dosa
-
బిర్యానీయే బాస్!
సాక్షి, హైదరాబాద్: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్ డిష్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్తో వార్షిక నివేదికను విడుదల చేసింది.నివేదికలోని విశేషాలు ఇవీ.. ⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది. ⇒ బ్రేక్ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తేడిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్ల కంటే దాదాపు 29% ఎక్కువ. ⇒ అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్క్రీం చార్ట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ⇒ బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు. ⇒ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడుల్స్. ⇒ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం. ⇒ ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. ⇒ బ్రేక్ఫాస్ట్గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. ⇒ బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు. ⇒ 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ⇒ చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్నైట్ ఆర్డర్లలో టాప్లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకుంది. ⇒ ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు. -
పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.doesn’t pay single rupee in income tax.but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. -
దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో
‘దోసెలందు డెస్క్టాప్ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్బాగ్ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్’ టాపిక్గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్ మెషీన్తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్తో మోహిని అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘ది డెస్క్ టాప్ దోశ’ అనే కాప్షన్స్తో ఈ వీడియోను రీపోస్ట్ చేశారు.ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్ యజమాని మెషిన్లోని ఐరన్ ప్లేట్పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్ వచ్చి రోల్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7— anand mahindra (@anandmahindra) November 14, 2024 ఇక సోషల్ మీడియావాసుల రెస్పాన్స్ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది. కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!‘ఇంతకీ ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’ అని చెబుతాడో... వేచి చూడాల్సిందే. -
'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?
ఆహారప్రియులకు దోస అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దోసల్లో ఎన్నో రకాల వెరైటీలు చూసుంటారు. ఇటీవల పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యం అంతా వెలికి తీసి మరీ డిఫరెంట్ రుచులతో ఈ దోసలను అందిస్తున్నారు. అయితే ఇలాంటి దోస గురించి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే..ఇది కర్ణాటకలోనే ఫేమస్. అంతేగాదు ఈ దోసకు ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అదెంటో చూద్దామా..!.ఈ దోసను కూడా మనం తినే సాధారణ దోస మాదిరిగానే తయారు చేస్తారు కాకపోతే అందులో వేసే దినుసుల్లోనే కొంచెం మార్పులు ఉంటాయి. దీన్ని తగినంత అటుకులు, మొంతులు తప్పనిసరిగా జోడించి తయారు చేస్తారు. అయితే మరి ఏంటి 'తుప్పా' అంటే..కర్ణాటకలో 'తుప్పా' అంటే నెయ్యి అందుకని దీన్ని తుప్పా దోస అని పిలుస్తారు. మనం Ghee Dosa దోస ఇమ్మని ఆర్డర్ చేస్తాం కదా అలాంటిదే కాకపోతే కొద్ది తేడా ఉంటుందంతే.చారిత్రక నేపథ్యం..కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం..ఈ తుప్పా దోస కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో ఉద్భవించిందని చెబుతుంటారు. చాళుక్య రాజు సోమేశ్వరుడు- III తన మానసోల్లాస పుస్తకంలో తుప్పా దోస వంటకాన్ని దోసక అని పిలుస్తారని రాశారు. క్రీస్తు శకం నుంచి తమిళనాడు ఆహార సంస్కృతిలో ఈ దోస భాగమని ఆ పుస్తకం పేర్కొంది. ఆఖరికి తమిళనాడు సంగం సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉండటం విశేషం. ఎలా చేస్తారంటే..తయారీ విధానం..ఇడ్లీ బియ్యం 2 కప్పులుపోహా(అటుకులు): 1 కప్పుఉరద్ పప్పు: ½ కప్పు ఉప్పు: 2 స్పూన్మెంతులు: ½ స్పూన్ పైన చెప్పిన పదార్థాలన్నీ సుమారు 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మొత్తగా గ్రైండ్ చేసుకుని రాత్రంతా పులియబెట్టాలినివ్వాలి. ఆ తర్వాత దోసలుగా పెనం మీద వేసి.. బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే తుప్పా దోస రెడీ..!. అయితే దీన్ని నెయ్యితో దోరగా కాలుస్తారు. ఇక 'చమ్మంతి పొడి' అంటే తమిళంలో కొబ్బరి పొడి అని అర్థం. మనం కొబ్బరి చట్నీతో తింటే వాళ్లు దీన్ని కొబ్బరి పొడితో ఇష్టంగా తింటారట.(చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..) -
దోస స్క్రాపర్ పిచ్చ పిచ్చగా వైరలవుతోంది : మీకూ కావాలా?
పెనానికి అంటుకోకుండా, పేపర్లాగా దోస వెయ్యాలంటే అంత ఆషామాషీ కాదు. మరికొంత గృహిణులకు చెయ్యితిరిగిన దోస మాస్టర్లకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా పిండి పెనం మీద,రౌండ్గా తిప్ప కాసిన్న ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి, కాస్త కాలాక దోస తిరగవెయ్యాలని చూస్తామా.. అప్పుడు ఉంటుంది అసలు కథ. ఒక్క పట్టాన రానే రాదు.. పోనీ.. ఇంకోటి.. సేమ్ సీన్ రిపీట్.. హన్నన్నా.. నీ సంగతి చూస్తా.. అని ఇంకోటి ట్రై చేస్తే.. అదీ విరిగి ముక్కలవుతుంది. View this post on Instagram A post shared by nameisshekhar4 (@nameisshekhar4) చివరికి యూ ట్యూబ్, అదీ ఇదీ వెతికి వెతికి ఉల్లిపాయ కట్ చేసి తవాకి రాసి, నీళ్లు చల్లి తుడిచి, ఇలా నానా కష్టాలు పడ్డాక మొత్తానికి దోస అయ్యిందనిపిస్తాం. ఇపుడిదంతా ఎందుకంటే.. ఈ బాధలేవీ లేకుండా, చక్కగా దోసను మడతబెట్టేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఏకంగా1.3 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. వైరల్ వీడియోలో, పెనం మీద వేసిన దోస అలా అలవోకగా తీస్తున్న స్క్రాపర్ని మనం చూడొచ్చు. ఈ అద్భుతమైన స్క్రాపర్ నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.బ్రో మసాలా దోసపై వేయడం ఇంత ఈజీనా.. సగం టైం క లిసొచ్చింది అని ఒకరు, చాలా బాగుంది. చేతులతో పనిలేకుండా పరిశుభ్రంగా ఉందిని మరొకరు వ్యాఖ్యానించారు. "బహుశా గతంలోబుల్డోజర్ డ్రైవర్’’ ఏమో,ఇన్స్టాగ్రామర్ “సిమెంట్ రోలర్” అని కొందరు అభిప్రాయ పడగా, వీటన్నింటికీ మించి ఈ మెషీన్ నాకూ కావాలి అని ఎక్కువ అంది కమెంట్ చేశారు. -
ఇవి.. పొరుగింటి దోసెలు!
