contract lecturers
-
కాంట్రాక్టు లెక్చరర్లపై కక్ష!
‘కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధికరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..’ – 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరు ప్రజాగళం సభలో బాబు హామీ! ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేలా పోరాడతా’.. – 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖీలో పవన్ కళ్యాణ్ హామీ! సాక్షి, అమరావతి: తమ జీవితాలను మార్చే హామీని అమలు చేయాలని వేడుకుంటే.. ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ మేనిఫెస్టోలో లేదు కాబట్టి అమలు చేయలేం’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుండ బద్ధలు కొడుతున్నారని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు వీలుగా గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని అయినా అమలు చేయాలని కోరితే.. ‘ఆ చట్టాన్ని తాము అమలు చేయాలన్న రూల్ లేదు’ అని లోకేశ్ తేల్చి చెబుతుండటంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఇటీవల నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు ప్రాణాలు విడిచారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక మృతుల కుటుంబాలు వీధిన పడ్డాయి. 2000లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించగా తెలంగాణలో 2021లో కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఒకే జీవో ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా చేరిన వారు తెలంగాణలో రెండేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా కాంట్రాక్ట్ సిబ్బందిగానే కొనసాగుతున్నారు. ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2023 అక్టోబర్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.దీని ప్రకారం 2014 జూన్కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్ధీకరించాలని జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పని చేస్తున్న 3 వేల మంది రెగ్యులరైజ్ కావడంతోపాటు గతేడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారి క్రమబద్ధీకరణ మాత్రం ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. వీరిలో 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. అర్హులైన అందరి వివరాలు ఆర్థికశాఖ ‘నిధి పోర్టల్’లో ఉన్నా కూటమి ప్రభుత్వం తొక్కిపెడుతోంది.కాంట్రాక్టు జేఎల్స్కు తీవ్ర అన్యాయంగత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. కాంట్రాక్టు ఉద్యోగులపై గత ప్రభుత్వాలు వివిధ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించినా వారి కల సాకారం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి సమస్యలపై చర్చించి 30/23 చట్టం తెచ్చింది. దీని ప్రకారం మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు.ప్రాణాలు పోతున్నా పట్టదా..!తెలంగాణలో ఎలాంటి చిక్కులు లేకుండా విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండేళ్ల క్రితమే రెగ్యులర్ అయ్యారు. 30/23 ద్వారా ఏపీలోనూ రెగ్యులర్ కావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం వారి పట్ల కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇంటర్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మరణించిన కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలకు పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉన్నా అమలు కావడం లేదని బాధిత కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి. -
చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
-
పాపం.. కాంట్రాక్ట్ లెక్చరర్లు!
‘కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్దీకరిస్తాం. ఈ బాధ్యత నేను తీసుకుంటున్నాను’.. ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ఇది. కానీ.. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి ఈ హామీని గుర్తుచేస్తే క్రమబద్దీకరణ కుదరదు పొమ్మన్నారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖి సమావేశమై ‘ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు పోరాడుతా’.. అని హామీ ఇచ్చారు. ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖం కూడా చూపించలేదు. సాక్షి, అమరావతి : కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఝులక్ ఇచ్చింది. ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని, వారి సర్వీసును క్రమబద్దీకరిస్తామని మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఆ అంశాన్నే పక్కన పెట్టేశారు. అంతేకాదు.. ఈ అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడంతో కాంట్రాక్టు లెక్చరర్లు కంగుతిన్నారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2021లో తెలంగాణ ప్రభుత్వం అక్కడి కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కూడా క్రమబద్దీకరించేందుకు గతేడాది అక్టోబరులో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. 2014 జూన్కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్దీకరించాలని జీఓ–114 ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పనిచేస్తున్న 3 వేల మందిని రెగ్యులరైజ్ చేయగా, మిగిలిన వారి వివరాలు తీసుకునేసరికి ఎన్నికల కోడ్ అమలుతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆందోళనలో ఐదువేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు.. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లే ఉన్నారు. వీరిలో ఇంటర్మీడియట్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది పనిచేస్తున్నారు. 2023 అక్టోబరులో చేసిన చట్టం ప్రకారం వీరినీ క్రమబద్ధీకరించేందుకు వారి వివరాలు, సర్వీసు, విద్యార్హతల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసి ఫైల్ను న్యాయ నిపుణుల సలహా కోసం పంపారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. క్రమబద్దీకరణ కోసం అర్హులుగా గుర్తించిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరు మాత్రమే రెగ్యులర్ కావడంతో మిగిలిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెర్ఫార్మెన్స్ పేరుతో కొత్త నిబంధన.. ఇదిలా ఉంటే.. ఏటా కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యువల్ను జూన్లో ఇవ్వాల్సి ఉండగా, ఈసారి మూడు నెలలు ఆలస్యంగా రెన్యువల్ చేశారు. అందులోనూ 3,618 మందిలో 558 మంది పనితీరు సరిగ్గాలేదని పక్కనపెట్టారు. పైగా.. ఈ విద్యా సంవత్సరం ఒప్పందంలో ‘పెర్ఫార్మెన్స్’ అనే కొత్త నిబంధనను తీసుకురావడం గమనార్హం. అంటే వచ్చే ఏడాది ఈ వంకతో ఎంతమందిని తొలగిస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. త్వరలో డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 350 మంది నాన్ టీచింగ్ స్టాఫ్కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. కానీ, ఆ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది.మా గోడు ఆలకించండితమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ పాదగయలో హోమం పిఠాపురం: ఎన్నికల ముందు తమకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో వినూత్న నిరసన నిర్వహించారు. ఎన్నో రోజులుగా తమ గోడు వినిపించుకోండంటూ ప్రభుత్వం వద్ద వాపోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో దేవుడి వద్ద తమ గోడు తెలుపుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు బీఎస్ఆర్ శర్మ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ తమ సమస్యలను పట్టించుకోవాలనే..ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసన చేపట్టామన్నారు. ఆదివారం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసనలు నిర్వహించి వచ్చే ఆదివారం విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, ఆపై ఆదివారం సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో వినూత్న నిరసనలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి, పురూహూతికా అమ్మవారి సన్నిధిలో పొర్లు దండాలు పెట్టి, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి దేవుడా! ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి, మా బాధలు వినేలా చేయి అంటూ తమ గోడును విన్నవించుకున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో వీరంతా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్ను కట్చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు పలువురు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. గత పాలకులు ఎగతాళి చేశారు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచమంటే మీకిదే ఎక్కువని గత పాలకులు గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న మా బాధలు చూసి స్వయంగా మా ధర్నా శిబిరాలకు వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కలకాలం ఆయనకు రుణపడి ఉంటాం. – కల్లూరి శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ కో–చైర్మన్ 10 వేలకు పైగా కుటుంబాల్లో వెలుగులు రెండు దశాబ్దాలకు పైగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ, జగన్ పాదయాత్రలో మా సమస్యను విని సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పరిష్కరించారు. ఈ నిర్ణయంతో 10,117 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ఆయనకు అండగా ఉంటాయి. – డి. ఉమాదేవి, కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి సీఎం మేలు మరువలేం.. సీఎం జగనన్న మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. పది కాలాలపాటు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మహిళా ఉద్యోగులందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు దైవకృçప, ప్రజల ఆశీçస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.– ఆర్. దీప, కాంట్రాక్ట్ లెక్చరర్ (కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి) ఐదేళ్ల నిబంధన తొలగింపు చరిత్రాత్మకం.. సీఎం జగనన్న తీసుకున్న రెగ్యులరైజేషన్ నిర్ణయం 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఐదేళ్ల నిబంధన తొలగింపు నిర్ణయం చరిత్రాత్మకం. జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకుకృషిచేస్తాం.– కుమ్మరకుంట సురేష్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్లలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వివారలను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారి వివరాలు పంపించాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. దీంతో తమ తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి, వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. 230 మంది కాంట్రాక్ట్ లెక్చర్ర్లు నకిలీలుగా తేలింది. మరికొంతమంది మంజూరు లేని పోస్టులలోపనిచేస్తున్నట్లు, క్వాలిఫికేషన్ లేకున్నా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా జాయిన్ అయినట్లు బయటపడింది. ఇప్పటి వరకు 18 మంది డిగ్రీ లెక్చర్లు, ఆరుగురు పాలిటెక్నిక్ లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. మరి నకిలీ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. చదవండి: బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు -
రెసిడెన్షియల్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఏపీఆర్ఈఐ) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం పెంచింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్స్కేల్ను అమలు చేయనుంది. యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైమ్స్కేల్ను మంజూరు చేస్తూ గతంలో ఆర్థికశాఖ 40వ నంబరు జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఏపీఆర్ఈఐ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహరావు మెమో ఇచ్చారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం పెరగనున్న జీతాల వివరాలు.. -
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్లు ‘భయో’ పిక్లు, కాకూడదు) -
కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం: మంత్రి హరీశ్
సిద్దిపేట ఎడ్యుకేషన్ : ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు పీఆర్సీ అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ (జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్) ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో రాష్ట్రస్థాయి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. సభకు మంత్రి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి 2014 నుంచి నేటి వరకు రూ.567 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. పీఆర్సీ అమలుతో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ తదితర 1.20 లక్షల మంది చిరు ఉద్యోగులకు లబ్ధి కలిగిందన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అని పేర్కొన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి సబ్కమిటీని ఏర్పాటు చేశామని, రూ.4 వేల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు. -
పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత కొంతకాలంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. వారికి 12 నెలల జీతం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత అధ్యాపకుల వినతి మేరకు 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆయన ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రైవేట్ ఓరియంటల్.. ప్రభుత్వ ఓకేషనల్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇది వర్తించనుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 5,042 మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. (చదవండి: అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం) -
వేదన తీరె.. బోధన మారె!
