Cuba
-
అక్రమ వలసదారులకు ఇక నరకమే: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికాకు వచ్చే అక్రమ వలసదారుల్ని గ్రహాంతరవాసులతో పోలుస్తున్నారు. వాళ్లను తిరిగి స్వదేశాలకు పంపే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటిదాకా.. వారం వ్యవధిలో 7,300 మందిని వెనక్కి పంపించేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారాయన.అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించే ప్రసక్తి లేదని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. అక్రమ వలసదారులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేందుకు అవసరమైన ‘లేకెన్ రిలే’ చట్టం అక్కడి చట్టసభల ఆమోదం పొందిన తెలిసిందే. ఆ ఫైల్పై ట్రంప్ తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమినల్స్ను విడిచిపెట్టం. దేశం నుంచి పంపించేస్తాం. అయితే కొందరు అత్యంత క్రూరులు ఉంటారు. వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్లను నరకంలాంటి గ్వాంటనామో జైలుకు తరలిస్తాం. సుమారు 30 వేల మంది కోసం అక్కడ బెడ్లు సిద్ధం చేయించే ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తా అని అన్నారాయన.క్యూబాలోని గ్వాంటనామో బేలో ఉందీ జైలు. నావల్ స్టేషన్ గ్వాంటనామో బే(NSGB) పరిధిలో ఉందీ అమెరికా మిలిటరీ ప్రిజన్. భూమ్మీది నరకంగా ఈ జైలును అభివర్ణింటారు. ఉగ్రవాదుల బంధీఖానాగా దీనికి పేరుంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత 2012లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ జైలును ప్రారంభించారు. 9/11 దాడుల్లో పాల్గొన్నవాళ్లను అమెరికా ఇక్కడ నిర్భంధించింది. ఇక్కడి ఖైదీలను మానసికంగా, శారీకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. జనవరి 2025 నాటికి.. ఈ జైల్లో 48 దేశాలకు చెందిన 780 మందిని బంధీలుగా ఉంచారు. అయితే.. 756 మందిని వెనక్కి పంపించేశారు. కస్టడీలో 9 మంది చనిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. -
క్యూబాలో వింత ఆచారం
కోరికలు తీర్చాలనో.. అవి తీరినందుకు మొక్కు చెల్లించుకోవడానికో ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడం చూస్తూనే ఉంటాం. క్యూబాలో కూడా ఇలాంటి సంస్కృతే ఉండటం విశేషం. పొర్లు దండాలు కాకున్నా సెయింట్ లాజరస్ ఊరేగింపు సందర్భంగా భక్తులు నేలపై పాకుతూ వెళ్తుంటారు. అందుకోసం భక్తులు పేదరికానికి ప్రతీకగా సంచులతో చేసిన బట్టలు వేసుకుంటారు. మోచేతులు, కాళ్లు రక్తమోడుతున్నా పట్టించుకోకుండా పాకుతారు. హవానా శివార్లలోని ఎల్ రిన్కాన్ అనే చిన్న చర్చికి చెప్పుల్లేకుండా నడిచి వెళ్తారు. కోర్కెలు తీర్చాల్సిందిగా లాజరస్ను మొక్కుకుంటారు. ఇది తాతల నాటి సంప్రదాయమట. ఏదేమైనా దాన్ని కచ్చితంగా ఆచరిస్తామని చెబుతారు వాళ్లు. క్యూబా నాస్తికత్వాన్ని వీడి 1992లో లౌకిక రాజ్యంగా మారింది. అక్కడ ఇటీవల బహిరంగ మత విశ్వాస ప్రదర్శనలు పెరిగాయి. 200 ఏళ్ల క్రితం బానిసలుగా వచ్చిన ఆఫ్రికన్లు యోరుబా మతంలోని శాంటరియా శాఖను తమతో తీసుకొచ్చారు. కొందరేమో బలవంతంగా కాథలిక్ మతంలోకి మారారు. దేశమంతటా ఈ రెండు మతాల సమ్మిళిత వాతావరణం ఉంటుంది. 1959 విప్లవం తరువాత క్యూబాలో వ్యవస్థీకృత మతాన్ని అణచివేసి శాంటరియా చాలావరకు విస్తరించింది. అది మతం కాదని క్యూబా ఆధ్యాత్మిక సంస్కృతి అని చెబుతుంటారు. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికాతో శత్రుత్వమున్నా ఒబామా హయాంలో దౌత్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. కానీ 2016లో డొనాల్డ్ ట్రంప్ రాకతో క్యూబాపై ప్రతికూల ప్రభావం పడింది. మళ్లీ ట్రంప్ రాకతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుందని క్యూబన్లు భయపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మత విశ్వాసాలను నమ్ముకుంటున్నారు. -
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్గా, మిలిటరీ కమాండర్గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
విప్లవ జ్యోతి
ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన విప్లవ నాయకుడు చే గువేరా. అర్జెంటీనాకు చెందిన ఈ మార్క్సిస్ట్ విప్లవకారుడు... వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ముఖ్యుడు. ఆయన అసలు పేరు ఎర్నేస్తో ‘చే’ గువేరా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. ఆయనకు ఆస్తమా వ్యాధి వుండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే విప్లవ పోరాటాలు చేశారు. లాటిన్ అమెరికాలో పర్యటన సమయంలో అక్కడి పేదరికం చూసి చలించిపోయారు. దీనికి కారణం ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాదాలేనని భావించారు. సమకాలీన వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని భావించారు. అందుకే విప్లవం బాట పట్టారు.మెక్సికోలో ఉంటున్న సమయంలో రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. అప్పటి నుంచి వారితో భుజం భుజం కలిపి క్యూబాను బాటిస్టా పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడారు. విప్లవకారుల్లో ముఖ్యమైన వ్యక్తిగా, సైన్యంలో రెండవ స్థానానికి చేరుకుని, నియంతృత్వ బాటిస్టాపై జరిగిన గెరిల్లా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అనేక ప్రధాన బాధ్యతలను స్వీకరించారు. మంచి వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాద దౌత్యవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశారు.గెరిల్లా యుద్ధ తంత్రంపై ఆధార గ్రంథాన్ని రాశారు. దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా పుస్తకం రాశారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో కిన్షాసాలోనూ, బొలీవియాలోనూ యుద్ధాలకు నాయకత్వం వహించారు.బొలీవియా యుద్ధంలో పాల్గొని, 1967 అక్టోబర్ 9న అక్కడి సైనికాధికారులకు పట్టుబడి కాల్చివేతకు గురయ్యారు. అలా తాను పుట్టిన దేశం వదలి ప్రపంచ పీడితుల పక్షాన వివిధ దేశాల్లో పోరాటాలు చేస్తూ అసువులు బాసి ఆధునిక విప్లవం మీద తనదైన ముద్ర వేశారు చే!– ర్యాలి ప్రసాద్, కాకినాడ(నేడు చే గువేరా జయంతి) -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
సీన్యో కాల్వీనో
ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్ 15) సంవత్సరం ఇది. ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్ గ్రాండ్మదర్)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్ పాలొమార్’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్ షీప్). కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్ యాన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్ మాడర్నిస్ట్ నవల అంటారు (ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం. ‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు. ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్బ్యాక్’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్ పొలొమార్’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్ చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్ వీవర్ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు! -
చేగువేరా బయోపిక్ నేపథ్యంలో వస్తోన్న 'చే'
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే". లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇదే. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిత్రయూనిట్ను అభినందించారు. (ఇది చదవండి: యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!) ఈ సందర్భంగా హీరో , దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... ' విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు ఈ చిత్రంలో చూపించాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమాను రూపోందించాం." అని చెప్పారు. త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్) -
అతిపెద్ద ఐస్క్రీమ్ పార్లర్..
ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్క్రీమ్ పార్లర్. క్యూబాలోని హవానా నగరంలో ఉంది. పేరు కొపేలియా పార్క్. ఈ పార్లర్లో పనిచేసే సిబ్బందికి అస్సలు ఖాళీ ఉండదు. ఒక రౌండ్లో 600ల మంది కస్టమర్లకు ఒకేసారి ఐస్క్రీమ్ అందిస్తుంటారు. రోజూ ఇక్కడకు కనీసం 30 వేలమంది వస్తుంటారు. 1966లో నిర్మించిన దీనిని ఐస్ క్రీమ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత పెద్ద ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్క్రీమ్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కో ఐస్క్రీమ్ ధర కేవలం రూ.17.20 మాత్రమే. ధర తక్కువ అని ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే పొరపాటే! ఈ పార్లర్లోని ఐస్క్రీమ్ రుచులు విదేశీ పర్యాటకులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతం అయిన తర్వాత అమెరికా నుంచి ఫిడెల్ క్యాస్ట్రో 28 కంటైనర్ల ఐస్క్రీమ్ ఆర్డర్ ఇచ్చారట. దాని రుచి ఆయనను ఎంతగానో ఆకట్టుకుందట! దీంతో అలాంటి ఐస్క్రీమ్ తమ దేశంలోనూ ఉండాలనే ఉద్దేశంతో కొపేలియా పార్క్ నిర్మించారట! (చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే) -
క్యూబాలో చైనా గూఢచారులు
వాషింగ్టన్: కమ్యూనిస్ట్ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి ఈ మేరకు డ్రాగన్ దేశంపై ఆరోపణలు గుప్పించారు. క్యూబాలోని చైనా నిఘా కేంద్రంపై అమెరికా నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయని ఆయన తెలిపారు. చైనా నిఘా కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలను బైడెన్ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. దౌత్యపరమైన, ఇతర మార్గాల్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయని ఆయన అన్నారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబా గడ్డపై నుంచి చైనా గూఢచర్యం కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని తమ నిఘా వర్గాలు అంటున్నాయని ఆ అధికారి ఉటంకించారు. అట్లాంటిక్ సముద్రం, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్యూబాలోని నిఘా కేంద్రాన్ని 2019లో చైనా అప్గ్రేడ్ చేసిందని ఆ అధికారి వివరించారు. క్యూబాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు గురువారం వాల్స్ట్రీట్ జర్నల్లో కథనం వచ్చింది. బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యూబాకు భారీగా ముట్టజెప్పేందుకు చైనా సిద్ధమైందని కూడా అందులో పేర్కొంది. అయితే, వాల్స్ట్రీట్ జర్నల్ కథనాన్ని క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖండించారు. -
అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు
బొల్లోజు రవి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయిన నిన్నటితరం గెరిల్లా యుద్ధ యోధుడు, మార్క్సిస్టు విప్లవవీరుడు చేగువేరా నేటి యువతరానికీ ఓ ఐకాన్. తండ్రి విప్లవ బాటను నిలువెల్లా నింపుకున్న ఆయన కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలైదా గువేరా ‘సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం’అంటూ ప్రపంచమంతా చాటి చెబుతున్నారు. క్యూబా రాజధాని హవానాలోని విలియం సోలెర్ చిల్ర్డన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేçస్తూనే ప్రపంచ దేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంటారు. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా భారత్లో పర్యటిస్తున్న అలైదా గువేరా ఆదివారం తన కుమార్తె, చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాతో కలసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నాన్నతో గడిపిన కాలం గుర్తుంది... లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాన్ని రగిలించేందుకు వెళ్లిన నాన్నను బొలీవియాలో 1967లో అమెరికా అనుకూల బొలివీయా దళాలు కాల్చి చంపినప్పుడు నాకు సుమారు ఏడేళ్లు. అయినప్పటికీ ఆయనతో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ మెరుపులా గుర్తున్నాయి. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నన్ను లేపేవారు. చెరకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన పనిచేస్తుంటే నేను చెరకుగడలు తింటూ గడిపేదాన్ని. ఇతరులతో మాట్లాడుతూ నన్ను ఆడిస్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీపుపై తిప్పుతూ ఆడించేవారు. నాకు, నా సోదరులకు జంతువుల కథలను ఎక్కువగా చెప్పేవారు. వారాంతాల్లో స్వచ్ఛంద పనులు చేసేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మాకు దూరంగా ఉన్నా ఉత్తరాలు రాసే వారు. మరో తండ్రిలా క్యాస్ట్రో... నాన్న చనిపోయాక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన ఫిడేల్ క్యాస్ట్రోనే అన్నీ తానై నన్ను చూసుకున్నారు. క్యాస్ట్రో మరో తండ్రిలాంటి వారు. ఆయనతో కలిసి గడిపిన కాలం ఎంతో ప్రత్యేకం. 1987లో నాకు పెళ్లయింది. పెళ్లి రాత్రి 11:30 గంటలకు జరిగింది. ఆయన రాకకోసం వేచిచూసి ఆ సమయంలో చేసుకున్నాం. నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన ఆసుపత్రికి వచ్చారు. విక్టోరియా అనే పేరు పెట్టాలని సూచించారు. కానీ అప్పటికే నేను, మావారు ఒక పేరు నిర్ణయించాం. ఈ విషయం ఆయనకు చెప్పేసరికి కాస్తంత నొచ్చుకున్నారు. పాపను చూసి అమ్మలా నువ్వు ఉండొద్దు (నవ్వుతూ) అని అన్నారు. ప్రపంచానికి మా దేశ వైద్య రంగం ఆదర్శం... క్యూబా వైద్య రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కాలంలోనూ వివిధ దేశాలకు వైద్య సాయం చేసింది. ఖతార్లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే వారంతా క్యూబన్లే. వారికి ఆ దేశం వేతనాలు ఇస్తుంది. హైతీలోనూ ఒక ఆసుపత్రిలో క్యూబన్లు పనిచేస్తున్నా వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ దేశం లేదు. అందువల్ల ఖతార్లో వచ్చే ఆదాయాన్ని హైతీ ఆసుపత్రుల్లో పనిచేసే క్యూబన్ డాక్టర్లకు చెల్లిస్తున్నాం. అర్జెంటీనాలో స్మారక నేత్ర ఆసుపత్రి, బొలీవియాలో జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. కరోనా కాలంలో ఫ్రాన్స్ కూడా క్యూబా వైద్య సాయం కోరింది. ఇటలీ, కెనాడాలకు వైద్య సాయం చేస్తున్నాం. మా దేశంలో చిన్నారులకు 14 రకాల టీకాలు ఇస్తుంటాం. క్యూబాలో ప్రస్తుతం శిశుమరణాల రేటు ప్రతి వెయ్యిలో ఐదుగా ఉంది. క్యూబాలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు.. క్యూబాలో 100 శాతం స్త్రీ, పురుష సమానత్వం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. మా దేశంలో మహిళా సంఘం ఉంది. అది అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తుంది. చినప్పటి నుంచే బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. పైస్థాయిలోనూ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళలు అన్ని రకాలుగా ముందున్నారు. అక్కడి చట్టాలు మహిళల హక్కులు కాపాడతాయి. మహిళా ఉద్యోగులకు ప్రసవానికి ముందు రెండు నెలలు, ప్రసవం తర్వాత 9 నెలలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైనా కూడా అదనపు సెలవులు కావాలంటే మరో మూడు నెలలు 75 శాతం వేతనంతో సెలవు ఇస్తున్నారు. త్వరలో ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కొత్త చట్టం రానుంది. అంతేకాదు ఆరు నెలలు తల్లికి, మరో ఆరు నెలలు తండ్రికి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనుకుంటున్నారు. క్యూబాలో ఇప్పుడు మగవారు కూడా వారికొక సంఘం కోరుకుంటున్నారు (నవ్వుతూ). మా దేశంలో పిల్లలను కొట్టకూడదు. క్యూబా డాక్టర్లలో 72 శాతం మంది మహిళలే. నాన్న కమ్యూనిస్టు... నాన్న చేగువేరా పూర్తి కమ్యూనిస్టు. ఇరాన్ వంటి దేశాల్లోనూ ఆయన్ను ఆరాధిస్తారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఆయన పనిచేశారు. కమ్యూనిస్టుగానే ఆయన చనిపోయారు. క్యూబా ఒకప్పుడు అమెరికా కాలనీగా ఆ దేశ కనుసన్నల్లో బతికింది. 1950లలో విప్లవోద్యమంతో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశం అన్ని రంగంలో పురోగమించింది. అమెరికాకు ఇది మింగుడు పడడంలేదు. ఇప్పటికీ క్యూబాను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోంది. పుస్తకం రాస్తున్నా.. నేను నాన్న గురించి ‘చేగువేరా–వైద్యం’అనే పుస్తకం రాస్తున్నా. అందుకోసం నాన్న రాసిన పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తున్నా. బొలీవియన్ డైరీస్ పుస్తకం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. డైరీ చివరి పేజీ నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి పేజీ ఆయన్ను చంపిన రోజు. ఒక పోరాట యోధుడి డైరీనే బొలివియన్ డైరీ. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. చదవండి: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ! -
Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..
క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. సోవియట్ యూనియన్ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది. నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ క్యూబా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీఫెన్ విల్కిన్సన్ చెప్పారు. 1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్ అగ్రికల్చర్ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి: అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
'గే' మ్యారేజెస్కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
Mumbo Jumbo: ముంబో జంబో.. ఈ ఇడియమ్ ఎప్పుడైనా వాడారా? అర్థం తెలిస్తే!
English Idioms- Mumbo Jumbo: అర్థం పర్ధం లేని మాటలు, పనులు, తెలివి తక్కువ నిర్ణయాలు, గందర గోళ పరిస్థితి, నవ్వులాటగా తోచే సీరియస్ పనులు... మొదలైన సందర్భాలలో ఉపయోగించే జాతీయం ఇది. 1738లో ఫ్రాన్సిస్ మూర్ అనే రచయిత ఈ ఎక్స్ప్రెషన్ను మొదటిసారిగా ఉపయోగించాడు. పశ్చిమ ఆఫ్రికాలో మూఢాచారాలు అనిపించే క్రతువులు కొన్ని ఉండేవి. అలాంటి వాటిలో ముంబో జంబో ఒకటి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అర్థంలో ఈ ఇడియమ్ను ఫ్రాన్సిస్ ఉపయోగించలేదు. ఆ తరువాత మాత్రం ‘నాన్సెన్స్’ అనిపించే పనులు, మాటల విషయాల్లో ఉపయోగిస్తున్నారు. ఉదా: 1. వాటిజ్ ఆల్ దిస్ ముంబో జంబో? 2. ఇట్ ఈజ్ నాట్ ముంబో జంబో యాజ్ సమ్ పీపుల్ థింక్.. మరి మీరు ఎపుడైనా ఈ ఇడియమ్ను ఉపయోగించారా? సమ్థింగ్ స్పెషల్.. పాత ఫొటోలు పాడయ్యాయా? ప్రతి ఇంట్లోనూ ఫొటో ఆల్బమ్స్ ఉంటాయి. వాటిలో చాలా పాత ఫోటోలు పాడై పోయి ఉంటాయి. ఇమేజ్ రిస్టోరేషన్ మెథడ్స్ వల్ల కొత్త ఫోటో వచ్చినప్పటికీ, దీనికి, ఒరిజినల్కు తేడా బాగా కనిపిస్తుంది. ఒరిజినల్కు, కొత్త ఇమేజ్కు పెద్ద తేడా లేకుండా సహజంగా ఉండడానికి gfp- యాప్ ఫ్రీ ఏఐ టూల్స్ ఉపకరిస్తాయి. ఎక్కడ ఏది అవసరమో (ఫిల్ ఇన్ది గ్యాప్స్) క్షణాల వ్యవధిలో సమకూరుస్తాయి ఈ ఏఐ టూల్స్. ప్రతీకాత్మక చిత్రం ఆర్ట్ అండ్ కల్చర్: అయ్యయ్యో! క్యూబా ఆర్టిస్ట్ ఆల్ఫ్రెడో మార్టిరెనా పర్యావరణ స్పృహతో ఎన్నో కార్టూన్లు గీశాడు. వాటిలో మీరు చూస్తున్న కార్టూన్ ఒకటి. ప్రపంచ జనాభా ఊహించని రీతిలో పెరిగిపోతుంది. పల్లెలు మాయమై పట్టణాలు ఇరుకు అవుతున్నాయి. చెట్లు మాయం అవుతున్నాయి. ఎటు చూసినా కాంక్రిట్ జంగిల్. దాని ప్రతికూల ప్రభావం ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది పచ్చదనం రూపంలో కాస్త ప్రాణవాయువు. అట్టి విషయాన్ని ఈ కార్టూన్ ఎంత చక్కగా చెప్పిందో! చదవండి: Pubarun Basu: నాలుగేళ్ల వయసులో మొదలెట్టాడు.. అద్భుతం ఆవిష్కృతం! అంతర్జాతీయ స్థాయిలో! -
అమెరికా పౌరసత్వాల్లో భారత్కు రెండో స్థానం
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్ 15 వరకు 6,61,500 మందికి పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మనవారికి 12,928 మందికి పౌరసత్వం లభించింది. మెక్సికో నుంచి అత్యధికంగా 24,508 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. ఫిలిప్పీన్స్(11,316), క్యూబా(10,689), డొమినికస్ రిపబ్లిక్(7,046) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. గతేడాది మొదటి ఐదు స్థానాల్లో మెక్సికో, భారత్, క్యూబా, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు నిలిచాయి. కాగా, అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. (క్లిక్: కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?) -
ఆ హోటల్.. ఇట్స్ అమేజింగ్! జింగ్.. జింగ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్గోయెంకా అద్భుతమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చారు. ఉరుకులపరుగుల జీవితం నుంచి దూరంగా వెళ్లి కాసేపు పక్షులా స్వేచ్ఛగా బతికేయాలని అనుకునేవాళ్లకి అనువైన ఓ హోటల్ని పరిచయం చేశారు. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో అధునాతన సౌకర్యాలతో గదులు, లాంజ్లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద గూళ్ల తరహాలో ఉన్న గదులను చేరుకునేందుకు చెట్లపైనే వేలాడే వుడెన్ బ్రిడ్జీలను ఏర్పాటు చేశారు. వెలిజ్ ఆర్కిటెక్టో అనే వ్యక్తి ఈ హోటళ్లను డిజైన్ చేశారు. ప్రశాంతతకి స్వర్గథామంగా ఈ హోటళ్లని స్థానికంగా పేర్కొంటారు. Amazing hotel complex in Cuba located on the trees of a forest where individual nests are connected by wooden suspension bridges. Looks like a haven of peace and tranquility! Architect: Veliz Arquitecto pic.twitter.com/s5lBDJYWaL — Harsh Goenka (@hvgoenka) October 10, 2021 చదవండి : 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం? -
హవానా... అంతా భ్రమేనా?!
అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకేస్తే ఎక్కడో ఉన్న ఎవరికో తగిలి తుస్సుమన్నట్లు అంతర్జాతీయ డిటెక్టివ్ సినిమా స్థాయిలో అందరూ హడావుడి చేసిన హవానా సిండ్రోమ్ వెనుక రహస్యాయుధాలేమీ లేవని తాజా పరిశోధన తేల్చేసింది. మనిషిలో ఏర్పడే మనో, చిత్త భ్రమల కారణంగానే హవానా సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని న్యూరాలజిస్టుల తాజా అంచనా! ఇంతకీ ఏంటీ సిండ్రోమ్? ఎందుకీ హడావుడి? సైంటిస్టులేమంటున్నారు? చూద్దాం.. ప్రపంచ పెద్దన్న అమెరికానే హైరానా పెట్టిన హవానా సిండ్రోమ్ పేరు 2016–17లో తొలిసారి వినిపించింది. క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మైగ్రేన్ తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం తదితర లక్షణాలు సిబ్బందిలో కనిపించాయి. దీని గురించి బయటపడి ఐదేళ్లైనా ఎందువల్ల వస్తుందో ఎవరూ కచి్ఛతంగా చెప్పలేకపోయారు. చివరకు జేమ్స్బాండ్ సినిమాలోలాగా ఏదో రహస్యాయుధం వల్లనే ఈ లక్షణాలు కలుగుతున్నాయని, అమెరికా సిబ్బందిపై ఈ ఆయుధాన్ని శత్రుదేశాలు ప్రయోగిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధం క్యూబా సృష్టి అని, రష్యా రూపకల్పన అని పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. కొందరు పేరున్న సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం తెలుసుకోకుండా ఆయుధ వాడకం థియరీని బలపరిచారు. అయితే అమెరికాకే చెందిన న్యూరాలజిస్టు రాబర్ట్ బలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. హవానా సిండ్రోమ్ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ లక్షణాలు తనవద్దకు వచ్చే మనోభ్రాంతి పేషెంట్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైకోసొమాటిక్(మానసికోత్పన్న) లక్షణాలుగా నిర్ధారణకు వచ్చారు. మానసిక భ్రాంతి కారణంగా కలిగినప్పటికీ ఈ లక్షణాలు నిజమైన బాధను కలగజేస్తాయని ఆయన పరిశోధనలో తేలింది. దీంతో ఈ విషయమై ఆయన మరింత లోతైన అధ్యయనం జరిపారు. బృంద లక్షణాలు మాస్ సైకోజెనిక్ ఇల్నెస్(బృంద చిత్త భ్రమ వ్యాధి) అనేది ఒక సమూహంలోని కొందరు ప్రజలు సామూహికంగా అనుభవించే మనో భ్రమ అని రాబర్ట్ చెప్పారు. ఇదే హవానా సిండ్రోమ్కు కారణమై ఉండొచ్చన్నది ఆయన స్థిర అభిప్రాయం. ఒక సమూహంలోని కొందరు తామేదో భయానకమైనదాన్ని ఎదుర్కొన్నామని భావించినప్పుడు ఈ భ్రమ మొదలవుతుందని వివరించారు. ఉదాహరణకు 20వ శతాబ్దంలో టెలిఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. తొలినాళ్లలో పలువురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక షాక్ లాంటి స్థితిని చాలా రోజులు అనుభవించేవారని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది కేవలం మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని రాబర్ట్ బల్లగుద్ది చెబుతున్నారు. హవానా సిండ్రోమ్ కూడా అలాంటిదేనన్నది ఆయన భావన. ఒత్తిడిలో పనిచేసేవారిలో ఈ ఇల్నెస్ ఆరంభమవుతుంది. ఒకరిలో ఈ భ్రమ ఆరంభం కాగానే, వారు దీని గురించి ఇతరులకు వివరిస్తారు. అలా విన్నవారిలో కొందరు అలాంటి భ్రమకు లోబడతారు. ఇలా ఈ లక్షణాలు వ్యాపిస్తూ ఉంటాయి. మెదడులో రసాయన మార్పుల కారణంగా ఈ లక్షణాలు ఆరంభమై సదరు వ్యక్తిని పలు ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు కనిపించే అవకాశం ఉందని రాబర్ట్ చెప్పారు. జాతీయ సైన్స్ అకాడమీ ఈ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. కానీ తగిన గణాంకాలు లేనందున నిర్ధారించడంలేదు. క్యూబా ప్రభుత్వం కూడా దీనిపై లోతైన పరిశోధన జరిపి గతనెల 13న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిండ్రోమ్ వెనుక ఎలాంటి ఆయుధాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. క్యూబాలో ఎప్పుడో పనిచేసిన ఒక అండర్ కవర్ ఏజెంట్, తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడి ఉంటారని, తననుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించిందనేది హవానా సిండ్రోమ్పై తాజా అంచనా. ఇంతకు మించిన కారణాలేమైనా ఉంటే, వాటిని సీఐఏ బయటపెడితే తప్ప హవానా సిండ్రోమ్పై హైరానా అనవసరమన్నది సైంటిస్టుల అభిప్రాయం. (చదవండి: అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్) సిద్ధాంత రాద్ధాంతాలు హవానా సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందులు ఒక్కరికే పరిమితం కాకుండా పలుమందిలో ఒకేలా కనిపించడం రాబర్ట్ను ఆకర్షించింది. దీంతో ఆయన మాస్ హిస్టీరియా, సైకోసొమాటిక్ డిసీజెస్ తదితర అనేక అంశాలను పరిశీలించి అధ్యయనం చేశారు. సోనార్ ఆయుధం వాడకం చెవి అంతర్భాగంలో ఏర్పడుతున్న హాని వల్ల ఈ లక్షణాలు కలుగుతున్నట్లు 2018లో మియామీకి చెందిన కొందరు జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. ఈ ఫలితాలను కూడా ఆయన మదింపు చేశారు. అయితే ఈ అధ్యయనాలన్నింటిలో లోపాల కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు రూపొందాయని ఆయన చెబుతున్నారు. (చదవండి: Bihar: నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు) సోనార్ ఆయుధం వాడి ఉంటే కేవలం లోపలి చెవి భాగాలు మాత్రమే కాకుండా మెదడులోని భాగాలు కూడా దెబ్బతిని ఉండేవని వివరించారు. మైక్రోవేవ్ రేడియేషన్ ఆయుధం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని 2020లో కొందరు సరికొత్త సిద్ధాంతం లేవనెత్తారు. దీన్ని జాతీయ సైన్సు అకాడమీ పరోక్షంగా సమరి్ధంచడంతో ఈ సిద్ధాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే మేక్రోవేవ్ ఆయుధం వల్ల వినిపించే శబ్దాలు నిజమైనవి కావని, మెదడులో ఉండే న్యూరాన్లు అనుభవించే మిధ్యా శబ్దాలని రాబర్ట్ చెప్పారు. హవానా సిండ్రోమ్ లక్షణాలు ఇలాంటి మిధ్యా శబ్దాలు కావని ఆయన గుర్తించారు. ఈ విధంగా అనేక పరిశీలన అనంతరం చిత్త భ్రమ వల్లనే ఈ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని రాబర్ట్ నిర్ధారణకు వచ్చారు. – నేషనల్ డేస్క్, సాక్షి. -
వారెవ్వా: ‘పంచ్’ అదిరిందిగా.. బాక్సింగ్లో టాప్ ఎవరంటే!
టోక్యో: ఒలింపిక్స్లో క్యూబా బాక్సర్ల పంచ్లకు ప్రత్యర్థుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. ఆదివారం పురుషుల లైట్వెయిట్ (63 కేజీలు) విభాగంలో జరిగిన ఫైనల్ బౌట్లో క్యూబా బాక్సర్ ఆండీ క్రూజ్ 4–1తో కీషాన్ డేవిస్ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిస్పై క్రూజ్కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పురుషుల +91 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రిచర్డ్ టొర్రెస్ జూనియర్ (అమెరికా) 0–5తో బకోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో 17 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గాలని చూసిన అమెరికాకు నిరాశే మిగిలింది. ఓవరాల్గా బాక్సింగ్లో ఐదు పతకాలు (నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం) సాధించిన క్యూబా టాప్ పొజిషన్లో నిలిచింది. వాటర్పోలో విజేత సెర్బియా పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన వాటర్పోలో ఫైనల్లో సెర్బియా 13–10 గోల్స్ తేడాతో గ్రీస్పై గెలుపొందింది. నికోలా జాక్సిచ్ మూడు గోల్స్ చేసి సెర్బియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హంగేరి తర్వాత వాటర్పోలోలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన జట్టుగా సెర్బియా నిలిచింది. గతంలో హంగేరి 2000–08 మధ్య జరిగిన ఒలింపిక్స్లో హ్యాట్రిక్ స్వర్ణాలను గెల్చుకుంది. చదవండి: మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా? -
ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఒక్కడు...