వారం మెనూలో దోసె ఉండాల్సిందే... దోసె కూడా బోర్ కొట్టేస్తుంటే ఏం చేద్దాం? పక్క రాష్ట్రాల వాళ్ల వంటింట్లోకి తొంగిచూద్దాం. కేరళ వాళ్లు మనదోనెనే కొద్దిగా మార్చి ఆపం చేస్తారు. కన్నడిగులు చిరుతీయటి నీర్దోసె వేస్తారు.కన్నడ నీర్ దోసె.. కావలసినవి..బియ్యం – 2 కప్పులు;కొబ్బరి తురుము – కప్పు;ఉప్పు – చిటికెడు;నూనె – టేబుల్ స్పూన్;తయారీ..– బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టాలి.– బియ్యం, కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మిక్సీలో మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా గ్రైండ్ చేయాలి.– పిండిలో తగినంత నీటిని కలిపి గరిటె జారుడుగా ఉండాలి.– పెనం వేడి చేసి దోసె వేసి కొద్దిగా నూనె వేయాలి. రెండువైపులా కాల్చి వేడిగా వడ్డించాలి.గమనిక: కన్నడ నీర్ దోసెకు పిండిని పులియబెట్టాలిన అవసరం లేదు. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి వెంటనే దోసెలు వేసుకోవచ్చు. దీనికి సాంబార్, ఆవకాయ– పెరుగు కలిపిన రైతా మంచి కాంబినేషన్.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా – చిటికెడు.తయారీ..– బియ్యాన్ని కడిగి మంచినీటిలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.– మిక్సీలో బియ్యం, కొబ్బరి తురుము వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.– బాణలిలో నీటిని ΄ోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.– మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.– ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి.– ఉదయం ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో కలపాలి.– మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి.– ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పెనం అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.– మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.– అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.– అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.– ఇందులో నూనె వేయాల్సిన పని లేదు.– ఆపం పెనం లేక΄ోతే దోశె పెనం (ఫ్లాట్గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు. -
దోశ, ఊతప్పం మిస్సింగ్.. జొమాటోకు రూ. 15వేలు ఫైన్
జొమాటో, స్విగ్గి వంటి డెలివరీ యాప్స్ వచ్చిన తరువాత నచ్చిన ఫుడ్ బుక్ చేసుకుని, ఉన్నచోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీలలో సమస్యలు తలెత్తుతాయి. దీనికి సంస్థలు బాధ్యత వహిస్తూ.. జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది.చైనాలోని పూనమల్లి నివాసి ఆనంద్ శేఖర్ 2023 ఆగష్టు 21న జొమాటో యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ 'అక్షయ్ భవన్' నుంచి ఊతప్పం, దోశ కాంబోతో సహా ఇతర ఆహార పదార్థాలను 498 రూపాయలకు ఆర్డర్ చేసుకున్నారు. కానీ అతనికి ఇచ్చిన డెలివరీలో దోశ, ఊతప్పం మిస్ అయ్యాయి. ఇది గమనించి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించడానికి పదేపదే ప్రయత్నించాడు, కానీ సహాయం లభించలేదు.జొమాటో తాను పెట్టిన పూర్తి ఆర్డర్ అందివ్వలేదని.. నష్టపరిహారం కోరుతూ తిరువల్లూరులోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో కేసు వేశారు. దీనికి జొమాటో కూడా బాధ్యత వహిస్తుందని కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు జొమాటోకు రూ. 15000 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునిచ్చింది. -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
ప్రింటింగ్ దోశ..