శ్రీకాకుళం న్యూకాలనీ: కాంట్రాక్ట్ లెక్చరర్లకు జగన్మోహన్రెడ్డి సర్కారు తీపి కబురును అందించింది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్ల అర్హతలు, సీనియారిటీ ప్రాతిపదికన క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల తమ చిరకా ల న్యాయపరమైన డిమాండ్ నెరవేరిందని పట్టరాని ఆనందంతో ఉన్నారు. బుధవారం రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా కళాశాలలు తెరుచుకున్న సమయంలో ఆ నోటా ఈ నోటా ఇదే చర్చ. దశాబ్దాల డిమాండ్ను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పదిరోజుల్లోనే మోక్షం కలకడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు సంతోషంతో మునిగితేలుతున్నారు. సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకోవడంపై వారంతా నూతనోత్సాహంతో పనిచేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇది.. రాష్ట్రవ్యాప్తంగా 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3800 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 44 ప్రభుత్వ జూని యర్ కళాశాలలు ఉండగా దాదాపు 388 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న మరో 80 మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 20శాతం మంది రెండు దశాబ్దాల నుంచి కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తుండగా, మరో 50 శాతం మంది దశాబ్దానికి పైగా ప్రభుత్వ కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. 1999లో కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థను నాటి చంద్రబాబు తీసుకొచ్చారు. ఒక లెక్చరర్కు ఇచ్చే జీతంతో నలుగురుగు కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాఠాలు బోధించవచ్చని దుర్మార్గపు ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారని విద్యావేత్తలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్లపై పూర్తిగా శీత కన్నేసింది. తమకు జీతాలు పెంచాల ని, సమాన పనికి సమాన వేతనం మంజూరుచేయాలని, క్రమబద్ధీకరణ జరపాలని వివిధ రూపాల్లో ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, వంటా వార్పు చేపట్టారు. ఎంత చేసినా ఏంచేసినా కాంట్రాక్ట్ లెక్చరర్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. పొరుగునే ఉన్న తెలంగాణా రాష్ట్రంలో బేసిక్ (రూ.38,000) వేతనాన్ని జీతంగా చెల్లిస్తుండగా రాష్ట్రంలో మాత్రం కాంట్రాక్ట్ లెక్చరర్లకు నెలకు రూ.27వేల జీతాన్నే చెల్లిస్తున్నారు. డిగ్రీ లెక్చరర్లకు 30వేలు వరకు లభిస్తుంది. నేను ఉన్నానంటూ.. పాదయాత్రలో జగన్ హామీ ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర సమయంలో అన్నిశాఖల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరిల ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్ల దీనగా థను తెలుసుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘాలు నేరుగా జగన్ దృష్టికి తమ న్యాయపరమైన డిమాండ్ల ను తీసుకెళ్లాయి. మీ సమస్యను నేను విన్నాను .. నేను ఉన్నానంటూ ఆనాడే భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తానని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘ నాయకుల కు జగన్మోహన్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చా రు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పది రోజుల్లోనే జరిగిన మొదటి కేబినేట్ సమావేశంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు శుభం కార్డు పడేలా నిర్ణయం తీసుకోవడంపై సర్వాత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమతో పాటు తమ కుటుంబాల్లో వెలుగులు నింపుతు న్న జగన్మోహన్రెడ్డిని రుణం తీర్చుకోలేమని వారంతా చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకు న్యాయం ఇదే సమయంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు, పార్ట్టైం లెక్చరర్లకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల స్థానంలో ఆరేళ్ల కిందట సత్సమాన విద్యార్హతలతో కూడిన గెస్ట్ లెక్చరర్లు నియామకాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. వీరికి ప్రస్తుతం పీరియడ్కు రూ.150 చెల్లిస్తూ నెలకు గరిష్టంగా రూ.10 వేలు అందజేస్తున్నారు. పార్ట్టైమ్ లెక్చరర్లకు గత ఏడాది దీన్ని పీరియడ్కు రూ.375 చెల్లిస్తూ నెలకు రూ.27 వేలు చెల్లిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేసి మీకు న్యాయం చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చినట్లు గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. కాంట్రా క్ట్ లెక్చరర్ల మాదిరి తమకు కూడా జగన్మోహన్రెడ్డి సర్కారు న్యాయం చేస్తుందని వారంతా ఆశగా ఎదురుచేస్తున్నారు. మా జీవితాల్లో వెలుగులు.. దశాబ్దాల నుంచి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు పాఠాలు బోధిస్తున్నారు. రెగ్యులర్ లెక్చరర్తో సరిసమానంగా విధులు నిర్వర్తిస్తు కళాశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఎదుగుదల, మెరుగైన ఫలితాలకు కారణం అవుతున్నారు. మమ్మల్ని క్రమబద్ధీకరించాలని దశాబ్దం నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. సీఎం జగన్ పుణ్యమా అని మా జీవితాల్లో వెలుగులు రానున్నాయి. – బొడ్డు ప్రవీణ్కుమార్, మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్, జీజేసీ మందస రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఉన్నారు. వారంతా ఆఖరి దశలో ఉన్నారు. దశాబ్దాలుగా ఎన్నో విధాలుగా పోరాటాలు, ధర్నాలు చేశాం. ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో మీ సమస్య నేను విన్నాను.. మీకు నేను ఉన్నాను అంటూ అభయం ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే మొదటి కేబినేట్ భేటీలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం. – కరణం రవీంద్రనాధ్ ఠాగూర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, జీజేసీ బూర్జ అందరికీ న్యాయం చేయాలి.. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మేము ముందునుంచి నమ్ముతున్నాం. ఆయన్ని గెలిపించుకున్నాం. ఆయన ఇచ్చిన మాటకోసం ఎందాకైనా వెళ్తారని అంతా అంటుంటారు. అది మరోసారి రుజువైంది. క్రమబద్ధీకరణకు సర్వీసు, విద్యార్హత తీసుకోవడం మంచిదే. అయితే సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. – హనుమంతు రామ్మోహన్దొర(బుజ్జి), కాంట్రాక్ట్ లెక్చకరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
కాంట్రాక్టు లెక్చరర్లకు తీపి కబురు
వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఏటా 12 నెలలకూ వేతన విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ప్రకటనతో జిల్లాలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలువెల్లివిరిశాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఏడాది కాలానికి పూర్తి వేతనం అందుకోవడమనే కలను సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆచరణలోకి వచ్చింది. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత మాట అటుంచితే మిగతా ఉద్యోగుల మాదిరిగా కనీసం ఏడాదిలో 12 నెలల వేతనాన్ని సైతం పొందలేని దుర్భర పరిస్థితులకు ఇక తెరపడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కలను సాకారం చేశారు. కాంట్రాక్టుఅధ్యాపకులకు 12 నెలలకు పూర్తి వేతనాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చిన ఆదేశం అప్పటికప్పుడే జీవో రూపం దాల్చింది. దీంతో ఈ ఉత్తర్వులకోసం 19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు, విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించే విధంగా ఏడాదికి 12 నెలలకు వేతనం చెల్లించే విధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలో 319 మంది కాంట్రాక్టు అధ్యాపకులు విశాఖపట్నం జిల్లాలో 34 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒక ఒకేషనల్ జూనియర్ కాలేజీ ఉన్నాయి. వీటిలో 319 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.27 వేల వేతనం అందుతోంది. ఇకపై రెండు నెలల జీతం కూడా చెల్లించనుండడంతో ఈ కాంట్రాక్టు లెక్చరర్లు ఒక్కొక్కరు ఏటా రూ.54 వేలు అదనంగా పొందనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లుగా కాలయాపన... ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంది ఉద్యోగులు,ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను సావధానంగా ఆలకించారు. అందులో భాగంగానే కాంట్రాక్టు అధ్యాçప³కులకు ఏడాదిలో కేవలం 10 నెలలకే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో ఏప్రిల్, మే నెలలకు వేతనం ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒక్క సంతకంతో వారి తలరాతలు మార్చివేశారు. గత ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో తమకు 12 నెలల కాలానికి వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు అధ్యాపకులు ఎన్నోమార్లు సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసి, వినతి పత్రాలు సమర్పించారు. 10 నెలలు చెల్లిస్తున్న వేతనాన్ని 12 నెలలకు పెంచేందుకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, చేతులు దులుపుకొంది. రాష్ట్ర వ్యాప్తం గా 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబా లకు సంబంధించిన విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాదాపు మూడేళ్లు తాత్సారం చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఎటూ తేల్చలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, శ్రమ కు తగిన వేతనాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాని ని ఆచరణలోకి తెచ్చి విశ్వసనీయత చాటుకున్నారు. వైఎస్ హయాంలో పెరిగిన జీతాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2000లో చేరిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేవారికి రూ.4,500, పట్టణ ప్రాంతాల్లో పని చేసే వారికి రూ.5,500 జీతం ఇచ్చేవారు. 2005లో వైఎస్ సీఎం అయిన తర్వాత అందరికీ రూ. 8,500 జీతం అమలు చేశారు. తర్వాత 2009లో సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో రూ.18,000 వేలు చేశారు. గత ప్రభుత్వం దానిని రూ. 27 వేలుకు పెంచింది. ఇచ్చిన హామీని నెరవేర్చని ‘బాబు’ ‘తమ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తాం (రెగ్యులరైజ్)’ అంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాక ఈ హామీని ఎన్నికల మేని ఫెస్టోలో కూడా పెట్టారు. అనుకున్నట్లే అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించినా హామీని మాత్రం అమలు చేయలేదు. సాధ్యాసాధ్యాలను పరిశీలించే ందుకని 2016లో జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కమిటీని ఏ ర్పాటు చేశారు. 2017లో మరోసారి ఎమ్మెల్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను చంద్రబాబు ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. సంతోషాన్ని పెంచారు.. కాంట్రాక్టు లెక్చరర్ల వ్యవస్థ ఆరంభమైనప్పట్నుంచి ఏడాదిలో పది నెలలే జీతాలు ఇస్తున్నారు. 12 నెలలూ వేతనాలివ్వాలని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నాం. అయినా ఎవరూ స్పందించలేదు. ఇటీవల ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా ఇబ్బందులు చెప్పుకున్నాం. అధికారంలోకి రాగానే మీ సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాటతప్పకుండా వెంటనే 12 నెలల జీతాలూ ఇచ్చేలా నిర్ణయం తీసుకుని మా అందరిలో ఆయన సంతోషాన్ని పెంచారు. మా ఇతర సమస్యలను కూడా అలాగే పరిష్కరిస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. సీఎంకు కృతజ్ఞతలు. –శర్మ, రాష్ట్ర కార్యదర్శి,ఏపీ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ -
ఆనందమానందమాయే..
రాయవరం (మండపేట): జనహృదయ విజేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కొలువు దీరింది. ఇక అసలుసిసలు ప్రజాప్రభుత్వం వచ్చేసిందన్న విశ్వాసం అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ఇది నిజమే అన్నట్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పండుటాకుల సంక్షేమానికి జగన్ పెద్ద పీట వేసి, వారి పింఛనును పెంచారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీనీ అమలు చేస్తూ వస్తున్న జగన్ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా తీపి కబురు అందించారు. ఇప్పటివరకూ ఏడాది మొత్తం పని చేసినా.. 10 నెలలకు మాత్రమే వారికి వేతనం చెల్లించేవారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ 12 నెలల వేతన విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంట్రాక్టు లెక్చరర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. హామీకే పరిమితమైన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతనాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ ప్రభుత్వం 10 నెలల వేతనాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ నేతలు పలుమార్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12 నెలల వేతన విధానంతో కూడిన టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బేసిక్పై డీఏ ఇవ్వాలన్న వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్ ఎమ్మెల్సీ – ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచారు. మంత్రి ఉపసంఘం నిర్ణయం తెలపకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులకు చివరికి నిరాశే మిగిలింది. హామీ నిలబెట్టుకున్న జననేత నడిసంద్రంలో కొట్టుకుపోతున్న వారికి తెప్ప దొరికినట్లు.. ఎడారిలో ఒయాసిస్సు కనిపించినట్టుగా.. కాంట్రాక్టు లెక్చరర్లకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కనిపించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంలో కాంట్రాక్టు లెక్చరర్లు రాజమహేంద్రవరం, బూరుగుపూడి, కోరుకొండల్లో కలిసి, తమ గోడు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతన విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ మెమో నంబరు 1290413 జారీ చేశారు. ఈ మెమో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రయోజనం కలగనుండగా, జిల్లాలోని ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 498 మందికి మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే వారి సమస్యలను మర్చిపోకుండా ప్రత్యేక మెమో ద్వారా 12 నెలల వేతనాన్ని మంజూరు చేస్తూ (ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకూ.. మార్చి నెల చివరిలో 10 రోజుల బ్రేక్తో) వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందని భావించామని, అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదని కాంట్రాక్టు లెక్చరర్లు ఆనందంగా చెబుతున్నారు. మాట తప్పని నైజం తనది మాట తప్పని, మడమ తిప్పని నైజమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు. తండ్రి వైఎస్ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. మాకు మంచి రోజులు వచ్చాయి. భవిష్యత్తులో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాం. – డాక్టర్ వలుపు కనకరాజు, జిల్లా అధ్యక్షుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ సంతోషంగా ఉంది ఇచ్చిన హామీని మర్చిపోకుండా వెంటనే అమలు చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలన్న విషయాన్ని నిజం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయి. – టి.అమర్ కళ్యాణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్, ఏలేశ్వరం -
పార్ట్ టైం లెక్చరర్స్ను రెగ్యులరైజ్ చేయాలి
ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్లో 1000 మందికిపైగా ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్ను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందని.. వారి ఉద్యోగ భద్రతకు ప్రతిపక్ష నేతగా కృషి చేయాలని తాళ్లూరు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నేత టి.లక్ష్మయ్య జగన్కు వినతిపత్రం అందించారు. గత 20 సంవత్సరాలుగా సర్వీస్లో ఉండి గంటకు వేతనం ప్రాతిపదికన పని చేస్తున్నారన్నారు. వీరిని రెగ్యులర్ చేయటం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించవచ్చని చెప్పారు. ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు చేపట్టాలి ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనశాఖలో ఇంత వరకు ఒక్క ఉద్యాన విస్తరణాధికారి పోస్ట్ నియామకం కూడా జరగలేదని అద్దంకి హార్టికల్చరల్ ఎంపీఈఓ ఎ.స్వర్ణలత జగన్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎంపీఈఓలు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు మండలాల పరిశీలకులుగా ఉన్నారన్నారు. 20 వేల నుంచి 25 వేల ఎకరాల భూములను పరిశీలించటం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. ఉద్యాన విస్తరణాధికారి నియామకాలు చేపట్టడం ద్వారా బీఎస్సీ డిప్లమో (హార్టికల్చర్) పూర్తి చేసిన సుమారు వెయ్యి మందికిపైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలొస్తాయని వివరించారు. -
2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
-
2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
ఏకీకృత సర్వీసు పేరిట ఇంటికి పంపాలని సర్కారు నిర్ణయం సాక్షి, అమరావతి: జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఇది 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు మాట. ఆ మాట చెప్పి ఎన్నికల్లో నెగ్గిన చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చుని మూడేళ్లు గడిచిపోయాయి. కొత్తగా ఉద్యోగాల కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకు సైతం ఆయన ఎసరు పెడుతున్నారు. తాజాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 4000 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 1900 మందికి పైగానే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనల పేరిట ప్రభుత్వం వీరిపై వేటు వేయాలని చూస్తోంది. తమను రెగ్యులర్ చేయాలని గత ఏడాదిలో వీరు సమ్మె చేయగా ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, దశల వారీగా రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తామని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తూ హూస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇలా ఇళ్లకు పంపుతారా? ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం, దానిపై కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. ఈ నెల 16లోపు వీటి ముసాయిదాకు తుది రూపు ఇచ్చి అనంతరం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు శాపంగా మారుతోంది. దాదాపు 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడు తమ జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారని వారు ఆక్రోశిస్తున్నారు. 21న గుంటూరులో నిరసన తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని చూడడం దారుణమని ప్రభుత్వ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాంధీ, ఇతర నాయకులు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై ఈ నెల 21న చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపు నిస్తున్నామన్నారు. -
దగా పడ్డారు!
