Commonwealth Games
-
భారత్లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు!
న్యూఢిల్లీ: భారత్లో రెండోసారి కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. 2030లో జరిగే పోటీల కోసం బిడ్ వేయాలని యోచిస్తోందని క్రీడా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. క్రీడలను నిర్వహించడంతో పాటు 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి తొలగించిన క్రీడాంశాలను కూడా మళ్లీ చేర్చే ఆలోచనలో భారత్ ఉంది. 2030 క్రీడల నిర్వహణకు ‘ఆసక్తిని ప్రదర్శించే’ ప్రక్రియకు మార్చి 31 చివరి తేదీ కాగా... ఈ దిశగానే ప్రయత్నం మొదలైనట్లు అధికారి చెప్పారు. ‘కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులతో చర్చలు జరిగాయి. 2030లో మేం నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా చెప్పాం. 2026లో తొలగించిన అన్ని క్రీడాంశాలను 2030లో చేర్చే విధంగా చూడాలని కూడా చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. 2026లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహక కమిటీ కేవలం 10 క్రీడాంశాలకే పోటీలను పరిమితం చేసింది. ఈ క్రమంలో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్, క్రికెట్లను పోటీల నుంచి తొలగించారు. ఇవే క్రీడాంశాల్లో భారత్కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉండేది. కమిటీ నిర్ణయం కారణంగా భారత్కు పెద్ద సంఖ్యలో పతకాలు వచ్చే అవకాశం ఉన్న ఆటలన్నీ క్రీడల్లో లేకుండాపోయాయి. గతంలో ఇదే తరహాలో 2022 బర్మింగ్హామ్ క్రీడల నుంచి కూడా ఆర్చరీ, షూటింగ్లను తొలగించిన తర్వాత వాటిని మళ్లీ చేర్చాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. దీనికి సానుకూల స్పందన వచ్చినా కోవిడ్ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అయితే వన్నె తగ్గిన కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే విషయంలో ఆర్థికభారం కారణంగా పలు పెద్ద దేశాలు కూడా వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో భారత్ ముందుకు వెళ్లడం ఆశ్చర్యకర పరిణామం! 2026కు ముందుగా ఆ్రస్టేలియాలోని విక్టోరియా వేదిక కాగా... 2023 జూలైలో ఆ దేశం అనూహ్యంగా తప్పుకుంది. నిర్వాహక కమిటీ మలేసియా దేశానికి ఆఫర్ ఇచ్చినా అదీ అంగీకరించలేదు. చివరకు తక్కువ బడ్జెట్తో, అదీ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆరి్థక సహకారంతో గ్లాస్గో ముందుకు వచి్చంది. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 23వ కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. మరోవైపు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపిస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి లేఖ పంపించింది. వచ్చే మార్చి తర్వాత దీని పురోగతిపై స్పష్టత రావచ్చు. -
‘కామన్వెల్త్’లో స్విమ్మింగ్, సైక్లింగ్లకు పెద్దపీట
గ్లాస్గో: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్లో క్రీడల్ని కుదించినప్పటికీ కొన్ని క్రీడలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్, పారా పోటీల్లో గణనీయంగా పతకాల ఈవెంట్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది గ్లాస్గో ఆతిథ్యమివ్వబోయే ఈ కామన్వెల్త్ మెగా ఈవెంట్లో 200కు పైగా బంగారు పతకాలు అథ్లెట్ల పరం కానున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే విభాగాన్ని తిరిగి ఈ కామన్వెల్త్లో చేర్చారు. చివరిసారిగా 1966లో మిక్స్డ్ రిలే విభాగం పోటీలు నిర్వహించాక తదనంతరం క్రీడల్లో ఆ ఈవెంట్కు మంగళం పాడారు. దీనిపై ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో హర్షం వ్యక్తం చేశారు. 1930 నుంచి 1966 వరకు కామన్వెల్త్లో అలరించిన మిక్స్డ్ రిలే ఈవెంట్ మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత గ్లాస్గోలో పతకాల కోసం పరుగుపెట్టబోతోంది’ అని అన్నారు. పారా అథ్లెటిక్స్లోని 10 ఈవెంట్లలో ఏకంగా ఆరు క్రీడాంశాలకు గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రికార్డుస్థాయిలో 47 పతకాలు పారా అథ్లెట్లు అందుకోనున్నారు. సైక్లింగ్లో 26 పతకాల ఈవెంట్లు (పారా సైక్లింగ్ కలిపి), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్లలో 56 పతకాలు ఈతకొలనులో కొల్లగొట్టనున్నారు. ఈ సారి కొత్తంగా 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 1500 మీటర్ల మహిళల ఫ్రీస్టయిల్ రేసుల్ని చేర్చారు. 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 11 రోజుల పాటు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. పది క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వీల్చైర్ బాస్కెట్బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్ , బౌల్స్, పారా బౌల్స్ (ఇండోర్), జూడో, నెట్బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా సైక్లింగ్, వెయిట్లిఫ్టింగ్, పారా పవర్లిఫ్టింగ్లో పోటీలుంటాయి. కామన్వెల్త్ ఎరెనా, సర్ క్రిస్ హో వెలొడ్రోమ్, స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఎస్ఈసీ), స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ వేదికల్లో పది రోజుల పాటు పోటీలు జరుగుతాయి. తొలి రోజు కేవలం ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. -
భారత్కు పెద్ద దెబ్బ
ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో మెగా ఈవెంట్ కామన్వెల్త్ క్రీడలు. ఇందులో భారత క్రీడాకారులు ప్రతీసారి పెద్ద సంఖ్యలో పతకాలు పట్టుకొస్తున్నారు. పతకాల పట్టికలోనూ క్రమంగా పుంజుకుంటూ టాప్–10, టాప్–5 స్థానాల్లో పదిలంగా నిలుస్తున్నారు. అలాంటి మెగా ఈవెంట్లో ఇకపై పతకాల వేట, పోడియం వద్ద మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం కష్టంగా మారనుంది. భారత్ అత్యధికంగా గెలిచే అవకాశాలున్న క్రీడాంశాలను ఆతిథ్య దేశం పెద్ద సంఖ్యలో తొలగించడం మన క్రీడాకారులకు నిజంగా గుండెకోతనే మిగల్చనుంది. ఓవరాల్గా పతకాల వేటకు పెద్ద దెబ్బ తగలనుంది. లండన్: మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి. భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ సిద్ధమైంది. గత బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను తప్పించారు. షూటింగ్ను బర్మింగ్హామ్లోనే పక్కన బెట్టారు. తాజా తొలగింపుతో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే భారత్ కచ్చితంగా ఈ ఐదు ఈవెంట్లలో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. బర్మింగ్హామ్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 30 పతకాలు ఆ ఈవెంట్లలోనే గెలుపొందడం విశేషం. అంటే దాదాపు సగం పతకాలను ఇకపై భారత్ కోల్పోనుండటం ఎదురుదెబ్బగా భావించవచ్చు. బడ్జెటే ప్రతిబంధకమా? నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్లోపే ఈవెంట్ ను నిర్వహించాలనుకుంటుంది. ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, నెట్బాల్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, జూడో, లాన్ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్బాల్ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్ జరుగుతుంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్లిఫ్టింగ్, లాన్ బౌల్స్ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. తొలగించిన క్రీడాంశాలు... హాకీ, క్రికెట్ టీమ్ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (టీటీ), స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ గెలిచిన పతకాలు రెజ్లింగ్ (12), వెయిట్లిఫ్టింగ్ (10), అథ్లెటిక్స్ (8), టేబుల్ టెన్నిస్ (7), బ్యాడ్మింటన్ (6), జూడో (3), బాక్సింగ్ (7), హాకీ (2), లాన్ బౌల్స్ (2), స్క్వాష్ (2), క్రికెట్ (1), పారా పవర్లిఫ్టింగ్ (1).బ్యాడ్మింటన్ను తొలగించాలనే గ్లాస్గో నిర్ణయం నన్ను కలవరపాటుకు గురిచేసింది. తీవ్ర నిరాశలో ముంచింది. క్రీడల్లో ప్రగతి సాధించే భారత్లాంటి దేశాలకు ఇది గొడ్డలిపెట్టు. మన షట్లర్లు ఈ క్రీడాంశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలో సత్తా చాటుకునే అవకాశాన్ని ఇలా కాలరాయడం నిజంగా దురదృష్టకరం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఇంకెందుకు కామన్వెల్త్ గేమ్స్? పూర్తిగా ఈవెంట్నే పక్కన బెట్టేయండి. కేవలం ఒలింపిక్స్, ఆసియా క్రీడలతోనే సరిపెట్టుకుందాం. ఎందుకంటే కీలకమైన ఆటల్ని తొలగించడం వల్ల కామన్వెల్త్ ప్రభ కోల్పోతుంది. వారి నిర్ణయం నన్ను నిర్ఘాంత పరిచింది. ఇక మనం మన జట్టును కామన్వెల్త్ గేమ్స్కు పంపించాల్సిన అవసరమే లేదు. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గ్లాస్గో నిర్వహించే పది క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లేకపోవడం బాధాకరం. ఇదొక్కటే కాదు, తొలగించిన అన్ని క్రీడాంశాల ఆటగాళ్లకు ఎదురుదెబ్బ. ముఖ్యంగా టీటీలో మనం ఎన్నో స్వర్ణాలు గెలిచాం. –శరత్ కమల్, భారత టీటీ దిగ్గజం -
CWG 2026: మనకే దెబ్బ!.. ఎందుకిలా చేశారు?
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నుంచి కీలక క్రీడాంశాలను ఎత్తివేసింది నిర్వాహక బృందం. 2026లో గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నుంచి క్రికెట్, హాకీ, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రోడ్ రేసింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్ని తొలగించారు. ఈ నేపథ్యంలో పతకాల పట్టికలో భారత్ వెనుకబడే అవకాశం ఉంది.మనకే దెబ్బ! తీవ్ర ప్రభావంఎందుకంటే.. హాకీ, క్రికెట్(మహిళలు), బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్లలోనే మనకు ఎక్కువ పతకాలు వస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్లో అత్యధికంగా ఇప్పటి వరకు 135 కామన్వెల్త్ మెడల్స్ గెలిచింది భారత్. ఇందులో 63 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరోవైపు.. రెజ్లింగ్లోనూ వివిధ విభాగాల్లో 114 మెడల్స్ దక్కాయి.బడ్జెట్ను తగ్గించుకోవడం కోసమే!వచ్చే కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ రెండింటిని తొలగించారు గనుక భారత్కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేర క్రీడల్ని తొలగించడానికి ప్రధాన కారణం బడ్జెట్ను తగ్గించుకోవడం కోసమే అని తెలుస్తోంది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా 10 క్రీడలు మాత్రమే నిర్వహించేవారు. అయితే, 1998 తర్వాత 15- 20 క్రీడలను అదనంగా చేర్చారు.నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్అయితే, గ్లాస్గోలో పాత పద్ధతినే ఫాలో అయ్యేందుకు నిర్వాహకులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తక్కువ క్రీడలు ఉంటే తక్కువ వేదికలు మాత్రమే అవసరమవుతాయి.. ఫలితంగా తక్కువ ఖర్చుతో మెగా ఈవెంట్ను పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్ నిర్వహించనున్నారు.స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, కామన్వెల్త్ ఎరీనా/సర్ క్రిస్ హోయ్ వెలడ్రోమ్, స్కాటిష్ ఈవెంట్స్ క్యాంపస్లను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదు. భవిష్యత్తులో మరిన్ని క్రీడలను చేర్చే, తొలగించే వెసలుబాటు ఆతిథ్య దేశాల కమిటీలకు ఉంటుంది. తమ దేశ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో ఉండబోయే క్రీడలు👉అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్👉స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్👉ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్👉ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్👉నెట్బాల్👉వెయిట్లిఫ్టింగ్, పారా వెయిట్లిఫ్టింగ్👉బాక్సింగ్👉జూడో👉బౌల్స్, పారా బౌల్స్👉3*3 బాస్కెట్బాల్, 3*3 వీల్చైర్ బాస్కెట్బాల్.చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే -
‘కామన్వెల్త్’ నుంచి హాకీ, రెజ్లింగ్ అవుట్!
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.అయితే 2026లో మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్హామ్ గేమ్స్లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది. కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్కు భారత జట్టు ప్రకటన -
బాబోయ్... భరించలేం!
గోల్డ్కోస్ట్ (ఆ్రస్టేలియా): బ్రిటిష్ రాజ్యమేలిన దేశాల మధ్య ప్రతి నాలుగేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే కామన్వెల్త్ క్రీడలు ఆతిథ్య నగరాలకు గుదిబండగా మారాయి. ఆ్రస్టేలియాలాంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహణ పెనుభారంగా భావిస్తున్నాయి. మాకొద్దంటే మాకొద్దని ఘనమైన ఆతిథ్యానికి దూరం జరుగుతున్నాయి. తాజాగా 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించలేమని ఆ్రస్టేలియాకు చెందిన మరో నగరం గోల్డ్కోస్ట్ కూడా వైదొలిగింది. రెండేళ్లలో జరిగే ఈ క్రీడల హక్కుల్ని తొలుత ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రం దక్కించుకుంది. అయితే క్రీడాగ్రామం నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటు, రవాణా, ఇతరత్రా ఆధునిక సదుపాయాల కల్పన తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని నిర్ధారించుకున్నాక విక్టోరియా ఆతిథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు ఈ జూలైలోనే వెల్లడించింది. దీంతో 2018లో ఈ క్రీడల్ని విజయవంతంగా నిర్వహించిన గోల్డ్కోస్ట్ మరోసారి ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచి్చంది. అయితే 700 కోట్ల డాలర్లకు పైగా వ్యయమయ్యే ఈ క్రీడల ఆతిథ్యాన్ని మరోసారి భరించడం కష్టమని వివరిస్తూ గోల్డ్కోస్ట్ కూడా ఈ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగింది. ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందిగా కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్)కు గోల్డ్కోస్ట్ నగర మేయర్ టామ్ టేట్ సూచించారు. ఆస్ట్రేలియా కాకుండా మరో మూడు దేశాలు కామన్వెల్త్ క్రీడల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అనుకున్నట్లుగా 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ జరిగితే మాత్రం మరుసటి ఏడాది (2027) జరగొచ్చు. -
'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్(Victoria State) వేదిక కానుంది. కానీ తాజాగా తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువైతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్తో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని.. మా కాంట్రాక్ట్ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మంచిదని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ మెల్బోర్న్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ''మొదట కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్లో రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్($2Aus Billion Dollars) కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు($7Aus Billion Dollars) అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్స్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం.. ఇది మాకు మూడింతల బడ్జెట్'' అని తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రతినిధి డానియెల్ ఆండ్రూస్ ► ఇక 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్ పట్టణం ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్లో ఆస్ట్రేలియా 179 పతకాలతో టాప్లో ఉండగా.. రెండో స్థానంలో ఇంగ్లండ్ 176 పతకాలతో ఉంది. ఇక భారత్ ఈ గేమ్స్లో 61 పతకాలు(22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో) నాలుగో స్థానంలో నిలిచింది. When the Commonwealth Games needed a host city to step in at the last minute, we were willing to help – but not at any price. And not without a big lasting benefit for regional Victoria. — Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023 చదవండి: Asian Games 2023: ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ -
స్వర్ణపతకం సాధించిన కొన్ని క్షణాల్లోనే తండ్రి మృతి.. విలవిల్లాడిన లోకప్రియ
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): న్యూజిలాండ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పట్టుకోట్టైకి చెందిన క్రీడాకారిణి స్వర్ణం సాధించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న క్రీడాకారిణి శోకసంద్రం అయింది. తంజావూరు జిల్లా పట్టుకోట్టై అన్నానగర్కు చెందిన పెయింటర్ సెల్వముత్తు (50) భార్య రీటా మేరీ (42)కి ముగ్గురు కుమార్తెలు లోకప్రియ (22), ప్రియదర్శిని (19), ప్రియాంక (14). ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన లోకప్రియ చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో ఆసియా, రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. న్యూజిలాండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన లోకప్రియ 52 కిలోల జూనియర్ విభాగంలో 350 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్లో నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఈ మ్యాచ్ జరిగింది. చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లి చేసుకొని..) ఈ క్రమంలో లోకప్రియ తండ్రి సెల్వముత్తు నిన్న రాత్రి 8 గంటల సమయంలో పుదుక్కోట జిల్లా కందర్వ కోట తాలూకా రన్పట్టి వద్ద గుండెపోటుతో మరణించారు. లోకప్రియకు పోటీ ముగిసేవరకు చెప్పలేదు. పోటీ ముగిసిన అనంతరం స్వర్ణపతకం సాధించిన లోకప్రియకు తన తండ్రి మరణవార్తను వీడియో కాల్లో తెలిపారు. దీంతో లోకప్రియ వీడియో కాల్లోనే తండ్రి మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ గోల్డ్మెడల్ గెలిచిన ఆనందం ఐదు నిమిషాలు కూడా నిలవలేదన్నారు. తాను న్యూజిలాండ్కు వెళ్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని, పతకం సాధించాక వీడియో కాల్లో చూపించి తన ఆశీస్సులు పొందాలనుకున్నానని వాపోయింది. తనకు తండ్రి దూరం కావడం తీరని లోటని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు క్రీడాకోటాలో ఉపాధి కల్పిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటానని చెప్పింది. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
మ్యాచ్కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్లకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశ్ ప్లేయర్స్పై నిషేధం
కామన్వెల్త్ గేమ్స్ లాంటి కీలకమైన ఈవెంట్లో మ్యాచ్కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులపై ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేధం విధించింది. సోనమ్ సుల్తానా సోమా, సాదియా అక్తర్ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్ టీటీ ప్లేయర్లు.. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆగస్ట్ 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్ల్లో (సింగిల్స్, డబుల్స్, మిక్సడ్ డబుల్స్) పాల్గొనాల్సి ఉండింది. అయితే ఈ జోడీ క్యాంప్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్ సమయానికి కనిపించకుండా పోయారు (బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పేర్కొన్నారు). దీంతో ప్రత్యర్ధులకు బై లభించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రీడల సమాఖ్య.. దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు డొమెస్టిక్ సర్క్యూట్కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
డోపింగ్లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్జీత్ కౌర్
ఇటీవల బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్కు చెందిన 27 ఏళ్ల నవ్జీత్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్హామ్ గేమ్స్లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో, కజకిస్తాన్లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్లో నవ్జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్జీత్పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. -
అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు. దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. -
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్హామ్లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
CWG 2022: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ
Commonwealth Games 2022- న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో కొందరు మినహా దాదాపు విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అపూర్వ విజయాలు చూసి జాతి మొత్తం గర్విస్తోందని ప్రశంసించారు. స్వర్ణ యుగం మొదలైంది! ‘‘మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని నాకు కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు భారతీయుల్లాగే.. మీ గురించి మాట్లాడటం నాకూ గర్వంగా ఉంది. భారత క్రీడల్లో స్వర్ణ యుగం ఆరంభమైంది. ఇది కేవలం యువ శక్తి వల్లే సాధ్యమైంది. గడిచిన రెండు వారాల్లో అటు కామన్వెల్త్.. ఇటు చెస్ ఒలింపియాడ్ రూపంలో రెండు మెగా ఈవెంట్లు. కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు చెస్ ఒలింపియాడ్కు మనం తొలిసారి ఆతిథ్యం ఇచ్చాము. ఈ మెగా ఈవెంట్లో విజయం సాధించిన వాళ్లందరికీ కూడా నా శుభాభినందనలు’’ అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన.. స్వర్ణ పతక విజేత బాక్సర్ నీతూ ఘంఘస్, బ్మాడ్మింటన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు, క్రికెటర్ రేణుకా సింగ్తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేరును ప్రస్తావించారు. భేటీలు భేష్! అమ్మాయిలంతా శెభాష్ అనిపించుకున్నారని, దేశమంతా గర్వించేలా చేశారని కొనియాడారు. అయితే, పూజా కాంస్యానికే పరిమితమైనందుకు కన్నీరు పెట్టుకున్నపుడు తాను వెంటనే స్పందించానన్న ప్రధాని మోదీ.. పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు ఆనందించాలే తప్ప బాధపడవద్దంటూ క్రీడాకారులకు సూచించారు. కామన్వెల్త్ గేమ్స్లో సీనియర్ అథ్లెట్లు ముందుండి నడిస్తే.. యువ ఆటగాళ్లు వారి స్ఫూర్తితో పతకాలు సాధించారని కొనియాడారు. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్లోనే మనకు 6 స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు వచ్చాయి. చదవండి: Ind Vs Zim ODI Series: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు.. The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా! Elated to interact with our CWG 2022 contingent. Entire nation is proud of their outstanding achievements. https://t.co/eraViqKcnl — Narendra Modi (@narendramodi) August 13, 2022 -
కామన్ వెల్త్ గేమ్స్ టీటీలో స్వర్ణం గెలిచిన ఆకుల శ్రీజ
-
కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రీడలు ముగిసాక స్వదేశానికి తిరుగు పయనం అయ్యేందుకు బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆ ఇద్దరు, అక్కడి నుంచి కనిపించకుండా పోయారంటూ పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (పీబీఎఫ్) వెల్లడించింది. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్హామ్ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శ్రీలంకకు చెందిన 10 మంది అథ్లెట్లు కూడా ఇదే తరహాలో అదృశ్యమైన నేపథ్యంలో ఈ మిస్సింగ్ కేస్ చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్లుగా పీబీఎఫ్ పేర్కొంది. వీరిలో నజీర్ 86-92 కేజీల హెవీవెయిట్ విభాగం రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరగగా.. 60-63.5 కేజీల విభాగంలో సులేమాన్ రౌండ్ ఆఫ్ 32లో ఓటమిపాలైనట్లు పీబీఎఫ్ పేర్కొంది. బాక్సర్ల అదృశ్యంపై విచారణ నిమిత్తం పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పీబీఎఫ్ ప్రకటించింది. కాగా, ఇదే ఏడాది బుడాపెస్ట్ వేదికగా జరిగిన 19వ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సందర్భంగా ఫైజాన్ అక్బర్ అనే ఓ పాకిస్థానీ స్విమ్మర్ కూడా ఇలానే అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. చదవండి: కామన్వెల్త్లో భారత ఫెన్సర్కు స్వర్ణం -
CWG 2022: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘పసిడి’ పంచ్తో..
CWG 2022- Boxer Nitu Ghanghas: బాక్సింగ్లో మన అమ్మాయిల పంచ్ కామన్వెల్త్ క్రీడల్లో గట్టిగా పడింది. తెలంగాణ నిఖత్ జరీన్తో పాటు హర్యాణ నీతు ఘణఘస్ కూడా స్వర్ణం సాధించింది. నిఖత్ వెనుక ఆమె తండ్రి ఎలా మద్దతుగా నిలిచాడో నీతు ఘంఘస్ వెనుక ఆమె తండ్రి జై భగవాన్ నిలిచాడు. హర్యాణ విధాన సభలో బిల్ మెసెంజర్గా పని చేసే జై భగవాన్ ఉద్యోగానికి జీతం లేని సెలవు పెట్టి నీతు బాక్సింగ్కు వెన్నుదన్నుగా నిలిచాడు. అతని త్యాగం ఫలించింది. నీతు బంగారు పతకం సాధించింది. ఆదివారం కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన నీతు ఘణఘస్ అక్కడి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో అభిమానులు ‘భారత మాతాకీ జై’ అని ఉత్సాహంగా నినాదాలు ఇస్తుంటే తన మెడలోని బంగారు పతకాన్ని చూపుతూ ‘ఈ పతకం ఈ దేశ ప్రజలందరితో పాటు మా నాన్నకు అంకితం’ అని చెప్పింది. కామన్వెల్త్ క్రీడలలో 45– 48 కేజీల విభాగంలో నీతు ఘణఘస్ ఇంగ్లండ్ బాక్సర్ డెమీ జేడ్ను ఘోరంగా ఓడించింది. ఎంత గట్టిగా అంటే రెఫరీలందరూ ఆమెకు ఏకగ్రీవంగా 5–0తో గెలుపునిచ్చారు. ‘మా కోచ్ భాస్కర్ చంద్ర భట్ నాతో నీ ప్రత్యర్థి ఎత్తు తక్కువ ఉంది. ఎక్కువగా దాడి చేసే వీలు ఉంది. కాచుకోవడానికి పక్కకు జరుగుతూ దాడి చెయ్ అన్నారు. అదే పాటించాను’ అంది నీతు. ఇలాంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంది కాబట్టే ఇవాళ ఆమె విజేత అయ్యింది. తండ్రికీ, దేశానికీ గర్వకారణంగా నిలిచింది. అతని గెలుపుతో స్ఫూర్తి 2008లో బీజింగ్ ఒలిపింగ్స్లో బాక్సర్ విజేందర్ సింగ్ స్వర్ణం సాధించడంతో నీతు కల మొదలైంది. అప్పటికి ఆ అమ్మాయికి 8 ఏళ్లు. ఆమె ఊరు ధనానాకు విజేందర్ సింగ్ ఊరు సమీపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ విజేందర్ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో నీతు తాను కూడా బాక్సర్ కావాలని నిశ్చయించుకుంది. ముగ్గురు తోబుట్టువులలో ఒకరైన నీతు ఇంట్లోగాని స్కూల్లోగాని ఫైటింగుల్లో ముందు ఉంటుంది. ఆ దూకుడు గమనించిన తండ్రి జై భగవాన్ ఆమెను బాక్సర్ను చేయడానికి నిశ్చయించుకుని చండీగఢ్లోని కుటుంబాన్ని ధనానాకు మార్చాడు. తను ఉద్యోగం చేస్తూ కూతురిని అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘భివాని బాక్సింగ్ క్లబ్’కు శిక్షణ కోసం వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాడు. భివానిలోనే విజేందర్ సింగ్ బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. రెండేళ్లు గడిచిపోయాయి. కాని నీతు బాక్సింగ్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ‘నేను బాక్సింగ్ మానేస్తాను నాన్నా’ అని తండ్రికి చెప్పింది. కాని కూతురు అలా నిరాశలో కూరుకుపోవడం తండ్రికి నచ్చలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి చండీఘడ్లో విధాన సభలో బిల్ మెసెంజర్గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం. మూడేళ్లు లీవ్ అడిగాడు కూతురి కోసం. అన్నేళ్లు ఎవరు ఇస్తారు. పైగా కూతురి బాక్సింగ్ కోసం అంటే నవ్వుతారు. కాని జై భగవాన్ లాస్ ఆఫ్ పే మీద వెళ్లిపోయాడు. సొంత ఊరు ధనానాకు చేరుకుని ఉదయం సాయంత్రం కూతురిని ట్రైనింగ్కు తీసుకెళ్లసాగాడు. జరుగుబాటుకు డబ్బులు లేవు. తండ్రి నుంచి వచ్చిన పొలంలో కొంత అమ్మేశాడు. ఎప్పుడో కొనుక్కున్న కారు అమ్మేశాడు. ఒక్కోసారి ట్రైనింగ్ కోసం ధనానా నుంచి భివానికి నీతు వెళ్లకపోయేది. ఇంట్లోనే సాధన చేయడానికి ఊక బస్తాను వేళ్లాడగట్టి ఉత్సాహపరిచేవాడు. ‘నువ్వు గొప్ప బాక్సర్వి కావాలి’ అనేవాడు. ‘నాన్నా... నేను మంచి బాక్సర్ని కాకపోతే నువ్వు ఉద్యోగంలో చేరిపో’ అని నీతు అనేది. ‘దాని గురించి ఆలోచించకు’ అని లక్ష్యంవైపు గురి నిలపమనేవాడు. విజయం వరించింది జై భగవాన్ అతని భార్య ముకేశ్ కుమారి కలిసి నీతు మీద పెట్టుకున్న ఆశలు ఫలించాయి. 2017, 2018 రెండు సంవత్సరాలు వరుసగా యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో నీతు ఛాంపియన్గా నిలిచింది. 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో దిగి గోల్డ్మెడల్ సాధించడంతో ఆమె ఘనత ఉన్నత స్థితికి చేరింది. గొప్ప విషయమేమంటే ఏ విధాన సభలో తండ్రి పని చేస్తాడో అదే విధాన సభ చైర్మన్ జ్ఞాన్చంద్ నీతు విజయం గురించి విని సంబరాలు జరపడం. నీతు తండ్రి జై భగవాన్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ‘మనమ్మాయి గొప్ప విజయం సాధించింది’ అన్నాడాయన జై భగవాన్తో నిజమే. ఇప్పుడు నీతు ‘మన అమ్మాయి’. మన భారతదేశ గర్వకారణం. చదవండి: CWG 2022: నిఖత్ జరీన్కు అరుదైన గౌరవం Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దారుణమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు దాదాను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడి కనకం గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్ సేన స్పూర్తివంతమైన ప్రదర్శనకు గాను ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ గంగూలీ కూడా హర్మన్ సేనను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇందులో దాదా టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. Congratulations to the Indian women's team for winning silver ..But they will go home disappointed as it was their game tonite ..@BCCIWomen — Sourav Ganguly (@SGanguly99) August 7, 2022 "సిల్వర్ గెలిచినందుకు భారత మహిళా క్రికెటజట్టుకు అభినందనలు.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యంకాని ట్వీట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ అభ్యంతరకర ట్వీట్పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. they shouldn't be disappointed, they should be proud of that silver medal they should be disappointed for still not having a proper system in place for them and it's a bit ironic when he talks about a final game lol#CWG2022 https://t.co/ydsrD7ow7o — Nikhil Mane 🏏🇦🇺 (@nikhiltait) August 8, 2022 తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సీరియస్ అవుతున్నారు. అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్గా ఉండటం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. The biggest disappointment is you. https://t.co/gBj47PO0HD — ಸುಶ್ರುತ । Sushrutha (@3eyeview) August 8, 2022 This guy is an absolute 🤡 Shame that he is the president of World's most powerful board https://t.co/slQz1drjPI — Harsh Deshwal🇮🇳 (@IamHarshDeshwal) August 8, 2022 చదవండి: నాలుగో ర్యాంక్లో టీమిండియా ఓపెనర్ -
నిఖత్ జరీన్కు అరుదైన గౌరవం
బర్మింగ్హామ్: ఆటలు ముగిశాయి. వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు స్టేడియంపై విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా మొదలైన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఆట్టహాసంగా ముగిశాయి. భయపెట్టే కోవిడ్ కేసులు లేకుండా ముచ్చటపరిచే రికార్డులతో అలరించిన ఆటల షోకు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున తెరపడింది. 72 దేశాలకు చెందిన 4500 పైచిలుకు అథ్లెట్లు తమ ప్రదర్శనతో కామన్వెల్త్కు కొత్త శోభ తెచ్చారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ బర్మింగ్హామ్ ఆటలకు తెరపడిందని లాంఛనంగా ప్రకటించారు. 2026 ఆతిథ్య వేదిక విక్టోరియా (ఆస్ట్రేలియా)లో కలుద్దామని అన్నారు. భారతీయ భాంగ్రా స్టేడియాన్ని ఊపేసింది. భారత సంతతికి చెందిన సుప్రసిద్ధ గేయరచయిత, గాయకుడు ‘అపాచి ఇండియన్’గా ఖ్యాతి పొందిన స్టీవెన్ కపూర్ ‘భాంగ్రా’ పాటలను హుషారెత్తించే గళంతో పాడాడు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ , టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. -
కామన్వెల్త్ గేమ్స్లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం!
ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్ లీసా కీట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లండ్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన హెడ్కోచ్ పదవికి కీట్లీ రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లీగ్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడినప్పటికీ.. సెమీఫైనల్లో భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందింది. అదే విధంగా న్యూజిలాండ్తో జరిగిన కాంస్య పతక పోరులోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. దీంతో స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పటికీ క్రికెట్ విభాగంలో పతకం సాధించకుండానే ఇంగ్లండ్ తమ ప్రయాణాన్ని ముగించింది. కాగా కీట్లీ రెండున్నరేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కోచ్గా పనిచేసింది. ఆమె నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా మహిళల ప్రపంచ కప్-2022లో ఇంగ్లండ్ ఫైనల్కు చేరడంలో ఆమె కీలక పాత్ర పోషిచింది. ఇక కీట్లీకు కోచ్గా సెప్టెంబర్లో జరగనున్న ఇంగ్లండ్- భారత్ సిరీస్ అఖరిది కానుంది. ఈ సిరీస్ తర్వాత ఆమె తన బాధ్యతలనుంచి తప్పుకోనుంది. చదవండి: భారత్పై చెత్త రికార్డుకు కారణం మా జట్టు అత్యుత్సాహమే: పాక్ క్రికెటర్ -
CWG 2022: మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది.. కంగ్రాట్స్: కోహ్లి
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో సత్తా చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడాడు. మిమ్మల్ని చూసి భారతీయులంతా గర్వపడుతున్నారంటూ ప్రశంసించాడు. కాగా జూలై 29 నుంచి ఆగష్టు 8 వరకు ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ ఈసారి 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు సాధించింది. రెజ్లింగ్లో 12, వెయిట్లిఫ్టింగ్లో 10, అథ్లెటిక్స్లో 8, బాక్సింగ్లో 7, టేబుల్ టెన్నిస్లో 7, బ్యాడ్మింటన్లో 6, జూడోలో 3, హాకీలో 2, లాన్ బౌల్స్లో 2, స్వ్కాష్లో 2, టీ20 క్రికెట్లో 1, పారా పవర్లిఫ్టింగ్లో 1 మెడల్స్ వచ్చాయి. ఇలా మొత్తంగా 61 పతకాలు గెలిచిన భారత్.. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కోహ్లి.. మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించాడు. గొప్ప పురస్కారాలు అందించారు! ఈ మేరకు.. ‘‘మన దేశానికి గొప్ప పురస్కారాలు అందించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న, గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. జై హింద్’’ అంటూ కోహ్లి పతకధారుల ఫొటోను షేర్ చేశాడు. ఇక ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి భారత జట్టులో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యాటర్.. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్కు ఎంపికైన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లి.. ఈ టోర్నీలోనైనా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. You have brought great laurels for our country. Congratulations to all our winners and the participants of CWG 2022. We are so proud of you. Jai Hind 🇮🇳👏 pic.twitter.com/phKMn7MMdY — Virat Kohli (@imVkohli) August 9, 2022 చదవండి: Ravindra Jadeja: మంచి మనసు చాటుకున్న జడేజా భార్య.. ఏకంగా 101 ఖాతాలు.. ప్రధాని మోదీ ప్రశంసలు -
CWG 2022: పతకాల పట్టికలో 56 దేశాలు ఆమె వెనకే..!
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పింది. ఈ క్రీడల్లో 6 స్వర్ణాలు గెలిచిన ఎమ్మా.. పతకాల పట్టికలో 56 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించిన అథ్లెట్గా రికార్డు సృష్టించింది. ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాలు పాల్గొనగా.. కేవలం 13 దేశాలు మాత్రమే ఎమ్మాతో సమానంగా, అంత కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించాయి. ఎమ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా 67 స్వర్ణాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ (57), కెనడా (26), భారత్ (22), న్యూజిలాండ్ (20), స్కాట్లాండ్ (13), నైజీరియా (12), వేల్స్ (8), సౌతాఫ్రికా (7), మలేషియా (7), నార్త్రన్ ఐర్లాండ్ (7), జమైకా (6), కెన్యా (6) దేశాలు వరుసగా 2 నుంచి 13 స్థానాల్లో నిలిచాయి. ఎమ్మా (6 స్వర్ణాలు సహా 8 పతాకలు) ఈ 13 దేశాల తర్వాత 14వ స్థానంలో నిలిచింది. కాగా, ఎమ్మా గత మూడు కామన్వెల్త్ క్రీడల్లో ఏకంగా 14 స్వర్ణాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో 4 పసిడి పతకాలు సాధించిన ఈ బంగారు చేప.. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చదవండి: CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు -
తెలుగు తేజాలకు సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ అభినందనలు
కామన్వెల్త్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తొలిసారిగా స్వర్ణం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు. కాగా బర్మింగ్హామ్లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవంలో భారత్కు మొత్తంగా 61 పతకాలు లభించాయి. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. బంగారు రోజిది.. భారత బ్యాడ్మింటన్కు బంగారు రోజిది. కామన్వెల్త్లో అద్భుత విజయాలు సాధించిన సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు శుభాకాంక్షలు. దేశం గర్వపడేలా పతకాలు సాధించిన వారందరికీ నా అభినందనలు. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం Golden day for Indian Badminton! Congratulations to champions @pvsindhu1, @lakshya_sen and @srikidambi for their phenomenal victories at #CWG2022. My heartiest wishes to all the medal winners for making India proud. Keep shining 🇮🇳#Cheer4India — YS Jagan Mohan Reddy (@ysjagan) August 8, 2022 స్వర్ణం సాధించిన పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్లోనూ ఆమె ఇదే విజయపరంపర కొనసాగించాలి. – కె.చంద్రశేఖర రావు, తెలంగాణ సీఎం CM Sri K. Chandrashekar Rao has expressed happiness over Badminton player @Pvsindhu1 winning Gold in Women's Singles category at the @birminghamcg22. Hon'ble CM congratulated Ms. Sindhu and lauded her effort.#PVSindhu #CommonwealthGames2022 (File Photo) pic.twitter.com/IzyoGjPBQD — Telangana CMO (@TelanganaCMO) August 8, 2022 కాగా, కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలుపొందారు. (చదవండి: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు) -
CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Commonwealth Games 2022- బర్మింగ్హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. అవకాశం ఇవ్వకుండా.. అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది. లక్ష్యసేన్ సైతం.. అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో కాంస్యం... 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది. శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి. అభిమానులకు ధన్యవాదాలు: సింధు సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు PC: PV Sindhu Twitter సింధు ఘనతలు: ►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. ►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
షాకింగ్: కోవిడ్ నిర్ధారణ అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ క్రికెటర్
22వ కామన్వెల్త్ క్రీడలు ముగిసాక మహిళల క్రికెట్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పాజిటివ్గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబురాలు చేసుకుంది. భారత్తో ఫైనల్ మ్యాచ్కు ముందు స్టార్ ఆల్రౌండర్ తహ్లియా మెక్గ్రాత్కు కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా ఆసీస్ మేనేజ్మెంట్ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది. ఈ మ్యాచ్లో మెక్గ్రాత్ బ్యాటింగ్లో 2 పరుగులు, బౌలింగ్లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఏమంత ఆశాజనకమైన ప్రదర్శన చేయనప్పటికీ.. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్కు కోవిడ్ అని తెలిసినా ఆసీస్ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్ క్రీడాలోకం షాక్కు గురైంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసీస్ యాజమాన్యం వ్యవహరించిన తీరును అందరూ దుయ్యబడుతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్లేయర్ని ఐసోలేషన్కి తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా టీమిండియా క్రికెటర్లు సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ (కోవిడ్ సోకడంతో) ఆసీస్తో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్ మ్యాచ్లో మెక్గ్రాత్ని పక్కనబెట్టే సాహసం చేయడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆమె 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్తో 78 పరుగులు, అలాగే బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్లో ఉండటమే ఇందుకు కారణం. అంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో మెక్గ్రాత్ రాణించింది (2 వికెట్లు, 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు). ఇదిలా ఉంటే, కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా టెన్నిస్ స్టార్ జకోవిచ్ పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు ఉల్లంఘించాడని ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన జకోను ఘోరంగా అవమానించి, కేసులు కూడా పెట్టారు. చదవండి: ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
కామన్వెల్త్ గేమ్స్ హీరో శరత్ కమల్కు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం ఏంటి..?
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్. మచిలీపట్నంలో జననం తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మెరికల్లాంటి శిష్యులు శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్డ్ డబుల్స్లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు. మలుపు తిప్పిన చైన్నె శ్రీనివాసరావుకు చైన్నె ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్ఐఎస్లో కోచ్గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు. -
కామన్వెల్త్ గేమ్స్లో మెరిసిన అమలాపురం బుల్లోడు
Amalapuram Satwiksairaj Rankireddy: అమలాపురం కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్శెట్టితో కలిసి ఇంగ్లండ్ జట్టుపై సునాయాస విజయం సాధించాడు. కామన్వెల్త్ డబుల్స్ వ్యక్తిగత విభాగంలో తొలిసారి స్వర్ణ పతకంతో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే ఇదే క్రీడల టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన సాత్విక్.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా డబుల్ ధమాకా కొట్టినట్టయ్యింది. 2018 కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాత్విక్ స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. అయితే అప్పుడు టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించగా, ఇప్పుడు ఫలితం తారుమారైంది. మూడు నెలలు.. మూడు పతకాలు సాత్విక్ క్రీడా జీవితంలో ఇప్పుడు స్వర్ణయుగమనే చెప్పాలి. గడచిన మూడు నెలల్లో అతడి బ్యాడ్మింటన్ రాకెట్కు తిరుగులేకుండా పోయింది. మే నెలలో ప్రతిష్టాత్మక థామస్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో సాత్విక్ ఆడిన విషయం తెలిసిందే. థామస్ కప్ చరిత్రలోనే భారత జట్టు సాధించిన అతి పెద్ద విజయం ఇది. మూడు నెలలు గడవకుండానే కామన్వెల్త్లో స్వర్ణం, రజతం సాధించడం ద్వారా మూడు నెలల్లో అంతర్జాతీయంగా మూడు అత్యుత్తమ పతకాలు సాధించిన ఘనతను సాత్విక్ సొంతం చేసుకున్నాడు. జీవితాశయం చేజారినా.. కుంగిపోకుండా.. గత ఏడాది జపాన్లో జరిగిన ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్శెట్టితో కలిసి మూడు మ్యాచ్లకు గాను రెండు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో సాత్విక్ జంట ఏదో ఒక పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం తృటిలో చేజారినా అతడు కుంగిపోలేదు. ఒలింపిక్స్ తరువాత ఫ్రాన్స్లో జరిగిన సూపర్–750లో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇండియన్ ఓపెన్–500 విజేతగా నిలిచాడు. Thankyou so much sir 🙏🏻 https://t.co/XR11LSRPLU — Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) August 5, 2022 సంబరాల్లో కుటుంబ సభ్యులు సాత్విక్ ఘన విజయంతో అతడి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. సాత్విక్ గెలిచిన వెంటనే అతడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, రంగమణి దంపతులు కేక్ కట్ చేసి పంచుకున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఆర్డీఓ బి.వసంతరాయుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి చుండ్రు గోవిందరాజు, ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సూర్యనారాయణలు వారిని అభినందించారు. మన పిల్లలు బాగా ఆడారు ఈ రోజు భారత్ బ్యాడ్మింటన్కు మంచి రోజు. మన పిల్లలు సాత్విక్, చిరాగ్శెట్టి, మహిళా సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ స్వర్ణ పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. సాత్విక్ తండ్రిగా కన్నా అభిమానిగానే ఆటను ఆస్వాదించాను. ఈ విజయం ఊహించిందే. అయినా గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చింది. - రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్, సాత్విక్ తండ్రి -
పతకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే..!
బర్మింగ్హామ్లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవం సోమవారంతో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి 66 పతకాలు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. అయితే గోల్డ్కోస్ట్ గేమ్స్లో షూటింగ్ క్రీడాంశంలో భారత్ ఏకంగా 16 పతకాలు సొంతం చేసుకుంది. బర్మింగ్హామ్లో షూటింగ్ క్రీడాంశాన్ని నిర్వహించలేదు. ఫలితంగా భారత్ పతకాల ర్యాంక్లో ఒక స్థానం పడిపోయింది. ఒకవేళ షూటింగ్ కూడా బర్మింగ్హామ్ గేమ్స్లో ఉండి ఉంటే భారత్ పతకాల సంఖ్యలోనూ, తుది ర్యాంక్లోనూ మరింత మెరుగయ్యేది. -
నీరజ్ చోప్రా గైర్హాజరీలో చెలరేగిన నదీమ్.. 56 ఏళ్ల పాకిస్తాన్ నిరీక్షణకు తెర
కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అద్భుతం చేశాడు. ఫైనల్లో నదీమ్ జావెలిన్ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో జావెలిన్ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్గా గుర్తింపు పొందాడు. 2017లో చైనీస్ తైపీ అథ్లెట్ 91.36 మీటర్ల దూరం విసిరాడు. నదీమ్ ప్రదర్శనతో పాక్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో పతకం గెలిచింది. ఇదిలా ఉంటే భారత స్టార్, వరల్డ్ నంబర్ వన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయం కారణంగా చివరి నిమిషంలో కామన్వెల్త్ క్రీడల బరిలో నుంచి తప్పుకోవడం నదీమ్కు కలిసొచ్చింది. నీరజ్ గైర్హాజరీలో నదీమ్ చెలరేగాడు. కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాక్ కల సాకారం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నదీం నాలుగో స్థానంలో నిలువగా.. నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని (రెండో స్థానం) గెల్చుకున్నాడు. నీరజ్ అదే ఊపులో కామన్వెల్త్ బరిలోకి దిగి ఉంటే అలవోకగా 90 మీటర్ల దూరం విసిరేవాడు. ఏదిఏమైనప్పటికీ నీరజ్ కామన్వెల్త్ క్రీడల బరిలో లేకపోవడంతో పాక్ 56 ఏళ్ల కల నెరవేరింది. కాగా, నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చరిత్రలో భారత్కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2003లో మహిళల లాంగ్జంప్లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్మ్యాన్ ప్రోమో -
commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’
శరత్ కమల్ తొలి కామన్వెల్త్ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్హామ్ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్డ్లో ఇంకా ఫైనల్ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్ అయిన ఆయన ప్రతీ మ్యాచ్లో, ప్రతీ పాయింట్కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. చివరకు నేను పాయింట్ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్ అన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడాను. నా కోచ్ సోమ్నాథ్ ఘోష్కు శరత్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా శరత్ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్డ్ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’ -
Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్’ కాలం
2006 – మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు – టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్జెల్పై విజయంతో స్వర్ణం... 2022 – బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలు– సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్పై విజయంతో స్వర్ణం... ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్ ఆటగాడే ఆచంట శరత్ కమల్. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే... వరుసగా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని శరత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్ కమల్ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు. కొత్త కుర్రాడిలాగే... సుదీర్ఘ కాలంగా భారత టేబుల్ టెన్నిస్ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచి శరత్ కమల్ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. -
ఫైనల్లో ఓటమి.. భారత హాకీ జట్టుకు రజతం
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకం సాధించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో 0-7 తేడాతో భారత్ ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. తొలి క్వార్టర్ నుంచే భారత్పై ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించింది. ఏ దశలోను ఆస్ట్రేలియాకు భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు క్వార్టర్స్లో ఆస్ట్రేలియా 7 గోల్స్ సాధించగా.. భారత్ కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా తరపున టామ్ విక్హామ్, బ్లేక్ గోవర్స్, ఫిన్ ఒగిల్వీ, నాథన్ ఎఫ్రామ్స్, నాథన్ ఎఫ్రామ్స్ గోల్స్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా బంగారు పతకం తమ ఖాతాలో వేసుకుంది. కాగా కామన్వెల్త్ గేమ్స్ హాకీలో ఇది ఆస్ట్రేలియాకు ఏడో పతకం కావడం గమనార్హం. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత మ్యాచ్లు ముగిశాయి. కామన్వెల్త్ గేమ్స్-2022 పతకాల పట్టికలో 61 మెడల్స్తో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 గోల్డ్ మెడల్స్,16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
టేబుల్ టెన్నిస్లో భారత్కు మరో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్-2022 అఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్పై 4-1తో కమల్ విజయం సాధించాడు. ఇక ఓవరాల్గా అఖరి రోజు భారత్కు ఇది ఐదో పతకం. అంతకుముందు పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ కాంస్య పతక పోరులో జ్ఞానశేఖరన్ సాతియన్ విజయం సాధించాడు. భారత్ ఇప్పటి వరకు 22 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 60 మెడల్స్తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
CWG 2022:భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి
కామన్ వెల్త్ గేమ్స్-2022లో అఖరి రోజు భారత్ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. బర్మింగ్హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన బెన్ లేన్- సీన్ వెండీ జోడీని 21-15, 21-13 తేడాతో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి ఓడించారు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. భారత్ ఇప్పటి వరకు 21 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 59 మెడల్స్తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: Lakshya Sen: బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం.. -
CWG 2022: బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్ ఎన్జీ జీ యోంగ్ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. తడబడినా.. ఇక లక్ష్య సేన్ సోమవారం నాటి మెన్స్ సింగిల్స్ ఫైనల్లో మలేషియా షట్లర్ ఎన్జీ జీ యోంగ్తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన మొదటి గేమ్లో లక్ష్య సేన్ 19-21తో వెనుకబడ్డాడు. అయితే, రెండో గేమ్లో పుంజుకున్న అతడు 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇక ఆఖరి గేమ్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 21-16తో లక్ష్య సేన్ యోంగ్ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. కాగా లక్ష్య సేన్ గెలుపుతో భారత్ ఖాతాలో 20వ పసిడి పతకం చేరింది. దిగ్గజాల సరసన.. వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇదే మొదటి టైటిల్. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్లు ప్రకాశ్ పదుకొణె(1978), సయ్యద్ మోదీ(1982), పారుపల్లి కశ్యప్(2014) తదితరుల సరసన నిలిచాడు. ఇక భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. గత మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన టీమిండియా రజతంతో సరిపెట్టుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవడంతో స్వర్ణం గెలవాలన్న ఆశలు నెరవేరలేదు. ఇదిలా ఉంటే.. భారత్ ఇప్పటి వరకు 20 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 58 మెడల్స్తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: PV Sindhu Gold Medal: చాంపియన్లకే చాంపియన్.. గోల్డెన్ గర్ల్.. క్వీన్.. సింధుపై ప్రశంసలు Asia Cup 2022: ఆసియా కప్కు భారత జట్టు.. అయ్యర్కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
CWG 2022- PV Sindhu: చాంపియన్లకే చాంపియన్.. ఈ ‘క్వీన్’ ముందు తలవంచాల్సిందే!