టోక్యో: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును క్యూబా మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నునెజ్ సాధించాడు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి రెజ్లర్గా అతను గుర్తింపు పొందాడు. గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 38 ఏళ్ల లోపెజ్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా అజేయుడిగా నిలిచి తన మెడలో పసిడి పతకాన్ని వేసుకున్నాడు. రెండోసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న లకోబికి రజతం దక్కింది. సోమవారం జరిగిన ఫైనల్లో లోపెజ్ 5–0తో లకోబి కజాయ (జార్జియా)ను ఓడించి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో లోపెజ్ 9–0తో అలెక్సుక్ (రొమేనియా)పై, క్వార్టర్ ఫైనల్లో 8–0తో అమీన్ మిర్జాజాదె (ఇరాన్)పై, సెమీఫైనల్లో 2–0తో రిజా కాయల్ప్ (టర్కీ)పై విజయం సాధించాడు. కాంస్య పతక బౌట్లలో రిజా కాయల్ప్ 7–2తో అమీన్ మిర్జాజాదెపై; అకోస్టా ఫెర్నాండెజ్ (చిలీ)పై సెర్గీ సెమెనోవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ) గెలిచారు. గతంలో రష్యా మేటి రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ (130 కేజీలు) వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గే రికార్డును సృష్టించాలనుకొని విఫలమయ్యాడు. కరెలిన్ 1988, 1992, 1996 ఒలింపిక్స్లలో స్వర్ణాలు సాధించి 2000 సిడ్నీ ఒలింపిక్స్ ఫైనల్లో రులాన్ గార్డెనర్ (అమెరికా) చేతిలో 0–1తో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. లోపెజ్ మాత్రం తన ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నాలుగో స్వర్ణాన్ని దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా కూడా నిలిచిన లోపెజ్ 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్లో 120 కేజీల విభాగంలో పసిడి పతకాలు సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్లో 130 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ‘పురుషుల రెజ్లింగ్లో కొత్త చరిత్ర సృష్టించినందుకు ఆనందంగా ఉంది. నా సుదీర్ఘ కెరీర్లో ఎంతో కష్టపడ్డాను. అత్యుత్తమ రెజ్లర్లను ఓడించి నాలుగోసారి స్వర్ణాన్ని గెలిచినందుకు గర్వంగా కూడా ఉంది. స్వర్ణ పతకం బౌట్ ముగిశాక క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కెనల్ నాకు ఫోన్ చేసి అభినందించారు’ అని లోపెజ్ వ్యాఖ్యానించాడు. మహిళల రెజ్లింగ్లో జపాన్కు చెందిన కవోరి ఇచో మాత్రమే వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. కవోరి ఇచో 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో 63 కేజీల విభాగంలో... 2016 రియో ఒలింపి క్స్లో 58 కేజీల విభాగంలో పసిడి పతకాలు గెల్చుకుంది. -
డబ్బులు తీసుకోలేదు.. ఫ్రీగా చేశా: మియా ఖలీఫా
ఎక్స్-పోర్న్స్టార్, ప్రయుఖ వెబ్కామ్ మోడల్ మియా ఖలీఫా మరోసారి వార్తల్లోకి నిలిచింది. క్యూబా అల్లకల్లోలంపై ఆమె చేసిన పోస్ట్తో రాజకీయపరమైన విమర్శలు మొదలయ్యాయి. ఏకంగా క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ ఆమెపై విరుచుకుపడ్డాడు. మియాను ఓ క్యారెక్టర్లేని పర్సనాలిటీగా పేర్కొన్న మిగ్యుయెల్.. ఆమె ఒక అమెరికా పెయిడ్ ఏజెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె స్పందించింది. ‘ప్రజల పట్ల మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్న మీ తీరును ఇతరులకు తెలియజేయాలనే ఆ పని చేశా. నేనేం డబ్బులు తీసుకుని ఆ పని చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు ఆ పని అప్పజెప్పలేదు. నా పరిధిలో ఉచితంగా ఆ ట్వీట్ చేశా’ అంటూ ట్వీట్ ద్వారా బదులిచ్చింది ఆమె. అంతేకాదు క్యూబా అయినా, పాలస్తీనా అయినా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే నా పని అంటూ మరో ట్వీట్ ద్వారా పేర్కొంది. ఇదిలా ఉంటే క్యూబా ప్రజల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు బైడెన్ మద్దతు తెలిపిన రోజే.. మియా ఖలీఫా ట్వీట్ చేసింది. దీంతో మీడియా ప్రతినిధులు క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దగ్గర ఆమె ప్రస్తావన తీసుకురావడంతో ‘ఆమె అమెరికా చేతిలో కీలు బొమ్మ. క్యారెక్టర్ లేని వ్యక్తి. పెయిడ్ ఏజెంట్’ అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. ఇక మియాకు ఇలా ఇన్న్యూస్ విషయాలపై కొత్తేం కాదు. గతంలో పాలస్తీనా విషయంలో అమెరికా తప్పుల్ని సైతం వెలేత్తి చూపించిందామె. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ లెబనీస్-అమెరికన్ సెలబ్రిటీ.. తరచూ కొందరికి సాయం అందించడంతో పాటు ఇలా వివాదాల్లో కూడా నిలుస్తోంది. It’s tough not to see the faces of my people in the suffering of Cubans. Lebanon, Palestine, Cuba, it doesn’t matter where it’s happening, all that matters is it needs to be talked about because look at the result: PRESSURE forces change https://t.co/OG6QeEM7QL — Mia K. (@miakhalifa) July 15, 2021 -
రణరంగంగా క్యూబా.. విధ్వంసకాండ! కుట్ర కోణం?
Cuba Protests దశాబ్దాలుగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న క్యూబాలో కనివిని ఎరుగని రీతిలో జనాగ్రహం పెల్లుబిక్కింది. రోడ్డెక్కిన వేల మంది ప్రజలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన గళం విప్పుతున్నారు. నియంతృత్వ పోకడల ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని, అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ తిరుగుబాటు వెనుక కుట్ర కోణం ఉందని క్యూబా ప్రభుత్వం ఆరోపిస్తోంది. హవానా: కరేబియన్ ద్వీప దేశం క్యూబాలో ఈ స్థాయి ప్రభుత్వవ్యతిరేకత కనిపించడం ఇదే తొలిసారి. ఆర్థిక సంక్షోభం వల్లే జనాల్లో ఆగ్రహం నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరెంట్ కోతలు, ఆహార కొరత, కరోనా మందులు-వ్యాక్సిన్ల కొరత.. వీటికి తోడు అమెరికా ఆంక్షల పర్వం కూడా క్యూబా ప్రజల్లో సొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయి. అధ్యక్షుడు Miguel Díaz-Canel రాజీనామాకు డిమాండ్ చేసేలా చేశాయి. ‘మా స్వేచ్ఛ మాక్కావాలి’ అంటూ వేల మంది రాజధాని హవానాకు చేరి ప్రదర్శనలు చేపడుతున్నారు. పోలీసులు వాళ్లను అదుపు చేసే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కర్రలతో ఎదురు దాడులకు పాల్పడడమే కాకుండా.. ప్రజా ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు నిరసనకారులు. అణిచివేత దశాబ్దాల కమ్యూనిస్టు పాలనలో ఇంత తీవ్ర స్థాయి నిరసనలు హోరెత్తడం ఇదే తొలిసారి. హవానాతో పాటు చాలాచోట్ల పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో మిలిటరీ, పోలీసుల సాయంతో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది క్యూబా ప్రభుత్వం. ఇప్పటికే పదుల సంఖ్యలో నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. మరికొందరికి గాయలయ్యాయి. క్యూబాలో 2018లో ఇంటర్నెట్ అడుగుపెట్టగా.. ప్రస్తుతం ప్రజా తిరుగుబాటు ప్రభావంతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్టులు కనిపిస్తున్నాయి. ‘Freedom, food, vaccines!’ 😲😳#Cuba #CubaProtestspic.twitter.com/8VTjWf5pEr — Auron (@auron83591234) July 12, 2021 దీంతో అక్కడి ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ను కట్ చేసింది. మరోవైపు క్యూబా ప్రజాగ్రహంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. క్యూబా ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న తిరుగుబాటు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అభివర్ణించాడు. క్యూబా ప్రజలకు తమ మద్ధతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ‘ముందు వాళ్ల డిమాండ్లు ఏంటో వినండి.. అణచివేతను ఆపి పేదరికాన్ని ఎలా రూపుమాపాలో దృష్టిపెట్టండి. ప్రజలపై కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అంటూ క్యూబా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు బైడెన్. జోక్యం చేసుకుంటే ఊరుకోం ఇది ముమ్మాటికీ ‘క్యూబన్-అమెరికన్ మాఫియా’ పనే అని ఆరోపిస్తోంది క్యూబా సర్కార్. పెయిడ్ ఏజెంట్లను నియమించుకున్న అమెరికా.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో అంతర్జాతీయ సమాజంలో తమను నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ ఆరోపించాడు. ఇందులో కుట్ర దాగుంది. ప్రజలు సమన్వయం పాటించాలి. శాంతి స్థాపన కోసం పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధం. ఇతరుల జోక్యం లేకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరిద్దాం అని ఆదివారం రాత్రి జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇదిలా ఉంటే క్యూబా అంతర్గత వ్యవహారంలో ఏ దేశమైనా కలుగజేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని రష్యా, మెక్సికోలు హెచ్చరికలు జారీ చేశాయి. అఫ్కోర్స్.. పరోక్షంగా ఈ వార్నింగ్ అమెరికాకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శాంతియుతంగా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చి.. వాళ్ల డిమాండ్లపై చర్చలు జరపాలని ఈయూ ఫారిన్ పాలసీ ఛీఫ్ జోసెఫ్ బొర్రెల్, క్యూబా ప్రభుత్వాన్ని కోరాడు. In the three years I spent going back and forth to Cuba, my Cuban partner and I were stopped repeatedly by the police on the streets in Havana. This is truly amazing to see the people fighting back against the police state.pic.twitter.com/x6WPUq9ddn — Keith Boykin (@keithboykin) July 12, 2021 -
క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం పన్నాడని ఆయన గర్ల్ఫ్రెండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా చెప్పారు. వచ్చేసారి క్యూబాలో కలుసుకుంటామని చోక్సి తనతో చెప్పినట్టుగా ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ అతను క్యూబాలో స్థిరపడాలని భావించాడు’అని బార్బరా చెప్పారు. చోక్సికి తాను గర్ల్ఫ్రెండ్ని కాదన్నారు. చోక్సి నేరస్తుడని తెలీదు చోక్సి పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలీదని, అతని అసలు పేరు, బ్యాక్ గ్రౌండ్ ఏదీ తనకు తెలీదని బార్బరా చెప్పారు. ‘నేను యూరోపియన్ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించీ తెలీదు. చోక్సి అసలు పేరేమిటో గత వారం వరకు నాకు తెలీదు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి చోక్సిని కలుసుకున్నాను. తన పేరు రాజ్ అని పరిచయం చేసుకున్నాడు. తరచు నాకు మెసేజ్లు పెడుతూ ఉండేవాడు. కానీ నెలకోసారి మాత్రం రిప్లయ్ ఇచ్చేదాన్ని’ అని చెప్పారు. మరోవైపు ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి తనను డొమినికాకు తీసుకువచ్చారని, ఆ కిడ్నాప్లో బార్బరా హస్తం కూడా ఉందంటూ చోక్సి చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. మెహుల్ చోక్సి బెయిల్ పిటిషన్ విచారణని డొమినికా హైకోర్టు 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. కింద కోర్టు అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో చోక్సి హైకోర్టుకెక్కారు. -
లాక్డౌన్.. ఎవరు బెస్ట్?
కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్డౌన్ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా లాక్డౌన్ను అమలు చేసిందెవరు? దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఓ భారీ అధ్యయనం నిర్వహించింది. మొత్తం 180 దేశాల్లో లాక్డౌన్ను పరిశీలించిన అనంతరం 100కు ఇన్ని మార్కులు అని వేసింది.. ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలు సమర్థంగా లాక్డౌన్ను అమలు చేసినట్లు అన్నమాట. అలాగని లాక్డౌన్ అనేసరికి.. ఒక్క కర్ఫ్యూ విధించడం ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోలేదు. అనేక ఇతర అంశాలను పరిశీలించింది. పాఠశాలలు, ఆఫీసులను మూసేయడం.. బహిరంగ సమావేశాలపై నిషేధం, వృద్ధుల సంరక్షణ, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, వైద్య రంగంలో పెట్టుబడి, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడటం, ఆర్థికపరమైన ప్యాకేజీలు, ఆదాయం కోల్పోయినవారికి ఆసరాగా నిలవడం, వ్యాక్సిన్లపై ఖర్చు, కాంటాక్ట్ ట్రేసింగ్, లాక్డౌన్ దశలవారీగా ఉపసంహరణ ఇలా అనేక అంశాలను గమనించి.. ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కఠినంగా లాక్డౌన్ను అమలు చేసిన దేశం క్యూబా (90.74).. తర్వాతి స్థానాల్లో ఎరిత్రియా(89.81), ఐర్లాండ్(87.96), హొండూరస్(87.96), లెబనాన్(87.04), బ్రిటన్, పెరూ(86.11) ఉన్నాయి. మన విషయానికొస్తే.. భారత్కు 68.98 పాయింట్లు రాగా.. చైనాకు 78.24, అమెరికాకు 71.76, ఫ్రాన్స్కు 63.89 వచ్చాయి. లాక్డౌన్ మార్కుల స్కేల్పై వివిధ దేశాల పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే.. -
మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..
వాషింగ్టన్: తెలియని ప్రాంతంలో ఒక్క పూట గడపాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది నర సంచారం లేని దీవిలో.. తిండి తిప్పలు లేకుండా నెల రోజులకు పైగా గడపడం అంటే మాటలు కాదు. ఇలాంటి భయంకర పరిస్థితి ఎదురయ్యింది ముగ్గురు వ్యక్తులకు. వీరంతా 33 రోజుల పాటు మనుషుల్లేని దీవిలో బందీలయ్యారు. నాలుగో మనిషి కనబడడు.. ఆహారం, నీరు లేదు. అదృష్టం కొద్ది అక్కడ కొబ్బరి చెట్లు ఉండటంతో.. ఇన్నాళ్లు బతికి బట్టకట్టగలిగారు. చివరకు 33 రోజుల తర్వాత ఆ దీవి నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇంతకు వీరంతా ఆ దీవిలోకి ఎందుకు వెళ్లారు.. ఎలా బయటపడగలిగారు అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు.. పడవలో సముద్రంలోకి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువ కావడం వల్ల వారు ప్రయాణిస్తున్న పడవ బొల్తా పడింది. ఊహించని ఈ ప్రమాదానికి వారు బిక్క చచ్చిపోయారు. ఎలానో ధైర్యం తెచ్చుకుని చేతికి అందిన వస్తువులను పట్టుకుని సమీపంలోని దీవి వరకు ఈదుకుంటూ వెళ్లిపోయారు. ఇక వారు చేరుకున్న దీవి నర సంచారం ఉండని బహమాన్ దీవుల్లోని అతి చిన్న ద్వీపం అంగుయిలా కే. ఒడ్డుకు అయితే చేరగలిగారు కానీ అక్కడి నుంచి బయటపడే మార్గ కనిపించలేదు. చేసేదేం లేక అటుగా ఏమైనా ఓడలు, విమానాలు వస్తే సాయం అడగవచ్చని భావించి.. కాలం గడపసాగారు. ఇలా ఓ మూడు రోజులు గడిచాయి. వారితో తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీవిలో ఏమైనా పండ్ల చెట్ల లాంటివి ఉంటాయేమోనని వెతకడం ప్రారంభించారు. అదృష్టం కొద్ది వారికి కొబ్బరి చెట్లు కనిపించాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మొదట్లో కొబ్బరి బొండాల్లో నీరు తాగి, కొబ్బరిని తిని రోజులు వెళ్లదీశారు. కానీ ఎన్ని రోజులని ఇలా. సరైన ఆహారం లేక.. కేవలం కొబ్బరి మాత్రమే తీసుకుంటుండటంతో వారిలో నీరసం బాగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది నీరసం పెరగుతోంది.. బతుకు మీద ఆశ తగ్గుతోంది. ఇక తామంతా ఆ దీవిలోనే ఆకలితో అలమటించి సజీవ సమాధి అవ్వక తప్పదని భావించారు. అలా 33 రోజుల గడిచిపోయాయి. #UPDATE @USCG rescued the 3 Cuban nationals stranded on Anguilla Cay. A helicopter crew transferred the 2 men & 1 woman to Lower Keys Medical Center with no reported injuries. More details to follow.#D7 #USCG #Ready #Relevant #Responsive pic.twitter.com/4kX5WJJhs8 — USCGSoutheast (@USCGSoutheast) February 9, 2021 ఈ క్రమంలో ఫిబ్రవరి 8న అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి అటుగా ఎగురుతూ వచ్చింది. ఆ శబ్దం వారిలో చనిపోయిన ఆశలను రేకేత్తించింది. బతికిపోయాం.. ఇక బయటపడతాం అని భావించారు. తమ దగ్గరున్న దుస్తులను జెండాలుగా ఊపుతూ.. తమ గురించి ఎయిర్ క్రాఫ్ట్లోని వారికి అర్థం అయ్యేలా చేశారు. ఇక విమానంలో ఉన్న వారికి కింద ఏవో జెండాలు కదులుతున్నట్లు తోచి.. కాస్త కిందకు వచ్చారు. అక్కడ ఈ ముగ్గురిని చూసి షాకయ్యారు. ఆ తర్వాత పైలెట్ వీరి గురించి అధికారులకు తెలియజేశాడు. దాంతో ఆ దీవి వద్దకు హెలికాప్టర్ను పంపి ఆ ముగ్గురికి నీళ్లు, ఆహారంతో పాటు వారితో మాట్లాడేందుకు వీలుగా ఓ రేడియో వాకీ టాకీని కూడా అందించారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అదే రోజు వారిని రక్షించలేకపోయారు. దాంతో ఫిబ్రవరి 9న మరో రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించింది. అనంతరం వారిని హాస్పిటల్కు తరలించారు. లక్కీగా వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. నీరసం మినహా ఇతర అనారోగ్య సమస్యలు ఏం లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక వీరిని కాపాడిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మీకింకా భూమ్మీద నూకలున్నాయి.. అందుకే బయటపడ్డారు.. మరో సారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ నెటిజనులు సూచిస్తున్నారు. చదవండి: ఆరోగ్యం... క్యూబా భాగ్యం! స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..! -
క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం
హవానా: గగనతలంలో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ఇండినేషియాలో భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా క్యూబా దేశంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున (జనవరి 29) హెలికాప్టర్ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దేశంలో 2018లో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఘాటెక్కిన హవానా చుట్ట!
ప్రపంచం ఇంకా చిన్నదైంది. ఆర్థిక విధానాల గ్లోబలైజేషన్తో తొలిసారి కుచించుకుపోయిన భూగోళం, దాని వెన్నంటే వచ్చిన కమ్యూనికేషన్ విప్లవంతో అరచేతిలోకి చేరిపోయింది. ఇప్పుడు మనం మహమ్మారిగా పిలుచుకుంటున్న కోవిడైజేషన్ ఆ గ్లోబ్ ధరించిన రకరకాల రంగురంగుల వస్త్రాలను విప్పేసింది. నగ్నంగా నిలబెట్టింది. గొప్పదేశాల గోత్రాలు తెలిసిపోతున్నాయి. చిన్న దేశాల సందేశాలు చెవిసోకుతున్నాయి. రెండొందల పై చిలుకు దేశాల పేర్లు వార్తల్ని బ్రేక్ చేస్తున్నాయి. అంతా అనుకున్న ట్టుగానే జరిగి వుంటే ఈ జూలైలో ఒలింపిక్స్ ప్రారంభమై ఉండేవి. నెలరోజులపాటు ప్రపంచం దృష్టి అటు మళ్లి వుండేది. మెడల్స్ గెలిచిన దేశాల పట్టిక మీడియా హైలైట్గా వుండేది. కాని ఆ పట్టికలో చాలా దేశాలకు చోటు దొరికి ఉండేది కాదు. ఈ కరోనా పట్టిక అలా కాదు. రెండొందల పైచిలుకు దేశాలకు చోటు కల్పించింది. వీటిలో కొన్ని దేశాల మీదే ప్రజల దృష్టి ఎక్కువగా లగ్నమైంది. వైరస్ ప్రారంభమైన చైనా, అల్లాడుతున్న ఇటలీ, స్పెయిన్లతో పాటు ఇంకో రెండు పేర్లు, రెండు వేర్వేరు కారణాల రీత్యా టాక్ ఆఫ్ ది గ్లోబ్గా నర్తిస్తున్నాయి. అవి అమెరికా, క్యూబా. పక్కపక్కనే ఉంటాయి. ఇరుగూ పొరుగే కానీ, ఈడూ జోడూ అస్సలు కుదరదు. రెంటి మధ్యన హస్తిమశకాంతరం. అమెరికా ఏనుగైతే క్యూబా దోమ. సైజులోనే కాదు సంపదలో కూడా. మన దేశంలో నిరక్షరాస్యులక్కూడా పరిచయం అవసరం లేని పేరు అమెరికా. అది కూడా మనదే, బలిసినవాళ్లుండే బంజారా హిల్స్ లాగా... కాకపోతే ఇంకాస్త పెద్దది అనుకునేవాళ్లు కోకొల్లలు. ‘మావాడు అమెరికాలో తాసిల్దారయితే చూడాలని ఉందండీ’ అంటాడు కోట శ్రీనివాసరావు అదేదో సినిమాలో. మధ్యతరగతి వాళ్లకయితే అమెరికా అంటే ఒక జీవితాశయం. పిల్లల్ని బాగా చదివిస్తే అమెరికాకు వెళ్తారు. డాలర్లు సంపాది స్తారు. అవి ఇండియాకు వచ్చి రూపాయలుగా మారుతాయి. వాటితో పొలం పుట్రా కొనేసి పెట్టొచ్చు పిల్లల కోసం... ఆ డాలర్ డ్రీమ్స్తోనే కొవ్వొత్తులుగా మారుతారు తల్లిదండ్రులు. చాలా మంది సాధిస్తారు. చివరకు తమకు మాత్రమే కనిపించే లైఫ్టైమ్ అచీవ్మెంట్ మెమెంటోను చూసుకుంటూ శేష జీవితం గడుపు తున్న తల్లిదండ్రులు లేని ఊరులేదు మన దేశంలో. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇక క్యూబా సంగతి. మన దేశంలో ఆ పేరు చాలా కొద్దిమందికే తెలుసు. ఫిడెల్ కాస్ట్రో కాల్చిపారేసిన కొహిబా బ్రాండ్ హవానా చుట్టలకూ, చేగువేరా బొమ్మలు వుండే టీ–షర్టు లకు ప్రపంచమంతటా ఉన్నట్టే మన దగ్గర కూడా అంతో ఇంతో క్రేజ్ ఉంది. మన నవతరంలో ఎక్కువమందికి క్యూబా గురించి అంతకుమించిన ఆసక్తి వుండే అవకాశం లేదు. అమెరికాకు ఆగ్నే యంగా వున్న ఫ్లొరిడా తీరానికి 90 మైళ్ల దూరంలో వుంది క్యూబా. ఈ తొంబై మైళ్ల దూరానికి ఒక అరవై ఏళ్ల స్టోరీ కూడా వుంది. అమెరికా–రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా వున్న రోజుల్లో కాస్ట్రో కమ్యూనిస్టు కనుక క్యూబా రష్యా అనుకూల వైఖరితో ఉండేది. ఇది అమెరికాకు కంట్లో నలుసులాంటి సమస్య. చివరకు కెనెడీ క్యూబాను బెదిరిస్తాడు. ‘అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే క్యూబా వుంది జాగ్రత్త’. కాస్ట్రో కూడా అందుకు దీటుగా సమాధానం చెబుతాడు. ‘అవును, అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలోనే ఉంది. అంతేకాదు, క్యూబాకు కూడా అమె రికా 90 మైళ్ల దూరంలోనే ఉంది గుర్తు పెట్టుకోండి’. ‘దీవార్’ సినిమాలో అమితాబ్ బచ్చన్తో ‘మేరే పాస్ మా హై’ అని శశికపూర్ చెప్పినంత నిబ్బరంగా కాస్ట్రో కూడా అమెరికాకు చెబుతాడు. మహామేరువు లాంటి అమెరికాకు పిపీలికమంత క్యూబా సవాలు విసరడమా? ఆ ధైర్యం వెనుక రహస్యమేమిటి? ఇంకేముంటుంది రష్యా తప్ప అన్నారంతా. కానేకాదు, ఆ ధైర్యం క్యూబా సామాజిక వ్యవస్థ సమకూర్చిన ఆత్మబలం అని తదనం తర పరిణామాలు నిరూపించాయి. కాస్ట్రో తర్వాత క్యూబా విప్లవంలో ప్రముఖపాత్ర పోషించిన చేగువేరా నిజానికి క్యూబా దేశస్తుడు కాదు. అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశానికి ముగు తాడు వేయాలంటే ఒక్క క్యూబాలోనే కాదు అమెరికా ఖండం లోని అన్ని దేశాల్లోనూ విప్లవ ప్రభుత్వాలు ఏర్పడాలని కాంక్షిస్తూ, ఒక విశ్వమానవుడిగా ఆ పోరాటాల్లో పాల్గొంటూ చివరకు బొలీవియా అడవుల్లో హత్యకు గురవుతాడు. భారత్కు భగత్ సింగ్లాగా చేగువేరా ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించాడు. ఒక నాడు అమెరికా ఆంక్షల కారణంగా ఔషధాలు లభించక, కనీస వైద్యసేవలు అందుబాటులో లేక అవస్థలు పడిన క్యూబా అనతి కాలంలోనే అత్యుత్తమమైన ప్రజారోగ్య విధానాన్ని అమలు చేయ గలిగింది. ఈ రోజున క్యూబాలో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. ప్రాథమిక రోగ నివారణ పద్ధతులు, ప్రజారోగ్యంపై సామాజిక, కుటుంబ, ఆర్థిక, మానసిక కారణాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు కూడా అక్కడి వైద్యవిద్యలో పాఠ్యాంశాలుగా ఉంటాయి. వైద్యరంగం మొత్తం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. కొన్ని కుటుంబాలకు కలిపి ఒక డాక్టర్ను, నర్సును కేటాయిస్తారు. ఆ కుటుంబాల్లోని సభ్యులం దరి ఆరోగ్య జాతకాలు సంబంధిత ఫ్యామిలీ డాక్టర్, నర్సుల దగ్గర ఉంటాయి. వారి పరిధిలో కుటుంబాలను తరచుగా వారిం టికే వెళ్లి డాక్టర్, నర్సు పలకరిస్తుంటారు. అందువల్ల సహజంగానే ఆరోగ్యపరమైన అవగాహన, చైతన్యం సమాజంలో ఎక్కువ. పెద్దగా వనరుల్లేని చిన్న దేశం, పేదదేశమైన క్యూబాలో సగటు ఆయుర్దాయం 79.74 Sఏళ్లుగా ఉంది. ఇది అమెరికా కంటే ఒక సంవత్సరం, భారత్కంటే పదేళ్లు ఎక్కువ. వైద్య రంగాన్ని ప్రైవే ట్కు వదిలేసిన సూపర్ పవర్ అమెరికా వైరస్ దాడికి చిగురు టాకులా వణికిపోతుంటే పక్కనే ఉన్న క్యూబా తన దేశంలో నిలు వరించగలిగింది. పైగా తన వైద్యులను ఇటలీ, స్పెయిన్, ఇరాన్ తదితర అనేక దేశాలకు పంపించి సమస్త మానవాళి తరఫున క్యూబా పోరాటం చేస్తున్నది. అమెరికా మాత్రం చేతులెత్తేసింది. మందుల కోసం భారత్ను దేబిరిస్తున్నది. మిస్టర్ జాన్ఎఫ్ కెనెడీ... మిమ్మల్ని క్యూబా ఓడించింది. రష్యా అండతో కాదు. ఆత్మబలం అండతో, ఆశయబలం అండతో. అమెరికా, క్యూబా రెండూ విభిన్నమైన సామాజిక– రాజ కీయ–ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రెండు విరుద్ధ భావాలకు ఇవి ప్రతీకలు. అమెరికా, యూరప్, ఇతర పెట్టుబడిదారీ దేశాల మౌలిక సిద్ధాంతం పెట్టుబడి చుట్టూ తిరుగుతుంది. దానిపై వచ్చే లాభాల చుట్టూ తిరుగుతుంది. అందువల్ల విద్య, వైద్యం సహా సమస్త రంగాలను ప్రైవేట్పరం చేశాయి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, సోషల్ డెమోక్రాట్లు తర తమ భేదాలతో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తారు. పెట్టుబడి కేంద్రక అభివృద్ధికి బదులు మానవకేంద్రక అభివృద్ధిని ప్రతిపాదిస్తారు. అందువల్ల ఈ వ్యవస్థలో మౌలిక రంగాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిన ఇరవయ్యో శతాబ్దపు చరిత్ర అంతా ఈ రెండు వ్యవస్థల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధ చరిత్రే. ఈ యుద్ధం ఫలితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉదారవాదం ముసుగు వేసుకొని శ్రామికులను, సాధారణ ప్రజలను ఆకర్షించగలిగింది. కమ్యూనిస్టు ఆర్థికాభివృద్దికి ఉన్న పరిమితుల కారణంగా ఈ యుద్ధంలో సోవియట్ రష్యా శిబిరం ఓడిపోయింది. ఇప్పటికీ కమ్యూనిస్టు రాజ్యాలుగా చెప్పుకుం టున్న చైనా, క్యూబా, వియత్నాం దేశాలు వైరస్ వ్యాప్తిని విజయ వంతంగా కట్టడి చేశాయి. రష్యాతోపాటు కమ్యూనిస్టు పాలనను వదిలించుకొని పెట్టుబడిదారీ వ్యవస్థలోకి జారిపోయిన సుమారు 25 తూర్పు యూరప్, సెంట్రల్ ఆసియా దేశాలు కూడా ఈ విషయంలో మెరుగ్గానే వున్నాయి. యూరప్లో సగభాగమైన తూర్పు యూరప్లోని మొత్తం కరోనా మరణాల సంఖ్య ఒక్క బ్రిటన్ మృతుల సంఖ్య కంటే కూడా తక్కువ. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ల తర్వాత మరణాల సంఖ్యలో యూరప్లో నాలుగో స్థానం బ్రిటన్ది. తూర్పు యూరప్ దేశాల విద్య, ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్న సోషలిస్టు పునాదుల కారణంగానే ఈ తేడా ఉన్నదనే వాదాన్ని గట్టిగా ఖండించలేము. కరోనా ఎపిసోడ్ నుంచి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నది. వేలంవెర్రిగా ప్రైవేటీకరణవైపు పరుగులు తీయకుండా కనీసం ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్యలనైనా పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పాత్ర దాదాపు పూజ్యం. ప్రభుత్వ వైద్యులు ప్రాణా లకు తెగించి పని చేస్తుంటే కార్పొరేట్ వైద్యులు మీడియా ఇంటర్వూ్యల్లో ఉచిత సలహాలు పారేసే పనిలో బిజీగా గడుపు తున్నారు. హైదరాబాద్లో నిరంతరం పేషెంట్లతో కిటకిటలాడే రెండు మూడు కార్పొరేట్ ఆస్పత్రులను లాక్ డౌన్ పీరియడ్లో పరిశీలించడం జరిగింది. పేషెంట్ల సంఖ్య 30 శాతానికి పడిపో యింది. ఆశ్చర్యకరమైన విషయం ఎమర్జెన్సీ కేసులు కూడా ఇరవై శాతానికి పడిపోవడం. కరోనాను చూసి గుండెపోట్లు, కిడ్నీ ఫెయి ల్యూర్స్లాంటివి కూడా జడుసుకున్నాయా? ఎమ్ఆర్ఐ స్కానర్లు, సీటీ స్కానర్లు కూడా మూలనపడ్డాయి. వాటి అవసరమే కలగడం లేదు. వైద్యసేవలు అందక రోగాలతో చనిపోయే (నాన్–కరోనా) వారి సంఖ్య కూడా పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. కార్పొరేట్ ఆస్పత్రులు పేషెంట్లను భయపెట్టి కృత్రిమ ఎమర్జెన్సీ కేసులను సృష్టిస్తున్నాయని బోధపడటం లేదా? కరోనా అనంతరం జరగబోయే పరిణామాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కరోనా ముగింపు ఏ రకంగా ఉండబోతున్నదో ఎవరికీ ఊహకందడం లేదు. జరగ బోయే విధ్వంసం ఎంతో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. భారతదేశంలో తొలి కరోనా మరణం సంభవించిన నెలరోజుల తర్వాత నేటికి ఆ సంఖ్య 250కి చేరింది. నెల రోజుల వ్యవధిలో టీబీ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. డెంగీతో, విషజ్వరాలతో ఇంతకంటే ఎన్నోరెట్లు ఎక్కు వమంది చనిపోయారు. కాకపోతే వాళ్లంతా పేదవర్గాల ప్రజలు. మనదేశంలో కరోనా లాక్డౌన్ ఫలితంగా ముందు ముందు సంభవించబోయే జీవన విధ్వంసం మరింత భయంకరంగా ఉండబోతున్నది. లక్షలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూత పడబోతున్నాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోబోతున్నారు. అమెరికాలోనే లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారన్న అంచ నాలు వస్తున్నవి. ఈ ఫలితాలు రాజకీయ వ్యవస్థల మీద ఎటు వంటి ప్రభావం చూపబోతున్నాయో స్పష్టతరాలేదు. అమెరి కాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరగాలి. డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీపడిన బెర్నీ శాండర్స్ మధ్యలో తప్పుకోవడం ఆ దేశంలోని ఉద్యోగులకు, శ్రామికులకు, పేదలకు అశనిపాతం లాంటిది. మళ్లీ ట్రంప్ గెలిస్తే ఉద్యోగాల ఊచకోత తప్పక పోవచ్చు. కానీ, అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట ఒక మెట్టు కిందకు దిగుతుంది. చైనా ఒక మెట్టు పైకి ఎక్కవచ్చు. అంత మాత్రాన అది తక్షణం అగ్రరాజ్యం కాజాలదు. ఎక్కాల్సిన మెట్లు ఇంకా ఉన్నాయి. మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న భారత ఆకాం క్షలను లాక్డౌన్ పుణ్యమా అని మరో ఐదేళ్లో పదేళ్లో వాయిదా వేసుకోవలసి రావచ్చు. ఆ స్థానం జర్మనీ కైవసం కావచ్చు. భారత రాజకీయాల్లో ప్రస్తుతానికి నరేంద్ర మోదీకి పోటీ లేదు. ఆర్థిక వ్యవస్థను ఆయన గాడిలో పెట్టే తీరుపై వచ్చే ఎన్నికలు నాటి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. చివరగా లాక్డౌన్లో గడుపుతున్నవారి కోసం ఒక చిన్న పొడుపు కథ: ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. అయినా స్కూల్ పిల్లలు మోడల్ అసెంబ్లీని ప్రదర్శించిన పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలనే కలెక్టర్లుగా భావించి ముఖ్యమంత్రి వేషంలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు రాజకీయ విభేదాలు పక్కనపెట్టాయి. ట్రంప్ వైఫల్యం కనిపి స్తున్నా ఆయన ప్రత్యర్థి కాబోతున్న జో బిడెన్ కూడా ఏమీ అనడంలేదు. కానీ ఆయన మాత్రం ప్రతిరోజూ విమర్శలనే పనిగా పెట్టుకున్నారు. ఎవరాయన? క్లూ: అడిగినవారికీ అడగని వారికీ తన ఆటోబయోగ్రఫీ వినిపించే అలవాటు ఆయనకు బాగా ఎక్కువ. మహాత్మాగాంధీ, లియోటాల్స్టాయ్, అబ్రహాం లింకన్, కులీకుతుబ్షా తదితరుల బయోగ్రఫీల్లోని కొన్ని భాగాలను పొరపాటున తన బయోగ్రఫీలో కలిపి చెప్పుకోవడం కూడా కద్దు. వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమి? - వర్ధెల్లి మురళి -
కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటి వరకు 186 దేశాలకు విస్తరించిన ఈ మహ్మమారిని.. ఎదర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకూ వైరస్ సోకడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనగా మారింది. ఈ క్రమంలో అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న అతిచిన్న దేశం క్యూబా కరోనా బాధిత దేశాలకు అండగా నిలుస్తోంది. పక్కనున్న శత్రుదేశం అమెరికాను కరోనా పీడిస్తున్న తరుణంలో ఆ దేశానికి వైద్యులను పంపి ఆదుకుంటోంది. యూఎస్కే కాదు క్యూబా వైద్యులు నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు సేవలందిస్తున్నారు. క్యూబా.. ఒక చిన్న దేశం.. మన దేశంలో ఓ జిల్లా అంత విస్తీర్ణంలో ఉంటుంది. కేవలం కోటి మంది జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే డాక్టర్ల కార్ఖానాగా వెలుగొందుతోంది. జనాభా పరంగా చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ జనాభాగల దేశం. కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో క్యూబా వైద్యులు అనేక దేశాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. క్యూబాపై అనేక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఛీదరించుకునే అమెరికాలో, ఇటలీలో కరోనా వైద్య సేవల్లో క్యూబన్ డాక్టర్లు నిమగ్నమయ్యారు. కరోనా కారణంగా ఆరోగ్యం అనేది గాలిలో దీపమైపోయిన వేళ.. భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపిస్తున్న ఇలాంటి సమయంలో క్యూబా మన కళ్ల ముందు కనిపించే ఓ కాంతి రేఖ. విప్లవ యోధులైన చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల ప్రభావం అక్కడి యువతరంపై ఎక్కువ. ముఖ్యంగా గొప్ప వైద్యుడు, మానవతావాది అయిన చేగువేరా స్ఫూర్తి క్యూబా డాక్టర్లలో కనిపిస్తుంది. దేశ సేవ అంటే మనుషులకు సేవ చేయడమేననేది క్యూబా సోషలిస్టు ప్రభుత్వం నమ్మే సిద్ధాంతం. అందుకే.. ప్రపంచం మొత్తాన్నీ కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ.. క్యూబా అధ్యక్షుడిగా క్యాస్ట్రో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రపంచానికి క్యూబా ఏం ఇస్తోందో క్యాస్ట్రో చెప్పారు. యుద్ధం చేసి ప్రాణాలు తీసే బాంబులను క్యూబా తయారు చెయ్యబోదన్న క్యాస్ట్రో.. మనుషులకు ప్రాణం పోసే డాక్టర్లను తమ దేశం తయారు చేస్తుందన్నారు. క్యాస్ట్రో చెప్పిన విధంగానే క్యూబా తనను తాను డాక్టర్ల కార్ఖానాగా నిరూపించుకుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా క్యూబా ప్రభుత్వం ఆయా దేశాల సహాయార్థం భారీగా డాక్టర్ల బృందాలను పంపి స్వచ్ఛంద వైద్య సేవల్ని అందిస్తుంది. కరోనా అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తున్న వేళ.. క్యూబా డాక్టర్లు కరోనా బాధిత దేశాలకు సేవలందించేందుకు తరలివెళ్లారు. క్యూబా సోషలిస్టు భావాలంటే అమెరికా భయపడుతుంది. అందుకే.. క్యూబా అమెరికా మధ్య విపరీతమైన ఆంక్షలుంటాయి. క్యూబాను అణగదొక్కేందుకు అమెరికా చెయ్యని ప్రయత్నాల్లేవు. అలాగే ఇటలీ, బ్రిటన్, జర్మనీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షల అస్త్రశస్త్రాలు విసురుతూనే ఉంటాయి. అవేవీ మనసులో పెట్టుకోని క్యూబా కరోనా వైద్య సేవలందించేందుకు తన దేశం నుంచి వైద్య బృందాలను పంపింది. తమ దేశంలోకి క్యూబా వైద్యులు రాగానే ఇటలీ పౌరులు కరతాళ ధ్వనులతో వారికి గొప్ప స్వాగతం పలికారంటే.. అది క్యూబా వైద్యులపై ఇటలీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ ఇలా అనేక దేశాల్లో ప్రస్తుతం వేలాది మంది క్యూబన్ వైద్యులు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ రోగాలు ప్రబలిన సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా డాక్టర్లు సైనికుల్లా ముందుకు కదిలారు. హైతీలో కలరా వ్యాపించి జనం పిట్టల్లా రాలిపోతోంటే.. క్యూబా డాక్టర్ల బృందాలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి సేవలందించాయి. పశ్చిమాసియా దేశాలకు ఎబోలా ప్రబలినప్పుడు కూడా క్యూబా వైద్యులే ఆపద్భాందవుల్లా కదిలారు. విపత్కర పరిస్థితులలో సరిహద్దులకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే క్యూబా డాక్టర్లు కష్టకాలంలో పోరాడే యోధులు. కరోనా కరాళ నృత్యంతో అమెరికా కకావికలం అయిపోతోంది. ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్పెయిన్, ఇరాన్ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయ్. ఈ దేశాలన్నీ సంపన్న దేశాలు. ఆధునిక పోకడలు ఎక్కువగా ఉన్న దేశాలు. కానీ క్యూబా అమెరికాను ఆనుకొని ఉన్న చిన్న దేశం. అమెరికా విద్వేషాన్ని ఎదుర్కొంటూ తన దేశాన్ని తీర్చిదిద్దుకున్న దేశం. ఆయుధాల కంటే ఆరోగ్యమే గొప్ప అని నమ్మిన దేశం. కరోనా విసిరిన సవాలును దీటుగా స్వీకరించి వైద్యసేవలందిస్తున్న క్యూబా మన లాంటి దేశాల ప్రాధాన్యతలు ఎలా ఉండాలో గుర్తు చేస్తోంది. ఆఫ్రికా ఖండం ఎబోలాతో తల్లడిల్లినపుడు అండగా నిలిచింది క్యూబా వైద్యులే. ఇవాళ కరోనాతో అతలాకుతలమవుతున్న వేళ అగ్రరాజ్యాలు చేతులెత్తేసినపుడు మేమున్నామని భరోసా ఇచ్చింది క్యూబా వైద్యులే.. క్యూబాను చూసైనా భారత్ తో సహా అనేక దేశాలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయుధాలు, అణ్వస్త్రాల కంటే విద్య, వైద్యం పైన ఎక్కువ దృష్టిసారించాలి. భవిష్యత్తులో యుద్ధాలంటూ చేయాల్సివస్తే అది శతృదేశాలతో కాదనీ.. కరోనా లాంటి భయంకరమైన వైరస్లతోనన్న నిజాన్ని గుర్తించాలి. అందుకు దేశపౌరులను సిద్ధం చేసేందుకు వైద్యరంగాన్ని అత్యంత ప్రాధాన్యమైన రంగంగా గుర్తించాలి. ప్రాణాలు తీసే ఆయుధాల కంటే.. ప్రాణం పోసే వైద్యాన్ని పటిష్టం చేసుకోవాలంటూ దిశా నిర్దేశం చేస్తోంది క్యూబా. -
క్యూబా డాక్టర్ల కార్ఖానా!