వీరఘట్టం(పాలకొండ): కాంట్రాక్ట్ లెక్చరర్లను కచ్చితంగా క్రమబద్ధీకరిస్తామంటూ 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని మరిచిపోయారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యమబాట పట్టారు. హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో గత ఏడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి మూడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 రోజుల పాటు సమ్మె చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతోకాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. తర్వాత భేటీ అయిన మంత్రి వర్గం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేమని.. అయితే జీతాన్ని మాత్రం 50 శాతం పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ హామీకి రెండు నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు జీవోను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నా యి. సర్కారు అధ్యాపకులతో పాటు 487 మం ది కాంట్రాక్ట్ అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నా రు. ఈ విద్యా సంవత్సరం కూడా జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇంతవర కు ప్రభుత్వం రెన్యూవల్స్ ఇవ్వకపోవడంతో వీరి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మార్చి 31వ తేదీతో గత విద్యా సంవత్సరం ముగిసింది. రెండు నెలల వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో జీతాలు ఇవ్వరు. దీంతో ఉన్న ఉద్యోగం రెన్యువల్ అవ్వక.. జీతం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలా గే వీరితో పాటు జిల్లాలో ఉన్న 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా రెన్యూవల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో కీలకం.. ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనలో కాంట్రాక్టు లెక్చరర్ల కృషి చాలా ఉందని కొన్ని సందర్భాల్లో అధికారులే కితాబు ఇచ్చారు. అయితే శక్తివంచన లేకుండా పనిచేస్తున్న ఒప్పం ద అధ్యాపకులపై ప్రభుత్వం కత్తికట్టిందనే చెప్పాలి. ఇంటర్లో ప్రైవేటు విద్యను అమితంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. సర్కారు విద్య ను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభమైనప్పటికీ...తగినంత మంది అధ్యాపకులు మాత్రం లేదు. దీంతో చాలామంది పిల్లలు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే కారణమనే విమర్శలు వస్తున్నాయి. బుట్టదాఖలైన ఎన్నికల హమీ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ఎన్ని కల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తుంగలో కలిసిపోయాయి. ఇప్పటివరకూ ఎని మిదిసార్లు మంత్రి వర్గం భేటీ అయింది. క్రమబద్ధీకరణకు అడ్డంకిగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అవాంతరాలను తొలగించాలనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించి మూడేళ్లయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. విద్యార్థుల అవస్థలు ప్రైవేటుకు దీటుగా సర్కారు విద్య ఉండాలంటే పోటీ తప్పదు. అయితే ప్రభుత్వం తీరుతో ఒప్పంద అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. తరగతులు ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయిలో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడంతో కళాశాలలు వెలవెలబోతున్నాయి. తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెన్యూవల్ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నకిలీ సర్టిఫికెట్లపై కాంట్రాక్టు లెక్చరర్లు !
► ఇంటర్, డిగ్రీలలో 4,375 మంది... ► సగం మంది నకిలి సర్టిఫికెట్లపైన్నే... ► పాత కరీంనగర్లోనే 22 మంది నకిలీలు ► ఈ భాగోతానికి ఆద్యుడు చంద్రబాబు ► లోకాయుక్తలో నిరుద్యోగుల ఫిర్యాదు ► వచ్చే నెల 20న హైదరాబాద్లో విచారణ సాక్షి, కరీంనగర్ : ఇంటర్మీడియట్ విద్యావిధానంలో నకిలీ సర్టిఫికెట్లు కలిగిన కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల (పర్మినెంట్)ను రెగ్యులరైజ్ చేసే వ్యవహారం లోకాయిక్తకు చేరింది. ఈ విధానం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టుతుందని ఫిర్యాదు చేశారు. బీహార్, కువ్వంపు, వినాయక మిషన్, ద్రావిడ తదితర యూనివర్శిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు పొందిన పలువురి నియామకం వివాదస్పదం అవుతోంది. నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విధానం అతిదారుణమని నిరుద్యోగులు, అర్హులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఈ విధానంలో అనేకమైన లొసుగులున్నాయని వారంటున్నారు. రిజర్వేషన్లను ఉల్లంఘించడం, అనర్హులను అందలమెక్కించడం రాజ్యాంగ విరుద్దమైన విధానంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అనర్హులతో గెజిటెడ్ పోస్టులలో నింపివేశారంటూ పలువురు లోకాయుక్తను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్లో 3685 లెక్చరర్ల పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 1050 వరకు పోస్టులు పూర్తి స్థాయిలో అనర్హులతో నింపివేయగా, ఒక్క పూర్వ కరీంనగర్ జిల్లాలోనే 22 మంది నకిలీలని తేలడం వివాదస్పదం అవుతోంది. నిబంధనలు ఏమి చెప్తున్నాయి.. ఇంటర్మీడియట్లో ఇతర రాష్ట్రాల నుంచి, కొని తెచ్చుకున్న యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీల డిగ్రీలు వీరికి ఎలాంటి విద్యా ప్రావీణ్యత లేదు. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉంటేనే అదే సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇలాంటి నియమాలు లేని డిగ్రీలు ఉన్నవి. ఒక సబ్జెక్టు లెక్చరర్గా నకిలీ (ఫేక్) సర్టిఫికేట్స్తో జాయిన్ అయిన అతడే మరో సర్టిఫికెట్ సృష్టించుకోని పోస్టు డిమాండ్ ప్రకారం అందులోకి మారినవారున్నారు. దాదాపు అంటే ఇందులో 80 శాతం మంది ఇలాంటి డిగ్రీలు కలిగిన వారున్నారు. ఇక వీరి నియామకం చాలా హాస్యాస్పదం. ఈ ఫేక్ సర్టిఫెకెట్గాళ్లకు ఎలాంటి రాత పరీక్ష లేదు. 2000 సంవత్సరంలో కాలేజీ వైజ్గా పేపర్ ప్రకటన అంటే (ప్రెస్నోట్)చిన్నగా ఇచ్చి ఇలాంటి వారిని ప్రిన్సిపల్స్ ద్వారా ఎంపిక చేశారు. రెగ్యులర్ పోస్టులు రాజ్యాంగ బద్ద సంస్థ ఏపీపీఎస్సీ ద్వారా నింపాల్సిన పోస్టులను చాలా ‘ఛీప్’గా వారితో నింపారు. వాస్తవంగా గెజిటెడ్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా నింపాలి. నేడైతే తెలంగాణ టీఎస్పీపీఎస్సీ ద్వారా జాతీయ పేపర్లో నోటిఫికేషన్స్ ఇచ్చి రాత పరీక్ష– ఇంటర్వ్యూల ద్వారా నింపాలి. కానీ అలా కాకుండా ఇలా ఫేక్ సర్టిఫికేట్ వారితో వారి అనుకూలమైన వారితో నింపారు. దశాబ్దకాలంగా ఏపీపీఎస్సీ ని నిర్వీర్యం చేసిన ఆంధ్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల విధానంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే వస్తుంది. అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత లేని వారే కొనసాగుతున్నారు. ఇదిలా వుంటే 2007–08 లో శాసనసభ కమిటి సిఫారసు మేరకు ఆర్జేడీ ద్వారా రోస్టర్వైజుగా నోటిఫికేషన్ వేసి 14 సబ్జెక్టులలో 355 మందిని మాత్రమే రోస్టర్ ద్వారా ఎంపిక చేశామంటున్నారు. కానీ ఇందులో కూడా అనేక మంది ఫేక్ సర్టిఫికేట్లతో చేరినారు. రోస్టర్ విధానంకు వక్రభాష్యం.. 3650 పోస్టులలో కేవలం 355 మందిని 14 సబ్జెక్టులలో అదీ శాసనసభ కమిటీ సిఫారసు మేరకు రోస్టర్ లో ఎంపిక చేశామంటున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గెజిటెడ్ పోస్టులను ఎక్కడి వారే అక్కడ స్థానికులను అందులో ఫేక్ సర్టిఫికేట్ దూర విద్యా విధానం ఇతర రాష్ట్రాల డిగ్రీల వారే ఉన్నారు. ఎందరో నిరుద్యోగులు రెగ్యులర్ యూనివర్సిటీలు, అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలలో చదివిన వారు నిరుద్యోగులుగా ఉన్నారు. వారి నోట్లో మట్టి కోట్టే కనీస విద్యా ప్రావీణ్యత లేనివారు ఎలాంటి పరీక్ష పాస్ కాకుండానే ఇందులో చేరినారు. ఎలా గెజిటెడ్ పోస్టులలో రెగ్యులర్ చేస్తారు? అంటూ నిరుద్యోగులు లోకాయుక్తలో సవాల్ చేశారు. ఇంగ్లీష్ వాటికి అందులో ప్రావీణ్యత ఉండదు గనక కనీస ప్రావీణ్యత లేని వీరికి టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహించి వీరి కొనసాగింపు అపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అన్ని పోస్టులను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా చేయాలంటున్నారు. ఈ వ్యవహారంపై వచ్చే నెల 20న విచారణ జరపనుండగా, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఫేక్ సర్టిఫికేట్లపై తక్షణం సీబీసీఐడీతో దర్యాప్తు జరుపాలని కోరుతున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తేలేనా?