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న ఈ తెలుగు తేజం గెలుపును యావత్ భారతావని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సింధు గెలుపును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చాంపియన్లకే చాంపియన్ ‘‘పీవీ సింధు చాంపియన్లకే చాంపియన్! ఎప్పటికప్పుడు తన ప్రతిభా పాటవాలను చాటుకుంటూనే ఉంది. ఆట పట్ల తన అంకితభావం, నిబద్ధత స్ఫూర్తిదాయకం. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన సింధుకు శుభాభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ప్రధాని మోదీ సింధును విష్ చేశారు. అదే విధంగా కేంద్ర క్రీడా శాఖా మాజీ మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరన్ రిజిజు సైతం పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. సింధు విజయాన్ని కీర్తిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా సింధును సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పీవీ సింధును అభినందించారు. కాగా అపూర్వ విజయం నేపథ్యంలో పీవీ సింధు పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగి పోతోంది. ఆమె రాణి.. తన ముందు తలవంచాల్సిందే! నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆమె ముందు మనం తలవంచాలా? అవును కచ్చితంగా.. ఎందుకంటే తను రాణి. గోల్డెన్ గర్ల్ సింధు.. నువ్వు భారతావనిని మరోసారి తలెత్తుకునేలా చేశావు’’ అంటూ విష్ చేశాడు. చదవండి: Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్మ్యాన్ ప్రోమో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The phenomenal @Pvsindhu1 is a champion of champions! She repeatedly shows what excellence is all about. Her dedication and commitment is awe-inspiring. Congratulations to her on winning the Gold medal at the CWG. Wishing her the best for her future endeavours. #Cheer4India pic.twitter.com/WVLeZNMnCG — Narendra Modi (@narendramodi) August 8, 2022 Pride of India, @Pvsindhu1 creates history by winning the Gold Medal in #CommonwealthGames2022 ! She won Bronze in Glasgow 2014, Silver in Gold Coast 2018 and now GOLD!! Congratulations Sindhu for making India proud once again! #Cheer4India 🇮🇳 #CWG2022 pic.twitter.com/El8YRUo5zT — Kiren Rijiju (@KirenRijiju) August 8, 2022 Should we bow? Yes, she's a Queen 🙌🏽 🏅 Congratulations to Golden girl @Pvsindhu1 you make India proud 🇮🇳 #CWG22india pic.twitter.com/mn1wgEkifH — Wasim Jaffer (@WasimJaffer14) August 8, 2022 The unstoppable #PVSindhu First Gold Medal for her in Commonwealth Games in Singles Event. She won the finals in style. The nation is applauding the untiring efforts of @Pvsindhu1. Heartiest congratulations to her. pic.twitter.com/52iQRUO4eT — Y. Satya Kumar (@satyakumar_y) August 8, 2022 -
బ్యాడ్మింటన్ సింగిల్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన సింధు
-
CWG 2022: సింధు సాధించింది.. స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి పతకం గెలిచి మరో ప్రతిష్టాత్మక టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా బర్మింగ్హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది. ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ (21-15, 21-13) ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ వరుస సెట్లలో పైచేయి సాధించి విజేతగా నిలిచింది. ఇక కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజత పతకాలను సింధు గెలిచింది. 2018లో సింధు ఫైనల్ చేరినా.. తుదిపోరులో మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: CWG 2022 Womens Doubles Badminton: కాంస్యం నెగ్గిన గోపిచంద్ తనయ -
ఆఖరి రోజు 5 స్వర్ణాలు, ఓ కాంస్యంపై భారత్ గురి.. సింధు సహా పురుషుల హాకీపై గంపెడాశలు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడలు చివరిదశకు చేరుకున్నాయి. ఇవాల్టితో (ఆగస్ట్ 8) ఈ మహా సంగ్రామం ముగియనుంది. క్రీడల ఆఖరి రోజు భారత్ మరో ఆరు పతకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు (10వ రోజు) భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్యసేన్, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ, పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్, పురుషుల హాకీ టీమ్ స్వర్ణం కోసం పోరడనుండగా.. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్లో సాథియాన్ జ్ఞానశేఖరన్ కాంస్యం కోసం ఇంగ్లండ్కు చెందిన పాల్ డ్రింక్హాల్తో తలపడనున్నాడు. 11వ రోజు భారత షెడ్యూల్ ఇదే.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20) పీవీ సింధు వర్సెస్ మిచెల్ లీ (కెనడా) పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 ) లక్ష్య సేన్ వర్సెస్ జే యోంగ్ ఎన్జీ (మలేషియా) పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు) సాత్విక్ సాయి రాజ్-చిరాగ్ శెట్టి వర్సెస్ బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35) సాథియాన్ జ్ఞానశేఖరన్ వర్సెస్ పాల్ డ్రింక్హాల్ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 4.25) ఆచంట శరత్ కమల్ వర్సెస్ లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) పురుషుల హాకీ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, ప్రస్తుత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇవాళ ఆరు పతకాలు (5 స్వర్ణాలు , కాంస్యం) సాధించినా (55+6=61) 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ రికార్డును (66 పతకాలు (26 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్)) బద్దలు కొట్టే అవకాశం లేదు. వీటిలో రెండు స్వర్ణాలు గెలిచినా పతకాల పట్టికలో న్యూజిలాండ్ను (48 పతకాలు (19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు)) వెనక్కునెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (170), ఇంగ్లండ్ (165), కెనడా (87) తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ రికార్డు స్థాయిలో 101 మెడల్స్ సాధించింది. ఇప్పటికీ భారత్కు అదే అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: బాక్సింగ్లో మరో పతకం.. సాగర్ అహ్లావత్కు రజతం -
బాక్సింగ్లో మరో పతకం.. సాగర్ అహ్లావత్కు రజతం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్లో భారత పోరాటం ముగిసింది. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లావత్ రజతం సాధించడంతో బాక్సింగ్లో భారత ప్రస్థానం సమాప్తమైంది. పదో రోజు సాగర్ అహ్లావత్.. ఇంగ్లండ్కు చెందిన డెలిసియస్ ఓరీ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. సాగర్ పతకంతో బాక్సింగ్లో భారత పతకాల సంఖ్య ఏడుకు (3 గోల్డ్, సిల్వర్, 3 బ్రాంజ్) చేరింది. ఓవరాల్గా 10వ రోజు ముగిసే సమాయానికి భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) చేరాయి. చదవండి: IND VS WI 5th T20: ఆఖరి పోరులోనూ భారత్దే గెలుపు -
కాంస్యం నెగ్గిన గోపిచంద్ తనయ
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత షట్లర్ల హవా కొనసాగుతోంది. పురుషుల, మహిళల సింగల్స్లో లక్ష్యసేన్, పీవీ సింధు.. పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ ఇదివరకే ఫైనల్కు చేరగా.. పదో రోజు ఆఖర్లో పురుషుల సింగల్స్లో కిదాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్లో ట్రీసా జాలీ, పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి గోపిచంద్ జోడీ కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో ట్రీసా-గాయత్రి ద్వయం.. ఆస్ట్రేలియాకు చెందిన చెన్ సుయాన్ యు వెండి-గ్రోన్యా సోమర్విల్లే జోడీపై 21-15, 21-19 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ట్రీసా-గాయత్రి ద్వయం ఇదే ఎడిషన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం నెగ్గిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ట్రీసా-గాయత్రి జోడీ కాంస్యంతో బ్యాడ్మింటన్లో భారత పతకాల సంఖ్య 3కు (రజతం, 2 కాంస్యాలు), ఓవరాల్గా భారత పతకాల సంఖ్య 54కు చేరింది. చదవండి: కాంస్యం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య.. భారత్ ఖాతాలో 50వ పతకం -
భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ హవా
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్హాల్–లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్హాల్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు. పోరాడి ఓడిన శ్రీజ మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. -
16 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో పతకం, అంబరాన్ని అంటిన సంబురాలు.. వైరల్ వీడియో
గోల్కీపర్, కెప్టెన్ సవిత పూనియా అన్నీ తానై అడ్డుగోడలా నిలబడటంతో... 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్ దాకా వెళ్లిన భారత్... కెప్టెన్ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్’లో 2–1తో న్యూజిలాండ్పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. Watch | Indian women's hockey team celebrates their victory in the Bronze medal match in #CommonwealthGames2022 @Media_SAI@YASMinistry | @TheHockeyIndia#CWG2022 | #Cheer4India pic.twitter.com/MWGvsDsruM— DD News (@DDNewslive) August 7, 2022 ఆట 29వ నిమిషంలో సలీమా టెటె చేసి గోల్తో 1–0తో ఆఖరి దాకా ఆధిక్యంలో నిలిచిన భారత్... ఇంకొన్ని క్షణాల్లో మ్యాచ్ గెలిచేందుకు సిద్ధమైపోయింది. 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా... కివీస్కు పెనాల్టీ కార్నర్ లభించగా ఒలీవియా మెర్రీ (60వ ని.) దాన్ని గోల్గా మలిచింది. 1–1తో సమంకాగా, షూటౌట్ అనివార్యమైంది. భారత బృందంలో తొలి షాట్లో సంగీత గురి తప్పగా... రెండు, మూడు షాట్లలో సోనిక, నవనీత్ స్కోరు చేశారు. నాలుగో షాట్లో నేహా విఫలమైంది. న్యూజిలాండ్ జట్టులో తొలి షాట్ను మేగన్ హల్ మాత్రమే గోల్పోస్ట్లోకి తరలించగా... మిగతా నాలుగు షాట్లను రాల్ఫ్ హోప్, రోజ్ టైనన్, కేటీ డోర్, ఒలీవియా షనన్ల షాట్లను సవిత అడ్డుకుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో భారత్కిది మూడో పతకం. 2002 గేమ్స్లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది. -
కాంస్యం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య.. భారత్ ఖాతాలో 50వ పతకం
కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్–దీపిక పల్లికల్ జంట భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సౌరవ్–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్–కామెరాన్ పిలె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి కాంస్యం నెగ్గింది. తద్వారా భారత్ ఖాతాలో 50వ పతకం చేరింది. ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లైన దీపిక పల్లికల్.. ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య అన్న విషయం తెలిసిందే. -
హర్మాన్ పోరాటం వృధా.. ఉత్కంఠ పోరులో ఆసీస్ చేతిలో టీమిండియాకు పరాభవం
CWG 2022 Womens Cricket Final: కామన్వెల్త్ గేమ్స్లో ఈసారి ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (61; 8 ఫోర్లు), మెగ్ లానింగ్ (36; 5 ఫోర్లు, 1 సిక్స్), అష్లే గార్డ్నెర్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ] భారత బౌలర్లలో రేణుక సింగ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత మహిళల జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్ (65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. మహిళల క్రికెట్లో రజతంతో భారత పతకాల సంఖ్య 52కు చేరింది. -
బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన తెలంగాణ బిడ్డ
-
కాంస్యంతో సరిపెట్టుకున్న శ్రీకాంత్.. సింధుకు ‘స్వర్ణా’వకాశం
కామన్వెల్త్ గేమ్స్లో తెలుగు తేజం సింధు ఖాతాలో సింగిల్స్ విభాగం పసిడి పతకమే బాకీ ఉంది. గత ఈవెంట్లో స్వర్ణం గెలిచినప్పటికీ అది మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వచ్చింది. సింగిల్స్లో గ్లాస్గో (2014) లో కాంస్యం, గోల్డ్కోస్ట్ (2018)లో రజతం నెగ్గిన ఆమెకు ఇప్పుడు స్వర్ణావకాశం మళ్లీ వచ్చింది. బర్మింగ్హామ్ ఈవెంట్లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్లో ఆమె 21–19, 21–17తో యో జియా మిన్ (సింగపూర్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సంపాదించింది. పురుషుల సింగిల్స్లో స్టార్ లక్ష్య సేన్ కూడా పసిడి వేటకు సిద్ధమవగా... కిడాంబి శ్రీకాంత్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 21–18తో జియా హెంగ్ తె (సింగపూర్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 51కి చేరింది. సెమీఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 18–21, 21–16తో జియా హెంగ్ టె (సింగపూర్)పై గెలుపొందగా, శ్రీకాంత్ 21–13, 19–21, 10–21తో తే యంగ్ ఎంజ్ (మలేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–6, 21–15తో చెంగ్ పెంగ్ సున్–టియాన్ కియన్ మెన్ (మలేసియా) జంటపై గెలిచి పసిడి పోరుకు సిద్ధమైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 18–21తో తాన్ కూంగ్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచింది. -
Commonwealth Games 2022: కనకాభిషేకం
బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్లో రజతం పతకంతో మెరిసింది. బర్మింగ్హామ్: పంచ్ పంచ్కూ పతకం తెచ్చి కామనెŠవ్ల్త్ గేమ్స్లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్ను కనబరిచింది. ఈ గేమ్స్లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో నిఖత్ పంచ్ల ధాటికి రిఫరీ బౌట్ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు. -
రజతంతో సరిపెట్టుకున్న శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో అచంట శరత్ కమల్-జ్ఞానశేఖరన్ సతియాన్ ద్వయం.. ఇంగ్లండ్ జోడీ లియామ్ పిచ్ఫోర్డ్-పాల్ డ్రింక్హాల్ చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లీష్ జోడీ 8-11, 11-8, 11-3, 7-11, 11-4తేడాతో భారత ద్వయంపై విజయం సాధించి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లోనూ ఇంగ్లండ్ జోడీ.. భారత జోడీపై దాదాపు ఇదే తరహాలో విజయం సాధించింది. నాడు డిసైడింగ్ గేమ్లో ఇంగ్లండ్ 11-8 తేడాతో నెగ్గగా.. ఇప్పుడు 11-4 తేడాతో విజయం సాధించింది. టీటీలో శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 49కి (17 స్వర్ణాలు, 13 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 9 పతకాలు చేరాయి. చదవండి: పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్ -
పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ ఒక్క రోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసిరాడు. తాజాగా మహిళల 48-50 కేజీల లైట్ ఫ్లై విభాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరో స్వర్ణం సాధించింది. HAR PUNCH MEIN JEET! 🔥🔥🔥 Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022 Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQy — SAI Media (@Media_SAI) August 7, 2022 ఫైనల్లో జరీన్.. నార్త్రన్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్నౌల్ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్కు మూడో బాక్సింగ్ స్వర్ణాన్ని అందించింది. జరీన్ పసిడి పంచ్తో బాక్సింగ్లో భారత్ పతకాల సంఖ్య 5కు (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) చేరగా, ఓవరాల్గా భారత పతకాల సంఖ్య 48కి (17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. పురుషుల ఫెదర్వెయిట్ 57 కేజీల విభాగంలో మహ్మద్ హుస్సాముద్దీన్, పురుషుల 67 కేజీల వెల్టర్వెయిట్ విభాగంలో రోహిత్ టోకాస్లు ఇదివరకే కాంస్య పతకాలు గెలిచారు. కాగా, జరీన్.. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లోనూ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్.. భారత్కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. చదవండి: జావెలిన్ త్రోలో తొలి పతకం.. చరిత్ర సృష్టించిన అన్నూ మాలిక్ -
జావెలిన్ త్రోలో తొలి పతకం.. చరిత్ర సృష్టించిన అన్నూ మాలిక్
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జాతరను కొనసాగిస్తుంది. ఇప్పటికే భారత్ ఖాతాలో 46 పతకాలు ఉండగా.. తాజాగా మరో మెడల్ వచ్చి చేరింది. ప్రస్తుత క్రీడల్లో జావెలిన్ త్రోలో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల కేటగిరీలో అన్నూ రాణి జావెలిన్ను 60.03 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం గెలిచింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో భారత్కు ఇదే తొలి పతకం కాగా, ఓవరాల్గా (మహిళలు, పురుషులు) మూడవది. అన్నూ మెడల్తో భారత్ పతకాల సంఖ్య 47కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ పతకాల సంఖ్య ఏడుకు (3 స్వర్ణాలు, రజతం, 3 కాంస్యాలు) చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, ట్రిపుల్ జంప్లో ఎల్దోస్ పాల్ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీ, పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్లో సందీప్ కుమార్, మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాలు గెలిచారు. చదవండి: అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్ వాక్లో మరో పతకం -
అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్ వాక్లో మరో పతకం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే ఓ స్వర్ణం (పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్దోస్ పాల్), 4 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్ఛేజ్లో అవినాష్సాబ్లే, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్), ఓ కాంస్యం (పురుషుల హై జంప్లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో పతకం చేజిక్కించుకున్నారు. పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్స్లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రేస్ని 38:49.21 నిమిషాల్లో ముగించిన సందీప్.. మూడో స్థానంలో నిలువగా, కెనడాకు చెందిన ఎవాన్ డన్ఫీ (38:36.37 నిమిషాల్లో) స్వర్ణం, ఆస్ట్రేలియాకు చెందిన డెక్లాన్ టింగే (38:42.33 నిమిషాల్లో) రజతం సాధించారు. ఈ ఎడిషన్లో రేస్ వాక్లో భారత్కి ఇది రెండో మెడల్. మహిళల 10 కిలో మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించింది. సందీప్ బ్రాంజ్తో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య 7కు, ఓవరాల్గా భారత పతకాల సంఖ్య 46కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 18 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ పతకాల సంఖ్య ఆరుకు (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు)చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, ట్రిపుల్ జంప్లో ఎల్దోస్ పాల్ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీలో కాంస్యం, తాజాగా సందీప్ కుమార్ పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్లో కాంస్యం గెలిచారు. చదవండి: చరిత్ర సృష్టంచిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్లో స్వర్ణం, రజతం మనవే -
చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్లో స్వర్ణం, రజతం మనవే
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే 3 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్ఛేజ్లో అవినాష్సాబ్లే), ఓ కాంస్యం (పురుషుల హై జంప్లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో రెండు పతకాలు చేజిక్కించుకున్నారు. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్దోస్ పాల్ స్వర్ణం (మూడో ప్రయత్నంలో 17.03 మీటర్లు), ఇదే ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం (ఐదో ప్రయత్నంలో 17.02 మీటర్లు) సాధించి కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీరిద్దరు ఒకే ఈవెంట్లో గోల్డ్, సిల్వర్ సాధించడంతో భారత్ కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. గతంలో ఈ క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో ఒకే ఈవెంట్లో భారత్ ఎన్నడూ స్వర్ణం, రజతం సాధించింది లేదు. ఇదే ఈవెంట్లో భారత్ కాంస్యం గెలిచే అవకాశాన్ని కూడా తృటిలో చేజార్చుకుంది. ప్రవీన్ చిత్రవేళ్ (16.89మీ, నాలుగో స్థానం) 0.03 మీటర్ల మార్జిన్తో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. బెర్ముడాకు చెందిన జా-నై పెరిన్చీఫ్ 16.92 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం సాధించాడు. ఎల్దోస్ పాల్ స్వర్ణం (కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఆరో స్వర్ణం), అబ్దుల్లా రజతంతో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరగా, ఓవరాల్గా భారత పతకాల సంఖ్య 45కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ వరుసగా స్వర్ణ పతకాలు సాధిస్తుంది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పతకాలు సాధించారు. తాజాగా ట్రిపుల్ జంప్లో ఎల్దోస్ పాల్ కూడా స్వర్ణం సాధించడంతో ఇవాళ భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఇదే రోజు భారత్ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్.. న్యూజిలాండ్పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. చదవండి: మరో పసిడి పంచ్.. బాక్సింగ్లో భారత్కు రెండో స్వర్ణం -
మరో పసిడి పంచ్.. బాక్సింగ్లో భారత్కు రెండో స్వర్ణం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు రెచ్చిపోతున్నారు. పురుషుల ఫెదర్వెయిట్ 57 కేజీల విభాగంలో మహ్మద్ హుస్సాముద్దీన్, పురుషుల 67 కేజీల వెల్టర్వెయిట్ విభాగంలో రోహిత్ టోకాస్లు ఇదివరకే కాంస్య పతకాలు గెలువగా.. పదో రోజు క్రీడల ఆరంభంలోనే మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్ స్వర్ణంతో మెరిసింది. నీతూ పసిడి గెలిచిన నిమిషాల వ్యవధిలోనే భారత్ బాక్సింగ్లో మరో స్వర్ణం సాధించింది. పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసిరాడు. అమిత్ ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్ కియరన్ మెక్డొనాల్డ్ను 5-0 తేడా మట్టికరిపించి భారత్ స్వర్ణాల సంఖ్యను 15కు, ఓవరాల్ పతకాల సంఖ్యను 43కు (15 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలు) పెంచాడు. ఇదే రోజే భారత్ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్.. న్యూజిలాండ్పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. చదవండి: పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం -
పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం
CWG 2022: బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. తొమ్మిదో రోజు వరకు మొత్తం 40 పతాకలు (13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించిన భారత్.. పదో రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పతకాల సంఖ్యను 43కు పెంచుకుంది. మహిళల బాక్సింగ్ 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసరగా.. మహిళల హాకీలో భారత్ కాంస్యం చేజిక్కించుకుంది. సెమీస్లో (ఆస్ట్రేలియా) అంపైర్ తప్పిదం కారణంగా స్వర్ణం లేదా రజతం గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన భారత మహిళా హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో అసమాన పోరాట పటిమ కనబర్చి పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్ కొద్ది సెకెన్లలో (18 సెకెన్లలో) ముగుస్తుందనగా న్యూజిలాండ్ గోల్ చేసి 1-1తో స్కోర్ను సమం చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున సోనికా, నవ్నీత్ కౌర్ గోల్స్ సాధించగా.. కివీస్ తరఫున మెగాన్ హల్ మాత్రమే గోల్ చేయగలిగింది. చదవండి: Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు -
భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు పతకాలు మోత మోగిస్తున్నారు. తాజాగా 10వ రోజు భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చి చేరాయి. మహిళల 48 కేజీల విభాగంలో భారత బాక్సర్ నీతు ఘంగాస్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ల్లో ఇంగ్లండ్కు చెందిన డెమీ-జేడ్పై 5-0తేడాతో నీతు విజయం సాధించింది. తన పాల్గొంటున్న తొలి కామన్వెల్త్ గేమ్స్లోనే నీతు పతకం సాధించడం గమనార్హం. కాగా కామన్వెల్త్ గేమ్స్-2022లో బాక్సింగ్లో భారత్కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు పురుషుల 51 కేజీల విభాగంలో బాక్సర్ అమిత్ పంఘల్ కూడా గోల్డ్మెడల్ సాధించాడు. ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్ కియారన్ మక్డొనాల్డ్ను 0-5 ఓడించి పంఘల్ పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 42 పతకాలు చేరాయి. చదవండి: CWG 2022- PV Sindhu: ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు -
CWG 2022: ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు.. ‘పసిడి’కి అడుగు దూరంలో..
CWG 2022- PV Sindhu Enters Final: కామన్వెల్త్ గేమ్స్-2022లో బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సెమీస్లో సింగపూర్ షట్లర్ ఇయో జియా మిన్ను ఓడించి ఫైనల్ చేరింది. కాగా క్వార్టర్ ఫైనల్లో సింధు మలేషియా షట్లర్ గో వె జిన్ను 19-21, 21-14, 21-18తో ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బర్మింగ్హామ్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్లో సింధు జియాతో సెమీస్లో పోటీపడింది. గాయం వేధిస్తున్నా.. హోరాహోరీగా సాగిన పోరులో సింధు ఆఖరికి పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా తన అనుభవంతో ఒత్తిడిని జయించి పీవీ సింధు 21-19, 21-17తో గెలుపు నమోదు చేసింది. తద్వారా ఈ భారత షట్లర్ కామన్వెల్త్ గేమ్స్-2022 ఫైనల్లో ప్రవేశించింది. కాగా సింధు ఈ ఫీట్ నమోదు చేయడం వరుసగా ఇది రెండోసారి. అంతేకాదు.. తాజా ప్రదర్శనతో ఆమె ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా 2018 కామన్వెల్త్ గేమ్స్లో సింధు రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2014లో కాంస్య పతకం అందుకుంది. ఇక ఇప్పుడు స్వర్ణ పతకానికి గురిపెట్టింది పూసర్ల వెంకట సింధు. ఈ క్రమంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ వేదికగా సింధును అభినందించాడు. భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారంటూ పీవీ సింధుతో పాటు కాంస్యం గెలిచిన జట్టులో భాగమైన హాకీ ప్లేయర్ సవితా పునియా, స్వర్ణం గెలిచిన బాక్సర్ నీతూ ఘంగస్ను కొనియాడాడు. ఈ మేరకు భారత మహిళా అథ్లెట్లు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని ప్రశంసించాడు. చదవండి: Rohit Sharma: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. 5 క్లీన్స్వీప్లు.. నువ్వు తోపు కెప్టెన్! CWG 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు! PV Sindhu, Savita Punia, Nitu Ghanghas..Across sports, so many stars. India's women athletes are doing us proud. — Harsha Bhogle (@bhogleharsha) August 7, 2022 -
కామన్వెల్త్ గేమ్స్.. 10వ రోజు భారత్ షెడ్యూల్ ఇదే!
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా తొమ్మిదో రోజు(శనివారం) అథ్లెట్లు 11 పతకాలతో సత్తా చాటారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ పతకాల పట్టికలో 40 మెడల్స్తో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక 10వరోజు కూడా భారత క్రీడాకారులు సత్తాచాటడానికి సిద్దమయ్యారు. కామెన్వెల్త్ గేమ్స్లో 10వ రోజు భారత్ షెడ్యూల్ హాకీ ఉమెన్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.30 నుంచి) ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 2.20) పీవీ సింధు మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10) లక్ష్య సేన్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10) కిదాంబి శ్రీకాంత్ మహిళల డబుల్స్ సెమీ ఫైనల్ ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ (సాయంత్రం 4 గంటలు) పురుషుల డబుల్స్ సెమీఫైనల్ చిరాగ్ శెట్టి/సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి (సాయంత్రం 4.50) అథ్లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ (మధ్యాహ్నం 2.45 ) అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీన్ చిట్రివేల్ మెన్స్ 10000 మీటర్ల రేజ్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3.50) సందీప్ కుమార్ ఉమెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (సాయంత్రం 4.05) శిల్ప రాణి, అన్నూ రాణి ఉమెన్స్ 4 *100 రిలే ఫైనల్ (సాయంత్రం 5.24) మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (ఆదివారం అర్థరాత్రి) రోహిత్ యాదవ్, డీపీ మను మెన్స్ 4 * 100 రిలేజ్ ఫైనల్ ఆదివారం అర్ధరాత్రి బాక్సింగ్ ఉమెన్స్ 48 కేజీలు ఫైనల్(మధ్యాహ్నం 3 గంటలకు) - నీతు గంగహాస్ మెన్స్ 51 కేజీలు ఫైనల్ మధ్యాహ్నం 3.15 గంటలకు - అమిత్ పంగల్ ఉమెన్స్ 50 కేజీలు ఫైనల్ రాత్రి 7 గంటలకు - నిఖత్ జరీన్ టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35) మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15) ఆచంట శరత్ కమల్, జి సత్యన్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ ఆచంట శరత్ కమల్( రాత్రి 9.50) సత్యన్ జ్ఞానశేఖరన్ ( రాత్రి 10.40) మిక్స్ డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఆదివారం అర్ధరాత్రి ) ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల క్రికెట్ ఉమెన్స్ టీ20 ఫైనల్(ఆస్ట్రేలియా-భారత్) రాత్రి 9:30 గంటలకు ప్రారంభం స్క్వాష్ మిక్స్ డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (రాత్రి 10.30) దీపిక పల్లికల్, సౌరభ్ ఘోషల్ చదవండి: Commonwealth Games 2022: భారత్ పతకాల మోత -
CWG: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్!
Commonwealth Games 2022: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోత్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పూజ సాధించిన పతకం ఆనందోత్సవాలకు కారణమవుతుందన్న ఆయన.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆమెను ఓదార్చారు. కాగా ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా సాగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో పూజా గెహ్లోత్ కాంస్య పతకం సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (50 కేజీల) విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో పూజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో స్కాట్లాండ్ రెజ్లర్ క్రిస్టెలీ లెమోఫాక్ లిచిద్జియోతో ప్లే ఆఫ్లో తలపడింది. ఇందులో భాంగా 12-2తో విజయం సాధించి కాంస్య పతకం గెలిచింది. అయితే, సెమీ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన పూజా.. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. నన్ను క్షమించండి! తాను కాంస్య పతకానికే పరిమితమైనందుకు క్షమించాలంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై జాతీయ గీతం వినిపించలేకపోయానంటూ భారతావనిని క్షమాపణలు కోరింది. ఈ మేరకు పూజా గెహ్లోత్ మాట్లాడుతూ.. ‘‘నేను సెమీ ఫైనల్ చేరుకున్నాను. కానీ ఓడిపోయాను. నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. జాతీయ గీతం వినిపించాలనుకున్నా.. కానీ అలా చేయలేకపోయాను.. నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. వాటిని సరిదిద్దుకుంటాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ పూజను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘పూజా.. నీ పతకం సెలబ్రేషన్స్కు కారణమవుతుంది. క్షమాపణకు కాదు! నీ జీవిత ప్రయాణం మాకు ఆదర్శం. నీ విజయం మాకు సంతోషాన్నిచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి.. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలి’’ అంటూ పూజాకు అండగా నిలిచారు. నవీన్, రవి దహియా, వినేశ్ ఫొగట్ రెజ్లర్లు అదరగొట్టారు.. కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత రెజ్లర్ అద్భుత విజయాలు అందుకున్నారు. ఈ క్రీడా విభాగంలో భారత్కు మొత్తంగా ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు లభించాయి. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్, వినేశ్ ఫొగట్, రవి దహియా, నవీన్ స్వర్ణ పతకాలతో మెరవగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్, పూజా గెహ్లోత్, పూజా సిహాగ్, దీపక్ నెహ్రా కాంస్య పతకాలు గెలిచారు. చదవండి: Rohit Sharma-Rishabh Pant: పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! Pooja, your medal calls for celebrations, not an apology. Your life journey motivates us, your success gladdens us. You are destined for great things ahead…keep shining! ⭐️ https://t.co/qQ4pldn1Ff — Narendra Modi (@narendramodi) August 7, 2022 -
Commonwealth Games 2022: సెమీస్లో సింధు, శ్రీకాంత్
బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్లో సింధు... పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్ ఫైనల్స్లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్ (మలేసియా)పై, శ్రీకాంత్ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై, లక్ష్య సేన్ 21–12, 21–11తో జూలియన్ (మారిషస్)పై గెలిచారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్ (జమైకా) జంటపై గెలిచింది. -
Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో...