-
ఆరోగ్యం... క్యూబా భాగ్యం!
1950 ప్రాంతాల్లో క్యూబన్ రివల్యూషన్ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఓ వైద్య విధానాన్ని రూపొందించుకుంది. దాని పేరే ‘రూరల్ మెడికల్ సర్వీసెస్’. ఆ విధానం మేరకు మారుమూల పల్లెలకు సైతం వైద్యం అందితీరాలని క్యూబా ప్రతినబూనింది. పైపెచ్చు చికిత్స కంటే నివారణకు ఎంతో ప్రాధాన్యమిచ్చింది. అసలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు క్యూబా దగ్గర 750 మంది ఫిజీషియన్లే ఉన్నారు. 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దేశాలన్నీ ‘అల్మా–ఆటా’డిక్లరేషన్ చేశాయి. ప్రతి వ్యక్తీ... శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలంటూ... చేసుకున్న ఈ తీర్మానం పై ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు సంతకం చేశాయి. కానీ వీటిలో చాలా దేశాలు... ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. క్యూబా మాత్రం 1970లలోనే దేశమంతటా మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ను ఏర్పాటు చేసుకుంది. అల్మా–ఆటా తర్వాత ఇది మరింత ఊపందుకుంది. 1980ల నాటికి ‘ఫ్యామిలీ డాక్టర్స్–నర్సెస్’అనే కార్యక్రమంతో మరింత ముందుకెళ్లింది. 1990 నాటికి దేశంలోని 95% జనాభాకు వైద్య ఆరోగ్య సేవలందించే స్థితికి చేరింది. అక్కడి కోటి మంది జనాభా ఉంటే వారిలో 1 శాతం... అంటే లక్ష మంది వైద్యులే. వారిలోనూ 33,000 మంది ఫ్యామిలీ ఫిజీషియన్లే. వైద్యరంగంలో క్యూబా సాధించిన ప్రగతి కారణంగా 2014 మేలో నిర్వహించిన ‘67వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’కి క్యూబా నేతృత్వం వహించింది. ఇదీ... క్యూబా ఘనత ► ఈ దేశ రాజ్యాంగంలో ‘ఆరోగ్య హక్కు’ఉంది. దీని ప్రకారం అందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. ఇక్కడ సగటు జీవనకాలం 79 ఏళ్లు. ► క్యూబా వైద్యులిపుడు ప్రపంచమంతా సేవలందిస్తున్నారు. అంధత్వాన్ని నివారించేందుకు లాటిన్ అమెరికా దేశాలైన బొలీవియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్యాటెమాలా, గయానా, హైతీ, హోండురాస్, గ్రనెడా, నికరాగ్వా, పనామా, పరాగ్వే, ఉరుగ్వే లాంటి 14 దేశాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ► క్యూబా 1998 నుంచీ లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (ఈఎల్ఏఎమ్) ద్వారా వేలమంది ఫిజీషియన్లను తయారు చేసింది. ఇప్పుడు కూడా 120 దేశాలకు చెందిన 11,000 మంది అక్కడ చదువుతున్నారు. ► 1960, 1972, 1990లలో చిలీ, నికరాగ్వా, ఇరాన్లలో భూకంపాలు వచ్చినప్పుడు అత్యవసర సహాయం కోసం క్యూబా డాక్టర్లు ముందుకొచ్చారు. ► 1998లో హరికేన్ విపత్తు వచ్చినప్పుడు అక్కడి వైద్యబృందాలు హోండురాస్, గ్వాటెమాలాకు తరలివెళ్లి... సేవలందించాయి. ► 2004 సునామీ సమయంలో శ్రీలంకకూ వచ్చి సేవలందించారు. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ప్రబలినప్పుడు... ఎన్నో దేశాలు గడగడలాడినా... క్యూబా 62 మంది డాక్టర్లనూ, 103 మంది నర్సులను పంపింది. ► తాజాగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న ఇటలీకి దాదాపు 50 మందికి పైగా ఉన్న ఓ వైద్య బృందం చేరుకుని సేవలందించడం మొదలు పెట్టింది. అదో చిన్న దేశం. నిజం చెప్పాలంటే చాలా చాలా చిన్న దేశం. పిచ్చుక లాంటి ఆ దేశంపై అమెరికా అనునిత్యం ఆంక్షల బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తూనే వచ్చింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు సైతం అవకాశం దొరికినప్పుడల్లా క్యూబాపై ఆంక్షలు విధిస్తూ... అక్కడి విధానాలను ఆడిపోసుకున్నాయి. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పూనుకుని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోపై 638 సార్లు హత్యాయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి. అలాంటి క్యూబా... ఈ సంక్షోభ సమయంలో అగ్రరాజ్యమైన ఇటలీకి తమ వైద్యుల్ని పంపి కొండంత అండగా నిలుస్తోంది. ఇంత చిన్న దేశమైన క్యూబా వద్ద అంత పెద్ద వైద్య వ్యవస్థ ఎలా ఉందని ఆశ్చర్యం కలగక మానదు. దాని వెనక పెద్ద కథే ఉంది. అది చూస్తే... -
నీటి అడుగున చిత్రం
కళాకారులంటేనే సృజన శీలురు. ఏ పని అయినా చాలా వినూత్నంగా చేయాలని కోరుకుంటారు. క్యూబాకు చెందిన శాండోర్ గొంజాలెజ్ చిత్రకారుడు చూసినది చూసినట్టు కాన్వాస్పై చిత్రించేస్తాడు. అయితే, భూ ఉపరితలంపై అన్నింటినీ చిత్రించేశాడో, లేక పైన ఎక్కడా సరైన ప్లేస్ లేదనుకున్నాడో ఏమో గాని.. సముద్రం లోపలికి వెళ్లి నేరుగా ఆ లోపలి జలరాశిని, చేపలను, సొరచేపలను, పగడపుదిబ్బలను చూస్తూ పెయింటింగ్ వేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరంజామా అంతా ఏర్పాటు చేసుకొని సముద్రంలో మునిగాడు. శాండోర్ వయసు 42. నలుపు–తెలుపు చిత్రాలను, వేటకు సంబంధించినవి, పట్టణ, పల్లె జీవనశైలులు కాన్వాస్పై కళ్లకు కట్టేలా చిత్రించి అంతర్జాతీయంగా పేరొందినవాడు. ఆరేళ్ల క్రితం.. క్యూబా దీవుల్లో స్కూబా డైవింగ్లో పాల్గొన్నప్పుడు నీటి కింద కనిపించే ప్రశాంతత, అక్కడి ప్రకృతి అందమైన రూపాలు చూసి అబ్బురపడ్డాడు. ‘తేలికపాటి అలలు, మృదువుగా మనసును తాకే సవ్వడులు నాలో ఒక అలౌకికమైన ఆనందాన్ని నింపాయి’ అంటాడు శాండోర్. స్పెయిన్లో ఒక జీవశాస్త్రవేత్త నీటి అడుగున పెయింటింగ్ వేశారని ఎవరో బ్లాగర్ ద్వారా తెలుసుకున్నప్పటికీ తనకు తానుగా ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు. నీళ్లలో తడిస్తే తుడుచుకుపోయే పెయింట్ కాకూడదని, భూమి పైనా ఆ చిత్రాలతో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెల్లటి కాన్వాసులను ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టి, వాటిలో ఉప్పు ఇతర సేంద్రీయ పదార్థాలను వదిలించడానికి ప్రత్యేకంగా కడగడం ఎలాగో, వాటిని ఎలాంటి పద్ధతుల్లో ఆరబెట్టాలో నేర్చుకున్నాడు. నీ అడుగున చేరి కాన్వాస్పై ఏ రంగులు.. ఎలా వేయాలో తెలుసుకున్నాడు. సరైన సరంజామాతో.. స్కూబా డైవింగ్ గేర్, ఆక్సిజన్ ట్యాంక్, కాళ్లకు కట్టుకునే ఎల్లో ఫ్లిప్పర్స్, కాన్యాస్, ఇతరత్రా సామగ్రి అంతా తీసుకొని సముద్రంలో మునిగి 197 అడుగుల లోతుకు వెళ్లి తన పెయింటింగ్కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. మరో ఇరవై అడుగుల లోతులో నీటి ఉధృతి లేని చోటు చూసుకుని కాన్వాస్ టేబుల్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆక్సిజన్ ట్యాంక్ పరిధి మేరకు ముప్పై నిమిషాల సేపు నీటి అడుగు లోపలి అందాలను వీక్షిస్తూ పెయింటింగ్ వేసుకొని పైకి వచ్చేస్తాడు. పారదర్శకంగా కనిపించే నీళ్లలో 200 అడుగుల లోతు నుంచి పైకి చూస్తూ ఆ కనిపించే ప్రపంచంలో ఎగిరి తిమింగళాలు, చేపలు, కదలాడుతున్నట్టు కనిపించే ఇండ్లు, చెట్లు, ఆకాశం... ఇలా ఎన్నో అందాలు ఆ చిత్రాల్లో కనిపిస్తాయి. ‘నీటి అడుగున పెయింటింగ్ వేయడం ప్రపంచంలో మరెక్కడా లేదని నేను అనుకోను. నేనైతే జలంతర్గామి పెయింటింగ్ను నీటిలో ఉండి చిత్రించాలనుకుంటున్నాను’ అంటూ తన ముందున్న లక్ష్యాన్ని వివరిస్తాడు శాండోర్. ఇప్పుడు క్యూబా దీవుల్లో టూరిస్టులకు, స్కూబా డైవింగ్ చేసేవారికి శాండోర్ నీటి అడుగు చిత్రాల గురించి అక్కడి స్థానికులు ప్రత్యేకంగా చెబుతుంటారు. -
4 జీబీ డేటా 3 వేల రూపాయలు
మొబైల్ ఇంటర్నెట్.. ప్రస్తుతం ఓ నిత్యావసరంగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు కూడా ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తిని విస్తృతిస్తున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి కనెక్ట్ అవడానికి కూడా మొబైల్ ఇంటర్నెటే ఓ సారథిలా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ లగ్జరీగా ఉంది. చాలా మంది దీని యాక్సస్ను పొందలేకపోతున్నారు. దీనిలో కరేబియన్ దీవి క్యూబా ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత ట్రెండ్ను బ్రేక్ చేస్తూ.. క్యూబా ఎట్టకేలకు మొబైల్ ఇంటర్నెట్ను అందించడం ప్రారంభించింది. తొలిసారిగా ఎంపిక చేసిన యూజర్లకు అంటే ప్రభుత్వ రంగ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగులు, రాయబారులకు మొబైల్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు మొబైల్ ఫోన్ యూజర్లందరకూ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా క్యూబా పనిచేస్తోంది కూడా. క్యూబన్ టెలికాం దిగ్గజం ఈటీఈసీఎస్ఏ ఈ సర్వీసులను అందజేస్తోంది. అయితే ఆ దేశ టెలికాం మార్కెట్లో మోనోపలిగా సేవలందిస్తున్న ఈ సంస్థ, 4 జీబీ డేటాకు 45 డాలర్లు అంటే రూ.3 వేలను ఛార్జ్లుగా విధిస్తోంది. తన 50 లక్షల కస్టమర్లందరికీ ఇంటర్నెట్ యాక్సస్ను ఈటీఈసీఎస్ఏ కల్పిస్తుందని రిపోర్టు చెప్పాయి. అంటే దేశ జనాభాలో సగం శాతం. 2018 నాటికి దేశం మొత్తానికి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా గట్టిగా చెబుతోంది. వ్యాప్తి చెందుతున్న ఇంటర్నెట్ యాక్సస్తో, దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఈ విప్లవానికి క్యూబా ప్రజలు కూడా సాయం చేస్తారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్ చెప్పారు. 2013 వరకు క్యూబాలో ఇంటర్నెట్ కేవలం పర్యాటక హోటళ్లలోనే అందుబాటులో ఉంది. సైబర్ కేఫ్లు, పబ్లిక్ వై-ఫైలతో ఈ ఇంటర్నెట్ వ్యాప్తిని క్యూబా విస్తృతపరుస్తోంది. అయితే 5జీ టెక్నాలజీ వైపు ప్రపంచ దేశాలన్నీ దూసుకుపోతుంటే, 3జీ కనెక్టివిటీని అందించడానికే క్యూబా తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్కు అదనంగా మరో 224 ఆర్టికల్స్ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
ఇటాలో కాల్వీనో
ఇటాలియన్ తల్లిదండ్రులకు క్యూబాలో జన్మించాడు ఇటాలో కాల్వీనో(1923–1985). తమ దేశ మూలాలను మరిచిపోకూడదన్న పట్టింపుతో ఇటాలో అని నామకరణం చేసింది తల్లి. తన పేరు మరీ రణాభిముఖమైన జాతీయవాదపు పేరుగా వినబడుతుందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు ఇటాలో. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుడిగా పనిచేశాడు కూడా. పిల్లాడిగా ఉన్నప్పుడే ఇటాలో తల్లిదండ్రులు ఇటలీకి తిరిగొచ్చారు. తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులే. శాస్త్రవిజ్ఞానాలంటే ఎక్కువ ఆదరముండే ఇంట్లో, సాహిత్యాన్ని ప్రేమించడం ఇటాలోను అధముడిగా పరిగణించేలా చేసింది. చాలా సందేహాల మధ్య సాహిత్యం వైపు మరలాడు. రీజన్కు ప్రాధాన్యత ఇచ్చే రచయిత. రాసిందానికంటే కొట్టేసేది ఎక్కువ, అంటాడు. ‘అవర్ ఆన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘ఇన్విజిబుల్ సిటీస్’, ‘ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్’ నవలలు ఆయన రచనల్లో పేరెన్నికగన్నవి. ‘కాస్మియోకామిక్స్’, ‘ద క్రో కమ్స్ లాస్ట్’, ‘నంబర్స్ ఇన్ ద డార్క్’, ‘ఆడమ్, వన్ ఆఫ్టర్నూన్’ లాంటివి కథాసంకలనాలు. పాత్రికేయుడిగా పనిచేశాడు. కొంతకాలం కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. 1956లో హంగెరీ మీద సోవియట్ రష్యా దండెత్తడంతో పార్టీ మీద భ్రమలు తొలగి రాజీనామా చేశాడు. చనిపోయేనాటికి అతి ఎక్కువగా అనువాదమైన ఇటాలియన్ రచయిత కాల్వీనో. -
ఘోరం: విమానం కూలి 100 మంది దుర్మరణం
హవానా : క్యూబా రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కూలి దాదాపు 100 మరణించారు. జోస్ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్ తీసుకున్న బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందులో 100 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్కేనెల్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గురైన బోయింగ్ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్ ఎయిర్లైన్స్ అద్దెకు తీసుకుని నడుపుతుంది. -
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్–కేనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు. -
క్యూబాలో క్యాస్ట్రో శకానికి తెర
-
క్యూబా అధ్యక్షుడిగా డియాజ్ కానెల్
హవానా: క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ అగ్రనేత మిగ్వెల్ డియాజ్ కానెల్(58) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. కానెల్ 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బుధవారం ఆయన్ని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫిడేల్ అనారోగ్యానికి గురికావడంతో 2006లో రౌల్ అధికారం చేపట్టారు. అయితే క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా కొనసాగనున్న రౌల్ పర్యవేక్షణలోనే కానెల్ పాలించే వీలుంది. చిన్నచిన్న ప్రైవేట్ సంస్థలను దేశంలోకి ఆహ్వానించడం, చిరకాల ప్రత్యర్థి అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం ఆయన ముందున్న సవాళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత కానెల్ కొంతకాలం ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. మితవాద భావాలతో ప్రశాంతంగా కనిపించే కానెల్..క్యూబా రెబెల్స్, అమెరికాపై మాత్రం తీవ్ర స్వరంతో స్పందించేవారు. -
60 ఏళ్ల క్యాస్ట్రోల శకానికి తెర
సాక్షి, న్యూఢిల్లీ : కమ్యూనిస్టు పాలనలో ఉన్న లాటిన్ అమెరికా దేశం క్యూబాలో క్యాస్ట్రోల ఆరు దశాబ్దాల పాలనకు గురువారం తెరపడింది. ఫిడెల్ క్యాస్ట్రో అనంతరం 12 సంవత్సరాల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో తన పదవికి స్వస్తి చెప్పారు. దేశ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు కనుక ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు కొనసాగుతుంది. రెండు పర్యాయాలు నిరాటంకంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రౌల్ క్యాస్ట్రో (86) ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. ఆగర్భ శత్రువైన అమెరికాతో సంబంధాలు నెలకొల్పారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొట్టమొదటిసారిగా క్యూబాను సందర్శించడంతో ఇరు దేశాల మధ్య సాధారణ పౌర సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా కొనసాగడం లేదు. ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వాన 1959లో క్యూబాలో విప్లవం విజయవంతం అవడం, ఆ తర్వాత క్యాస్ట్రో ప్రధాన మంత్రిగా దేశ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. 1976 వరకు అదే పదవిలో కొనసాగిన ఆయన 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలపాటు పదవిలో కొనసాగిన ఫిడెల్ క్యాస్ట్రో.. అనారోగ్య కారణాల వల్ల 2006లో దేశాధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు అప్పగించారు. అన్నతోపాటు రౌల్ క్యాస్ట్రో క్యూబా విప్లవంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దాదాపు 60 ఏళ్లు ఇద్దరు క్యాస్ట్రోలే దేశాన్ని పాలించారు. రౌల్ క్యాస్ట్రో స్థానంలో క్యూబా కమ్యూనిస్టు పార్టీ స్టేట్ కౌన్సిల్ పార్టీ విధేయుడైన మిగుల్ డియాజ్ కెనాల్ బెర్ముడెజ్ (58)ను ఎన్నుకొంది. గురువారం నాడు దేశాధ్యక్షుడిగా రౌల్ క్యాస్ట్రో దిగిపోవాలనే, ఇదే రోజున దేశాధ్యక్షుడిగా మిగుల్ డియాజ్ బాధ్యతలు స్వీకరించాలని ముందుగా నిర్ణయించారు. ఇందుకు ఓ కారణం ఉంది. 1961లో అప్పటి ప్రధాన మంత్రి ఫిడెల్ క్యాస్ట్రోను దించేందుకు అమెరికా మద్దతుతో 1400 మంది తిరుగుబాటుదారులు కుట్ర చేశారు. ‘బే ఆఫ్ పిగ్ ఇన్వేషన్’గా పేర్కొన్న ఆ కుట్ర విఫలమైన వార్షికోత్సవ రోజు గురువారం. అంతేకాకుండా డియాజ్ కెనాల్ ఈ రోజునే 58వ ఏట అడుగుపెట్టారు. క్యూబాలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకొని ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో రౌల్ క్యాస్ట్రో దిగిపోయారు. కొత్త తరానికి నాయకత్వం అప్పగించారు. డియాజ్ కెనాల్ చాలాకాలంగా దేశ ఉపాధ్యక్షుడిగా ఉంటూ రౌల్ క్యాస్ట్రోకు అండగా ఉన్నారు. ఆయన అమెరికా నటుడు రిచర్డ్ గేర్లా ఉన్నారంటారు. ఆయన ‘ది బీటిల్స్’ రాక్ బ్యాండ్కు వీరాభిమాని. -
ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడి ఆత్మహత్య
హవానా: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కొడుకు డియాజ్ బలార్ట్(68) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ‘ గత కొన్ని నెలలుగా డియాజ్ తీవ్రమైన డిప్రెషన్కు చికిత్సపొందుతున్నారు’ అని క్యూబా అధికార పత్రిక గ్రాన్మా తెలిపింది. క్యాస్ట్రో మొదటి భార్య మిర్తా డియాజ్ బలార్ట్కు 1949 సెప్టెంబర్ 1న డియాజ్ జన్మించారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తన తండ్రి కాస్ట్రో పోలికలతో ఉండటంతో అక్కడి వారికి ఈయన ఫిడెల్ జూనియర్గా చాలా ఫేమస్. ఫిజిక్స్లో శాస్త్రవేత్త అయిన డియాజ్ క్యూబాలో అణుశక్తి కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. చనిపోయే దాకా ఆయన క్యూబా ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా, అకాడమీ ఆఫ్ సైన్సెస్కు వైస్ప్రెసిడెంట్గా పనిచేశారు. -
ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఆత్మహత్య
-
ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఆత్మహత్య
హవానా: దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ (68) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. 'డియాజ్ గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయినా తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు' అని ప్రభుత్వ అధికార వెబ్సైట్ క్యూబాడిబేట్ పేర్కొంది. ఫిడెల్ క్యాస్ట్రో మొదటి భార్య మిర్టా డియాజ్ బాలార్ట్ కుమారుడు డియాజ్ బలార్ట్.. ఈయనను స్థానికంగా జూనియర్ క్యాస్ట్రో, ఫిడెలిటో గా పిలుస్తారు. అప్పటి సోవియట్ యూనియన్లో అణు భౌతిక శాస్త్రవేత్తగా పనిచేశారు. అదే విధంగా క్యూబా ప్రభుత్వానికి శాస్త్ర సలహాదారుగా.. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్స్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. కాగా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో ఆరోగ్య సమస్యల కారణంగా 90 ఏళ్ల వయసులో 2016 , నవంబర్ 26 న మృతి చెందిన విషయం తెలిసిందే. (తండ్రి క్యాస్ట్రోతో డియాజ్ బలార్ట్ చిన్ననాటి ఫొటో) -
నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు!
ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మను ఎన్నో సినిమాల్లో చూశాం. చాలామంది టీషర్టులపై చూశాం. కానీ... సినిమాలు చూసినవాళ్లలో, ఈ బొమ్మతో ఉన్న టీషర్టులు వేసుకున్నవారిలో ఎంతమందికి ఇతని గురించి తెలుసు?.. చే గువేరా ఏ దేశానికి చెందిన విప్లవ యోధుడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చే.. ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. యావత్ ప్రపంచానికి కొత్త శక్తినిచ్చిన నేత. ప్రపంచంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించాలని యువతకు దిశానిర్దేశం చేసి, ఆచరించి చూపించిన మార్గదర్శి. ఊహించని శక్తిగా... 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించిన చే గువేరా బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తారని ఎవరైనా ఊహించగలరా? అవును. ఈ పసివాడే నియంతల గుండెల్లో నిద్రపోయాడు. వాళ్లకు నిద్ర లేకుండానూ చేశాడు. జీవితాన్ని మార్చిన ప్రయాణం.. వైద్యవిద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. సమాజానికి వైద్యం.. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చే గువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి... బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్గించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంతపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. చే గువేరా వర్ధంతికి హాజరైన ఆయన అభిమానులు, మద్ధతుదారులు ఘనంగా వర్ధంతి.. చే గువేరా 50వ వర్ధంతిని పురస్కరించుకొని హవానాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది క్యూబన్లు పాల్గొన్నారు. దేశాధినేత రౌల్ క్యాస్ట్రో స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై చె గొవేరాకు నివాళులర్పించారు. -
ఇర్మా: మియామికి ముప్పు తప్పినట్లేనా..!