కాగితంపై అక్షరాలు ప్రింట్ తీయడం చూశాం.. ఫొటోలు ప్రింట్ తీయడం చూశాం.. ఫ్లెక్సీలు ప్రింట్లు వస్తున్నాయి. ప్రింటర్లలోనూ కలర్, బ్లాక్ అండ్ వైట్, 3డీ, ఇంకా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దోశను ప్రింట్ తీయడం ఎప్పుడైనా విన్నారా.. కొత్తగా ఉంది కదూ.. నిజమే ఇటీవల కాలంలో మార్కెట్లోకి కొత్తగా దోశ మేకర్ (ప్రింటర్) అందుబాటులోకి వచి్చంది. వంటింట్లో ఇప్పటికే అనేకరకాలైన ఆధునిక వస్తువులు వినియోగిస్తున్నాం. తాజాగా చెన్నైకి చెందిన ఓ సంస్థ దోశ ప్రింటర్ను అభివృద్ధి చేసింది. ప్రింటర్కు ఒక వైపు ట్రే ఉంటుంది. అందులో పిండి వేస్తే సరిపోతుంది.నిమిషానికి ఒక దోశ వస్తుంది. దోశను ఎంత మందంతో కావాలనుకుంటే ఆ విధంగా మనం మర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ ఆటోమేటిక్ దోశ మేకర్కు 360 డిగ్రీల ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్ అమర్చి ఉంటుంది. ఈ యంత్రం 1600 వాట్ల విద్యుత్తు శక్తితో పనిచేస్తుంది. అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తుందని తయారీ సంస్థ పేర్కొంటోంది. పరిమాణం చిన్నగా ఉండటంతో వంట గదిలో ఇట్టే ఇమిడిపోతుంది. ఆటోమేటిక్ సేఫ్టీ కట్ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. 3 నిమిషాలు వినియోగించకపోతే దానంతట అదే పవర్ ఆఫ్ అయిపోతుందట. ఒక్కో ప్రింటర్ రూ.13 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. -
ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్
నెట్టింట యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వుతోంది. అందులో విదేశాల్లోని రెస్టారెంట్లో మన దక్షిణభారతదేశ బ్రేక్ఫాస్ట్ల పేర్లు, ధరలు గురించి షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్లో.. తాను అమెరికాలోని ఓ రెస్టారెంట్ మన దక్షిణ భారతదేశ అల్పహారాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. వాటి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం అన్నారు. నిజంగా ఆ పేర్లు వింటే గనుక ఖానే కా మజా ఖతం(ఇలాంటి పేర్లతో తింటే..తినడంలో ఉండే ఆనందం పోతుంది) అని క్యాప్షన్ జోడించి మరీ సదరు రెస్టారెంట్ మెనుని కూడా జత చేసి మరీ పోస్ట్ చేశారు. అందులో మన దక్షిణ భారతదేశపు అల్పాహారాల పేర్లుకు ఆ మెనులో ఉన్న ఫ్యానీ పేర్లు వరుసగా..వడకి "డంక్డ్ డోనట్ డిలైట్", ఇడ్డీకి "డంక్డ్ రైస్ కేక్ డిలైట్", దోసకి "నేక్డ్ క్రేప్" ఫ్యాన్సీ పేర్లు పెట్టి విక్రయించేస్తున్నారు. ఇక వాటి ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. ప్లేట్ దోసె ధర రూ. 1400/-, ఇడ్లీ సాంబార్ ధర రూ. 1300/-, వడ ధర రూ.1400/-గా మెనులో ధరలు ఉండటం విశేషం. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బహుశా వాళ్లు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పనివాళ్లను పెట్టుకున్నారో అందుకే కాబోలు చుక్కలు చూపించేలా ఈ ధరలు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. Who knew vada, idli, and dosa could sound so fancy? With these strange names khaane ka mazaa khatam! Agree 😂? pic.twitter.com/Px94gQGUAd— Harsh Goenka (@hvgoenka) July 2, 2024 (చదవండి: 'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!
టీఫెన్స్లో రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్న వంటకం ఏదంటే..'దోసె'. ఇప్పుడూ రకరకాల చెఫ్ల పాకశాస్త్ర నైపుణ్యం పుణ్యామా అని వైరేటీ దోసలు వచ్చేశాయి. కస్టమర్లు కూడా వెరైటీ దోసెలు ట్రై చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పుడూ రోడ్డు సైడ్ ఉండే చిన్న చిన్న స్టాల్స్లో కూడా విభిన్నమైన దోసెలు కూడా టేస్టీగా ఉండి కస్టమర్ల మనసులను దోచుకుంటున్నాయి. అయితే ఈ స్ట్రీట్ సైడ్ అమ్మే వ్యాపారస్తుల్లో కొందరూ దోసెలు వేసే విధానం చూస్తే తినాలన్న ఆలోచనకంటే..ఆ స్టైలింగ్ స్కిల్ భలే ఆకట్టుకుంటుంది. అలానే సూపర్స్టార్ రజనీ రేంజ్ స్టైల్లో దోసెల వేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు ఓ వ్యాపారి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముంబైలోని దారరలోని వీధి పక్కన ఉండే ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఆ వ్యాపారి ఏకకాలంలో ఓకేసారి నాలుగు దోసలు వేసే విధానం. అవి రెడి అయ్యాక పెనం మీద తీసే స్టైలింగ్ కోలీవుడ్ నటుడు రజనీకాంత్ స్టైల్లో ఎగరేస్తూ యమ ఫాస్ట్గా తీస్తుంటాడు. ఆ పక్కనే ఉన్న సహాయకుడు ఆయన విసిరే ప్రతి దోసెను భలే ఒడిసి పట్టుకునే విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ స్టాలల్లో విక్రేత దోసెలను వేసే విధానం, వాటిని మడత పెట్టి ప్లేట్లోకి విసిరే విధానం అచ్చం రజనీకాంత్ స్టైల్ని పోలి ఉంటుంది. ఈ వీడియోకి "ముంబై ప్రసిద్ద రజనీకాంత్ స్టైల్ దాదార్ దోసవాలా ముత్తు దాస్ కార్నర్, ముంబై స్ట్రీల్ ఫుడ్" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ దోస వాలా అతడి సహాయకుడు ఇద్దరు క్రికెట్ టీమ్లో ఉండాల్సిన వాళ్లు అంటూ వారి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఉత్తరాదిన సూర్యుడి భగభగలు..మానవ శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..) View this post on Instagram A post shared by Rekib Alam (@food.india93) -
షుగర్ కంట్రోల్ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్-రిచ్ బ్రేక్ఫాస్ట్
శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి అల్పాహారం. నిద్ర లేచిన తరువాత శరీరానికి చురుకుదనానికి, గ్లూకోజ్ను అందిస్తుంది ఇది. ఆధునిక కాలంలో ప్రొటీన్-రిచ్ఆహారంపై శ్రద్ధపెరిగింది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉదయమే ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఐకానిక్ సౌత్ ఇండియన్ టిఫిన్ గురించి తెలుసుకుందామా.ముఖ్యంగా దోసెలంటే ఇష్టముండే వారికి, ప్రొటీన్లు, ఫౌబర్ పుష్కలంగా లభించే అడై దోసె. ఇది కూడా దోసె ఫామిలీకి చెందిందే. సాధారణ దోస కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీంతో ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. అదే అడై దోసె. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీతమిళనాడులో ఎక్కువగా పాపులర్ అయిన అడై దోసె. ఇది రుచికర మైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. పైగా పులియబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.పప్పులు, బియ్యం కలయికతో, కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్ను చేర్చుకోవాలని చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తయారీ విధానంబియ్యం , పప్పు (మినప పప్పు, ఉరద్ పప్పు, శనగ పప్పు) శుభ్రంగా కడిగిన తరువాత, 4-6 గంటలు నీటిలో నానబెట్టాలి.తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటపుడు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, సోపు గింజలు, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, తరిగిన కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా గాకుండా కలుపుకోవాలి.పెనంపై రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి చక్కగాదోసెలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే అడైదోసె రడీ. దీనికి జతగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదా సాంబార్తోగానీ వేడి వేడిగా అడై దోసను ఆస్వాదించడమే. -
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్కు చెందిన చెఫ్ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మెడి టిప్స్: ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతో.. ఈ సమస్యకు చెక్!
