కోహ్లికిది రెండో సెంచరీ.. నాగ్పూర్ వన్డేలో కూడా శతకం నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం కోహ్లి ఫామ్ను చూస్తే వన్డేల్లో సచిన్(49) అత్యధిక సెంచరీల రికార్డును త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లి ఆగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి మరో రికార్డు ఇక చాలు.. మళ్లీ చూడదల్చుకోలేదు : కోహ్లి టీ20 చరిత్రలో ఇంత ఘోర ఓటమా! -
విండీస్ను కొట్టేందుకు..
దాదాపు ఏకపక్షంగానే సాగిన సిరీస్లో తుది అంకం. రెండు టెస్టులనూ అలవోకగా గెలిచేసి, ఐదు వన్డేల సిరీస్ను ఒడిసి పట్టేసిన టీమిండియాకు టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ను క్లీన్స్వీప్ చేసే అవకాశం. విజయాల ఊపులో ఉన్న రోహిత్ బృందానికిది నల్లేరుపై నడకే! అటు ఆటలో, ఇటు దృక్పథంలో తేలిపోతున్న కరీబియన్లు విజయం అందుకోవాలంటే శక్తికి మించి ఆడాల్సిందే! చెన్నై: పెద్దగా శ్రమించకుండానే వెస్టిండీస్తో టి20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్కు... దానిని సంపూర్ణ విజయంగా మార్చుకునే సందర్భం వచ్చింది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఆదివారం జరుగనున్న మూడో టి20 ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే సిరీస్ వశమైనందున టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు పర్యాటక జట్టు పరాభవం తప్పించుకునే ప్రయత్నం చేయనుంది. తుది జట్టులోకి చహల్, సుందర్... బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. వీరి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, స్థానిక కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. గత మ్యాచ్ల్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో దిగిన టీమిండియా... చెన్నై పిచ్ స్వభావంరీత్యా ఇద్దరు పేసర్లు, ఆల్రౌండర్ సహా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహానికి మొగ్గు చూపుతున్నట్లుంది. దీంతో సిద్ధార్థ్ కౌల్, ఎడంచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీమ్కు అవకాశం లేనట్లైంది. చివర్లో నిర్ణయం మారితే... నదీమ్ అరంగేట్రం చేయొచ్చు. కెప్టెన్ రోహిత్ గత మ్యాచ్లోలానే చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ ధావన్ ఫామ్లోకి రావడం మరింత బలం కానుంది. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యతలు చూసుకుంటారు. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాతో పాటు చహల్, సుందర్ స్పిన్ భారం పంచుకుంటారు. విండీస్... ఈ ఒక్కటైనా! ప్రధాన ఆటగాళ్లు దూరమై... ముందే డీలాపడిన వెస్టిండీస్ టి20 సిరీస్లో మరీ తేలిపోయింది. లక్నోలో జరిగిన రెండో మ్యాచ్లో ఆ జట్టు అత్యంత పేలవంగా ఆడింది. హెట్మైర్, బ్రేవో, పొలార్డ్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. బౌలింగ్లో ఒషేన్ థామస్ పేస్ మినహా చెప్పుకొనేదేమీ లేదు. చెన్నైలోనైనా గెలిస్తే జట్టుకు కొంత ఉపశమనం దక్కుతుంది. ఈ మ్యాచ్కు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ రామ్దిన్ను తప్పించి రావ్మన్ పావెల్ను తీసుకోనుంది. నికొలస్ పూరన్ కీపింగ్ చేస్తాడు. సరైన వ్యవస్థ లేకే... విండీస్ క్రికెట్ దుస్థితిపై బ్రియాన్ లారా ఆవేదన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ దుస్థితికి కారణం తమ దేశంలో యువతరాన్ని తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడమేనని దిగ్గజ క్రికెటర్, విండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణపట్నం పోర్టు గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ కోసం హైదరాబాద్కు విచ్చేసిన లారా తమ దేశ క్రికెట్కు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. విండీస్ క్రికెట్ బోర్డు శక్తిమంతంగా లేకపోవడం కూడా తమ స్థితికి కారణమన్నాడు. క్రికెట్ భవిష్యత్కు ఆధారమైన యువతరాన్ని చేరదీయడంలో తమ బోర్డు విఫలమైందని విమర్శించాడు. మౌలిక వసతులు, స్టేడియాలు బాగున్నప్పటికీ యువ క్రికెటర్లను తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడంతో క్రికెట్ అభివృద్ధి కుంటుపడిందని వివరించాడు. ‘భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల తరహాలో దేశవాళీ క్రికెట్ అభివృద్ధి కోసం మా బోర్డు కృషి చేయడంలేదు. ఫలితంగా గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిభ గల యువ క్రికెటర్లు వెలుగులోకి రాలేకపోతున్నారు. వారిని సానబెట్టే వ్యవస్థ ప్రస్తుతం మా దగ్గర లేదు’ అని పేర్కొన్నాడు. భారత పర్యటనలో టెస్టుల్లో విండీస్ విఫలమైన తీరుపై లారా విచారం వ్యక్తం చేశాడు. ‘టెస్టుల్లో ప్రదర్శనే ఒక జట్టు స్థాయిని నిర్ణయిస్తుంది. కానీ భారత్పై తొలి రెండు టెస్టులను విండీస్ మూడు రోజుల్లోనే ముగించింది. ఇది ఆశించదగినది కాదు. మూడు రోజులకు మించి విండీస్ టెస్టు ఆడలేకపోతోంది. ఈ అంశం నాకు చాలా నిరాశ కలిగించింది’ అని వివరించాడు. యువతరాన్ని తీర్చిదిద్దితేనే విండీస్ క్రికెట్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది తన బయోగ్రఫీని విడుదల చేస్తానని లారా ప్రకటించాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, పంత్, కృనాల్, సుందర్, చహల్, భువనేశ్వర్, ఖలీల్. వెస్టిండీస్: షై హోప్, పూరన్, హెట్మైర్, డారెన్ బ్రేవో, పొలార్డ్, బ్రాత్వైట్ (కెప్టెన్), రావ్మన్ పావెల్, కీమో పాల్, అలెన్, పియర్, థామస్. పిచ్, వాతావరణ చెపాక్ మైదానం స్పిన్కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్లో భారత్ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది.చెపాక్ మైదానం స్పిన్కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్లో భారత్ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది. రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం