charging stations
-
ఈవీ.. చార్జింగ్ స్టేషన్లు ఏవీ!
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల(Electric vehicles)(ఈవీ) విప్లవం మొదలైంది. భవిష్యత్తులో రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్, హైడ్రోజన్తో పరుగులు తీసే వాహనాలే కనిపిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. అమెరికా వంటి దేశాల్లో డ్రైవర్ రహిత ఈవీలు క్యాబ్లుగా కూడా అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఇంకా ఆ స్థాయిలో ఈవీల వినియోగం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం సరిపడా చార్జింగ్ స్టేషన్లు (EV charging)లేకపోవడమే. ఇదే విషయాన్ని ‘గేమ్ చేంజర్ లా అడ్వైజర్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్ట్’ తాజాగా విడుదల చేసిన ‘చార్జింగ్ ఎహెడ్–2’ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి పెరిగే ఈవీలకు సరిపడా 39 లక్షల చార్జింగ్ స్టేషన్లు అవసరమని ప్రకటించింది.కాలుష్యాన్ని తగ్గించాలంటే తప్పదు⇒ దేశంలో 2024 మార్చి 31 నాటికి 41 లక్షల విద్యుత్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మరో ఐదు లక్షల ఈవీలు పెరుగుతాయని అంచనా.⇒ ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి సంప్రదాయ వాహనాల స్థానంలో 30శాతం ఈవీ కార్లు, 80శాతం ఈవీ బైక్లు, 70శాతం ఈవీ కమర్షియల్ వాహనాలు ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.⇒ రానున్న ఐదేళ్లలో 8కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్లమీద నడవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 2030 నాటికి ఒక గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. ⇒ దేశంలో ప్రస్తుతం 12,146 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కేంద్రం లక్ష్యం నెరవేరాలంటే ఈవీల వినియోగం పెరగాలి. అందుకోసం 2030 నాటికి దేశ వ్యాప్తంగా పెరిగే ఈవీలకు సరిపడా 39 లక్షల చార్జింగ్ స్టేషన్లు అవసరమని ‘చార్జింగ్ ఎహెడ్–2’ నివేదిక ప్రకటించింది.రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే ప్రోత్సాహంరాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక పాలసీ రూపొందించింది. నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలో మీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల వెంబడి 25 కిలోమీ టర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పా లని నిర్ణయించింది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది.పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల(పీసీఎస్)ను లైసెన్స్ తీసుకోకుండానే ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈవీ చార్జర్లపై 25 శాతం డిస్కౌంట్ అందించింది. ఈ–మెబిలిటీలో సరికొత్త పరిశోధనల కోసం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఈవీ పాలసీని రద్దు చేసింది. ఇంధన పాలసీలోనే దానిని కలిపేసింది. ఐదు వేల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయ డం తమ లక్ష్యమని కూటమి ప్రభుత్వం ప్రకటించినా... గత తొమ్మిది నెలల్లో ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. కాగా, విద్యుత్ సంస్థలు విడుదల చేసిన స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్లో 2030 నాటికి రాష్ట్రంలో 7,82,600 ఈవీలు ఉంటాయని అంచనా వేశారు. -
ఇవన్నీ ఉంటేనే ఇల్లు కొంటాం..
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్పార్క్, గోల్ఫ్కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోపెట్ పార్క్, స్పా..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి.సోలార్, హోమ్ గార్డెనింగ్ సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.ఈవీ చార్జింగ్ స్టేషన్లుపెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.వసతులు ఇలా..నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు. జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి.రిచ్మ్యాన్ గేమ్గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్లు కాస్త ఔట్డోర్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
రెండేళ్లలో ఈవీల వినియోగం వేగవంతం..
చెన్నై: దేశీయంగా ఈ రెండేళ్లలో (2025, 2026) విద్యుత్ ప్యాసింజర్ వాహనాల వినియోగం మరింత వేగవంతమవుతుందని హ్యుందాయ్ మోటర్ ఇండియా (హెచ్ఎంఐఎల్) సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత్లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభ స్థాయిలో 2.4 శాతం స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చనే అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద బ్రాండ్లు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగ వృద్ధికి తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడ్పడగలదన్నారు. హ్యుందాయ్ సంస్థ భవిష్యత్తులో నాలుగు ఈవీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీని ధర రూ. 15–25 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. అటు మారుతీ సుజుకీ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ’ఈ–విటారా’ను ఆవిష్కరించనుంది. మరోవైపు, చార్జింగ్ సదుపాయాలకు సంబంధించి 10,000 చార్జింగ్ పాయింట్ల వివరాలతో ప్రత్యేక యాప్ను రూపొందించామని, దీన్ని ఇతర వాహనదారులు కూడా వినియోగించుకోవచ్చని గార్గ్ చెప్పారు. వీటిలో 7,500 పాయింట్లలో యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే సదుపాయం ఉందన్నారు. ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్–విజయవాడ, ముంబై–పుణె తదితర హైవేల్లోని 30 చార్జింగ్ స్టేషన్లలో 80 ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేసినట్లు గార్గ్ వివరించారు. -
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు. -
చార్జింగ్ వసతులకు రూ.16,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్ చార్జింగ్ డిమాండ్ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్ టారిఫ్ ఉండడం, అలాగే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్ ఈవె న్ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది. అనుమతి అవసరం లేని.. స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్ నుండి సింగిల్–పార్ట్ టారిఫ్కు మార్చాలి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్జీ త్రీ–వీలర్ నుండి ఎలక్ట్రిక్కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది. టాప్–40 నగరాల్లో..చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్మ్యాప్ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్ల కోసం ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. -
హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు
జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు. – సాక్షి, అమరావతి దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన జాతీయ రహదారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వచ్చే ఏడాది జూన్ నాటికి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్ స్టేషన్లు 7,432మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833 మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230 -
‘ఈ–ప్రోత్సాహం’ కొందరికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలనే అమలుచేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ విధానాలను తమవని చెప్పుకునేందుకు పాకులాడుతోంది. కానీ, చార్జింగ్ కేంద్రాలను ప్రత్యేక కేటగిరి టారిఫ్ కిందకు తీసుకొచ్చి తక్కువ ధరకే విద్యుత్ అందించాలన్న వైఎస్ జగన్ నిర్ణయానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యూనిట్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది.ఇప్పుడు రాయితీలు కొందరికే.. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకయ్యే ఖర్చులో 25 శాతం అంటే గరిష్టంగా రూ.10 లక్షల వరకూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. వాహనదారులు కొనుగోలు చేసే చార్జర్లపైనా 25 శాతం డిస్కౌంట్ అందించింది. అలాగే.. విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ కేంద్రాలు, హైడ్రోజన్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహకాలను గత ప్రభుత్వం ప్రకటించింది. మూలధన వ్యయంలో 25 శాతం వరకూ రాయితీ కల్పించింది. అది గరిష్టంగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంది. విద్యుత్ సుంకాన్ని, స్టేట్ జీఎస్టీని వంద శాతం తిరిగిచ్చేసింది. అన్నిటికీ మించి ఈ–మొబిలిటీలో సరికొత్త పరిశోధనల కోసం రూ.500 కోట్ల నిధులను కేటాయించింది. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ముందువచ్చిన కొందరికే రాయితీలు ఇచ్చేలా విధానాన్ని రూపొందిస్తోంది. అంతేకాక.. చార్జింగ్ కేంద్రాల్లో యూనిట్కు రూ.15 చొప్పున వసూలుచేయాలని భావిస్తోంది. తద్వారా విద్యుత్ వాహనదారులపై పెనుభారం మోపనుంది.పాత పాలసీకే మెరుగులు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకొచి్చంది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. అందుకు అవసరమైన నాలుగు వేల స్థలాలను అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల (పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ అక్కర్లేదని చెప్పింది.అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించినట్లుగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఈవీ స్టేషన్లో ఉండాలని సూచించింది. టెండర్లు ఆహ్వనించగా.. యూనిట్కు రూ.12 చొప్పున వసూలుచేసి, దాన్నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కేవలం 1,028 చార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మన రాష్ట్రంలో 266 స్టేషన్లను జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీని రూపొందిస్తున్నామని చెబుతూ గత ప్రభుత్వ పాలసీకే మెరుగులు దిద్దుతోంది. -
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: జియో–బీపీ 500వ పల్స్ ఈవీ–చార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ ముకేశ్ అంబానీ, బీపీ సీఈవో ముర్రే ఆషిన్క్లాస్ గురువారం ప్రారంభించారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ ప్లాజా, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కి వచ్చే వారికి ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రిలయన్స్–బీపీ కలిసి ఇంధనాల విక్రయం, చార్జింగ్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. కంపెనీ అత్యంత వేగంగా ఈవీ చార్జింగ్ పాయింట్లను విస్తరించింది. ఏడాది వ్యవధిలోనే 1,300 నుంచి 5,000కు పెంచుకుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతమయ్యేందుకు జియో–బీపీ కృషి చేస్తున్నాయని అనంత్ అంబానీ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ముర్రే వివరించారు. -
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఊరట
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త స్కీమ్ పేరు ''పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్'' (PM E-DRIVE). ఇది మార్చి వరకు తొమ్మిదేళ్లపాటు అమలులో ఉన్న ప్రస్తుత 'ఫేమ్' ప్రోగ్రామ్ను భర్తీ చేస్తుంది.ఈ కొత్త పథకం ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఎటువంటి సబ్సిడీలు లభించదు. కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సులకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రం రెండేళ్లకు రూ. 10900 కోట్లు కేటాయించారు. ఇందులో హైబ్రిడ్ అంబులెన్స్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా కొంత ప్రోత్సాహాలు లభిస్తాయి.పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 88500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్పై నిర్ణయం తీసుకున్నట్లు వైష్ణవ్ విలేకరులతో చెప్పారు.రాష్ట్ర రవాణా సంస్థలు & ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు అందించారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్ల వంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో CESL ద్వారా డిమాండ్ అగ్రిగేషన్ చేయనున్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత ఇంటర్సిటీ, ఇంటర్స్టేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా మద్దతు లభిస్తుంది.ఎలక్ట్రిక్ అంబులెన్స్ల ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. రోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సహించేందుకు కూడా రూ.500 కోట్లు అందించారు.ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికి కూడా చాలామంది కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లు, ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్లు, టూ వీలర్ & త్రీ వీలర్స్ కోసం 48400 ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసం రూ. 2000 కోట్లు వెచ్చించారు. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్తో పాటు గూగుల్ సెర్చ్లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్ను తొలిసారిగా భారత్లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేయొచ్చు!.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగా కొంత మంది ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ ఇండియా.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తో చేతులు కలిపింది.ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంజీ మోటార్.. హెచ్పీసీఎల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు హైవేలపై, ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 50 kW, 60 kW DC ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నారు. ఫలితంగా ఇకపై ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారు నిశ్చింతగా కొనేయొచ్చు.‘‘భారతదేశంలో హెచ్పీసీఎల్ భారీగా విస్తరిస్తోంది. ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీల పునర్వినియోగం వంటి అంశాలపై కొత్తగా సమర్థమైన చర్యలు తీసుకోవచ్చు.’’ అని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.దేశమంతటా 15,000 ఛార్జింగ్ స్టేషన్స్ఇప్పటికే ఎంజీ మోటార్ కంపెనీ.. టాటా పవర్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఫోర్టమ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 15,000 పబ్లిక్, ప్రైవేట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేసింది. పబ్లిక్ EV ఛార్జర్ల ఇన్స్టాలేషన్ కోసం ఈ కార్ల తయారీ సంస్థ భారత్ పెట్రోలియం, జియో-బీపీతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది.హెచ్పీసీఎల్ 3600 ఛార్జింగ్ స్టేషన్స్హెచ్పీసీఎల్ కంపెనీ కూడా అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో ఈవీ ఛార్జీల నెట్వర్క్ను విస్తరించాయి. హెచ్పీసీఎల్ దేశవ్యాప్తంగా 3600 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2024 చివరి నాటికి 5000కు పెంచాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్న్యూస్.. ఛార్జింగ్ సమస్యకు చెక్!
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్లో హ్యుందాయ్ మోటార్స్ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఐఎల్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ జే వాంగ్ ర్యూ తెలిపారు.హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్ ర్యూ వెల్లడించారు. ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్ యాప్లోని ఈవీ ఛార్జ్ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్ స్పష్టం చేసింది. -
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ.. ధర ఎంతంటే..
విద్యుత్ వాహనాల వినియోగదారులు ఛార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. హైదరాబాద్తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, గురుగావ్, బెంగళూరులో ఈ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన దిల్లీ-ఛండీగఢ్, దిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, ముంబై-నాసిక్ రోడ్లపై ఐదు అల్ట్రా ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు రోజంతా తెరిచివుండనున్నాయని సంస్థ తెలిపింది. ఒక్కో స్టేషన్లలో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయిని చెప్పింది. హ్యుందాయ్ కస్టమర్లతోపాటు ఇతర కస్టమర్లు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగ్డ్రైవ్ చేసేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఇదీ చదవండి: డ్రాగన్మార్ట్కు పోటీగా ‘భారత్మార్ట్’.. ఎక్కడో తెలుసా.. కేవలం 21 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుండడంతో సమయం ఆదాకానుందని పేర్కొంది. 30 కిలోవాట్ల ఛార్జర్ ఒక్కో యూనిట్పై రూ.18, 60 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్పై రూ.21, 150 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్కు రూ.24 ధర నిర్ణయించారు. ఛార్జింగ్ స్లాట్ను ముందస్తు బుకింగ్తోపాటు చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ ఏడాదిలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వివరించింది. -
విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ అందించడానికి అన్ని ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత రాకుండా సౌర విద్యుత్ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని జలాశయాలపై సోలార్ ప్రాజెక్ట్ల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూఫ్టాప్ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదనకు సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని తక్షణమే పరిశీలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆ రాయితీలను ప్రజలకు వివరించండి రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గృహ వినియోగదారులు ఒక కిలో వాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే..రూ. 18 వేలు రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు రూ. 9 వేలు లెక్కన ప్రభుత్వం రాయితీ ఇస్తోందనీ, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. -
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
15 నిమిషాల ఛార్జ్తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్లోని గీలీ హోల్డింగ్ గ్రూప్కు చెందిన బ్యాటరీ ప్లాంట్లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
‘ఈవీ’ ఇళ్లు..!
సాక్షి, హైదరాబాద్: ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ (రెట్రోఫిట్) ప్రాజెక్ట్ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సరీ్వస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిరీ్ణత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ శంకర్ తెలిపారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఆఫీస్ స్పేస్లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సరీ్వస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్లలో ఖాళీ ప్లేస్లు లేకపోవటమే అసలైన సవాలు. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సరీ్వస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
టాటా పవర్, ఐవోసీ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్ అవుట్లెట్స్లో టాటా పవర్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ చార్జింగ్) వీరేంద్ర గోయల్ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్ ఈజెడ్ చార్జ్, ఇండియన్ఆయిల్ ఈ–చార్జ్ మొబైల్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
ఇంజన్ల మోత ఉండదిక!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా..ఈ ఏడాది అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది అమ్ముడవుతోన్న మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లూ భారీగా ఏర్పాటవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6 వేల చార్జింగ్ స్టేషన్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశంలో 9,113 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు 15,493 ఈవీ చార్జర్లలో పనిచేస్తున్నాయి. వాహనాలకనుగుణంగా ఈవీ చార్జర్ల విక్రయాలూ పెరుగుతున్నాయి. అది ఎంతగా అంటే 2030 నాటికి దేశంలో ఈవీ చార్జర్ల డిమాండ్ ప్రస్తుతం ఉన్నదానికంటే 65% పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన ఏడేళ్లలో 30 లక్షల చార్జర్లు అవసరమని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్), ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) సంయుక్త నివేదిక తెలిపింది. అప్పగించే పని మొదలైంది ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ఎన్ఆర్ఈడీసీఏపీ స్థలాలను గుర్తించాయి. నమోదు చేసుకున్న నిర్వాహకులకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతలను అప్పగించే పని మొదలైంది. – ఎస్ రమణారెడ్డి, వీసీ, ఎండీ, ఎన్ఆర్ఈడీసీఏపీ ప్రత్యేక పాలసీ..స్థిరమైన లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ (వాయిదా)ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేస్తోంది. రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ/మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా చార్జింగ్ మౌలిక సదుపాయాలను న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో 266 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య 65,000 దాటింది. 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశల వారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జాతీయ రహదారుల వెంబడి 25 కి.మీ ఒకటి చొప్పున, నగర పరిధిలో ప్రతి 3 కీలోమీటర్ల గ్రిడ్ లోపల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది. -
615 ‘ఎలక్ట్రిక్ ’ చార్జింగ్ కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై 615 ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన సంస్థ(రెడ్కో) దరఖాస్తులను ఆహ్వానించింది. రెడ్కో చూపించిన స్థలాల్లోనే ఫాస్ట్, స్లో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్లోని తమ కేంద్ర కార్యాలయం/స్థానిక జిల్లా కార్యాలయాలను సందర్శించాలని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ వెబ్సైట్ https:// tsredco.telangana.gov.in/ లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పీపీపీ విధానంలో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే యాదాద్రిలో ఏర్పాటు చేసిన తొలి చార్జింగ్ కేంద్రం విజయవంతంగా నడుస్తోందని సతీష్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025 కల్లా 3000 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్కో స్వయంగా 150 ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని వివరించారు. -
200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్.. ఎక్కడ?
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలకు చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ఎలక్ట్రిక్ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ప్రకృతి ఈ–మొబిలిటీ (ఎవెరా)తో చేతులు కలిపినట్లు అదానీ టోటల్ఎనర్జీస్ ఈ–మొబిలిటీ (ఏటీఈఎల్) తెలిపింది. దీనితో ఢిల్లీలో 200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్ను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరించనున్నట్లు ఏటీఈఎల్ వివరించింది. అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్ అనేది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్కు చెందిన విభాగం. ఇది భారతదేశంలో ఛార్జ్ పాయింట్లను నిర్వహిస్తోంది. -
షాకింగ్ న్యూస్: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ చేస్తే..
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ ముందుకు తీసుకెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్నుతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయి. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను సూచిస్తుంది. ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా లేదా సేవల సరఫరాగా పరిగణిస్తారా అనే సమస్య ప్రాథమికంగా తలెత్తింది. ఇందులో మొదటిది అయితే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ని విద్యుత్ సరఫరా కేటగిరి కింద పరిగణించాలా వద్దా అన్నది అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ముందున్న ప్రధాన సమస్య. ఇదీ చదవండి ➤ FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్ అథారిటీ తెలిపింది. విద్యుత్ అనేది వస్తువుగా వర్గీకరించిన చరాస్తి. దాన్ని అలాగే కాకుండా బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని అడ్వాన్స్ రూలింగ్ సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణను కూడా ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ అనేది విద్యుత్ విక్రయం కిందకు రాదని, దాన్ని సర్వీస్ కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సర్వీస్ సప్లయిగా పరిగణించాలని, కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది. -
‘ఈవీ’ ఏటీఎం.. ఏపీలో 12 సౌర విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాల (ఈవీల) కోసం రాష్ట్రంలో అత్యాధునిక సౌర విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల యజమానులు ఈ సౌర చార్జింగ్ కేంద్రాల్లో కార్డు ద్వారా వారే డబ్బులు చెల్లించి, వారే వాహనానికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చార్జింగ్ కేంద్రాలకు అనుమతినిచ్చింది. తొలుత అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 కేంద్రాలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఈ నగరాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లతో చార్జింగ్ కియోస్్కలను రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఏర్పాటు చేస్తుంది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బు చెల్లించి వాహనదారుడే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్క్యాప్) చేస్తుంది. రానున్న కాలం ‘ఈవీ’లదే దేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు 2030 నాటికి 30% విద్యుత్ కార్లు, 80 శాతం విద్యుత్ టూ వీలర్లు, 70 శాతం విద్యుత్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు ఇంధనం దిగుమతులు తగ్గించటం ద్వారా 330 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుంది. రానున్న ఎనిమిదేళ్లల్లో 66 శాతం వాహనదారులు విద్యుత్ వాహనాలనే వాడతారని ఈవీ మార్కెట్పై తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వినూత్న చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఏడాదిలో 250 కేంద్రాలు దేశంలో 2070 నాటికి ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ చార్జీలు భారంగా ఉన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడానికి, స్థిరమైన రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం అంతటా చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 110 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు నెడ్క్యాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను గుర్తించింది. రాష్ట్రంలో ఏడాదిలో 250 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్థతిలో లక్ష ఈ–వాహనాల పంపిణీతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలనిస్తోంది. ఖర్చు తక్కువ విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఖర్చులు తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈవీలు సురక్షితమైనవి కూడా. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. వాటితో పాటు భవిష్యత్లో పెరగనున్న ఈవీలన్నిటి కోసం చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎనర్జీ రంగంలో ఉన్న షెల్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హ్యుందాయ్కి చెందిన 36 డీలర్షిప్ కేంద్రాల వద్ద 60 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్లను షెల్ ఏర్పాటు చేస్తుంది. దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం అని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్పై కీలక ప్రకటన ‘కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రాథమికమైనవి’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. హ్యుందాయ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 72 కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు
సాక్షి, విజయవాడ: ఇంధన భద్రతను పెంచడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ఆశాజనక మార్గాలలో ఒకటైన ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) రాష్ట్రంలో 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిందని ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ భవానీపురంలోని రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ ద్వారా పనిచేసే సైన్స్ ఎగ్జిబిడ్స్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారని ఏపీసమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కోస్ట్) సహకారంతో ఎన్ఆర్ఈడీసీఏపీ ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాన్ని(ఆర్ఈఆర్సీ) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఈ-మొబిలిటీకి ఒక నమూనాగా, పునరుత్పాదక ఇంధనానికి నాలెడ్జ్ హబ్ గా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీ రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయడం, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ఈ -మొబిలిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను మంత్రి అభినందించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందన్నారు. భారతదేశం బయో ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా తదుపరి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని గుర్తుచేశారు. ఈ -మొబిలిటీని స్వీకరించడానికి దోహదపడే ఛార్జింగ్ స్టేషన్ల యొక్క బలమైన ఇంధన నెట్ వర్క్ ను నిర్మించే లక్ష్యంతో 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా నగర పరిధిలో 3 కి.మీ x 3 కి.మీ గ్రిడ్ లోపల మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ మరియు ఎనర్జీ కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ల గురించి సందర్శించే విద్యార్థులకు సౌలభ్యంగా సుమారు 30 పునరుత్పాదక ఇంధన గాడ్జెట్ లను ప్రదర్శించడానికి ఆర్ఈఆర్ సీ ఏర్పాటుకు చొరవ చూపినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఈడీసీఏపీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. నెట్ జీరో ఎమిషన్స్ టూరిస్ట్ ప్లేస్ గా తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుపతిలో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పటివరకు తిరుపతి పట్టణంలో సుమారుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయన్నారు. సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రయోజనకరంగా ఉండటమేగాకుండా స్థానిక పర్యావరణాన్ని రక్షించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని సూచించారు. ఆర్ ఈఆర్ సీ సెంటర్ గురించి మాట్లాడుతూ అన్ని వయసుల విద్యార్థులకు అభ్యసన అవకాశాలను పెంపొందించేందుకు ఆర్ఈఆర్సీ దోహదపడుతుందన్నారు. అంతకుముందు విద్యుత్ వాహనాలను వాడుదాం-స్వావలంబన సాధిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడుదాం లాంటి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైన్స్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సర్ సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, ఆర్కిమెడిస్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, బెంజ్ మెన్ ఫ్రాంక్లిన్,ఐజాక్ న్యూటన్, విక్రమ్ సారాబాయి, హోమీ జహంగీర్ బాబా తదితర శాస్త్రవేత్తలు వారు చేసిన కృషిని వివరిస్తూ ఉన్న ఎగ్జిబిషన్ ను, రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన మినియేటర్ న్యూక్లియర్ గ్యాలరీని మంత్రి తిలకించారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా, డిజిటల్ టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, సభ్య కార్యదర్శి డాక్టర్ వై. అపర్ణ, జనరల్ మేనేజర్లు కె.శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్ రావు, ఎన్ఆర్ ఈడీసీఏపీ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
మరో 22 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ)కు ఆదరణ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇప్పటికే దేశంలో 6,586 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి అదనంగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో కలిసి ఇంధన సంస్థలు మరో 22 వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది 7,432 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల వెంట 400 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎన్హెచ్ఏఐ వర్గాలు తెలిపాయి. అన్ని మోడల్ వాహనాలకు ఉపకరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సరికొత్త ఈవీ చార్జింగ్ స్టేషన్ నమూనాను రూపొందించగా.. కేంద్రం ఆమోదించింది. వీటిని ఏర్పాటు చేసే ఇంధన కంపెనీలకు 70 శాతం రాయితీలను అందించనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చార్జింగ్ స్టేషన్ల కంటే.. కొత్త మోడల్ స్టేషన్ల ఏర్పాటుకు 40 శాతం తక్కువ వ్యయం అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్, జపాన్, కొరియన్, యూరోపియన్ తదితర ప్రాంతాల కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్ వాహనాలకు తక్కువ సమయంలోనే పూర్తి చార్జింగ్ చేసుకునేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు సమయం కూడా ఆదా అవుతుంది. -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
Hyderabad: దేశ రాజధానిలో భళా.. ఇక్కడ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతుండటంతో వాహనదారులు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన విద్యుత్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. సాధారణ వాహనంతో పోలిస్తే విద్యుత్ వాహనం ఖర్చు కొంత ఎక్కువే అయినప్పటికీ.. రోజువారి ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉండటంతో మెజార్టీ వాహనదారులు ఇటు వైపు ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే నగరంలో 49 వేలకుపైగా వాహనాలు వచ్చి చేరాయి. మొదట్లో కేవలం స్కూటర్లు మాత్రమే రోడ్లపై కనిపించగా.. ప్రస్తుతం అన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు కూడా రోడ్లపై దూసుకుపోతున్నాయి. 300 కేంద్రాలు అన్నారు.. 24తో సరిపెట్టారు.. గ్రేటర్ పరిధిలో మొత్తం 75 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో 70 శాతం ద్విచక్ర వాహనాలు, 19 శాతం కార్లు, 11 శాతం ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెట్రోల్, డీజిల్పై పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నారు. మనకు ఆయిల్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో యుద్ధం, ఇతర విపత్తులతో పెద్దఎత్తున సంక్షోభం తలెత్తుతోంది. నగరంలోని వాహనదారులు ఇలాంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడేందుకు టీఎస్ రెడ్కో, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నగరంలో 300 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 24 మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో కొన్ని పని చేయడం లేదు. కిలోవాట్ ఫర్ అవర్కు రూ.18 వసూలు చేయాలని నిర్ణయించారు. అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆశించినా.. ఇంట్లో ఛార్జింగ్ పాయింట్కు అవకాశం లేకపోవడంతో వారు ఇందుకు వెనుకాడుతున్నారు. అదే రోడ్డు సైడ్ పెట్రోల్ బంకులు, మెట్రో స్టేషన్ల వద్ద మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి వాటిని ఆన్లైన్తో అనుసంధానిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. సరిపడా చార్జింగ్, బ్యాటరీ కేంద్రాలు లేక ఇక్కట్లు ఢిల్లీలో విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 597 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈజెడ్ యాప్ను, బెంగళూరులో ఈవీమిత్ర యాప్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ మార్పిడి సెంటర్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ నగరంలో ఇప్పటి వరకు ఈ దిశగా అడుగులు వేయలేదు. అంతేకాదు నగరంలో వాహనాల నిష్పత్తి మేరకు నగరంలో చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ మారి్పడి స్టేషన్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. రెండేళ్ల క్రితం టీఎస్ రెడ్కో ఎనర్జీ స్టోరేజీ పేరుతో ఒక విధానం రూపొందించింది. డీజిల్, పెట్రోల్ ఎంత సులభంగా లభిస్తుందో అంతే సులభంగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు కొనుగోలు చేస్తున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొరపాటున ఛార్జింగ్ అయిపోయి బండి రోడ్లు మధ్యలో ఆగిపోతే.. ఇతర వాహనాల సహాయంతో వాటిని ఇంటి వరకు తోసుకొని వెళ్లాల్సి వస్తోంది. -
దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఏటేటా ఈ వాహణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోనూ నాలుగేళ్లుగా వీటి సంఖ్య పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే విద్యుత్ వాహనాల ధరలు, ఇంధన వ్యయం తక్కువగా ఉండటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా 16.85 లక్షలకు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగింది. గత ఏడాది దేశశ్యాప్తంగా 10 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా–1, ఫేమ్ ఇండియా–2 అమలు చేస్తోంది. ఫేమ్–ఇండియా–2 కింద ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటీవల పార్లమెంట్లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహక రాయితీని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫేమ్ తొలి దశ ఏప్రిల్ 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు కొనసాగింది. ఏప్రిల్ 2019 నుంచి ఫేమ్–2 ప్రారంభమైంది. ఇది 2024 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ను సృష్టించడంతో పాటు చార్జింగ్ సౌకర్యాలు కల్పనకు, అన్ని రకాల వాహనాలను ప్రోత్సహించడానికి రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, అలాగే చార్జర్లు, చార్జింగ్పైన జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో 2022లో భారీగా పెరిగిన ఎలక్ట్రికల్ వాహనాలు రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 1,474 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరగ్గా.. 2022 సంవత్సరంలో ఏకంగా 25,721 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఈ నెలలో 23వ తేదీ వరకు 1,675 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎలక్ట్రికల్ వాహనా సంఖ్య 38,026కు చేరింది. రాష్ట్రంలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఆటోల సంఖ్య పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చార్జింగ్ స్టేషన్లు వస్తే మరింతగా పెరగనున్న వాహనాల సంఖ్య పెట్రోల్, డీజిల్ బంక్లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఈ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవలి కాలంలో వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దీంతో భవిష్యత్లో మరింతగా వీటి వినియోగం పెరుగుతుందని ఆయన తెలిపారు. -
సివిల్ సప్లైస్ గోదాములపై సోలార్ పలకలు
సాక్షి, హైదరాబాద్: నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందడం కోసం పౌర సరఫరాల శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ గోదా ములపై సోలార్ పలకలను అమర్చి.. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, ఇదే సమయంలో పలుచోట్ల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుద్ధర ణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో కలసి సివిల్ సప్లైస్ పరిధిలోని గోదాములతోపాటు పెట్రోల్, ఎల్పీజీ ఔట్లెట్లలోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం పౌర సరఫరాల భవనంలో రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, తెలంగాణ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్, ఇతర అధికారులతో రవీందర్సింగ్ సమావేశమై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన కరెంటు చార్జీలను తగ్గించుకు నేందుకు గోదాముల్లో సోలార్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్టు రవీందర్సింగ్ వెల్లడించారు. తొలిదశలో సంస్థకు చెందిన 19 గోదాములు, రెండు పెట్రోల్ బంకులు, ఐదు ఎల్పీజీ గోదాములు కలిపి మొత్తం 26 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపా దనలపై చర్చించామన్నారు. అందులో 24 చోట్ల అనుకూలంగా ఉన్న ట్టుగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఇక తమ పరిధిలోని రైస్మిల్లుల్లోనూ సౌర విద్యుత్ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. సమావేశం అనంతరం రవీందర్సింగ్ సికింద్రాబాద్లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయంపై సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. -
TS: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ కేంద్రాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్కో (రెన్యూయేబుల్ ఎనర్జీ డెవల‹³మెంట్ కార్పొరేషన్) చైర్మన్ వై.సతీశ్రెడ్డి తెలిపారు. దుర్గం చెరువు వద్ద బుధవారం ఏర్పాటు చేసిన రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషీన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్లో త్వరలోనే 150 రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలతో వాహనాలను చార్జింగ్ చేసుకునే వీలుంటుందని తెలిపారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసుమును నిర్ణయించిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటిదన్నారు. చార్జింగ్ కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. -
బీపీసీఎల్.. ఈవీ రూట్
బెంగళూరు: ఇంధన రంగంలో ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఈవీ బాట పట్టింది. దేశవ్యాప్తంగా 7,000 రిటైల్ ఔట్లెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు–చెన్నై, బెంగళూరు–మైసూరు–కూర్గ్ హైవే మార్గాల్లో ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను తాజాగా ప్రారంభించింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ అన్ని ముఖ్య జాతీయ రహదారులపై నిర్ధేశిత దూరంలో రిటైల్ కేంద్రాల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలన్నది బీపీసీఎల్ ఆలోచన. -
హెచ్పీసీఎల్తో హీరో మోటోకార్ప్ జట్టు.. గట్టి ప్లానే వేసింది!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) చేతులు కలిపాయి. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్పీసీఎల్కి ఉన్న బంకుల్లో ఇరు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి. తొలి దశలో ఎంపిక చేసిన నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు, ఆ తర్వాత ఇతరత్రా మార్కెట్లకు విస్తరించనున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. చార్జింగ్ మొదలుకుని చెల్లింపుల వరకూ మొత్తం ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు 20,000 పైచిలుకు రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ద్విచక్ర వాహనాల మార్కెట్లో దిగ్గజంగా ఉన్న హీరో మోటోకార్ప్తో జట్టు కట్టడం ద్వారా పెద్ద ఎత్తున చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యపడుతుందని హెచ్పీసీఎల్ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. చదవండి: పవర్ ఆఫ్ సారీ: రూ. 6 లక్షలకు..50 కోట్లు వచ్చాయ్! -
ఎలక్ట్రిక్ వాహనాలు పది రెట్లు!
సాక్షి, హైదరాబాద్: తక్కువ ఖర్చుతో ప్రయాణం, కాలుష్యం నుంచి దూరం, నడపడం సులభం.. పైగా ప్రభుత్వ రాయితీలు అన్నీ కలిసి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలోనే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పది రెట్లు పెరిగింది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చి నాలుగైదు ఏళ్లు దాటిపోయినా.. గత ఏడాదిన్నరగా డిమాండ్ పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం దీనికి తోడ్పడిందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాస్త ఆలస్యంగా మొదలై.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే దృష్టి పెట్టింది. రాయితీలు, ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి పలు రాష్ట్రాలు మొదట్లోనే స్పందించి చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలతో పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు అయ్యే తొలి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్డు పన్ను, 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఏర్పడింది. రెండు లక్షల వాహనాలను మించితే రాయితీ రాదన్న ఉద్దేశంతో కొనుగోళ్లు పెరిగాయి. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, బస్సులు, కార్ల విషయంగా కూడా రాయితీలు ప్రకటించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను పెంచుతామని.. స్థానికంగా వాహనాల తయారీని ప్రోత్సహిస్తామని పేర్కొంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఏడాదిన్నరలో.. 2020 సంవత్సరం చివరలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రకటించింది. అంతకుముందు రాష్ట్రంలో కేవలం 3,838 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే రోడ్డెక్కాయి. పాలసీ వచ్చాక వీటి సంఖ్య 32,741కి పెరిగింది. పాలసీకి పూర్వం రాష్ట్రంలో 2,788 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడుకాగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 28,389కి పెరిగింది. అంటే పది రెట్లు పెరగడం గమనార్హం. ఇక అప్పట్లో రాష్ట్రంలో కేవలం 567 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ఉండగా.. ప్రస్తుతం 2,729కు చేరింది. బ్యాటరీ పేలుళ్లతో ఆందోళన ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లోని బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు కొనుగోలుదారుల్లో కొంత ఆందోళన రేపుతున్నాయి. అయితే చైనా తయారీ నాసిరకం బ్యాటరీలు మాత్రమే ఆ ప్రమాదాలకు కారణమని.. చార్జింగ్, వాహన వినియోగం విషయంలో కంపెనీల మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు జరగవని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దేశీయంగా బ్యాటరీల తయారీ పెరుగుతుండటంతో.. త్వరలో నాణ్యమైన వాహనాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మొదలైందని.. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, త్వరలో అవి పరిష్కారమవుతాయని ఏఆర్సీఐ ఇన్చార్జి డైరెక్టర్ డా.తాతా నరసింగరావు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు. -
2030 నాటికి 10,000 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: షెల్ ప్రణాళికలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లు నెలకొల్పుతున్న ఐవోసీ, రిలయన్స్–బీపీ తదితర సంస్థల జాబితాలో తాజాగా షెల్ కూడా చేరుతోంది. 2030 నాటికి దేశీయంగా 10,000 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం తమ తొలి ఈవీ చార్జర్లను ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. తొలి విడతలో బెంగళూరులోని యశ్వంత్పూర్, బ్రూక్ఫీల్డ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది. -
Electric Vehicles In India: 2030 నాటికి 5 కోట్ల ఈవీలు
న్యూఢిల్లీ: భారత రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) 2030 నాటికి 5 కోట్లకు చేరుకుంటాయని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ అంచనా వేసింది. చార్జింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసే సంస్థలకు అపార అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రస్తుతం మొత్తం వాహనాల్లో ఈవీల వాటా 1%గానే ఉన్నప్పటికీ.. డిమాండ్, సరఫరా, నియంత్రణ పరమైన సానుకూలతలు ఉన్నట్టు తెలిపింది. ‘ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ – తదుపరి భారీ అవకాశాలు’ పేరుతో కేపీఎంజీ ఓ నివేదిక విడుదల చేసింది. ‘దేశీ ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈవీ ప్రధాన విభాగంగా అవతరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల విక్రయాలు 3 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. 2022 మార్చికి భారత రోడ్లపై ఈవీల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సంఖ్య 2030 నాటికి 4.5–5 కోట్లకు చేరుతుంది. ఇది చార్జింగ్ సదుపాయాలకు భారీ డిమాండ్ను తెస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,700 బహిరంగ చార్జింగ్ స్టేషన్ల వరకే అందుబాటులో ఉన్నాయి. ఈవీల వృద్ధికి ఈ సంఖ్య ఏ మాత్రం చాలదు’’అని కేపీఎంజీ నివేదిక తెలిపింది. -
చార్జ్నెట్ రూ.70 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ వసతుల కంపెనీ చార్జ్నెట్.. ఈవీ సొల్యూషన్స్ కంపెనీ బైక్వోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 50,000లకు పైగా చార్జింగ్, స్వాపింగ్ కేంద్రాలను ఏడాదిలో ఏర్పాటు చేస్తారు. విస్తరణకు రూ.70 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు చార్జ్నెట్ కో–ఫౌండర్ చక్రవర్తి అంబటి తెలిపారు. ‘చార్జింగ్ ఉపకరణాలను హైదరాబాద్లో తయారు చేస్తున్నాం. ప్లాంటు సామర్థ్యం నెలకు 20,000 యూనిట్లు. దీనిని 18 నెలల్లో రెండింతలకు పెంచుతాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 200లకుపైగా చార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలతోసహా వన్స్టాప్ సొల్యూషన్స్ అందిస్తున్నట్టు బైక్వో కో–ఫౌండర్ విద్యాసాగర్ రెడ్డి చెప్పారు. చదవండి: వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం! -
46వేల చార్జింగ్ స్టేషన్లు కావాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే 2030 నాటికి దేశీయంగా 46,000 చార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని ప్రొఫెషనల్ సర్వీసుల సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈవీ చార్జర్ల నిష్పత్తి చైనా.. నెదర్లాండ్స్లో 6గాను, అమెరికాలో 19గాను, భారత్లో 135గాను ఉన్నట్లు తెలిపింది. అంటే చైనాలో ప్రతి 6 ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక చార్జర్ ఉండగా.. భారత్లో మాత్రం ప్రతి 135 వాహనాలకు ఒకటి ఉందని వివరించింది. ఎలక్ట్రిక్ వాహనాల సదస్సు ది ఈవీకాన్ఇండియా 2022 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈవీల వినియోగానికి ఎదురవుతున్న సవాళ్ళను ఇందులో ప్రస్తావించారు. ప్రధానంగా ఖరీదు, రేంజి (మైలేజి)పరమైన ఆందోళన, సరఫరా వ్యవస్థ, ఉత్పత్తి భద్రత .. నాణ్యత, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. భారీ వాహన పరిశ్రమ, కాలుష్య సమస్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈవీల వినియోగం, నవకల్పనలు వేగవంతంగా పెరగడానికి భారత్లో ఇదే సరైన సమయమని వివరించింది. సరఫరా వ్యవస్థ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడి ఫైనాన్సింగ్కు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతే వచ్చే అయిదేళ్లలో పరిశ్రమలోని అనుబంధ విభాగాలు సగటున 50–100 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అల్వారెజ్ అండ్ మార్సల్ ఇండియా ఎండీ మనీష్ సైగల్ చెప్పారు. -
ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ మరోమారు సిద్ధమైంది. వాహనాలకు ఇంధన ఖర్చు తక్కువ, పర్యావరణహితం కావడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వీటిని వినియోగించేవారు పెరుగుతున్నారు. అందుకనుగుణంగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు(పీసీఎస్)లు పెంచుతున్నారు. మూడేళ్ల క్రితమే నగరవ్యాప్తంగా వంద పీసీఎస్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. అనంతరం వాటిని అటకెక్కించింది.తాజాగా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)తో కలిసి 14 ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 278 ప్రాంతాల్లో ఫీజిబిలిటీ స్టడీ జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పేర్కొన్నారు. స్టడీ నివేదికను బట్టి 230 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. దిగువ ప్రాంతాల్లో.. ఇందిరాపార్కు, కేబీఆర్ పార్కు వద్ద 3, ట్యాంక్బండ్ రోడ్, బషీర్బాగ్, గన్ఫౌండ్రి, ఆబిడ్స్, నానక్రామ్గూడ, మహవీర్ హరిణ వనస్థలి, ఉప్పల్, ఒవైసీ హాస్పిటల్, తాజ్ త్రీస్టార్ హోటల్(సికింద్రాబాద్)ల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు. అటకెక్కిన గత ఒప్పందం.. దాదాపు మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్æ(ఈఈఎస్ఎల్)తో వంద స్టేషన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ..అనంతరం దాన్ని అటకెక్కించింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2030 నాటికి రోడ్ల మీదకు వచ్చే వాహనాలన్నీ ఎలక్ట్రిక్వే ఉండాలని కేంద్రప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రికల్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి ప్రజారవాణా బస్సులన్నీ ఎలక్ట్రిక్వే ఉండాలని భావిస్తోంది. అందుకనుగుణంగా రూపొందించిన పాలసీ మేరకు 2022 నాటికి 25 శాతం, 2025 వరకు 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనేది లక్ష్యం. ఈ లక్ష్యం సాధించాలంటే ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి. వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు తగినన్ని పీసీఎస్లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతమున్న ప్రైవేట్ స్టేషన్లు పెరిగే వాహనాల అవసరాలకు సరిపోవు. ఈ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా స్థానిక సంస్థలపై ఉండటంతో జీహెచ్ఎంసీ అందుకు సిద్ధమైంది.ఫీజిబిలిటీ స్టడీని బట్టి ఆయా ప్రాంతాల్లో పీసీఎస్లు ఏర్పాటు చేస్తారు. హెచ్ఎండీఏ పరిధిలో మరో వంద ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏర్పాటు కానున్న ప్రతి చార్జింగ్ స్టేషన్ లో ఫాస్ట్ స్పీడ్ ఛార్జింగ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ సదుపాయాలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ స్థలాలు ఇస్తున్నందున పీసీఎస్లు వినియోగంలోకి వచ్చాక యూనిట్ కు 1 రూపాయి చొప్పున ప్రతి మూడు నెలలకోసారి జీహెచ్ఎంసీకి చెల్లింపులు చేయాలనేది ప్రతిపాదన. ఆమేరకు ఒప్పందం కుదరాల్సి ఉంది. (చదవండి: నిర్వాసితులకు బేడీలా?) -
ఈవీ యాక్షన్ ప్లాన్.. సిటీలో ప్రతీ 3 కి.మీలకు ఒక ఛార్జింగ్ స్టేషన్
నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింతగా ప్రోత్సహించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్ఈడీసీఓ)లు సంయుక్త కార్యచరణ ప్రకటించాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రతీ మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాలనే ప్రణాళికతో ఉన్నారు. నగరంలో ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో 150 వరకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పెట్రోలు బంకులు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో విస్తరించి ఉన్నాయి. వీటికి అదనంగా మరో 300ల వరకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఒక్క ఛార్జింగ్ స్టేషన్ను 18 కిలోవాట్ పవర్ పర్ అవర్ కెపాసిటీతో నిర్మించనున్నారు. వీటిని రెవెన్యూ షేరింగ్ పద్దతిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే ఇందిరాపార్క్, కేబీఆర్ పార్క్ గేట్ నంబర్ 1, 3, 6, ట్యాంక్బండ్ రోడ్, మున్సిపల్ పార్కింగ్ ఏరియా అబిడ్స్, నానక్రామ్గూడ, మహావీర్ హారిని వనస్థలి నేషనల్ పార్క్, ఉప్పల్ మెట్రో పార్కింగ్ ఏరియా, ఓవైసీ హాస్పిటల్ సంతోశ్నగర్, తాజ్ హోటల్ సరోజినిదేవీ రోడ్ తదితర ప్రాంతాలు ఎంపికయ్యాయి. ఒకసారి లొకేషన్ ఫైనల్ అయ్యాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. చదవండి: షాకింగ్ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, స్పందించిన సంస్థ -
గుడ్న్యూస్! రైల్వే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ఎక్కడెక్కడంటే?
EV Stations in Hyderabad: రైల్వే శాఖ ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త తెలిపింది. రైల్వే ప్రాంగణాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఫేజ్1లో తొలి స్టేషన్ను హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్లో ప్రారంభించింది. త్వరలోనే నగరంలో మరిన్ని స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనుంది. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ పర్యావరణ హితమైన ఈవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈవీ కార్లు, స్కూటర్లు, బైకులు కొన్న వారికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సహాకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా లేకపోవడం పెద్ద లోపంగా మారింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రోత్సహిస్తోంది. జంటనగరాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ జోన్లో ఫస్ట్ ఫేజ్లో మొత్తం 32 స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి స్టేషన్ నాంపల్లిలో ప్రారంభం అయ్యింది. ఇది కాకుండా హైదరాబాద్ నగర పరిధిలో బేగంపేట, హైటెక్సిటీ, ఘట్కేసర్, లక్డీకాపూల్, ఫతేనగర్, నెక్లస్రోడ్, సంజీవయ్య పార్కు స్టేషన్లలో కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. As part of GOI's initiative to reduce carbon emission at all major cities by 2030 & as a major boost towards E-mobility -E-Vehicle charging facility set up @ Hyderabad Rly Stn -Initiative promotes usage of environment-friendly vehicles, while generating revenue for Railways pic.twitter.com/6eKcGNz3yS — South Central Railway (@SCRailwayIndia) June 1, 2022 తెలంగాణలో ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, డోర్నకల్, మధిర, భద్రాచలంరోడ్, భువనగిరి, జనగామ, జమ్మికుంట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, కరీంనగర్ స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. చదవండి: ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా -
ఐఓసీ పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి బ్యూరో: పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఈ ధరలు వాహనాల యజమానులకు కొండంత భారంగా మారాయి. ఈ తరుణంలో పెట్రోల్, డీజిల్తో పనిలేని ఎలక్ట్రిక్ వాహనాలు (ఈ–వాహనాలు) అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వాహనాలకు సరిపడినన్ని చార్జింగ్ స్టేషన్లు లేక వాటి కొనుగోలుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్క్యాప్) దృష్టి సారించింది. ఈ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుంది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమికంగా 27 ఈ– చార్జింగ్ స్టేషన్లు/పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు చెందిన 11 పెట్రోల్ బంకుల్లో 25, 30, 50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మూడు స్టేషన్లకు విద్యుత్ (గ్రిడ్) కనెక్షన్ కూడా ఇవ్వడంతో అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన వాటికి త్వరలో కనెక్షన్ ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో.. కొత్తగా ఆర్టీసీ బస్టాండ్లలో ఈ–చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్, ఆటోనగర్, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, జగ్గయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, ఎ.కొండూరు, ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, చందర్ల పాడు, గన్నవరం, కైకలూరును ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టేషను/డిపో/బస్టాండ్లలో వాహనాల చార్జింగ్కు అనువుగా ఉండే స్థలాలను ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్టు నెడ్క్యాప్ జిల్లా మేనేజర్ జె.వి.ఎల్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అవి ఖరారైతే ఆయా చోట్ల చార్జింగ్ పాయింట్లను అమర్చనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నాలుగు, మూడు చక్రాల విద్యుత్ వాహనాలకు చార్జింగ్ పెట్టుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాహనదారులు తమ వాహనానికి చార్జింగ్ అయిపోతే సమీపంలో చార్జింగ్ స్టేషన్/పాయింట్ ఎక్కడుందో తెలుసుకునే ఆధునిక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించారు. (క్లిక్: కృష్ణా యూనివర్సిటీకి 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు) -
ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి: ప్యాసింజర్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో 4 వేల ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంతాలను న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) గుర్తించింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. మరోవైపు తిరుపతిలో 200, విశాఖపట్నంలో 100 త్రీ వీలర్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్ఆర్ఈడీసీఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) సంయుక్తంగా ఈ బాధ్యతలను తలకెత్తుకున్నాయి. ఈవీ వాహనాలను పరీక్షించడానికి ఒక టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతో నెడ్కాప్ ఒప్పందం కుదుర్చుకుంది. వాయిదాల్లో విద్యుత్ వాహనాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో, రాజమండ్రి, విజయవాడ నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో గాలి నాణ్యత ప్రామాణిక నాణ్యతకన్నా తక్కువగా ఉంది. దీనిని పెంచడానికి ద్విచక్ర వాహనాలన్నీ ఈవీలుగా మారాలి. ఈ ఉద్దేశంతో ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు నెడ్కాప్ వాయిదా పద్ధతిలో విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించడానికి ఒక పథకాన్ని రూపొందించింది. రుణాల కోసం ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది. వడ్డీ రేటు కేవలం 9 శాతం మాత్రమే. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇప్పటికే పథకాన్ని ప్రారంభించింది. ఒక ఈవీ టూ వీలర్ వల్ల ఏటా సగటున రూ.42,300 వరకు ఆదా అవుతుందని అంచనా. ఆటోలతోనే మార్పు మొదలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే అపార్ట్మెంట్లు, పార్కులు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, జాతీయ రహదారుల్లో చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండాలి. బ్యాటరీని కూడా అక్కడే మార్చుకునే (స్వాపింగ్) వీలుండాలి. దీనికోసమే నెడ్కాప్ రాష్ట్రంలో 4వేల స్థలాలను గుర్తించింది. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు 10 మంది డెవలపర్స్ను నమోదు చేసింది. ప్యాసింజర్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. అంటే ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోల్లోని ఐసీ ఇంజన్ను తొలగించి, దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ అమరుస్తారు. బ్యాటరీ సాయంతో ఆ మోటార్ పనిచేస్తుంది. తిరుపతిలో మూడు ఆటోలను ప్రయోగాత్మకంగా ఇలా మార్చి ఇప్పటికే నడిపిస్తున్నారు. దీనికి రూ.2.50 లక్షల ఖర్చు కానుండగా.. వాహనదారుడు కేవలం రూ.10 వేలు మాత్రమే డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మిగతా రూ.2.40 లక్షల్లో రూ.80 వేలు ఏపీఎస్ఈసీఎం అందజేస్తుంది. మిగిలిన మొత్తాన్నీ ప్రైవేటు డెవలపర్స్ ద్వారా నెడ్కాప్ సమకూరుస్తుంది. ఈ మొత్తం రుణాన్ని వాహనదారుడు ప్రతిరోజూ ఆటో చార్జింగ్ పెట్టుకోవడానికి ఈవీ స్టేషన్కు వెళ్లినపుడు చెల్లించాల్సి ఉంటుంది. ఆ రోజుకి ఈవీ వల్ల ఆదా అయిన పెట్రోల్, డీజిల్ ఖర్చునే వాయిదాగా కడితే సరిపోతుంది. అవగాహన కోసం ‘గో ఎలక్ట్రిక్’ ప్రచారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో, ఈవీల వినియోగంపై అవగాహన కల్పించడానికి ‘గో ఎలక్ట్రిక్’ ప్రచారాన్ని నెడ్కాప్, ఏపీఎస్ఈసీఎంలు శుక్రవారం విజయవాడలోని విద్యుత్ సౌధలో ప్రారంభించాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఈవీ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్, సైకిల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాయి. అనంతరం ఈవీ వాహనాలతో రోడ్ షో నిర్వహించాయి. ఏపీ ట్రాన్స్కో జేఎండీ బి.మల్లారెడ్డి, డైరెక్టర్లు ఓ ముత్తుపాండియన్, ఎ.చంద్రశేఖరరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా చార్జింగ్ మౌలిక వసతుల రంగంలో ఉన్న బోల్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశవ్యాప్తంగా 50,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే 4.5 లక్షల పైచిలుకు వినియోగదార్లకు ప్రయోజనం కలిగించేందుకు 750కిపైగా హీరో ఎలక్ట్రిక్ విక్రయ కేంద్రాల్లో బోల్ట్ చార్జర్స్ను అందుబాటులో ఉంచుతారు. 2,000 మంది హీరో ఎలక్ట్రిక్ కస్టమర్ల ఇళ్ల వద్ద చార్జింగ్ యూనిట్లను ఉచితంగా నెలకొల్పుతారు. వచ్చే రెండేళ్లలో భారత్లో 10 లక్షలకుపైగా చార్జింగ్ పాయి ంట్లను ఏర్పాటు చేయాలన్నది బోల్ట్ లక్ష్యం. చదవండి: రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్ గుడ్బై -
మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కు డిమాండ్, రంగంలోకి దిగిన ఎస్బీఐ!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ విభాగంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వ్యాపార అవకాశాలు దక్కించుకోవడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దృష్టి సారించింది. వీటిపై అధ్యయనం చేసి, తగు సూచనలు చేసేందుకు కన్సల్టెంటును నియమించుకోనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం దరఖాస్తు చేసుకునే సంస్థకు .. పేమెంట్ సిస్టమ్స్ విషయంలో కన్సల్టింగ్ సర్వీసులు అందించడంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండేళ్ల పాటు లాభాల్లో ఉండాలి. గరిష్టంగా నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. బిడ్ల దాఖలుకు మే 10 ఆఖరు తేది. ఈ ఏడాది మార్చి మధ్య నాటికి దేశవ్యాప్తంగా 10.60 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. 1,742 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు పని చేస్తున్నాయి. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్న్యూస్, వందల కోట్లతో కేంద్రం మాస్టర్ ప్లాన్!
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ కారిడార్లను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. రద్దీగా ఉండే 100 జాతీయ రహదార్లలో 2023 మార్చి నాటికి 100 కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా 2,000 స్టేషన్స్ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. 2024–25 నాటికి ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను 7,000కు చేర్చాలన్నది లక్ష్యమని బీపీసీఎల్ రిటైల్ ఈడీ బి.ఎస్.రవి తెలిపారు. అంచనాలను మించి ఈవీ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కనీస మౌలిక వసతుల ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తాం. తొలినాళ్లలో కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో వాణిజ్య పరంగా చార్జింగ్ స్టేషన్స్ లాభదాయకత కాదు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలను కోరతాం’ అని వివరించారు. -
3–4 ఏళ్లలో భారీగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ముంబై: దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు (ఈవీలు) మద్దతుగా చార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు కానున్నాయి. వచ్చే మూడు నాలుగేళ్లలో అదనంగా 48,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోకి రూ.14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయంటూ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర, బస్ విక్రయాలు పుంజుకుంటాయని, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కీలకమవుతుందని పేర్కొంది. ‘‘ఈవీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 2024–25 సంవత్సరం నాటికి మొత్తం విక్రయాల్లో 13–15 శాతంగా ఉండొచ్చు. అదే సమయంలో త్రిచక్ర వాహనాలు 30 శాతానికి పైగా, ఈ బస్సుల విక్రయాలు 8–10 శాతానికి చేరుకోవచ్చు’’ అని అంచనా వేసింది. ప్రస్తుతానికి మనదేశంలో బహిరంగ ఈవీ చార్జింగ్ కేంద్రాలు 2,000 వరకు ఉండగా.. ఇవి కూడా కేవలం కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకే పరిమితం కావడం గమనార్హం. విధానపరమైన ప్రోత్సాహం.. ‘‘ఈవీ చార్జింగ్ సదుపాయాల విషయంలో భారత్ వెనుకనే ఉంది. కాకపోతే విధానపరమైన ప్రోత్సాహం బలంగా ఉంది. ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు చార్జింగ్ ఇన్ఫ్రాలోకి అడుగుపెడుతున్నట్టు ప్రణాళికలు ప్రకటించాయి’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. ఈవీ చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయం బ్యాటరీ స్వాపింగ్ (ఖాళీ బ్యాటరీ ఇచ్చి చార్జింగ్ నింపి ఉన్నది తీసుకెళ్లడం) అని, కాకపోతే ఇది ఆరంభంలోనే ఉన్నట్టు దివాన్ చెప్పారు. ఫేమ్ పథకం కింద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు రూ.1,300 కోట్లను కేటాయించడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. -
టీవీఎస్తో జట్టు కట్టిన జియో
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా జియోబీపీ సంస్థ ప్రముఖ టూవీలర్ మేకర్ టీవీఎస్తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న త్వరలో రాబోతున జియో బీపీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లలో టీవీఎస్ వాహనాలకు యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా టీవీఎస్ ఈవీలలో ప్రయాణం చేయడం మరింత సౌకర్యవంతం కానుంది. రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అయిన జియో బీపీ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జియోబీపీ ప్లస్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు ఐక్యూబ్ పేరుతో ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో అడుగు పెట్టిన టీవీఎస్ సంస్థ.. రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లను ఈవీ రంగంపై ఖర్చు చేయనుంది. దీంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా జియోబీపీ, టీవీఎస్లు జట్టు కట్టాయి. -
ఈవీ ఛార్జింగ్.. ఎంతో ఈజీగా..
-
ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజర్లకు గుడ్న్యూస్.. మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా కొత్త విభాగాన్ని ప్రకటించింది. ఎంజీ చార్జ్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన చార్జింగ్ మౌలిక వసతులను కల్పిస్తారు. 1,000 రోజుల్లో దేశవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో 1,000 చార్జింగ్ కేంద్రాలను స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. సూపర్ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకై ఎంజీ మోటార్ ఇటీవలే ఫోర్టమ్, టాటా పవర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
ఈ–వాహనాల వృద్ధి.. పవర్ ఫుల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విద్యుత్ (ఈ) వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటి సంఖ్య నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. 2017లో ద్విచక్రవాహనాలు, త్రిచక్ర వాహనాలు (ఆటోలు), కార్లు కలిపి విద్యుత్ వాహనాల సంఖ్య 5,653 ఉంటే గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 21,565కు పెరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఆటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017తో పాటు 2018 సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఆటోలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 2,587కు పెరిగింది. విద్యుత్ స్కూటర్ల సంఖ్య కూడా నాలుగేళ్ల నుంచి భారీగానే పెరుగుతోంది. 2017లో 3,195 ఎలక్ట్రికల్ స్కూటర్లున్నాయి. వీటి సంఖ్య గత డిసెంబర్ చివరి నాటికి 14,441. విద్యుత్ కార్ల వినియోగం మాత్రం ఇప్పుడే పెరుగుతోంది. 2017లో 2,452 విద్యుత్ కార్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 4,537కు చేరింది. చార్జింగ్ స్టేషన్లు వస్తే ఈ–వాహనాలు మరింత పెరుగుతాయి పెట్రోల్, డీజిల్ బంక్లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణాశాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరుగుతోందని చెప్పారు. చార్జింగ్ స్టేషన్లు వస్తే వీటి వినియోగం పెరుగుతుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలపై పన్ను లేకపోవడం వల్ల కూడా ఇటీవల వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. విద్యుత్ కార్ల వినియోగం పుంజుకుంటోందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. -
గుడ్న్యూస్ వైజాగ్! నగరంలో ఈవీ చార్జింగ్ స్టేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా వైజాగ్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. 25 కిలోవాట్ సూపర్ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాన్ని టాటా పవర్ సహకారంతో అందుబాటులోకి తెచ్చింది. ఎంజీ మోటార్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 44 సెంటర్స్ను ప్రారంభించింది. ఈజీ చార్జ్ బ్రాండ్ కింద టాటా పవర్ 180 నగరాలు, పట్టణాల్లో 1,000కిపైగా ఈవీ చార్జింగ్ కేంద్రాలను స్థాపించింది. -
బీపీసీఎల్తో హీరో మోటోకార్ప్ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను కలి్పంచే దిశగా ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా .. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కలి్పంచడం సహా వివిధ రకాల ఇంధనాలను విక్రయించే ఇంధన కేంద్రాలుగా దాదాపు 7,000 పైచిలుకు సాంప్రదాయ పెట్రోల్ బంకులను మార్చనున్నట్లు బీపీసీఎల్ గతేడాది సెపె్టంబర్లో వెల్లడించింది. నగదురహితంగా ప్రక్రియ..: హీరో మోటోకార్ప్ త్వరలోనే రెండు నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయాల కల్పన ప్రారంభించనుంది. ఒక్కో చార్జింగ్ స్టేషన్లో డీసీ, ఏసీ చార్జర్లు సహా పలు చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉపయోగపడతాయి. చార్జింగ్ ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నగదురహితంగా పూర్తి చేయవచ్చు. తమ భారీ నెట్వర్క్తో ఈవీ చార్జింగ్ సదుపాయాలను గణనీయంగా విస్తరించవచ్చని బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. వాహన రంగంలో కొంగొత్త ధోరణులను అందిపుచ్చుకోవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని హీరో మోటో చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వాహనాల(ఈవీల)కు డిమాండ్ ఊపందుకోవడంతో వాటి చార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా ఇప్పుడు దేశమంతటా పెరుగుతూ పోతున్నాయి. కేవలం గత నెల నాలుగు నెలల్లోనే మెట్రో సిటీల్లో వీటి సంఖ్య రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు ఒక ఉదాహరణ. సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో చార్జింగ్ స్టేషన్లు గణనీయంగా పెరిగాయని సెంట్రల్ పవర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలోనే అదనంగా 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశంలోని 1,640 పబ్లిక్ ఈవీ ఛార్జర్లలో దాదాపు 940 ఈ నగరాల్లోనే ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. 4 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 9 మెగా నగరాలపై ప్రభుత్వం మొదట్లో తన దృష్టిని పెంచింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల జనవరి 14, 2022న ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను జారీ చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రైవేటు కంపెనీలతో పాటు బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలూ ఈ వ్యాపారంలోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పొందడానికి సౌకర్యవంతమైన ఛార్జింగ్ నెట్ వర్క్ గ్రిడ్ అభివృద్ధి చేయడానికి ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మెట్రో సిటీల్లో ఈవీ చార్జింగ్ నెట్వర్క్ బలంగా ఉన్నందున, ప్రభుత్వం దశలవారీగా ఇతర నగరాలకు కవరేజీని విస్తరించాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు, జాతీయ రహదారులపై 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో ప్రకటించాయి. వీటిలో10 వేల స్టేషన్లను ఐఓసీఎల్ ద్వారా.. 7000 స్టేషన్లు బీపీసీఎల్ ద్వారా.. మిగిలిన 5000 స్టేషన్లు హెచ్పీసీఎల్ ద్వారా ఇన్స్టాల్చేస్తారు. (చదవండి: పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను వీడని కష్టాలు..!) -
ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని తమ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో గురువారం ఇక్కడ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ రహదారులపై ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రెడ్కో సంస్థ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను నిర్మించి ఇండియన్ ఆయిల్ సంస్థకు అప్పగించనుంది. సీబీజీ, సీఎన్జీ వంటి పునరుద్ధరణీయ ఇంధన ఆధారిత చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును సైతం పరిశీలిస్తున్నట్టు రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పేర్కొన్నారు. 2022 చివరి నాటికి 800 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?
నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలోనే అతిపెద్ద 100 పాయింట్ల ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను గురుగ్రామ్లో ఎన్హెచ్ఈవీ అనే సంస్థ ప్రారంభించింది. రానున్న కాలంలో వాహన వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఈ స్టేషన్ సహకరిస్తుందని తెలిపారు. సెక్టార్ 52లోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఫాస్ట్, స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు తెలిపారు. ఒక రోజులో 576 పెద్ద వాహనాలను ఛార్జ్ చేయవచ్చు అని ఆ సంస్థ అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులను చేపట్టడంలో నైపుణ్యం ఉన్న నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్(ఎన్హెచ్ఈవీ) అనే ప్రైవేట్ సంస్థతో కలిసి నీతి అయోగ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి, యమునా ఎక్స్ ప్రెస్ వేపై ఇలాంటి మరిన్ని స్టేషన్ల ఏర్పాటు చేయడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్ ఒక ప్రోటోటైప్గా పనిచేస్తుందని ఎన్హెచ్ఈవీ అధికారులు తెలిపారు. ఒక స్లో ఛార్జర్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఆరు గంటల వరకు పడుతుందని, ఒక రోజులో నాలుగు వాహనాలను చార్జ్ చేయగలదు అని, అటువంటి 72 ఛార్జర్లు ప్రతిరోజూ 288 వాహనాలను ఛార్జ్ చేయగలవని తెలిపారు. "వేగవంతమైన డీసీ ఛార్జర్లు రెండు గంటల కంటే తక్కువ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయగలవు. ఈ స్టేషన్ వద్ద ప్రతిరోజూ 12 వాహనాలను చార్జ్ చేయవచ్చు. రోజు మొత్తంలో 288 వాహనాలను ఛార్జ్ చేయడానికి మాకు 24 డిసి ౫కెడబ్ల్యు ఛార్జర్లు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు. ఎన్ హెచ్ఈవీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అభిజీత్ సిన్హా మాట్లాడుతూ.. రాబోయే అన్ని ఛార్జింగ్ స్టేషన్లకు ఇది ఒక నమూనాగా నిలుస్తుందని తెలిపారు. 100 ఛార్జింగ్ యూనిట్లతో దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇదే అవుతుందని ఆయన అన్నారు. దీనికి ముందు, అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ ముంబైలో ఉంది సిన్హా పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా జైపూర్-ఢిల్లీ హైవే వెంబడి ౧౦ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, హైవేకు ఇరువైపులా నాలుగు & రెండు నగరాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తామని సిన్హా తెలిపారు. ఢిల్లీ - జైపూర్ మధ్య భారతదేశంలోని తొలి విద్యుత్ రహదారిని నిర్మించడానికి మంత్రిత్వ శాఖ విదేశీ కంపెనీలతో చర్చిస్తుందని గత సంవత్సరం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. (చదవండి: ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!) -
ఇక ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ కష్టాలకు చెక్..!
ముంబై: ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ ఆల్టిగ్రీన్, విద్యుత్ వాహనాల చార్జింగ్ సొల్యూషన్స్ స్టార్టప్ సంస్థ మాసివ్ మొబిలిటీ చేతులు కలిపాయి. వచ్చే రెండేళ్లలో 25,000 ఆన్-డిమాండ్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. మాసివ్ మొబిలిటీకి ప్రస్తుతం ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతంలోని (ఎన్సీఆర్) 150 ప్రదేశాల్లో చార్జర్లు ఉన్నాయి. ఆల్టిగ్రీన్తో ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పనుంది. బ్రాండ్, మోడల్తో సంబంధం లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు అనువుగా ఇవి ఉంటాయి. యూజర్లు తమ ప్రొఫైల్ను ఆన్లైన్లో సెట్ చేసుకుని, చార్జింగ్ స్టేషన్లలో స్లాట్లను బుక్ చేసుకోవడం, యూపీఐ విధానంలో చెల్లింపులు జరపడం మొదలైన లావాదేవీలు కూడా చేసేందుకు తమ చార్జింగ్ యాప్ ఉపయోగపడుతుందని మాసివ్ మొబిలిటీ వ్యవస్థాపకుడు శైలేష్ విక్రం సింగ్ తెలిపారు. చార్జింగ్ సదుపాయాలు భారీ స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరగగలదని ఆల్టిగ్రీన్ సీఈవో అమితాబ్ శరణ్ పేర్కొన్నారు. (చదవండి: OnePlus 10 Pro: అదిరిపోయే ఫీచర్స్తో విడుదలైన వన్ప్లస్ సూపర్ స్మార్ట్ఫోన్..!) -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్న్యూస్! ఈ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ ఫ్రీ
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స ట్రెండ్ నడుస్తోంది. క్రమంగా పెట్రోలు, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు ప్రజలు మళ్లుతున్నారు. అయితే ఈ చేంజింగ్ ట్రెండ్కి ఛార్జింగ్ పాయింట్ల షార్టేజీ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ఈవీ తయారీ సంస్థలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది. పెట్రోలు బంకుల్లో పెట్రోల్ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్లకు ఛార్జింగ్ సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోల్ బంకుల్లో ఓలా సంస్థ హైపర్ ఎలక్ట్రిక్ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవీశ్ అగర్వాల్ ట్విట్టర్లో స్వయంగా ప్రకటించారు. రెండు నెలల్లో భారత్ పెట్రోలు బంకుల్లో హపర్ ఛార్జింగ్ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్ ఛార్జింగ్ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు. ఛార్జింగ్ ఫ్రీ ఇక పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్ అగర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. భారత్ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్ 30 వరకు ఈ ఆఫర్ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్ కరెంట్కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్ సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. Hypercharger roll out has begun across cities. At key BPCL pumps as well as residential complexes. 4000+ points up through next year. We’re installing across India and will make them operational in 6-8 weeks. Will be free for use till end June 22 for all customers. pic.twitter.com/WKEzok4E98 — Bhavish Aggarwal (@bhash) December 28, 2021 అథర్కి పోటీగా ఓలా కంటే ముందే ఈవీ మార్కెట్లో ఉన్న అథర్ సంస్థ సైతం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్ పెసిలిటీని కల్పించింది. 2021 డిసెంబరు 31తో ఈ గడువు ముగియగా తాజాగా 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఆ వెంటనే ఓలా నుంచి పబ్లిక్ హైపర్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ప్రకటన వచ్చింది. చదవండి:విశాఖలో ఓలా స్కూటర్ల డెలివరీ.. గెట్ రెడీ అంటున్న భవీశ్ అగర్వాల్ -
భారత్లో టెస్లా పవర్ 5000 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం 2025 నాటికి దేశవ్యాప్తంగా 5000 విద్యుత్ వాహన (ఈవీ)చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని టెస్లా పవర్ యూఎస్ఏ ప్రకటించింది. ఫ్రాంఛైజీలుగా పనిచేస్తున్న టెస్లా పవర్ షాపుల్లో వీటిని నెలకొల్పుతామని తెలిపింది. టెస్లా పవర్ యూఎస్ఏ ఢిల్లీలో భారత వ్యాపార సమావేశాన్ని నిర్వహించింది. విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ భారత విభాగపు ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు. భారత్లో 20కు పైగా రాష్ట్రాల్లో కంపెనీకి 200కు పైగా డిస్ట్రిబ్యూటర్లు, 250కు పైగా టెస్లా పవర్ షాపులు ఉన్నాయి. -
ఫెర్న్ హోటల్స్తో జట్టు కట్టిన మెజెంటా
ఛార్జ్ పాయింట్ ఆపరేటర్గా ఉన్న మెజెంటాతో ది ఫెర్న్ హోటల్స్ అండి రిసార్ట్ జట్టు కట్టింది. ఫెర్న్ సంస్థ లోనావాలా, కరాద్, బెంగళూరులతో పాటు మొత్తం 69 లోకేషన్స్లో 84 ఎన్విరాన్ఫ్రెండ్లీ హోటల్స్ నిర్వహిస్తోంది. తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు ఫెర్న్ హోటల్స్ అండ్ రిసార్ట్స్లలో డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ను నెలకొల్పడంతో పాటు మెయింటనెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మొబైల్ అప్లికేషన్ ఏనబేల్డ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ని మెజెంటా అందిస్తోంది. కస్టర్మర్ ఫ్రెండ్లీ ఫీచర్స్తో మెజెంటా ఛార్జింగ్ స్టేషన్లు, ఫీచర్లు అందిస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. ఛార్జింగ్ కష్టాలకు చెక్!