బాక్సింగ్ ఈవెంట్లో నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), అమిత్ పంఘాల్ (51 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. మహిళల విభాగం సెమీఫైనల్స్లో నిఖత్ 5–0తో స్టబ్లీ అల్ఫియా సవానా (ఇంగ్లండ్)పై నెగ్గగా... నీతూ పంచ్ల ధాటికి ప్రత్యర్థి ప్రియాంక ధిల్లాన్ (కెనడా) చేతులెత్తేయడంతో రిఫరీ మూడో రౌండ్లో బౌట్ను నిలిపి వేశారు. పురుషుల విభాగం సెమీఫైనల్లో అమిత్ 5–0తో చిన్యెంబా (జాంబియా)పై నెగ్గాడు. మహిళల 60 కేజీల సెమీఫైనల్లో జాస్మిన్ (భారత్) 2–3తో జెమ్మా రిచర్డ్సన్ (ఇంగ్లండ్) చేతిలో, పురుషుల 57 కేజీల సెమీఫైనల్లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 1–4తో జోసెఫ్ కామె (ఘనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి
బర్మింగ్హామ్: తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. నాట్ సివర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్), డానీ వ్యాట్ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు), ఎమీ జోన్స్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. సివర్, జోన్స్ నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. చేతిలో 7 వికెట్లతో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో జోన్స్ రనౌట్ కాగా... ఆ తర్వాత 8 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా సివర్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అప్పుడు పతకం రాలేదు కామన్వెల్త్ క్రీడల్లో గతంలో ఒకే ఒకసారి (1998; కౌలాలంపూర్) క్రికెట్ పోటీలు నిర్వహించారు. పురుషుల టీమ్తో వన్డే ఫార్మాట్లో అజయ్ జడేజా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగింది. సచిన్, కుంబ్లే, లక్ష్మణ్, హర్భజన్, రాబిన్ సింగ్, ఎమ్మెస్కే ప్రసాద్ లీగ్ దశలో 3 మ్యాచ్లూ ఆడారు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు... కెనడాపై గెలిచి ఆస్ట్రేలియా చేతిలో ఓడగా, ఆంటిగ్వా అండ్ బార్బుడాతో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. దాంతో సెమీస్ చేరకుండానే టీమిండియా నిష్క్రమించింది. -
Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు
ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో భారత మహిళలు అసమానంగా పోరాడారు. ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయినా ఆ తర్వాత కోలుకొని సత్తా చాటారు. చివర్లో ఎదురుదాడికి దిగి లెక్క సరి చేశారు కూడా. దాంతో ఫలితం పెనాల్టీ షూటౌట్కు చేరింది. అక్కడా ప్రత్యర్థి తొలి ప్రయత్నాన్ని కీపర్ సవిత అద్భుతంగా అడ్డుకోగలిగింది. ఇదే జోరు కొనసాగిస్తే విజయం సాధించడం ఖాయమనిపించింది. కానీ ఇక్కడే రిఫరీ భారత్ను దెబ్బ కొట్టింది. ‘గడియారం గంట కొట్టలేదంటూ’ మొదటి గోల్ ప్రయత్నంలో లెక్కలోకి రాదంది. మళ్లీ పెనాల్టీ తీసుకునేందుకు ఆసీస్కు అవకాశం కల్పించింది. దాంతో ఏకాగ్రత చెదిరిన మన మహిళలు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు. షూటౌట్లో తడబడి చివరకు ఓటమి పక్షాన నిలిచారు. భారత్ పరాజయానికి ఆటలో వైఫల్యంకంటే అసమర్థ రిఫరీనే కారణమనడంలో సందేహం లేదు. బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీస్లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్లో 3–0 తేడాతో భారత్ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. మ్యాచ్ 10వ నిమిషంలో ఆస్ట్రేలియా తరఫున రెబెకా గ్రీనర్ గోల్ చేయగా, 49వ నిమిషంలో భారత్ తరఫున వందనా కటారియా గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్లో వెనుకబడిన భారత జట్టు తర్వాతి రెండు క్వార్టర్లలో దూకుడుగా ఆడింది. గోల్ లేకపోయినా ఆసీస్పై ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. అదే ఊపులో చివరి క్వార్టర్లో గోల్తో స్కోరు సమం చేసింది. పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియా నుంచి ఆంబ్రోసియా మలోన్, కైట్లిన్ నాబ్స్, ఎమీ లాటన్ గోల్స్ చేయగా... భారత్ నుంచి లాల్రెమ్సియామి, నేహ, నవనీత్ కౌర్ విఫలమయ్యారు. కాంస్యం కోసం నేడు జరిగే పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. ఏం జరిగింది... తొలి పెనాల్టీని మలోన్ తీసుకోగా, భారత కీపర్ సవిత దానిని గోల్ కాకుండా సమర్థంగా అడ్డుకోగలిగింది. అంతా ముగిసిన తర్వాత అది చెల్లదని, మళ్లీ పెనాల్టీ తీసుకోవాలని రిఫరీ ఆదేశించింది. పెనాల్టీ సమయం గరిష్టంగా 8 సెకన్లు చూపించే ‘స్టాప్వాచ్’ టైమర్ స్టార్ట్ కాలేదని, దానికి ముందే పెనాల్టీ తీసుకున్నందున గుర్తించలేమని రిఫరీ ప్రకటించింది. నిబంధనల ప్రకారమైతే మైదానంలో ఉండే టెక్నికల్ అఫీషియల్ ముందుగా చేయి పైకెత్తుతారు. ఆ తర్వాత చేతిని కిందికి దించితే ‘టైమర్’ ప్రారంభమవుతుంది. అదే సమయంలో రిఫరీ విజిల్ వేస్తే పెనాల్టీ తీసుకోవాలి. అయితే ఈ టెక్నికల్ అఫీషియల్ చేతికి కిందకు దించలేదు. ఇది పూర్తిగా ఆమె తప్పు. దాంతో స్టాప్వాచ్ను మరో అధికారిణి స్టార్ట్ చేయలేదు. దానిని గుర్తించి ‘నో నో’ అనే లోపే పెనాల్టీ ముగిసిపోయింది. దీనిని ఆమె వివరించడంతో రిఫరీ మళ్లీ పెనాల్టీ తీసుకోవాల్సిందిగా కోరింది. మా ఓటమికి దీనిని సాకుగా చెప్పను. అయితే మొదటి పెనాల్టీని ఆపితే సహజంగానే వచ్చే ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. అందరం చాలా నిరాశ చెందాం. తాము పెనాల్టీని కోల్పోయామని గుర్తించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు రిఫరీ ఎందుకు కల్పించుకోవాలి. అధికారులు ఆటతో పాటు ముడిపడి ఉండే భావోద్వేగాలని అర్థం చేసుకోలేరు. –భారత కోచ్ జేనెక్ స్కాప్మన్ -
Commonwealth Games 2022: భారత్ పతకాల మోత
కామన్వెల్త్ గేమ్స్లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు. బర్మింగ్హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు. హాకీలో మూడోసారి... పురుషుల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. అవినాష్, ప్రియాంక అద్భుతం అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్కిది తొమ్మిదోసారి కావడం విశేషం. తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్ బౌల్స్లో రజతం లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. -
పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. లాన్బౌల్స్లో మరో పతకం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించి, స్వదేశంలో అంతగా ఆదరణ లేని క్రీడల్లో సైతం పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ (4 పతకాలు), లాన్బౌల్స్ (1), జూడో (3), స్క్వాష్ (1) వంటి క్రీడల్లో ఇప్పటికే 8 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా లాన్బౌల్స్లో మరో పతకం సాధించారు. పురుషుల టీమ్ ఈవెంట్లో సునీల్ బహదూర్, నవ్నీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో నార్త్రన్ ఐర్లాండ్ చేతిలో 5-18 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. తద్వారా లాన్బౌల్స్లో రెండో మెడల్, ఓవరాల్గా 29వ మెడల్ (9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) భారత్ ఖాతాలో చేరాయి. మహిళల లాన్బౌల్స్ టీమ్ ఈవెంట్లో భారత్ ఇదివరకే స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లవ్లీ చౌబే, పింకి, నయన్మోని సైకియా, రూపా రాణితో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికా టీమ్పై 17-10 తేడాతో విజయం సాధించి స్వర్ణం సాధించింది. కాగా, కామన్వెల్త్ క్రీడల తొమ్మిదో రోజు (రాత్రి 7 గంటల వరకు) భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు, లాన్బౌల్స్లో ఓ పతకాన్ని భారత్ సొంతం చేసుకుంది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్తో బోణీ కొట్టగా.. ఆతర్వాత పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. తాజాగా పురుషుల లాన్బౌల్స్ టీమ్ కూడా రజతం సాధించింది. భారత్ ఇవాళ సాధించిన మూడు పతకాలు రజతాలే కావడం విశేషం. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో తొలి పతకం ఖరారు -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో తొలి పతకం ఖరారు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ ప్రవేశపెట్టిన తొలి ఎడిషన్లోనే హర్మన్ నేతృత్వంలోని టీమిండియా పతకం ఖరారు చేసింది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో టీమిండియా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు అర్ధసెంచరీ (32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు), మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 164 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో షఫాలీ వర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (20 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఇంగ్లీష్ బౌలర్లలో కెంప్ 2, బ్రంట్, సీవర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి లక్ష్యం దిశగా సాగింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నతాలీ సీవర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, సిక్స్) రనౌటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్వైపు మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావల్సిన తరుణంలో స్నేహ్ రాణా (2/28) అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు చారిత్రక విజయాన్ని అందించింది. ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల క్రికెట్లో భారత్కు తొలి పతకం (కనీసం రజతం) ఖరారైంది. ఇంతకుముందు 1998 కామన్వెల్త్ గేమ్స్ పురుషుల క్రికెట్లో భారత్ కనీసం సెమీస్కు కూడా చేరలేకపోయిన విషయం తెలిసిందే. చదవండి: అదరగొడుతున్న అథ్లెట్లు.. స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం -
అదరగొడుతున్న అథ్లెట్లు.. స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు అదరగొడుతున్నారు. తొమ్మిదో రోజు వరుసగా రెండు రజతాలతో సత్తా చాటారు. తొలుత మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్తో బోణీ కొట్టగా.. తాజాగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. SILVER FOR SABLE🥈@avinash3000m wins a 🥈in Men's 3000m Steeplechase event at #CommonwealthGames2022 with a Personal Best and National Record (8.11.20) Congratulations Avinash. India is very proud of you 🤩#Cheer4India #India4CWG2022 pic.twitter.com/lSmP1Ws4sk — SAI Media (@Media_SAI) August 6, 2022 అవినాష్ 8:11.20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు జాతీయ రికార్డును నెలకొల్పాడు. అవినాష్.. కేవలం 0.05 సెకెన్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయాడు. కెన్యాకు చెందిన అబ్రహామ్ కిబివోత్ (8:11.15) స్వర్ణం, అదే దేశానికి చెందిన ఆమోస్ సెరమ్ (8:16.83) కాంస్య పతకాలు సాధించారు. కాగా, ప్రస్తుత క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ ఇదివరకే మూడు పతాకలు గెలిచింది. పురుషుల హై జంప్లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్లో శ్రీశంకర్ మురళీ రజతం, మహిళల 10000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి రజత పతకాలు సాధించారు. అవినాష్ పతకంతో ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఓవరాల్గా భారత్ 28 మెడల్స్తో (9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కంస్యాలు) నాటౌట్గా నిలిచింది. చదవండి: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్లో ప్రియాంకకు రజతం -
మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టుతో శనివారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన రెచ్చిపోయి ఆడింది. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ టీ20 నాకౌట్ మ్యాచ్ల్లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్లాన్నింగ్ (27 బంతుల్లో) పేరిట ఉండేది. మంధాన తాజా ప్రదర్శనతో మెగ్లాన్నింగ్ రికార్డు బద్ధలైంది. ఈ మ్యాచ్లో మంధాన విధ్వంసం ధాటికి పటిష్టమైన ఇంగ్లండ్ బౌలింగ్ దళం వణికిపోయింది. Fastest fifty in a Women's T20I knockout match:23 balls - Smriti Mandhana🇮🇳 v ENG, today27 balls - Meg Lanning🇦🇺 v ENG, 201828 balls - Elyse Villani🇦🇺 v ENG, 201829 balls - Smriti Mandhana🇮🇳 v AUS, 202030 balls - Alyssa Healy🇦🇺 v IND, 2020#CWG2022 #AUSvIND— Kausthub Gudipati (@kaustats) August 6, 2022 మంధాన మొత్తం 32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధాన, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 164 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (20 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు సాధించారు. ఇంగ్లీష్ బౌలర్లలో కెంప్ 2, బ్రంట్, సీవర్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: 'కోహ్లికి బ్యాకప్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి' -
భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్లో ప్రియాంకకు రజతం
కామన్వెల్త్ క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ మూడో పతకం (పురుషుల హై జంప్లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్లో శ్రీశంకర్ మురళీ రజతం) సాధించింది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ చేజిక్కించుకుంది. 43 నిమిషాల 38 సెకెన్లలో రేస్ను ముగించి ప్రియాంక.. కెరీర్లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు కామన్వెల్త్ క్రీడల రేస్ వాకింగ్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్గా రికార్డుల్లోకెక్కింది. ప్రియాంక సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 27కు (9 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కంస్యాలు) చేరింది. మరోవైపు తొమ్మిదో రోజు బాక్సింగ్లోనూ భారత్ హవా కొనసాగింది. మహిళల 48 కేజీల విభాగంలో నీతూ గంగస్ కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల 51 కేజీల విభాగం సెమీ ఫైనల్లో అమిత్ పంగల్.. జాంబియా బాక్సర్ను మట్టికరిపించి ఫైనల్కు దూసుకెళ్లాడు. దీంతో ఆయా విభాగాల్లో భారత్కు రెండు పతాకలు ఖరారయ్యాయి. చదవండి: CWG 2022: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే -
CWG 2022: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ఇప్పటికే (8వ రోజు) 26 పతకాలు (9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కంస్యాలు) సాధించి, పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నిన్న (ఆగస్ట్ 7) ఒక్క రోజే భారత అథ్లెట్లు రెజ్లింగ్లో ఆరు పతకాలతో అదరగొట్టిన తీరు చూస్తే.. ఈసారి క్రీడల్లో భారత్కు పతకాల పంట పండటం ఖాయంగా కనిపిస్తుంది. 9వ రోజు భారత షెడ్యూల్ విషయానికొస్తే.. అథ్లెటిక్స్ అండ్ పారా అథ్లెటిక్స్ *ఉమెన్స్ షాట్పుట్ ఫైనల్ ఎఫ్ 55 - 57 (మధ్యాహ్నం 2:50) పూనమ్ శర్మ, షర్మిలామ్, సంతోష్ *ఉమెన్స్ 10000 మీటర్స్ రేస్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3 గంటలకు) ప్రియాంక, భావన ఝట్ *మెన్స్ 3000మీ స్టీపుల్చేస్ ఫైనల్ (సాయంత్రం 4:20) అవినాష్ సాబ్లే *ఉమెన్స్ 4 * 100 రిలే రౌండ్ వన్ హీట్ (సాయంత్రం 4.45 ) హిమదాస్, ద్యుతీచంద్, ష్రబనీ నందా, ఎన్ఎస్ సిమి *ఉమెన్స్ హ్యామర్ త్రో ఫైనల్ (రాత్రి 11.30) మంజు బాలా *మెన్స్ 5000 మీటర్స్ ఫైనల్ (శనివారం అర్ధరాత్రి 12.40 ) అవినాష్ సాబ్లే బ్యాడ్మింటన్ *ఉమెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ ట్రెసా జాలీ, గాయత్రి గోపీచంద్ *ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పీవీ సింధు *మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ కిదాంబి శ్రీకాంత్ బాక్సింగ్ *ఉమెన్స్ మినిమమ్వెయిట్ 45- 48 సెమీ ఫైనల్ నీతు (మధ్యాహ్నం 3 గంటలకు) *మెన్స్ ఫ్లైవెయిట్ 48- 51 కేజీలు సెమీ ఫైనల్ (మధ్యాహ్నం 3.30 ) అమిత్ పంగల్ *ఉమెన్స్ లైట్ ఫ్లై వెయిట్ 48- 50 కేజీలు సెమీ ఫైనల్ (రాత్రి 7.15 ) నిఖత్ జరీన్ *ఉమెన్స్ లైట్ వెయిట్ 57 -60 కేజీలు (రాత్రి 8 గంటలకు) జాస్మిన్ *ఉమెన్స్ వాల్లర్ వెయిట్ 63.5 -67 కేజీలు (మధ్యాహ్నం 12.45 నుంచి ప్రారంభం) రోహిత్ టోక్స్ *సూపర్ హెవీ వెయిట్ 92 కేజీలు పైన (శనివారం అర్ధరాత్రి 1:30) సాగర్ మహిళల క్రికెట్ (మధ్యాహ్నం 3.30 నుంచి ప్రారంభం) *ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ టేబుల్ టెన్నిస్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ *ఉమెన్స్ డబుల్స్ రౌండ్ 16 (మధ్యాహ్నం 2 గంటల నుంచి) ఆకుల శ్రీజ, రీత్ టెన్నిసన్ *ఉమెన్స్ డబుల్స్ రౌండ్ 16 మనిక బత్రా, దియా పరాగ్ *మిక్సడ్ డబుల్స్ సెమీఫైనల్స్ (సాయంత్రం 6 గంటలకు) ఆచంట శరత్ కమల్, ఆకుల శ్రీజ *మెన్స్ సింగిల్స్ క్లాసెస్ 3-5: బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15 గంటలకు) రాజ్ అరవిందన్ *ఉమెన్స్ సింగిల్ క్లాసెస్ 3-5: బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (శనివారం అర్ధరాత్రి 12:15) సోనాల్ బెన్ *ఉమెన్స్ సింగిల్స్ క్లాసెస్ 3-5: గోల్డ్ మెడల్ మ్యాచ్ శనివారం అర్ధరాత్రి 1 గంటకు భవినా పటేల్ రెజ్లింగ్ మధ్యాహ్నం ( 3 గంటల నుంచి ప్రారంభం) *మెన్స్ ఫ్రీస్టైల్ 57 కేజీలు క్వార్టర్ ఫైనల్ - రవికుమార్ *మెన్స్ ఫ్రీస్టైల్ 97 కేజీలు క్వార్టర్ ఫైనల్ - దీపక్ నెహ్రా *ఉమెన్స్ ఫ్రీస్టైల్ 76 కేజీలు క్వార్టర్ ఫైనల్ - పూజా షిహాగ్ *ఉమెన్స్ ఫ్రీస్టైల్ 53 కేజీలు నోర్డిక్ సిస్టర్ మ్యాచ్ 3 - వినేష్ ఫొగట్ *ఉమెన్స్ ఫ్రీస్టైల్ 50 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 3 - పూజా గెహ్లాట్ *మెన్స్ ఫ్రీస్టైల్ 74 కేజీలు ఫైనల్ - నవీన్ *ఉమెన్స్ ఫ్రీస్టైల్ 53 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 2 - వినేష్ ఫొగట్ *ఉమెన్స్ ఫ్రీస్టైల్ 50 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 1 - పూజా గెహ్లాట్ *ఉమెన్స్ ఫ్రీస్టైల్ 53 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 6 - వినేష్ ఫొగట్ చదవండి: ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్ మాత్రం మారదు -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో రజతం, 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
CWG: బాల్రాజ్ ఏంటిది? చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఆటగాళ్లు.. వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2022లో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీ పడుతున్నామనే విషయం మరిచి ఇద్దరు హాకీ ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకున్నారు. సహచర ఆటగాళ్లు వచ్చి వారిని విడదీయకపోతే అలాగే కొట్టుకునేవాళ్లేమో! ఇంతకీ ఏం జరిగిందంటే.. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్... గురువారం కెనడాతో తలపడింది. పూల్ బీలో జరిగిన ఈ మ్యాచ్లో హాఫ్టైమ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కెనడా ప్లేయర్ బాల్రాజ్ పనేసర్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ గ్రిఫిత్స్ మధ్య వివాదం తలెత్తింది. అప్పటికే ఇంగ్లండ్ 4-1తో ఆధిక్యంలో ఉంది. ఆట కొనసాగుతుండగా గ్రిఫిత్స్ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. ఒకరినొకరు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒకానొక సమయంలో పనేసర్.. గ్రిఫిత్స్ గొంతు కూడా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాకీలో రెజ్లింగ్.. ఒకే టికెట్పై రెండు ఆటలు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాల్రాజ్కు అంపైర్ రెడ్ కార్డ్ చూపడంతో మైదానాన్ని వీడగా.. గ్రిఫిత్స్కు యెల్డో కార్డ్ జారీ అయింది. మ్యాచ్ విషయానికొస్తే.. 11-2తో కెనడాను ఓడించిన ఇంగ్లండ్ సెమీస్ చేరింది. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. భారత్ సైతం వేల్స్పై 4-1తో గెలుపొంది సెమీ ఫైనల్ చేరుకుంది. వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్తో రాణించడంతో అద్భుత విజయం అందుకుంది. చదవండి: WC 2022: ఓపెనర్గా పంత్, ఇషాన్.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే! SreeShankar Won Silver CWG 2022: మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్? Thanks to @JaspreetSSahni for showing me a new sport that combines Hockey and Wrestling pic.twitter.com/UiRopSLNfQ — Digvijay Singh Deo (@DiggySinghDeo) August 4, 2022 -
దుమ్మురేపుతున్న భారత్ బాక్సర్లు
-
సెమీస్కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు.. బాక్సింగ్లో అరడజను పతకాలు ఖరారు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ 18 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) సాధించగా.. బాక్సింగ్లో మరో అరడజను పతకాలు ఖాతాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లవత్, మహిళల 60 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియ, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగల్ ఇవాళ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. మరోవైపు పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. వేల్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. స్క్వాష్లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. మెన్స్ డబుల్స్లో సెంథిల్ కుమార్-అభయ్ సింగ్ జోడీ, మహిళల డబుల్స్లో అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా జోడీ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించాయి. ఇవే కాకుండా హ్యామర్ త్రో ఈవెంట్లో మంజు బాల ఫైనల్కు అర్హత సాధించగా.. స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ 200 మీటర్ల విభాగంలో సెమీస్కి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్లో స్టార్ షట్లర్లు సింధు, శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్కు చేరారు. చదవండి: స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్ -
స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్లు స్వర్ణ పతకం లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మహిళల సింగల్స్లో సింధు, పురుషుల సింగల్స్లో శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. వీరిద్దరు తమ తొలి రౌండ్లలో ప్రత్యర్ధులపై సునాయస విజయాలు సాధించి ముందడుగు వేశారు. సింధు.. ఒలింపిక్ పతక విజేత, మాల్దీవులకు చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్పై 21-4, 21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా, శ్రీకాంత్.. ఉగాండాకు చెందిన డేనియల్ వానగాలియాపై 21-9, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని సాధించాడు. గత కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు గెలిచిన సింధు, శ్రీకాంత్లు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. చదవండి: భారత రిలే జట్టుకు రజతం -
సఫారీ బౌలర్ల విజృంభణ.. 46 పరుగలకే కుప్పకూలిన శ్రీలంక
కామన్వెల్త్ క్రీడల్లో శ్రీలంక మహిళా క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. గ్రూప్-బిలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కేవలం 46 పరుగులకే ఆలౌటై (17.1 ఓవర్లు) చెత్త రికార్డు మూటగట్టుకుంది. టీ20ల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్. లంక ఇన్నింగ్స్లో ఒకే ఒక్కరు (కెప్టెన్ చమారీ ఆటపట్టు (15)) రెండంకెల స్కోర్ సాధించగలిగారంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా సాగిందో అర్ధమవుతుంది. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా దండెత్తి లంక ఇన్నింగ్స్ను కకావికలం చేశారు. డి క్లెర్క్ (3/7), క్లాస్ (2/7), టైరాన్ (1/1), మ్లాబా (1/4), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/12) లు వీర లెవెల్లో రెచ్చిపోయి లంకేయులను మట్టుబెట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు కేవలం 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టాపోకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఓపెనర్లు అన్నెకె బోష్ (16 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. గ్రూప్ బిలో ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో పరాజయంపాలైన శ్రీలంక.. ఈ మ్యాచ్లో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించగా.. లంకపై ఘన విజయం సాధించినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు కూడా నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. సఫారీలు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయంతో 2 పాయింట్లు సాధించి గ్రూప్ బిలో మూడో స్థానంలో నిలిచారు. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ నాకౌట్కు అర్హత సాధించగా.. గ్రూప్ ఏ నుంచి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్ 4కు చేరాయి. చదవండి: CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా -
Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్లిఫ్టింగ్, స్క్వాష్లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్లో స్కాట్లాండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్వన్ జేమ్స్ విల్స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్ప్రీత్ స్నాచ్లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. వెయిట్లిఫ్టింగ్పై ‘లవ్’తో... లవ్ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్లిఫ్టింగ్పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్సర్లోని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని జాతీయ క్యాంప్కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్ప్రీత్ స్థాయిని పెంచింది. నిఖత్, హుసాముద్దీన్లకు పతకాలు ఖాయం బాక్సింగ్ క్రీడాంశంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు. రజతంతో సరి కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్ను ఓడించింది. -
Commonwealth Games 2022: న్యూస్ మేకర్.. జూడో ధీర
కామన్వెల్త్ క్రీడలలో సుశీలా దేవి లిక్మబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్లో హోరాహోరీ పోరాడి రెండో స్థానంలో నిలిచింది. సుశీలా దేవి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. డిప్రెషన్ను జయించి ప్రత్యర్థిని గెలిచింది. మణిపూర్ ఖ్యాతిని పెంచిన మరో వనిత సుశీలా దేవి పరిచయం... ప్రత్యర్థిని నాలుగు వైపుల నుంచి ముట్టడించాలని అంటారు. జూడోలో కూడా నాలుగు విధాలుగా ప్రత్యర్థిని ముట్టడించవచ్చు. త్రోయింగ్, చోకింగ్, లాకింగ్, హోల్డింగ్ అనే నాలుగు పద్ధతులతో ప్రత్యర్థిపై గెలుపు సాధించాల్సి ఉంటుంది. బర్మింగ్హామ్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్– 2022లో మహిళా జూడో 48 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ఫైనల్స్లో సుశీలా దేవి లిక్మబమ్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జూడో క్రీడాకారిణి మిషిలా వైట్బూయీ మీద ఈ నాలుగు విధాలా దాడి చేసినా ప్రత్యేక పాయింట్ల విషయంలో వెనుకబడింది. ఫలితంగా రెండో స్థానంలో నిలబడింది. అయినప్పటికీ భారత దేశానికి మహిళా జూడోలో రజతం సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రశంసలను పొందుతోంది. అయితే ఈ రజతంతో ఆమె సంతోషంగా లేదు. ‘నేను అన్ని విధాలా గోల్డ్ మెడల్కు అర్హురాలిని. మిస్ అయ్యింది’ అని కొంత నిరాశ పడుతోంది. కాని సుశీలా ఎదుర్కొన్న ఆటుపోట్లను చూస్తే దాదాపుగా జూడో నుంచి బయటికొచ్చేసి తిరిగి ఈ విజయం సాధించడం సామాన్యం కాదని అనిపిస్తుంది. మేరీకోమ్ నేల నుంచి మణిపూర్ అంటే మేరీకోమ్ గుర్తుకొస్తుంది. 27 ఏళ్ల సుశీలా దేవిది కూడా మణిపూరే. తండ్రి మనిహర్, తల్లి చవోబి. నలుగురు పిల్లల్లో రెండో సంతానం సుశీలాదేవి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సుశీలాను చూసి ఆమె మేనమామ దినిక్ తనలాగే అంతర్జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అప్పటికే సుశీలాదేవి అన్న శైలాక్షి కూడా జూడో నేర్చుకుంటూ ఉండటంతో ఎనిమిదేళ్ల వయసు నుంచే సుశీలకు జూడో మీద ఆసక్తి పుట్టింది. ప్రాక్టీసు కోసం మేనమామ ఇంఫాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రానికి రోజూ రమ్మంటే సుశీల వాళ్ల ఇంటి నుంచి అది సుమారు 10 కిలోమీటర్లు అయినా రోజూ అన్నా చెల్లెళ్లు సైకిల్ తీసుకుని కొండలు, గుట్టలు దాటుతూ సాయ్ కేంద్రానికి చేరుకునేవారు. అలా ఆమె శిక్షణ మొదలయ్యింది. చెప్పాల్సిన విషయం ఏమంటే అన్న క్రమంగా జూడోలో వెనకబడితే చెల్లెలు పేరు తెచ్చుకోవడం మొదలెట్టింది. దానికి కారణం మహిళా జూడోలోకి ప్రవేశించే క్రీడాకారిణులు తక్కువగా ఉండటమే. పాటియాలా శిక్షణ సుశీల శిక్షణ ఇంఫాల్ నుంచి పాటియాలాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలె¯Œ ్సకు మారింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మేరీకోమ్ వంటి ఆటగాళ్లను చూశాక ఆమెలో స్ఫూర్తి రగిలింది. తాను కూడా విశ్వవేదికపై మెరవాలని కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేసింది. కోచ్ జీవన్ శర్మ ఆమెకు ద్రోణాచార్యుడి గా మారి శిక్షణ ఇచ్చాడు. 2008 జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్లో పతకం సాధించడంతో ఆమె పేరు జూడోలో వినిపించడం మొదలెట్టింది. కొనసాగింపుగా ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కూడా సుశీల పతకాలు సాధించింది. కారు అమ్ముకుంది క్రికెట్ తప్ప వేరే క్రీడలను పెద్దగా పట్టించుకోని స్పాన్సర్లు భారత్లో అంతగా తెలియని జూడోను అసలు పట్టించుకోనేలేదు. పైగా మహిళా జూడో అంటే వారికి లెక్కలేదు. ప్రభుత్వం కూడా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్కు తప్ప వరల్డ్ ఛాంపియ¯Œ ్సకు పెద్దగా స్పాన్సర్షిప్ చేయదు. స్పాన్సర్లు లేకపోవడంతో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొదటి కారును అమ్ముకుని ఆ పోటీలలో పాల్గొన్నది సుశీల. ‘నేను సంపాదించిందంతా జూడోలోనే ఖర్చు చేశాను. ఇంక నా దగ్గర అమ్ముకోవడానికి ఏమీ మిగలలేదు. కానీ ఈ ఆటను నేను వీడను..’ అంటుంది సుశీల. ఈ మెడల్తో ఆమె ఖ్యాతి మరింత పెరిగింది. ఇక ఆట కొనసాగింపు చూడాలి. సుశీల ప్రస్తుతం మణిపూర్ పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తోంది. 2014 కామన్వెల్త్ విజయం 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో రజతం సాధించడంతో సుశీల మీద అందరి అంచనాలు పెరిగాయి. ఆమె నుంచి ఒక ఒలింపిక్ పతకం ఖాయం అని భావించారు. అందుకు రిహార్సల్స్ వంటి 2018 ఆసియా క్రీడల్లో పాల్గొనాలని ఉత్సాహపడుతున్న సుశీలను గాయం బాధ పెట్టింది. ఆమె ఆ గేమ్స్లో పాల్గొనలేకపోవడంతో డిప్రెషన్ బారిన పడింది. ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్, టోర్నీలు రద్దుకావడం ఇవన్నీ ఆమెను టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటానో లేదోననే స్థితికి తీసుకెళ్లాయి. టోక్యో ఒలింపిక్స్లో అదృష్టవశాత్తు కాంటినెంటల్ కోటాలో స్థానం దొరికితే దేశం తరపున ఏకైక జూడో క్రీడాకారిణిగా పాల్గొన్నా ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2019 ఆసియన్ ఓపెన్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్, 2019 లో కామన్వెల్త్ జూడో ఛాంపియన్ షిప్లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018 కు ముందు ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న ఆశలు ఆవిరవుతున్నట్టు అనిపించింది. కానీ ఆమె కుంగిపోలేదు. ఇంటికి వెళ్లి మూడు నెలలు విరామం తీసుకుంది. తిరిగి 2018లో ఆసియా గేమ్స్ లో పాల్గొనలేకపోయినా 2019 లో హాంకాంగ్ వేదికగా జరిగిన హాంకాంగ్ ఓపెన్ లో బరిలోకి దిగింది. -
మెక్గ్రాత్ ఆల్రౌండ్ షో.. పాక్ను మట్టికరిపించిన ఆసీస్
కామన్వెల్త్ క్రీడల మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్-ఏలో హాట్ ఫేవరెట్ అయిన ఆసీస్.. వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయాలతో ఆరు పాయింట్లు సాధించి గ్రాండ్గా సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభ మ్యాచ్లో భారత్పై 3 వికెట్లు తేడాతో గెలుపొందిన ఆసీస్.. ఆతర్వాత బార్బడోస్పై 9 వికెట్ల తేడాతో, తాజాగా పాక్పై 44 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలైన పాక్.. గ్రూప్లో ఆఖరి స్థానంలో నిలిచి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. పాక్.. తమ తొలి మ్యాచ్లో పసికూన బార్బడోస్ చేతిలో, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో, తాజాగా ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్-ఏలో రెండో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు ఇవాళ భారత్-బార్బడోస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆసీస్తో పాటు సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 3) రాత్రి 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇక ఆసీస్-పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బెత్ మూనీ (49 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్), తహీల మెక్గ్రాత్ (51 బంతుల్లో 78; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన పాక్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాటింగ్లో రాణించిన తహీల మెక్గ్రాత్ (3/13) బౌలింగ్లోనూ చెలరేగి పాక్ పతనాన్ని శాసించింది. పాక్ బ్యాటర్లలో ఫాతిమా సనా (26 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. చదవండి: IND VS PAK: మౌకా.. మౌకా యాడ్కు మంగళం పాడిన స్టార్ స్పోర్ట్స్.. కారణం అదేనా..! -
పతకం దిశగా దూసుకుపోతున్న భారత అమ్మాయిలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. ఆతర్వాతి మ్యాచ్లో వేల్స్పై 3-1 తేడాతో గెలుపొందింది. అయితే ఇంగ్లండ్తో తదుపరి జరిగిన మ్యాచ్లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్ కౌర్, లాల్రెమ్సియామి తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్ చేసిన కారణంగా కెనడా గ్రూప్-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే, ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. మరో 3 పతకాలు భారత జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. చదవండి: CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు -
CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్), లవ్ప్రీత్ సింగ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్, విజయ్ కుమార్ యాదవ్ బ్రాంజ్), లాన్స్ బౌల్స్లో ఒకటి (గోల్డ్), టేబుల్ టెన్నిస్లో ఒకటి (గోల్డ్), బ్యాడ్మింటన్లో ఒకటి (సిల్వర్) గెలిచారు. ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్, 32 సిల్వర్, 32 బ్రాంజ్) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 86 (31 గోల్డ్, 34 సిల్వర్, 21 బ్రాంజ్), న్యూజిలాండ్ 26 (13 గోల్డ్, 7 సిల్వర్, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్, 16 సిల్వర్, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్, 5 సిల్వర్, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం -
కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి సత్తా చాటుతున్నారు. ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్లో కాంస్యం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. భారత్ సాధించిన ఈ పతకాలలో 9 వెయిట్ లిఫ్టింగ్లోనే సాధించినవి కాగా, మిగతా 5 మెడల్స్.. జూడో (2), లాన్స్ బౌల్స్ (1), టేబుల్ టెన్నిస్ (1), బ్యాడ్మింటన్ (1) క్రీడల్లో గెలిచినవి. ఇదిలా ఉంటే, క్రీడల ఐదో రోజు బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్పై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతుంది. ఈ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో దారుణంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. భారత్ ఆడిన నాలుగు గేమ్ల్లో ఒక్క పీవీ సింధు మాత్రమే విజయం సాధించింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలై భారత్ బంగారు ఆశలను నీరుగార్చారు. అయితే ఓటమి అనంతరం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టిన వైనం భారత అభిమానులను చాలా బాధించింది. శ్రీకాంత్.. తన వల్లే భారత్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మీడియాకు తెలిపాడు. శ్రీకాంత్ అలా ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించిందని, అతన్ని ఆ పరిస్థితిలో చూడటం అదే మొదటిసారి అని సాత్విక్ అన్నాడు. చదవండి: కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం -
కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్ప్రీత్ సింగ్ భారత్కు కాంస్య పతకం అందించాడు. స్నాచ్ రౌండ్లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 192 కేజీలు ఎత్తిన లవ్ప్రీత్ సింగ్.. మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. కెమరూన్కు చెందిన పెరిక్లెక్స్ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, లవ్ప్రీత్ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్).. తాజాగా లవ్ప్రీత్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. చదవండి: CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో మరో పతకం -
బార్బడోస్తో భారత్ కీలక పోరు.. ఓడితే ఇంటికే!తుది జట్లు!
కామన్వెల్త్ గేమ్స్-2022లో బుధవారం బార్బడోస్ మహిళల జట్టుతో కీలక పోరులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన భారత్ ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో ఓటమి పాలైన భారత్.. రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. గ్రూపు-ఎలో నాలుగు పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఇక ఇప్పటి వరకు చెరో విజయం సాధించిన భారత్, బార్బడోస్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే బార్బడోస్ కంటే భారత్(+1.165)కు మెరుగైన రన్రేట్ ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో బార్బడోస్ ఉండగా.. అఖరి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక సెమీస్లో అడుగు పెట్టాలంటే బార్బడోస్పై హర్మన్ ప్రీత్ సేన ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒక వేళ ఓడితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఇక కీలకపోరులో తలపడనున్న భారత్, బార్బడోస్ జట్ల బలా బలాలపై ఓ లుక్కేద్దాం. భారత జట్టు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఆనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు అఖరిలో చేతులెత్తేశారు. అనంతరం పాక్పై మాత్రం టీమిండియా మహిళలు ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు. తొలుత బౌలింగ్లో పాక్ను కేవలం 99 పరుగులకే కుప్పకూల్చిన భారత మహిళలు.. అనంతరం బ్యాటింగ్లో కూడా ఇరగదీశారు. ఓపెనర్ స్మృతి మంధాన 63 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్కు విజయ తీరాలకు చేర్చింది. ఇక స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడం భారత్కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ పరంగా భారత్ కాస్త తడబడుతోంది. ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో పేసర్ రేణుక సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిగితా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే రెండో మ్యాచ్లో పాక్పై మాత్రం బౌలర్లు విజృంభించారు. ఇక మరోసారి భారత బౌలర్లు చెలరేగితే బార్బడోస్కు మాత్రం ఓటమి తప్పదు. ఇక బార్బడోస్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్లో పాక్పై అద్భుతమైన విజయం సాధించిన బార్బడోస్, రెండో మ్యాచ్లో ఆసీస్ చేతిలో భంగపాటు పడింది. అయితే బార్బడోస్ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. జట్టులో కెప్టెన్ హేలీ మాథ్యూస్, ఓపెనర్ డాటిన్ వంటి అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్లో కూడా షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్ వంటి సీనియర్ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. తుది జట్లు (అంచనా) బార్బడోస్ మహిళల జట్టు: డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), కైసియా నైట్ (వికెట్ కీపర్), కైషోనా నైట్, ఆలియా అలీన్, త్రిషన్ హోల్డర్, అలీసా స్కాంటిల్బరీ, షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్, కైలా ఇలియట్, షానికా బ్రూస్ భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! తల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్! -
Commonwealth Games 2022: బౌల్స్లో బంగారం... టీటీలో పసిడి
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి. అనూహ్య ప్రదర్శనతో దూసుకొచ్చిన మహిళల లాన్ బౌల్స్ టీమ్ అదే అద్భుతాన్ని కొనసాగిస్తూ విజేతగా నిలవగా... అంచనాలను అందుకుంటూ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ 2018లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. లాన్ బౌల్స్ తుదిపోరులో దక్షిణాఫ్రికాకు భారత్ షాక్ ఇవ్వగా... టీటీలో సింగపూర్పై మన ప్యాడ్లర్లు సత్తా చాటి జట్టును గెలిపించారు. పురుషుల వెయిట్లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ రజత పతకం సాధించాడు. అదే జోరు... లాన్ బౌల్స్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. లవ్లీ, పింకీ, రూప, నయన్మోని సభ్యులుగా ఉన్న ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 17–10 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. గత రెండు కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకాలు నెగ్గిన సఫారీ టీమ్తో భారత్ పోరు ఆసక్తికరంగా సాగింది. ఎండ్–3 ముగిసేసరికి ఇరు జట్లు 2–2తో సమంగా నిలవగా, ఎండ్–4 తర్వాత భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఒకదశలో భారత్ 8–2తో దూసుకుపోగా, దక్షిణాఫ్రికా పోరాడటంతో ఎండ్–10 ముగిసేసరికి స్కోరు మళ్లీ 8–8, ఆపై 10–10తో సమమైంది. నిబంధనల ప్రకారం 15 ఎండ్ల తర్వాత ఆటను ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఎండ్–14 తర్వాత భారత్ 15–10తో ముందంజలో ఉండగా... చివరి ఎండ్లో 6 పాయింట్లు సాధిస్తే స్వర్ణం గెలిచే స్థితిలో దక్షిణాఫ్రికా నిలిచింది. అయితే ఇందులోనూ భారత్ 2 పాయింట్లు సాధించగా, సఫారీ మహిళలు ఒక్క పాయింట్ను కూడా గెలవలేక చేతులెత్తేశారు. చివరి ప్రయత్నంలో విసిరిన బౌల్...జాక్కు చాలా దూరంగా వెళ్లడంతో భారత్ స్వర్ణ సంబరాల్లో మునిగిపోయింది. టేబుల్ టెన్నిస్లో పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ హవా కొనసాగింది. ఫైనల్లో భారత్ 3–1 తేడాతో సింగపూర్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్ డబుల్స్లో హర్మీత్ దేశాయ్–సత్యన్ జోడీ 13–11, 11–7, 11–5తో యాంగ్ క్విక్–కూన్ పాంగ్పై గెలుపొందింది. అయితే ఆ తర్వాత సింగిల్స్లో భారత టాప్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ అనూహ్యంగా 7–11, 14–12, 3–11, 9–11తో క్లారెన్స్ చూ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో సింగిల్స్లో సత్యన్ 12–10, 7–11, 11–7, 11–4తో ఎన్ కూన్ పాంగ్ను చిత్తు చేశాడు. ఆ తర్వాత కీలకమైన మూడో సింగిల్స్లో సత్తా చాటిన హర్మీత్ దేశాయ్ 11–8, 11–5, 11–6తో క్లారెన్స్ చూపై గెలుపొంది భారత్కు స్వర్ణం ఖాయం చేశాడు. రజత ‘వికాసం’... భారత సీనియర్ వెయిట్లిఫ్టర్ వికాస్ ఠాకూర్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్లోనూ పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్ రజత పతకం సాధించాడు. పంజాబ్కు చెందిన వికాస్ మొత్తం 346 కేజీలు (స్నాచ్లో 155+క్లీన్ అండ్ జెర్క్లో 191) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. డాన్ ఒపెలోజ్ (సమోవా; 381 కేజీలు) స్వర్ణం, టానియెలా ట్యుసువా (ఫిజీ; 343 కేజీలు) కాంస్యం గెలిచారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో 85 కేజీల విభాగంలో రజతం నెగ్గిన వికాస్... 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో 94 కేజీల విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. హర్జిందర్కు రూ. 40 లక్షలు నజరానా మహిళల వెయిట్లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారిణి హర్జిందర్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం నగదు పురస్కారం ప్రకటించింది. హర్జిందర్కు రూ. 40 లక్షలు నజరానా ఇస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. బర్మింగ్హామ్లో సోమ వారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల 71 కేజీల విభాగం ఫైనల్లో 25 ఏళ్ల హర్జిందర్ మొత్తం 212 కేజీలు (స్నాచ్లో 93+క్లీన్ అండ్ జెర్క్లో 119 కేజీలు) బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. సారా డేవిస్ (ఇంగ్లండ్; 229 కేజీలు) స్వర్ణం, అలెక్సిస్ యాష్వర్త్ (కెనడా; 214 కేజీలు) రజతం గెల్చుకున్నారు. పూనమ్ విఫలం... మహిళల 76 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ విఫలమైంది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన పూనమ్ తాజా గేమ్స్లో మాత్రం తన కేటగిరీలో చివరిస్థానంలో నిలిచింది. స్నాచ్లో 98 కేజీలు బరువెత్తిన ఈ ఉత్తర్ప్రదేశ్ లిఫ్టర్ క్లీన్ అండ్ జెర్క్లో మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. భారత్కు తొలి ఓటమి మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. పూల్ ‘ఎ’లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 1–3 తేడాతో ఓటమి చవిచూసింది. వరుసగా మూడు విజయాలతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా... ఆరు పాయింట్లతో భారత్, కెనడా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు కెనడాతో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తేనే సెమీస్ చేరుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో ఆచంట శరత్ కమల్ సాధించిన పతకాల సంఖ్య. 2006 మెల్బోర్న్ క్రీడల నుంచి వరుసగా బరిలోకి దిగిన అతను వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కలిపి ఈ ఘనతను సాధించాడు. ఇందులో 5 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా షూటర్ గగన్ నారంగ్ (10) రికార్డును శరత్ కమల్ సమం చేశాడు. -
CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో మరో పతకం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్, పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతాకలు సాధించిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో తాజా మరో పతకం సాధించింది. పురుషుల 96 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వికాస్ సింగ్ రజతం సాధించాడు. స్నాచ్ రౌండ్లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 191 కేజీలు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్లో వికాస్కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం గెలిచిన వికాస్.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో సమోవాకి చెందిన డాన్ ఓపెలోగ్ (171+210=381 కేజీలు) స్వర్ణం గెలువగా.. ఫిజికి చెందిన తానియెల (155+188=343) కాంస్యం సాధించాడు. వికాస్ సింగ్ విజయంతో భారత పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..? -
భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..?
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత టీమ్.. తాజాగా పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. సింగపూర్తో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 3-1 తేడాతో విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకుంది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం, ఓవరాల్గా 11వ పతకం చేరింది. తొలి మ్యాచ్లో హర్మీత్ దేశాయ్- జీ సాథియన్ జోడి 13-11, 1-7, 11-5 తేడాతో యంగ్ ఇజాక్ క్వెక్-యో ఎన్ కోన్ పంగ్ ద్వయంపై విజయం సాధించి భారత ఆధిక్యాన్ని 1-0 పెంచగా.. ఆ తర్వాతి మ్యాచ్లో భారత స్టార్ ఆటగాడు శరత్ కమాల్.. క్లెరెన్స్ చ్యూ చేతిలో 7-11, 14-12, 3-11, 9-11 తేడాతో ఓడిపోయాడు. అనంతరం జీ సాథియన్.. కొన్ పంగ్పై 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో గెలుపొంది భారత్కు 2-1 ఆధిక్యం అందించగా.. నాలుగో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్.. జెడ్ చ్యూపై 11-8, 11-5,11-6 వరుస సెట్లలో గెలుపొంది భారత్కు గోల్డ్ మెడల్ ఖరారు చేశాడు. చదవండి: CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్ -
CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వుమెన్స్ టీమ్.. ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్స్లో భారత్ పటిష్టమైన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆట ఆరంభంలో టీమిండియాను తక్కువ అంచనా వేసిన సఫారీ టీమ్.. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక దశలో దక్షిణాఫ్రికా 10-10తో స్కోర్ను సమం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా రెచ్చిపోయి ప్రత్యర్ధిని అదే స్కోర్ వద్ద ఉంచి ఘన విజయం సాధించింది. భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. సెమీస్లో భారత్.. న్యూజిలాండ్ను 16-13 తేడాతో మట్టికరిపించి ఫైనల్కు చేరింది. ఇదిలా ఉంటే, లాన్ బౌల్స్లో స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య పదికి (4 స్వర్ణాలు, 3 రజతాలు, మూడు కాంస్యాలు) చేరింది. చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యంత విజయవంతమైన అథ్లెట్గా అవతరించింది. బర్మింగ్హామ్లో ఇప్పటికే 4 గోల్డ్ మెడల్స్ (మిక్స్డ్ 4*100 ఫ్రీస్టైల్, 4*100 ఫ్రీస్టైల్, 50 ఫ్రీస్టైల్, 50 బటర్ఫ్లై) సాధించిన ఎమ్మా.. గత రెండు కామన్వెల్త్ గేమ్స్లో 8 పతకాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్గా రికార్డుల్లోకెక్కింది. Australian swim sensation Emma McKeon won a record-extending 12th gold medal at the Commonwealth Games on Monday as cycling star Laura Kenny finished her campaign with an emotional gold. Read more: https://t.co/CotVw94x2E pic.twitter.com/snDQblFq5S — The Namibian (@TheNamibian) August 2, 2022 గతంలో ఆస్ట్రేలియాకే చెందిన ఇయాన్ థోర్ప్, సూసీ ఓ నీల్, లీసెల్ జోన్స్లు తలో 10 బంగారు పతకాలు సాధించారు. తాజాగా ఎమ్మా వీరి పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టి కామన్వెల్త్ ఆల్టైమ్ బెస్ట్ అథ్లెట్గా రికార్డల్లోకెక్కింది. 2014 గ్లాస్గో క్రీడల్లో అరంగేట్రం చేసిన ఎమ్మా ఇప్పటివరకు మొత్తం 17 పతకాలు సాధించింది. ఇందులో 12 స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించిన ఎమ్మా.. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చదవండి: CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం! -
Commonwealth Games 2022: అన్నయ్య అభయహస్తమై...స్ఫూర్తిదాయకం అచింత ప్రస్థానం
సాక్షి, క్రీడావిభాగం: పసిడి పతకం గెలవగానే అన్నింటికంటే ముందు అచింత నోటి నుంచి వచ్చిన మాట... ‘ఈ పతకం నా అన్నయ్యకు అంకితం’... అతడిని దగ్గరి నుంచి చూసిన వారికి ఇది ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ రోజు అచింత కామన్వెల్త్ పతకధారిగా సగర్వంగా నిలబడ్డాడంటే దాని వెనక అలోక్ ఉన్నాడు. తమ్ముడి కోసం తన ఆటకు దూరమైన ఆ అన్నయ్య, అంతటితో ఆగకుండా అన్నీ తానై, అంతటా వెనకుండి నడిపించాడు. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కూడా ఆటలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చంటూ అన్ని రకాలుగా స్ఫూర్తినిచ్చేలా అచింత జీవితం కనిపిస్తుంది. కోల్కతాలోనే హౌరా నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది దియూల్పూర్ గ్రామం. అక్కడ ఎక్కువ మందికి ‘జరీ’ పనినే జీవనాధారం. రిక్షా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి 2014లో హఠాత్తుగా చనిపోయిన సమయంలో అచింత వయసు 12 ఏళ్లు! ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తల్లి ‘జరీ’ పనిలో చేరిపోయింది. ఆమెకు అండగా తనకంటే ఏడేళ్లు పెద్ద అయిన అన్నయ్య కూడా వెళ్లక తప్పలేదు. వయసు చిన్నదే అయినా తన చిట్టి చేతులతో అచింత తానూ ఆ పనిలో సాయం చేయడం మొదలు పెట్టేశాడు. ఇలాంటి ఆర్థిక స్థితిలో ఆటలు అనేవి ఆలోచనకు కూడా అందవు. దాంతో అప్పటి వరకు తన ఆసక్తి కొద్దీ వెయిట్లిఫ్టింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అన్న అలోక్ ఆ బరువును పక్కన పడేసి ఇంటి భారం తన మీద వేసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం ‘జరీ’ వర్క్తో పాటు ఉదయం వేళ హౌరా మిల్లుల్లో లేబర్గా పని చేసేందుకు సిద్ధమైన అలోక్... అదే సమయంలో తన తమ్ముడిలో తనకంటే మంచి ప్రతిభ ఉందని గుర్తించడం మర్చిపోలేదు. అందుకే ఏం చేసైనా అచింతను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అన్న కష్టాన్ని అచింత వృథా పోనీయలేదు. ఒకవైపు వెయిట్లిఫ్టింగ్లో ఆటకు పదును పెట్టుకుంటూనే మరోవైపు తనకు ఇచ్చే డబ్బుల్లో ఒక్కో పైసాను అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు. 2014 జాతీయ చాంపియన్షిప్లో నాలుగో స్థానంలో వచ్చినా... కోచ్ దృష్టిని ఆకర్షించడంతో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం వచ్చి ంది. దాంతో అచింత రాత మారింది. తీవ్ర సాధన తో సత్తా చాటుతూ ఆసియా యూత్ చాంపియన్ షిప్లో రజతం, కామన్వెల్త్ జూనియర్ చాంపియన్షిప్లో స్వర్ణం తర్వాత గత ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లో రజతంతో అచింత సంచలనం సృష్టించి దూసుకుపోయాడు. ఆర్మీ ఉద్యోగం ఉండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు కావడంతో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిన ఈ బెంగాల్ కుర్రాడు ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ ఘనతను సగర్వంగా అందుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్... కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన తొలిసారే అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల వెయిట్లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో అచింత భారత్కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్లో 143+క్లీన్ అండ్ జెర్క్లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు. అజయ్కు నిరాశ 81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ అజయ్ సింగ్కు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో అజయ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. అజయ్ స్నాచ్లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 176 కేజీలు (మొత్తం 319 కేజీలు) బరువెత్తాడు. ఈ కేటగిరీలో క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు), కైల్ బ్రూస్ (ఆస్ట్రేలియా; 323 కేజీలు), నికోలస్ వాకన్ (కెనడా; 320 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం
బర్మింగ్హామ్: ఎనిమిదేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈ సారి స్వర్ణంగా మార్చాలని బరిలోకి దిగిన భారత జూడో ప్లేయర్ సుశీలా దేవికి నిరాశే ఎదురైంది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్బూ విజయం సాధించింది. గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్కు రెండు పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది. బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 3–0తో సింగపూర్ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో మలేసియాపైనే నెగ్గి భారత్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. సింగపూర్తో జరిగిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–11, 21–12తో యాంగ్ కాయ్–లియాంగ్ క్వెక్లపై గెలుపొందగా... రెండో మ్యాచ్లో పీవీ సింధు 21–11, 21–12తో జియా మిన్ యోను ఓడించి భారత్కు 2–0తో ఆధిక్యంలో నిలిపింది. మూడో మ్యాచ్లో లక్ష్య సేన్ 21–18, 21–15తో ప్రపంచ చాంపియన్ కీన్ యె లోపై నెగ్గి భారత్ను ఫైనల్కు చేర్చాడు. ఇంగ్లండ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’ పురుషుల హాకీలో ఇంగ్లండ్తో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్ను భారత్ 4–4తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (3వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్(46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మన్దీప్ (13వ, 22వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. సెమీస్లో సౌరవ్ పురుషుల స్క్వాష్ సింగిల్స్లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–5, 8–11, 11–7, 11–3తో గ్రెగ్ లాబన్ (స్కాట్లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జోష్నా చినప్ప 9–11, 5–11, 13–15తో హోలీ నాటన్ (కెనడా) చేతిలో ఓడిపోయింది. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో భారత ప్లేయర్ ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది. -
Commonwealth Games: మరో రెండు పతకాలు ఖాయం చేసుకున్న భారత్
కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. జూడో 48 కేజీ విభాగంలో భారత అథ్లెట్ సుశీలా దేవి లిక్మాబమ్ ఫైనల్కు చేరుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మారిషస్కు చెందిన ప్రిస్సిల్లా మోరాండ్పై సుశీలా దేవి విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఒక వేళ ఫైనల్లో సుశీలా దేవి దేవి ఓటమి చెందిన రజత పతకమైన భారత్ ఖాతాలో చేకూరుతుంది. మరో వైపు లాన్ బౌల్స్ క్రీడలో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్ను 16-13తో ఓడించింది. తత్వారా కామన్ వెల్త్ గేమ్స్లో మరో పతకం భారత్ ఖాతాలో చేరనుంది. కాగా లాన్ బౌల్స్ క్రీడలో భారత్ తొలి సారి పతకం సాధించబోతుండడం గమనార్హం. ఇక కామన్ వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో ఇప్పటికే ఆరు పతకాలు ఉన్నాయి. వాటిలో మూడు గోల్డ్ మెడల్స్, రెండు రజత పతకాలు, ఒక్క కాంస్య పతకం ఉంది. కాగా ఇప్పటి వరకు భారత అథ్లెట్లు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్లో సాధించినవే కావడం విశేషం. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. చదవండి: Mirabai Chanu: ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయిన మీరాబాయి తల్లి! వీడియో వైరల్ -
కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ గెలిచిన అచింత షూలి
-
కామన్వెల్త్ గేమ్స్ నాలుగో రోజు భారత షెడ్యూల్ ఇదే..!