మియామి: హరికేన్ ఇర్మా శనివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరేబియన్ దీవులకు 85 మైళ్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇర్మా తన దిశను మార్చుకున్నట్లుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఇర్మా తుపారు మియామిని నేరుగా తాకే అవకాశం ఉండదని.. దాంతో ముప్పు చాలా వరకు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అత్యంత వేగంతో భారీ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇర్మా హరికేన్ క్యూబా ఉత్తర తీరంవైపు ప్రయాణిస్తోందని, ఫ్లోరిడాకు ఆగ్నేయతీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. హరికేన్ ఇర్మా ఒకవేళ క్యూబా తీరాన్ని తాకితే.. టర్క్స్, కొకైస్, బహమాస్ ఆగ్నేయ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యూబా తీరంలో గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
క్యూబాతో మైత్రికి ట్రంప్ తెర
► ఒబామా హయాం నాటి ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్ ► క్యాస్ట్రో మిలిటరీకి అమెరికా నిధులు బంద్ వాషింగ్టన్/మయామి: అమెరికా, క్యూబా సంబంధాల పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. బరాక్ ఒబామా హయాంలో క్యూబాతో కుదిరిన మైత్రి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని క్యూబా విమర్శించింది. ఈ విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా 2014 డిసెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని, రౌల్ క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించమని ట్రంప్ మయామిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి బదులుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అమెరికా చట్టాలకు లోబడే కొత్త విధానంతో క్యూబా, అమెరికా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. క్యూబా ప్రజలకే పెట్టుబడులు నేరుగా చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని, దాని వల్ల వారు సొంత వ్యాపారాలు ప్రారంభించి తమ దేశానికి గొప్ప భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. క్యూబా ప్రభుత్వంపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు, హైజాకర్లకు, పోలీసులను హత్యచేసిన వారికి ఆశ్రయం కల్పించిందని ఆరోపించారు. -
అమెరికాను వ్యతిరేకించి క్యూబా నిలబడింది: చాడ
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాలను వ్యతిరేకించి క్యూబా నిలబడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆంక్షలు, ఇతర రూపాల్లో అవాంతరాలు కల్పించినా తట్టుకొని రౌల్ క్యాస్ట్రో నాయక త్వంలో ముందుకు సాగుతోందన్నారు. సామ్యవాద విధానాలను కొనసాగిస్తూ, ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలో శనివారం ప్రారంభమైన క్యూబా సంఘీభావ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ 8వ మహాసభలో చాడ పాల్గొన్నారు. క్యూబాకు సంఘీభావంగా సభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. -
విప్లవ శిఖరానికి నేటికీ ఘన నివాళులు
హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో సమాధిని సందర్శించి మహానేతకు నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. గత ఏడాది నవంబర్ 25న క్యాస్ట్రో(90) కన్నుమూయగా, సంతాప సభలు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4వ తేదీన శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సరిగ్గా నెలరోజుల్లో రోజుకు రెండువేలకు పైగా అభిమానులు ఆయన సమాధిని దర్శించేందుకు తరలివస్తున్నారని క్యూబా అధికారులు తెలిపారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో 70 వేల మందికి పైగా ఆయన మృతికి నివాళులు అర్పించినట్లు యుదిస్ గార్సికా అనే అధికారి వెల్లడించారు. విప్లవ శిఖరం క్యాస్ట్రో స్వదేశమైన క్యూబా ప్రజలతో పాటుగా విదేశీ పర్యాటకులు ముఖ్యంగా జపాన్, ఇటలీ, మెక్సికో, గ్వాటిమలా దేశాల నుంచి అభిమానులు క్యాస్ట్రో సమాదిని దర్శించుకునేందుకు తరలిరావడం గమనార్హం. క్యాస్ట్రో సమాధిని దర్శించుకునే వరకూ తాను గెడ్డం గీసుకోనని ఓ సౌదీ యువరాజు ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా యుదిస్ గార్సికా ప్రస్తావించారు. తమ నాయకుడు కన్నుమూశాడని కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు నేతలు, అభిమానులు భావిస్తున్నారు. (ఇక్కడ చదవండి: శోకసంద్రంలో క్యూబా) ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హొల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆయన చేగువేరాతోపాటు వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు విప్లవ పోరాటం సాగించి 1959లో క్యూబాను విప్లవవీరుడు క్యాస్ట్రో హస్త్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాలపాటు మకుటంలేని మహరాజుగా క్యూబాను పాలించారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. బలమైన ప్రత్యర్థి దేశాలకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాడు క్యాస్టో. ఆయన చనిపోయినా.. ఆయనపై అభిమానం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందని వారు నిరూపిస్తున్నారు. -
బాకీ తీర్చేందుకు బంపర్ ఆఫర్!
వందేళ్లు మద్యం సరఫరా! ఈ వార్త తెలిశాక చెక్ రిపబ్లిక్ దేశంలోని మందుబాబులు పండుగ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ దేశ మందుబాబులను మస్త్ ఖుషీ చేసే కబురు క్యూబా చెప్పింది. చెక్ రిపబ్లిక్కు క్యూబా దాదాపు రూ. 187 కోట్లు అప్పు పడింది. ఆ బాకీ తీర్చడానికి క్యూబా ఇటీవల ఓ వినూత్నమైన ఆఫర్ను చేసింది. దేశీయ రమ్ముకు క్యూబా పెట్టింది పేరు. కాబట్టి అప్పు కింద వందేళ్లు మీ దేశ పౌరులందరికీ సరిపడే రమ్మును సరఫరా చేస్తామని ప్రతిపాదించింది. చెక్ రిపబ్లిక్కు ఇవ్వాల్సిన 276 మిలియన్ డాలర్ల అప్పును తీర్చేందుకు తమ దగ్గర ప్రస్తుతం డబ్బులేదని, కానీ, రమ్ము కావాల్సినంత అందుబాటులో ఉందని క్యూబా రాజధాని హవానాలో ఇటీవల ఆ దేశ ఆర్థికశాఖ ప్రకటించిందని బీబీసీ తెలిపింది. చెక్ రిపబ్లిక్ ఆర్థిక శాఖ కూడా క్యూబా ప్రతిపాదనను ధ్రువీకరించింది. అయితే, మొత్తం రమ్ము రూపంలో కాకుండా కొంతైనా నగదు రూపంలో చెల్లించాలని తాము కోరుతున్నట్టు ఆ దేశం తెలిపింది. ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి అప్పు ఇది. అప్పట్లో మధ్య, తూర్పు యూర్లో విస్తరించిన కమ్యూనిస్ట్ కూడలి చెకోస్లోవోకియాలో క్యూబా కూడా భాగంగా ఉండేది. ఆ తర్వాత క్యూబా వేరుపడగా.. చెకోస్లోవోకియా కాస్తా చెక్రిపబ్లిక్గా అవతరించింది. ఈ అప్పు తీర్చడానికి అవసరమైతే తమ దేశంలో తయారయ్యే ఔషధాలు కూడా సరఫరాచేస్తామని కూడా క్యూబా ప్రతిపాదించినప్పటికీ, యూరప్ ప్రమాణాలకు తగ్గట్టుగా అవి ఉండవని చెక్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. -
క్యూబాకు అమెరికా విమాన రాకపోకలు
హవానా: క్యూబా అమెరికా దేశాల మధ్య నిలిచిపోయిన విమాన రాకపోకలు క్యూబా విప్లవ యోధుడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణానంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. మంగళవారం తొలి వాణిజ్య విమానం అమెరికా నుంచి బయలుదేరి క్యూబా రాజధాని హవానాలో దిగింది. దీంతో 50 ఏళ్ల అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా విమానం క్యూబాలో అడుగిడినట్లైంది. క్యాస్ట్రో మరణంతో ఆ దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభలకు హాజరయ్యే ప్రయాణికుల దృష్ట్యా అమెరికా నుంచి క్యూబాకు విమాన రాకపోకల్ని పునరుద్ధరించాలని అమెరికన్ ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. ఈ తాజా నిర్ణయం పట్ల క్యూబా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభమైన సందర్భంగా హవానాలోని జోస్మార్టి అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే పొడవునా విమానంపై ఫైర్ట్రక్కులనుంచి నీటిని వెదజల్లుతూ క్యూబా ప్రజలు స్వాగతం పలికారు. ‘ఈ హవానా దీవిని సందర్శించడం నాకిది మూడోసారి. ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం కావడం పట్ల నేనెంతో ఉద్వేగానికి గురయ్యా’నని మియామీలో జన్మించిన క్యూబన్ అమెరికన్ జొనాథన్ గొంజాలెజ్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం క్యూబా అధ్యక్షుడు రావుల్ క్యాస్ట్రో, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ సందర్భంగా ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకల పునరుద్ధరణకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. -
శోకసంద్రంలో క్యూబా
ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో అంతటా విషాదం హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం దేశమంతటా ప్రజల విషాద వదనాలతో నిశ్శబ్దం అలముకుంది. ఎక్కడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలనూ నిర్వహించలేదు. 50 ఏళ్లు పాలన సాగించిన క్యాస్ట్రో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా తుది వీడ్కోలు పలికెందుకు దేశం సిద్ధమవుతోంది. సంతాప సభలు, 4 రోజుల పాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబరు 4న శాంటియాగోలో అంత్యక్రియలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. క్యాస్ట్రో 1953లో శాంటియాగో నుంచే విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి క్యాస్ట్రో(90) అనారోగ్యంతో తుది శ్వాస విడవడం తెలిసిందే. హవానాలోని చారిత్రక రివల్యూషన్ స్క్వేర్లో సంతాప సభలు సోమవారం మొదలవుతాయి. నా జీవితం కంటే ఎక్కువ... క్యాస్ట్రో మరణంతో క్యూబన్ల గుండెలు పగిలారుు. ‘ఏం చెప్పగలను? క్యాస్ట్రో నా జీవితం కంటే ఎక్కువ’ అని కన్నీటి పర్యంతమయ్యారు 82 ఏళ్ల ఆరోరా మెండెజ్. పేదల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ప్రస్తుత క్యూబా జనాభాలో చాలామంది పుట్టక ముందే క్యాస్ట్రో పోరాటం, ధీరత్వం... స్కూలు పుస్తకాలు, పత్రికలన్నింటా నిండిపోయారుు. మార్గదర్శకుడిగా నిలిచి, సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన యోధుడు లేకుండా వారు తమ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. కొందరు మాత్రం... ఫిడెల్ మరణంతో ఆయన తమ్ముడు, అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుం దని భావిస్తున్నారు. అంత్యక్రియలకు క్యాస్ట్రో సోదరి దూరం మయామి: ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలకు ఆయన సోదరి జువానిత హాజరుకాబోవడం లేదని అమెరికా మీడియా పేర్కొంది. ‘ఫిడెల్ అంత్యక్రియలకు వెళుతున్నానన్న ఊహాగా నాల్లో నిజం లేదు. తిరిగి క్యూబాకు వెళ్లే ప్రసక్తే లేదు’ అని దశాబ్దాలుగా అమెరికాలోని మియామీలో ఉంటున్న జువానిత చెప్పారని వెల్లడించింది. ఫిడెల్ కమ్యూనిస్టు ప్రభుత్వా న్ని జువానిత బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. క్యాస్ట్రోను తొలగించేం దుకు సీఐఏకు సహకరించారని ఆమెపై ఆరోపణలున్నారుు. -
ధిక్కారానికి ప్రతీక..ఉడుకు రక్తానికి ఉత్తేజం
కాలపరీక్షకు నిలిచి గెలిచిన శిఖరం కాలంతోపాటే మార్పులు సహజం. ఇరవయ్యో శతాబ్దంలోనే ఉచ్ఛస్థితికి చేరిన కమ్యూనిజం ప్రపంచవ్యాప్తమై... అదే శతాబ్దంలో ప్రభావం కోల్పోయే దశకు చేరింది. కమ్యూనిస్టుల కంచుకోటలు కూలిపోయారుు. సోవియట్ ముక్కలైంది. చైనా సైతం కమ్యూనిస్టు పంథా నుంచి ఓపెన్ మార్కెట్ వైపు మళ్లింది. రెండు కమ్యూనిస్టు ప్రబల శక్తులు ప్రపంచీకరణ ప్రభంజనంలో మనుగడ సాగించడానికి తమ సిద్ధాంతాలను వదులుకొన్నా... పెట్టుబడిదారుల పెద్దన్న, అగ్రరాజ్యం అమెరికాకు పక్క నుంచే సవాలు విసురుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం కమ్యూనిజాన్ని శ్వాసించిన ధీశాలి! గుబురు గడ్డం, ఆలివ్గ్రీన్ మిలటరీ దుస్తులు, నోట్లో సిగార్... ఆ రూపం ధిక్కారానికి ప్రతీక! తిరగబడే ఉడుకురక్తానికి ఒక ఉత్తేజం!! అంతా తానే అనుకునే అమెరికా గుండెల్లో దశాబ్దాలుగా మోగుతున్న ‘ఫిరంగి’. ఆయనే ఫిడెల్ క్యాస్ట్రో. పాశ్చాత్యదేశాల్లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పి.. కాల పరీక్షకు నిలబడి గెలిచాడు. - సాక్షి నాలెడ్జ సెంటర్ మిత్రులతో కలిసి మిలటరీ స్థావరంపై దాడి 1952 మార్చి 10న దేశాధ్యక్షుడు కార్లోస్ ప్రియో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిగింది. ఫుల్జెన్షియో బటిస్టా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అమెరికాకు సన్నిహితంగా ఉంటూ సోషలిస్టు సంస్థ, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టాడు. సాయుధ తిరుగుబాటు ద్వారానే మిలటరీ పాలకులను దించగలమని భావించిన ఫిడేల్.. ఒరియెంటే ఫ్రావిన్సలోని మోంకాడా మిలటరీ స్థావరంపై అనుచరులతో కలిసి దాడి చేశాడు. మిలటరీ సాయుధ సంపత్తిని కొల్లగొట్టి ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆయుధాలను సమకూర్చుకోవాలనేది ఆయన ఆలోచన. అరుుతే ఈ ప్రయత్నంలో అతని బృందం విఫలమైంది. ఫిడేల్ ప్రభుత్వ బలగాలకు పట్టుబడ్డాడు. 15 ఏళ్ల శిక్ష..19 నెలలకే విడుదల ప్రభుత్వ బలగాలకు పట్టుబడిన క్యాస్ట్రోను విచారించారు. 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అరుుతే విచారణ సందర్భంగా సైన్యం అరాచకాలను ఎలుగెత్తి చాటడం, దానికి విదేశీ మీడియా మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో ఫిడేల్ ప్రాచుర్యంలోకి వచ్చాడు. 19 నెలల జైలు జీవితం తర్వాత 1955లో ప్రభుత్వ క్షమాభిక్ష ద్వారా విడుదలయ్యాడు. జైల్లో ఉన్నకాలంలోనే భార్య బలార్ట్కు విడాకులిచ్చాడు. మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. విడుదలయ్యాక మెక్సికో వెళ్లాడు. అక్కడే యువ పోరాటయోధుడు ఎర్నెస్టో చేగువెరాను కలిశాడు. బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో జూలై ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. 1956 డిసెంబరు 2న 82 మందితో చిన్న నౌకలో బయలుదేరి క్యూబాలోని ఒరియెంటే ఫ్రావిన్సకు చేరుకున్నాడు. బటిస్టా సైన్యంతో జరిగిన పోరాటంలో ఫిడేల్ క్యాస్ట్రో, చేగువెరా, రౌల్ క్యాస్ట్రోలతోపాటు మరో 9 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మిగతా వారు దొరికిపోవడమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరిగింది. తోటి విప్లవకారులతో కలిసి సైన్యం కంటపడకుండా ఫిడేల్... సియర్రా మాయెస్ట్రా పర్వతశ్రేణిలో ఆశ్రయం పొందాడు. అక్కడి నుంచే రెండేళ్లపాటు బటిస్టా ప్రభుత్వంపై గెరిల్లా దాడులు కొనసాగించాడు. ఈ క్రమంలో బటిస్టాను వ్యతిరేకించే శక్తులు, సంస్థలకు ఫిడేల్ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన జీవితం ఓ దర్పణం క్యాస్ట్రో జీవితం...20వ శతాబ్దంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాలకు దర్పణం. విప్లవోద్యమాలు, ప్రజా తిరుగుబాట్లు, ప్రచ్చన్న యుద్ధం, పాశ్చాత్య-తూర్పు దేశాల మధ్య అంతరాలు, ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికా మధ్య వైరం, కమ్యూనిజం- పెట్టుబడిదారీ విధానం మధ్య ఘర్షణ... ఇలా ఎన్నో పరిణామక్రమాలు. వీటన్నింటినీ చూశాడాయన. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లు.. కుట్రలు కుతంత్రాలు.. కానీ క్యాస్ట్రోలో మార్పులేదు. నేటికీ ఆయన తిరుగుబాటు ప్రతీక. కమ్యూనిజం పతనమైనా.. తట్టుకొని నిలబడ్డ కమ్యూనిస్టు. వలసొచ్చిన స్పానిష్ రైతు బిడ్డ స్పెరుున్ నుంచి వలస వచ్చిన ధనిక రైతు ఏంజెల్ మరియా బౌటిస్టా క్యాస్ట్రో క్యూబాలోని ఓరియెంటే ఫ్రావిన్సులోని బిరాన్ సమీప ప్రాంతంలో స్థిరపడ్డాడు. లీనా రుజ్ గొంజాలెజ్ ఇతని తోటల్లో పనిచేసేది. ఈమెకు ఏంజెల్ మరియాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1926 ఆగస్టు 13న ఫిడేల్ అలెజాండ్రో క్యాస్ట్రో రుజ్ (ఫిడేల్ క్యాస్ట్రో) జన్మించాడు. ఫిడేల్ పుట్టాక అతని తల్లిదండ్రులు పెళ్లిచేసుకున్నారు. క్యాస్ట్రో చదువుల్లో చురుకుగా ఉండేవాడు.. మంచి అథ్లెట్ కూడా. బేస్బాల్పై అమితాసక్తి. 1945లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి హవానా యూనివర్సిటీలో చేరాడు. అక్కడే యువ క్యాస్ట్రోకు పలు రకాల భావాజాలాలతో, సిద్ధాంతాలతో పరిచయం ఏర్పిడింది. కమ్యూనిజంపై వర్సిటీ ప్రాంగణంలో విసృ్తత చర్చలు జరిగేవి. లా చదువును మధ్యలోనే వదిలేసి 1948లో కొలంబియాలో అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్నాడు. కొలంబియా అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో క్యూబా విద్యార్థులు కొలంబియాలోని తమ దేశ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అనంతరం క్యాస్ట్రో హవానాకు తిరిగి వచ్చి ‘లా’ కోర్సును కొనసాగించాడు. ఆర్టాడోక్సో పార్టీకి చెందిన జనాకర్షక నేత ఎడ్యురాడో చిబాస్కు అభిమానిగా మారాడు. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన చిబాస్ పార్టీ ప్రధాన ఆశయాలుగా ఉండేవి. న్యాయశాస్త్రం చదువుతుండగానే క్యాస్ట్రో ఫిలాసఫీ విద్యార్థిని మిర్టా డియాజ్ బలార్ట్ను పెళ్లాడాడు. ఈమె సంపన్న రాజకీయవేత్త కూతురు. ఉన్నతవర్గాలతో పరిచయం ఏర్పడినా... అటువైపు కాకుండా క్యాస్ట్రో కమ్యూనిజం వైపు మళ్లాడు. దేశ ఆర్థిక సమస్యలన్నింటికీ విశృంఖల పెట్టుబడిదారీ వ్యవస్థే కారణమని విశ్వసించేవాడు. లా కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీసు ప్రారంభించినా పెద్దగా నడవలేదు. క్యాస్ట్రోపై అప్పుల భారం ఉండేది. అరుునా ఏ దశలోనూ రాజకీయ కార్యకలాపాలను వదల్లేదు. హింసాత్మకంగా మారిన పలు నిరసన ప్రదర్శనల్లో క్యాస్ట్రో పాల్గొన్నాడు. తిరుగుబాటుతో అధికారం హస్తగతం 1959 జనవరి 2న క్యాస్ట్రో నేతృత్వంలో 9 వేల మందితో కూడిన తిరుగుబాటు దళాలు రాజధాని హవానాలోకి ప్రవేశించారుు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారుు. బటిస్టా పారిపోగా... వందల కొద్దీ అతని మద్దతుదారులకు మరణశిక్ష పడింది. క్యాస్ట్రో ప్రధానమంత్రి అయ్యారు. 1976లో రాజ్యాంగాన్ని మార్చి ఫిడేల్ అధ్యక్షుడయ్యారు. 1959 ఫిబ్రవరి 15న తన తమ్ముడు రౌల్ క్యాస్ట్రోను సైనికదళాల చీఫ్ కమాండర్గా నియమించాడు. అత్యంత జనాకర్షక నేతగా, అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే ఫిడేల్... ప్రజలకు భూమిని తిరిగి ఇచ్చేస్తానని, పేదల హక్కులు కాపాడతానని హామీ ఇచ్చాడు. బటిస్టా అనుచరులు చట్టవిరుద్ధంగా కూడబెట్టిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1960లో క్యూబాలోని అమెరికా వ్యాపారాలన్నింటినీ జాతీయం చేశాడు. ప్రతిచర్యగా 1961 జనవరి 3న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసన్హోవర్ క్యూబాపై ఆంక్షలు విధించారు. అమెరికాకు కొరకరాని కొయ్యలా.. 1961లో ప్రవాస క్యూబన్లతో తిరుగుబాటు సైన్యాన్ని ఏర్పరచి ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా ప్రయత్నించి విఫలమైంది. ఇక అప్పటినుంచి క్యాస్ట్రో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. బటిస్టాకు వ్యతిరేకంగా పనిచేసిన సాయుధ గ్రూపులు, సంస్థలన్నింటినీ క్యాస్ట్రో ఏకం చేశాడు. ఇవన్నీ కలిసి 1965లో ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా’ ఏర్పడింది. ఏకపార్టీ వ్యవస్థ నెలకొంది. మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా ఇతర దేశాలతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ అధ్యక్షుడు కృశ్చేవ్తో క్యాస్ట్రో బంధం బలపడింది. 1962లో రష్యా ... కూబ్యా గడ్డపై క్షిపణులను మొహరించడంతో 13 రోజుల పాటు ప్రపంచం అణుయుద్ధం భయంతో వణికిపోరుుంది. మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే ఆందోళన నెలకొంది. అరుుతే అమెరికాతో కుదిరిన రహస్య సయోధ్య కారణంగా రష్యా మిస్సైల్స్ను ఉపసంహరించడంతో ఉద్రిక్తలు తగ్గారుు. అరుుతే ప్రపంచ రాజకీయ చిత్రపటంపై కమ్యూనిస్టు యోధుడిగా క్యాస్ట్రో ప్రతిష్ట పెరిగింది. అలీనోద్యమంలో ముఖ్య పాత్ర చక్కెర పరిశ్రమలను జాతీయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో క్యూబన్లలో క్యాస్ట్రో ప్రతిష్ట ఇనుమడించింది. మరోవైపు సోవియట్తో సన్నిహితంగా ఉంటూనే అలీనోద్యమంలో క్యూబా ముఖ్యపాత్ర పోషించింది. లాటిన్ అమెరికా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తిరుగుబాట్లకు మద్దతు ఇవ్వకుండా 1964 తర్వాత రష్యా కొంతవరకు క్యూబాను కట్టడి చేసింది. అరుుతే క్యాస్ట్రో ఇతర ఖండాల్లో విప్లవోద్యమాలకు మద్దతును ఆపలేదు. 1966లో ఆసియా- ఆఫ్రికా, లాటిన్ అమెరికా సాలిడారిటీ ఆర్గనైజేషన్ను ప్రారంభించారు. బొలీవియాలో 1967లో చేగువెరా తిరుగుబాటు విఫలమైంది. చే హతమయ్యాడు. క్యాస్ట్రో తన పంథా వీడలేదు. అంగోలాలో మార్క్సిస్టు గెరిల్లాలకు మద్దతుగా 15 వేల మంది సైన్యాన్ని పంపాడు. 1977లో ఇథియోపియాకు సైనికులను పంపాడు. పలుదేశాలకు వైద్యులను పంపి సాయం చేశాడు. అండగా సోవియట్ అమెరికా ఆంక్షల నేపథ్యంలో సోవియట్ యూనియన్ 1960ల నుంచే క్యూబాకు దన్నుగా నిలిచింది. ఆర్థిక సహాయం చేయడమే కాకుండా... క్యూబా ఉత్పత్తి చేసిన చక్కెరలో (దేశానికి ఇదే ప్రధాన ఆదాయవనరు) సింహభాగాన్ని కొనుగోలు చేసింది. అమెరికా మిత్రదేశాల వ్యాపార ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న క్యూబాకు కావాల్సిన ఆహారపదార్థాలు, వస్తువులు అందజేసింది. దీంతో రగిలిపోయిన అమెరికా హత్యాయత్నాలకు తెగించింది. సోవియట్ పతనం తర్వాత.. గోర్బచేవ్ సమయానికి సోవియట్ పరిస్థితి తారుమారైంది. క్యూబా నుంచి చక్కెర కొనుగోలును నిలిపివేసింది. సోవియట్ పతనం తర్వాత క్యూబా ఆర్థిక పరిస్థితి దిగజారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయారుు. దీనికి అమెరికా ఆంక్షలే కారణమని క్యాస్ట్రో విమర్శించేవాడు. క్యాస్ట్రో పాలన ముగిస్తే తప్ప ఆంక్షల ఎత్తివేత ఉండదని అమెరికా స్పష్టం చేసింది. 2000 జూలైలో అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా క్యాస్ట్రో క్యూబా చరిత్రలోనే పెద్ద ర్యాలీ తీశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకులు లేకుండా చూసు కోవడంలో క్యాస్ట్రో నిర్దయగా వ్యవహరించారు. క్యూబా పర్యటనకు వెళ్లిన పోప్ జాన్పాల్-2 మానవ హక్కుల ఉల్లంఘటనపై క్యాస్ట్రో సమక్షంలోనే విమర్శలు సంధించారు. తర్వాత క్యూబా మనుగడ కోసం క్యాస్ట్రో కొన్ని రంగాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టారు. అమెరికా ‘పక్కలో బల్లెం’ ఆదిలోనే బెడిసికొట్టాయి.. క్యూబాలో అంతర్భాగమైన గాంటనామా బేను అమెరికాకు శాశ్వతంగా లీజుకు అద్దెకిచ్చాక.. దాదాపు 50 ఏళ్లపాటు అమెరికా ప్రభుత్వం, కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి, తిరుగుబాట్లు రాకుండా చూశారుు. 1946లో అరుుతే అమెరికా నేర సామ్రాజ్య నేతలు క్యూబా రాజధాని హవానాలో సమావేశాలు జరిపేవారు. 1959లో క్యూబా నియంత ఫల్జెన్సియో బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన క్యాో్ట్ర సర్కారును మొదట అమెరికా గుర్తించింది. క్యాస్ట్రో కమ్యూనిస్టు పోకడలు, 500 మందికి పైగా బటిస్టా మద్దతుదారులను విప్లవకారులు కాల్చి చంపడంతో అమెరికాకు అనుమానాలు ఎక్కువయ్యారుు. అప్పట్లోనే అధికార పీఠమెక్కిన క్యాస్ట్రో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన్ను కలవడానికి అగ్రరాజ్య నేత ఐసెన్హోవర్ నిరాకరించారు. చివరికి ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ను కలిసి క్యాస్ట్రో హవానాకు వెనుదిరిగివచ్చారు. అలా ఆదిలోనే మంచి సంబంధాలకు పునాదులు పడలేదు. అమెరికా ఆస్తుల జాతీయం! 1960లో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్యాస్ట్రో సర్కారు.. క్యూబాలోని ప్రైవేటు భూములను హస్తగతం చేసుకుంది. అమెరికా బడా కార్పొరేషన్ల అనుబంధ కంపెనీలు సహా వందలాది ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసింది. దాంతో 1961లో క్యూబాతో అమెరికా అన్ని దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. ఐసెన్హోవర్ తర్వాత అధ్యక్షుడైన జాన్ కెన్నడీ1962 ఫిబ్రవరిలో క్యూబాపై ఆంక్షలు విధించారు. బే ఆఫ్ పిగ్స్ లో దెబ్బపడింది! 1961 జనవరి 20న అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే జాన్ ఎఫ్ కెన్నడీ సీఐఏ తోడ్పాటుతో జరిపిన ‘బే ఆఫ్ పిగ్స’ దాడి ఘోరంగా విఫలమైంది. 1961 ఏప్రిల్ 17న ‘బ్రిగేడ్ 2506’ పేరుతో క్యూబా నుంచి గతంలో పారిపోరుు వచ్చిన సాయుధులతో ఓ పారామిలటరీ దళాన్ని సీఐఏ ఏర్పాటు చేసింది. ఆ దళాన్ని క్యూబాలోని బే ఆఫ్ పిగ్స ప్రాంతంలో దింపి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అరుుతే క్యూబా దళాలు మూడు రోజుల్లో ఈ కిరారుు సేనలను ఓడించాయి. తప్పిన అణుయుద్ధం సోవియట్ యూనియన్ క్యూబాలో క్షిపణుల మోహరింపు పరిణామాల తర్వాత 13 రోజులపాటు రెండు అగ్రరాజ్యాలు, క్యూబా ప్రజలేగాక యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠకు గురైంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య అణు యుద్ధం తప్పదని అందరూ భయపడ్డారు. క్యూబాలోకి మరిన్ని సోవియట్ క్షిపణులు ప్రవేశించకుండా అమెరికా యుద్ధనౌకలు క్యూబాను చుట్టుముట్టారుు. మోహరించిన క్షిపణులను కమ్యూనిస్ట్ రష్యాకు తిరిగి పంపేయాలని అమెరికా షరతు పెట్టింది. క్యూబా నుంచి క్షిపణులు తొలగిస్తే.. టర్కీ, ఇటలీ నుంచి అమెరికా క్షిపణులు తొలగిస్తామన్న కెన్నడీ ప్రతిపాదనను సోవియట్ నేత నికితా క్రుశ్చేవ్ అంగీకరించడంతో అణుయుద్ధ ప్రమాదం తప్పింది. చివరికి 2008లో అమెరికాలో రిపబ్లికన్ల పాలనకు తెరపడి ఒబామా అధ్యక్షుడవ్వడంతో అమెరికా, క్యూబాల మధ్య మామూలు సంబంధాలకు మార్గం సుగమమైంది. ఒబామా క్యూబా గడ్డపై అడుగుపెట్టారు. దీంతో రెండు దేశాల మధ్య దశాబ్దాల వైరానికి తెరపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మనం విన్న మాటలు.. అమెరికా పక్కలో బల్లెం క్యూబా. అమెరికా అట్లాంటిక్ తీర రాష్ట్రం ఫ్లోరిడాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉండడం ఇందుకు కారణం. 50 ఏళ్లపాటు ఈ కరీబియన్ ద్వీప దేశాన్ని పాలించిన ఫిడెల్ క్యాస్ట్రో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అమెరికా శత్రువుగా మారారు. అంటే 1961 ఆరంభంలో రెండు దేశాల మధ్య తెగిన దౌత్య సంబంధాలు 2015 జూలై 20 వరకూ మళ్లీ అతుక్కోలేదు. అరుుతే ఈ రెండు పరిణామాలూ క్యాో్ట్ర బతికుండగానే జరిగాయి. అనారోగ్యం.. సోదరుడికి పగ్గాలు 2006 జూలైలో క్యాస్ట్రో పేగులకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. అప్పుడే తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తాను అధ్యక్ష బాధ్యతలు చూడలేనని స్పష్టం చేయడంతో 2008లో రౌల్ పూర్తిస్థారుు అధ్యక్షుడయ్యారు. తదనంతరం ప్రజాజీవితం నుంచి పూర్తిగా తెరమరుగైన ఫిడేల్ క్యాస్ట్రో అనారోగ్యం పాలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారి సాధారణ ప్రజానీకానికి కనిపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జాతీయ అసెంబ్లీలోనూ మాట్లాడారు. తర్వాత అప్పుడప్పుడు మీడియాకు ఆయన వీడియోలు, ఫోటోలను క్యూబా ప్రభుత్వం విడుదల చేసింది. క్యాస్ట్రో పరిస్థితి విషమంగా ఉందని పలుమార్లు వదంతులు వ్యాపించారుు. చివరకు ఈ కమ్యూనిస్టు యోధుడు శుక్రవారం సాయంత్రం (భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం) తుదిశ్వాస విడిచారు. -
కోల్డ్క్రీమ్లో విషపు గుళికలు దాచి..