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్లలో వేలల్లో ఖాళీ పోస్టులు - కాంట్రాక్టు క్రమబద్ధీకరణ కుదరదన్న హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరేనా? - కాంట్రాక్టు పోస్టుల్లో 5,027 మంది లెక్చరర్లు - అయినా మరో 2350 పోస్టులు ఖాళీయే - కాంట్రాక్టు అంశం తేలకున్నా భర్తీకి వీలుగా 2,650 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు కొట్టివేయడమే కాకుండా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం గందరగోళంలో పడింది. డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తే కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెబుతోంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరదేమోనన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లోనూ ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, వివరణలతో కూడిన మార్గదర్శకాల ప్రకారమే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుదరదని హైకోర్టు స్పష్టం చేయడమే అందుకు కారణం. రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనుకున్నారంటే.. రాష్ట్ర విభజన, ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేందుకు ప్రొహిబిషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ (యాక్టు 2/1994) చట్టాన్ని సవరించింది. ఇందుకు అనుగుణంగా 2016 ఫిబ్రవరి 26న జీవో 16 తెచ్చింది. 2014 జూన్ 2 నాటికి ముందు నుంచీ పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలేజీలవారీగా పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిల్ దాఖలు చేయగా కాంట్రాక్టు క్రమబద్ధీకరణ విషయంలో స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రమబద్ధీకరణ కుదరదంటూ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లినా రెగ్యులరైజేషన్ అనేది సాగదీతే తప్ప సాధ్యం కాదని అధికారులే పేర్కొంటున్నారు. మిగిలిన పోస్టులను భర్తీ చేయొచ్చు కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం ఇప్పట్లో తేలకపోయినా ప్రభుత్వం తలచు కుంటే ఇప్పటికిప్పుడు 2,650 పోస్టులను భర్తీ చేసే వీలుంది. కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని 5,027 పోస్టులు కాకుండా మిగిలిన ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఇదీ కాలేజీలవారీగా పరిస్థితి... - జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 5,905 ఉండగా అందులో 900 పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగిలిన 5,005 ఖాళీల్లో 3,638 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తుండగా మరో 1,367 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. - డిగ్రీ కాలేజీల్లో మొత్తం 2700 పోస్టులు ఉన్నాయి. అందులో 1,600 మంది రెగ్యులర్ అధ్యాపకులు పని చేస్తున్నారు. మరో 924 పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కాంట్రాక్టు అధ్యాపకుల్లో 117 మందికే నిర్ణీత అర్హతలు ఉండగా మిగిలిన 807 పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 176 పోస్టులను కలుపుకొని 983 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు. - పాలిటెక్నిక్ కాలేజీల్లో 465 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉంటే మంజూరైన ఖాళీలు 165 మాత్రమే ఉన్నాయి. అయితే కాలేజీల్లో అవసరాల మేరకు పోస్టులు లేకపోయినా కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టి కొనసాగిస్తున్నారు. మిగతా 300 పోస్టులను సృష్టించి భర్తీ చేయాల్సి ఉంది. -
విద్యాశాఖలో అవినీతిని అరికడతాం: కడియం
హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ శాసనమండలిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లోని 16 మదర్సాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇందుకు సంబంధించి పదిమంది విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇందులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యాశాఖలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిపై విచారణ జరుపుతున్నామని వివరించారు. -
వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ అయ్యేనా!
⇒ రెగ్యులరైజేషన్ కోసం ఆందోళన ఉధృతం చేసిన కాంట్రాక్టు లెక్చరర్లు ⇒ పోస్టుల భర్తీ, క్రమబద్ధీకరణపై ఏం చేయాలన్న ఆలోచనల్లోనే ప్రభుత్వం ⇒ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు పెండింగ్లోనే.. సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు ఇప్పట్లో భర్తీ అవుతాయా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఓవైపు కాంట్రాక్టు లెక్చరర్ల నిరవధిక సమ్మె.. మరోవైపు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్.. ఇంకోవైపు పోస్టులను భర్తీ చేయాలంటున్న నిరుద్యోగుల డిమాండ్లతో యూనివర్సిటీల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఒక్కొక్కటి పరస్పరం ఒక్కో సమస్యతో ముడిపడి ఉండటంతో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇద్దామంటే సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్టు లెక్చరర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పైగా రెగ్యులరైజ్ చేస్తామంటూ సీఎం హామీ ఉండటం.. పోనీ అదీ చేద్దామన్నా న్యాయ పరమైన చిక్కులతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుదామంటే నోటిఫికేషన్లు ఇవ్వరా? అంటూ నిరుద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం సతమతం అవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ నియామకాలు ఇప్పట్లో అయ్యేనా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. దశల వారీగానైనా నియామకాలు జరిగేనా? ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు మొత్తంగా 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రాధాన్య క్రమంలో పోస్టులను భర్తీ చేయాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏయే యూనివర్సిటీలో ఏయే సబ్జెక్టుల పోస్టులను మొదట భర్తీ చేయాలి? ఏయే పోస్టులను రెండో దశలో భర్తీ చేయాలి? అన్న అంశాలపై వర్సిటీల వారీగా వివరాలను సేకరించి, అవసరాలను గుర్తించి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. దీంతో మండలి ఆ కసరత్తు పూర్తి చేసి గత నవంబరు నెలలోనే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఇందులో మొదటి దశలో 11 యూనివర్సిటీల్లో 32 ప్రొఫెసర్ పోస్టులను, 109 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 701 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మొత్తంగా 842 అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. అలాగే రెండో దేశలో 586 పోస్టులను భర్తీ చేయాలని, రెండు దశల్లో 1,428 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే అవి నవంబరులో ప్రభుత్వానికి నివేదిక అందజేసే సమయానికి ఉన్న ఖాళీలు మాత్రమే. ఈ రెండు నెలల కాలంలోనూ పలు పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల సమస్య, కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తంటాలు వచ్చి పడ్డాయి. పైగా యూజీసీ నిబంధనలు, యూ నివర్సిటీల పోస్టుల భర్తీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంత సులభం కాదని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రెండు దశల్లో 1,428 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుండగా.. కాంట్రాక్టు లెక్చరర్లే 1,531 మంది వరకు ఉన్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ప్రభుత్వం పడింది. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
► అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మానవహారం నిర్మల్ రూరల్ : ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట లెక్చరర్లతో కలిసి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు లోక లక్ష్మారెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు గండ్రత్ రమేశ్, అయ్యన్నగారి పోశెట్టి తదితరులు మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల బేసిక్ పే, డీఏ, రెగ్యులరైజేషన్ వంటి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు ఎస్ఎన్ రెడ్డి, రాంలక్ష్మణ్, ఏబీవీపీ నాయకులు మెహర్, టీఎన్ ఎస్ నాయకులు శ్రీకాంత్, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్గ రవీందర్, నాయకులు వెంకటేశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ కాలేజీల బంద్ విజయవంతం
– కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ – బంద్లో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ సంఘాలు కర్నూలు (సిటీ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన కాలేజీల బంద్ విజయవంతమైంది. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి నగరంలోని ప్రభుత్వ కాలేజీలను బంద్ చేయించారు. ఈ సందర్బంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందనా్నరు. తమకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తే వారిని పట్టించుకోవడం లేదనా్నరు. ఈనెల చివరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని, అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మతో ప్రభుత్వ జూనియర్ (టౌన్ మోడల్) కాలేజీ నుంచి రాజ్విహార్ వరకు శవయాత్ర నిర్వహించారు. పోలీసులు శవయాత్రను అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా కాలేజీల బంద్ చేయించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమాల్లో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఇతర నాయకులు అక్బర్, శివ, రమణ, వినోద్, మోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం
హైదరాబాద్: కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసులను త్వరలో క్రమబద్దీకరిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం కడియం శ్రీహరి మాట్లాడారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించే ప్రయత్నంలో ఉస్మానియా విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం పెండింగ్లో పడిందని చెప్పారు. అయినప్పటికీ కోర్టు అననుమతితో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.18 వేల నుంచి రూ. 27 వేలకు, డిగ్రీ కళాశాల లెక్చరర్లకు రూ. 20 వేల నుంచి రూ. 31 వేలకు పెంచామని వివరించారు. -
పదో పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలి
► కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె ► పలువురి సంఘీభావం పెద్దపల్లిఅర్బన్ : ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కళాశాలల్లో అధ్యాపకులుగా పని చేస్తున్నామని, తమను క్రమబద్ధీకరణ చేయాలని అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ను క్రమబద్ధీకరిస్తామని జీవో 16ను విడుదల చేసిందని, ఆ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాలేదని తెలిపారు. క్రమబద్ధీకరణ ఆలస్యమైతే ప్రస్తుతం అమలవుతున్న పదో పీఆర్సీ ప్రకారం బేసిక్ పే, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సునీల్, పవన్ కుమార్, శ్రీనివాస్, విక్రమాదిత్య, శంకరయ్య, రమేశ్, శ్రీధర్రావు, సంతోషి, లలిత, రాజ్యలక్ష్మి, కవిత, ప్రశాంతి పాల్గొన్నారు. పలువురి మద్దుతు కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మె శిబిరాన్ని పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు సహకారంతో ప్రభుత్వానికి సమస్యలను విన్నవించి పరిష్కారం కోసం చొరవ తీసుకుంటానన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ బాలసాని లెనిన్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్, నాగరాజు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ‘వెన్నపూస’ మద్దతు
అనంతపురం రూరల్ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి మద్దతు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శిబిరాన్ని శనివారం గోపాల్రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధాల బాబు పాలనకు కలిసికట్టుగా చమరగీతం పాడుదామని పిలుపు నిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వైఎస్ జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు రామాంజనేయులు, అన్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్ల డిమాండ్లను నెరవేర్చాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి రొద్దం : కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు నెల రోజులుగా వారు సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తామంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. వారి సమ్మెకు మద్దతు తెలుపుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను రూలాఫ్ రిజర్వేష¯ŒSలోకి తీసుకొచ్చి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ రద్దుపై పోరాటం చేస్తామన్నారు. తాను సుదీర్ఘకాలం ఉద్యోగ సంఘాల నాయకుడిగా నిస్వార్థంగా పని చేశానన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో పోరాడినట్లు తెలిపారు. 10వ పీఆర్సీ కమిష¯ŒSను సకాలంలో నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రానున్న రోజుల్లో సమస్యలపై పోరాడేందుకు ముందుటానన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాములు, వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అశోక్కుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడు గుర్రం గోవర్ధన్, ఉపాధ్యాయులు రామచంద్రరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల పక్షాన పోరాటం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అనంతపురం రూరల్ : కాంట్రాక్టు లెక్చరర్ల పక్షాన ప్రభుత్వంపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ మేరకు స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట వారు చేపట్టిన దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘చంద్రబాబు అవసరం తీరాక తెప్ప తగలేసే రకం’ అని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ తెచ్చిందే తానని, అధికారం చేపట్టగానే క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో గద్దెనెక్కిన బాబు ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్లు కావస్తున్నా మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్పొరేట్ దిగ్గజాల సంస్థల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బాబుకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియ¯ŒS నాయకులు ఆదినారాయణరెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు చింతా సోమశేఖర్రెడ్డి, పార్వతి, ఐద్వా సంఘం నాయకులు సావిత్రి, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లకు 'అధికార' బెదిరింపులు
– ఈ నెల 26లోపు వీధుల్లో చేరని 267 మందికి నోటీస్లిచ్చిన ప్రిన్సిపాళ్లు – నేటితో ముగియనున్న జూనియర్ లెక్చరర్ల కాంట్రాక్ట్ గడువు కాంట్రాక్ట్ లెక్చర్లపై అధికార బెదిరింపులు మొదలయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్ కోసం ముందస్తు నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లినా పట్టించుకోని ప్రభుత్వంగుడ్డిగా బెదిరింపులకు పాల్పడుతోంది. తాము చెప్పినట్లు వినకపోతే ఉన్న ఉద్యోగం ఊడబెరుకుతామన్నంతగా భయపెట్టేందుకు పూనుకుంటోంది. అందులోభాగంగానే ఈనెల 26లోపు విధుల్లో చేరని 267మంది కాంట్రాక్ట్ లెక్టరర్లకు ప్రిన్సిపాళ్లతో నోటీస్లు ఇప్పించింది. - కర్నూలు సిటీ తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఈ నెల 2 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు గత నెల చివరి వారంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రభుత్వానికి నోటీస్లిచ్చారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తప్పని పరిస్థితిల్లో సమ్మెలోకి వెళ్లారు. వీరిని రెగ్యులర్ చేయడానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇంత వరకు ఒక్క సారి కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లతో చర్చలు జరపలేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్సీలతో చర్చలు జరిపి కాంట్రాక్ట్ లెక్చరర్ల చర్చలు సఫలమయ్యాయని, సమ్మె విరమించేందుకు ఒప్పుకున్నారని తప్పుడు ప్రచారం చేసి కాంట్రాక్ట్ లెక్చరర్ల సంక్షేమ సంఘంలోనే చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అదీ పారకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ నెల 26లోపు వీధుల్లోకి చేరిన వారికి మాత్రమే కాంట్రాక్ట్ గడువు పెంచుతామని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి మంత్రి ఆదేశాలను విస్మరించిన 267మంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల చేత నోటీసులు పంపారు. మాట మార్చిన ప్రభుత్వం.. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్, 14 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో 307, డిగ్రీ కాలేజీల్లో 79 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. కొందరు 16 ఏళ్లుగా పనిచేస్తుండగా మరికొందరు మూడేళ్లకు పైగానే పనిచేస్తున్నారు. వీరందరినీ 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత సాంకేతిక కారణాలు చూపుతూ కాలయాన చేస్తూ వస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 26వ తేదీలోపు వీధుల్లో చేరాలని ఆదేశాల ఇచ్చారు. ఈ మేరకు వీధుల్లో చేరక పోవడంతో మొదటగా 267 మందికి తిరిగి వీధుల్లో చేరలేదని నోటీస్లు ఇచ్చారు. వీరితో పాటు మరికొంత మందికి నోటీస్లు ఇచ్చారు. ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తోందని, రాబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులు వాపోతున్నారు. ఏడాదిలో రెండు సార్లు కాంట్రాక్ట్ గడువు.. 2000 సంవత్సరం నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వం అయినా 10 నెలల కాంట్రాక్ట్ గడువు పెట్టింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగానే నీరుగార్చేందుకు జూన్ - డిసెంబరు, జనవరి - మార్చి వరకు కాంట్రాక్ట్ నిబంధన పెట్టారు. ఈ నిబంధన వల్ల సమ్మె చేసిన ప్రతి సారి ప్రభుత్వం గడువు పేరుతో బెదిరింపులకు దిగుతుండడం గమనర్హం. ముందస్తు నోటీస్ ఇచ్చాం: టి.శివాంజనేయులు, కాంట్రాక్ట్ లెక్చరర్, నందికొట్కూరు రెగ్యులర్ చేయాలని, సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ సమ్మె చేపట్టనున్నట్లు ముందుగానే ప్రభుత్వానికి నోటీస్లిచ్చాం. అయినా ప్రభుత్వం ఇలా నోటీస్లు ఇచ్చి బెదిరించడం తగదు. 10 ఏళ్లుగా పని చేస్తున్నా రెగ్యులర్ చేయక పోవడం బాధాకరం. ప్రభుత్వ అధికారం ఉందని ఇలా చేయడం సరి. టీడీపీ ప్రభుత్వంలోనే ఏడాదికి రెండు సార్లు కాంట్రాక్ట్ గడువు: అంజన్కూమార్, ఒకేషనల్ జూనియర్ కాలేజీ, కర్నూలు గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఏడాది రెండు సార్లు కాంట్రాక్ట్ గడువు పెట్టారు. ఈ నెల 31తో మొదటి గడువు ముగియనుంది. ఇచ్చిన హామీని అమలు చేయాలని సమ్మె చేపడితే ఇలా నోటీస్లు ఇచ్చి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరించే ధోరణి అవలంభించడం సమంజసం కాదు. -
కాంట్రాక్టు లెక్చరర్ల రిలే నిరాహార దీక్షలు
జగిత్యాల: కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణను వేగవంతం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో జగిత్యాలలో లెక్చరర్లు రిలే నిరాహార దీక్షకు దిగారు. పదవ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం, డీఏ చెల్లించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం అమలు చేయాలని, జూనియర్ డిగ్రీ కళాశాలలో నాన్-శాంక్షన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
‘పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’
-
సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఉక్కు పాదం
-
అడిగిన పాపానికి తొలగింపా!