కామన్వెల్త్ గేమ్స్ మొదటి మూడు రోజుల్లో ఊహించని ఫలితాలతో సత్తా చాటిన భారత బృందం నాలుగో రోజు (ఆగస్ట్ 1) కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. ఇప్పటికే ఆరు మెడల్స్ (3 స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం) సాధించి పతకాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న భారత్.. నాలుగో రోజు మరిన్ని పతకాలు సాధించాలని పట్టుదలగా ఉంది. ఇవాళ భారత్ పాల్గొనబోయే ఈవెంట్స్ విషయానికొస్తే.. లాన్ బౌల్స్ (మధ్యాహ్నం 1 నుంచి ప్రారంభం) ఉమెన్స్ ఫోర్ సెమీ ఫైనల్ జూడో (మధ్యాహ్నం 2.30 నుంచి మొదలు) మెన్స్ 66 కేజీలు రౌండ్ 16 - జస్లీన్ సింగ్ సైని ఉమెన్స్ 57 కేజీలు రౌండ్ 16 - సుచికా తరియాల్ మెన్స్ 60 కేజీలు రౌండ్ 16 - విజయ్ కుమార్ యాదవ్ ఉమెన్స్ 48 కేజీలు - క్వార్టర్ ఫైనల్ - సుశీలా దేవి స్క్వాష్ (సాయంత్రం 4.30 నుంచి ప్రారంభం) ఉమెన్స్ సింగిల్స్ ప్లాటర్ క్వార్టర్ ఫైనల్ - సునయన సారా కురివిల్లా ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ - జాషువా చిన్నప్ప (సాయంత్రం 6 గంటలు) స్విమ్మింగ్ (మధ్యాహ్నం 3.51 నుంచి ప్రారంభం) మెన్స్ 100 మీటర్స్ - బటర్ ఫ్లై హీట్ 6 - సజన్ ప్రకాష్ బాక్సింగ్ (సాయంత్రం 4.45 నుంచి ప్రారంభం) 48 51 కేజీల కేటగిరీ - ఫ్లై వెయిట్ రౌండ్ 16 - అమిత్ ఫంగల్ 54 57 కేజీలు - ఫెథర్ వెయిట్ రౌండ్ 16 - హుసాముద్దీన్ మహమ్మద్ (సాయంత్రం 6 గంటలకు) 75 80 కేజీలు - లైట్ హెవీ వెయిట్ రౌండ్ 16 - ఆశిష్ కుమార్ (మధ్నాహ్నం 1 నుంచి ప్రారంభం) సైక్లింగ్ (సాయంత్రం 6.32 నుంచి ప్రారంభం) ఉమెన్స్ కీరెన్ ఫస్ట్ రౌండ్ - త్రియాశీ పాల్, శుశికల అగషే, మయూరీ లూటే మెన్స్ 40 కిమీ రేస్ క్వాలిఫయింగ్ - నమన్ కపిల్, వెంకప్ప, దినేష్ కుమార్, విశ్వజీత్ సింగ్ (సాయంత్రం 6.52 కి ప్రారంభం) హాకీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (రాత్రి 8.30) వెయిట్ లిఫ్టింగ్ మెన్స్ 81 కేజీలు - అజయ్ సింగ్ (మధ్యాహ్నం 2 గంటలు) ఉమెన్స్ 71 కేజీలు - హర్జీందర్ సింగ్ (రాత్రి 11 గంటలు) టేబుల్ టెన్నిస్ మెన్స్ టీమ్ సెమీ ఫైనల్ ఇండియా వర్సెస్ నైజీరియా (రాత్రి 11.30 ) పారా స్విమ్మింగ్ మెన్స్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఎస్ 7 ఫైనల్ - నిరంజన్ ముకుందన్, సుహాస్ నారాయణన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత చదవండి: రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్ ఖాతాలో మూడో స్వర్ణం -
CWG 2022: మా అమ్మ.. ఇంకా బంధువుల సంబరాలు! వీడియో వైరల్
Birmingham 2022- Mirabai Chanu: భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయారు. బంధువులతో కలిసి తమ సంప్రదాయ శైలిలో నాట్యం చేస్తూ కూతురి విజయాన్ని ఆస్వాదించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా మీరాబాయి భారత్కు తొలి స్వర్ణ పతకం అందించిన సంగతి తెలిసిందే. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగం ఫైనల్లో మీరాబాయి స్నాచ్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 113 కేజీలు (మొత్తంగా 201 కేజీలు) ఎత్తి.. పసిడి పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన ఆమె.. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. తద్వారా బర్మింగ్హామ్లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ క్రమంలో యావత్ భారతావనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇక మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి తమ ఇంట్లోనే సంబరాలు జరుపుకొన్నారు. My mom and other relatives celebrating victory at my home ✌️ pic.twitter.com/sTCIoTDVwM — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 31, 2022 ఇందుకు సంబంధించిన వీడియోను మీరాబాయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మా అమ్మ.. ఇంకా బంధువులు.. నా విజయాన్ని ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు’’ అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను రీషేర్ చేస్తూ నెటిజన్లు మీరాబాయికి, ఆమె తల్లికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మీరాబాయి 2014 గ్లాస్కో గేమ్స్లో రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్లో స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్లో రజతం.. తాజాగా స్వర్ణం సాధించింది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. మణిపూర్కు చెందిన మీరాబాయి చానుది మధ్యతరగతి కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వంట కలప కోసం వెళ్లినపుడు తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసిన మీరాబాయి.. అప్పుడే తనలోని ప్రతిభను వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రోత్సహించిన కుటుంబం.. అంచెలంచెలుగా ఎదగడంలో అండగా నిలిచింది. తల్లితో మీరాబాయి చాను ఇక పదకొండేళ్ల వయసులోనే స్థానికంగా జరిగే వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన చాను.. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకం సాధించి వెలుగులోకి వచ్చింది. ఇక 2016లో రియో ఒలింపిక్స్లో విఫలమైనా... పడిలేచిన కెరటంలా 2017లో ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఇవేకాకుండా ఎన్నో అరదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. మీరాబాయి ప్రయాణంలో కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా ఆమె తల్లి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి CWG 2022: మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో -
CWG 2022: సెమీస్లో భారత బ్యాడ్మింటన్ జట్టు
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలి మ్యాచ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... రెండో మ్యాచ్లో లక్ష్య సేన్... మూడో మ్యాచ్లో ఆకర్షి కశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. స్క్వాష్లో మహిళల సింగిల్స్లో జోష్నా చినప్ప, పురుషుల సింగిల్స్లో సౌరవ్ క్వార్టర్ ఫైనల్ చేరారు. -
CWG 2022: పతకం రేసులో భారత టీటీ జట్టు
కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలి మ్యాచ్లో హర్మీత్–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–8, 11–6, 11–2తో రమిహిమిలన్–అహ్మద్ జంటను ఓడించింది. రెండో మ్యాచ్లో శరత్ కమల్ 11–4, 11–7, 11–2తో రిఫాత్పై గెలిచాడు. మూడో మ్యాచ్లో జ్ఞానశేఖరన్ 11–2, 11–3, 11–5తో అహ్మద్పై నెగ్గి భారత విజయాన్ని ఖాయం చేశాడు. -
కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు.. ఘనాపై భారీ విజయం సాధించిన టీమిండియా
కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డు విజయం నమోదు చేసింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ విజయం ఇదే. 1998 గేమ్స్లో ట్రినిడాడ్పై భారత్ 10–1తో నెగ్గింది. GOAL! Harmenpreet hits a hatrick, having just scored another goal for India, Harmanpreet Singh is sustaining his title of "Best Drag Flicker."IND 11:0 GHA #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @IndiaSports@sports_odisha @Media_S— Hockey India (@TheHockeyIndia) July 31, 2022 ఈ మ్యాచ్లో భారత ఆటగాడు హర్మన్ప్రీత్ సింగ్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హ్యాట్రిక్ గోల్స్తో ప్రత్యర్ధిపై విరుచుకుపడ్డాడు. మరో ఆటగాడు జుగ్రాజ్ సింగ్ కూడా రెండు గోల్స్తో ఆకట్టుకున్నాడు. భారత్ తర్వాతి మ్యాచ్లో పూల్-బి టాపర్ ఇంగ్లండ్తో తలపడనుంది. -
నిఖత్ పంచ్ అదిరె.. పతకం దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో నిఖత్ పంచ్ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్) తట్టుకోలేక విలవిలలాడింది. దాంతో రిఫరీ మూడో రౌండ్ మధ్యలోనే బౌట్ను నిలిపివేసి నిఖత్ను విజేతగా ప్రకటించారు. నిఖత్ ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గి జోరుమీదున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లోనూ నిఖత్ పసిడి పంచ్ విసరాలని పట్టుదలగా ఉంది. క్వార్టర్స్లో నిఖత్.. న్యూజిలాండ్కు చెందిన గార్టన్తో తలపడనుంది. మరోవైపు పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ శివ థాపాకు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రిక్వార్టర్స్లో థాపా 1-4తో రిసీ లించ్ (స్కాట్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్ ఖాతాలో మూడో స్వర్ణం
Achinta Sheuli: కామన్వెల్డ్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఈ గేమ్స్ భారత్ ఇప్పటివరకు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్లో సాధించినవే కావడం విశేషం. ఈ క్రీడలో ఇప్పటికే 5 మెడల్స్ సాధించిన భారత్.. తాజాగా మరో పతకం ఖాతాలో వేసుకుంది. 73 కేజీల విభాగంలో అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో పసిడి సాధించాడు. Achinta Sheuli bags #TeamIndia's third 🥇 at @birminghamcg22 👏🎆All three gold medals so far have been won by our weightlifters 🏋♂️🏋♀️🏋♂️#EkIndiaTeamIndia | @WeAreTeamIndia pic.twitter.com/kCJVxFVNYI— Team India (@WeAreTeamIndia) July 31, 2022 స్నాచ్లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 170 కేజీల బరువు ఎత్తిన షెవులి.. మొత్తంగా 313 కేజీల బరువు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్లో భారత్కు ఇది మూడో స్వర్ణం. 73 కేజీల ఈవెంట్లో మలేషియాకు చెందిన ఎర్రి హిదాయత్ మహమ్మద్ 303 కేజీల బరువు ఎత్తి రజతం సాధించగా.. కెనెడాకు చెందిన షాడ్ డార్సిగ్ని (298 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. చదవండి: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్లో జెరెమీకి గోల్డ్ -
Commonwealth Games 2022: భారత్ ధనాధన్
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ టి20 క్రికెట్ ఈవెంట్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్ను కంగు తినిపించింది. తద్వారా సెమీఫైనల్ రేసులో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట పాకిస్తాన్ మహిళల జట్టు 18 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచింది. రాధ యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. రేణుక, మేఘన సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 11.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (14; 2 ఫోర్లు) ధాటిగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. బుధవారం బార్బడోస్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో భారత్ తలపడుతుంది. -
Commonwealth Games 2022: జెరెమీ జయహో...
అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు ఆదివారం భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించింది. అంతర్జాతీయ జూనియర్ స్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మిజోరం టీనేజర్ జెరెమీ లాల్రినుంగా సీనియర్ స్థాయిలో పసిడి పతకంతో అరంగేట్రం చేయగా... మణిపూర్ మహిళా లిఫ్టర్ బింద్యారాణి దేవి సొరోఖైబమ్ రజత పతకంతో మెరిసింది. ఫలితంగా బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్లిఫ్టర్లు నెగ్గిన ఐదు పతకాలతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. బర్మింగ్హామ్: ఏ లక్ష్యంతోనైతే భారత టీనేజ్ వెయిట్లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా బర్మింగ్హామ్లో అడుగుపెట్టాడో దానిని సాధించాడు. మూడు నెలల క్రితం కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం నమూనా ఫొటోను తన ఫోన్ వాల్ పేపర్గా పెట్టుకున్న 19 ఏళ్ల జెరెమీ ఇప్పుడు నిజమైన పసిడి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల వెయిట్లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా విజేతగా నిలిచాడు. స్నాచ్లో 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 160 కేజీలు బరువెత్తి ఓవరాల్గా 300 కేజీలతో జెరెమీ చాంపియన్గా అవతరించాడు. స్నాచ్లో, ఓవరాల్ టోటల్లో జెరెమీ రెండు కామన్వెల్త్ గేమ్స్ కొత్త రికార్డులు సృష్టించాడు. వైపావా లోన్ (సమోవా; 127+166=293 కేజీలు) రజతం... ఎడిడియోంగ్ యుమోఫియా (నైజీరియా; 130+160=290 కేజీలు) కాంస్యం సాధించారు. స్నాచ్ ఈవెంట్లో జెరెమీ తొలి ప్రయత్నంలో 136 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 143 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక క్లీన్ అండ్ జెర్క్లో తొలి ప్రయత్నంలో 154 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తిని జెరెమీ మూడో ప్రయత్నంలో 165 కేజీలకు ప్రయత్నించి తడబడ్డాడు. మూడో ప్రయత్నంలో జెరెమీ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను వెయిట్బార్ను వదిలేశాడు. సమోవా లిఫ్టర్ వైపావా క్లీన్ అండ్ జెర్క్లో 166 కేజీలు ఎత్తినా స్నాచ్లో జెరెమీ ఎక్కువ కేజీలు ఎత్తడంతో భారత లిఫ్టర్కు స్వర్ణం ఖాయమైంది. ముందు బాక్సింగ్లో... మిజోరం రాష్ట్రానికి చెందిన జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ లాల్నెత్లువాంగా కుమారుడైన జెరెమీ ఆరంభంలో తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. కొన్నాళ్లు బాక్సింగ్లో కొనసాగిన జెరెమీ పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందాక వెయిట్లిఫ్టింగ్వైపు మళ్లాడు. అటునుంచి జెరెమీ వెనుదిరిగి చూడలేదు. 2016లో ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో 56 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన జెరెమీ ఆ తర్వాత 2017 ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో రజతం సాధించాడు. 2018 ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో కాంస్యం... 2018లో అర్జెంటీనా ఆతిథ్యమిచ్చిన యూత్ ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచాడు. గత ఏడాది తాష్కెంట్లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్లోనూ జెరెమీ బంగారు పతకం గెలుపొందాడు. ఒక కేజీ తేడాతో... మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్కు చెందిన 23 ఏళ్ల బింద్యారాణి మొత్తం 202 కేజీలు (స్నాచ్లో 86+క్లీన్ అండ్ జెర్క్లో 116) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. అదిజాత్ అడెనికి ఒలారినోయి (నైజీరియా; 92+111=203 కేజీలు) స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒలారినోయి, బింద్యారాణి ఓవరాల్ టోటల్ మధ్య కేవలం ఒక కేజీ తేడా ఉండటం గమనార్హం. ఫ్రెయర్ మొరో (ఇంగ్లండ్; 89+109=198 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారమే జరిగిన మహిళల 59 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ పాపీ హజారికా నిరాశపరిచింది. పాపీ హజారికా 183 కేజీలు (స్నాచ్లో 81+క్లీన్ అండ్ జెర్క్లో 102) బరువెత్తి ఏడో స్థానంలో నిలిచింది. నా స్వప్నం సాకారమైంది. నేను కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. యూత్ ఒలింపిక్స్ తర్వాత సీనియర్స్థాయిలో నేను పాల్గొన్న పెద్ద ఈవెంట్ ఇదే. నేను 67 కేజీల నుంచి నేను ఒలింపిక్ వెయిట్ కేటగిరీ 73 కేజీలకు మారబోతున్నాను. పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాను. –జెరెమీ లాల్రినుంగా -
ధోని రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్
కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళల క్రికెట్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్ పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా (పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి) సరికొత్త రికార్డు (42 విజయాలు) నెలకొల్పింది. ఈ మ్యాచ్కు ముందు టీ20ల్లో టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్గా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని (41 విజయాలు) ఉండేవాడు. తాజా విజయంతో హర్మన్.. ధోని రికార్డును బద్దలు కొట్టి పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్గా అవతరించింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 30 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో నాలుగో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో విజయం ద్వారా భారత్ మరో రికార్డ్ను కూడా బద్దలు కొట్టింది. పాక్ నిర్ధేశించిన 99 లక్ష్యాన్ని మరో 38 బంతులుండగానే ఛేదించిన టీమిండియా.. ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్ల్లో బంతుల పరంగా అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఇంతకుముందు 2018లో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్తో ఆ రికార్డును చెరిపి వేసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. చదవండి: మంధాన విధ్వంసం.. పాక్ను మట్టికరిపించిన భారత్ -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్లో జెరెమీకి గోల్డ్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 పతకాలు సాధించి అంచనాలకు మించి రాణిస్తున్న భారత వెయిట్ లిఫ్టర్లు.. తాజాగా మరో పతకం సాధించారు. మూడో రోజు ఈవెంట్స్లో పురుషుల 67 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగ 300 కేజీల (స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్లో కలిపి) బరువు ఎత్తి స్వర్ణ పతకం నెగ్గాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య రెండుకు, మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జెరెమీ అనూహ్యంగా 300 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మాంచి జోరు మీద ఉంది. భారత్ ఇప్పటివరకు సాధించిన పతాకలన్నీ వెయిట్ లిఫ్టింగ్లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్యం, తాజాగా జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. -
మంధాన విధ్వంసం.. పాక్ను మట్టికరిపించిన భారత్
మంధాన విధ్వంసం.. పాక్ను మట్టికరిపించిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాక్తో జరిగిన కీలక సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్: 99 ఆలౌట్ భారత్: 102/2 (11.4 ఓవర్లు) మంధాన సుడిగాలి హాఫ్ సెంచరీ భారత ఓపెనర్ స్మృతి మంధాన సుడిగాలి హాఫ్ సెంచరీ బాదింది. స్వల్ప లక్ష్య ఛేదనలో మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. 31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఫిఫ్టి పూర్తి చేసింది. మంధాన వీర బాదుడు ధాటికి టీమిండియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 100 పరుగుల స్వల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్), మంధాన (26 బంతుల్లో 44; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా మంధాన పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతుంది. ఈ దశలో షఫాలీ వర్మ మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటైంది. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 61/1. కుప్పకూలిన పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్.. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి పాక్ నడ్డి విరిచారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో (18వ ఓవర్లో) పాక్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. రాధా యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్, మేఘన సింగ్, షఫాలి వర్మ తలో వికెట్ సాధించారు. ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్గా నిలిచింది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 66/4 ఇన్నింగ్స్ ఆరంభంలో నత్తనడకలా సాగిన పాక్ స్కోర్ బోర్డు 12 ఓవర్లు ముగిసాక కూడా అదే తీరులో సాగుతోంది. 8వ ఓవర్లో 14 పరుగులు సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత స్నేహ్ రాణా వేసిన 9వ ఓవర్లో మహరూఫ్ (17), మునీబా అలీ (32) వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత రేణుకా సింగ్ వేసిన 12వ ఓవర్లో పాక్ మరో వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్లో రోడ్రిగ్స్కు క్యాచ్ ఇచ్చి అయేషా నసీమ్ (10) పెవిలియన్ బాట పట్టింది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 66/4గా ఉంది. ఆలియా రియాజ్(1), ఒమైమా సొహైల్ (5) క్రీజ్లో ఉన్నారు. నత్తనడకన సాగుతున్న పాక్ బ్యాటింగ్.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన పాక్ ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. సున్నా పరుగులకే రెండో ఓవర్లో వికెట్ కోల్పోయిన ఆ జట్టు 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిస్మా మహరూఫ్ (16), మునీబా అలీ (18) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్ టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్కు రెండో ఓవర్లోనే వికెట్ దక్కింది. మేఘన సింగ్ బౌలింగ్లో యస్తిక క్యాచ్ పట్టడంతో ఇరామ్ జావీద్ డకౌట్గా వెనుదిరిగింది. అంతకుముందు తొలి ఓవర్ను రేణుకా సింగ్ మెయిడిన్ చేసింది. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 7/1. క్రీజ్లో బిస్మా మహరూఫ్ (5), మునీబా అలీ (1) ఉన్నారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదింపు మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వరుణుడు ఆటంకం కలిగించడంతో టాస్ గంటకు పైగా ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ను 18 ఓవర్లకు కుదించారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీమిండియాతో హైఓల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. అయితే మ్యాచ్ వేదిక అయిన ఎడ్జ్బాస్టన్లో జల్లులు కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా సాధ్యపడలేదు. వరుణుడు శాంతించి మ్యాచ్ సజావుగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు సంబంధించి ఇవాళ (జులై 31) హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్లు ఎడ్జ్బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రీడల్లో గ్రూప్-ఏలో పోటీపడుతన్న ఇరు జట్లు.. తమతమ మొదటి మ్యాచ్ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో పరాజయం పాలయ్యారు. భారత్.. ఆరంభ మ్యాచ్లో పటిష్టమైన ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వగా.. పాక్కు పసికూన బార్బడోస్ (15 పరుగుల తేడాతో ఓటమి) షాకిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సత్తా చాటుతుంది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు నాలుగు పతకాలు సాధించి మాంచి జోరు మీద ఉంది. భారత్ సాధించిన నాలుగు పతాకలు వెయిట్ లిఫ్టింగ్లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతాకలు సాధించారు. -
మన 'బంగారు' మీరాబాయి
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం వచ్చి చేరింది. టోక్యో ఒలింపిక్స్లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం ఒడిసి పట్టింది. శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత వెయిట్లిఫ్టర్గా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ వచ్చింది. అలసటను దరి చేరనీయలేదు.. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. వాస్తవానికి మీరాబాయి చానూ ఈసారి 55 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఈ సారి ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య ఆమెను 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. దీంతో మీరాబాయి తన బరువును పెంచుకుంటూనే ఎంతోగానో శ్రమించింది. కానీ ఆఖరి క్షణంలో ఒక్క విభాగం నుంచి ఒక్కరే ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. అలా తనకు అచ్చొచ్చిన విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్గా పెట్టుకుంది. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఇక 2014 గ్లాస్కో గేమ్స్ రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్లో స్వర్ణం.. తాజాగా మరోసారి స్వర్ణంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. మరి వచ్చే పారిస్ ఒలింపిక్స్(2024)లో టోక్యోలో వచ్చిన రజతాన్ని స్వర్ణంగా మారుస్తుందేమో చూడాలి. Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్లిఫ్టింగ్లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్కు చెందిన మీరాబాయి స్నాచ్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన సంకేత్, స్నాచ్లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్లో భారత్ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ను సోనీ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
టీమిండియాను వదలని మహమ్మారి.. తాజాగా మరొకరికి పాజిటివ్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని కరోనా మహమ్మారి వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లు (సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్) మహమ్మారి బారిన పడగా.. తాజాగా మహిళా హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ నవ్జోత్ కౌర్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నవ్జోత్కు ఇవాళ (జులై 30) ఉదయం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఐసోలేషన్కు తరలించారు. ఆమెకు మరో రెండు రోజుల్లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని భారత బృందానికి సంబంధించిన అధికారి తెలిపారు. ఒకవేళ అప్పటికీ ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రాకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడా గ్రామంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో భాగంగా ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం -
CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతుంది. రెండో రోజు భారత అథ్లెట్లు వెయిట్లిఫ్టింగ్లో రెండు పతకాలు సాధించారు. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించగా.. తాజాగా 61 కేజీల (పురుషుల) విభాగంలో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు. గురురాజ మొత్తం 269 కేజీల బరువును (స్నాచ్లో 118 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 153 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలువగా.. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్ 285 కేజీలు (127, 158) ఎత్తి స్వర్ణ పతకాన్ని.. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి రజతం సాధించారు. కాగా, గురురాజకు కామన్వెల్త్ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2️⃣nd medal for 🇮🇳 at @birminghamcg22 🤩 What a comback by P. Gururaja to bag 🥉 with a total lift of 269 Kg in the Men's 61kg Finals🏋♂️ at #B2022 Snatch- 118kg Clean & Jerk- 151kg With this Gururaj wins his 2nd consecutive CWG medal 🙂 Congratulations Champ!#Cheer4India pic.twitter.com/UtOJiShUvS — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో తొలి పతకం -
CWG 2022: హిమ దాస్ స్వర్ణం గెలవలే.. నెట్టింట వైరలవుతున్న ఫేక్ ట్వీట్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం (400 మీటర్ల పరుగు పందెం) నెగ్గిందన్న వార్త కొద్దిసేపటి క్రితం నెట్టింట హల్చల్ చేసింది. హిమ స్వర్ణం గెలిచిందన్న ఆనందంలో చాలామంది భారతీయులు ఆమెకు రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వార్త ఫేక్ అని తేలడంతో వారంతా నాలుక్కరచుకుని తమ పోస్ట్లను డిలీట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా చేసిన వారిలో మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు. సరైన ఫాలో అప్ లేక ఇలాంటి ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను వారంతా పశ్చాత్తాప పడుతున్నారు. అసలు కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ (జులై 30) హిమ దాస్ ఈవెంటే లేకపోవడం ఓ విషయమైతే.. హిమ స్వర్ణం నెగ్గినట్లు చెబుతున్న 400 మీటర్ల రేసులో ఆమె పాల్గొనకపోవడం మరో విశేషం. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించి భారత్కు తొలి పతకం అందించాడు. Hima das has not started her campaign yet. Why so hurry Mr Patra and Mr Sehwag. An old video is prompting many to tweet this fake news. Now they have deleted the tweet. She is participating in 200m and 4*100m relay. @sambitswaraj @virendersehwag #HimaDas #CommonwealthGames2022 pic.twitter.com/4dxegSWMca— Pankaj Priyadershi (@BBCPankajP) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో తొలి పతకం -
CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో తొలి పతకం
Birmingham 2022: బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. Braving through injury to win a medal for his country, we couldn't have asked for more from Sanket! ❤️🇮🇳#CommonwealthGames pic.twitter.com/btIYs9MEqx — The Bridge (@the_bridge_in) July 30, 2022 మలేషియాకు చెందిన బిబ్ అనిక్ 259 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. శ్రీలంకకు చెందిన దిలంక యోడగే (225 కేజీలు) కాంస్యం సాధించాడు. సంకేత్.. సీ ఎండ్ జే రెండో ప్రయత్నంలో గాయపడటంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. చదవండి: CWG 2022: ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!.. కామన్వెల్త్ నుంచి సస్పెండ్ -
పాకిస్తాన్కు ఊహించని షాక్.. పసికూన చేతిలో ఓటమి
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. మెగా ఈవెంట్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓటమిపాలవ్వగా.. రెండో మ్యా్చ్లో కరీబియస్ జట్టైన బార్బడోస్ చేతిలో పాక్కు పరాభవం ఎదురైంది. హర్మన్ సేనను ఆసీస్ 3 వికెట్ల తేడా ఓడించగా.. పసికూన బార్బడోస్ 15 పరుగుల తేడాతో పాక్ను ఖంగుతినిపించింది. పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. వికెట్కీపర్ కైసియా నైట్ (56 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో బార్బడోస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనాకు 2 వికెట్లు దక్కగా.. డయానా బేగ్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం ఛేదనలో పాక్ తడబాటుకు లోనై 129 పరుగులకే (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. నిదా దార్ (31 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) పాక్ను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. నిదాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో పాక్ ఓటమిపాలైంది. నిదా మినహా మరే ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. బార్బడోస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ పొదుపుగా బౌలింగ్ (4 ఓవర్లలో 1/13) చేయడంతో పాటు రెండు రనౌట్లు చేసి ఓ క్యాచ్ అందుకోగా.. షమీలియా కాన్నెల్, ఆలియా అల్లెన్, డియాండ్రా డొట్టిన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-బి మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ మరో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా.. రాత్రి మ్యాచ్లో ఇంగ్లండ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. జులై 31న (ఆదివారం) గ్రూప్-ఏకి సంబంధించిన కీలక మ్యాచ్లో భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్! -
CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్!