దాదాపు ఐదు దశాబ్దాలు (1959 నుంచి 2008 దాకా). ఫిడెల్ క్యాస్ట్రోపై ఎన్నెన్ని కుట్రలు చేసినా.. ఎంత గింజుకున్నా అమెరికా ఏమీ చేయలేకపోరుుంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ప్రపంచ గతి మారింది. 10 మంది అమెరికా అధ్యక్షులూ మారారు. కానీ క్యాస్ట్రో ఎదురు నిలిచాడు. అగ్రరాజ్యం కుట్రలకూ, కుతంత్రాలకు ఎదురునిలిచాడు. ఫిడెల్ క్యాస్ట్రో ప్రేయసి మారిటా లోరెంజ్. ఆమె గర్భం దాల్చినపుడు అమెరికాకు వెళ్లింది. అక్కడ సీఐఏ ఏజెంట్లు ఆమెను సంప్రదించి.. అమెరికా కోసం క్యాస్ట్రోను నిర్మూలించాల్సిందేనని ఆమెను ఒప్పించారు. కోల్డ్క్రీమ్లో విషపు గుళికలను దాచి పంపారు. వాటిని ఆమె రహస్యంగా క్యాస్ట్రో గదిలోకి తీసుకెళ్లి అతను తీసుకునే డ్రింక్లో కలపాలి. ఈ కుట్ర గురించి తెలిసిన క్యాస్ట్రో... లోరెంజ్ను చూసి ‘నన్ను చంపడానికి వచ్చావా?’ అంటూ గన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. గట్టిగా సిగార్ను పీల్చి వదిలి షూట్ చేయమన్నట్లుగా చూశాడు. అంతే ఆమె గన్లోంచి బుల్లెట్లను తీసేసి.. కన్నీళ్లతో క్యాస్ట్రోపై వాలిపోరుుంది. ‘ఫిడెల్కు తెలుసు నేనతన్ని కాల్చలేనని.. ఎందుకంటే నేనతన్ని ప్రేమించాను. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. అతనూ అంతే..’ అని లోరెంజ్ స్వయంగా ఈ ఘటనను తర్వాతి కాలంలో వెల్లడించింది. శంఖంలో బాంబు... క్యాస్ట్రోకు స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి డైవ్ చేసినపుడు సముద్ర గర్భంలో ఆకర్షణీయమైన శంఖం పెడితే... దాని దగ్గరకు వెళతాడని, పేలి చనిపోతాడని ప్లాన్ వేసింది సీఐఏ. తను తరచుగా స్కూబా డైవింగ్కు వెళ్లే ప్రదేశంలో దీన్ని ప్లాన్ చేసింది. అరుుతే అమలులో ఇబ్బందులతో దీన్ని ప్రయత్నించలేదు. అలాగే స్కూబా డైవింగ్ సూట్కు విషపూరిత రసాయనాలు పూసి ఓ మిత్రుడి ద్వారా దాన్ని ఫిడెల్ క్యాస్ట్రోకు అందించే ప్రయత్నం చేసింది. కానీ క్యూబా అధ్యక్షుడితో మంచి సాన్నిహిత్యమేర్పడిన ఆ లాయర్ విషపూరితమైన సూట్కు బదులు మామూలు సూట్ను అందజేశాడు. -
ఇందిర.. నా సోదరి!
అలీనోద్యమం జోరుగా నడుస్తున్న రోజులవి.. భారత రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా నిలిచింది. వందకు పైగా దేశాధినేతలు, పరిశీలకులు పాల్గొన్న ఈ సదస్సులో ఫిడెల్ క్యాస్ట్రో చర్య.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇరుకున పెట్టేసింది. అప్పటివరకూ అలీనోద్యమానికి చైర్మన్గా వ్యవహరించిన క్యాస్ట్రో... ఢిల్లీ సదస్సులో ఆ బాధ్యతలను ప్రధాని ఇందిరాగాంధీకి అప్పగించాలి. ‘‘నా సోదరికి ఈ బాధ్యతలు అప్పగించడం నాకు ఆనందం కలిగిస్తోంది’’ అని క్యాస్ట్రో ప్రకటించారు. వేదికపైనే ఉన్న ఇందిర అధికార దండం (న్యాయమూర్తుల వద్ద ఉండే కలప సుత్తి లాంటిది)ను అందుకునేందుకు దగ్గరకు వచ్చారు. చేయి చాచారు. కానీ క్యాస్ట్రో వైపు నుంచి అసలు కదలిక లేదు. చేతిలో దండం అలాగే ఉంది. రెండోసారి చేయి చాచినా.. స్పందన లేదు. క్యాస్ట్రో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కానీ దండం మాత్రం చేతులు దాటి రావడం లేదు. ఏం చేయాలబ్బా అని ఇందిర తటపటాయిస్తున్న సమయంలో క్యాస్ట్రో హఠాత్తుగా ముం దుకు కదిలారు. ఇందిరను రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో అధికార దండాన్ని ఆమె చేతుల్లో పెట్టాడు. ఈ పరిణామంతో ఇందిర ఒకింత షాక్కు గురైనా... ఆ వెంటనే తేరుకుని... చిరునవ్వులు చిందిస్తూ నిలబడిపోరుుంది. ఈలోపు... విజ్ఞాన్ భవన్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోరుుంది. అలిగిన అరాఫత్ 1983లో ఢిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సులో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా విమోచనోద్యమ నేత యాసర్ అరాఫత్ ఏదో ఒక విషయమైన అలక వహించారు. సదస్సు నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నట్వర్ సింగ్కు ఆ విషయం తెలిసింది. ఆతిథ్య దేశంగా భారత్కు చెడ్డపేరు వస్తుందని, వెంటనే ఆ విషయాన్ని ప్రధాని ఇందిరకు తెలియజేశారు. అరాఫత్ను సముదారుుంచాలని సూచించారు. వెంటనే ఇందిర రంగంలోకి దిగారు. క్యాస్ట్రోను వెంటబెట్టుకుని అరాఫత్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత సంభాషణ ఇలా సాగింది... క్యాస్ట్రో: మిత్రమా.. ఇందిర నీ స్నేహితురాలేనా? అరాఫత్: మిత్రమా... ఇందిరాగాంధీ నా పెద్దక్కతో సమానం. ఆమె కోసం ఏమైనా చేస్తా క్యాస్ట్రో: అరుుతే మంచి తమ్ముడి మాదిరిగా... సదస్సులో పాల్గొను అంతే... అరాఫత్ తన వాకౌట్ ఆలోచనలన్నింటినీ పక్కనబెట్టేశారు. సదస్సులో పాల్గొన్నారు. నెహ్రూ మెచ్చిన సాహసి.. 1960లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నెహ్రూ న్యూయార్క్ వెళ్లారు. ఆ సందర్భంలో క్యాస్ట్రోను స్వయంగా వెతుక్కుంటూ వెళ్లి మరీ కలిశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. ‘ప్రపంచంలోనే అత్యంత సాహసిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అప్పుడు క్యాస్ట్రో 34 ఏళ్ల కుర్రాడు!! -
అరుణతార అస్తమయం
నేలకొరిగిన కమ్యూనిస్టు శిఖరం ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత ముప్పై ఏళ్ల వయసులోనే విప్లవాగ్ని రగిల్చిన యోధుడు అగ్రరాజ్యం అమెరికాను ధిక్కరించి.. క్యూబాలో నియంత సర్కారును కూల్చి.. 1959లో దేశ పగ్గాలు చేపట్టిన సోషలిస్టు ఐదు దశాబ్దాలపాటు అప్రతిహత పాలన అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు అండగా నిలిచిన క్యాస్ట్రో క్యూబాలో 9 రోజుల సంతాప దినాలు.. 4వ తేదీన అంత్యక్రియలు ప్రపంచ దేశాధినేతల సంతాపం.. అమెరికాలో మాత్రం సంబరాలు హవానా: కమ్యూనిస్టు శిఖరం నేలకొరిగింది. విప్లవ యోధుడు అస్తమించాడు. అగ్రరాజ్యం అమెరికాను యాభై ఏళ్లపాటు వణికించిన ధీరుడు, క్యూబా ప్రజల ఆరాధ్యదైవం ఫిడెల్ క్యాస్ట్రో (90) తుదిశ్వాస విడిచారు. ఆయన తమ్ముడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో జాతీయ రేడియో ద్వారా ఫిడెల్ మరణవార్తను ప్రపంచానికి వెల్లడించారు. ‘క్యూబా విప్లవ కమాండర్ ఇన్ చీఫ్ ఇకలేరు’అంటూ గంభీర స్వరంతో ప్రకటించారు. క్యూబా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30కి ఫిడేల్ కన్నుమూసినట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి తొమ్మిది రోజులను సంతాప దినాలుగా క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. నాలుగురోజుల పాటు దేశమంతా క్యాస్ట్రో పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4న శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తమ అభిమాన నాయకుడి మరణవార్తతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోరుుంది. చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి రోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల నేతలు ఫిడెల్ మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు అమెరికాలో ఫిడెల్ మృతితో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. విప్లవకారుల హీరో: సామాన్య పౌరులపై పెట్టుబడిదారుల ఆధిపత్యానికి ఫిడెల్ క్యాస్ట్రో బద్ధ వ్యతిరేకి. ఆయన్ను వ్యతిరేకించే వారికి మాత్రం క్రూరమైన నిరంకుశుడు. 1959కి ముందు క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టాపై ఫిడెల్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. 32 ఏళ్ల వయసులోనే తన రెబల్ సైన్యంతో మిలటరీని చిత్తుచేసి విప్లవ నాయకుడిగా ఎదిగారు. ఐదు దశాబ్దాలపాటు 11 మంది అమెరికా అధ్యక్షులతో నేరుగా ఢీకొన్నారు. ఒకదశలో అణుయుద్ధం తప్పదనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఫిడెల్ను హత్య చేసేందుకు అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా ఏకంగా 638 సార్లు యత్నించి విఫలమైంది. 1961లో అమెరికా చేపట్టిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ (ప్రపంచ ప్రమాదరకమైన సర్జికల్ దాడుల్లో ఒకటి)ను తిప్పికొట్టిన అసామాన్య నేత క్యాస్ట్రో. ఎప్పుడూ నోట్లో సిగార్లతో కనిపించే క్యాస్ట్రో.. అనారోగ్యం బారిన పడిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు పొగతాగటం మానేశారు. 2008లో కడుపు, పెద్దపేగులకు సంబంధించిన సమస్యల కారణంగా సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు దేశాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రపంచమంతా పాశ్చాత్య ప్రజాస్వామ్యాన్ని అమలుచేస్తున్నా.. తోటి కమ్యూనిస్టు దేశాలైన చైనా, వియత్నాంలు పెట్టుబడిదారీ విధానాన్ని స్వాగతించినా.. ‘సోషలిజం లేదా మరణం’లో ఏదో ఒకటి తేల్చుకోవాలని బలంగా నమ్మి ఆచరణలో పెట్టారు క్యాస్ట్రో. సోషలిజమే ఊపిరిగా.. 1926 ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో జన్మించారు. అంతకుముందే వీరి కుటుంబం స్పెయిన్ నుంచి క్యూబాకు వలస వచ్చింది. హవానా యూనివర్సిటీలో చదివిన క్యాస్ట్రో.. 1953లో శాంటియాగోలోని మొన్కాడా మిలటరీ బ్యారక్లపై దాడితో తన రెబల్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం జైలుపాలయ్యారు. క్షమాభిక్షపై బయటకు వచ్చి మెక్సికో వెళ్లారు. 1959 జనవరి 8న బటిస్టా నియంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి విజయం సాధించారు. సోవియట్ యూనియన్ శిబిరంలోకి క్యూబా వెళ్లడాన్ని జీర్ణించుకోలేని అమెరికా.. క్యాస్ట్రోపై కక్ష గట్టింది. క్యూబాపై అనేక ఆంక్షలు పెట్టింది. 1956లో మొదటి భార్య మిర్తా దియాజ్తో క్యాస్ట్రో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే వీరికి ఓ కుమారుడున్నాడు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలు దాలియా సోటో డెల్ వాల్లేతో సహజీవనం చేశారు. వీరికి ఐదుగురు సంతానం. 1980లో వీరి వివాహం రహస్యంగా జరిగింది. పేదలకు ఆపన్న హస్తం క్యూబాలోని విప్లవ గ్రూపులను ఏకం చేసి క్యూబన్ కమ్యూనిస్టు పార్టీని ఫిడెల్ ప్రారంభించారు. తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో నియంతృత్వాలపై పోరాటానికి విప్లవాన్ని రగిలించారు. ఆఫ్రికాలో పాశ్చాత్య దేశాల ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి మద్దతుగా క్యూబన్ సైన్యాలను పంపించారు. అరుుతే సోవియట్ యూనియన్ పతనం క్యూబాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రచ్ఛన్నయుద్ధం ముగియడం, లాటిన్ అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాల తోడ్పాటుతో క్యూబా కోలుకుంది. 50 ఏళ్ల పాటు క్యూబాను అప్రతిహతంగా పాలించి.. ప్రపంచంలో ఎక్కువకాలం ఒక దేశాన్ని పాలించిన నేతగా నిలిచారు ఫిడెల్. అనారోగ్యం కారణంగా తమ్ముడు రౌల్కు 2008లో దేశ పగ్గాలు అప్పగించారు. ఆరోగ్యం విషమించటంతో చాలా కాలంగా బయటకు రాలేదు. చివరి సారిగా 2016లో బహిరంగంగా కనిపించారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో క్యూబన్ల జీవితాల గురించి 1960లో 269 నిమిషాలసేపు (ఇదే అత్యధిక సమయం) క్యాస్ట్రో చేసిన ప్రసంగం ఇప్పటికీ రికార్డే. విప్లవోద్యమాలకు స్ఫూర్తిప్రదాత అగ్రరాజ్యం అమెరికాకు సమీపం నుంచే ఎదు రొడ్డి నిలబడిన క్యాస్ట్రో లాటిన్ అమెరికా, మధ్య అమెరికా ఆఫ్రికా దేశాల్లోని విప్లవ, జాతీయ విముక్తి పోరాటాలకు ఎనలేని స్ఫూర్తినం దించారు. క్యాస్ట్రో తన అభిమాన యోధుడని దక్షిణా ఫ్రికా నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా కొనియాడారు. మధ్య అమెరికాలోని నికరగువా, గ్వాటమాల ప్రజాపోరాటాలకు క్యాస్ట్రో మద్దతునందించారు. ముఖ్యంగా గ్వాటమాల నేత డేనియల్ ఆర్టెగాకు కీలకమైన మద్దతు అందించారు. అలాగే మరో లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో హ్యూగో చావెజ్ నేతృత్వంలో వచ్చిన ప్రజాతంత్ర ప్రభుత్వం నిలబడడానికి క్యాస్ట్రో నుంచి అన్ని విధాలా నైతిక మద్దతు లభించింది. ఇంత సాయం అందించినందుకు బదులుగా క్యూబాకు కారుచౌకగా చావెజ్ ముడి చమురు సరఫరా చేశారు. అలాగే ఐరోపా వలస పాలన నుంచి విముక్తి కోసం ఆఫ్రికా దేశాల్లో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలకు కూడా క్యాో్ట్ర చేతనైనంత సాయం చేశారు. తన సుదీర్ఘ పాలనా కాలంలో పది మంది అమెరికా అధ్యక్షులను క్యాస్ట్రో చూడడమే కాదు వారి విధానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి, దాని కీలుబొమ్మ సర్కార్లకు వ్యతిరేకంగా జరిగిన అన్ని ప్రజాపోరాటాలకు అండగా నిలిచారు. సామ్రాజ్యవాదంపై సామ్యవాద గర్జన నువ్వు.. నియంతృత్వ రాజ్యంపై.. నిప్పులుగక్కిన పిడుగు నువ్వు.. ‘పెట్టుబడి’ పడగలపై.. పెకైగిసిన పిడికిలి నువ్వు.. అగ్రదేశం ఆదేశంపై.. అరుణోదయ అస్త్రం నువ్వు.. అన్నిటికీ మించి కాలగమనంపై ఎన్నటికీ కరగని కార్మికుల చెమట చుక్కవు నువ్వు ఎవరన్నారు కామ్రేడ్.. నువ్వు అస్తమించావని..?? వారికి తెలియదేమో...! రేపటి ఉదయాన లేలేత కిరణాలకు అరుణ వర్ణం అద్దుతూ మళ్లీ ఉదయిస్తావని...!!! -
క్యాస్ట్రో సిగార్ కథ
క్యాస్ట్రో పేరు చెబితే.. ఆరడుగుల నిండైన విగ్రహం. బవిరి గడ్డం.. నోట్లో పొగలుగక్కుతున్న సిగార్ గుర్తుకొస్తాయి. క్యూబా సిగార్లకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది కూడా ఈయనే. ఆ విషయాన్ని క్యాస్ట్రో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ‘‘అప్పట్లో కొహిబా (క్యాస్ట్రోకు ఇష్టమైన క్యూబన్ సిగార్)కు ఒక బ్రాండ్గా ఉండేది కాదు. నా బాడీగార్డ్ ఒకరు కాల్చే సిగార్ మంచి సువాసనతో ఉండేది. ఏ బ్రాండ్ తాగుతున్నావని అడిగా. ప్రత్యేకమైన బ్రాండ్ ఏదీ కాదని.. మిత్రుడు ఒకరు చుట్టి ఇస్తాడని బాడీగార్డ్ చెప్పాడు. ఆతడు ఎవరో వెంటనే పట్టుకోవాలని చెప్పా. నేనూ ఆ సిగార్ను కాల్చి చూశా. చాలా బాగుంది. ఆ మనిషిని వెతికిపట్టుకుని సిగార్ల తయారీ ఫ్యాక్టరీ పెట్టించాను. ఎలాంటి పొగాకు వాడాలో? ఎక్కడ్నుంచి పొగాకు సేకరించాలో అతడే చెప్పాడు. అలా కొంతమంది సిగార్ తయారీదార్లతో మొదలైంది కొహిబా’’ అంటారు క్యాస్ట్రో. 90 మీటర్ల సిగార్... క్యాస్ట్రో 90వ జన్మదినం సందర్భంగా క్యూబన్లు ఆయనకు ఒక అపురూపమైన బహుమతి ఇచ్చారు. క్యాస్ట్రో 1980లలోనే చుట్ట కాల్చడం మానేశానని ప్రకటించినప్పటికీ.. క్యూబాకు ఓ పేరు తెచ్చిపెట్టిన సిగార్లకు ఆద్యుడిగా ఆయన్ను గుర్తు పెట్టుకునేందుకు ఏకంగా 90 మీటర్ల పొడవైన చుట్ట తయారు చేశారు. హవానా ఓడరేవు పక్కనే ఉన్న కోటలో ప్రత్యేకమైన టేబుల్పై పదిరోజులపాటు రోజుకు పన్నెండు గంటలపాటు కష్టపడితేగానీ ఈ భారీసైజు చుట్ట తయారు కాలేదు. -
అస్తమించిన ‘అరుణతార’
సందర్భం ఒక శకం ముగిసింది. క్యూబా విప్లవ నిర్మాత, సోషలిస్టు విప్లవ దిగ్గజ నేతలలో చివరి శిఖరం ఫిడెల్ క్యాస్ట్రో కన్ను మూశారు. లాటిన్ అమెరికా దేశాలకే కాదు.. వెనుకబడిన దేశాల నేత లకు, ప్రజలకు స్ఫూర్తి కలిగించిన మహా మేరువు అస్తమించింది. అమెరికా వంటి ప్రపంచాధిపత్య శక్తితో ఢీ అంటే ఢీ అని తలపడి చివరి క్షణం వరకు ధిక్కరించిన ధీశాలి ఫిడెల్. అందుకే... ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా తొలి సారి పిడెల్ క్యాస్ట్రోను కలిసిన నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ‘ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారు గనుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను’ అని ప్రశంసిం చారు. ‘అమెరికాకు క్యూబా 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న విషయం మర్చిపోవద్ద’ని అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెన్నడీ హెచ్చ రికను తిప్పికొడుతూ ‘క్యూబాకు అమెరికా కూడా 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న వాస్తవాన్ని మర్చిపోవద్ద’ని ఫిడెల్ ప్రతి హెచ్చరిక చేసిన ప్పుడు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా క్యూబాను నిలిపిన దృఢ వ్యక్తిత్వం ఫిడె ల్ది. విద్యలో నూటికి నూరు శాతం అక్షరాస్యత గలిగిన అతి కొద్ది దేశాల్లో క్యూబా ఒకటి. కానీ ఆరోగ్యరంగంలో ఏ దేశం కూడా తన దరిదాపు ల్లోకి కూడా రానంత శిఖరస్థాయి ప్రమాణాలను నెలకొల్పిన ఘనత ఫిడెల్ సొంతం. గుంటూరు జిల్లా అంత విస్తీర్ణం లేని క్యూబా నేడు లాటిన్ అమెరికన్ దేశాలన్నింటికీ 17 వేల మంది వైద్యు లను అందించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికా నిత్య దిగ్బంధంలోనూ తనను ఆదుకున్న సోవియట్ యూనియన్ కుప్పగూలి పోయి, క్యూబాకు ఆయువులాంటి ఆయిల్ సర ఫరా నిలిచిపోయినప్పుడు క్యాస్ట్రో ఒకటే పిలుపు నిచ్చారు. ‘చమురు లేకపోతే మనం బతకొద్దా.. మళ్లీ వెనక్కు వెళ్లి గుర్రాల మీద ప్రయాణం చేద్దాం. గుర్రాలతో సేద్యం చేద్దాం’ అంటూ జాతి మొత్తానికి దిశానిర్దేశం చేసిన వాడు ఫిడెల్. సోష లిజం కోసం ఇంత హింసాకాండకు పాల్పడాలా? అని క్యూబన్ నేతలను ప్రశ్నిస్తే విప్లవం గెలిచిన గత అయిదేళ్లలో 50 లక్షల మంది పిల్లలను కాపా డుకోగలిగాం. ఇందుకోసం ఎలాంటి హింసకూ మేం పాల్పడలేదు అంటూ ఫిడెల్ జవాబిచ్చారు. గతంలో నేను క్యూబా సందర్శించాను. దేశంలో ఏ ప్రాంతంలో కూడా క్యాస్ట్రో ఫొటో కానీ, విగ్రహం కాని లేదు. క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ నేతలను ఈ విషయమై ప్రశ్నించాను. మను షులు తప్పులు చేస్తారు. చనిపోరుున వ్యక్తులను మాత్రమే అమరవీరులుగా మేం ఆరాధిస్తాం అని సమాధానమిచ్చారు. అలాగే క్యూబాలో 10 లేదా 12 ఏళ్ల వయసు పిల్లలను ‘మీకు సామ్రాజ్య వాది కనబడితే ఏం చేస్తారు?’ అని అడిగాను. ‘షూట్ హిమ్ డౌన్’ అని సమాధానమిచ్చారు వారు. క్యూబాకు సామ్రాజ్యవాదులు ఏం చేశారన్న ప్రశ్నకు తిరుగులేని జవాబది. మా పురోగమనంలో సోవియట్ యూని యన్ సాయం నిర్ణయాత్మకం అని పదే పదే ప్రక టించి కృతజ్ఞత తెలిపిన క్యూబా నాయకత్వం అదే సోవియట్ నాయకత్వం తప్పుధోరణుల్లోకి వెళ్లినప్పుడు తీవ్రంగా ఖండించింది. ప్రజలకు ప్రోత్సాహకాలు, బోనస్లు ఇచ్చి పనిచేయిం చడం సోషలిజమేనా? అని ఫిడెల్ ప్రశ్నించారు. ప్రపంచ మానవాళిపై ఇంత ప్రభావం కలి గించిన జననేత ఇటీవలి చరిత్రలో కనిపించరు. క్యూబన్లకు, లాటిన్ అమెరికన్ దేశాల ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజానీకానికి కూడా పోరాట స్ఫూర్తిని కలిగించిన విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో నేడు భౌతికంగా కనుమరుగయ్యారు. ఆశయాల పరంగా ఆయన పీడిత ప్రజల్లో చిరస్మరణీయుడై నిలిచి ఉంటారు. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు మొబైల్ : 98480 69720 -
638 సార్లు చంపాలనుకున్నారు..
హవానా: అమెరికా తనకు ఆగర్భ శత్రువైన క్యూబా మాజీ అధ్యక్షుడు, వీర విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోను చంపేందుకు చేయని ప్రయత్నం లేదు. 600 సార్లుకుపైగా ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్ర తెలియజేస్తోంది. జేమ్స్బాండ్ సినిమాల్లోలాగా సిగార్లలో విషం నింపడం ద్వారా, పెన్ను సిరాలోకి విషం ఎక్కించడం ద్వారా, అందమైన అమ్మాయిలతోని, మాజీ భార్యతోని విషపు గుళికలను తినిపించడం ద్వారా, సముద్ర నత్త గుళ్లల్లో శక్తివంతమైన చిన్న బాంబులను అమర్చడం ద్వారా, ప్రత్యేకమైన మాఫియా పద్ధతుల్లో క్యాస్ట్రోను చంపేందుకు అమెరికా సీఐఏ ప్రయత్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అయితే క్యాస్ట్రోను హతమార్చేందుకు ‘ఆపరేషన్ మంగూస్’ పేరిట పెద్ద వ్యూహమే రచించారు. అన్నీ హత్యా ప్రయత్నాల నుంచి జేమ్స్బాండ్కన్నా చాకచక్యంగా తప్పించుకున్న క్యాస్ట్రో ఓ సందర్భంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ప్రయత్నాల నుంచి తప్పించుకున్నవారి మధ్య ఒలింపిక్స్ పోటీ పెట్టినట్లయితే కచ్చితంగా తనకు బంగారు పతకం వచ్చేదని వ్యాఖ్యానించారు. తనపై అమెరికా నీడ కూడా పడకుండా చివరి వరకు కమ్యూనిస్టు యోధుడుగా పోరాడిన కాస్ట్రో సహజసిద్ధంగా తన 90వ ఏట కన్నుమూశారు. క్యాస్ట్రోను చంపేందుకు 638 సార్లు అమెరికా సీఐఏ కుట్ర పన్నిందని ఆయన వెన్నంటే ఉండి అనేకసార్లు ఆయన్ని ఈ హత్యాప్రయత్నాల నుంచి రక్షించిన రిటైర్డ్ క్యూబా ఇంటెలిజెన్స్ అధికారి ఫాబియన్ ఎస్కలాంటే తెలిపారు. క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్ ద్వారా విషపు గుళికలు ఇచ్చి చంపేందుకు సీఐఏ ప్రయత్నించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. తాను గర్భవతి అయ్యేవరకు క్యాస్ట్రోతో కలసివున్న లారెంజ్ ఓ రోజు హఠాత్తుగా జబ్బున పడ్డారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెను కలసుకున్న సీఐఏ అధికారులు, లారెంజ్కు ఆలస్యంగా ఆబార్షన్ చేయించి ప్రాణం మీదకు తీసుకురావాలని క్యాస్ట్రో కుట్రపన్నినట్లు ఆమెను నమ్మించారు. ప్రతిగా అమెరికా ప్రజల కోసం క్యాస్ట్రోను భోజనంలో విషపు మాత్రలు కలిపి చంపేయాలని సూచించారు. ప్రమాదకరమైన విషపు గుళికను కూడా ఇచ్చి పంపారు. కస్టమ్స్ అధికారుల కళ్లుకప్పి కూడా ఆమెను క్యూబాకు పంపించారు. అమెరికాలలో లారెంజ్ను సీఐఏ అధికారులు కలుసుకున్న విషయాన్ని తన వేగుల ద్వారా తెలసుకున్న క్యాస్ట్రో అతి జాగ్రత్తగా లారెంజ్ ప్రవర్తనను గమనిస్తూ వచ్చారు. అమె తన కోల్డ్ క్రీమ డబ్బాలో దాచిన విషపు మాత్రను క్యాస్ట్రో ఓ రోజు కనుక్కున్నారు. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి తన పిస్టల్ తీసి అమెకిచ్చి తనను చంపాలనుకుంటే నేరుగానే చంపాలని ఆమెకిచ్చారట. కళ్లు మూసుకొని సిగరెట్ పొగ వదులుతూ నుదిటిపై గురిచూసి కాల్చమని చెప్పారట. దానికి లారెంజ్ వనికిపోతూ పిస్టల్ నుంచి తుపాకీ గుళ్లను తీసేసి, పొరపాటుపడ్డాను, క్షమించడంటూ క్యాస్ట్రో కౌగిట్లో వాలిపోయారట. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసింది. కారు యాక్సిడెంట్ల ద్వారా, క్యాస్ట్రో తరచుగా వెళ్లే బేస్బాల్ స్టేడియంలలో గ్రెనేడ్ల ద్వారా చంపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారని ఎస్కలాంటే మీడియాకు అనేక సందర్భాల్లో వెల్లడించారు. 1990లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో క్యాస్ట్రో మాట్లాడేందుకు వచ్చినప్పుడు ఆయన బూట్లపై రసాయనిక పౌడర్ సిఐఏ చల్లిందట. బూట్లు ఇప్పుకోవడం, కట్టుకోవడం వల్ల ఆ పౌడర్ రియాక్షన్ ద్వారా ఆయన గడ్డం ఊడిపోవాలన్నది కుట్రట. ఎల్ఎస్డీ నింపిన సిగరెట్లు అందించడం ద్వారా కూడా చంపాలనుకున్నట్లు ‘ఏ 638 ప్లాట్స్ అగెనెస్ట్ క్యాస్ట్రో’ అనే పుస్తకంలో ఎస్కలాంటే వివరించారు. ఆయన ఆ పుస్తకంలో కుట్రలకు డాక్యుమెంట్ ఆధారాలు కూడా చూపించారు. -
ధీశాలి ఫెడల్ క్యాస్ట్రో: వైఎస్ జగన్
హైదరాబాద్: అద్భుతమైన పోరాటస్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత ఫెడల్ క్యాస్ట్రో అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం(భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం) మరణించిన క్యూబా మాజీ అధినేత ఫెడల్ క్యాస్ట్రోకు వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు విడుదలచేసిన ఒక ప్రకటనలో క్యాస్ట్రో పోరాట పంథాను శ్లాఘించారు. అమెరికాకు అతి సమీపంగా ఉంటూ, అగ్రరాజ్యానికి కించిత్ తల వంచని ధీశాలి క్యాస్ట్రో అని, చిన్నదేశమే అయినప్పటికీ ఎవ్వరికీ గులాము కాకుండా క్యూబా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘమని, తన పట్టుదల, నిబ్ధతతో క్యూబాను, క్యూబన్లను నడిపించిన మహానేత ఫెడల్ క్యాస్ట్రోఅని వైఎస్ జగన్ కీర్తించారు. 50 ఏళ్లపాటు క్యాస్ట్రో పాలనలో క్యూబా ఎన్నో విజయాలు సాధించిందని గుర్తుచేశారు. (విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూత) -
క్యాస్ట్రో మరుపురాని వ్యాఖ్యలు
క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో సమీకాలిన చరిత్రపై చెరుగని ముద్రవేశారు. విప్లవానికి ప్రతీకగా, చేగువేరాకు ఆప్తమిత్రుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో స్ఫూర్తినింపారు. తన గురించి, కమ్యూనిజం గురించి వివిధ సందర్భాల్లో ఆయన పేర్కొన్న గుర్తుండిపోయే వ్యాఖ్యలివి.. నన్ను ఖండించండి. ఏం ఫర్వాలేదు. రేపు చరిత్రే నన్ను అర్థం చేసుకుంటుంది. - శాంటియాగో డి క్యూబాలోని సైనిక బ్యారక్లపై దాదాపు ఆత్మాహుతి దాడులు జరపడంపై 1953లో తనను తాను సమర్థించుకుంటూ క్యాస్ట్రో 82మందితో నేను విప్లవాన్ని ప్రారంభించాను. మరోసారి విప్లవాన్ని చేయాలనుకుంటే కేవలం 10, 15మందితో, సంపూర్ణ విశ్వాసంతో చేస్తాను. మీ మీద మీకు విశ్వాసం ఉండి, కచ్చితమైన కార్యాచరణ ఉంటే మీరు చిన్నవారైనా పెద్ద విషయమే కాదు. - 1959లో క్యాస్ట్రో నా గడ్డన్ని గీయించుకోవాలని నేను అనుకోవడం లేదు. నేను దీనికి అలవాటుపడిపోయాను. నా గడ్డం మా దేశానికి సంబంధించినది అంశం. సుపరిపాలన అందిస్తామన్న మా వాగ్దానం నెరవేరిన నాడు నేను గడ్డాన్ని తీస్తాను. - 1959లో విప్లవం విజయవంతమైన 30 రోజుల అనంతరం సీబీఎస్ చానెల్ ఇంటర్వ్యూలో క్యాస్ట్రో క్యూబన్ ప్రజారోగ్యం కోసం నేను చేయాలనుకున్న చివరి త్యాగం.. పొగ తాగటాన్ని మానెయ్యడం. కానీ దానిని నేను చేయలేకపోయాను. - 1985 డిసెంబర్లో తాను పొగతాగడం మానేశానని ప్రకటిస్తూ క్యాస్ట్రో నాలోని భావజాలాలకు, ఆ అసాధారణ వ్యక్తి (జీసెస్ క్రైస్ట్)లోని భావజాలాలకు ఎలాంటి వైరుధ్యాన్ని నేను చూడలేదు - 1985లో క్యాస్ట్రో సోషలిస్టు వర్గం కనుమరుగై ఉండి ఉంటే ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమేనని నేను భావించను. - 1989లో క్యాస్ట్రో విప్లవం అందించిన గొప్ప ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే మా వేశ్యలు కూడా పట్టభద్రులే - డైరెక్టర్ ఆలివర్ స్టోన్ 2003లో తీసిన డాక్యుమెంటరీ ‘కమాండెంట్’పై క్యాస్ట్రో క్యూబన్ మోడల్ మనకోసం ఇక ఎంతమాత్రం పనిచేయబోదు - 2010లో అమెరికా జర్నలిస్ట్ జెఫ్రీ గోల్డ్బెర్గ్తో ఇంటర్వ్యూలో క్యాస్ట్రో.. ఆ తర్వాత తన వ్యాఖ్యను సందర్భోచితంగా తీసుకోలేదని క్యాస్ట్రో పేర్కొన్నారు. అమెరికాతో చేయబోయే యుద్ధమే నా నిజమైన గమ్యమని నేను గుర్తించాను - 2004లో ఒలివర్ స్టోన్ తీసిన రెండో డాక్యూమెంటరీ ‘లుకింగ్ ఫర్ ఫిడెల్’ లో క్యాస్ట్రో ప్రారంభ మాటలు 80ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టడం నిజంగా ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ పవర్గా పేరొందిన పొరుగుదేశం ప్రతిరోజూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా. ఇంతకాలం బతకుతానని నేను అనుకోలేదు. - 2006 జూలై 21న అర్జెంటినాలో జరిగిన లాటిన్ అమెరికా అధ్యక్షుల సదస్సులో క్యాస్ట్రో -
విప్లవ పోరాటంలో ఫెడల్ క్యాస్ట్రో - చేగువేరా..