మన జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలో ప్రతి చదరపు మిల్లీమీటరులోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియలకు తోడ్పడటంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. దీనిలో ఏదైనా తేడాలు రావడాన్ని ‘డిస్బయోసిస్’ అంటారు. ఇది మూడు విధాలుగా రావచ్చు. మొదటిది మేలు చేసే బ్యాక్టీరియా బాగా తగ్గిపోవడం, రెండోది హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య ప్రమాదకరంగా పెరగడం, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వైవిధ్యం దెబ్బతినడం. ఇలా జరిగినప్పుడు డాక్టర్లు ్రపో–బయాటిక్స్ సూచిస్తారు. ఇవి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ తాజా పెరుగు, మజ్జిగ, పులవడానికి వీలుగా ఉండే పిండితో చేసే ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతోనే ‘డిస్ బయోసిస్’ తేలిగ్గా పరిష్కారమవుతుంది. అప్పటికీ తగ్గకపోతేనే ‘ప్రో–బయాటిక్స్’ వాడాల్సి వస్తుంది. కాబట్టి ‘డిస్ బయోసిస్’ నివారణ కోసం ముందునుంచే పెరుగు, మజ్జిగ వంటివి వాడటం ఆరోగ్యానికే కాదు.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
'వరల్డ్ దోస డే'!: దోస రెసిపీని మొదటగా ఎవరు చేశారంటే..?
భారతదేశంలోని పలు బ్రేక్ఫాస్ట్ రెసిపీల్లో దోసదే అగ్రస్థానం. దీన్ని దోస లేదా దోసే/ దోసై వంటి పలు రకాల పేర్లతో పిలుస్తారు. దక్షిL భారతదేశ వంటకమైన ఈ దోసని బియ్యం, మినప్పులను నానబెట్టి రుబ్బగా వచ్చిన మిశ్రమంతో తయారు చేస్తారు. ఎలా పాపులర్ అయ్యిందో తెలియదు గానీ. ప్రపంచమంతా ఇష్టంగా తినే వంటకంగా 'దోస' మొదటి స్థానంలో ఉంది. అందువల్లో దీనికంటూ ఓ రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మార్చి 3ని ఈ వంటకానికి అంకితమిచ్చారు. అందువల్లే ప్రతి ఏడాది ఈ రోజున 'వరల్డ్ దోస డే' గా జరుపుకుంటున్నారు. ఈ వంటకం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యిన వంటకంగా నిలిచింది. ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోసకు క్యాపిటల్గా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతలా ఫేమస్ అయిన ఈ దోస వంటకం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామా!. దోస చరిత్ర.. మొదటగా తమిళనాడులో దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత క్రిస్పీగా ఉండే దోసెను కర్ణాటకలో తయారు చేయడం మొదలు పెట్టారు. ఉడిపి అనే రెస్టారెంట్ దోసెను ఇలా క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాల ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. ఈ దక్షిణ భారత వంటాకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. 1930లలో ఉడిపి హోటల్ మద్రాస్కి విస్తరించడంతో అక్కడ నుంచి ఢిల్లీకి ఇలా పాకింది. ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్లు తమ పాకనైపుణ్యానికి పదును పెట్టి మరీ రకరకాల దోసెలను తీసుకొచ్చారు. ప్రజలు వాటిని కూడా ఆస్వాదించడం విశేషం. అలా దోసెలు కాస్త..మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ వంటకం ఎలా వచ్చిందనేదనేందకు కచ్చితమైన ఆధారాలు లేవు కానీ సాహిత్య గ్రంథాల్లో వాటి ప్రస్తావన మాత్రం వచ్చింది. వాటి ఆధారంగా దోస మూలం ఆ రాష్టలేనని భావిస్తున్నారు చరిత్రకారులు. దక్షిణ భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే.. ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తూ శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయపేర్కొన్నాడు. అంతేగాదు కన్నడ సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్లు అచాయ వెల్లడించాడు. అందువల్లే ఈ దోస మూలం ఏ రాష్టం అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. "ది స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్" అనే పుస్తకంలో కర్ణాటక రాజు సోమేశ్వర III గురించి ఉంది. ఆయన తన ప్రాచీన సాహిత్య రచన మానసోల్లాసలో దోసను 'దోసకా' అని సంబోధించాడు. పైగా ఆ వంటకం ఎలా తయారు చేస్తారో కూడా వివరించాడు. ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఉద్భవించిందని ఉంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఏదీఏమైన నోరూరించే ఈ రెసిపీని అందరూ ఇష్టంగా ఆస్వాదించడం విశేషమైతే చెఫ్లు వాటి పాకనైపుణ్యంతో వెరైటీ దోసలు పరిచయం చేయంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యి, బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మంచి క్రేజ్ని దక్కించుకున్న టాప్ వంటకంగా నిలిచిపోయింది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
World Dosa Day: స్విగ్గీలో 29 మిలియన్ దోసెలు ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: అల్పాహారంలో దోసెదే అగ్రస్థానం అనేది ప్రపంచ దోస దినోత్సవ నేపథ్యంలో మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడింంది. ఏటా మార్చి 3వ తేదీన దోసె దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 లోపు ఏకంగా 29 మిలియన్ల దోసెలు డెలివరీ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ సమయంలో నిమిషానికి సగటున 122 దోసెలు ఆర్డర్ అయ్యా యి. ఇందులో బెంగళూరు టాప్లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్కు ఇష్టమైన స్నా క్–టైమ్ డిష్గా దోసె మరోసారి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్కు చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో 447 ప్లేట్ల దోసెలు ఆర్డర్ చేసి.. దేశంలోనే ఛాంపియన్గా నిలిచాడు. మరోవైపు పరాఠాలను ఎక్కువ ఇష్టపడే చండీగఢ్ వాసులు సైతం తమ ఇష్టమైన వంటకంగా దోసెను స్వీకరించడం విశేషం. రంజాన్, క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్ సమయాల్లో అత్యధికంగా ఆర్డర్లు నమోదైన రెండో వంటకంగానూ.. నవరాత్రి సీజన్లో టాప్గా దోసె నిలిచింది. వీటిల్లో క్లాసిక్ మసాల దోసె అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ప్లె యిన్, సెట్, ఉల్లిపాయ, బటర్ మసాలా ఉన్నాయి. చాక్లెట్, పావ్ బాజీ నూడుల్స్ పాలక్, షెజ్వాన్ చాప్సూయ్ స్పెషల్, దిల్ ఖుష్ దోసెలను ప్రజలు ఆస్వాదించారు. -
మిగిలిపోయిన అన్నంతో చిటికెలో దోసె వేసుకోండి..
అన్నం దోసె తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు పుల్లని పెరుగు, రవ్వ, గోధుమ పిండి– 1 కప్పు చొప్పున ఉప్పు – రుచికి సరిపడా వంట సోడా›– 1 టీ స్పూన్ నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా మిక్సీలో అన్నం, పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులో రవ్వ, గోధుమపిండి, వంట సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. -
‘ఎక్స్’లో హాట్టాపిక్గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్కి అప్పగించేయండి! -
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
వెరైటీగా బీరకాయ దోసెలు ట్రై చేయండి! టేస్ట్ అదుర్స్!
బీరకాయ దోసెలకు కావలసినవి: బియ్యం – అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) పెసలు –అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) బీరకాయ – అర కప్పు (తొక్క తీసేసి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం ముక్క – చిన్నది పచ్చిమిర్చి – 3 లేదా 4 నీళ్లు – కొద్దిగా\ పెరుగు – 2 టేబుల్ స్పూన్లు నూనె – కావాల్సినంత ఉల్లిపాయ ముక్కలు – సరిపడా తయారీ విధానం: ముందుగా బీరకాయ ముక్కలను మిక్సీ పట్టుకుని, మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసలు, బియ్యం వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడేంత ఉప్పు వేసుకుని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగు, బీరకాయ పేస్ట్ వేసుకుని మరోసారి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్ది కొద్దిగా నూనె వేసుకుని, దోసెలు వేసుకోవాలి. తర్వాత అభిరుచిని బట్టి.. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. (చదవండి: వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!) -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
దోసెలు వేసిన రాహుల్
-
కొత్తిమీరతో గ్రీన్ దోశ.. టేస్ట్తో పాటు హెల్తీ కూడా
గ్రీన్ దోశ తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; మినప పప్పు – కప్పు: మెంతులు – టీస్పూను; కొత్తిమీర – కప్పు; పుదీనా – కప్పు; కరివేపాకు – అరకప్పు; జీలకర్ర – అరటీస్పూను; వాము – చిటికెడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – నాలుగు; ఉప్పు – టీస్పూను; నూనె –పావు కప్పు. తయారీ విధానమిలా: ∙బియ్యం, మినపపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙నానాక వీటన్నింటినీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ∙సగం మెదిగిన తరువాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేయాలి ∙అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ∙చక్కగా మెదిగిన పిండిని గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి ∙కాలిన పెనంపైన పిండిని దోశలా పోసుకుని కొద్దిగా నూనె వేయాలి ∙రెండువైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ దోశ రెడీ. -
ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ తరుణంలో ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో సైంటిస్ట్ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్. దీంతో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ నివేదికలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చంద్రయాన్ -3 సక్సెస్లో ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర’ పై ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 వంటి అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఒపిక, శక్తి కావాలి. అయితే, ‘ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం ద్వారా అలసట అనే విషయాన్ని పక్కన పెట్టాం. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారు. ఎక్కువ సేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఇస్రో సైంటిస్ట్ల పనితీరు అమోఘం ఇస్రో మాజీ డైరెక్టర్ సురేంద్ర పాల్ కేవలం రూ.150 రూపాయల ఖర్చుతో ఒక సాధారణ ఎద్దుల బండిపై కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రవాణా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు భారత్తో పాటు ఇతర దేశాల్లోని సైంటిస్ట్ల కంటే ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎక్కువగా ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ చెప్పారు. బాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే? ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
టిఫిన్లో ఇడ్లీ, దోశలు తింటున్నారా? అయితే ఆ వ్యాధి బారినపడ్డట్లే!
సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి. ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా? అన్ని టిఫిన్స్తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. బ్రేక్ఫాస్ట్లో వీటిని తీసుకోండి ►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. ► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్ను తీసుకోవాలి. ►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. -ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు. -
సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!
మనసు దోచే దోసె గురించి ఎంత చెప్పినా తక్కువే. దోసె ప్రియుల కోసం సరికొత్త ‘ఫుడ్ చాలెంజ్’ ముందుకు వచ్చింది. ‘ఆరడుగుల పొడవు ఉన్న దోసెను ఒక్క సిట్టింగ్లో తినగలరా?’ అనే సవాలు విసురుతుంది ఈ ఫుడ్ చాలెంజ్. విజేత పొట్టశ్రమ వృథా పోదు. పదకొండు వేల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తారు. పాపులర్ బ్లాగర్స్ వాణి, సావిలు ‘సమ్వన్ హు కెన్ ఫినిష్ దిస్?’ ట్యాగ్తో పోస్ట్ చేసిన ‘ఫుడ్ చాలెంజ్’ 5.7 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్ ‘దోసె ఫ్యాక్టరీ’లో ఈ ఆరు అడుగుల దోసెను తయారు చేయడంతోపాటు షూట్ చేశారు. మూడు రకాల మసాలాలు, నెయ్యితో తయారు చేసిన ఈ మెగా దోసెకు సాంబార్, చట్నీ, రవ్వ కేసరి కాంబినేషన్లుగా ఉంటాయి. ‘టైమ్ లిమిట్ లేకపోతే ఈజీగా లాగించవచ్చు’ అని కొందరు నెటిజనులు స్పందించారు. (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
రెస్టారెంట్కు షాక్.. మసాలా దోసతో సాంబారు ఇవ్వలేదని..