-
కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా పోరాటం
తక్షణం ప్రభుత్వం స్పందించాలి కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ కంబాలచెరువు : (రాజమహేంద్రవరం) : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తెలిపాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS మాట్లాడుతూ ఏళ్ల తరబడి కళాశాలల్లో అధ్యాపక వృత్తినే నమ్ముకుని జీవించి, చివరికి వయసు మించిపోయి ఉద్యోగ అర్హత కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలకు దిక్కెవరన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి పదో పీఆర్సీ అమలు చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. జేఏసీ నాయకుడు వి.కనకరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకుడు పి.మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. చదువులు చెప్పే పంతుళ్లు ఇలా రోడ్డు పాలు కావడం బా«ధాకరమని ఎల్ఐసీ యూనియ¯ŒS నాయకులు పి.సతీష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యారంగానికి కీలకమైన కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్లు పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె.రూపస్రావు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరరావు, దేశిరెడ్డి బలరామానాయుడు, గంగాధరరావు, నల్లా రా>మారావు, వి.రాంబాబు, ఎం.ఎస్.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కాంట్రాక్టు లెక్చరర్ల రౌండ్ టేబుల్ సమావేశం
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మంగళవారం రౌండు టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ భద్రత కోరుతూ 24 రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ కారణంగా వారు ఆందోళన చేస్తున్న శిబిరం వద్దనే ఉదయం 11 గంటలకు ఈ రౌండు టేబుల్ సమావేశం జరుగనుందన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావాలన్నారు. నిద్దరోతున్నప్రభుత్వాన్ని మేల్కొపడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య పరిష్కారించడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలన్నారు. -
ప్రభువా..సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు..!
– ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఏ నవీన్కుమార్ కల్లూరు (రూరల్): ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధిని, ప్రేమగల హృదయాన్ని ప్రసాదించాలని యేసు ప్రభువును రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంఏ నవీన్కుమార్ వేడుకున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సమ్మెలో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేసే మంచి బుద్ధిని ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మంత్రులకు ఇవ్వాలని యేసు ప్రభును వేడుకున్నామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జునస్వామి, లక్ష్మీప్రసాద్రెడ్డి, రవి, చాంద్బాషా, ఉసేన్పీరా, వెంకటకృష్ణ, రంగముంజరి, రుక్మిణి, కల్పన, సరస్వతి పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు
హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన ఈ వేతనాలను ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. -
చావో.. రేవో..!
కడప ఎడ్యుకేషన్:‘ మా సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆపేది లేదు.. విధుల్లో చేరకుంటే తొలగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాలకు బెదిరేది లేదు.. చావో..రేవో తేల్చుకుంటాం..’ అంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా వ్యాప్తండా 204 మంది అధ్యాపకులతో కలిసి చేపట్టిన దీక్ష శుక్రవారం నాటికి 22 రోజులకు చేరింది. రోజుకొక వినూత్న కార్యక్రమంతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకమని కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ వాపోయింది. కాగా రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనను విరమించి విధుల్లోకి వెళ్లాలని లేకుంటే వీరిని విధుల నుంచి తొలగించమని సంబంధిత ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోకాళ్లపై నిలబడి.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కాంట్రాక్ట్ అధ్యాపకులు కలెక్టర్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 25 ప్రభుత్వ కళాశాలల పరిధిలో 204 మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నామన్నారు. ఇందులో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం కేవలం కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే పనిచేయడంతో సంబంధిత కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాకపోగా శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని లేని పక్షంలో విధుల నుంచి తొలగించాలని ఆదేశించిందన్నారు. కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడమని తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరగడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పిస్తేనే దీక్షల నుంచి విరమించుకుంటామని స్పష్టం చేశారు. సరైన నిర్ణయం రాకపోతే: ఈనెల 26న కేబినేట్ మీటింగ్లో సరైన నిర్ణయం వెలువడకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. 27 నుంచి వెలగపూడిలో జేఏసీ పిలుపుమేరకు ఆమరణ నిరాహార దీక్షను చేపడతాం. – జానీబాబు, జేఏసీ నాయకుడు. ఉద్యోగ భద్రత కల్పించాలి: మాకు ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఉద్యమాన్ని ఆపం. 21 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఇప్పుడేమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఎలాంటి హామీ ఇవ్వకుండా విధుల్లో ఎలా చేరాలి. – సుబ్బయ్య, జేఏసీ నాయకుడు. తాడోపేడో తేలాలి.. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వడంతోపాటు సమాన పనికి సమాన వేతనాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సంబంధిత విషయాల్లో తాడోపేడో తేలేవరకూ ఉద్యమాలను ఆపం. 21 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వ ఎలాంటి హామీ ఇవ్వకుండా దీక్షలు ఎత్తేయమనటం సబబుగా ఉందా. – ఉమాదేవి, జేఏసీ నాయకురాలు. -
'సమ్మె విరమించాల్సిందే'
విజయవాడ: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమ్మె విరమించాలని శుక్రవారం కాంట్రాక్ట్ లెక్చరర్లకు అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం సమ్మె విరమించని పక్షంలో కాంట్రాక్ట్ లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా సమ్మె కాలంలో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను గాలికొదిలేశారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్న లెక్చరర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. -
ఉద్యోగ భద్రత కోసం వినూత్న నిరసన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ అధ్యాపకులు, పార్ట్టైం పీఈటీలు బుధవారం వినూత్న నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు నోటికి నల్లగుడ్డను ధరించి కలెక్టరేట్ వరకు మౌన ర్యాలీని నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని జేఏసీ నాయకులు ఎంఏ నవీన్కుమార్, చాంద్బాషా, రఫీవుద్దీన్, మల్లికార్జున, సోమేష్ కోరారు. రిలే నిరాహార దీక్షలో మత్తయ్య, వెంకటశివుడు, మోహన్, బాయ్యరెడ్డి, నరసింహులు కూర్చున్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం కాంట్రాక్ట్ అధ్యాపకులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాల నుంచి రాజ్విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మిల, జిల్లా కార్యదర్శి అలివేలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్కుమార్ మాట్లాడారు. మోకాళ్లపై నిలబడి.. తమను రెన్యువల్ చేయాలని పార్ట్టైం పీఈటీలు బుధవారం..వినూత్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రాధాకృష్ణ, ఆనంద్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రంగమునినాయుడు, నక్కలమిట్ట శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. దీక్షల్లో పార్ట్టైం పీఈటీలు ఏ.షాఫైజల్, టి.వేణుగోపాల్రెడ్డి, వి.శివరామ్, ఎన్వీఆరుణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
హామీలతో అన్నివర్గాలను వంచించిన బాబు
–మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎన్నికల్లో బూటకపు హామీలతో చంద్రబాబు అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత అన్ని వర్గాలవారిని వంచించారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని గురునాథరెడ్డి సందర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, సినిమా హీరో పవన్కళ్యాణ్తో కలిసి హామీలను గుప్పించారన్నారు. హామీలను నెరవేర్చకపోవడంతో వంచనకు గురైనవర్గాలవారు కఽలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. మంగళవారం విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు హనుమంతరెడ్డి, శివారెడ్డి, ఎర్రప్ప, రామలింగా, రామాంజినేయులు, రాధమ్మ, రాధిక, భాస్కర్రెడ్డి, అరుణ, శంకరప్ప, రామన్న, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మకునీరెత్తిన ప్రభుత్వం
- సమ్మెబాటలో కాంట్రాక్ట్ లెక్చరర్లు –అటకెక్కిన చదువులు –పూర్తికాని పాఠ్యాంశాలు - సమీపిస్తున్న వార్షిక పరీక్షలు –విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఉరవకొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ న్యామమైన డిమాండ్లను పరిష్కరించాలని పలు రూపాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అద్యాపకులను రెగ్యూలర్ చేస్తామని హమీ కుడా ఇచ్చారు. మూడేళ్లు కావస్తుఽన్నా ప్రభుత్వంలో స్పందనలేదు. అటు కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. అటక్కెక్కిన చదువులు... డిసెంబరు నుంచి ప్రధాన పరీక్షల వరుకు విద్యార్థికి ఎంతో కీలక సమయం. మిగిలిన సిలబస్ త్వరగా పూర్తి చేయించుకోని, భవిష్యత్ పరీక్షలకు సిద్ధమయ్యే పరిస్థితి. కానీ బోధించే అధ్యాపకలు లేక విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఉరవకొండ, మడకశిర, తాడిమర్రి, అమరాపురం, బొమ్మనహల్, గుడిబండ, గుంతకల్లు తదితర ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 50 శాతానికిపైగా కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన జరిగేది. ఇందులో సైన్స్ సబ్జెక్టులను బోధించేవారు లేక విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఒక వైపు జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్, మరోవైపు ఈనెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. ఉదాహరణకు ఉరవకొండ బాలుర, బాలికల కళాశాలలు మొత్తం 90 శాతం కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేసుతఆన్నరు. వీరు సమ్మెలో వెళ్లి నప్పటి నుంచి ప్రిన్సిపల్ ఒక్కరి మీదే బోధన బాధ్యత పడింది. ఇంకా ఇప్పటికి ఎంపీసీ, బైపీసీ గ్రూపు సిలబస్ కుడా పూర్తి కాలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు.. –ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలి. - ఇది అమలయ్యే దాకా రెగ్యూలర్ అధ్యాపకులతో సమానంగా పీఆర్సీ సిఫారస్సు మేరకు వేతనాలు పెంచాలి. –ఏటా కొనసాగుతున్న బాండ్ విధానాన్ని రద్దు చేయాలి. - 12 నెలల వేతనం, విద్యార్థి ఉత్తీర్ణత శాతంలో మినహాయింపు చేయాలి. సిలబస్ పూర్తి కాలేదు: ఫస్ట్ ఇయర్లో సిలబస్ సకాలంలో పూర్తి చేయడం వల్ల మంచి స్కోరు చేయగలిగాను, రెండవ సంవత్సరంలో కుడా కష్టపడి చదువుదామంటే ఇంకా సిలబస్ 20 శాతం పూర్తి కావాల్సి వుంది. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. పరీక్షల్లో ఉత్తమ ఫలితాల ఎలా సాధించాలి? - మోహెతాజ్, ఎంపీసీ, రెండవ సంవత్సరం,ఉరవకొండ ప్రాక్టికల్స్ను ఎలా ఎదుర్కోవాలో...? ప్రస్తుతం జంబ్లింగ్ పద్ధతిలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. లెక్టరర్లు లేక ఇప్పటి వరకూ ప్రాక్టికల్స్ నిర్వహించలేదు. జనవరి నుంచి ఈ పరీక్షలు ఉన్నాయి. ప్రభత్వం లెక్చరర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది. తేజస్వీని, బైపీసీ, ఉరవకొండ ఇబ్బందికరంగా ఉంది... కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మెలో వెళ్లడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. అందరినీ చెట్టుకింద కూర్చోబెట్టి బోధించాల్సిన పరిస్థితి ఉంది. బాలురు, బాలికల కళాశాలలో వెయ్యి మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఇదే పరిస్థితి ఉంటే ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. - నరసింహం, ఇంటర్ బాలుర, బాలికల కళాశాల ప్రిన్సిపాల్, ఉరవకొండ హమీను నేరవేర్చాలి... టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు అద్యాపకులకు రెగ్యూలర్ చేస్తామని గతంలో హమీ ఇచ్చింది. ఈహమీ ప్రకారం తమకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉపసంఘం వేసి కాలయాపన చేయడం సరైంది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి. - ఎర్రప్ప, జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