సరైన ఆలోచన ఎంత ముఖ్యమో దానిని పక్కాగా అమలుచేయడమూ అంతే ప్రధానం. ఇక సాయుధపోరాటంలో ఎత్తుగడలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. క్యూబా విప్లవ పోరాటంలో ఫెడల్ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం చేగువేరా. ఎక్కడో పుట్టి, పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం తుపాకి పట్టిన చేగువేరాకు, అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహం ఇస్తూ విప్లవాన్ని విజయవంతం చేయడంలో ఫెడెల్ క్యాస్ట్రో అనుసరించిన తీరు చరిత్రలో అరుదైన ఘట్టం. 1950 దశకం నుండి క్యూబాలో అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. చెరుకు రైతులతోపాటు సాధారణ ప్రజల జీవితాలనూ పీల్చి పిప్పిచేస్తూ నాటి ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేశాన్ని విప్లవానికి అనుకూలంగా మలచడంలో ఫెడల్కు చేగువేరా అందించిన సహకారం అనిర్వచనీయం. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను ‘గ్రాన్మా’ నౌకలో తీసుకొనిపోయి బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే తర్వాతి రెండేళ్ళ కాలంలో విప్లవంగా మారిపోయింది. బృందాలుగా విడిపోయిన విప్లవ సైన్యాలు.. తాము ప్రయాణించే మార్గంలో తారాసపడే గ్రామాలకు వెళ్లి, రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహించేవారు. వాళ్లని పోరాటానికి ఉద్యుక్తుల్ని చేసేవారు. వైద్యుడిగా ఫెడల్ విప్లవ సైన్యంలో చేరిన చేగువేరా.. మాక్సిజం, లెనినిజంల పంథాను సహచరులకు మరింత అర్థమయ్యేలా వివరించేవాడు. అతనిలోని బోధకుడిని గుర్తించిన ఫెడల్.. రైతులు, కూలీలతో నిర్వహించే సమావేశాల్లో చేగువేరాను మాట్లాడాల్సిందిగా ప్రోత్సహించేవాడు. దోపిడి, తిరుగుబాటు, పోరాటం, విప్లవం, సమానత్వం, కమ్యూనిజం, సోషలిజం.. ఒక్కటేమిటీ అన్ని అంశాలను పామరుడికి సైతం అర్థమయ్యేలా వివరించడం, యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకులేకుండా దూసుకెళ్లడం చేగువేరా సహజనైజం. చే విధానాలకు ఏనాడూ అడ్డుచెప్పని ఫెడల్.. చివరికి గువేరా క్యూబాను విడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా అదేపని చేశాడు. తనలా చేగువేరా ఒక దేశానికే పరిమితమైపోయేవాడు కాదు.. ‘ప్రపంచ పోరాట యోధుడు’ అని అందరికన్నా ముందు గుర్తించింది ఫెడల్ క్యాస్ట్రోనే. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా మోటర్ బైక్పై వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవం విజయవంతం అయిన తర్వాత ప్రధాని హోదాలో ఫెడల్ క్యాస్ట్రో.. క్యూబాకు ఆయువుపట్టైన చక్కెర, పరిశ్రమల శాఖకు చేగువేరాను మంత్రిగా నియమించాడు. ప్రస్తుతం క్యూబా ప్రపంచ చెక్కెర గిన్నె(సుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్)గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. విప్లవం అనంతరం ఒక దేశంగా క్యూబా మనుగడ సాధించాలంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో(ఒక్క అమెరికాతో తప్ప) సఖ్యత అత్యవసరమైంది. ఆ బాధ్యతను కూడా ఫెడల్ క్యాస్ట్రో.. చేగువేరాకే అప్పగించాడు. క్యూబా విదేశాంగ మంత్రి హోదాలో చే.. భారత్ సహా రష్యా, శ్రీలంక, జపాన్, చైనా తదితర దేశాల్లో పర్యటించి, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుని క్యాస్ట్రో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అధికార నిర్వహణ కంటే విప్లవం పురుడుపోసుకుంటున్న మిగత లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలకు తన సేవలు అవసరమని భావించిన చేగువేరా క్యూబా విడిచి బొలీవియా వెళ్లాలనుకున్నాడు. నిజానికి చేగువేరా లాంటి తురుపుముక్కను వదులుకోవడానికి ఏ రాజనీతిజ్ఞుడూ సిద్దపడడు. కానీ అది విప్లవ పోరాటం. అక్కడ వ్యక్తిగత స్నేహాలకు తావులేదు. అందుకే దేశాధినేతగా కాకుండా ప్రియమైన స్నేహితుణ్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఫెడల్ క్యాస్ట్రో.. చేగువేరాకు వీడ్కోలు పలికాడు. బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న చే మరణించాడు. -
విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూత
-
విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూత
హవానా: కమ్యూనిస్టు శిఖరం కూలిపోయింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో(90) కన్నుమూశారు. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10:30కు(భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9గంటలకు) కన్నుమూశారు. ఫెడెల్ సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ఈ విషయాన్ని జాతీయ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఫెడల్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కుగదీసింది. ఫెడల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూస్(ఫెడల్ క్యాస్ట్రో) 1926, ఆగస్టు 13న బిరాన్(హొల్గూయిన్ ఫ్రావిన్స్)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. నాటి అమెరికా అనుకూల బటిస్టా సేనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా చేస్తోన్న ఆందోళనల్లో విద్యార్థి నాయకుడిగా భాగం పంచుకున్న క్యాస్ట్రో.. తర్వాతి కాలంలో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పోరాటానికి వెన్నుచూపని నైజం అతడిని పార్టీ నాయకుడిగా ఎదిగేలా చేసింది. ఫెడల్ క్యాస్ట్రో నేతృత్వంలో చేగువేరా, రావుల్క్యాస్ట్రో, ఇంకా వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు జరిపిన విప్లవ పోరాటం ఒక సమోన్నత చరిత్ర. 1959లో క్యూబాను హస్తగతం చేసుకున్న ఆ పార్టీయే నేటికీ అధికారంలో కొనసాగుతుండటం గమనార్హం. 1959 నుంచి 1976దాకా క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై, 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. మాక్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతాలకు క్యూబా జాతీయతను రంగరిస్తూ ఫిడెల్ అనుసరించిన విధానం దేశంలో అతనిని తిరుగులేని నేతగా నిలబెట్టింది. విద్య, వైద్య, ప్రజా సేవల రంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలోకీ పైస్థానంలో నిలిచేలా చేసింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది డాక్టర్లను అందించిన దేశంగా, సుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్గా క్యూబా ఎదగడం వెనుక క్యాస్ట్రో కృషి అనిర్వచనీయం. వృధాప్యం కారణంగా 2008లో ఫెడెల్ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయన తమ్ముడు రావుల్ క్యాస్ట్రో అధ్యక్ష పదవిని చేపట్టారు. -
ఉప్పు, నిప్పుల మధ్య కీలక ముందడుగు
వాషింగ్టన్ డీసీ: దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా ఉన్న అమెరికా,క్యూబా సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఐదు దశాబ్దాల అనంతరం క్యూబాలో అమెరికా రాయబార కార్యాలయం తెరుచుకోనుంది. జెఫ్రీ డిలారెంటిస్ ను క్యూబాలో అమెరికా రాయబారిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.50 ఏళ్ల అనంతరం క్యూబాలో అంబాసిడర్ను నియమించడం గర్వంగా ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. క్యూబా, అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జెఫ్రీని అభినందించారు.ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ పూరిత పరిస్థితులను పరిష్కరించడంలో ఒబామాతో కలిసి జెఫ్రీ కీలకపాత్ర పోషించారు. దాదాపు 90 ఏళ్ల అనంతరం ఈ యేడాది మార్చిలో అమెరికా అధ్యక్షుని హోదాలో ఒబామా క్యూబాలో పర్యటించారు. దీంతో ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడంలో కీలక ముందడుగు పడింది. -
రేప్ కేసులో ఐదుగురు వాలీబాల్ ఆటగాళ్లకు జైలు
టాంపెరె: ఫిన్లాండ్కు చెందిన ఓ యువతిపై లైంగికదాడి చేసిన కేసులో క్యూబాకు చెందిన ఐదుగురు జాతీయ వాలీబాల్ ఆటగాళ్లకు జైలుశిక్ష పడింది. మంగళవారం ఫిన్లాండ్లోని టాంపెరె కోర్టు వారిని దోషులుగా ప్రకటించింది. నలుగురికి ఐదేళ్ల చొప్పున, మరో ఆటగాడికి మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. టాంపెరెలో జరిగిన వాలీబాల్ ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో క్యూబా ఆటగాళ్లు ఫిన్లాండ్ యువతిపై దారుణానికి పాల్పడ్డారు. ఓ హోటల్లో వాలీబాల్ ఆటగాళ్లు తనపై లైంగికదాడి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూలై 2న టాంపెరె పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మొదట ఎనిమిదిమంది ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నా, విచారణ అనంతరం ఈ కేసులో ప్రమేయంలేని ముగ్గురు ఆటగాళ్లను విడిచిపెట్టారు. క్యూబాకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు నేరానికి పాల్పడినట్టు కోర్టులో రుజువైంది. కాగా వీరి పేర్లు, మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
గత గాయాలకు మందు
బైలైన్ క్యూబా. వియత్నాం. హిరోషిమా. బరాక్ ఒబామా మనకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తున్నది. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ అధ్యక్ష పదవీకాలంలోనే ఈ తరం అమెరి కన్లను వెంటాడిన కొన్నికొన్ని జ్ఞాపకా లనూ, సందిగ్ధాలనూ తనకు సాధ్యమై నంత మేర భూస్థాపితం చేయాలని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు, సందిగ్ధాలు ఏవంటే: 1945లో నాగసాకి, హిరోషిమాలను సర్వ నాశనం చేసిన అణుబాంబులు, 1960లలో క్యూబా, వియత్నాంల మీద జరిగిన దాడి ఘటనలు. దేశాధ్యక్షునిగా ఆయన ఈ సంఘటనల మీద క్షమాపణలు చెప్పలేరు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులకు అది క్షేమకరం కాదు. అలాగే సోవియెట్ యూనియన్కు తీవ్రమైన సవాళ్లు విసరి, కమ్యూనిజం నుంచి ఈ స్వేచ్ఛా ప్రపం చాన్ని రక్షించామని విశ్వసించే వారికి కూడా అది ఆత్మహత్యా సదృశమవుతుంది. కానీ 19 60, 1970లలో పెరిగి పెద్దదైన తరానికి మాత్రం క్యూబా మీద జరిగినది ఓ మూర్ఖపు చర్య, వియత్నాం మీద దాడి ఘోర తప్పిదం. ఇది పూర్తిగా యాదృచ్ఛికం కాకున్నా, బరాక్ ఒబామా పుట్టిన సంవత్సరం, బే ఆఫ్ పిగ్స్ (దక్షిణ క్యూబా) మీద విఫల దాడికి జాన్ఎఫ్ కెన్నెడి ఆమోదించిన సంవ త్సరం కూడా 1961. కొన్ని మాసాల తరువాత క్యూబాలో క్షిపణల గురించిన వివాదం మీద అమెరికా, సోవియెట్ రష్యా అణు సంఘర్షణతో ఈ ప్రపంచాన్ని పేల్చేసినంత పనిచేశాయి. పశ్చాత్తాపం కూడా తగిలిన ఎదురు దెబ్బలకి కొంత సాంత్వన చేకూర్చగలదని ఒబామాకు తెలుసు. అయితే ఇందుకు తాను కూడా కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయ నకూ తెలుసు. అందుకు సంబంధించిన ఆత్మలు ప్రార్థనలతో సరిపెట్టుకోవు. వాటిని పూర్తిగా భూస్థాపితం చేయవలసిందే. గతకాలపు విషాదాలను మనం తుడిచిపెట్టలేం. వాటి పర్యవ సానాలను నిరాకరించలేం కూడా. ఒక ఘోర తప్పిదం గురించి బాహాటంగా అంగీకరిస్తే ప్రజలలో గుర్తింపు ఉంటుంది. గడచిన శతాబ్దంలో మనం చూసిన కనీవినీ ఎరుగని రక్తపాతాలు- యుద్ధాలు, వర్ణ వివక్ష, మారణహోమాలతో పోల్చి చూస్తే కామగాటమారు ఉదంతం వాటితో సమంగా మానవాళి మీద పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదు. కానీ సిక్కుల మీద అది లోతైన ముద్రను వదిలి వెళ్లింది. 1914లో సిక్కులు ప్రయా ణిస్తున్న కామగాటమారు అనే ఓడను జనంతో అలాగే కెనడా వెనక్కి తిరగ్గొట్టింది. ఇప్పటికీ ఆ గాయం రేగుతూనే ఉంటుంది. ఈ గాయాన్ని మాన్పవలసిన అవసరాన్ని కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆచితూచి వేసిన పదాలతో ఆయన ఓ ప్రకటన ఇచ్చారు కూడా. కామగా టమారు నౌకకు, అందులో అప్పుడు ప్రయాణించిన వారు ఎదుర్కొన్న ప్రతి విషాద ఘటనకి కెనడా బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రయాణికులు నిరపాయంగా తిరిగి వలస పోవడానికి వీలు కల్పించని నాటి కెనడా చట్టాలకు మాత్రం మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పర్యవసానంగా ఎదురైన అన్ని విచారకర పరిణామాలకు మాత్రం మమ్మల్ని క్షమించాలి.’’ ఇందులో ముఖ్యాంశం బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం. వాస్తవం ఏమిటంటే ఈ పనిచేయడానికి వందేళ్లు పట్టిందంటే, ఇలాంటి విషాదాన్ని గుర్తించడానికి వ్యవస్థలకు ఎంతకాలం పడుతుందో ఇది సూచిస్తుంది. అలాగే ఆ విషాదాలలోని అన్యాయం ఎంతటిదో గమనించడానికి కూడా ఎంత సమయం కావాలో ఇది సూచిస్తుంది. హిరోషిమా, నాగసాకిలలో నిర్మించిన శాంతి స్మారక స్తూపాన్ని సందర్శించడానికి అమెరికా అధ్యక్షుడికి 71 ఏళ్లు పట్టింది. ఇలాంటి వాటి మీద ఆగ్రహం ప్రకటించడం కంటే, నైతిక ప్రమాణాల గురించి మాట్లాడటం కంటే ఇలాంటి ఆలస్యాల వెనుక ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1945 నాటికి అమెరికా, జపాన్ అప్పటికి మూడేళ్ల నుంచి ఘోర యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి. ఎవరూ వెనక్కి తగ్గేటట్టు లేరు. కమికాజి అనుభవం దృష్ట్యా (పేలుడు పదార్థాలను నింపిన ఆ పేరు కలిగిన జపాన్ విమానం శత్రు స్థావరం మీద దాడి చేసింది) జరిగే ప్రాణనష్టం గురించి అమెరికా యోచించవలసి వచ్చింది. అయినప్పటికీ హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబుల బీభ త్సం తప్పలేదు. నా అభి ప్రాయం వరకు అమెరికా, జపాన్ల మధ్య సయోధ్య ఇప్పటికి పరిపూర్ణం కాలేదు కానీ, 1950లలోనే ఇందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఉత్పాతం కంటే శాంతి గొప్పదన్న వాస్తవాన్ని ఇంత తొంద రగా గుర్తించినందుకు రెండు దేశాలకు చెందిన ప్రజలకు శిరసు వంచి నమ స్కరించాలి. పర్యవసానం గా ప్రపంచం కొంత మెరుగైన స్థితికి చేరింది. చరిత్రలో సరికొత్త అధ్యాయం ఎప్పుడు మొదలవుతుంది? విజయం లేదా పరాజయం ప్రతి అంశాన్ని పరిపూర్ణంగా మార్చి వేసినప్పుడు తప్ప, సరికొత్త అధ్యాయం గురించి చెప్పడం ఎప్పుడూ కష్టమే. ఒక పరిణామం కొనసాగింపు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. ఒబామాకు క్యూబా సాదర స్వాగతం చెప్పినప్పుడు కూడా అమెరికా ఆ దేశంతో సంబంధాలకు సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని ఏళ్ల నుంచి ఆ తలుపులను తట్టలేదు. అయితే ఆ తలుపులు ఇక ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఒబామా పర్యటన గట్టిగా చెబుతోంది. అమెరికా-వియత్నాం సంబంధాలలో ఒబామా తాపీగా చేసిన విన్యాసం ఒక కొత్త విధానాన్ని పరిచయం చేస్తున్నది. వియత్నాంకు అమెరికా ఆయుధాలు అమ్మబోతున్నది. వియ త్నాం యుద్ధం కొన్ని దశాబ్దాల క్రితమే ముగిసి ఉండవచ్చు కానీ, విభేదాలకు సంబంధించిన చివరి జాడలు, అంటే అనుమానాలు కూడా ఇప్పుడు సమసిపోయాయి. ఇది 1940లలో కమ్యూనిస్టు యోధుడు హోచిమన్ జపాన్కు వ్యతిరేకంగా అమెరికాతో కలసినప్పుడు ఆ రెండు దేశాల మధ్య కొనసాగిన బంధానికి పూర్తి విరుద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే ఐరోపా దేశాలను వలసల నుంచి ఖాళీ చేయవలసిందిగా అమెరికా ఒత్తిడి చేస్తుందని హోచిమన్ భావించారు (ఇలాంటి కారణాలతోనే గాంధీజీ మొదటి ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇచ్చారు). కానీ రూజ్వెల్ట్ చనిపోయిన తరువాత ఆయన వారసుడు హ్యారీ ట్రూమన్ వియత్నాం మీదకు ఫ్రాన్స్ను ఉసిగొలిపారు. మిగిలిన కథ అందరికీ తెలుసు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి -
నిరంతర విప్లవ స్ఫూర్తి
కొత్త కోణం ప్రపంచ అగ్రరాజ్యం పక్కనే ఉన్న ఓ చిన్న దేశంలోని సోషలిజాన్ని కాపాడుకోవడం కోసం కాస్ట్రో చేసిన పోరాటం ప్రపంచాన్నే నివ్వెర పరచింది. క్యూబాలో కాస్ట్రో అమలు పరచిన సోషలిస్టు విధానాల ఫలితంగా ప్రజలందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఉత్పత్తిలో కూడా ప్రజలకు నిజమైన భాగస్వామ్యం లభించింది. ఫలితంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలుచేసే మార్కెట్ శక్తుల ప్రాబల్యం తగ్గింది. అంతేకాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గడంతోపాటూ, పౌరహక్కులకు రక్షణ కూడా పెరిగింది. ‘‘ఈ దేశాన్ని సమూలంగా మార్చగలిగినప్పుడు నేను సంతోషిస్తాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక. ప్రజల కోసం నేను కొన్ని వేలమంది ద్వేషాన్నైనా లెక్కచేయను. ఇందులో బంధువులు, స్నేహి తులు, నా సహచర విద్యార్థులు ఉన్నా భరిస్తాను.’’ క్యూబా విప్లవ నేత, మాజీ దేశాధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఒకప్పుడు అన్న మాటలివి. వారం క్రితం కమ్యూనిస్టు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... ఇదే నా చివరి ఉపన్యాసం కావచ్చంటూ చేసిన సంక్షిప్త ప్రసంగంలోనూ ఆయన ప్రజల పట్ల అదే ప్రేమను వ్యక్త పరిచారు: ‘‘కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మార్క్సిస్టు, సోష లిస్టు విలువలకు కట్టుబడి పనిచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వరాదు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఉండాలి’’. ఫిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు విశిష్ట నాయకుడు. క్యూబా వంటి అతిచిన్న దేశం, అతి తక్కువ జనాభాతో ప్రపంచ సామ్రాజ్యవాద యుద్ధ పిపాసి అమె రికాతో తలపడటం అంటే మాటలు కాదు. అందుకు గుండె ధైర్యం కావాలి. గుండెనిండా ప్రజలపై ప్రేమ కావాలి. అన్నింటికీ మించి ప్రాణాలపై తెగింపు కావాలి. వీటన్నింటినీ కలగలుపుకొన్న వ్యక్తిత్వం ఫిడెల్ కాస్ట్రోది. మార్క్సి జాన్ని ఆయుధంగా, దిక్సూచిగా చేసుకొని విప్లవ వీరుడిగానేగాక, అత్యంత సమర్థ పరిపాలకునిగా కాస్ట్రో అరుదైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. చాలా మంది విప్లవ నాయకుల జీవితాలు విప్లవ విజయంతోనో లేదా కొన్నేళ్లు ప్రభుత్వాన్ని నడపడంతోనో ముగుస్తాయి. కానీ విప్లవానంతరం దాదాపు ఆరు దశాబ్దాలు ప్రభుత్వాధినేతగా ఉండటం అనూహ్యం. ఆయన ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువగా చేయడమే కాదు, విద్య, వైద్యాలను ప్రజలందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చి క్యూబా చరిత్రను తిరగరాశారు. ఫిడెల్ తండ్రి ఏంజల్ కాస్ట్రోకు ఏడుగురు సంతానం. ఆరేళ్ల ప్రాయంలో పాఠశాలలో చేరిన ఫిడెల్, పందొమ్మిదేళ్ళ వయస్సులో హవానాలోని ప్రతిష్టాత్మకమైన ఒక క్రైస్తవ కళాశాలలో చేరాడు. ఆ తదుపరి హవానా విశ్వ విద్యాలయ న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉండగా క్రమంగా విద్యార్థి ఉద్యమ రాజ కీయాలవైపు దృష్టి మరల్చాడు. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నిం చాడు. క్యూబా అధ్యక్షుడు రమోన్ గ్రావ్ హింసాయుత రాజ్యానికి, అవినీతి పాలనకు వ్యతిరేకంగా 1946లో కాస్ట్రో చేసిన ఉపన్యాసం ఆనాటి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు ఎడ్వర్డొ చిబాస్ స్థాపించిన క్యూబా పీపుల్స్ పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో కాస్ట్రో ఆ పార్టీలో సభ్యునిగా చేరారు. కాస్ట్రో ఆ పార్టీలో క్రియాశీల నేతగా కొనసాగారు. క్యూబా విప్లవ చుక్కాని అదేసమయంలో 1947 జూన్లో డొమినికన్ రిపబ్లిక్ నియంత రాఫెల్ ట్రుజిల్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సాగుతున్న పోరాటంలో పాల్గొ నాలని కాస్ట్రో ప్రయత్నించారు. డొమినికన్ రిపబ్లిక్కు బయలుదేరబోతున్న కాస్ట్రో వంటి తిరుగుబాటుదార్లను అమెరికా కనుసన్నల్లోని క్యూబా ప్రభుత్వం ముందే నిర్బంధంలోకి తీసుకుంది. అయినా విద్యార్థి ఉద్యమా లలో కాస్ట్రో కృషి కొనసాగింది. 1948 ఏప్రిల్లో బొగోటా, కొలంబియాలలో పర్యటించిన ఫిడెల్ అక్కడి విద్యార్థుల సభల్లో పాల్గొన్నారు. అదే ఏడాది ఆయన మిర్టా డియాజ్ బలార్ట్ను పెళ్లి చేసుకున్నాడు. నిరంతర కార్యాచరణ మధ్య 1950లో ఆయన న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఫుల్జెన్సియో బాటిస్టా నాయకత్వాన 1952, మార్చి 10 న ప్రభుత్వ వ్యతిరేక సైనిక తిరుగుబాటు జరిగింది. బాటిస్టా దుర్మార్గ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతి రేకంగా 1953, జూలై 26న కాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డి క్యూబా లోని మంకోడా సైనిక దుర్గంపై జరిగిన దాడి విఫలమైంది. కాస్ట్రోతో పాటు మరో 24 మందిని ప్రభుత్వం అరెస్టు చేసి, జైలు శిక్ష విధించింది. ఆ దాడి తర్వాత 60 మంది విప్లవకారులను బాటిస్టా ప్రభుత్వం హత్య చేసింది. అప్పటి నుంచి కాస్ట్రో నడిపిన ఉద్యమాన్ని జూలై 25 ఉద్యమంగా పిలవ సాగారు. ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్లో కాస్ట్రో సహా తిరుగు బాటు నేతలంతా విడుదలయ్యారు. క్యూబాలోని విప్లవ కార్యక్రమాలపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినందువల్ల కాస్ట్రో తన కార్య స్థానాన్ని మెక్సికోకు మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు ప్రారంభిం చాడు. ఆయన సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్, ప్రపంచ యువ శక్తికి నేటికీ తలమానికమై నిలుస్తున్న చేగువేరా కూడా కాస్ట్రో బృందంలో ఉన్నారు. 81 మంది విప్లవకారులతో కాస్ట్రో ఒక నౌకలో 1950 డిసెంబర్ 2న క్యూబా చేరుకున్నాడు. రెండేళ్ళ పాటు కాస్ట్రో నాయకత్వంలోని రెడ్ ఆర్మీ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, 1959, జనవరి 1 నాటికి నియంత బాటిస్టాను క్యూబా నుంచి పారదోలింది. 1959 ఫిబ్రవరి 10న కాస్ట్రో క్యూబాకు మొదటి ప్రధాన మంత్రి అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత 1965లో క్యూబా కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి 2008 వరకు ఆయనే పార్టీకి, ప్రభుత్వానికి అధినేతగా ఉన్నారు. చేగువేరాతో స్నేహం అర్జెంటీనాకు చెందిన చేగువేరాకు 1955లో ఫిడెల్ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దాదాపు పన్నెండేళ్లు విప్లవ పోరాటంలో కలిసి నడి చారు. క్యూబా విముక్తిలో భాగమయ్యారు. చేగువేరా కొంత కాలం పాటు క్యూబా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ... 1962లో లాటిన్ అమెరి కాలోని మిగిలిన దేశాలకు విప్లవాన్ని విస్తరింపజేయాలని క్యూబా పౌరస త్వాన్ని, ప్రభుత్వ హోదాలను వదులుకున్నారు. కాస్ట్రో, చేగువేరా మధ్య అనేక సిద్ధాంత రాజకీయ చర్చలు జరిగేవి. అయితే ప్రభుత్వాన్ని నడపడంలో ఉన్న సమస్యలు, పరిమితులు చేగువేరాను కాస్ట్రోకు దూరం చేశాయి. ముఖ్యంగా విప్లవ సిద్ధాంతం విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలేర్పడ్డాయి. ఎన్ని విభేదాలున్నా కాస్ట్రో పట్ల చేగువేరా స్నేహపూర్వకమైన వైఖరితోనే ఉండేవాడు. ‘‘ఒకరాత్రంతా నేను ఫిడెల్ కాస్ట్రోతో మాట్లాడాను. ఆ రోజే ఆయన ఒక ఆసాధారణ వ్యక్తిగా నన్ను ఆకర్షించాడు. అసాధారణమైన పనులను సుసాధ్యం చేసే ఆయన సామర్థ్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. క్యూబాకు చేరుకొని నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించి దేశాన్ని విముక్తి చేస్తాననే విషయంలో కాస్ట్రోకు అచంచలమైన విశ్వాసం ఉండేది. చివరికి అది సాధించి చూపించారు’’ అని చేగువేరా ప్రముఖ రచయిత రికార్డోతో అన్నారు. అగ్రరాజ్యానికి కంటికి నిద్ర కరువు బ్రిటన్లోని ఛానల్ 4 రూపొందించిన డాక్యుమెంటరీ ప్రకారం అమెరికా, కాస్ట్రోపై 638 హత్యా ప్రయత్నాలు చేసిందని వెల్లడయ్యింది. అమెరికా గూడఛార సంస్థ అయిన సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)ఈ దాడులకు రూపకర్తని కూడా ఆ డాక్యుమెంటరీ వెల్లడించింది. సిగరె ట్ల ద్వారా, లో దుస్తుల ద్వారా, భోజనంలో విషం కలిపి, పడక గదిలో ఇలా సీఐఏ కాస్ట్రోకు సకల యత్నాలూ చేసింది. అనేక మంది ప్రత్యక్ష సాక్షులను, చివరకు మాజీ సీఐఏ ఏజెంట్లను కూడా ఇంటర్వ్యూ చేసి ఈ డాక్యుమెంటరీని రూపొం దించారు. దాదాపు 50 ఏళ్లపాటు పలువురు అమెరికా అధ్యక్షులు ఈ కుట్రలో భాగస్వాములైన వైనాన్ని చానల్ 4 బయట పెట్టింది. ఇన్ని దాడులను ఎదుర్కొంటూ కూడా క్యూబాను పేదలు, కార్మిక వర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గల సోషలిస్టు దేశంగా నిలబెట్టడంలో ఫిడెల్ కాస్ట్రో తిరుగులేని విజయం సాధించారనేది సత్యం. క్యూబాలో కాస్ట్రో అమలు పరచిన సోషలిస్టు విధానాల ఫలితంగా ప్రజ లందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి రావడమే కాదు, దేశంలో జరిగే ఉత్పత్తిలో కూడా ప్రజలకు నిజమైన భాగస్వామ్యం లభించింది. ఫలితంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసే మార్కెట్ శ క్తుల ప్రాబల్యం గణనీ యంగా తగ్గింది. అంతేకాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గడం తోపాటూ, పౌరహక్కులకు రక్షణ కూడా పెరిగింది. కేంద్రీకృత పరిపాలనా విధానాలను అవలంబించడం వల్ల సరైన ఫలితాలను సాధించినప్పటికీ... పాలనలో ప్రజాస్వామ్యం లక్షణాలు కొరవడ్డాయన్న విమర్శను ఫిడెల్ కాస్ట్రో ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచ అగ్రరాజ్యం పక్కనే ఉన్న ఓ చిన్న దేశం లోని సోషలిజాన్ని కాపాడుకోవడం కోసం కాస్ట్రో చేసిన దశాబ్దాల పోరాటం ప్రపంచాన్నే నివ్వెర పరిచింది. అది విశ్వవ్యాప్తంగా విప్లవ శక్తులకు ఊత మిచ్చింది. అమెరికాను ఎదిరించినిలిచే శక్తి ప్రపంచంలో ఇంకా మిగిలే ఉందని నిరూపించింది. పెద్ద పెద్ద దేశాల సార్వభౌమత్వాలనే పాదాక్రాంతం చేసుకున్న అగ్రరాజ్యానికి కంటి మీద కునుకులేకుండా చేసిన ఘనత క్యూబాది. ఆ విప్లవ పోరాటానికి ప్రపంచమే సలామంది. నికార్సయిన వర్గ ధృక్పథానికి, అలుపెరుగని విప్లవ కార్యదీక్షకు కాస్ట్రో జీవితమే ఉత్తమోత్తమ ఉదాహరణ. వారం క్రితం చేసినదే కాస్ట్రో చివరి ఉపన్యాసం అయితే కావచ్చు నేమో. కానీ, ప్రపంచ పెత్తందారీ దేశాలను గజగజలాడించిన అసంఖ్యా కమైన ఆయన ఉపన్యాసాలు, ఆయన పోరాటాలు నిరంతరం, తరం తరం పీడిత ప్రజలను మేల్కొల్పుతూనే ఉంటాయన్నది సత్యం. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