పాట్నా: మసాలా దోసతో పాటు సాంబారు ఇవ్వనందుకు కస్టమర్కు రూ.3,500 జరిమానా చెల్లించాలని బిహార్లో ఓ హోటల్ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.140 పెట్టి కొనుక్కున్న స్పెషల్ మసాలా దోసకు సాంబార్ ఇవ్వలేదంటూ మనీశ్ గుప్తా అనే లాయర్ కమిషన్ను ఆశ్రయించాడు. పుట్టిన రోజు సందర్భంగా బక్సర్లోని నమక్ రెస్టారెంట్కు వెళ్లాడు. స్పెషల్ దోశ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి చూస్తే సాంబార్ లేదు. హోటల్కు ఇదేమిటని నిలదీస్తే, ‘రూ.140కి హోటల్ మొత్తం రాసిస్తారా?’ అంటూ ఓనర్ వెటకారం చేయడంతో అతనికి మనీశ్ లీగల్ నోటీసు పంపించాడు. స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
మురిపముగా..మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!
మొరింగా దోశ తయారీకి కావలసినవి : మునగ ఆకులు – రెండు కప్పులు ఇడ్లీ పిండి – రెండు కప్పులు నూనె – మూడు టీస్పూన్లు జీలకర్ర – అరటీస్పూను మిరియాలు – అరటీస్పూను వెల్లుల్లి రెబ్బలు – నాలుగు; ఇంగువ – చిటికెడు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: ∙బాణలిలో రెండు టీస్పూన్లు నూనె వేసి వేడెక్కనివ్వాలి. ∙కాగిన నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ∙ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న మునగ ఆకులు వేయాలి. ఆకుల్లోని నీరంతా ఇగిరిపోయాక దించేయాలి. ∙మునగ ఆకుల మిశ్రమం చల్లారాక ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకోవాలి. ∙ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ పేస్టుని వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ∙దోశపెనం వేడెక్కిన తరువాత పిండిని దోశలా పోసుకుని, టీస్పూను నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మొరింగాదోశ రెడీ. సాంబార్, కొబ్బరి చట్నీలు దీనికి మంచి కాంబినేషన్. (చదవండి: విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు..) -
ఓకైకే పాన్ దోశ వాలా!
‘ఎన్ని రకాల పాన్లు ఉన్నాయి?’ అని అడిగితే హైదరాబాద్ నుంచి అలహాబాద్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పవచ్చు. అలాగే దోశలలో కూడా మైసూర్ దోశ నుంచి రవ్వ దోశ వరకు ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. దోశ ప్లస్ పాన్ కాంబినేషన్ అనేది ఊహకు అందదు. అయితే ముంబైవాలా ఒకరు దోశకు పాన్ జత చేస్తూ తయారుచేసిన ‘పాన్ దోశ’ను చూసి నెటిజనులు ‘ఔరారా’ అంటున్నారు.వేడి వేడి దోశలో పాన్తో పాటు అంజీర్, డ్రై ఫ్రూట్స్... మొదలైనవి చేర్చాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో 1.5 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. -
హోటల్లో దోశలు వేసిన ప్రియాంక గాంధీ
-
Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక
బెంగళూరు: కర్ణాటకలో మే 10 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మైసూర్లోని ఓ హోటల్లో దోసెలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ మేరకు మైసూర్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు డీకే శివ కుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలలతో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మైసూర్లోని ప్రముఖమై పురాతన రెస్టారెంట్ అయిన హైలారీ హోటల్ని సందర్శించారు ఆమె. అనంతరం అక్కడ హోటల్ యజమానులతో కలసి ఉత్సాహంగా దోసెలు వేశారు. అంతేగాక వారితో కాసేపు ముచ్చటిస్తూ మీ వ్యాపారం నిజాయితీకి, కృషికి, మంచి ఆతిథ్యానికి మారు పేరు అంటూ ప్రశంసించారు. హోటల్ సిబ్బందితో సెల్ఫీ కూడా దిగారు. ఇక్కడ దోసెలు రుచిగా ఉన్నాయని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కూతురిని తీసుకుని అక్కడకు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మైసూరులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. బీజేపీ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. రాష్ట్రంలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రతిపక్ష నేతల సమాధులు తవ్వాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏ నాయకుడి మాటలు విని ఓటు వేయకూడదని, మనస్సాక్షిని అనుసరించి ఓటు వేయాలని సూచించారు. కాగా, 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ — Congress (@INCIndia) April 26, 2023 (చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై) -
భార్య దోసె వేయలేదనే కోపంతో..
అన్నానగర్: దోసె చేయలేదనే కోపంతో భర్త కత్తితో పొడవడంతో సోమవారం ఉదయం మహిళ మృతి చెందింది. కృష్ణగిరి జిల్లా మాత్తూరు సమీపంలోని ఎన్.మోటూరు గ్రామానికి చెందిన గణేశన్ (60) భార్య మాధమ్మాల్ (50) గత 11వ తేదీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన గణేశన్ తనకు దోసె చేయాలని భార్యను అడిగాడు. దీంతో ఆమె మూడు దోసెలు వేసి, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ అయిపోయింది. ఇంతలో గణేశన్ మరో 3 దోసెలు అడిగాడు. సిలిండర్లో గ్యాస్ అయిపోయిందని చెప్పింది. దీంతో తీవ్ర కోపంతో గణేశన్ కత్తితో మాధమ్మాల్ తల, చేయి నరికాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, చిన్నారి తానీషా(2)కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మాత్తూరు పోలీసులు గణేశన్ను అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధమ్మాన్ చికిత్స ఫలించక సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్గా ఏం చేశాడంటే!