గత కొద్ది నెలల నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో పెరగడంతో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనలను కొనుగోలు చేసే ప్రధాన సమస్య ఛార్జింగ్ సమస్య. పెట్రోల్, డీజిల్ ఫిల్ చేసుకున్నంత వేగంగా ఈవీలను వేగంగా ఛార్జింగ్ చేయాలక పోతున్నాము. త్వరలోనే ఈ కష్టాలకు కూడా చెక్ పడనుంది. ప్రముఖ ఆంప్రియస్ టెక్నాలజీస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనలను కేవలం 6 నిమిషాల్లో 0-80 శాతం చార్జ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 370 kW అవుట్పుట్ కలిగి ఉంది. మొబైల్ పవర్ సొల్యూషన్స్ అనే కంపెనీఅత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యం గల ఛార్జింగ్ టెక్నాలజీని పరీక్షించింది. ఈ పరీక్షలో 80 శాతం ఛార్జింగ్ చేయడానికి 6 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టింది. ఈ కంపెనీ చార్జర్ ద్వారా 0-70% ఛార్జింగ్ చేయడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడితే, ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫుల్ చార్జ్ చేయడానికి 30 నిమిషాల సమయం పట్టింది. ఇంకో ఆసక్తికర విషయం చెప్పాలంటే, 90-100% చార్జ్ కావడానికి 20 నిమిషాల సమయం పట్టింది. ఈ టెక్నాలజీ సిలికాన్ ఆనోడ్ లి-అయాన్ బ్యాటరీ సెల్స్ సహాయంతో పని చేస్తుంది. (చదవండి: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ధర ఇంత తక్కువ..?) -
ఎలక్ట్రిక్ వాహనాలకు స్టార్టప్ల జోరు..
న్యూఢిల్లీ: ఒకవైపు ఇంధనాల రేట్లు పెరుగుతుండటం మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండటం వంటి పరిణామాలు దేశీయంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలకు కలిసి వస్తోంది. సరఫరాను మించి ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ నెలకొంటోంది. దీంతో ఈ విభాగంలోని స్టార్టప్ సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే పనిలో ఉన్నాయి. ఎథర్ ఎనర్జీ కొత్తగా రెండో ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇది వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4,00,000 యూనిట్లుగా ఉంటుంది. ఎథర్కు ఇప్పటికే 1,20,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో హోసూరులో ఒక ప్లాంటు ఉంది. ఇది ఉత్పత్తి ప్రారంభించిన 10 నెలల్లోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సంస్థకు హీరో మోటోకార్ప్ తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు, అనుకున్న స్థాయి కన్నా ప్రీ–బుకింగ్స్ వెల్లువెత్తడంతో కోయంబత్తూర్కు చెందిన బూమ్ మోటార్స్ సంస్థ.. కొత్తగా మరో ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1,00,000 యూనిట్లుగా ఉండనుంది. అటు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈ మధ్యే తమిళనాడులోని రాణిపేట్లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్త్యం 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ యూనిట్లుగా ఉంటుంది. ఇక ఈ రంగానికి సారథ్యం వహిస్తున్న హీరో ఎలక్ట్రిక్ వచ్చే ఐదేళ్ల పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 10 లక్షల యూనిట్లుగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. భారీగా ప్రీ–ఆర్డర్లు... గతేడాది నవంబర్ నుంచి అమ్మకాలు నెలవారీగా 20 శాతం పైగా వృద్ధి చెందుతున్నట్లు ఎథర్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో వాహనాల బుకింగ్స్ నాలుగు రెట్లు పెరిగినట్లు వివరించింది. అటు బూమ్ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ బైక్ కార్బెట్ కోసం నవంబర్ 12న బుకింగ్స్ ప్రారంభించగా.. కేవలం 17 రోజుల్లోనే 36,000 పైచిలుకు ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికా, టర్కీ వంటి దేశాల నుంచి కూడా సం స్థకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. సింపుల్ వన్ పేరిట టూవీలర్ ఆవిష్కరించిన.. సింపుల్ ఎనర్జీ అనే సంస్థ కూడా తమకు ప్రీ–బుకింగ్లో 30,000 పైచిలుకు ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడులు.. డిమాండ్కు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సరఫరా చేసేందుకు కంపెనీలు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎథర్ వచ్చే అయిదేళ్లలో రూ. 650 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ దాదాపు రూ. 700 కోట్లు ఈ–మొబిలిటీ విభాగంపై ఇన్వెస్ట్ చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకు ఇచ్చే స్టార్టప్ సంస్థ బౌన్స్ కూడా తయారీలోకి అడుగుపెడుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి ఇన్ఫ్రా విస్తరించడంపై వచ్చే 12 నెలల్లో రూ. 742 కోట్లు పైగా వెచ్చించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలెకెరె తెలిపారు. కంపెనీకి రాజస్తాన్లోని భివాడీలో 1,80,000 స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది. అటు గుజరాత్లోని వడోదరకు చెందిన వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ కూడా సొంత ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. అంచనాలు అప్... 2030 నాటికి మొత్తం దేశీయ టూ–వీలర్ మార్కెట్లో వీటి వాటా 30 శాతం పైగా చేరవచ్చని భావిస్తున్నట్లు నొమురా రీసెర్చ్ తెలిపింది. ఎథర్ ఎనర్జీ తదితర సంస్థలన్నీ ఉత్పత్తి సామర్థ్యాలను భారీగా పెంచుకునే పనిలో ఉండటం ఇందుకు నిదర్శనమని వివరించింది. చౌక రుణాలపై ఆర్బీఐ దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈవీల కొనుగోలు కోసం ప్రాధాన్యతా రంగం (పీఎస్ఎల్) కింద రుణాలు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. ఒకవేళ దీనికి ఆమోదముద్ర లభిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభించగలవు. ప్రస్తుతం ఆటో రిటైల్ విభాగానికి పీఎస్ఎల్ రుణాలు లభిస్తున్నాయి. అయితే, ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎదురయ్యే రిస్కుల విషయంలో స్పష్టత లేకపోవడంతో, వీటికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి. కాలుష్యకారక వాయువులను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలకపాత్ర పోషించగలవని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐకి సదరు ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పీఎస్ఎల్ కింద ఈవీలను చేర్చడం వల్ల వడ్డీ భారం తగ్గడమే కాకుండా మరింత మందికి రుణ సదుపాయం లభిస్తుందని కాంత్ వివరించారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు కేంద్రం శుభవార్త..!
ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. భారీగా పెట్రో ధరల పెంపుతో పాటు, టెక్నాలజీ తగ్గట్లు అప్డేట్ అవుతున్నారు. అందుకే వాహనాదారులు పెట్రో వాహనాల్ని పక్కనపెట్టి..ఈవీ వెహికల్స్ను కొనుగోలు చేస్తున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా వాటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థలకు కలిసొస్తున్న అంశమనే చెప్పుకోవాలి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఛార్జింగ్ తప్పని సరి. కానీ దేశంలో ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు నామ మాత్రంగానే ఏర్పాటు చేశాయి. దీంతో వాహనదారులు ఈవీ వెహికల్స్ కొంటే ఛార్జింగ్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఫేమ్ ఇండియా (Faster Adoption And Manufacturing Of Electric Vehicles) పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 70వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో 22వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే స్పందించారు. ఎక్స్ప్రెస్ హైవేస్, హైవేస్, నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైవేకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, దూరంతో పాటు భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్కు ప్రతి 100కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, నగరాల్లోని గ్రిడ్ పరిధిల్లో ప్రతి 3కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తేవాలని విద్యుత్ శాఖ గైడ్లైన్స్ నిర్దేశించిందన్నారు. లిథియం బ్యాటరీల కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్లో కీలకమైన లిథియం బ్యాటరీల ఉత్పత్తి పరిశ్రమల్ని స్థాపించనున్నట్లు మహేంద్రనాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) కింద రూ.18,100 కోట్లు కేటాయించామని అన్నారు. చదవండి: కార్ల కొనుగోలుపై లక్షకు పైగా భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా -
క్లబ్హౌస్లలో వర్క్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్హౌస్లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైనా సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.ల ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటివి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చని ఆర్వీ నిర్మాణ్ ఎండీ సీహెచ్ రామచంద్రా రెడ్డి తెలిపారు. -
ఛార్జింగ్ సమస్యలకు చెక్..! ఎలక్ట్రిక్ స్కూటర్లలో సరికొత్త పంథా..!
బెంగళూరుకు చెందిన ప్రముఖ రెంటల్ బైక్ సర్వీసుల సంస్థ బౌన్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఛార్జింగ్ కష్టాలకు చెక్పెడుతూ ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ మోడల్తో బౌన్స్ రానుంది. అందుకుగాను ఆటోమెటేడ్, మెకానికల్ పార్కింగ్ సర్వీసులను అందిస్తోన్న పార్క్ ప్లస్ కంపెనీతో బౌన్స్ కలిసి పనిచేయనుంది. పార్క్ప్లస్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో సుమారు 3500 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను బౌన్స్ ఏర్పాటుచేయనుంది. పార్క్ ప్లస్ అనేది కారు వినియోగదారులకు పార్కింగ్ స్లాట్లను చూపించే మొబైల్ యాప్. ఈ యాప్ సహయంతో ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాటరీ స్వాపింగ్ అవుట్లెట్లను చూపించనుంది. సరికొత్త పంథా..! ఛార్జింగ్ కష్టాలకు చెక్..! ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అతిపెద్ద సమస్య ఛార్జింగ్ సమయం. ఈవీ వాహనాలు నిర్దిష్ట దూరాలకు మాత్రమే ప్రయాణిస్తాయి. వీటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కాగా ఛార్జింగ్ కష్టాలకు చెక్పెడుతూ బౌన్స్ సరికొత్త పంథాతో మార్కెట్లలోకి రానుంది. ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ మోడల్ను బౌన్స్ పరిచయం చేయనుంది. బౌన్స్ త్వరలోనే ఇన్ఫినిటీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్చేయనుంది. ఇన్ఫినీటీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుదారులు బ్యాటరీ లేకుండానే కొనుగోలు చేసే అవకాశాన్ని బౌన్స్ కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ఫినిటీ బైక్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 నుంచి 50 శాతం మేర బౌన్స్ ఇన్పినీటీ బైక్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఛార్జ్ జీరో కాగానే సమీపంలో ఉండే పార్క్ప్లస్ బ్యాటరీ అవుట్లెట్ల సహయంతో ఫుల్ ఛార్జింగ్ బ్యాటరీలను క్షణాల్లో పొందే అవకాశాన్ని బౌన్స్ కల్పించనుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! -
‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లపై ఆయిల్ కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మూడు కలసి రానున్న 3–5 ఏళ్లలో 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి.. 2070 నాటికి నెట్ జీరో (కాలుష్యం విడుదల పరంగా తటస్థ స్థితికి)కు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ప్రణాళికలతో ఉన్నాయి. ఇందులో ఒక్క ఐవోసీనే 10,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ సదుపాయాలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 7,000 స్టేషన్లలో ఈవీ చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీపీసీఎల్ ప్రకటించింది. హెచ్పీసీఎల్ 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది కాలంలోనే ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ చెరో 1,000 స్టేషన్లను ప్రారంభిస్తాయని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి మంగళవారం ప్రకటించారు. ఇటీవలే జరిగిన కాప్26 సదస్సులో భాగంగా నెట్జీరో లక్ష్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తెలిసిందే. -
ఇక దేశమంతటా పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!
ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతుండటంతో ఈవీ ఇన్ఫ్రా సెక్టార్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దేశమంతటా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలను మొదలుపెట్టాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్), మరో రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాబోయే 3-5 ఏళ్లలో 22,000 ఎలక్ట్రిక్ వేహికల్(ఈవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ ఐఓసీఎ రాబోయే మూడేళ్లలో 10,000 ఇంధన అవుట్ లెట్లలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) రాబోయే ఐదేళ్లలో 7,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) కూడా 5,000 స్టేషన్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. 2021 సీఓపీ26 వాతావరణ మార్పు సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం 2070 నాటికి ఉద్గారాలను సున్నాకు తగ్గించనున్నట్లు వివరించారు. అలాగే, భారతదేశం తన తక్కువ కార్బన్ శక్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు(జిడబ్ల్యు) పెంచాలని, 2030 నాటికి తన మొత్తం శక్తి అవసరాలలో 50 శాతం తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. (చదవండి: 5జీ స్మార్ట్ఫోన్ ఇంత తక్కువ ధరకా!) -
Zip Charge Go: ఫోన్లకే కాదు కార్ల కోసం కూడా.. పవర్ బ్యాంక్ ఫీచర్స్
ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్న వారికి గొప్ప రిలీఫ్. ఈవీ కొనాలనుకునేవారికి శుభవార్త! ఫోన్ల తరహాలోనే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోకుండా ఉంచుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకు రెడీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే డిమాండ్ ఊపు మీద ఉంది. ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించాలంటూ అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నాయి. మన దగ్గరయితే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్కి షిఫ్ట్ అయ్యేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు, వెహికల్ మైలేజీ రేంజ్ అనే అంశాలు అవరోధాలుగా ఉన్నాయి. పవర్ బ్యాంక్ ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మొబైల్ ఫోన్లలో నిరంతరం ఛార్జింగ్ ఉండేలా బ్యాటరీ డ్రయిన్ కాకుండా చూసుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకులు వెంట తీసుకెళ్తాం. ఇప్పుడు ఈవీ వెహికల్స్కి కూడా అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. సీఓపీ26లో బ్రిటన్కి చెందిన జిప్ఛార్జ్ అనే స్టార్టప్ కంపెనీ గో పేరుతో పవర్ బ్యాంకును తయారు చేసింది. గ్లాస్కోలో జరుగుతున్న కాన్ఫడరేషన్ ఆఫ్ పార్టీస్ 26 (సీవోపీ 26) సదస్సులో ఈ పవర్ బ్యాంకుని ఆవిష్కరించింది. వచ్చే ఏడాది చివరి త్రైమాసికం నాటికి మార్కెట్లోకి ఈ పవర్ బ్యాంక్ని తెస్తామని జిప్ఛార్జ్ ప్రకటించింది. ఈజీగా ఫోన్ పవర్ బ్యాంక్ అయితే చేతిలో పట్టుకెళ్లొచ్చు, బ్యాగులో తీసుకెళ్లొచ్చు. కార్ పవర్ బ్యాంక్ అంటే పెద్దదిగా ఉండి ఉపయోగించడం కష్టంగా ఉంటుందనే భావన రానీయకుండా డిజైన్ చేశారు. గరిష్టంగా 20 కేజీల బరువు ఉండే ఈ పవర్ బ్యాంకు చిన్న సూట్కేస్ అంత ఉంటుంది. వీల్స్పై దీన్ని తీసుకెళ్లడం సులభం. కారు డిక్కీలో ఈజీగా పడుతుంది. గరిష్టంగా 70 కి.మీ ఈ పవర్ బ్యాంక్ని ఉపయోగించి కారుని ఛార్జ్ చేస్తే కనిష్టంగా 35 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని జిప్ఛార్జ్ చెబుతోంది. ఇంట్లో సైతం కరెంటు లేని సమయంలో పవర్ బ్యాంక్ను బ్యాకప్గా ఉపయోగించుకునే వీలుంది. స్మార్యాప్ల ద్వారా దూరంగా ఉండి కూడా ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ను పర్యవేక్షించే వీలుంది. రెండు వేరియంట్లలో జిప్ఛార్జ్ సంస్థ 20 కిలోవాట్స, 40 కిలోవాట్స్ వేరియంట్లలో తయారు చేసింది. అయితే వీటి ధరను ఇంకా నిర్ణయించలేదు. మార్కెట్లోకి వచ్చేప్పుడు ధరలను ఫైనల్ చేస్తామని చెబుతున్నారు. చదవండి:ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు! -
ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!
ముంబై: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) భారతదేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాటలోనే నడిచేందుకు సిద్దం అయ్యింది. దేశవ్యాప్తంగా 19,000 పెట్రోల్ పంపులను కలిగి ఉన్న చమురు సంస్థ ఇప్పుడు ఈవి ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్ బంకుల వద్ద సుమారు 7,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికను రూపొందించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో ఆ రంగంలో కూడా అడుగుపెట్టాలని బీపీసీఎల్ చూస్తుంది. దేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో కొత్త వ్యాపారంలో తన మార్క్ చూపాలని చూస్తుంది. భారత్ పెట్రోలియం ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈవీ పరిశ్రమకు డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి 7,000 స్టేషన్ల ఏర్పాటు చేయలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ స్టేషన్లను 'ఎనర్జీ స్టేషన్లు' అని పిలుస్తారు" అని ఆయన అన్నారు. (చదవండి: ఆన్లైన్ సేల్స్ అదరహో..! అదరగొడుతున్న ఇళ్ల అమ్మకాలు..!) రాబోయే మూడేళ్లలో భారతదేశం అంతటా తన పెట్రోల్ బంకుల వద్ద 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ప్రకటించిన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ ప్రకటన చేసింది. 2024 నాటికి 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే 12 నెలల్లో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 3న చమురు కంపెనీ ప్రకటించింది. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఐఓసీఎల్ గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల వల్ల కొత్త వాహనం కొనలనుకునేవారు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక విషయం మాత్రం వారిని వెనుకడుగు వేసేలా చేస్తుంది. అదే ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ సమస్య. దేశంలో పెట్రోల్, డీజిల్ ఉన్న సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఈవీ కొనుగోలుదారులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఈవీ కొనుగోలుదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక శుభవార్త తెలిపింది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీల) కోసం 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేట్(ఐఓసీఎల్) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదిలోగా 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రాబోయే రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐఓసీఎల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏర్పడటంతో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. దీంతో అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈవీ తయారీదారుల సహకారంతో దేశంలో ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గత వారం, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్-సెక్టార్ ఇంటిగ్రేటెడ్ కంపెనీల్లో ఒకటైన టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. We will be setting up 10,000 EV charging stations in the next three years: SM Vaidya, Chairman, Indian Oil Corporation pic.twitter.com/XJNr5jcDMN — ANI (@ANI) November 3, 2021 (చదవండి: వన్ప్లస్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, స్పీడ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!) -
గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ నేడు(అక్టోబర్ 31) తర్వాతి తరం ఎలక్ట్రిక్ వేహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ లాంచ్ చేసినట్లు ప్రకటించింది. దీనిని అథర్ గ్రిడ్ 2.0 పేరుతో పిలుస్తున్నారు. ఈ కొత్త తరం ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నెట్ వర్క్ ఓవర్ ది ఎయిర్(ఓటిఏ) వంటి ఆధునాతన ఫీచర్లతో పనిచేయనుంది. అథర్ ఎనర్జీ ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో ఈ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ను ఇన్ స్టాల్ చేయడం ప్రారంభించింది. త్వరలో దేశంలోని ఇతర నగరాల్లో కూడా వీటిని లాంచ్ చేయనుంది. కంపెనీ ప్రస్తుత ఛార్జింగ్ గ్రిడ్లతో పోలిస్తే కొత్త జెనెరేషన్ పబ్లిక్ ఛార్జింగ్ నెట్ వర్క్ వేగంగా చార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అథర్ గ్రిడ్ 2.0ను అన్నీ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా నిర్మించినట్లు సంస్థ తెలిపింది. ఈ గ్రిడ్ 2.0 అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. తద్వారా అన్ని నగరాల్లో అన్ని ఛార్జింగ్ లొకేషన్ల రియల్ టైమ్ వివరాలు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వేహికల్ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసింది. అథర్ గ్రిడ్ ఛార్జింగ్ నెట్ వర్క్ ప్రస్తుతం 215కి పైగా ప్రదేశాలలో, 21 నగరాల్లో విస్తరించి ఉంది. కంపెనీ 2022 చివరి నాటికి మరో 500 నగరాల్లో ఛార్జింగ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. That's right! Our all new Ather Grid 2.0 charging points will start rolling out across all cities. Check it out when you see one ⚡ https://t.co/zwW6gnWy73 — Ather Energy (@atherenergy) October 31, 2021 (చదవండి: వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!) -
ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!
ప్రజలకు రెవోస్ కంపెనీ శుభవార్త తెలిపింది. మరో ఆదాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం రెవోస్ కంపెనీ అద్భుతమైన ఆఫర్ మీ ముందు ఉంచింది. పోర్టబుల్ ఛార్జర్లకు అనుకూలమైన ఛార్జింగ్ పాయింట్లను ఇక ఎవరైనా కొనుగోలు చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు అని తెలిపింది. యూనియన్ స్క్వేర్ వెంచర్స్ మద్దతు గల రెవోస్ కంపెనీ బోల్ట్ పేరుతో ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. దీనిని ఎవరైనా కొనుగోలు చేసి దుకాణాలు, గ్యారేజీలు, వాణిజ్య పార్కింగ్ స్థలాల వద్ద ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లు పోర్టబుల్ ఛార్జర్లు ఇంటి వద్ద ప్రస్తుతం ఉన్న ఎసీ పవర్ సప్లైతో కూడా ఇవి పనిచేస్తాయి. ఈ ఛార్జింగ్ పాయింట్లను సాధారణంగా అయితే ₹3,000కు కొనుగోలు చేసి ఛార్జింగ్ పాయింట్ తెరవవచ్చు. అయితే, ఆఫర్ లో భాగంగా కంపెనీ అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ చివరి వరకు ₹1 ప్రారంభ ధరకు బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లను అందిస్తోంది. ఎనర్జీ కాలిక్యులేటర్ ఛార్జింగ్ యూనిట్లు, పవర్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఎనర్జీ కాలిక్యులేటర్ తో ఈ పాయింట్స్ వస్తాయి. అలాగే, ఛార్జింగ్ పాయింట్ పక్కన ఉంచిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కస్టమర్ బిల్లు చెల్లింపులు కూడా చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఛార్జర్ సెట్ చేయడానికి అయ్యే ప్రాథమిక ఖర్చు తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఇతర ఖర్చులను వసూలు చేయడం లేదు. ప్రీ లాంఛ్ దశలో కంపెనీ భారతదేశంలోని 60 నగరాల్లో సుమారు 2,000 ఛార్జింగ్ పాయింట్లను 3,600 కెడబ్ల్యు సామర్థ్యం గల పాయింట్స్ ఇన్ స్టాల్ చేసింది. రెవోస్ బోల్ట్ మొబైల్ యాప్ ఉపయోగించి ఈవీ యజమానులు ఛార్జింగ్ పాయింట్లను గుర్తించవచ్చు. ఆర్ఈవీవోఎస్ సహ వ్యవస్థాపకుడు జ్యోతిరంజన్ హరీచందన్ బిజినెస్ లైన్తో మాట్లాడుతూ.. "మా ఛార్జింగ్ పాయింట్లు ఒక గంటలో ప్రతి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫుల్ ఛార్జ్ చేయగలవు. అంత సామర్థ్యం ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలకు లేదు. ప్రస్తుతం మాతో కొన్ని ఓఈఎమ్ లు పనిచేస్తున్నాయి. వారు తమ ఈవీలను 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే, ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పట్టే ఇతర ఈవీలు కూడా ఉన్నాయి. ఇది ఈవీ బ్యాటరీ టెక్నాలజీ, పోర్టబుల్ ఛార్జర్ పై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు. (చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!) యూరప్, ఆగ్నేయ ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో త్వరలో ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో, ఆర్ఈవీవోఎస్ భారతదేశంలోని 500 నగరాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో 1 మిలియన్ బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లకు పైగా ఇన్ స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెవోస్ కంపెనీని యాదవ్, హరిచందన్ 2017లో స్థాపించారు. యూనియన్ స్క్వేర్ వెంచర్స్, ప్రైమ్ వెంచర్ పార్టనర్స్ నుంచి కంపెనీ 4.5 మిలియన్ డాలర్ల నిధులను ఇప్పటికే సేకరించింది. బెంగళూరు, సింగపూర్లలో కార్యాలయాలను కలిగి ఉంది. రెవోస్ సహవ్యవస్థాపకుడు మోహిత్ యాదవ్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య వేగంగా పెరిగాలి అంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. గతంలో దేశ వ్యాప్తంగా ఉన్న పసుపు పచ్చ ఫోన్ బాక్స్ మాదిరిగానే, ప్రస్తుతం దేశం నలుమూలల ఆకుపచ్చ బోల్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు" తెలిపారు. కంపెనీ బోల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అభివృద్ది చేసింది. ఇది పేటెంట్ పెండింగ్ మాడ్యులర్ సిస్టమ్, ఇది ఏదైనా ఈవీతో ఇంటిగ్రేట్ చేయబడుతుంది. (చదవండి: ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో మొబైల్ దిగ్గజ కంపెనీ) -
అప్పుడు జియో నెట్వర్క్.. ఇప్పుడు పెట్రోలు బంకులు.. రిలయన్స్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: రిలయన్స్ సంస్థ రాకతో ఒక్కసారిగా మొబైల్ నెట్వర్క్ రూపు రేఖలే మారిపోయాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం ఆకాశాన్ని తాకింది. అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ అందిస్తూ మార్కెట్లో గట్టి పాగా వేసింది రిలయన్స్. తాజాగా పెట్రోలు బంకులు వ్యాపారంలోకి వస్తోంది. గతంలో రిలయన్స్ ఆధ్వర్యంలో బంకులు ఉన్నా.. ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉండేది. కానీ ఈసారి విదేశీ కంపెనీతో జట్టుకట్టి గోదాలోకి దూకుతోంది రిలయన్స్. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీ (ఆర్బీఎంఎల్) తొలి పెట్రోల్ బంకును ఆవిష్కరించింది. జియో–బీపీ బ్రాండ్ కింద నవీ ముంబైలోని నావ్డేలో దీన్ని ప్రారంభించింది. ‘కస్టమరు అవసరాలకు అనుగుణంగా జియో–బీపీ మొబిలిటీ స్టేషన్లను తీర్చిదిద్దాం. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, అడిటివైజ్డ్ ఇంధనాలు, రిఫ్రెష్మెంట్లు, ఆహారం మొదలైన వివిధ సర్వీసులన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి‘ అని ఆర్బీఎంఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సాధారణ ఇంధనాలు కాకుండా మరింత శక్తిమంతమైన ఇంధనాలను, ఎటువంటి అదనపు ధర విధించకుండా, వీటిలో అందిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయి ’యాక్టివ్’ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఇంధనం.. కీలకమైన ఇంజిన్ భాగాలకు రక్షణ కల్పిస్తుందని, ఇంజిన్లను శుభ్రంగా ఉంచుతుందని ఆర్బీఎంఎల్ వివరించింది. చాయ్.. సమోసా.. ఉప్మా.. తమ మొబిలిటీ స్టేషన్లలోను, ఇతర ప్రాంతాల్లోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఎంఎల్ తెలిపింది. ‘బీపీకి చెందిన వైల్డ్ బీన్ కెఫే బ్రాండ్ కాఫీతో పాటు మసాలా చాయ్, సమోసా, ఉప్మా, పనీర్ టిక్కా రోల్ వంటి ప్రాంతీయ, స్థానిక ఆహారం కూడా అందిస్తాం. ఇక పేరొందిన అమెరికన్ సంస్థ 24 గీ7 షాప్ ద్వారా నిత్యావసరాలు, స్నాక్స్, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను రిలయన్స్ రిటైల్ అందుబాటులో ఉంచుతుంది‘ అని వివరించింది. ఇక మొబిలిటీ స్టేషన్లలో క్యాస్ట్రాల్ భాగస్వామ్యంతో ఎక్స్ప్రెస్ ఆయిల్ చేంజ్ అవుట్లెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీటిలో వాహనాల చెకప్, ఆయిల్ చేంజ్ సర్వీసు వంటి సర్వీసులు ఉచితంగా అందిస్తామని వివరించింది. తక్ష ణ డిస్కౌంట్లు, హ్యాపీ అవర్ స్కీములు, సరళతరమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు మొదలైనవి కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఎంఎల్ తెలిపింది. 2025 నాటికి 5,500 మొబిలిటీ స్టేషన్లు.. 2019లో జాయింట్ వెంచర్గా (జేవీ) ఏర్పాటైన ఆర్బీఎంఎల్లో బీపీకి 49 శాతం, రిలయన్స్కు 51 శాతం వాటాలు ఉన్నాయి. రిలయన్స్కి చెందిన 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన (ఏటీఎఫ్) స్టేషన్లను దీనికి బదలాయించారు. ఈ బంకుల సంఖ్యను 2025 నాటికి 5,500కి పెంచుకోవాలని జేవీ నిర్దేశించుకుంది. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 78,751 పెట్రోల్ బంకులు ఉండగా.. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలదే ఉంది. ఆర్బీఎంఎల్కు 1,427 అవుట్లెట్స్, రష్యన్ దిగ్గజం రాస్నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీకి 6,250 బంకులు, షెల్కు 285 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతమున్న 1,400 రిలయన్స్ బంకులను జియో–బీపీ కింద రీబ్రాండింగ్ చేయనున్నట్లు ఆర్బీఎన్ఎల్ తెలిపింది. చదవండి: శ్రీలంకపై కన్నేసిన అదానీ..! -
ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు
ముంబై: కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు దేశంలో ఏ ఇతర సంస్థ చేయలేని విధంగా దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ తెలిపింది. ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను మాల్స్, హోటళ్లు, రిటైల్ అవుట్ లెట్లు, పబ్లిక్ యాక్సెస్ ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ పేర్కొంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనలను ప్రోత్సహించడం కోసం దేశ వ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా దేశంలో దాదాపు 10,000 హోమ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇవి వాహన యజమానులకు ఈవీ ఛార్జింగ్ చేసుకునేందుకు సౌకర్యవంతంగా ఉన్నాయి అని కంపెనీ తెలిపింది. టాటా పవర్ ఈజెడ్ ఛార్జర్స్ ఎకోసిస్టమ్ ద్వారా ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తుంది. ముంబైలో మొదటి ఛార్జర్లను టాటా పవర్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 180 నగరాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న ఈ-హైవేల మీద 10,000కి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్...!) -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఛార్జ్ చేయాలో తెలుసా..!