క్యూబా నేర్పుతున్న పాఠం
‘ఎప్పటినుండో మిమ్మల్ని తప్పకుండా చూడాలని, వ్యక్తిగతంగా మాట్లాడాలని అనుకున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత ధైర్యవం తులు మీరు!’ అని నెహ్రూజీ తొలి సారి క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రోను కలుసుకున్న సందర్భంగా అన్న మాటలివి! ప్రపం చాన్ని శాసించగల స్థాయిలో ఉన్నానన్న అహంకారంతో - ‘ఏమిటి ఈ కాస్ట్రో! ఒక ఎర్ర జెండా భుజాన వేసుకుని, పెద్ద మొనగాడల్లే ఊరేగుతు న్నాడు! అమెరికాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉందని మర్చిపోతున్నట్లున్నాడు ఈ బుడత విప్లవకారుడు!’ అని అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తే, అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలో ఉంటే, ‘క్యూబాకు అమెరికా కూడా 90 మైళ్ల దూరంలోనే వుందన్న ప్రాథమిక సత్యాన్ని అమెరికా అధ్యక్షుడు మరిచినట్లున్నాడు’ అని హెచ్చరిస్తూ బదులి చ్చిన ధీశాలి కాస్ట్రో. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా క్యూబా పర్యటనకు వెళ్లిన వార్తతో పాటు ఈ ఉదంతం గుర్తుకొ చ్చింది. అంతేకాదు, ‘అమెరికా అధ్యక్షునిగా ఒక నల్ల జాతీ యుడు ఎన్నికయితే క్యూబా అమెరికా సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఏర్పడతాయి’ అని కూడా కాస్ట్రో నాడు తెలిపిన అభిప్రాయం, భవిష్యద్దర్శనమా అన్నట్లు నిజమయింది. ఈ తరుణంలో, నా 37వ ఏట.. 1978లో ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భారతదేశ ప్రతినిధి బృందంలో ఒకరిగా, నా క్యూబా పర్యటనలో నేను గమనించిన క్యూబా విప్లవానికి సంబంధించిన కొన్ని అంశాలను భూమికగా ప్రస్తావించదలిచాను. క్యూబా విప్లవం జయప్రదం అయ్యేనాటికి దానిని కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన జరిగిన విప్లవంగా ప్రకటించే పరిస్థితి లేదు. క్యూబన్ కమ్యూనిస్టు తొలి మహాసభ విప్ల వానంతరం సంవత్సరం తర్వాత జరిగింది! క్యూబాలోని సామ్రాజ్యవాద అమెరికన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కాస్ట్రో నేతృత్వాన ఓడించకముందు, అలాంటి దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు రావడం అరుదేమీ కాదు. ఆ తర్వాత తిరుగు బాటు నేతను కూడా అమెరికా కొనేసి, దారికి తెచ్చుకుని తిరిగి తన కీలుబొమ్మగా మార్చుకోవడం జరిగేది. అలాగే కాస్ట్రో నేతృత్వాన రగులుకొంటున్న విప్లవాన్ని కూడా మరో సాధారణ తిరుగుబాటుగా వ్యవహరించవచ్చులే అని అమె రికన్ పాలకులు కొంత నిర్లక్ష్యం చేసి విప్లవ అణచివేత దిశగా ముందుగా మేల్కొనలేదు. తీరా విప్లవం జయప్రదం కాబోయే సమయానికి, అది అమెరికా చేయి దాటి క్యూబా చరిత్రలో, లాటిన్ అమెరికాలో తొలి ప్రజావిప్లవంగా నిలిచి పోయింది. ఇదొక ప్రత్యేకత! క్యూబా విప్లవాన్ని ఒక వాస్త వంగా అంగీకరించడానికి అమెరికా సిద్ధపడకపోగా పురిటి పసికందును అంతమొందించాలని, అనాగరిక ఆంక్షలకు ఆజ్యంపోసి, క్యూబాకు జీవనావసరాలను సైతం అంద కుండా చెయ్యాలని ఎంతో దుష్టయత్నం చేసింది. ఆ సమయానికే అంతర్జాతీయంగా సోవియెట్ యూనియన్ నేతృత్వాన సోషలిస్టు శిబిరం ఏర్పడింది. యు.ఎస్. ఎస్.ఆర్, చైనా మొదలగు దేశాలతో కూడిన సోషలిస్టు శిబిరం అండదండలతో క్యూబా నిలదొక్కుకోగలిగింది. అయితే సోవియెట్ యూనియన్ నేతృత్వంలోని సోషలిస్టు శిబిరం ఎంతగా సహకరించినా, క్యూబా ప్రజానీకంలో అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ చైతన్యం ప్రధాన కారణం కావాలి! అప్పుడే క్యూబన్ విప్లవానికి గ్యారంటీ! అందుకే ఆ విప్లవ చైతన్యాన్ని ప్రజలలో అంతర్ముఖం చేసేందుకు కాస్ట్రో సోషలిస్టు పాలన ఎంతో ప్రయత్నం చేసింది. అంత ర్జాతీయ సోషలిస్టు సిద్ధాంత ఘర్షణల ఆటుపోట్ల మధ్యనే క్యూబా తన విప్లవాన్ని కాపాడుకున్నది. అమెరికన్ ఆంక్షలనే కాదు - సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై అక్కడ సోషలిజం అంతరించినా చైనాలో ‘డెంగ్’ సంస్కరణల పాలన సాగినా, క్యూబా విప్లవం నిల దొక్కుకున్నది. లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. నిన్నమొన్నటి ‘చావేజ్’ కూడా క్యూబా ప్రభావితుడే! ప్రపంచంలోనే ఆరోగ్య రంగాన అగ్రగామిగా వున్న దేశం క్యూబా. 27 దేశాలలో క్యూబా వైద్యులు తమ ప్రభుత్వం తరఫున వెళ్లి వైద్య సహాయం అందిస్తున్నారు. క్యూబాకు ఆయిల్ సరఫరాలు నిలిచిపోయేలా అమెరికా ఆంక్షలు విధిస్తే - అత్యంత తీవ్రమైన పరిస్థితిలో తిరిగి గుర్రాలతో వ్యవసాయాన్ని (ట్రాక్టర్ల స్థానంలో) సాగించి, అమెరికాకు లొంగేది లేదని స్పష్టం చేసింది క్యూబా. తన దేశ ప్రజల ప్రయోజనాలకు, తన ఆర్థిక వనరులకూ అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాలకు తాకట్టు పెట్ట కుండా, ప్రగతి పథాన సాగుతున్నది గనుకనే అమెరికన్ సామ్రాజ్య వాదం సైతం బలప్రయోగంతో, క్యూబాను కబళింపవచ్చు నన్న అహంకారం పనిచేయదని గ్రహించింది. ఒకనాడు కాస్ట్రో జోస్యం చెప్పినట్లు - డెమొక్రటిక్ పార్టీ తరఫున నల్ల జాతీయుడైన ఒబామా అధ్యక్షులుగా వుండి అక్కడి పాలక వర్గం ప్రస్తుత పరిస్థితిలో అనుమ తించిన పరిధిలో, క్యూబాతో సత్సంబంధాల ఆవశ్యకత గుర్తెరిగి తానూ స్నేహ హస్తం అందించాడు. ఆ విజ్ఞతకు ఒబామా సైతం అభినందనీయుడే! క్యూబా మన దేశంతో పోలిస్తే చాలా చిన్న దేశం. అయినా, మార్క్సిజాన్ని ఒక రూళ్ల కర్ర సిద్ధాంతంగా కాకుండా, సోషలిస్టు శిబిరం ఉన్న నాటి పరిస్థితులు -ఆ శిబిరం విచ్ఛిన్నమైన పరిస్థితులు- అమెరికన్ సామ్రాజ్య వాద తీవ్ర వ్యతిరేకత. అలాగే లాటిన్ అమెరికన్ జాతీయ సంస్కృతీ నాగరికతలు, విభిన్న భౌతిక రాజకీయ పరిస్థితు లకు అనుగుణంగా మార్క్సిజం వెలుగులో తన ప్రత్యేక తలతో తన పయనం సాగించింది. అది క్యూబా కమ్యూ నిస్టు పార్టీ నుంచి మన కమ్యూనిస్టులు వినమ్రంగా స్వీక రించదగిన పాఠం. మార్క్సిజాన్ని ఒక పిడిసూత్రంగా కాక ఆచరణకు మార్గదర్శకంగా అన్వయించుకోగలగాలి. పుచ్చ లపల్లి సుందరయ్య ఒక సందర్భంలో చెప్పినట్లు ఈ సమా జం ప్రస్తుత దశనుంచి పురోగమన దిశగా ఎంతో కొంతైనా పయనించేటట్టు కృషి చేయడం.. ఏ స్థితిలో ఉండినా కమ్యూనిస్టుల కర్తవ్యం. కనీసం సమాజం మరింత తిరోగ మనానికి దారితీయకుండా, కనీసం ఆ స్థాయిలోనైనా నిలబెట్టగలగాలి. ఇప్పుడున్న స్థితిలో వర్గపోరాట రూపం ఒక్కటే ఏకైక పోరాటరూపంగానూ, వర్గవైరుధ్యం ఒక్కటే ఏకైక వైరుధ్యంగానూ భావించి వ్యవహరించడం మన భౌతిక వాస్తవికతకు అనుగుణంగా వ్యవహరించినట్లు కాదు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్, పూలే వంటి వారి అనుయాయులను, ఇతర సామాజిక శక్తులను, వ్యక్తు లను కలుపుకుని ముందుకు సాగాలి. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక దోపిడీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్య ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్ మను గడకు మన ప్రత్యేకతలో నిర్దేశించగలవు. (వ్యాసకర్త: ఎ.పీ. విఠల్, ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు) -
దూరం 90 మైళ్లు.. వెళ్లడానికి 88 ఏళ్లు!
అట్లాంటిక్ మహాసముద్రంలోకి చొచ్చుకుపోయినట్లుండే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా, క్యూబాల మధ్య దూరం 90 మైళ్లు. ఐదున్నర దశాబ్ధాలపాటు ఉప్పూ-నిప్పులా ఉన్న ఆ రెండు దేశాలు వైరం వీడి శాంతిబాటపట్టిన నేపథ్యంలో 88 ఏళ్ల తర్వాత ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలు పునరుద్ధరించుకున్నప్పటికీ దేశాధినేతల పర్యటన వెలితి అతి త్వరలో పూడనుంది. ఆ వెలితి పూడ్చబోయేది.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. సతీమణి మిషెల్లితోకలిసి ఒబామా మార్చి 21,22తేదీల్లో క్యూబాలో పర్యటిస్తారని శుక్రవారం వైట్ హౌస్ వర్గాలు తేల్చిచెప్పాయి. ఒక అమెరికా అధ్యక్షుడు చివరిసారిగా క్యూబా వెళ్లింది 1928లో. నాటి ప్రెసిడెంట్ కెల్విన్ కూలిడ్జ్ పర్యటన తర్వాత ఆ దేశాల సంబంధాలు అంతకంతకూ దిగజారాయి. ఇరాక్, అఫ్టానిస్థాన్ ల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించడం, ఇరాన్ తో శాంతి ఒప్పందం తదితర చర్యలతో శాంతి కాముకుడిగా పేరుపొందిన ఒబామా 88 ఏళ్ల తర్వాత క్యూబాలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు కావటం ఆయనపొందిన నోబెల్ శాంతి పురస్కారానికి మరింత గౌరవాన్ని ఆపాదించినట్లవుతదని కొందరిభావన. 'ఇరుదేశాల మధ్య శాంతి, సుహృద్భావం పెంపొందించేందుకు క్యూబాకు వెళతానని 14 నెలల కిందటే చెప్పా. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత 'క్యాస్ట్రో' గడ్డలోని దౌత్యకార్యాలయంపై అమెరికా జెండా రెపరెపలాడటాన్ని చూడాలని నా మనసు ఉవ్విళూరుతోంది' అని ఒబామా గురువారం ట్విట్టర్ లో స్పందించారు. శాంతి చర్చల ప్రక్రియ మొదలైనప్పటినుంచి క్యూబాకు అమెరికా టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న ఒబామా.. ఇప్పటికీ పలు అంశాల్లో తీవ్రమైన విబేధాలున్నాయని, తన పర్యటనలో వాటిని ప్రస్తావిస్తానని, అయితే రెండు దేశాలు కలిసికట్టుగా సాగటం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తన పర్యటన తప్పక క్యూబా అభ్యున్నతికి తోడ్పడుతుందని, తద్వారా హవానా ప్రజల జీవనప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఒబామా పేర్కొన్నారు. రావుల్ క్యాస్ట్రో సహా పలువురు మంత్రులు, క్యూబన్ వాణిజ్యవేత్తలతో ఒబామా చర్చలు జరుపుతారు. అనంతరం అటునుంచే అర్జెంటీనా బయలుదేరి వెళతారు. -
అక్కడ... 56 ఏళ్ల తర్వాత!
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్... హాలీవుడ్ సూపర్హిట్ బ్లాక్బస్టర్ సిరీస్లలో ఇది ఒకటి. లేటెస్ట్గా వచ్చిన ఈ సిరీస్లోని ఏడో భాగం బ్లాక్బస్టర్ కావడంతో మొత్తం అందరి దృష్టీ తరువాయి భాగంపై పడింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈ చిత్రం విడుదలకు ముందే హాలీవుడ్ చరిత్రలో నిలిచిపోనుంది. అదెలా అంటే... ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఎనిమిదో భాగం షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూబాలో షూటింగ్ ప్రారంభించనుంది చిత్ర బృందం. అదే ఇప్పుడు విశేషమైంది. హాలీవుడ్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటివరకు తమ షూటింగ్స్ కోసం వదలని ప్రదేశం లేదు. మొత్తం ప్రపంచ దేశాలను చుట్టేసిన హాలీవుడ్ కొన్నేళ్ళుగా ఒక దేశం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఆశ్చర్యంగా ఉందా! 1960లో ‘ఎమ్బార్గో’ చిత్రం తర్వాత మళ్లీ ఏ హాలీవుడ్ చిత్రం క్యూబాలో షూటింగ్ జరుపుకోలేదు. 56 ఏళ్ల తర్వాత అక్కడ చిత్రీకరణ జరుపుకోనున్న హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8’ కావడం విశేషం. రానున్న రోజుల్లో ఈ సీక్వెల్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో! -
డబ్బు జబ్బు వైద్యానికి ‘చికిత్స’
కొత్త కోణం: గవర్నరంతటి వాడికే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇంత చేదు అనుభవం ఎదురైతే, సాధారణ పౌరుల ధన, ప్రాణాలకు హామీ ఎక్కడ? వైద్య, ఆరోగ్యరంగాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక మంచి ప్రత్యామ్నాయ విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం నరసింహన్ చేస్తారని ఆశిద్దాం. క్యూబాలో అటువంటి వినూత్న ప్రజారోగ్య విధానం అమలులో ఉంది. మన కార్పొరేట్ వైద్య రంగాన్ని దారిలో పెట్టడానికి, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి వైద్య ఆరోగ్య రంగాల్లో క్యూబా సాధించిన విజయాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలి. ‘‘రోగి నుంచి వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోకుండానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నేను ఒక చిన్న సమస్యతో ఆసుపత్రికి వెళితే ఎక్స్రే సహా నానారకాల పరీక్షలు చేశారు. ఏమీ లేదని తేల్చారు. అవసరం లేని పరీక్షలు చేస్తూ రోగులు బతికుండగానే చంపేస్తున్నారు. ఉదాహరణకు, మధుమేహం వ్యాధి లేని ఒక రోగికి శస్త్ర చికిత్స చేసే ముందు 28 పర్యాయాలు రక్తపరీక్ష చేయడం జరుగుతోంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఇక బతకడని తెలిసినా వైద్యం చేస్తున్నామంటూ రోజులు గడిపేస్తూ బిల్లులు పెంచే అధ్వాన స్థితికి కార్పొరేట్ ఆసుపత్రులు నేడు చేరాయి. పలు ఆసుపత్రులు రాజకీయ నేతలకు, వీఐపీలకు రాయితీలు ఇస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే రోగం కాదుగానీ, బిల్లులు రోగిని పూర్తిగా చంపేస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి.’’ ఇవి, ఏ విప్లవకారుడో లేక ఏ ఉద్యమకారుడో చేసిన వ్యాఖ్యలు కావు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వయంగా అన్న మాటలు. గవర్నరంతటి వాడికే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురైతే, సాధారణ పౌరుల ధన, ప్రాణాలకు హామీ ఎక్కడ? రెండు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న గవర్నర్ అత్యవసర సేవలైన వైద్య ఆరోగ్య పరిస్థితులను అర్థంచేసుకుని, బహిరంగంగా హెచ్చరించడం, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తానని ప్రకటించడం సంతోషకరం. ఈ విషయంలో గవర్నర్ వ్యాఖ్యలకులాగే ఆయన చేతలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఒకవైపు వైద్య ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే, రెండోవైపు కనీసం మందు గోలి, సూది మందు ఎరుగని ప్రజలు కోట్లలో ఉన్నారు. మొత్తం దేశం ప్రజలంతా వైద్య, ఆరోగ్యాల కోసం చేస్తున్న ఖర్చులో కేవలం 30.5 శాతం మాత్రమే మన ప్రభుత్వం భరిస్తోంది. మిగతా 69.5 శాతం ప్రజలే భరించాల్సి వస్తోంది. లాటిన్ అమెరికా దేశమైన క్యూబాలో ఇది అక్షరాలా 94.2 శాతం. అక్కడి ప్రజలు సొంతగా ఖర్చుపెట్టేది 6.8 శాతం మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2015 నివేదిక వెల్లడించింది. మన ప్రైవేటు రంగం ఎంత విచ్చలవిడిగా వైద్య వ్యాపారాన్ని సాగిస్తోందో ఈ గణాంకాలే చెబుతాయి. నరసింహన్ ఆందోళనకు పరిష్కారం లభించాలంటే ప్రత్యామ్నాయం వెతక్క తప్పదు. ప్రజలందరికీ వైద్యం, ఆరోగ్యం ఉచితంగా లభించేలా లేదా అందుబాటులో ఉండేలా చేసే వ్యవస్థల వైపు మనం దృష్టి సారించాలి. అయితే అవేమీ ఆకాశంలోంచి ఊడిపడవు. ఇప్పటికే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థల నుంచి, విధానాల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రక్షాళనే పరిష్కారం మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరి ఆలోచనలు రాజధానికి సింగపూర్లాంటి రాజధాని వైపు, మరొకరి ఆలోచనలు అమెరికా కొలమానం సుందర నగరీకరణ వైపు పరుగులు తీస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పటివరకు ఓ మంచి అనుభవం, ఓ వినూత్న నమూనా వీరికి కనిపించకపోవడం విషాదకరం. ఆరేళ్ళకుపైగా తెలుగు ప్రజలకు గవర్నర్గా ఉన్న నరసింహన్ అయినా రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్యరంగాన్ని ప్రక్షాళన చేయడానికి, ఒక మంచి ప్రత్యామ్నాయ విధానాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తే మంచిది. క్యూబాలో అటువంటి వినూత్న ప్రజారోగ్య విధానం అమలులో ఉందని డబ్ల్యూహెచ్ఓ తేల్చి చెప్పింది. కార్పొరేట్ వైద్య రంగాన్ని దారిలో పెట్టడానికి, మన వ్యవస్థను సంపూర్ణంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్యూబా ప్రజారోగ్యం ఆదర్శం వైద్య ఆరోగ్య రంగంలో క్యూబా సాధించిన ఈ విజయానికి పునాది 1959 నాటి రాజ్యాంగంలోనే ఉంది. ‘‘ఆరోగ్యం ఒక మానవ హక్కు. అందువల్ల ఉత్పత్తితో ముడిపడి ఉన్న ఆర్థిక లాభం కన్నా క్యూబా ప్రజలందరికీ ఆరోగ్యసేవలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత’’ అని అది పేర్కొంది. ఆ లక్ష్యంతో క్యూబా 1960లోనే అందుకు తగ్గ వ్యవస్థలను నెలకొల్పింది. మొదటిగా గ్రామీణ వైద్య సేవలు అనే సంస్థను స్థాపించి, ప్రజల్లో ఆరోగ్య సంబంధమైన అవగాహనను పెంపొందించడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేసింది. 1959కి ముందటి క్యూబా ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, నియంతృత్వ పాలనను సాగించాయి. ఫిడెల్ కాస్ట్రో విప్లవ ప్రభుత్వం ఆనాటి ఆరోగ్య విధానాన్ని తలకిందులు చేసి పట్టణ, గ్రామ ప్రాంతాల ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. ఐదారేళ్లలోనే ఒక్క ఆసుపత్రి కూడా లేని ఆ ప్రాంతాల్లో 53 వైద్యశాలలను స్థాపించి, 750 మంది డాక్టర్లను పర్వత ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల దగ్గరకు పంపింది. ఆరోగ్యం ప్రజలందరి హక్కుగానే గాక ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తించడం కీలకమైనది. ఆరోగ్యాన్ని వ్యక్తిగత సమస్యగాగాక, నిర్దిష్ట పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలందరి సమష్టి అవసరంగా మార్చింది. దీని ఫలితంగానే ప్రతి నిర్దిష్ట నివాస ప్రాంతానికి ఫ్యామిలీ డాక్టర్ అనే విధానం రూపొందింది. ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించడంలో ప్రజలందరినీ అందులో భాగస్వాములను చేసి, వైద్య వ్యవస్థలను అనుసంధానం చేసే ప్రక్రియకు పురికొల్పింది. ఈ పథకాన్ని మొదట లావ్టా పట్టణంలో ప్రయోగాత్మకంగా అమలు జరిపి, తదుపరి క్యూబా అంతటికీ విస్తరింపజేశారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్, ఒక నర్స్ బాధ్యత వహించే ఈ విధానాన్ని ‘డాక్టర్-నర్స్ పథక’మని పిలుస్తారు. రోగాల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టేలా వారు ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఈ 150 కుటుంబాల వారందరి ఆరోగ్య వివరాలు తెలిసిన ఈ బృందం, వారిలో ఎవరికి ఎలాంటి వైద్య అవసరం ఏర్పడ్డా వెంటనే ఆ ఇంటికి చేరుకుని, అవసరమైన చికిత్సను అందిస్తుంది. తదనంతర చికిత్స కోసం పాలీక్లినిక్కి స్వయంగా వారే తీసుకెళతారు. 1984 నాటికి 30 వేల మంది డాక్టర్లు, 32 వేల మంది నర్సులతో డాక్టర్-నర్స్ పథకం నూరు శాతం జనాభాకు అందుబాటులోకి రావడం విశేషం. 30 వేల నుంచి 60 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక పాలీక్లినిక్ను ఏర్పాటు చేస్తారు. దాదాపు 498 పాలీక్లినిక్లు విస్తృత వైద్య సేవలందిస్తున్నాయి. ఈ పాలీక్లినిక్లలో పిల్లలు, మహిళల వైద్య నిపుణులతో పాటూ ఒక జనరల్ ఫిజీషియన్ కూడా ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్-నర్స్ పథకం, పాలీక్లినిక్ల సమర్థ నిర్వహణ కోసం ప్రజాసంఘాలతో కూడిన స్వచ్ఛంద బేసిక్ వర్క్ గ్రూప్ వారానికి ఒకసారి ఫ్యామిలీ డాక్టర్లు, పాలీక్లినిక్ డాక్టర్లు, రోగులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ గ్రూప్ వీరందరి మధ్య సమన్వయాన్ని పెంపొందించి, రోగులలో అవగాహనను కల్పిస్తుంది. వైద్య విద్యార్థులు మొదటి ఏడాది నుంచే పాలీక్లినిక్లలో వైద్యసేవలనందించడంలో శిక్షణ పొందుతారు. రోగుల సమస్యల గురించిన ఈ ఆచరణాత్మక జ్ఞానం వైద్య విద్యార్థులకు అమూల్య అనుభవం అవుతుంది. ప్రజాభాగస్వామ్యంతో ప్రజారోగ్యం క్యూబా ఆరోగ్య సంరక్షణ విధానంలో ప్రజా భాగస్వామ్యం ప్రధానాంశం. స్థానిక సంస్థల పాలనలో కూడా దీనిని ప్రధాన అంశంగా చేర్చారు. స్థానిక సంస్థల సమావేశాలకు ముందు పీపుల్స్ కౌన్సిల్స్ సమావేశమై అక్కడి ఆరోగ్య సమస్యలను చర్చించి తదుపరి చర్యల కోసం ప్రతిపాదనలను స్థానిక సంస్థలకు పంపిస్తాయి. మహిళలు, కార్మికులు తదితరుల ప్రజాసంఘాలన్నీ ఈ ఆరోగ్య విధానంలో భాగస్వాములవుతాయి. క్యూబా తన దేశంలోనే కాదు, ఇతర వెనుకబడిన దేశాల ప్రజలకు కూడా వైద్య ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తన శక్తిమేర కృషి చేస్తూ, పొరుగు దేశాలకు సహకరిస్తోంది. అంతేగాక, లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్స్ స్థాపించి కొన్ని వేల మంది విదేశీ విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందించింది. 72 దేశాలకు చెందిన దాదాపు 20,500 మంది విద్యార్థులు క్యూబాలో శిక్షణ పొందారు. క్యూబా స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా అమెరికా ఆంక్షలను విధించింది. అత్యవసరమైన మందులు, వైద్య పరికరాల ఎగుమతులను కూడా నిలిపివేసింది. ఇన్ని ఒత్తిడుల మధ్య సైతం క్యూబా, అమెరికా కన్నా మిన్నగా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూబా, అమెరికాల శిశు మరణాల రేట్లే ప్రజారోగ్యంలో క్యూబా సాధించిన అసాధారణ విజయానికి అద్దం పడతాయి. అగ్రరాజ్యం అమెరికాలో శిశుమరణాల రేటు 5.74 శాతంకాగా, క్యూబాలో అది కేవలం 4.63 శాతం. ఇక మన దేశంలోనైతే పదింతలు అధికంగా 41.1 శాతం. అమెరికాతో సమానంగా 79 ఏళ్ల సగటు ఆయుర్దాయాన్ని క్యూబా సాధించగలిగింది. మన దేశానికొస్తే అది 66 ఏళ్లే. అందుబాటులో లేని ఆరోగ్య వ్యవస్థ, గగనమైపోతున్న వైద్యం భారతీయుల ఆయుర్దాయాన్ని సైతం నిర్దేశిస్తోంది. క్యూబా వైద్య ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాన్ని మార్గదర్శకంగా తీసుకోవడమే గవర్నర్ నరసింహన్ ఆందోళనకు పరిష్కారం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్: 97055 66213 -
పొడవాటి పొగచుట్ట
తిక్క లెక్క పొగచుట్టలు కొత్త కాదు. అలాగే వాటితో ‘చుట్ట’రికం కూడా. అయితే, పొగచుట్టల తయారీలో మన కంటే క్యూబాదే అగ్రస్థానం. క్యూబాలో తయారయ్యే హవానా సిగార్లు అంటే ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్లకు విపరీతమైన మక్కువ. క్యూబాలోని జోస్ క్యాసెలర్ (67) అనే సీనియర్ ‘చుట్ట’కారుడు (సిగార్ మేకర్) తన వృత్తి నైపుణ్యంతో అరుదైన ఘనత సాధించాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఇతగాడికి పొగాకుతో ‘చుట్ట’రికం ఏర్పడింది. అప్పటి నుంచి రకరకాల సిగార్లు చుడుతూనే ఉన్నాడు. వృత్తినైపుణ్యంలో తన ఘనతను ప్రపంచానికి చాటాలని సంకల్పించుకుని, నాలుగేళ్ల కిందట ఏకంగా 81.80 మీటర్ల పొడవైన చుట్టను చుట్టి పారేసి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నాడు. అయితే, జోస్ ఈ రికార్డుతో తృప్తిపడటం లేదు. ఏనాటికైనా వంద మీటర్ల చుట్టను చుట్టేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. -
54 ఏళ్ల తరువాత యూఎస్ ఎంబసీలోకి జాతీయ జెండా!