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టును ఆదిలోనే ఓటమి పలకరించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన పరాజయం పాలైంది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి హర్మన్ప్రీత్ బృందం ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తొలి మ్యాచ్లోనే గెలిచి అరుదైన ఘనత సాధించాలనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఓడినా.. బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చింది. రేణుక ధాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. మ్యాచ్ రెండో బంతికే ఓపెనర్ అలిసా హేలీను అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించిన రేణుక.. వరుసగా బెత్ మూనీతో పాటు.. కెప్టెన్ మెగ్ లానింగ్, తాహిలా మెగ్రాత్ వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ఐదో ఓవర్ మొదటి బంతికి మెగ్రాత్ను రేణుక అవుట్ చేసిన తీరు హైలెట్గా నిలిచింది. అద్భుతమైన ఇన్స్వింగర్తో మెగ్రాత్ను రేణుక బౌల్డ్ చేసింది. రేణుక సంధించిన బంతిని షాట్ ఆడేందుకు మెగ్రాత్ సమాయత్తమైంది. కానీ.. నమ్మశక్యం కాని రీతిలో బంతి మెగ్రాత్ ప్యాడ్, బ్యాట్ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన మెగ్రాత్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా క్రీజును వీడింది. అయితే, గార్డ్నర్కు తోడు గ్రేస్ హ్యారిస్ 37 పరుగులతో రాణించడంతో విజయం ఆసీస్ సొంతమైంది. 𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲! 🔥 Renuka Singh Thakur, everyone. 👏#INDvAUS | #B2022 pic.twitter.com/zfo50r1QLj — Olympic Khel (@OlympicKhel) July 29, 2022 కామన్వెల్త్ క్రీడలు 2022- మహిళా క్రికెట్(టీ20 ఫార్మాట్) ►భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ►వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ ►టాస్: భారత్- బ్యాటింగ్ ►భారత్ స్కోరు: 154/8 (20) ►ఆస్ట్రేలియా స్కోరు: 157/7 (19) ►విజేత: ఆస్ట్రేలియా... 3 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో మొదటి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు అనుగుణంగానే సాగింది. బలహీన జట్లపై భారత బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టీమ్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా... హాకీలోనూ ఘన విజయం దక్కింది. ఊహించినట్లుగానే స్విమ్మింగ్, సైక్లింగ్వంటి క్రీడల్లో మనోళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవరాల్గా ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో రోజును ముగించింది. భారత్ ఫలితాలు మహిళల క్రికెట్: తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత్కు తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పేసర్ రేణుకా సింగ్ (4/18) దెబ్బకు ఆసీస్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్ (35 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టును గెలిపించారు. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ 5–0 తేడాతో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21–7, 21–12తో మురాద్ అలీపై, మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21–7, 21–6తో మహూర్ షహజాద్పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ జోడి 21–12, 21–9 మురాద్ అలీ–ఇర్ఫాన్ సయీద్ను, మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 21–4, 21–5తో మహూర్ షహజాద్–గజాలా సిద్దిఖ్ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి–పొన్నప్ప ద్వయం 21–9, 21–12తో ఇర్ఫాన్–గజాలా సిద్ధిక్పై ఆధిక్యం ప్రదర్శించింది. టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ విభాగంలో ముందుగా దక్షిణాఫ్రికాను 3–0తో, ఆపై ఫిజీని 3–0తో భారత్ చిత్తు చేసింది. పురుషుల టీమ్ విభాగంలో ముందుగా 3–0 తేడాతో బార్బడోస్పై నెగ్గింది. ∙ పురుషుల బాక్సింగ్ (63.5 కేజీలు) లో శివ థాపా 5–0తో సులేమాన్ బలూచ్ (పాకిస్తాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్విమ్మింగ్: పురుషుల స్విమ్మింగ్లో శ్రీహరి నటరాజ్ (100 మీ. బ్యాక్స్ట్రోక్)లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 54.68 సెకన్ల టైమింగ్తో రేస్ను పూర్తి చేసిన అతను ముందంజ వేశాడు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్ఫ్లయ్) హీట్స్లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. సైక్లింగ్: మూడు ఈవెంట్లలోనూ భారత సైక్లిస్ట్లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల స్ప్రింట్ టీమ్ ఈవెంట్లో రొనాల్డో, రోజిత్, బెక్హామ్, ఎల్కొటొచొంగో బృందం క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలవగా... శశికళ, త్రియాశ, మయూరి సభ్యులుగా ఉన్న మహిళల స్ప్రింట్ టీమ్ కూడా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వజీత్, వెంకప్ప, దినేశ్ సభ్యులైన 4000 మీటర్ల పర్సా్యట్ టీమ్ కూడా ఆరో స్థానంలో నిలిచింది. ట్రయథ్లాన్: భారత్నుంచి పేలవ ప్రదర్శన నమోదైంది. పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ఆదర్శ్ మురళీధరన్ 30వ స్థానంలో, విశ్వనాథ్ యాదవ్ 33 స్థానంలో నిలిచి నిష్క్రమించగా... మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ప్రజ్ఞా మోహన్ 26వ స్థానంతో, సంజన జోషి 28వ స్థానంతో సరిపెట్టుకున్నారు. హాకీ: మహిళల లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఘనాను చిత్తు చేసింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (3వ నిమిషం, 39వ ని.), నేహ (28వ ని.), సంగీతా కుమారి (36వ ని.), సలీమా టెటె (56వ ని.) గోల్స్ సాధించారు. ఇంగ్లండ్ ఖాతాలో తొలి స్వర్ణం బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. పురుషుల ట్రయాథ్లాన్లో ఇంగ్లండ్కు చెందిన అలెక్స్ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్ విల్డ్ (న్యూజిలాండ్), మాథ్యూ హాజర్ (ఆస్ట్రేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి. -
గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మాన్ప్రీత్ కౌర్(52), షఫాలీ వర్మ(48) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్ ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత యువ పేసర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఆసీస్ను దెబ్బకొట్టింది. ఇక ఆసీస్ ఓటమి ఖాయం అనుకున్న వేళ బ్యాటర్లు ఆష్లీ గార్డనర్, గ్రేస్ హ్యారీస్ భారత్పై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 51 పరుగులు జోడించారు. అనంతరం మేఘనా సింగ్ బౌలింగ్లో గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 37 పరుగులు) ఔటైంది. ఆ తర్వాత వచ్చిన జొనసేన్ ను 14వ ఓవర్లో దీప్తి శర్మ పెవిలియన్కు పంపింది. ఒక వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతోన్న గార్డనర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. గార్డనర్ 52 పరుగులతో అఖరి వరకు నిలిచి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్ జూలై 31న పాకిస్తాన్ తో ఆడనున్నది. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..! -
కెప్టెన్ ఇన్నింగ్స్.. అర్ధసెంచరీతో చెలరేగిన హర్మన్ప్రీత్ కౌర్
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతోన్న తొలి మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో చెలరేగింది. హర్మన్ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్మాన్ ప్రీత్(52)తో పాటు ఓపెనర్ షఫాలీ వర్మ(48) పరుగులతో రాణించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్కు 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన(24) బ్రౌన్ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన యస్తికా(9) రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ప్రీత్.. షఫాలీ వర్మతో కలిసి స్కోర్ బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 11 ఓవర్ వేసిన బ్రౌన్ బౌలింగ్లో భారత బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. ఇక 48 పరుగులు సాధించి జోరు మీద ఉన్న షఫాలీ వర్మ జూనెసన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరింది. ఇక జట్టు పూర్తి బాధ్యతను కెప్టెన్ హర్మన్ప్రీత్ తన భుజాలపై వేసుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్న హర్మన్ మాత్రం తన కెప్టెన్ ఇన్నింగ్స్ను కొనసాగించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్ ఒక్క వికెట్ సాధించింది. చదవండి: Rohit Sharma: ఒంటి చేత్తో మ్యాచ్ను లాగేయగలరు.. అందుకే: రోహిత్ శర్మ 🔹 Who are the eight teams? 🔹 Teams in each group? 🔹 Possible gold, silver and bronze medalists? Here's all you need to know ahead of the historic debut for women's cricket at the Commonwealth Games 📽️#B2022 pic.twitter.com/4SQXu8LkLY — ICC (@ICC) July 29, 2022 -
CWG 2022: అంగరంగ వైభవంగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
కామన్వెల్త్ గేమ్స్.. భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్..!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్కు ముందు భారత్ మహిళల జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కరోనా బారిన పడిన బ్యాటర్ సబ్భినేని మేఘన కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలలో ఆమెకు నెగిటివ్గా తేలింది. దీంతో మేఘన బర్మింగ్హామ్లో ఉన్న భారత జట్టలో చేరేందుకు సిద్దమైంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేఘన దృవీకరించింది. ఇక మేఘనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బర్మింగ్హామ్కు వెళ్లే తన ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఫోటోను షేర్ చేసింది. కాగా కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడానికి భారత జట్టు బర్మింగ్హామ్కు పయనమయ్యే ఒక్క రోజు ముందు మేఘన, ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ బర్మింగ్హామ్కు వెళ్లే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉండిపోయారు. అయితే పూజా ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా, పాకిస్తాన్తో జరిగే లీగ్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా,పాకిస్తాన్ బార్బడోస్ జట్లతో కలిపి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా గ్రూప్స్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. భారత తమ తొలి మ్యాచ్లో శుక్రవారం(జూలై 29) ఆస్ట్రేలియాతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్కు భారత జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా,యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా చదవండి: PV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్కు తరలింపు -
Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..?
కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత బృందానికి సంబంధించి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఓపెనింగ్ సెర్మనీలో పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో పాటు భారత ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించాల్సిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోవిడ్ బారినపడినట్లు ప్రచారం జరుగుతుంది. సింధుకు సంబంధించిన ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో తొలుత కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, ఆతర్వాత మళ్లీ జరిపిన టెస్ట్లో ఫలితం మరోలా ఉందని, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఎటు తేల్చుకోలేక ముందు జాగ్రత్తగా సింధును ఐసోలేషన్కు తరలించారని సమాచారం. సింధు విషయంలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని భారత బృందానికి చెందిన ఓ కీలక వ్యక్తి నిర్ధారించారు. సింధుకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారని.. అందులో నెగిటివ్ ఫలితం వచ్చాకే ఆమెను కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అనుమతిస్తామని సదరు వ్యక్తి తెలిపాడు. కాగా, భారత బృందంతో పాటు పీవీ సింధు జులై 25న హైదరాబాద్ నుంచి బర్మింగ్హామ్కు బయల్దేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కడానికి ముందు, ఆతర్వాత లండన్లో ల్యాండయ్యాక జరిపిన కోవిడ్ పరీక్షల్లో సింధును నెగిటివ్ రిపోర్టే వచ్చింది. అయితే ఇవాళ సింధుకు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉండటంతో పరీక్ష నిర్వహించారని, అందులో ఫలితం కన్ఫ్యూజింగ్గా వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్ సెర్మనీ) భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకల్లో మన్ప్రీత్ సింగ్తో పాటు పీవీ సింధు 214 మంది సభ్యుల భారత బృందానికి ప్రతినిధిగా త్రివర్ణపతాకాన్ని చేతపట్టుకొని ముందుండి నడిపించాల్సి ఉంది. చదవండి: పీవీ సింధుకు అరుదైన గౌరవం -
CWG 2022: ‘రవి అస్తమించని’ క్రీడలు
అమెరికా లేకపోతేనేమి, ఆస్ట్రేలియా ఆట కనువిందు చేస్తుంది... చైనా కనిపించకపోయినా ఇంగ్లండ్ స్టార్ల జోరు కట్టి పడేస్తుంది... రష్యా మెరుపులకు అవకాశం లేకున్నా... కెనడా, న్యూజిలాండ్ ఆ లోటును తీరుస్తాయి... ఇక పెద్ద సంఖ్యలో పతకావకాశాలతో సగటు భారత క్రీడాభిమానికి పన్నెండు రోజుల పాటు సరైన వినోదం ఖాయం. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల సంక్షిప్త రూపమిది. ఒకనాడు బ్రిటీష్ పాలనలో ఉండి, ఆపై స్వతంత్రంగా మారిన దేశాల మధ్య క్రీడా మైదానాల్లో సాగే సమరాలకు వేదిక ఈ ఆటలు... ప్రపంచ సంబరం ఒలింపిక్స్తో పోలిస్తే స్థాయి కాస్త తక్కువే అయినా... ఈ క్రీడలకు తమదైన ప్రత్యేకత ఉంది. వర్ధమాన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది సరైన చోటు కాగా... వనుతూ, మాల్టా, నౌరూ... ఇలా ప్రతీ చిన్న దేశం పతకంతో సందడి చేస్తుంటే కనిపించే క్రీడా స్ఫూర్తి, వేదికపై ఆ కళే వేరు...72 దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆగస్టు 8 వరకు జరిగే ఈ పండగలో చివరాఖరికి ఎవరెన్ని పతకాలను తమ ఖాతాలో వేసుకుంటారనేది ఆసక్తికరం. ►భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 11:30 నుంచి ప్రారంభోత్సవం జరగనుంది. సోనీ సిక్స్, సోనీ టెన్–1,2,3,4 చానెల్స్లో, డీడీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. బర్మింగ్హామ్: 2022 సంవత్సరంలో 22వ కామన్వెల్త్ క్రీడలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో దాదాపు ఐదువేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనుండగా, శుక్రవారం నుంచి పోటీలు మొదలవుతాయి. మొత్తం 20 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం పోటీ పడతారు. మహిళల క్రికెట్ తొలిసారి టి20 రూపంలో కామన్వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టనుండటం విశేషం. సాధారణంగా రెండు ఒలింపిక్స్ మధ్య (రెండేళ్ల తర్వాత, రెండేళ్ల ముందు) వీటిని నిర్వహిస్తారు. అయితే కోవిడ్తో టోక్యో క్రీడలు ఆలస్యం కావడంతో సంవత్సరం లోపే ఈ మెగా ఈవెంట్ ముందుకు వచ్చింది. 1930లో తొలిసారి ‘బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో నిర్వహించిన ఈ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మినహా ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. 1934 (లండన్), 2002 (మాంచెస్టర్) తర్వాత ఇంగ్లండ్ మూడోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. వేదిక మారి... నిజానికి ఈసారి పోటీలు దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరగాలి. 2015లో ఆ ఒక్క దేశమే బిడ్ వేయడంతో హక్కులు కేటాయించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలతో తమ వల్ల కాదంటూ 2017లో దక్షిణాఫ్రికా చేతులెత్తేయడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ క్రీడల మొత్తం బడ్జెట్ 778 మిలియన్ పౌండ్లు (రూ. 80 వేల కోట్లు). పోటీలపరంగా చూస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇన్నేళ్ల క్రీడల చరిత్రలో మొత్తం 932 స్వర్ణాలు సహా 2,415 పతకాలతో ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా... 2,144 పతకాలతో ఇంగ్లండ్ (714 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది. కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలూ పతకాల పట్టికలో ముందంజలో ఉండగా... జమైకా, కెన్యావంటి దేశాలు అథ్లెటిక్స్లో తమ ప్రభావం చూపించగలిగాయి. ఓవరాల్గా భారత్ కూడా 2002 నుంచి టాప్–5లో నిలబడుతూ వస్తోంది. ప్రాభవం కోల్పోతున్నాయా! 22 సార్లు క్రీడల నిర్వహణ మొత్తంగా 9 దేశాలకే పరిమితమైంది. వచ్చేసారి కూడా ఆస్ట్రేలియాలోనే (విక్టోరియా రాష్ట్రం) జరగనున్నాయి. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసే స్థితిలో చాలా కామన్వెల్త్ దేశాలు లేవు. పైగా పోటీల స్థాయి ఒలింపిక్స్తో మాత్రమే కాదు, ఆసియా క్రీడలతో పోల్చి చూసినా చాలా తక్కువగా ఉంటోంది. ఒక్క అథ్లెటిక్స్లో మాత్రం ప్రపంచస్థాయి ప్రమాణాలు కనిపిస్తుండగా, మిగతా క్రీడాంశాల్లో ఇక్కడ నమోదయ్యే అత్యుత్తమ ప్రదర్శనలకు, ఒలింపిక్ ప్రదర్శనలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. వేర్వేరు కారణాలతో స్టార్ ఆటగాళ్లు కామన్వెల్త్ క్రీడలకు దూరమవుతుండటంతో ఆసక్తి ఒక్కసారిగా తగ్గిపోతోంది. భారత్ కోణంలో చూస్తే ఇక్కడి ఫలితాలు ఆటగాళ్లను, అభిమానులను ‘భ్రమల్లో’ ఉంచుతున్నాయని, ఈ ఫలితం చూసి క్రీడల్లో బాగున్నామని భావించడం సరైంది కాదని పలువురు మాజీ ఆటగాళ్లు తరచుగా వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితి చూపిస్తోంది. అన్నింటికి మించి రాజకీయపరమైన కోణంలో ఈ క్రీడలపై అనాసక్తి కనిపిస్తోంది. ఒలింపిక్స్కు ప్రత్యామ్నాయంగా, అమెరికా ఆధిపత్యానికి ఎదురుగా నిలబడేందుకు తీసుకొచ్చి కామన్వెల్త్ క్రీడలు 1960ల వరకు మంచి ఫలితాలు అందించాయి. ఆ తర్వాతే వాటి స్థాయి పడిపోయింది. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా బ్రిటీష్ పాలించిన దేశాల మధ్య పోటీ ఏమిటంటూ వచ్చే విమర్శలతో పాటు... కామన్వెల్త్ దేశాల మధ్య ఒక కూటమిగా ఎలాంటి రాజకీయ సారూప్యత లేదు. సభ్య దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, కీలక విధాన నిర్ణయాల మీద సహకారం అందించే విధానం, స్పష్టమైన పాత్ర లేకపోగా, అంతటి బలం కూడా వీటికి లేదు. దాంతో ఇవి నామమాత్రంగా మారిపోతున్నాయి. 66లో 16 పోయినట్లే! ఈసారి కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ క్రీడాంశాన్ని తొలగించడం భారత్కు పెద్ద దెబ్బే. 2018లో మన దేశం సాధించిన 66 పతకాల్లో 16 (అత్యధికంగా 7 స్వర్ణాలు సహా) షూటింగ్ ద్వారా వచ్చాయి. భారత్ మూడో స్థానంలో నిలవగా, ఈసారి కిందకు దిగజారే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్లో మనకు ఖాయంగా మెడల్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ నుంచి ఈసారి 16 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 215 మంది క్రీడాకారులు పతకాల వేటలో ఉన్నారు. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ పతాకధారులుగా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను ‘ప్లాగ్ బేరర్’గా ఎంపిక చేసినా అతను గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్కు దూరమయ్యాడు. దాంతో 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత బృందానికి ‘ఫ్లాగ్ బేరర్’గా వ్యవహరించిన సింధుకు మరోసారి అవకాశం వచ్చింది. భారత్ @ బర్మింగ్హామ్ ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 215 మంది పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్ (43), హాకీ (36), మహిళలక్రికెట్ (15), వెయిట్లిఫ్టింగ్ (15), సైక్లింగ్ (13), బాక్సింగ్ (12), రెజ్లింగ్ (12), టేబుల్ టెన్నిస్ (12), బ్యాడ్మింటన్ (10), లాన్ బౌల్స్ (10), స్క్వాష్ (9) జిమ్నాస్టిక్స్ (7), స్విమ్మింగ్ (7), జూడో (6), ట్రయాథ్లాన్ (4), పారా పవర్లిఫ్టింగ్ (4). కామన్వెల్త్ గేమ్స్ షెడ్యూల్ ►ప్రారంభ వేడుకలు నేడు రాత్రి గం. 11:30 నుంచి ►అథ్లెటిక్స్: జూలై 30 నుంచి ఆగస్టు 7 ►అక్వాటిక్స్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►బ్యాడ్మింటన్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►3గీ3 బాస్కెట్బాల్: జూలై 29 నుంచి ఆగస్టు 2 ►బీచ్ వాలీబాల్: జూలై 30 నుంచి ఆగస్టు 7 ►బాక్సింగ్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►క్రికెట్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►సైక్లింగ్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►జిమ్నాస్టిక్స్: జూలై 29 నుంచి ఆగస్టు 6 ►హాకీ: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►జూడో: ఆగస్టు 1 నుంచి 3 ►లాన్ బౌల్స్: జూలై 29 నుంచి ఆగస్టు 6 ►నెట్బాల్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►పారా పవర్లిఫ్టింగ్: ఆగస్టు 4 ►రగ్బీ సెవెన్స్: జూలై 29 నుంచి 31 ►స్క్వాష్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►టేబుల్ టెన్నిస్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►ట్రయాథ్లాన్: జూలై 29 నుంచి 31 ►వెయిట్లిఫ్టింగ్: జూలై 30 నుంచి ఆగస్టు 3 ►రెజ్లింగ్: ఆగస్టు 5 నుంచి 6 ►ముగింపు వేడుకలు ఆగస్టు 8 మనోళ్లు 11 మంది... కామన్వెల్త్ గేమ్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం 11 మంది భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి యెర్రాజీ, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, సబ్బినేని మేఘన తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పోటీపడుతున్నారు. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది బరిలోకి దిగారు. ►అథ్లెటిక్స్: జ్యోతి యెర్రాజీ (ఆంధ్రప్రదేశ్; మహిళల 100 మీటర్ల హర్డిల్స్) ►బ్యాడ్మింటన్: సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సుమీత్ రెడ్డి, గాయత్రి గోపీచంద్ (తెలంగాణ). ►బాక్సింగ్: నిఖత్ జరీన్ (తెలంగాణ; మహిళల 50 కేజీలు), హుసాముద్దీన్ (తెలంగాణ; పురుషుల 57 కేజీలు). ►మహిళల హాకీ: రజని ఇటిమరపు (ఆంధ్రప్రదేశ్; రెండో గోల్కీపర్) ►టేబుల్ టెన్నిస్: ఆకుల శ్రీజ (తెలంగాణ) ►మహిళల టి20 క్రికెట్: సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్) -
పీవీ సింధుకు అరుదైన గౌరవం
బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు రేపటి (జులై 28) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహా క్రీడా సంగ్రామానికి సంబంధించి ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్ సెర్మనీ) కూడా రేపే ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు మొదలవుతాయి. గాయం కారణంగా భారత పతాకధారి నీరజ్ చోప్రా ఈ ఈవెంట్ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్ సెర్మనీలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) బుధవారం (జులై 27) వెల్లడించింది. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించిన సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్ చేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే, 72 దేశాల నుంచి 5 వేలకుపైగా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. 12 రోజుల పాటు (జులై 28- ఆగస్ట్ 8) 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 18వ సారి ఈ ఈవెంట్లో పాల్గొంటున్న భారత్.. మొత్తం 16 విభాగాల్లో 214 మంది అథ్లెట్లతో పోటీపడుతుంది. భారత్ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉన్న విభాగాల్లో మహిళల బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఈ ఈవెంట్కు ముందే సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న సింధు ఈసారి తప్పక గోల్డ్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. సింధు గత కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్లో సిల్వర్ మెడల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. చదవండి: పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్కు అనుమతి -
టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్
బర్మింగ్హామ్ వేదికగా ఈనెల (జులై) 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియాలోని ఇద్దరు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడినట్లు జట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. ఆదివారం (జులై 24) జట్టు బర్మింగ్హామ్కు బయల్దేరాక టీమిండియా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించింది. అయితే ఆ ఇద్దరి పేర్లను చెప్పేందుకు నిరాకరించింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆ ఇద్దరు బర్మింగ్హామ్లో జట్టుతో కలుస్తారని తెలిపింది. కాగా, కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. జులై 29న టీమిండియా తమ తొలి పోరులో పటిష్టమైన ఆసీస్ను ఢీకొట్టాల్సి ఉంది. అనంతరం భారత్ జులై 31న పాకిస్థాన్తో.. ఆగస్ట్ 3న బార్బడోస్తో తలపడాల్సి ఉంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్, భారత్ ఓ గ్రూప్ (ఏ)లో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు మరో గ్రూప్లో (బి) ఉన్నాయి. చదవండి: CWG 2022: క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..! -
పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్కు అనుమతి
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులు వేధిస్తున్నారంటూ నిన్న ట్విటర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకుంది. తన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్లోకి అనుమతించడం లేదని లవ్లీనా చేసిన ఆరోపణలు నేపథ్యంలో బీఎఫ్ఐ స్పందించింది. కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసి ఆమెకు హోటెల్లో వసతి కల్పించినట్లు బీఎఫ్ఐ వెల్లడించింది. అలాగే లవ్లీనాతో పాటు ట్రైనింగ్ క్యాంపుకు కోచ్ కూడా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు 33 శాతం సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందన్న నిబంధన కారణంగా లవ్లీనా కోచ్కు కామన్ వెల్త్ విలేజ్లోకి అనుమతి లభించలేదని బీఎఫ్ఐ వివరించింది. కాగా, బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని లవ్లీనా నిన్న ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. చదవండి: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు -
Cricket: 1998 కామన్వెల్త్ గేమ్స్ విజేత ఎవరు..? టీమిండియాది ఎన్నో స్థానం..?
Commonwealth Games: బర్మింగ్హామ్ వేదికగా ఈనెల (జులై) 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్కు తొలిసారి అవకాశం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రీడల్లో 24 ఏళ్ల క్రితమే పురుషుల క్రికెట్కు ప్రాతినిధ్యం లభించిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కౌలాంలంపూర్ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు తొలిసారి ప్రాతినిధ్యం లభించగా.. అందులో దక్షిణాఫ్రికా స్వర్ణ పతకం నెగ్గింది. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు 4 గ్రూప్లుగా విభజింపబడి పోటీపడగా.. సఫారీలు స్వర్ణాన్ని.. ఆసీస్ రజతాన్ని.. కివీస్ కాంస్య పతకాన్ని గెలిచాయి. ఆస్ట్రేలియా, కెనడా, అంటిగ్వా అండ్ బార్బుడా దేశాలతో పాటు గ్రూప్ బిలో తలపడిన భారత్ గ్రూప్ దశలోనే (3 మ్యాచ్ల్లో కేవలం ఒకే గెలుపు) నిష్క్రమించి ఓవరాల్గా 9వ స్థానంలో నిలిచింది. నాటి టీమిండియాకు అజయ్ జడేజా సారధ్యం వహించగా.. అనిల్ కుంబ్లే వైస్ కెప్టెన్గా.. సచిన్, లక్ష్మణ్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. కీలక ప్లేయర్లు పాకిస్థాన్తో సహారా కప్ ఆడుతుండటంతో బీసీసీఐ రెండో జట్టును కామన్వెల్త్ గేమ్స్కు పంపింది. చదవండి: CWG 2022: క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..! -
CWG 2022: క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..!
మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ భాగమైంది. ఇక ఓవరాల్గా దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల వన్డే క్రికెట్ టోర్నీను నిర్వహించారు. కాగా అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. కాగా ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నీలో మ్యాచ్లు అన్నీ బర్మింగ్హామ్ వేదికగానే జరగనున్నాయి. ఇక కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించల మూడు హాట్ ఫేవరెట్ జట్లును పరిశీలిద్దాం. ఆస్ట్రేలియా ప్రస్తుతం మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం చెలాయిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించే ఫేవరట్ జట్లలో ఆస్ట్రేలియాకు తొలి స్థానం ఇవ్వవచ్చు. అదే విధంగా మహిళల టీ20 క్రికెట్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆసీస్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఐదు టైటిల్స్ను లానింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా ఆస్ట్రేలియా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్లో బ్రెత్ మూనీ, కెప్టెన్ లానింగ్, మెక్గ్రాత్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక బౌలింగ్లో మేఘనా స్కాట్, జానెసన్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇంగ్లండ్ ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే జట్లులో ఇంగ్లండ్ ఒకటి. అయితే ఈ లీగ్లో రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ.. ఫైనల్లో మాత్రం ఈ రెండు జట్లు ఢీకోనే అవకాశం ఉంది. మహిళల వన్డే ప్రపంచకప్-2022 ఫైనల్లోను ఇంగ్లండ్, ఆసీస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆసీస్ విజయం సాధించి వరల్డ్కప్ను కైవసం చేసుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్లో ఇంగ్లండ్ రెగ్యూలర్ కెప్టెన్ హీథర్ నైట్ అందుబాటుపై సంద్ఘిదం నెలకొంది. ఒక వేళ ఈ టోర్నీకి ఆమె దూరమైతే ఇంగ్లండ్కు గట్టి ఎదరుదెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే ఇంగ్లండ్ మాత్రం ఆల్ రౌండర్ నాట్ స్కివర్, వెటరన్ కేథరీన్ బ్రంట్, యంగ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి వారితో బలంగా కన్పిస్తోంది. భారత్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ రేసులో ఉన్న మరో జట్టు భారత్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లకు భారత్ నుంచి గట్టీ పోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ పరిచిన సంగతి తెలిసిందే. అయితే కామన్వెల్త్ గేమ్స్లో మాత్రం తమ సత్తా చాటాలని హర్మన్ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. ఇక భారత్ కూడా బ్యాటింగ్,బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఓపెనింగ్ జోడీ షఫాలీ వర్మ,స్మృతి మంధాన చేలరేగితే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్లో రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక భారత్ తమ తొలి మ్యాచ్లనే ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ప్రతిష్టాత్మక క్రీడల్లో నామమాత్రపు విజయాలు కాకుండా పసిడి పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Axar Patel- Six in Final Over List: ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? 💬 💬 We are aiming for Gold Medal at the Commonwealth Games: #TeamIndia vice-captain @mandhana_smriti. 👍 👍#B2022 pic.twitter.com/7Tsovu3Y12 — BCCI Women (@BCCIWomen) July 22, 2022 -
భారత్కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్!
బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు దూరమయ్యాడు. కాగా తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ సమయంలో అతడి గజ్జలో గాయమైంది. ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, పరుగెత్తుతున్నప్పుడు తొడ కండరాలు పట్టేశాయని నీరజ్ చోప్రా పతకం సాధించిన అనంతరం చెప్పాడు. అయితే అతడి గాయం ప్రస్తుతం తీవ్రం కావడంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. "ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయం కాణంగా కామన్వెల్త్ గేమ్స్లో భాగం కాలేకపోతున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Lovlina Borgohain: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ సంచలన ఆరోపణలు Our Olympic Champ @Neeraj_chopra1 will not be defending his title at @birminghamcg22 due to concerns regarding his fitness. We wish him a speedy recovery & are supporting him in these challenging times.#EkIndiaTeamIndia #WeareTeamIndia pic.twitter.com/pPg7SYlrSm — Team India (@WeAreTeamIndia) July 26, 2022 -
బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించింది. తాను ఒలింపిక్ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్లోకి అనుమతించడం లేదని, మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కోను ఇండియాకు పంపించేశారని ఆమె వాపోయింది. 🙏 pic.twitter.com/2NJ79xmPxH — Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022 ఈ కారణంగా తన ప్రాక్టీస్ ఆగిపోయిందని, వరల్డ్ ఛాంపియన్షిప్ సమయంలో కూడా బీఎఫ్ఐ ఇలాగే తనతో డర్టీ పాలిటిక్స్ చేసిందని పేర్కొంది. బీఎఫ్ఐ ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. మరో మూడు రోజుల్లో (జులై 28) కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లవ్లీనా ఆరోపణలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. చదవండి: రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..? -
నీరజ్ నెక్స్ట్ టార్గెట్ అదే.. కామన్వెల్త్ గేమ్స్లో భారత షెడ్యూల్ ఇదే..!