భిక్షాటన చేస్తూ నిరసన
కర్నూలు (న్యూసిటీ): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు సోమవారం మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ముందుగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బ్రహ్మేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక దీక్షలు 18వ రోజుకు చేరాయి. వీరికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కేసీ రాముడు, అధికార ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య, కో కన్వీనర్ ఎస్ఎండీ రఫిక్, రామకృష్ణ, రవూఫ్, షేక్షావళి మద్దతు తెలిపారు. నిరాహారదీక్షలో నాయకులు రంగస్వామి, కె.రామక్రిష్ణ కూర్చున్నారు. లెక్చరర్లు శివరంగ ప్రసాద్, సోమేష్, ఆనంద్, భువనీశ్వరీ, రమేష్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
విజయవాడ (గాంధీనగర్) : పీఆర్సీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, ఎన్నికల హామీ మేరకు క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు ధర్నాచౌక్లో శుక్రవారం కొబ్బరిబోండాలు విక్రయిస్తూ నిరసన తెలియజేశారు. తాము 16ఏళ్లుగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నా, సీఎం చంద్రబాబుకు చేతులు రావడం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలలపై పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న ఆందోళనకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, కార్యదర్శి అజయ్కుమార్, కేవీపీఎస్ అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులపై వివక్ష చూపుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రభుత్వం... కష్టపడి పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జేఏసీ నాయకులు జీఎం దయాకర్, కేవీ కృష్ణంరాజు, రాంబాబు, వి.గిరి, విజయ్, సుధారాణి, జ్యోతి, సునీత, లత పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాల్సిందే
మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన జేసీసీ నాయకులు నేడు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల బంద్కు పిలుపు నెల్లూరు(పొగతోట) : కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న నిరాహారదీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం మద్దతు తెలిపారు. తొలుతగా జేఏసీ నాయకులు వారికి మద్దతుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారితో కలిసి కలెక్టరేట్ ఎదుట కళ్లకు నల్లరిబ్బన్ కట్టుకుని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డి.అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కారం కోసం గురువారం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల బంద్కు పిలుపునిస్తున్నామని తెలిపారు. 12 రోజులుగా వీరు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు పవన్, సాయి, ఆదిశేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి
– ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా కర్నూలు సిటీ: జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని ఏఐఎస్ఎఫ్, పీడీయస్యూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థాని ఇంటర్బోర్డు ప్రాంతీయ కార్యాలయం అధికారి కార్యాయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, శేఖర్ నాయుడు, భాస్కర్, ఆనంద్, రాజ్కూమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, ఇవ్వలేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీల గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా కార్పొరేట్ కాలేజీలతో సమానంగా ఫలితాలు తీసుకువస్తున్నారనే విషయం గుర్తించాలన్నారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పేదలకు అందనంత దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. అనంతర డీవీఈఓ సుబ్రమణ్యేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరింత జాప్యం!
- హైకోర్టులో కేసు కొలిక్కి రాకపోవడమే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరింత ఆలస్యం కానుంది. సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టులో కేసు పరిష్కారానికి మరింత ఎక్కువ సమయం పట్టనుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపునకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపింది. ఇందుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఆయా లెక్చరర్లకు వేతనాలు పెరగనున్నాయి. అనంతరం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్లకూ వేతనాలు పెంచే అవకాశం ఉందని బోర్డు వర్గాల సమాచారం. క్రమబద్ధీకరణ అంత సులభమా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో భాగంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2015లోనే జీవో 16 జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఓయూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో క్రమబద్ధీకరణ జరగలేదు. వాస్తవానికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అమలులో ఉన్న సర్వీసు నిబంధనలు, నోటిఫికేషన్ ఆధారంగానే క్రమబద్ధీకరణ చేయవచ్చని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 2015లో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టింది. 2014 జూన్ 2 నాటికి సర్వీసులో కొనసాగుతూ అన్ని అర్హతలు ఉండి, మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న వారి వివరాలను పంపాలని జిల్లాల అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్టే విధించాలంటూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని తేల్చేవరకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వబోమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు స్టే ఇవ్వలేదు. 50 శాతం పెంపునకే మొగ్గు క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 14ను జారీ చేసింది. గతంలో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆ కేడర్లో కనీస వేతనాలివ్వాలని జారీ చేసిన జీవో 3ను సవరించి జీవో 14ను జారీ చేసింది. కనీస వేతనంతోపాటు ప్రస్తుత వేతనంలో 50% పెంచాలని, ఆ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని వర్తింపజేయాలని పేర్కొంది. కానీ 50% వేతనా ల పెంపునకే బోర్డు మొగ్గు చూపుతోంది. -
జేసీ దివాకర్రెడ్డికి కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి
అనంతపురం: తమ డిమాండ్ల సాధనకు సహకరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ నాయకులు ఎంపీ దివాకర్రెడ్డిని కోరారు. స్థానిక జేసీ నివాసానికి వెళ్లి ఈ మేరకు సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 15న జరిగే కేబినేట్ సబ్ కమిటీ సమావేశం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి తమ పక్షాన నిలవాలని వారు కోరారు. ఎంపీ జేసీ సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖా మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మే చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు తప్పక వస్తానని చెప్పారు. జేఏసీ జిల్లా నాయకులు రామాంజనేయులు, నాగరాజు, సూర్యనారాయణ, సుధాకర్, రాజు, నాగరాజునాయక్ పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
- కరుణించాలని ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 11 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు సోమవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగు్యలరైజేషన్ కోసం నియమించిన ఉపసంఘం సభ్యులైన మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణ,, కామినేని శ్రీనివాస్, పల్లె రగునాథరెడ్డి పటాలకు పాలాభిషేకం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై కరుణ చూపాలంటూ రాష్ట్ర ఐక్య కార్యచరణ సమితి సభ్యుడు ఎన్.బ్రహ్మేశ్వర్లు, జిల్లా సంక్షేమ సంఘం సభ్యుడు పి.రంగస్వామి వేడుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. పదకొండో రోజు దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.శ్రీనివాసులు, ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.బలరాం, జేఏసీ జిల్లా కన్వీనర్ వీఎం వెంకటేశ్వర్లు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ నవీన్కుమార్, సునీత, కె.శ్రీనివాసులు, ఈశ్వర్, అప్పాంజినేయులు, సోమేష్, చాంద్బాషా, లక్ష్మీప్రసాద్రెడ్డి, నాగరాజు, రవి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
10వ రోజుకు చేరిన కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు చేపట్టిన ఆందోళన పదో రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కాగా, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ నాయకులు రంగస్వామి, నవీన్కుమార్, రామకృష్ణ, నాగరాజు పేర్కొన్నారు. పలువురు మద్దతు.. పదో రోజు దీక్షలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆదివారం పలువురు మద్దతు ప్రకటించారు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్న కేవీసుబ్బారెడ్డి, ఎస్కే యూనివర్సిటీ చరిత్ర ఉపన్యాసకులు మల్లికార్జుననరెడ్డి, ప్రత్యేక రాయలసీమ ఐక్య పోరాట సమితి మద్దతు ప్రకటించింది. -
నేడు కాంట్రాక్ట్ అధ్యాపకుల రాస్తారోకో
అనంతపురం రూరల్: కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని ఆ సంఘం జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. ఆదివారం కూడా వారు ఆందోâýæనను కొనసాగించారు. వారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడంలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయని ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే ఎంత గౌరవం ఉందో స్పష్టం అవుతోందన్నారు. నేడు రాస్తారోకో చేపడుతున్నట్లు తెలిపారు. అధ్యాపకుల సమ్మెకు ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు ప్రకటించి మాట్లాడారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు హనుంతరెడ్డి, ఎర్రప్ప, సుబ్రహ్మణ్యం, అక్బర్, ఎంజీ ప్రభాకర్, రామాంజనేయులతోపాటు పలువురు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన ర్యాలీ
విజయవాడ(గాంధీనగర్) : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళన పదో రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు శనివారం కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ప్రారంభమైన ప్రదర్శన లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్డుమీదుగా తిరిగి ధర్నా చౌక్కు చేరుకుంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న ఆందోళనకు బీజేఎంఎం రాష్ట్ర కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించి పీఆర్సీ ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు జీఎం దయాకర్ మాట్లాడుతూ 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి మించి పోయిందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి.మున్వర్, మహిళా కార్యదర్శి మంజుల, కేవీ కృష్ణంరాజు, బీజేౖఎంఎం సిటీ అధ్యక్ష, కార్యదర్శులు మేకల వెంకటేశ్వరరావు, కె మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయాలి
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు(న్యూసిటీ) : కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం కర్నూలులోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సీపీఐ జిల్లా నాయకుడు కె.జగన్నాథం, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.జె.రెడ్డి ..దీక్షలకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.ఎ.నవీన్కుమార్, ఎన్.బ్రహ్మేశ్వర్లు, డి.కె.ఈశ్వర్, డి.వి.రవికుమార్, నాగరాజరెడ్డి, చాంద్ బాషా, కల్పన, సునిత, రఫీవుద్దీన్, కిషోర్కుమార్, సోమేష్, మల్లికార్జున స్వామి, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ నేతల సంఘీభావం గుంటూరు ఎడ్యుకేషన్: శ్రమకు తగిన విధంగా వేతనాలు చెల్లింపు కోరుతూ నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘీభావం పలికారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఎన్నికల్లో బూటకపు హామీలు గుప్పించిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంతో పోరాడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. -
సమ్మెలో సారోళ్లు..!