హవానా: గత కొన్ని దశాబ్దాల నుంచి అగ్రరాజ్యం అమెరికాకు పొరుగు దేశం క్యూబాతో సత్సబంధాలు లేవు. దీంతో 54 ఏళ్ల క్రితం క్యూబాలోని రాయబార కార్యాలయంలో అమెరికన్ జాతీయ జెండాను తొలగించారు. ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయంలో తొలగించబడిన ఆ దేశ జాతీయ జెండా.. ఎట్టకేలకు తిరిగి వారి రాయబార కార్యాలయంలో రెపరెపలాడింది. 1961, జనవరి 4 వ తేదీన ఇరు దేశాల మధ్య పరస్పర వైరంతో క్యూబాలోని అమెరికన్ రాయబార కార్యాలయం నుంచి జాతీయ జెండాను తొలగించారు. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు బీజం పడింది. 1945 తరువాత తొలిసారి అమెరికన్ దేశ సెక్రటరీ కెర్రీ క్యూబా దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా జాన్ కెర్రీ శుక్రవారం క్యూబాలోని అమెరికన్ రాయబార కార్యాలయంలో తమ దేశ జాతీయ జెండాను ఆవిష్కరించి మర్యాద పూర్వక వేడుకలను నిర్వహించారు. అనంతరం ప్రసంగించిన ఆమె.. ఇక నుంచి రెండు దేశాల ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రగతి పథంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తొలుత ఇంగ్లిష్ లో తరువాత స్పానిష్ లో మాట్లాడిన ఆమె.. ఇరు దేశాలు తప్పక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామన్నారు. ఇదిలాఉండగా గత 50 సంవత్సరాల నుంచి అమెరికాతో సత్సబంధాలను కొనసాగించకపోవటంతో క్యూబా ఆర్థిక పరిస్థితి తీవ్ర అవరోధంలోకి నెట్టింది. -
ఆగస్టులో క్యూబాకు జాన్ కెర్రీ
వాషింగ్టన్: క్యూబాతో సయోధ్య కుదుర్చుకునేందుకు అమెరికా సిద్ధమైంది. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్దరించడంలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వచ్చే ఆగస్టు 14న క్యూబా వెళ్లనున్నారు. అక్కడి హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పునర్ నియమిస్తారు. సోమవారం అమెరికాలో క్యూబా విదేశాంగ మంత్రి బ్రునో రడ్రిగ్వెజ్తో కెర్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యూబాతో తాము మంచి పొరుగుదేశంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. పరస్పర గౌరవంతో ఇరు దేశాల ప్రజలు జీవించాలని కోరుకుంటున్నామన్నారు. 1958 తర్వాత మొదటిసారిగా క్యూబా విదేశాంగ మంత్రితో సమావేశమైనట్లు చెప్పారు. -
చిగురించిన అమెరికా, క్యూబా స్నేహం
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు అధికారికంగా నిర్ణయించాయి. గతేడాది డిసెంబర్ 17న అమెరికా అధ్యక్షుడు ఒబామా.. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చలు జరిపారు. 1961 తర్వాత వాషింగ్టన్లోని రాయబార కార్యాలయంపై క్యూబా జెండా ఎగిరింది. దౌత్య బంధాలు మరింత మెరుగుపర్చుకునే క్రమంలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ క్యూబా విదేశాంగమంత్రి బ్రూనో రోడ్రిగుజ్తో చర్చలు జరపనున్నారు. అనంతరం ఇరువురు సంయుక్త సమావేశంలో మాట్లాడతారు. జనవరి 1, 1959: క్యూబా నియంత బాటిస్టా పారిపోవడంతో తిరుగుబాటు నేత ఫిడెల్ క్యాస్ట్రో అధికార పగ్గాలు చేపట్టారు. బాటిస్టా మద్దతుదారులపై మరణశిక్షలను అమెరికన్లు విమర్శించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. 1960: అమెరికాకు చెందిన ఆయిల్ రిఫైనరీలు, వాణిజ్యాలను క్యూబా జాతీయీకరణం చేసింది. జనవరి 1961: క్యూబా సోషలిస్టు దేశంగా క్యాస్ట్రో ప్రకటన. మరునాడే క్యాస్ట్రోను కూలదోసేందుకు అమెరికా ‘బే ఆఫ్ పిగ్స్’ కుట్ర. 1998: ఐదుగురు క్యూబా గూఢచారులను అరెస్టు చేసిన అమెరికా. 2006: అనారోగ్యానికి గురైన ఫిడెల్ క్యాస్ట్రో. అధికార పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో. డిసెంబరు 17, 2014: దౌత్య సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా, రౌల్ క్యాస్ట్రోల ప్రకటన. 2014: ఉగ్రవాద జాబితా నుంచి క్యూబాను తొలగిం చిన ఒబామా సర్కారు. జూలై 20, 2015: రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఒప్పందం. -
తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాప్తిని నిర్మూలించారు
హవానా: తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాప్తి (మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్మిషన్) ని సంపూర్ణంగా నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా క్యూబా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆదేశంలో హెచ్ఐవీ బాధిత తల్లులకు పుట్టే పిల్లలెవ్వరికీ ఆ మహమ్మారి సొకడంలేదని, ఇది అరుదైన ఘనత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. తల్లికి హెచ్ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ముందర కొద్దికాలంపాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వడంతోపాటు ప్రసవం తర్వాత పుట్టిన పాపకు కూడా తగిన మోతాదులో మెడిసిన్ వాడాల్సి ఉంటుందని తద్వారా క్యూబా వైద్యులు హెచ్ఐవీ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకున్నారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్ చెప్పారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ (దీన్ని ఏజడ్టీ అని కూడా అంటారు) అనే ఔషధాలు ప్రభావవంతగా పనిచేశాయని తెలిపారు. అమెరికా ఒత్తిళ్లతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను డబ్ల్యూహెచ్ వో వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉందని, ప్రపంచంలో ఏ బిడ్డకూ తల్లి నుంచి హెచ్ఐవీ సోకకుండా నిరోధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని క్యూబా వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షలమంది హెచ్ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చుతుండగా వారిలో 15 నుంచి 45 శాతం మందికి పుట్టే బిడ్డలు కూడా వైరస్ తోనే పురుడుపోసుకుంటున్నారు. అయితే వైద్యశాస్త్రంలో నూతన పరిశోధనల ఫలితంగా 2009 నుంచి తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. -
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
పనామా: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ప్రాంతీయ అంశాల నేపథ్యంలో తనకు క్యూబా నాయకుడు రవుల్ క్యాస్ట్రోకు మధ్య జరిగిన సమావేశం సఫలీకృతం అయిందని చెప్పారు. అర్థమంతమైన చర్చలు తమ మధ్య జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ, క్యూబాను ఒక సమస్యగా తాము భావించడం లేదని తెలిపారు. ఇరు దేశాలమధ్య ప్రస్తుతం ఎలాంటి వైరుధ్యం లేదని, ప్రచ్ఛన్న యుద్ధం ఇక ముగిసినట్లేనని తెలిపారు. క్యూబాకు ఇచ్చే హోదాపై ఇప్పటికే తాము సమీక్ష నిర్వహించామని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే జాబితానుంచి దానిని తొలగించే అంశంపై పరిశీలనలు పూర్తయ్యాయని అన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని చెప్పారు. ఆయా శాఖల నుంచి అనుమతి రాగానే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే దేశాల జాబితాలో 1982లో చేర్చారు. -
క్యూబా, అమెరికా భాయి.. భాయి!
వాషింగ్టన్: క్యూబాతో దశాబ్దాల వైరానికి ముగింపు పలికే దిశగా అమెరికా పలు నిర్ణయాలు తీసుకుంది. క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయ ఏర్పాటు, ఆ దేశంపై విధించిన వాణిజ్య, పర్యాటక ఆంక్షల సడలింపు, క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని గతంలో చేసిన ప్రకటనపై పునఃపరిశీలన.. మొదలైన కీలక దౌత్య పరమైన నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్నారు. కాలం చెల్లిన వైఖరిని పక్కనబెట్టి.. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా క్యూబాతో సంబంధాలను రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో క్యూబా పౌరుల హక్కులకు అమెరికా మద్దతుంటుందని స్పష్టం చేశారు. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కూడా తాను మాట్లాడానన్నారు. కాగా, అమెరికా నిర్ణయంపై భారత్ సహా పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. -
క్యూబా
నైసర్గిక స్వరూపం వైశాల్యం: 1,09,884 చ.కి.మీ. జనాభా: 11,271,819 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: హవానా కరెన్సీ: పెసో ప్రభుత్వం: సింగిల్ పార్టీ స్టేట్ అధికారిక భాష: స్పానిష్, మతం: క్రైస్తవులు వాతావరణం: జనవరిలో 18 నుండి 26 డిగ్రీలు, జూలైలో 24 నుండి 32 డిగ్రీలు పంటలు: చెరకు, వరి, బంగాళదుంపలు, కసావా, మొక్కజొన్న, బత్తాయి. పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తులు, గనులు, ఫుడ్ప్రాసెసింగ్, పొగాకు ఉత్పత్తులు, ఖనిజాలు, రసాయనాలు, సిమెంటు, ఎరువులు, వస్త్రపరిశ్రమ, చేపలు స్వాతంత్య్రం: నామమాత్రంగా దక్కింది 1902 మే 20న (నిజమైన స్వాతంత్య్రం 1 జనవరి 1959) సరిహద్దులు: చుట్టూ సముద్రమే. అట్లాంటిక్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సముద్రం. 1. హవానా: కరేబియన్లోని ద్వీపదేశమైన క్యూబా రాజధాని హవానా ఒక పెద్ద నగరం. ఇక్కడే సముద్ర తీరం, ఓడరేవు ఉన్నాయి. క్యూబా దేశం పైనుండి చూస్తే రొయ్యలా కనబడుతుంది. నగరంలోనూ, పరిసరాల్లోనూ చూడదగిన వింతలు ఎన్నో ఉన్నాయి. నగరంలో మూడు ఓడరేవులు ఉన్నాయి. అవి మరిమెలెనా, అటారిస్, గ్వాన బాకోవా. నగరంలోని ఓల్డ్ హవానా నగరం పర్యాటకులకు స్వర్గధామం లాంటిది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. పాత నగరాన్ని హబామా వీజా అంటారు. వివిధ ఆకృతులలో ఉన్న పాత భవనాలు, క్యాథడ్రమ్లు ఎన్నో ఉన్నాయి. ఇక మధ్య హవానాను సెంట్రోహవానా అంటారు. ఇక్కడ ఉన్న పురాతన భవనాలను జాతీయ సంపదగా ప్రకటించారు. ఇక్కడ పార్క్ సెంట్రల్ జోస్ పార్ట్ విగ్రహం, కాపిటాలియో వీధి, సిగార్ ఫ్యాక్టరీ వీధి ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే నగరంలోని లెడాడో ప్రాంతం మరో ఆకర్షణ. ఇది రాజకీయ నాయకులు, పార్టీలకు గుండె లాంటిది. ఈ ప్రాంతంలోని లారాంపా అనే ప్రదేశంలోనే విప్లవ యోధుడు చేగువేరా స్మారక స్థలం ఉంది. ప్లాజాడిలా రెవెల్యూషన్ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నగరంలో ఇంకా హవానా విశ్వవిద్యాలయం, ఫోక్సా భవనం ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు: క్యూబా దేశంలో టూరిజం ఒక పరిశ్రమగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు మూడు మిలియన్ల పర్యాటకులు క్యూబా దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. క్యూబా రాజధాని హవానా ఒక గొప్ప పర్యాటక నగరం. 2. వరడెరో ఆకర్షణలు: వరడెరో ప్రాంతం క్యూబా దేశంలో ఒక ప్రధాన పర్యాటక స్థలం. సముద్రతీరం, తెల్లటి ఇసుక బీచ్లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. 1929లో కట్టిన విల్లా క్సనాడు భవనం ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇది ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో ఉంది. సువిశాలమైన జోసోన్ పార్కును 1940లో నిర్మించారు. ఈ పార్కులో పర్యాటకులకు కావల్సిన అన్ని వసతులు ఉన్నాయి. వరడెరో మ్యూజియంలో పురాతన కాలం నాటి అద్భుత వస్తువులు ఎన్నో ఉన్నాయి. వరడెరోకు ఉత్తరాన నీటి అడుగున పార్కు ఉంది. వాటర్ డ్రైవింగ్, సముద్రపు అడుగుభాగాలను ఈ పార్కులో విహరిస్తూ దర్శించవచ్చు. 3. కామాగ్వే ప్రావిన్స్: క్యూబా దేశంలో మూడో అతిపెద్ద నగరం కామాగ్వే. ఇక్కడ 20 కిలోమీటర్ల పొడవైన సాటాలూసియా బీచ్ ఉంది. పర్యాటకులు ఈత కొట్టడానికి ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. స్కూబా డ్రైవింగ్కు ఈ బీచ్ పుట్టినిల్లు. ఇక్కడే మరో బీచ్ న్యూవిటాస్ బీచ్ కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోనే కాయోసబినాల్ కోరర్ ఐలాండ్ ఉంది. ఫ్లెమింగో పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. కామాగ్వేకు ఉత్తరంవైపు సియారాడి క్యూబిటాస్ పర్వత శ్రేణి ఉంది. ఇవన్నీ చిన్న చిన్న పర్వత శ్రేణులు. ఈ పర్వతాలలో ఎన్నో గుహలు ఉన్నాయి. 4. సాంటియాగో డి క్యూబా: ఈ నగరం 15వ శతాబ్దంలో నిర్మితమైంది. విశాలమైన కాస్టిల్లో డి సాన్ పెడ్రో డెల్ మొర్రో కోట ఉంది. ఈ కోట ఒక చిన్న కొండ మీద నిర్మించబడింది. మొదట రక్షణ కోసం ఆ తర్వాత జైలుగా ఉపయోగపడింది ఈ కోట. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ ప్రోవిన్సెయల్ బకార్డె మోరో మ్యూజియం ఉంది. ఇక్కడ చరిత్ర పూర్వపు వస్తువులు, శతాబ్దాల నాటి రాజుల దుస్తులు, ఉపయోగించిన వస్తువులు, ఎన్నో కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ మ్యూజియమ్లో ఈజిప్టు మమ్మీలు, పెరూ మమ్మీలు అమెజాన్ ప్రాంతంలో లభించిన పురాతనకాలపు మానవ పుర్రెలు ఉన్నాయి. ఈ నగరంలోనే ఇంకా కాసా డిడీగో వెలాజ్ క్వెజ్ మ్యూజియం, మ్యాస్ట్రా సెనోరా బాసిలికా చర్చి, అబెల్ సాంటా మోరియా మ్యూజియం, సిమెంటేరియో డి సాంటా ఇఫిజనియా, సెస్పడెస్ పార్కు, ప్లాజాడిలా రెవెల్యూషన్, కార్నివాల్ మ్యూజియం, క్యూర్టెల్ మోన్కాడా మ్యూజియం, ప్లాజామార్టి, విస్టాఅలెగ్రా ఇలా ఎన్నో ప్రదేశాలు, కట్టడాలను ఇక్కడ దర్శించవచ్చు. పరిపాలనా విధానం: దేశాన్ని 16 ప్రావిన్స్లుగా, ఈ ప్రావిన్స్లను తిరిగి మున్సిపాలిటీలుగా విభజించారు. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణంగా ఉండటం వల్ల, పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. దేశంలో 10 నగరాలు ఉన్నాయి. అవి - హవానా, శాంటియాగో డి క్యూబా, కామాగ్వే, హోల్గిన్, శాంటాక్లారా, గ్వాంటనామో, బయామో, విక్టోరియా డి లాస్ టు నాస్, సీన్ ఫ్యూగోస్, మాంజనిల్లో. చరిత్ర: 1492లో క్యూబా దేశాన్ని కొలంబస్ కనుగొన్నాడు. 1512లో క్యూబాను స్పెయిన్ ఆక్రమించుకుంది. 1762లో బ్రిటన్ క్యూబాను తన అధీనంలోకి తీసుకుంది. కొద్దికాలానికే క్యూబా తిరిగి స్పెయిన్ అధీనంలోకి వచ్చింది. 1902 వరకు అమెరికా క్యూబాను ఆక్రమించుకుంది. 1902 తర్వాత క్యూబా స్వతంత్రాన్ని పొందింది. 1961లో క్యూబాను కమ్యూనిస్ట్ దేశంగా ఫిడెల్ క్యాస్ట్రో ప్రకటించాడు. క్యూబాలో సగం జనాభా ఆఫ్రికా, యూరప్ దేశాల మిశ్రమమే. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా: 1950 దశకం నుండి క్యూబాలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను తీసుకొని ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం తర్వాతి రెండేళ్ళ కాలంలో ఒక విప్లవంగా మారిపోయింది. 1958 చివరలో వాళ్ళు శాంటాక్లారాను ఆక్రమించారు. 1959 జనవరిలో రాజధాని నగరానికి ప్రవేశించారు. ఆ తర్వాత మొత్తం దేశాన్ని ఆయన తన అధీనంలోకి తెచ్చుకొని క్యూబా దేశాధ్యక్షుడు అయ్యాడు. దాదాపు 50 ఏళ్లు పరిపాలించి, 2008లో రాజీనామా చేశాడు. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవవీరుడుగా గుర్తింపుపొందిన చేగువేరా 1967 అక్టోబర్ 9న మరణించాడు. ప్రజలు-సంస్కృతి: 1959 నాటి విప్లవం తర్వాత ప్రజల జీవన విధానం బాగా మారిపోయింది. మహిళలకు పురుషులతో సమానమైన అధికారం, అవకాశం దక్కాయి. చదువు, ఉద్యోగం, వ్యవసాయ పనులు, ఇల్లు - ఇలా అన్ని రంగాలలో మహిళలకు అధికారం, స్వేచ్ఛ లభించాయి. జనాభాలో 35 శాతం మంది స్పెయిన్ దేశానికి చెందినవారు. 10 శాతం మంది ఆఫ్రికన్లు, 50 శాతానికి పైగా స్పానిష్ ఆఫ్రికన్ జాతుల మిశ్రమ జనాభా ఉంది. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ళలోపు వారే ఉన్నారు. ప్రజలు స్నేహభావంతో ఉండి, సేవ చేయడానికి ముందు ఉంటారు. పండుగలు, సంగీతం, నృత్యం పట్ల మక్కువ ఎక్కువ. ప్రజలు నగరాలు, పట్టణాలలో జీవించడానికి ఇష్టపడతారు. ఆహారం: క్యూబాలో వివిధ సంస్కృతుల ప్రజలు ఉండడం వల్ల వారి ఆహార రీతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్ని ప్రాంతాలలో వరి అన్నం అధికంగా తింటారు. దీనితో పాటు బంగాళదుంప వేపుడు, టమోటా, అవకాడో, లెట్యూస్, గుమ్మడి, క్యారెట్, క్యాబేజీల సలాడ్ కానీ, సూప్ కానీ చేస్తారు. భోజనంతో పాటు బీరు గానీ, వైన్ గానీ తాగుతారు. మాంసపు వంటకాలను చేసుకుంటారు. కోడిగుడ్డు అధికంగా తింటారు. వ్యవసాయం: క్యూబాలో దాదాపు 81 వేల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. క్యూబా దేశం చెరకు, చక్కెరలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దేశంలో పొగాకు పంట కూడా విరివిగా పండుతుంది. ఒక్క పొగాకు ఉత్పత్తుల ద్వారానే సంవత్సరానికి 200 మిలియన్ల అమెరికా డాలర్ల ఆదాయం లభిస్తుంది. ద్రాక్ష ఉత్పత్తిలో క్యూబా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. వరి, బంగాళదుంపలు బాగా పండుతాయి. కసావా (ఇది మన మొరంగడ్డల (చిలగడదుంపల) మాదిరిగా ఉంటుంది) 2,60,000 ఎకరాల్లో పండిస్తారు. దాదాపు మూడు లక్షల టన్నుల కసావాను పండిస్తారు. వీటితోపాటు అరటి, మామిడి, బొప్పాయి, అనాస, అవకాడో, జామ, కొబ్బరి కూడా క్యూబాలో అధికంగా పండుతాయి. పరిశ్రమలు: క్యూబాలో ఫార్మాస్యూటికల్స్, చక్కెర పరిశ్రమ ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మందులు అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. దేశ ఆర్థికవ్యవస్థలో 37 శాతం విదేశీ మారక ద్రవ్యం వీటి ద్వారా లభిస్తుంది. ఇవిగాక ఇంకా ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమ, బూట్లు, టూత్పేస్టులు, సబ్బులు, కార్డ్బోర్డ్ బాక్సుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. -
చీకటి ఖండంలో చావుకేక
ఎబోలా సంక్షోభం వెనుక ఉన్న అసమానతలకు విరుగుడు కనిపెట్టకుండా, ఈ వైద్య ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యంకాదని మోడియన్ డల్హౌసీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నిసీమ్ మన్నాతుకారన్ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో, ఎక్కడ ‘ఎబోలా’లు జనిస్తున్నాయి? అమెరికా తన పౌరుల ఆరోగ్యం కోసం తల ఒక్కింటికి 8,362 (ఏడాదికి) డాలర్లు వెచ్చిస్తున్నది. ఆఫ్రికాలోని ఎరిత్రియా అనే దేశం ఖర్చు చేస్తున్నది కేవలం 12 డాలర్లు. ప్రపంచంలో సంపన్న దేశాల ప్రజలు కేవలం 18 శాతం. కానీ ప్రపంచంలో ఆరోగ్యం కోసం జరుగుతున్న ఖర్చులో 84 శాతం ఈ సంపన్న దేశాలలోనే జరుగుతోంది. రుగ్మత ఏదైనా దాని నివారణ కోసం, నిర్మూలన కోసం జరిపే పోరాటం ఎలా ఉండాలి? అది మానవ శరీర పటు త్వంపైన ఆధారపడి ఉంటుంది. ఆ దృఢత్వం ప్రభుత్వ ప్రజారోగ్య విధానాల అమలుపైన ఆధారపడి ఉంటుంది. అంతేగానీ బలహీనమైన శరీరంపైన ఆధారపడి వైద్యుడు తన వృత్తి కౌశలంతోనే బలమైన శరీరాన్ని సృష్టించలేడు. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరాన్ని నిర్మించడమన్నది మొత్తం సామాజికుల సమష్టి కృషి ఫలితంగా ఉండాలి. - షేగువేరా ఈ సత్యాన్ని నిరూపించగలిగేదీ, సామాజిక స్పృహతో పరిపూర్ణంగా సుసాధ్యం చేయగలిగేదీ ఒక్క సోషలిస్ట్ ఆర్థికవ్యవస్థ మాత్రమే. ఇది ఎబోలా మహమ్మా రితో రుజు వవుతోంది. కొద్దికాలం క్రితం ఆఫ్రికా ఖండం లో ప్రారంభమై, ఇతర ఖండాలను చుట్టబెట్టడానికి సమాయత్తమైన వ్యాధి ఎబోలా. ఈ వ్యాధిని అరికట్టడా నికి ఆరంభమైన కృషిలో సోషలిస్టు క్యూబా నిర్వహించిన పాత్రకి ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రశంసల వర్షం కురిపించాయి. క్యూబానే ఎందుకు ప్రశంసించవలసి వచ్చింది? పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియె ర్రాలియోన్లలో వేలాది మందికి సోకిన ఆ అంటువ్యాధిని ఒక రాక్షస వ్యాధిగా గుర్తించారు. ఇది ఆయా దేశాల ప్రజ లలో బయ టపడిన వెంటనే ఎబోలా వైరస్ సంహారానికి ఆగమేఘాల మీద క్యూబా విరుగుడు కనిపెట్టింది. అయినా డిసెంబర్కు ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి మూలం ఏది? నిజానికి ఈ వ్యాధి ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు వ్యాపించింది. ఇతర ఖండాల నుంచి ఆయా దేశాలకు రాకపోకలు సాగించే దేశాల ప్రజ లవల్ల మరికాస్త విస్తరించే అవకాశమూ లేకపోలేదని హెచ్చరికలు వెలువడుతున్నాయి. భారత్, చైనాలలో విద్య కోసం, ఉద్యోగాల కోసం వచ్చిన ఆఫ్రికన్లు వివిధ పారి శ్రామిక వాడలలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి ఆఫ్రి కా నుంచి ఆసియాకు పాకే అవకాశాలూ ఎక్కువేనని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ సమయంలో దూసుకు వచ్చినదే క్యూబా మందు. ఇప్పటికే ఎబోలా వైరస్కు 10,000 మంది వరకు బలైనారు. చడీచప్పుడు లేకుండా కాటు వేసి, 48 గంటల లోనే ప్రాణాలను తోడేసే వ్యాధి ఎబోలా. దీని వైరస్ మూలాల గురించి నలుగురూ నాలుగు రకాల కారణాలు చెబుతున్నారు. వీటికి సంబంధించి ఈ నెల రెండో తేదీన లండన్ నుంచి వెలువడిన వార్త మరీ భయానకంగా ఉంది. ఈ వైరస్ను వ్యాప్తి చేయగలిగిన జీవి గబ్బిలమని కొందరు నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఎబోలాతో పాటు, వంద రకాల వైరస్లకు గబ్బిలమే కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలలో వెల్లడైంది. వీటిలో రాబిస్, తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే క్రిములు కూడా ఉన్నాయని తేలింది. ఇన్ని ప్రమాదకర వైరస్లతో జీవించే గబ్బిలాలకు ఆఫ్రికా అడవులే నిలయాలు. ఈ విషయాల తోనే వ్యాధి నిరోధకాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు మార్గం కూడా దొరికింది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా, దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తంగా ఉండవలసిందిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మన దేశం నుంచి చాలామంది ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగిస్తున్నందున ఎబోలా వ్యాపించ డానికి అవకాశాలెక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ గుర్తించారు? 38 ఏళ్లనాడు మధ్య ఆఫ్రికాలోని కాంగో రిపబ్లిక్ (పాత జైరే)కు చెందిన ఒక నర్సుకు ప్రాణాంతక వ్యాధి ఒకటి సోకి, కొన్ని గంటలలోనే కన్నుమూసింది. అప్పుడు ఆ రోగి శరీరం నుంచి స్రవించిన రక్తం, చేసుకున్న వాంతులు, విరేచనాలను పరీక్షించినపుడు బయట పడిన వ్యాధికే ఎబోలా అని పేరు పెట్టారు. ఎబోలాలో మొత్తం 20 రకా లు ఉన్నాయని కూడా అప్పుడే కనుగొన్నారు. కాంగోలోనే ఎంబుకు అనే గ్రామంలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలను గమనించారు కాబట్టి, ఆ ఊరి పేరే పెట్టారు. తరువాత ఆ గ్రామాన్నీ, వారి సంస్కృతినీ అవమానించడం ఇష్టం లేక అక్కడికి సమీపంలోనే ప్రవహిస్తున్న ఎబోలా అనే నది పేరును ఈ వైరస్కు తగిలించారు. దీని అర్థం - నల్ల నది. పాశ్చర్ పరిశోధనా సంస్థ (ఫ్రాన్స్)కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పియరీ సురెయు ఈ పేర్లను నిర్ధారించినవారిలో ప్రముఖుడు. ఓ వ్యాధి పేరుతో ఎబోలా నది అలా ప్రపంచ ప్రజలకు పరిచయమైంది. ఇలాగే కొన్ని నదుల పేర్లు రోగాలకు ఆపాదించారు. ఎబోలాను వీటన్నిటికి మించిన ప్రాణాంతక వ్యాధిగా శాస్త్రజ్ఞులు పరిగణిస్తున్నారు. ఆధు నిక మానవుడు ఘోరమైన విపత్తును ఎదుర్కొనబోతు న్నాడని కూడా అంచనా వేస్తున్నారు. నిరంతర అప్రమత్తతే వ్యూహం ఇలాంటి మహమ్మారిని నివారించడానికి పశ్చిమాఫ్రికా దేశాలతో కలసి, చిన్న దేశమైన సోషలిస్టు క్యూబా తన సామర్థ్యానికి మించి కృషి చేస్తున్నదని ప్రపంచ సంస్థలు శ్లాఘించాయి. అక్కడి వైద్యులకూ, నిపుణులకే కాకుండా ఇతర దేశాల వైద్య సిబ్బందికి కూడా క్యూబా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నది. ప్రపంచానికి వైద్యసేవలు అందిస్తున్న బహుకొద్ది దేశాలలో క్యూబా ఒకటి అని అపోలో ఆస్పత్రు ల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి కూడా ఉదహరించారు. 1961 నుంచి ఇప్పటి వరకు 154 దేశాలకు క్యూబా ఆరోగ్య సేవకులు వెళ్లారని లాటిన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు డాక్టర్ ఫిట్జ్ రాశాడు. సామ్రాజ్య వాద పెట్టుబడిదారి పాలక వ్యవస్థలు శతాబ్దాలుగా తమ పాత వలసను దురాక్రమిస్తూ యుద్ధాల ద్వారా, వనరుల దోపిడీ ద్వారా, బానిస వ్యాపారం ద్వారా ఆ ప్రాంతాల లోని ప్రజల ప్రతిఘటనా శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. దీనితో పాటు విషక్రిముల ద్వారా, విషపూరిత రసాయ నాల ద్వారా ఆ దేశాల పంటలను జనావాస ప్రాంతాలను కకావికలు చేస్తున్నాయి. ‘ఏజెంట్ ఆరెంజ్’ అనే విష పదార్థం సాయంతో వియత్నాం మీద అమెరికా చేసిన పని ఇదే. ఆ రసాయనాన్ని వియత్నాం మీద చల్లి అమెరికా అక్కడ పదిహేనేళ్ల పాటు ఏ పంట వేయడానికి ఆస్కారం లేకుండా చేసింది. ఆఫ్రికాలోని నిరుపేద దేశాలలో ఆరో గ్య వ్యవస్థలు కుప్పకూలిపోవడం ఇలాంటి క్రమంలో జరిగిందే. ఆ దేశాలు సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధా లకూ, నిరంతర ఘర్షణలకూ సుదీర్ఘకాలం కేంద్రంగా ఉన్న వే. ఆ దేశాలలోని ఇతర వ్యవస్థలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవడం లేదా నిర్వీర్యం కావడం దీని ఫలితమే. లైబీరియా సంగతే చూద్దాం. అక్కడ 40 లక్షల జనాభాకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు కేవలం 51 మంది. సియెర్రాలియోన్లో 60 లక్షల జనాభాకు 136 మంది వైద్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు. అమెరికా అమానుషత్వం బడుగు దేశాల పంటలనీ, ప్రజారోగ్యాన్నీ దెబ్బతీసిన వల స, నయా వలస పాలక వ్యవస్థలే ఇప్పుడు ఎబోలా వంటి వ్యాధులకు గురి అవుతున్న వర్ధమాన దేశాల పౌరులను తమ దేశంలోకి అనుమతించడంలేదు. వీరి ప్రవేశం మీద ఆంక్షలు, నిషేధాలు పెట్టడానికి వెనకాడటం లేదు. థామస్ డంకన్ అనే లైబీరియా పౌరుడు అమెరికాలో అడు గుపెట్టినపుడు అతడికి ఎబోలా లక్షణాలు ఉన్నట్టు గుర్తిం చారు. దీనితో అమెరికా ప్రభుత్వం, ‘కావాలనే, ఈ వ్యాధిని అమెరికాలో వ్యాపింప చేసే ఉద్దేశంతోనే’ అతడు వచ్చినట్టు చిత్రించింది. అతడు చనిపోక ముందే క్రిమినల్ నేరాలు మోపడానికి కూడా సిద్ధమైంది. ఇదే వైఖరిని తాజాగా ఆస్ట్రేలియా అనుసరిస్తున్నది. అసమానతలే అసలు వైరస్ ఎబోలా సంక్షోభం వెనుక ఉన్న అసమానతలకు విరుగుడు కనిపెట్టకుండా, ఈ వైద్య ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరిం చడం సాధ్యంకాదని మోడియన్ డల్హౌసీ విశ్వవిద్యాల యానికి చెందిన ప్రొఫెసర్ నిసీమ్ మన్నాతుకారన్ అభి ప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో, ఎక్కడ ‘ఎబోలా’లు జనిస్తున్నాయి? అమెరికా తన పౌరుల ఆరో గ్యం కోసం తల ఒక్కింటికి 8,362 (ఏడాదికి) డాలర్లు వెచ్చిస్తున్నది. ఆఫ్రికాలోని ఎరిత్రియా అనే దేశం ఖర్చు చేస్తున్నది కేవలం 12 డాలర్లు. ప్రపంచంలో సంపన్న దేశా ల ప్రజలు కేవలం 18 శాతం. కానీ ప్రపంచంలో ఆరోగ్యం కోసం జరుగుతున్న ఖర్చులో 84 శాతం ఈ సంపన్న దేశా లలోనే జరుగుతోంది. ఇలాంటి అసమానతల వల్లనే వర్ధ మాన, బడుగు దేశాలలో ఇప్పటికీ క్షయ వ్యాధితో, ప్రసూతి సమయంలో లక్షల సంఖ్యలో మరణాలు సంభవి స్తున్నాయి. మూలిగే నక్క మీద తాడిపడినట్టు ఎబోలాలు తలెత్తేదీ ఇలాంటి చోటేనని మరచిపోరాదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఐరాసలో అమెరికాకు చుక్కెదురు
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితిలో అగ్రరాజ్యం అమెరికాకు చుక్కెదురు అయ్యింది. గత 48 ఏళ్లుగా క్యూబా దేశంపై అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ క్యూబా పెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పలు దేశాలు కూడా క్యూబాపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్మానంపై భారత కాలమాన ప్రకారం బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఓటింగ్ జరిగింది. క్యూబాకు అనుకూలంగా 188 దేశాలు ఓటు వేయగా, వ్యతిరేకంగా కేవలం రెండే ఓట్లు పడ్డాయి. అవి కూడా ఒకటి అమెరికాది కాగా మరొకటి ఇజ్రాయిల్ వేసిన ఓటు. -
ఉత్తి చావు.. వీరికి అదో తుత్తి..
ఖననం జరగాల్సింది చనిపోయినవారికి.. ఇక్కడ జరుగుతున్నది మాత్రం బతికున్న మనిషికి! అవును, ఇవి ఉత్తుత్తి అంత్యక్రియలు. క్యూబాలోని శాంటియాగో డి లాస్ వెగాస్ గ్రామ ప్రజలకు ఇదో తుత్తి. అక్కడ ఉత్సవ సీజన్కు ముగింపుగా.. పునర్జన్మకు సూచికగా.. ఫిబ్రవరి 5న ఈ విచిత్రమైన అంత్యక్రియల కార్యక్రమాన్ని జరుపుతారు. మొత్తం తతంగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపిస్తారు. వీధుల్లో ఊరేగింపు.. ‘చనిపోయిన’ వారి భార్య పాత్రధారి పడిపడి ఏడవడం.. నన్నూ ఆయనతో తీసుకుపో దేవుడా.. అంటూ శోకాలు పెట్టడం.. స్థానికులంతా మృతుడి గొప్పతనం గురించి చర్చించుకోవడం.. ఇలా ఎక్కడా తేడా లేకుండా సీన్ను రక్తికట్టిస్తారు. చివరగా.. ఖననం కోసం శవపేటికను భూమిలో తీసిన గుంతలోకి దించిన తర్వాత.. గ్రామస్తులు ‘మృతుడి’ గొంతులో కొంత రమ్ పోయగానే.. అతడు ఎంచక్కా లేచి వచ్చేస్తాడు.. దాంతో ఆల్ హ్యాపీస్.