Commonwealth Games 2022: బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు ఈ నెల (జులై) 28 నుంచి ఆగస్ట్ 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో 214 మంది సభ్యుల భారత బృందం మొత్తం 16 క్రీడా విభాగాల్లో పాల్గొంటుంది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్కు తొలిసారి అవకాశం లభించింది. తాజాగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్షిప్స్లో జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ చోప్రా ప్రారంభ వేడుకల్లో భారత ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగిన 2018 గేమ్స్లో 66 పతాకలు సాధించిన భారత్.. ఈసారి పతకాల సంఖ్య మరింత పెంచుకోవాలని భావిస్తుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్లో పీవీ సింధులతో పాటు మహిళల క్రికెట్, హాకీలలో భారత్ స్వర్ణ పతకాలు ఆశిస్తుంది. ఈ క్రీడల్లో భారత షెడ్యూల్ ఎలా ఉందంటే.. జులై 29: అశ్విని పొన్నప్ప, సుమీత్ రెడ్డి (బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్) జులై 30: నితేందర్ రావత్ (పురుషుల మారథాన్) ఆగస్ట్ 2: అవినాశ్ సేబుల్ (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్) మురళీ శ్రీశంకర్, మహ్మద్ అనీస్ (పురుషుల లాంగ్ జంప్) జ్యోతి (మహళల 100మీ హర్డిల్స్) నవ్జీత్ కౌర్ (మహిళల డిస్కస్ త్రో) ఆగస్ట్ 3: పీవీ సింధు, ఆకర్షి కశ్యప్ (బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్) లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ (పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్) ఆగస్ట్ 4: ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్) సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్) ఆగస్ట్ 5: నీరజ్ చోప్రా, డీపీ మను, రోహిత్ యాదవ్ (పురుషుల జావెలిన్ త్రో) అబ్దుల్లా అబూబాకర్, ప్రవీణ్ చిత్రవేల్, ఎల్దోస్ పాల్ (పురుషుల ట్రిపుల్ జంప్) సందీప్ కుమార్, అమిత్ ఖత్రి (పురుషుల 10కిమీ రేస్ వాక్) ఆన్సీ సోజన్ (మహిళల లాంగ్ జంప్) అన్నూ రాణి, శిల్పా రాణి (మహిళల జావెలిన్ త్రో) మంజు బాలా సింగ్, సరితా రోమిత్ సింగ్ (మహిళల హ్యామర్ త్రో) ఆగస్ట్ 6: అమోజ్ జాకబ్, నోవా నిర్మల్ టామ్, అరోకియా రాజీవ్, మహ్మద్ అజ్మల్, నాగనాథన్ పండి, రాజేష్ రమేష్ (పురుషుల 4X400మీ రిలే) భావన జాట్, ప్రియాంకా గోస్వామి (మహిళల 10కిమీ రేస్ వాక్) హిమ దాస్, ద్యుతీ చంద్, శ్రాబనీ నందా, ఎంవీ జిల్నా, ఎన్ఎస్ సిమి (మహిళల 4X100మీ రిలే) మహిళల క్రికెట్: జులై 29: భారత్ vs ఆస్ట్రేలియా జులై 31: భారత్ vs పాకిస్థాన్ ఆగస్ట్ 3: భారత్ vs బార్బడోస్ పురుషుల హాకీ: జులై 31: భారత్ vs ఘనా ఆగస్ట్ 1: భారత్ vs ఇంగ్లండ్ ఆగస్ట్ 3: భారత్ vs కెనడా ఆగస్ట్ 4: భారత్ vs వేల్స్ మహిళల హాకీ: జులై 29: భారత్ vs ఘనా జులై 30: భారత్ vs వేల్స్ ఆగస్ట్ 2: భారత్ vs ఇంగ్లండ్ ఆగస్ట్ 3: భారత్ vs కెనడా బాక్సింగ్: జులై 30: అమిత్ పంగాల్ (మెన్స్ 51 కేజీ) మహ్మద్ హుసాముద్దీన్ (మెన్స్ 57 కేజీ) శివ థాపా (మెన్స్ 63 కేజీ) రోహిత్ టోకాస్ (మెన్స్ 67 కేజీ) సుమిత్ కుందు (మెన్స్ 75 కేజీ) ఆశిష్ చౌదరి (మెన్స్ 80 కేజీ) సంజీత్ (మెన్స్ 92 కేజీ) సాగర్ (మెన్స్ 92+ కేజీ) నీతూ (వుమెన్స్ 48 కేజీ) నిఖత్ జరీన్ (వుమెన్స్ 50 కేజీ) జాస్మిత్ (వుమెన్స్ 60 కేజీ) లవ్లీనా బోర్గహైన్ (వుమెన్స్ 70 కేజీ) వెయిట్లిఫ్టింగ్: జులై 30: మీరాబాయి చాను (వుమెన్స్ 55 కేజీ) సంకేత్ మహదేవ్ (మెన్స్ 55 కేజీ) రిషికాంతా సింగ్ (మెన్స్ 55 కేజీ) జులై 31: బింద్రాయనీ దేవి (వుమెన్స్ 59 కేజీ) జెరెమీ లాల్రినుంగా (మెన్స్ 67 కేజీ) అచింతా (మెన్స్ 73 కేజీ) ఆగస్ట్ 1: పాపీ హజారికా (వుమెన్స్ 64 కేజీ) అజయ్ సింగ్ (మెన్స్ 81 కేజీ) ఆగస్ట్ 2: ఉషా కుమార (వుమెన్స్ 87 కేజీ) పూర్ణిమా పాండే (వుమెన్స్ 87+ కేజీ) వికాస్ ఠాకూర్ (మెన్స్ 96 కేజీ) రాగాల వెంకట్ రాహుల్ (మెన్స్ 96 కేజీ) రెజ్లింగ్: ఆగస్ట్ 5: బజరంగ్ పూనియా (మెన్స్ 65 కేజీ) దీపక్ పూనియా (మెన్స్ 86 కేజీ) మోహిత్ గ్రెవాల్ (మెన్స్ 125 కేజీ) అన్షు మాలిక్ (వుమెన్స్ 57 కేజీ) సాక్షి మాలిక్ (వుమెన్స్ 62 కేజీ) దివ్యా కాక్రన్ (వుమెన్స్ 68 కేజీ) ఆగస్ట్ 6:రవికుమార్ దహియా (57 కేజీ) నవీన్ (మెన్స్ 74 కేజీ) దీపక్ (మెన్స్ 97 కేజీ) పూజా గెహ్లోత్ (వుమెన్స్ 50 కేజీ) వినేష్ పోఘాట్ (వుమెన్స్ 53 కేజీ) పూజా సిహాగ్ (వుమెన్స్ 76 కేజీ) లైవ్ ఎందులో అంటే.. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ బ్రాడ్కాస్టింగ్ హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ సొంతం చేసుకుంది. చదవండి: భారత్కు వరుస షాక్లు.. డోప్ టెస్ట్లో పట్టుబడ్డ మరో అథ్లెట్ -
భారత్కు వరుస షాక్లు.. డోప్ టెస్ట్లో పట్టుబడ్డ మరో అథ్లెట్
Commonwealth Games 2022: బర్మింగ్హామ్ వేదికగా ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి ముందు భారత్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్లో విఫలమై మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మరో అథ్లెట్కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. మహిళల 4x100 మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు (ఇదివరకే ఈ విభాగంలో ఓ సభ్యురాలు డోప్ టెస్టులో విఫలమైంది) డోప్ టెస్ట్లో పట్టుబడినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధృవీకరించారు. అయితే ఆ అథ్లెట్ పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కాగా, గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు (అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లై) సహా మరో ఇద్దరు భారత అథ్లెట్లు (స్ప్రింటర్ ధనలక్ష్మీ, ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబు) డోప్ టెస్ట్లో విఫలమైన విషయం తెలిసిందే. తాజా ఘటనతో భారత బృందంలో డోపీల సంఖ్య 5కు చేరింది. చదవండి: డోపింగ్లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు -
తేజస్విన్కు అనుమతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనేందుకు భారత హైజంప్ ప్లేయర్ తేజస్విన్ శంకర్కు నిర్వాహకులు అనుమతించారు. ఒకే ఈవెంట్లో వైదొలిగిన ప్లేయర్ స్థానంలో మరొకరికి అనుమతి ఇస్తామని గతంలో తేజస్విన్ ఎంట్రీని నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే శుక్రవారం డెలిగేట్ రిజిస్ట్రేషన్ మీటింగ్ ముగిశాక తేజస్విన్ ఎంట్రీకి పచ్చజెండా ఊపారు. స్వదేశంలో సెలెక్షన్ టోర్నీలో తేజస్విన్ బరిలోకి దిగలేదు. అయితే అతను కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని అమెరికాలో నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్స్ మీట్లో నమోదు చేశాడు. కానీ భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తేజస్విన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా అతనిని ఎంపిక చేయలేదు. దాంతో తేజస్విన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఏఎఫ్ఐ అధికారులు తేజస్విన్ పేరును కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు పంపించారు. -
నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచినపుడు.. అద్భుతమైన ఫీలింగ్: స్మృతి మంధాన
Commonwealth Games 2022- Smriti Mandhana: ‘‘విశ్వవేదికపై భారత జాతీయ జెండా రెపరెపలాడినపుడు.. జాతీయ గీతం విన్నపుడు కలిగే అద్భుతమైన, అనిర్వచనీయమైన భావన ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో ఇలాంటి అద్బుత క్షణాలను మేము కూడా ఆస్వాదించాం. స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అన్నారు. ఆసీస్తో తొలి పోరు.. కాగా ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు-2022 నిర్వహించేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత క్రికెటర్లకు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తిరిగి పాల్గొనే అవకాశం వచ్చింది. మన జెండా ఎగరాలి.. ఇందులో భాగంగా భారత మహిళా జట్టు పతకం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది. కాగా టీ20 ఫార్మాట్లో నిర్వహించే కామన్వెల్త్ క్రికెట్ విభాగంలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మొదటగా జూలై 29న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘‘కేవలం నామమాత్రపు విజయాలకే మేము పరిమితం కావాలనుకోవడం లేదు. మన జెండా పైకెగరాలి. జాతీయ గీతం వినిపించాలి. ప్రతి ఒక్కరు అనుభవించాలనుకునే అద్భుత భావన. ఒలంపిక్స్లో భారత్కు పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా గురించి తలచుకున్నప్పుడల్లా నాకు గూస్బంప్స్ వస్తాయి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 💬 💬 We are aiming for Gold Medal at the Commonwealth Games: #TeamIndia vice-captain @mandhana_smriti. 👍 👍#B2022 pic.twitter.com/7Tsovu3Y12 — BCCI Women (@BCCIWomen) July 22, 2022 మేము సైతం.. అలాంటి బెస్ట్ ఫీలింగ్ కోసం తాము కూడా కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒలంపిక్స్లో కాకపోయినా కామన్వెల్త్లో పతకం గెలిచి ఈ లోటు పూడ్చుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి జట్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సమాయత్తమయ్యామని, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని స్మృతి మంధాన పేర్కొన్నారు. కాగా కామన్వెల్త్ క్రీడలు-2022లో మొత్తం ఎనిమిది మహిళా క్రికెట్ జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్ బిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఇక టోక్యో ఒలింపిక్స్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా బంగారు పతకం గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్కు నో ఛాన్స్! ధావన్తో ఓపెనర్గా అతడే! ఇక ఫినిషర్గా ఎవరంటే.. Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోదీ
-
డోపింగ్లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్హామ్కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
కామన్ వెల్త్ గేమ్స్కు ముందు భారత్కు భారీ షాక్..!
బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. దీంతో వీరిద్దరు కామన్ వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ బుధవారం నిర్వహించిన డోప్ టెస్టులో ధనలక్ష్మి నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. ధనలక్ష్మి కామన్ వెల్త్ గేమ్స్కు 100 మీటర్లు, 4x100 మీటర్ల రిలే జట్టులో ద్యుతీ చంద్, హిమా దాస్ ,శ్రబాని నందా వంటి వారితో పాటుగా ఎంపికైంది. కాగా ధనలక్ష్మి గతేడాది 100 మీటర్ల రేసులో స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ను ఓడించి సంచలనం సృష్టించింది. దీంతో పాటు గత నెలలో ధనలక్ష్మి 200 మీటర్ల పరుగుల రేసులో పరుగుల చిరుత హిమదాస్పై విజయం సాధించింది. ఇక ఐశ్వర్యబాబు విషయానికి వస్తే.. గత నెలలో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సందర్భంగా నాడా అధికారులు ఐశ్వర్య శాంపిల్ను తీసుకున్నారు. తాజాగా ఆమె కూడా నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. ఆమె కామన్ వెల్త్ గేమ్స్-2022కు ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ ఈవెంట్లకు ఆమె ఎంపికైంది. చదవండి: Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
Commonwealth Games 2022: బర్మింగ్హామ్లో వేర్వేరుగా వసతి!
న్యూఢిల్లీ: గత కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య వేదికలకు భిన్నంగా ఈ సారి బర్మింగ్హామ్లో బస ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏదైనా మెగా ఈవెంట్ జరిగితే ఒక క్రీడా గ్రామాన్ని నిర్మించి అందులో అందరికి వసతి ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం బర్మింగ్హామ్లో ఒక దేశానికి చెందిన అథ్లెట్ల బృందం ఒకే చోట ఉండటం కుదరదు. కరోనా తదితర కారణాలతో ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం 5000 పైచిలుకు అథ్లెట్ల కోసం బర్మింగ్హామ్లో ఐదు క్రీడా గ్రామాల్ని అందుబాటులోకి తెచ్చింది. 16 క్రీడాంశాల్లో పోటీపడే 215 మంది భారత అథ్లెట్లు ఇప్పుడు ఈ ఐదు వేర్వేరు క్రీడా గ్రామాల్లో బసచేయాల్సి ఉంటుంది. కోచ్లు, అధికారులు కలుపుకుంటే భారత్నుంచి 325 మంది బర్మింగ్హామ్ ఫ్లయిట్ ఎక్కనున్నారు. బస ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాల వివరాలను ఆర్గనైజింగ్ కమిటీ భారత ఒలింపిక్ సంఘాని (ఐఓఏ)కి సమాచార మిచ్చింది. ఈ నెల 28 నుంచి బర్మింగ్హామ్లో ప్రతిష్టాత్మక పోటీలు జరుగనున్నాయి. -
Commonwealth Games: భారత హైజంపర్ తేజస్విన్ శంకర్కు షాక్!
న్యూఢిల్లీ: కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్ తేజస్విన్ శంకర్కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్ నిర్వాహకులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం తేజస్విన్ ఎంట్రీ ఆలస్యం కావడమే అందుకు కారణం. అర్హత మార్క్ సాధించినా... భారత్లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్లో పాల్గొనలేదనే కారణంతో తేజస్విన్ పేరుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య పంపలేదు. అయితే తేజస్విన్ కోర్టుకెక్కడంతో 400 మీటర్ల రన్నర్ అయిన అరోకియా రాజీవ్ స్థానంలో తేజస్విన్ను ఎంపిక చేశారు. అయితే సీడబ్ల్యూజీ నిబంధనల ప్రకారం ఒకరికి బదులుగా మరొకరిని ఎంపిక చేస్తే అదే ఈవెంట్కు చెందిన ఆటగాడు అయి ఉండాలి. రన్నర్కు బదులుగా హైజంపర్ను అనుమతించేది లేదని నిర్వాహకులు భారత ఒలింపిక్ సంఘానికి సమాచారమందించారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
‘కామన్వెల్త్’కు తేజస్విన్!
న్యూఢిల్లీ: హైజంపర్ తేజస్విన్ శంకర్ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసింది. కోర్టు సూచన మేరకు అమెరికాలో కళాశాల క్రీడల్లో కనబరిచిన అతని ప్రదర్శనను ఏఎఫ్ఐ గుర్తించింది. అర్హత ప్రమాణం (2.27 మీ.) పూర్తి చేసిన తేజస్విన్ను బర్మింగ్హామ్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తేజస్విన్తోపాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేత స్వప్న బర్మన్ (హెప్టాథ్లాన్), ఆంధ్రప్రదేశ్కు చెందిన మారథాన్ రన్నర్ శ్రీను బుగత, అనిశ్ థాపా, రిలే రన్నర్ జిల్నాలను కూడా ఎంపిక చేశారు. అయితే ఈ ఐదుగురి పేర్లను భారత ఒలింపిక్ సంఘం ఆమోదిస్తేనే వీరికి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే వీలుంటుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు తుది జాబితాను ఈనెల 30లోపు పంపించాలి. చదవండి: ENG vs NZ: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచకప్లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్కీపర్ రజనిని ఎంపిక చేశారు. అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోర్నీకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు. భారత మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజనీ ఎటిమార్పు, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెపఎటన్), గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను పుఖ్రంబం, మోనిక, నేహా, జ్యోతి, నవజోత్ కౌర్, సలీమా టేరియా, వందన కటరియా , లాల్రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, సంగీత కుమారి చదవండి: FIH Womens Hockey World Cup: ‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్కు.. -
తేజస్విన్ పేరును పరిశీలించండి
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ కోసం ఎంపికల రగడ కోర్టుల చుట్టూనే తిరుగుతుంది. టేబుల్ టెన్నిస్లో అయితే భారత జట్టులో చోటు కోసం వరుసబెట్టి క్రీడాకారులు హైకోర్టు తలుపు తట్టారు. తాజాగా పురుష అథ్లెట్ తేజస్విన్ శంకర్ కూడా ఎంపిక విషయమై కోర్టు మెట్లెక్కాడు. అతని పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెలక్షన్ కమిటీ ఆ హై జంపర్ మెరిట్స్ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ను ఆదేశించింది. తేజస్విన్ శంకర్ హైజంప్లో జాతీయ రికార్డు (2.29 మీటర్లు) సాధించాడు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అతను ఇటీవల అక్కడే జరిగిన నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్లో 2.27 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి బంగారు పతకం గెలిచాడు. ఏఎఫ్ఐ అర్హత మార్క్ కూడా 2.27 మీటర్లే! అయితే ఏఎఫ్ఐ అమెరికా పోటీల విషయమై శంకర్ తమను సంప్రదించలేదనే అహంతో... అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొనలేదన్న కారణంతో బర్మింగ్హామ్ ఈవెంట్కు ఎంపిక చేయలేదు. దీనిపై విచారించిన జస్టిస్ జస్మిత్ సింగ్ ఇలాంటి అహం, భేషజాలను పక్కనబెట్టి అతని ప్రతిభను గుర్తించి కామన్వెల్త్ గేమ్స్కు ఎంపిక చేయాలని కేంద్ర క్రీడాశాఖ, ఏఎఫ్ఐకు నోటీసులు జారీ చేసింది. -
కామన్వెల్త్ గేమ్స్కు భారత హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు వాయిదా పడటంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత పురుషుల హాకీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనే 18 మంది సభ్యులుగల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ఇటీవల ప్రొ హాకీ లీగ్ మ్యాచ్ల కోసం మన్ప్రీత్ స్థానంలో అమిత్ రోహిదాస్ను జట్టు కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే చైనాలో కరోనా ఉధృతితో ఈ ఏడాది జరగాల్సిన ఆసియా క్రీడలు వాయిదా పడ్డాయి. దాంతో హాకీ ఇండియా కామన్వెల్త్ గేమ్స్ కోసం అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో రెండుసార్లు రజత పతకాలు నెగ్గిన భారత్ ఈసారి పూల్ ‘బి’లో ఇంగ్లండ్, కెనడా, వేల్స్, ఘనా జట్లతో ఆడుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: మన్ప్రీత్ సింగ్(కెప్టెన్), హర్మన్ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), పీఆర్ శ్రీజేష్, కృషన్ బహదూర్ పాథక్ (గోల్ కీపర్లు), జుగ్రాజ్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్. చదవండి: వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
‘కామన్వెల్త్’కు జ్యోతి
న్యూఢిల్లీ: బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్కోస్ట్లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్లో ఉంది. అన్నింటికి మించి హైజంప్లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్ను అందుకున్న తేజస్విన్ శం కర్ను ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్లో ఎన్సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు. -
కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది. ప్రపంచ చాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. -
Commonwealth Games: కోర్టుకెక్కిన మరో టీటీ ప్లేయర్.. ఏం జరిగింది?
కామన్వెల్త్ క్రీడల కోసం భారత టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపికకు సంబంధించి వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే దియా చిటాలే, మనుష్ షా టీమ్ ఎంపికను ప్రశ్నించారు. తాజాగా స్వస్తిక ఘోష్ కూడా తనకు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఎంపిక ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం చూస్తే స్వస్తిక నాలుగో స్థానంలో ఉంటుందని, ఆమెను జట్టులోకి ఎంపిక చేయాల్సిందని ఆమె తండ్రి సందీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. కాగా దియా చిటాలేను తర్వాత టీటీ జట్టులో చేర్చగా మానుష్ షాకు మాత్రం నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ ఎంపిక నిబంధనల ప్రకారం అతడు టాప్-4లో ఉన్నా స్క్వాడ్లో చేర్చకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. శుక్రవారం ఇందుకు సంబంధించి విచారణ జరుగనుంది. ఇక జాతీయ స్థాయిలో ప్రదర్శన(50 శాతం), అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన(30 శాతం).. సెలక్టర్ల విచక్షణ అధికారం(20 శాతం) మేరకు ఆయా ప్లేయర్లకు స్క్వాడ్(టాప్-4)లో చోటు దక్కుతుంది. ఈ క్రమంలో పలువురు టీటీ ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది -
కామన్వెల్త్కు హుసాముద్దీన్
పటియాలా: తెలంగాణకు చెందిన బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోకి ఎంపికయ్యాడు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన భారత బాక్సింగ్ సమాఖ్య వేర్వేరు విభాగాలకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేసింది. 57 కేజీల విభాగం ట్రయల్స్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4–1 తేడాతో 2019 ఆసియా చాంపియన్షిప్ రజత పతక విజేత కవీందర్ సింగ్పై విజయం సాధించడంతో అతనికి అవకాశం దక్కింది. గోల్డ్కోస్ట్లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొన్న హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. భారత జట్టు వివరాలు: అమిత్ పంఘాల్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57), శివ థాపా (63), రోహిత్ టోకస్ (67), సుమిత్ (75), ఆశిష్ కుమార్ (80), సంజీత్ (92), సాగర్ (92 ప్లస్). -
Nikhat Zareen: ‘ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు’
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం నిఖత్ జరీన్ భుజానికి గాయమైంది. శస్త్ర చికిత్స కూడా చేయాల్సి రాగా, ఏడాది పాటు ఆమె ఆటకు దూరమైంది. కోలుకున్న తర్వాత కూడా పూర్తి ఫిట్గా లేకపోవడంతో 2018 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్షిప్లో కూడా పాల్గొనలేకపోయింది. దాంతో ఒక్కసారిగా ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. అయితే పట్టుదలతో మళ్లీ బరిలోకి దిగిన నిఖత్ అత్యుత్తమ ప్రదర్శనతో మళ్లీ రింగ్లోకి దూసుకొచ్చింది. ‘ఆ సమయంలో కూడా నాపై నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదని, చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచ చాంపియన్గా నిలవగలిగాను. 2019లో పునరాగమనం చేసిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆడిన ప్రతీ టోర్నీలోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. గత రెండేళ్లలో తన ఆటలో లోపాలు సరిదిద్దుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఆమె చెప్పింది. ‘2019 నుంచి పూర్తిగా నా ఆటను మెరుగుపర్చుకోవడానికే ప్రయత్నించా. బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుంటూ సాధన చేశా. అందుకోసం కఠినంగా శ్రమించా. నా జీవితంలో ఎదుర్కొన్న అవాంతరాలు నన్ను దృఢంగా మార్చాయి. మున్ముందు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల ని మానసికంగా సన్నద్ధమయ్యా’ అని జరీన్ పేర్కొంది. రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడం తన ప్రస్తుత లక్ష్యమన్న ఈ తెలంగాణ బాక్సర్... 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం ఏ కేటగిరీలో బరిలోకి దిగాలో నిర్ణయిం చుకోలేదని వెల్లడించింది. ‘ఒలింపిక్స్లాగే కామన్వెల్త్ క్రీడల్లోనూ 52 కేజీల కేటగిరీ లేదు. 50 కేజీలు లేదా 54 కేజీల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే 50 కేజీల కేటగిరీలో పతకం కోసం ప్రయత్నిస్తా. నాకు సంబంధించి ఎక్కువ బరువును ఎంచుకోవడం కంటే తక్కువకు రావడం కొంత సులువు. కాబట్టి దానిపైనే దృష్టి పెడతా’ అని జరీన్ స్పష్టం చేసింది. -
CWG 2026: మన పతకాలకు మళ్లీ ఎసరు!
లండన్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) మన పతకావకాశాలకు మళ్లీ ఎసరు పెట్టింది. విక్టోరియా (ఆస్ట్రేలియా) రాష్ట్రంలో జరిగే తదుపరి మెగా ఈవెంట్లోనూ భారత్ ‘గురి’పెట్టలేదు. ‘పట్టు’ పట్టలేదు. కొత్తగా బహుళ వేదికల్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో కూడా షూటింగ్, ఆర్చరీ క్రీడాంశాలతో పాటు రెజ్లింగ్ను పక్కన పెట్టేశారు. సీడబ్ల్యూజీలో భారత్కు పతకావకాశాలున్న ఈవెంట్లు లేకపోవడంతో మళ్లీ నిరాశనే మిగిలింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హామ్ ఆతిథ్యమిచ్చే పోటీల్లో షూటింగ్, ఆర్చరీలను నిర్వహించడం లేదు. దీనిపై గతంలోనే భారత్ తమ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చింది. ఒకానొక దశలో ‘బాయ్కాట్’ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. మొత్తం మీద బర్మింగ్హామ్ నిర్వాహకులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో సంప్రదింపులు జరిపి బుజ్జగించడంతో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకో అడుగు ముందుకేసి రెజ్లింగ్ను తప్పించడం భారత శిబిరాన్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే. బహుళ వేదికల్లో... 2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని సీడబ్ల్యూజీ ఆర్గనైజింగ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్లాండ్ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మాత్రం ఆతిథ్య, ముగింపు వేడుకలకు పరిమితమైంది. టి20 క్రికెట్ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ ఈవెంట్లు లేవు. సీజీఎఫ్ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్ (1962), బ్రిస్బేన్ (1982), గోల్ట్కోస్ట్ (2018)లలో మెగా ఈవెంట్స్ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్ కామన్వెల్త్ గేమ్స్ పోటీలు కూడా జరిగాయి. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్కు మతి భ్రమించిందా..? -
సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్లో... భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపించడంలేదు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, థామస్ కప్ –ఉబెర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్వహించే సెలెక్షన్ ట్రయల్స్కు దూరంగా ఉండాలని 23వ ర్యాంకర్ సైనా నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈనెల 15న నుంచి 20 వరకు జరిగే ట్రయల్స్కు దూరంగా ఉంటున్నానని సైనా ‘బాయ్’కు లేఖ రాసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్–15 లో ఉన్నవారికి నేరుగా చోటు లభిస్తుందని... 16 నుంచి 50 ర్యాంకింగ్స్లో ఉన్న వారు ట్రయల్స్కు హాజరుకావాలని ‘బాయ్’ తెలిపింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