- ఉద్యోగభద్రత కోసం దీక్షలకు దిగిన కాంట్రాక్ట్ లెక్చరర్లు – జిల్లాలో మూత పడ్డ జూనియర్ కాలేజీలు – ఆరు రోజులైనా స్పందించని ప్రభుత్వం - పరీక్షలు దగ్గపడుతుండటంతో ఆందోళనలో విద్యార్థులు ఎముక లేని నాలుక ఏమైనా మాట్లాడుతుందనే రీతిగా చంద్రబాబు ఎన్నికల సమయంలో అడిగిన వారందరికీ హామీలిచ్చారు. పనిలో పనిగా కాంట్రాక్ట్ లెక్చరర్లకూ తనను గెలిపిస్తే రెగ్యులర్ చేస్తానని అభయమిచ్చారు. అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పటికి దాదాపు మూడేళ్లు కావస్తోంది. మరి ఇచ్చిన మాటేమిటంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు పలుమార్లు అడిగి చూశారు. అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండటంతో ఇక కుదరదని సమ్మె బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు చదువులు చెప్పేది లేదని తెగేసి చెబుతున్నారు. ఫలితంగా ఆరు రోజులుగా జిల్లాలోని కళాశాలలు మూత పడ్డాయి. కర్నూలు సిటీ: తమ పార్టీని గెలిపిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఆ హామీని నెలబెట్టుకోవాలంటూ డిగ్రీ, ఇంటర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన బాట పట్టారు. మరో మూడు నెలల్లో పరీక్షలు జరుగనున్న సమయంలో కాలేజీలు మూత పడటంతో పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ కాలేజీలలోనే తమ పిల్లలను చేర్పించాలని, అక్కడే నాణ్యమై విద్య అందుతుందని ప్రచారం చేసే ప్రభుత్వం అక్కడ రెగ్యులర్ లెక్చరర్లు లేరని మాత్రం చెప్పడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ కాలేజీల్లోనే చదువుతున్నారు. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్, 17 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సబ్ కమిటీ ఏర్పాటుకే పరిమితమైన హామీ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కామినేని, యనమల, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్రెడ్డిలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటుకే బాబు హామీ పరిమితమైంది. ఈ కమిటీ ఐదు సార్లు çసమావేశం అయినా ఒక్కసారి కూడా నలుగురు మంత్రులు కూర్చొని చర్చలు జరపలేదు. సాంకేతిక సాకుతో రెగ్యులర్ చేయని ప్రభుత్వం.. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ప్రకటన, నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిన కానీ, రెగ్యులర్ పద్ధతిన కానీ భర్తీ చేసుకున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయవచ్చని 2006లో ఉమాదేవి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని అధికరణం–16 ప్రకారం ఉద్యోగాలు పొంది 3 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్కు అర్హులేనని బాంబే కోర్టు చెప్పింది. ప్రభుత్వం యాక్ట్ 2/1994 సెక్షన్–2 ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజీ సర్వీస్ కమిషన్, సెలక్షన్ కమిటీ, ఎంప్లాయ్మెంట్లలో ఏదో ఒకటి ద్వారా ఎంపిక అయిన వారు రెగ్యులర్కు అర్హులు. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏ సర్వీస్, ఏ కమిటీల ద్వారా ఎంపిక కాలేదని, ఏటా 10 నెలలు మాత్రమే పని చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంటున్నారనే సాకును చూపి రెగ్యులర్ జేయడంలో జాప్యం చేస్తున్నారు. అధ్యాపకుల సమ్మెతో మూతపడ్డ కాలేజీలు.. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ చేయాలని, 10 పీఆర్సీ అమలు చేయాలని నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టడంతో కాలేజీలలో తరగతి గదులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల కాలేజీలు మూత పడ్డాయి. మంత్రాలయం, ఆస్పరి, హొళగుంద, శ్రీశైలం, కోసిగి తదితర ప్రాంతాల్లో కాలేజీలు అధ్యాపకులు లేకపోవడంతో తలుపులు తెచుకోవడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: నవీన్ కుమార్, ఏపీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంక్షేమ సంఘం జేఏసీ కన్వీనర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలి. -
కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్సీపీ అండదండలు
- 16 ఏళ్లుగా పని చేస్తున్నా సర్కారు గుర్తించకపోవడం దారుణం - సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం - పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వెల్లడి - దీక్షలకు మద్దతు కర్నూలు సిటీ: కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ కృషి చేస్తుందని పార్టీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. వీరి సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేసేందుకు టీడీపీ సర్కారు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే జూనియర్ కాలేజీల్లో 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో చేపట్టిన కాంట్రాక్ట్ అధ్యాపకుల దీక్షా శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వస్తే అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు రెండున్నరేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేకపోయారన్నారు. రెగ్యులరైజేషన్ కోసం కమిటీని నియమించినా కాలం కరిగి పోతున్నా కమిటీ తీరులో ఏ మాత్రం కదలిక లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని సీఎం చంద్రబాబు ప్రచారం చేశారని, అయితే ఆయన రావడం వల్ల టీడీపీ నాయకులకు రాజకీయ ఉద్యోగం దొరికింది కాని చదువుకున్న నిరుద్యోగులకు కాదన్నారు. దీనికితోడు ఉన్న ఉద్యోగులనే విధుల నుంచి తొలగిస్తున్నారన్నారు. ఉద్యోగం ఇవ్వలేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామికి బుజు పట్టిందని ఆరోపించారు. ఇచ్చిన హామీని మరిచి తప్పుడు హామీలు, మాటలతో నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరో మూడు నెలలుంటే పరీక్షలున్నాయని, ఇలాంటి సమయంలో అధ్యాపకులు రోడ్లపైకి వచ్చేందుకు కారణమైన హామీపై సీఎం స్పందించాలన్నారు. దీక్షలకు...ఎన్జీఓలు మద్దతు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసి, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ చేపట్టిన దీక్షలకు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షులు సీహెచ్.వెంగళరెడ్డి సంఘీబావం తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.రంగస్వామి, నవీన్కూమార్, సేనీత, నాగరాజు, ఈశ్వర్, కిషోర్, శ్రీరాములు, సోమేష్, కె.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
విజయవాడ(గాంధీనగర్) : అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ టీడీపీ ఎన్నికల న హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు జీఎం దయాకర్ డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్స్ జేఏసీ సోమవారం «ఆందోళన చేపట్టింది. ఆయన మాట్లాడుతూ పదహారేళ్లు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా, అతితక్కువ వేతనంతో వెట్టిచాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో వేతన సంఘం కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్, డీఏ అమలు చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెట్టించుకోవడం లేదని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఆందోళనకు సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.సుందరి, విజయశ్రీ, నజీర్, మోహన్రావు, కేవీకే రాజు, ఎం.సుందరరావు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్ల ధర్నా
ప్రకాశం జిల్లా : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రతతో పాటు పదవ పీఆర్సీ వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లు కలెక్టరేట్ ముట్టడి
వైఎస్సార్ సీపీతో పాటు పలు సంఘాలు సంఘీభావం కాకినాడ సిటీ : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జాయింట్ యాక్ష¯ŒS కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. మందుగా కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరంలో మధ్యాహ్నం వరకు డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు మందు బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సీఐటీయూ నాయకులు అజయ్కుమార్, ఏఐటీయూసీ నాయకులు తోకల ప్రసాద్, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్సుందర్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వినతిపత్రం ఇచ్చేందుకు జేఏసీ నాయకులు యార్లగడ్డ రాజచౌదరి, పి.వీరబాబు, కె.లక్ష్మిదేవి, దడాల శ్రీనివాస్, వాగు మాధవ్, కనకరాజు ఆద్వర్యంలోకాంట్రాక్ట్ లెక్చరర్లు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మంత్రికి విషయం చెప్పగా ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్ల వద్దకు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించక పోతే ప్రోగసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరుపున ఆమరణదీక్ష చేపడతానన్నారు. మానవతా దృక్పథం లేదు : కన్నబాబు కాంట్రాక్ట్ లెక్చరర్లపై ప్రభుత్వానికి కనీస సానేభూతి, మానవతా దృక్పథ ఆలోచనలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనలో పాల్గొని మద్దతు పలికారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్్సపై ఎలాంటి ఆందోళనలు చేసినా వైఎస్సార్ సీపీ వెన్నంటి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళతానన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధానకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్ధుల్ బషీరుద్ధీ¯ŒS తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం
- కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు డిమాండ్ - కలెక్టరేట్ ముట్టడించి ధర్నా అనంతపురం అర్బన్ : ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వం డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ని కాంట్రాక్ట్ లెక్చరర్లు ముట్టడించి గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎర్రప్ప, సుబ్రమణ్యం, రామాంజినేయులు తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. సీఆర్సీ రికమెండేషన్ పేజీ 188–15 (బి) కాలేజ్యేట్ ఎడ్యుకేషన్ పేరా–2లో స్పష్టంగా కాంట్రాక్టు లెక్చరర్లకు మూలవేతనంతో పాటు డీఏ కూడా ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫేస్టోలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు లెక్చరర్లను బేషరతుగా కమ్రబద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వేణు, రవిరాజు, సుజాత, అనిత, మైథిలి, తదితరులు పాల్గొన్నారు. -
కంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి...