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా దుమ్మురేపింది. రెండు రోజుల్లోనే రూ. 1100 కోట్ల విలువైన అమ్మకాలను ఓలా జరిపింది. మరికొద్ది రోజుల్లోనే ఓలా బైక్స్ రోడ్లపైకి రానున్నాయి. ఓలా బైక్ను ఎలా ఛార్జ్ చేయాలంటే..! ఓలా బైక్లను బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ ఓక ప్రకటనలో పేర్కొంది. అయితే తాజాగా ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ఓలా బైక్ను ఏవిధంగా ఛార్జ్ చేయాలనే విషయాన్ని తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బైక్లను ఓలా హైపర్చార్జింగ్ స్టేషన్ దగ్గర సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చునంటూ ఓ వీడియోను శనివారం రోజున ట్విటర్లో షేర్ చేశారు.ఈ వీడియోను సుమారు 18 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. చదవండి: రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు ఓలా హైపర్ ఛార్జింగ్ స్టేషన్ల సహయంతో ఓలా బైక్లను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చును. దేశవ్యాప్తంగా 400 నగరాల్లో సుమారు లక్షకు పైగా హైపర్ ఛార్జింగ్ స్టేషన్లను ఓలా ఏర్పాటు చేయనుంది. ఈ హైపర్ ఛార్జింగ్ స్టేషన్ల సహాయంతో బ్యాటరీలు కేవలం 18 నిమిషాల్లో 50 శాతం మేర ఛార్జ్ కానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలను సులభంగా రిమూవ్ చేయవచ్చును. వీటి బరువు సుమారు 7 కిలోల వరకు ఉండనుంది. Simple! pic.twitter.com/CSI9QQWibI — Bhavish Aggarwal (@bhash) October 23, 2021 ఓలా ఎస్1, ఎస్1 ప్రో ధర ఓలా ఎస్1 ధర రూ.99,999 ఉండగా ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,29,999 ఉంది. ఇక వాహనకొనుగోలు దారులకు ఫేమ్2 స్కీంలో భాగంగా సబ్సిడీతో పాటు, రాష్ట్రాల్ని బట్టి అదనపు సబ్సిడీ ఉండనుంది. చదవండి: ఓలా బైక్, నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభం -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనేవారిని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఇప్పటికే సబ్సిడీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మరో శుభవార్త ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారిని వేదిస్తున్న ప్రధాన సమస్యకు చెక్ పెట్టేందుకు జాతీయ రహదారులపై ప్రతి 40 నుండి 60 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రోడ్డు కార్యదర్శి గిరిధర్ అరామానే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2023 నాటికి దేశంలో ఉన్న 40,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఛార్జింగ్ స్టేషన్లతో కవర్ చేయాలని అథారిటీ యోచిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ చైర్మన్ అరామే తెలిపారు. మొత్తం మీద, రాబోయే రెండేళ్లలో 700 ఛార్జింగ్ ఏర్పాటు చేయనున్నారు. " ఇక ఎలక్ట్రిక్ వాహనంలో జాతీయ రహదారులపై వెంట ప్రయాణిస్తున్న వారు ఛార్జింగ్ ఆయిపోతే భాదపడాల్సిన అవసరం లేదు" అని అరామానే తెలిపారు. ఛార్జింగ్ స్టేషన్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేస్, ఇప్పటికే ఉన్న రహదారుల వెంట ప్రైవేట్ సంస్థల ద్వారా అభివృద్ధి చేయనున్నారు. "ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడానికి వేసైడ్ సౌకర్యాల కోసం మేము రాయితీ ఒప్పందాన్ని సవరించాము. అంతేగాకుండా రెస్టారెంట్, మరుగుదొడ్లు, డ్రైవర్ల విశ్రాంతి గదులు, పెట్రోల్ & డీజిల్ పంపిణీ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు" అరామానే తెలిపారు. ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ 700 వేసైడ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది, కానీ తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017-18లో 69,012 యూనిట్ల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మార్చిలో పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సంఖ్య 2018-19లో 1,43,358 యూనిట్లు, 2019-20లో 1,67,041కు పెరిగాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పటికీ అదే రేంజ్ మైలేజ్ ఇస్తాయా?) -
‘పెట్రోల్ లేకపోయినా.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు’
న్యూఢిల్లీ:సడలించిన నూతన పెట్రోల్ పంపుల లైసెన్స్ నిబంధనల కింద.. పెట్రోల్, డీజిల్ విక్రయాల కంటే ముందే సీఎన్జీ, ఈవీ చార్జింగ్ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 నవంబర్ 8 నాటి నిబంధనల విషయమై ఈ మేరకు తాజాగా వివరణ ఇచ్చింది. ఈ నూతన నిబంధనల కింద.. పెట్రోల్, డీజీల్ విక్రయాలతో పాటు ఏదైనా ఒక నూతన తరం ప్రత్యామ్నాయ ఇంధన విక్రయాలను (సీఎన్జీ లేదా ఎల్ఎన్జీ లేదా ఎలక్ట్రిక్ లేదా బయో ఇంధనం) కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, దీన్ని తప్పనిసరి ఆదేశంగా చూడొద్దని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల పెట్రోలు బంకుకి అనుమతి పొందిన సంస్థలు. పెట్రోలు, డీజిల్ విక్రయాని కంటే ముందే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి : వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
కొత్త బంకుల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందే!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంధన సరళీకృత చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల సంఖ్య పెంచేందుకు ఇంధనేతర కంపెనీలకూ లైసెన్స్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఇంధన రిటైల్ నూతన సరళీకృత విధానాల్లో వివిధ షరతులు ఉన్నాయి. పెట్రోల్ బంకులు ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ వాటిని నిర్వహించాలనే వివిధ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం నడిస్తేనే కొత్త సంస్థలకు అవకాశం ఇస్తారు. రిటైల్ పెట్రోల్ పంపుల గెజిటే నోటిఫికేషన్ ప్రకారం.. కనీసం 100 పెట్రోల్ బంకులు నెలకొల్పాలి. ఇందులో 5 శాతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. అలాగే, కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ వంటి న్యూ జనరేషన్ ఇంధన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మూడేళ్లలో ప్రతిపాదిత రిటైల్ అవుట్ లెట్లలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి అని పేర్కొంది. భారతదేశం కొత్త సరళీకృత పెట్రోల్ పంప్ లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇక నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టేషన్ ప్రారంభించే స్టేషన్లలో అమ్మకాలు చేసే ముందు కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.(చదవండి: వాట్సాప్లో ఇలా చేశారో..! మీ అకౌంట్ను మర్చిపోవాల్సిందే..!) -
EV Charging Points: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్
రెండు నెలల క్రితం కిచెన్ రూమ్లో స్కూటర్ ఫోటో నెట్లో హల్చల్ చేసింది. బెంగళూరికి చెందిన ఓ ఐటీ ప్రొఫెషనల్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఎక్కడా చోటు లేక కిచెన్కి తీసుకొచ్చాడు. ఒక్క బెంగళూరే కాదు అనేక నగరాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి. కానీ ఈ తరహా పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది హైదరాబాద్. ముందుగానే హ్యాపెనింగ్ సిటీ పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ట్రెండ్కి తగ్గట్టుగా మారడంలో ఇతర నగరాల కంటే ముందు వరుసలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటూ ప్రభుత్వం చెబుతున్న సూచనలకు తగ్గట్టుగా రెడీ అవుతున్నారు. తమ అపార్ట్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలంటూ విద్యుత్ శాఖను సంప్రదిస్తున్నారు. గేటెట్లో ఛార్జింగ్ స్టేషన్లు నగరంలో పలు అపార్ట్మెంట్లు ఇప్పటికే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక నగరంలో ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీగా ఉన్న మైహోం గ్రూప్కి చెందిన భుజా, అవతార్లలో ఇప్పటికే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక యూనిట్ కరెంటుకి రూ. 6.50 వంతున ఛార్జ్ చేస్తున్నారు. ఇదే బాటలో ఉన్నాయి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరిన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్. మధ్యలో అంటే కష్టం ఇక ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్మెంట్లలో కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. దీంతో ఈవీ వెహికల్స కోసం కొత్తగా పవర్ అవుట్లెట్లను ఇస్తున్నారు. వీటికే ప్రత్యేకంగా మీటర్లు కేటాయిస్తున్నారు. సదరు ఆపార్ట్మెంట్లో ఈవీలు ఉపయోగించేవారు వీటి బాధ్యతలను తీసుకుంటున్నారు. ‘పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారి సంఖ్య ఒక్కసారిగా ఊపందుకుంది. కానీ మా అపార్ట్మెంట్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే స్థలం లేదు. అందుకే పార్కింగ్ ఏరియాలోనే పవర్ అవుట్లెట్లు ఏర్పాటు చేశాం’ అని గచ్చిబౌలికి చెందని ఓ ఆపార్ట్మెంట్ సోసైటీ సభ్యులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఈవీ వెహికల్స్కి హెడ్క్వార్టర్స్గా పేరొందిన బెంగళూరులో ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ అపార్ట్మెంట్ సోసైటీలు, ఈవీ వెహికల్స్ యజమానులకు మధ్య తరుచుగా ఈ విషయంపై వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలపై అక్కడ స్థానిక కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయి. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీలలోనూ ఈ తరహా సమస్యలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకముందే హైదరాబాద్లో అపార్ట్మెంట్లు క్రమంగా ఈవీ వెహికల్స్ తగ్గట్టుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే నగర పశ్చిమ ప్రాంతంలో ఈ మార్పు వేగంగా చోటు చేసుకుంటోంది. వరంగల్, కరీంనగర్ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. నగరంలో ఉన్న ఐటీ కంపెనీల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 140 పబ్లిక్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో 120 ఛార్జింగ్ స్టేషన్లు హైదరాబాద్లో రానుండగా, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 10 వంతున ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. -
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ, టాటా పవర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయులో భాగంగా భారతదేశం అంతటా టీవీఎస్ మోటార్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(ఈవీసీఐ) నిర్మించడం కోసం రెండు కంపెనీలు అంగీకరించాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం కోసం పెద్ద డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. టీవిఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ ద్వారా దేశంలో విస్తృతంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ నెట్ వర్క్ స్టేషన్లు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రెగ్యులర్ ఎసీ ఛార్జింగ్ నెట్ వర్క్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూసేవారికి ఈ భాగస్వామ్యం మరింత సహాయపడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో సౌర శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే రెండు కంపెనీలు తమ ప్రయాణంలో ఎంపిక చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సౌర శక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాయి. (చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!)