రామాయంపేట: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల కంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సుప్రింకోర్టు ఆదేశాలమేరకు తమకు పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు. అంతేగాకుండా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ అరుణకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కంట్రాక్టు లెక్చరర్లు బాపూరావు, అశోక్, దీప్లానాయక్, నర్సింలుగౌడ్, శ్రీదేవి, మాదవి, హాజీమా తదితరులు ఉన్నారు. టేక్మాల్: కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలి స్థానిక జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గతంలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యూలర్ చేస్తానని హమీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ చేయలేదన్నారు. కనీసం వేతనాలను కూడా పెంచడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ సమస్యలను నేడు హైదరాబాద్లో జరిగే ప్రిన్సిపల్ రివ్యూమీటింగ్లో విద్యాశాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కాంట్రాక్టు లెక్చరర్లు శ్రీనివాస్, రఘునాథరావు, పరమేశ్వర్, సంజీవ్, బాలేశ్వరమ్మ, అనిత ఉన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
మధురానగర్ : 16 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్స్గా పనిచేస్తున్న లెక్చరర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎం దయాకర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్స్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం ప్రభుత్వ కళాశాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామన్నారు. జీతాలు చాలక కుటుంబాలు అర్ధాకలితో, పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని చెప్పిన పాలకులు నేడు తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలుచేయని ప్రభుత్వాలు, తమను క్రమబద్ధీకరించటానికి మాత్రం సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పిందంటూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీఓ 16 ప్రకారం 2–94 యాక్ట్ను సవరించిందని, ఏపీలో తమ గురించి ఆలోచించిన వారే కరువయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు జీతాలను రెట్టింపు చేసుకునేందుకు నిధుల సమస్యలు లేవని తమ వేతనాలు పెంచడానికి, క్రమబద్ధీకరించడానికి నిధుల కొరత కనిపించడం హేయమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశామని, 21 నుంచి 23 వరకు పోస్టుకార్డు ఉద్యమం, 24, 25 తేదీలలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించటం, 28న కలెక్టరేట్వద్ద ధర్నా, డిసెంబర్ 1న కుటుంబ సభ్యులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 2 నుంచి నిరవధిక దీక్షలను చేపడతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు జాన్సన్, విజయశ్రీ,, రాంబాబు, సుధాకరన్, జ్యోతి, సునీత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త
– పోస్టుల రెన్యూవల్కు ఉత్తర్వులు జారీ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల (2016–17 విద్యా సంవత్సరానికి) పోస్టులను రెన్యూవల్ చేస్తూ ఆ శాఖ ఇన్చార్జ్ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలోని 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 427 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వం అధికారికంగా రెన్యూవల్ చేయని కారణంగా వారికి జీతాలు రాలేదు. ఉత్తర్వుల జారీతో వారు ఊపిరిపీల్చుకున్నారు. -
కొనసాగుతున్న రిలే దీక్షలు
ఎచ్చెర్ల : ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం సాగిస్తామని వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నేతలు స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ కాంట్రాక్టు అధ్యాపకులు చేపడుతున్న రిలే దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో యూజీసీ నిబంధనల అమలు, స్క్రీనింగ్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ దీక్షల్లో డాక్టర్ జేకేఎల్ సుజాత, డాక్టర్ కూన అచ్యుతరావు, రాంజీనాయక్, డాక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
మహబూబ్నగర్ విద్యావిభాగం: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను వెంటనే చేపట్టాలని తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రమదోపిడీ, వెట్టిచాకిరీ, బానిసత్వాలకు మరో రూపం కాంట్రాక్టు వ్యవస్థ అని అన్నారు. అలాంటి కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపడానికి కేసీఆర్ జీఓ 22ను, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు జీఓ నెం.16ను విడుదల చేసినప్పటికీ రెగ్యులరైజేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుందన్నారు. వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, నర్సింహ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్రావు, వెంకట్రాములు, జమ్మన్న, శ్రీధర్బాబు, పి.రామచంద్రారెడ్డి, ఆనంతరెడ్డి, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు దిగిన బీఆర్ఏయూ కాంట్రాక్టు అధ్యాపకులు
ఎచ్చెర్ల: కాంట్రాక్టు అధ్యాపకులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోసియేట్లు, టీచింగ్ అసిస్టెంట్లు సోమవారం సమ్మెకు దిగారు. రాష్ట్ర ఐక్య కార్యాచరణ యూనియన్ పిలు పు మేరకు తరగతులు బహిష్కరించారు. తరగతి గదులు, రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతరం వర్సిటీ ముందు ఆందోళన చేశారు. సహాయ ఆచార్యులు పోస్టుల నియామ కానికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేకమైనదంటూ నినదించారు. డాక్టరేట్, నెట్, స్లెట్ వంటి అర్హతలతో ఏళ్లకొద్దీ పనిచేస్తున్న వారికి అన్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో ఉద్యమం ఉద్ధతం చేస్తామని, కోర్టులను సైతం అశ్రయిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావులను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు బోధకుల నిరసన ను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం, డాక్టర్ కాయలు కష్ణమూర్తి, రోణంకి శ్రీధర్, డాక్టర్ జేఎల్ సంధ్యారాణి తదితరలు పాల్గొన్నారు. -
గాడి తప్పిన ఇంటర్ విద్య
అధ్యాపకుల కొరత రెన్యూవల్కు నోచుకోని కాంట్రాక్ట్ లెక్చరర్లు అతిథి అధ్యాపకులను తీసుకోనేందుకు ప్రభుత్వం ససేమిరా ఇంటర్ విద్య గాడి తప్పుతోంది. అనేక కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. వారి స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెల్లవుతున్నా వారి పోస్టులను రెన్యూవల్ చేయలేదు. మరోవైపు అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. పోస్టులు 652... పని చేస్తోంది 156 మంది జిల్లాలో 39 జనరల్, రెండు ఒకేషనల్ కలిపి మొత్తం 41 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 26,710 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మొత్తం 652 అధ్యాపక పోస్టులున్నాయి. వీటిల్లో కేవలం 156 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఉదాహరణకు శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా సైన్స్ గ్రూపులు మంజూరయ్యాయి. ఎంపీసీలో 10 మంది, బైపీసీలో 18 మంది విద్యార్థులు చేరారు. అయితే బోధించే అధ్యాపకులు లేరు. గణితం, ఫిజిక్స్, బొటనీ, కెమిస్ట్రీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు గాను ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. ఏదో ప్రిన్సిపల్ చొరవతో వీలున్నప్పుడు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) వచ్చి బోధిస్తున్నారు. అతిథి అధ్యాపకులుగా తమను తీసుకుంటారనే నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి చెబుతున్నారు. అనంతపురం నగరంలోని పాతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. -
కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేస్తాం
భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరీ పోస్టుల్లేవని గోడు వెళ్లబోసుకున్న బాధితులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లలో అర్హతలున్న వారందరికీ క్రమబద్ధీకరణ ప్రక్రియలో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. మంజూరీ పోస్టులు లేక నష్టపోతున్న వారికి తగు న్యాయం చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం, ప్రతినిధులు గంగ, ఫర్జానా, స్వర్ణలత తదితరులు బుధవారం సీఎం కేసీఆర్ను అధికారిక నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు. గత పాలకులు పోస్టులు మంజూరీ చేయకుండానే 2008-09లో 73 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరీ చేశారని, మంజూరీ పోస్టుల్లో అప్పటికే పనిచేస్తున్న 632 మందిని ఈ కాలేజీల్లోని అన్శాంక్షన్డ్ పోస్టుల్లోకి బదిలీ చేసి తమకు అన్యాయం చేశారని, దీంతో తాము మంజూరీ పోస్టుల్లో పనిచేస్తున్న జాబితాలో చేరామని, దీని వల్ల రెగ్యులరైజ్ అయ్యేందుకు అనర్హులుగా మారే ప్రమాదం తలెత్తిందని సీఎం కేసీఆర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి సరైన కసరత్తు చేసి సత్వర న్యాయం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. ఉద్యోగుల నియామకం, నియమ నిబంధనలు, రోస్టర్ పద్ధతి వంటి పలు న్యాయపరమైన అంశాలను అధిగమించే విధంగా మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ఆశపై అశనిపాతం
♦ పోస్టుల్లేకుంటే ఉద్వాసనే ♦ త్రిశంకు స్వర్గంలో కాంట్రాక్టు లెక్చరర్లు ♦ కొంపముంచిన మంజూరీ పోస్టుల నిబంధన ♦ ఎనిమిదేళ్లుగా కొత్త కాలేజీలకు పోస్టులివ్వని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ తాజా ఉత్తర్వు కాంట్రాక్టు ఉద్యోగుల్లో కలవరం సృష్టిస్తోంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. కొత్త కాలేజీల్లో పనిచేస్తున్నవారి పాలిట అశనిపాతంగా మారనుంది. దాదాపు 632 మంది కాంట్రాక్టు లెక్చరర్లు వీధినపడే ప్రమాదముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(రెగ్యులరైజేషన్ టు అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్ 1994ను తెలంగాణకు వర్తింపజేస్తూ ప్రభుత్వం (జీవో నం.16) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ 2014 జూన్ 2 నాటికి ప్రభుత్వశాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను కోరింది. రెండు వారాల్లోగా ఈ జాబితాలను పంపాలని ఈ నెల 4న అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సూచించారు. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిన నియమితులైనవారు, మంజూరు పోస్టుల్లో నెలనెలా వేతనాలు పొందినవారిని మాత్రమే అర్హులుగా పరిగణించాలన్నది ప్రభుత్వ ఉత్తర్వు సారాంశం. దాని ఆధారంగా అన్ని శాఖలు కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంజూరు కాని పోస్టుల్లో ఏళ్లకొద్దీ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా కొత్త కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ నిబంధన ముప్పు తెచ్చిపెట్టింది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 79 కొత్త జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో 11 కాలేజీలకు మాత్రమే పోస్టులు మంజూరు చేసింది. మిగతా 68 కాలేజీల్లో దాదాపు 632 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఈ కాలేజీల్లో పనిచేస్తున్నారు. వీరందరూ తాజా ఉత్తర్వులతో డీలాపడ్డారు. మరోవైపు 2012లో ఐదేళ్లు వరుసగా ఒకే కాలేజీలో పని చేసినవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అప్పటి వరకు మంజూరీ పోస్టుల్లో ఉన్న కొందరు కాంట్రాక్టు లెక్చరర్లు కొత్త కాలేజీలకు బదిలీ అయ్యారు. వీరందరూ మంజూరీ పోస్టుల నిబంధనతో నష్టపోయే పరిస్థితి తలెత్తింది. కొత్త కాలేజీల్లో పోస్టులు మంజూరు చేయకపోవటం తమ తప్పేలా అవుతుందని, ప్రభుత్వం ఈ నిబంధనపై పునరాలోచించి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు. -
'కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి'
హైదరాబాద్: కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈమేరకు మంత్రివర్గం ఉపసంఘం సభ్యులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాధరెడ్డిలను ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి కలిశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు గత 15 ఏళ్లుగా ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎయిడెడ్, సంస్కృత పాఠశాలల సిబ్బంది వేతనాల కోసం బడ్జెట్ను విడుదల చేసినందున మూడు నెలల వేతనం ఆంక్షలు లేకుండా చెల్లించాలని కోరారు. ఈ విషయాలపై మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గాంధీ, మాణిక్యం తదితరులు మంత్రులను కలిశారు -
బ్యాంక్ ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్లైన్ : ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న తమకు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారీ నిరాశ ఎదురైందని కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోయారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ గురువారం వారు రాజమండ్రి లోని ఇన్నీసుపేట స్టేట్బ్యాంక్ శాఖ ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 38 ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆరు నెలలుగా జీతాలు అందడంలేదు. దీంతో వారు పలు ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక నెల జీతాలను ప్రభుత్వం బ్యాంక్ డీడీల రూపంలో విడుదల చేశారు. ఈ సొమ్ము తీసుకునేందుకు డీడీలతో ఇన్నీసుపేట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇన్నీసుపేట బ్రాంచ్)కు వెళ్లిన 47 మంది కాంట్రాక్ట్ లెక్చర ర్లకు చుక్కెదురైంది. ఈ డీడీలు తప్పులతో జారీ అయ్యాయని, ఇవి చెల్లవని బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. ఆరు నెలలుగా అప్పులతో బతుకీడుస్తున్న తాము ఒక్కనెల జీతమైనా వస్తుందని ఆశతో వస్తే తప్పుడు డీడీలతో మోసం చేశారని కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గోకవరం కళాశాలకు సంబంధించిన డీడీని కోరుకొండ అడ్రస్తో, కాకినాడ కళాశాల డీడీని సామర్లకోట అడ్రస్తో ఇచ్చారని వాపోయారు. జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రాజాచౌదరి, ఇతర జిల్లా యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బ్యాంక్ సిబ్బందిని లెక్చరర్లు నిలదీశారు. 47 డీడీల లోని తప్పులను సవరించి మళ్లీ జారీ చేస్తామని బ్యాంకు సిబ్బంది సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
వేతనాలిచ్చేదెన్నడు?
నిర్మల్ రూరల్, న్యూస్లైన్ : రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతుండడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదనకు లోనవుతున్నారు. ఓ వైపు ఉద్యోగ భద్రత కరువు.. మరోవైపు వేతనాలు సరిగా అందక వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆగస్టు వరకు మాత్రమే వేతనాలు ఇచ్చారని, ఇటీవలే సెప్టెంబర్ వేతనం చెల్లించారని వారు చెబుతున్నారు. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలలకు సంబంధించిన వేతనం చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. విద్యార్థులకు రెగ్యులర్గా క్లాసులు చెబుతున్నా తమ వేతన గోడు వినేవారు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచీ కష్టాలే.. జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జీతం ప్రారంభంలో నెలకు రూ.4500. ఎన్నో ఆందోళనల తర్వాత ఆ మొత్తం రూ.18 వేలకు పెరిగింది. వేతనం పెరిగినా నెలనెలా అందించడంలో జాప్యం జరుగుతుండడంతో కాంట్రాక్టు లెక్చరర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లే ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్న తరుణంలో తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు. ఆయా డిమాండ్లపై గతంలో వారు ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకపో యింది. ఇకనైనా పెండింగ్ వేతనాలు చెల్లించి, నెలనెలా వేతనం సక్రమంగా చెల్లించేలా చర్య లు తీసుకోవాలని, తమ సర్వీసును రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నాకు మద్దతు పలికిన బాలినేని