దక్షిణాదిలో ప్రజలు తమ టిఫిన్ సెక్షన్లో ఎక్కువగా తినే వంటకాల జాబితాలలో మసాల దోస ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే దోసలందు మసాల దోస టేస్ట్ వేరయా అన్నట్లు ..దాని తిని ఆశ్వాదించాల్సిందే తప్ప మాటలతో చెప్పలేము. అంతటి ప్రాముఖ్యమున్న వంటకానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి ఆకలి వేసి ముంబైలోని కృష్ణ ఛాయా హోటల్కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాల దోస ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత వెయిటర్ తన ఆర్డర్ను తీసుకువచ్చి ఇచ్చాడు. అయితే అది చూసి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్ చేసిన మసాలా దోశను.. మసాలా విడిగా, దోశను విడిగా సర్వ్ చేశాడు ఆ వెయిటర్. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి సాంబర్, చట్నీతో దోశ తిని సరిపెట్టుకున్నాడు. మరి మిగిలిన మసాలాను ఏం చేశాడన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. తన ట్వీట్లో.. "నేను ఒక ఫుడ్ బ్లాగర్ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మసాల దోసకు బదులుగా.. దోస విడిగా, మసాలా విడివిడిగా సర్వ్ చేశారు. నేను దోసె తిన్నాను. విడిగా ఇచ్చిన మసాలాను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్లో ఉంచాను. ఆ తర్వాత రోజు దాచిన మసాలతో నా ఇంట్లో మసాల దోశ చేసుకుని తిన్నాను. టెస్ట్ ఓహోహో!" అని మసాల దోశ ఫోటోని షేర్ చేశాడు. ఆ వ్యక్తి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతని క్రియేటివికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపించారు. Main bhi food blogger. I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms — Ramki (@ramkid) March 19, 2023 -
జొన్న దోసె.. బరువు తగ్గాలనుకునే వారి కోసం..
కావలసినవి: మినప్పప్పు– కప్పు; జొన్న పిండి –3 కప్పులు ; అటుకులు– పావు కప్పు; మెంతులు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్; నూనె లేదా నెయ్యి – 4 టీ స్పూన్లు. తయారీ: మినప్పప్పు, మెంతులను కడిగి మంచినీటిలో ఐదారు గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వంపేసి మిక్సీలో వేసి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, అదే జార్లో జొన్న పిండి, నీరు వేసి బాగా కలవడం కోసం కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. దీనిని మినప్పప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి గట్టిగా మూత పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం పిండిని గరిటెతో కలిపి చూసుకుని తగినంత నీరు, ఉప్పు కలిపి దోసెలు వేసుకోవడమే. ఈ దోసెలు వేరుశనగపప్పు చట్నీ లేదా కొబ్బరి– పచ్చి శనగపప్పు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ పేషెంట్లకు మంచి ఆహారం. (క్లిక్ చేయండి: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!) -
Recipe: రొటీన్గా కాకుండా.. ఇలా ఓట్స్ మసాలా దోసెలు ట్రై చేయండి!
ఓట్స్ మసాలా దోసెలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మసాలా కర్రీ – 2 లేదా ఒకటిన్నర కప్పులు (దోసెలు పోసుకునే కాసేపు ముందు, వండి పెట్టుకోవాలి) ►బియ్యం – 4 కప్పులు ►ఓట్స్ – 2 కప్పులు ►మినప్పప్పు – 1 కప్పు ►మెంతులు – 1 టీ స్పూన్ (నానబెట్టుకున్నవి) ►ఉప్పు – సరిపడా తయారీ: ►బియ్యం, మినపప్పులను విడివిడిగా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ►ముందుగా మిక్సీలో ఓట్స్, మెంతులు, బియ్యం, మినప్పప్పు.. కలిపి పేస్ట్లా గ్రాండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►తగినంత ఉప్పు కలుపుకుని.. పెనంపై నెయ్యితో దోసెలు వేసుకోవాలి. ►ప్రతి దోసె మీద ఒక గరిటె మసాలా కర్రీని పెట్టి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Apple Egg Rings: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! Bread Garlic Soup: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా! -
గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలక్ దోసెతో
Recipes In Telugu: గర్భిణి తినే ఆహారం ప్రత్యేకంగా ఉండాలి. మామూలుగా ఎప్పుడూ తినే ఆహారం సరిపోదు. ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండాలి. అందుకే బ్రేక్ఫాస్ట్లోనే ఓట్స్, చిరుధాన్యాలు, పాలకూరలతో ఇలా హెల్దీగా ప్రయత్నించి చూడండి. ఓట్స్ పాలక్ ఊతప్పం కావలసినవి ►ఓట్స్ పొడి – కప్పు (కొంచెం రవ్వలా ఉండాలి) ►మినప పిండి – పావు కప్పు ►పచ్చిమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్లు ►పాలకూర పేస్ట్ – అర కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు ►ఉడికించిన గింజలు – ముప్పావు కప్పు (వేరుశనగ, పెసలు, శనగలు వంటివి) ►నూనె లేదా నెయ్యి– 4 టీ స్పూన్లు ►ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగినంత ►చాట్ మసాలా – టీ స్పూన్ (ఇష్టమైతేనే). తయారీ: ►ఓట్స్ పొడి, మినపపిండి, మిర్చి పేస్ట్, పాలకూర పేస్ట్, ఉప్పు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాలపాటు పక్కన ఉంచాలి. ►మినీ ఊతప్పాల పెనం (మామూలు పెనం మీద కూడా వేసుకోవచ్చు) స్టవ్ మీద పెట్టి ప్రతి గుంతలోనూ రెండు చుక్కల నెయ్యి వేసి గుంత మొత్తానికి అంటేటట్లు మునివేళ్లతో రుద్దాలి. ►పెనం వేడి అయిన తర్వాత చిన్న గరిటెతో పిండి మిశ్రమాన్ని గుంతల్లో పోయాలి. ►పిండి కాలేలోపుగా ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గింజలను వేసి మూత పెట్టి సన్న మంట మీద కాలనివ్వాలి. ►ఒకవైపు కాలిన తర్వాత స్పూన్తో జాగ్రత్తగా తిరగేసి మూత పెట్టకుండా కాలనివ్వాలి. ►రెండోవైపు కూడా కాలిన తరవాత తీసి చాట్ మసాలా చల్లి వేడిగా ఉండగానే కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో వడ్డించాలి. ►మినపపిండి లేకపోతే పావు కప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఓట్స్ పౌడర్ కలుపుకోవాలి. పాలక్ దోసె కావలసినవి : ►పాలకూర పేస్ట్ – అర కప్పు (సుమారు రెండున్నర కప్పుల పాలకూర ఆకులను రుబ్బితే అరకప్పు పేస్టు వస్తుంది) ►మినప్పప్పు – పావు కప్పు ►మెంతులు – అర టీ స్పూన్ ►గోధుమపిండి– కప్పు ►ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగనంత ►నూనె – 2 టీ స్పూన్లు. తయారీ: ►మినప్పప్పు, మెంతులను కడిగి నిండుగా నీటిని పోసి మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టాలి. ►ఆ తర్వాత తగినంత నీటిని కలుపుకుంటూ మెత్తగా రుబ్బాలి. ►ఈ పిండిలో పాలకూర పేస్ట్, గోధుమపిండి, ఉప్పు వేసి అవసరమైతే మరికొన్ని నీటిని పోసి గరిటె జారుడుగా కలిపి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ►ఆ తర్వాత పెనం వేడి చేసి దోసె పోసుకోవాలి. ►దోసె మీద నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి లేదా వెన్న వేసుకోవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: Makhana Panjiri: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ -
బంగారు దోసె @ రూ.వెయ్యి
తుమకూరు: సెట్ దోసె, నీరు దోసె, మసాల దోసె, ప్లెయిన్ దోసె ఇలా అనేక రకాల దోసెలను తినే ఉంటారు. వాటి ధర 50 నుంచి 100 మధ్య ఉంటే గొప్ప. కానీ ఇక్కడ ఎవరూ ఊహించని దోసెను అమ్ముతున్నారు. దానిని ఆరగించాలంటే రూ. వెయ్యి చెల్లించుకోవాలి. దోసెకు అంత ధర అని ఆశ్చర్యపోవద్దు, వివరాలు తెలుసుకుంటే నిజమే అని అంగీకరిస్తారేమో. ఇలా తయారవుతుంది తుమకూరు నగరంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ హోటల్లో బంగారు దోసె లభిస్తోంది. మామూలు మసాలా దోసెను చేయగానే దానిపై అతి పల్చని బంగారు కాగితాన్ని పరుస్తారు. దోసె వేడికి అది అలాగే అతుక్కుపోతుంది. దోసెతో సహా బంగారాన్ని కూడా తినేయవచ్చు. గత మూడు నెలల నుంచి ఇక్కడ బంగారు దోసెలను అమ్ముతున్నారు. ఇప్పటికి 45 దోసెలు మాత్రమే హోటల్ యజమాని కార్తీక్ మాట్లాడుతు కొన్ని సంవత్సరాల కిందట బెంగళూరులో ఒక హోటల్లో ఇలాంటి దోసెను వేశారని, అది మనసులో పెట్టుకుని తాను కూడా బంగారు దోసెకి నాంది పలికినట్లు చెప్పాడు. అప్పటి నుంచి రూ. వెయ్యి చెల్లించి 45 మంది మాత్రం ఈ ఖరీదైన దోసెల సంగతి చూశారు. కాగా, బంగారాన్ని ఆరగించడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, ఎలాంటి ఉపయోగం ఉండదని మరికొందరు తెలిపారు. ఎక్కువమంది కొనకపోయినప్పటికీ ఈ హోటల్కు వచ్చి బంగారు దోసెను చూసి ఫోటోలు వీడియోలు తీసుకోవడం పెరిగింది. (చదవండి: సాగర జలాశయంలో వింత మత్స్యం ..రెక్కలతో నిలబడే చేప ) -
మన కాఫీ, దోసెకు ఆయన కూడా ఫిదా
వైరల్: ఖరీదైన కాఫీని అంతే హంగులున్న కప్తో సిప్చేస్తూ..ఆ ఫొటోను ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేస్తే!. సోషల్ మీడియాలో బిల్డప్ రాయుళ్ల వేషాలు ఇలాగే ఉంటాయి. అయితే.. ఆ ఖరీదైన కాఫీ వెనుక ఉన్న వ్యక్తే.. సాదాసీదా వ్యవహారంతో వార్తల్లో నిలిస్తే!. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఖరీదైన కాఫీ వ్యవహారం స్టార్బక్స్ గురించి!. ప్రపంచంలోనే ఖరీదైన కాపీ దుకాణాల్లో ఒకటి. అలాంటి స్టార్బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సెయిగ్ల్ భారత్కు వచ్చారు. అంతేకాదు.. బెంగళూరులో ఓ హోటల్ను సందర్శించడమే కాదు.. అక్కడి రుచులను ఆస్వాదించారు కూడా. బెంగళూరులో చాలాకాలంగా విద్యార్థి భవన్ ఫేమస్. 1943లో ఓ చిన్ని హోటల్గా మొదలైంది అది. ఇప్పుడది బెంగళూరులో అత్యంత ఫేమస్ హోటల్లో ఒకటి. అక్కడికి విచ్చేశారు జెవ్ సెయిగ్ల్. అంతేకాదు.. ఆ హోటల్లో జనాలు ఎగబడి తినే మసాలా దోసెను, ఫిల్టర్ కాఫీని ఆస్వాదించారు కూడా. ఆపై అక్కడి గెస్ట్ బుక్లో.. తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని సియాటెల్కు మోసుకెళ్తానంటూ బుక్లో రాశారాయన. అమెరికా వ్యాపారవేత్త అయిన జెవ్ సెయిగ్ల్.. 1971లో స్టార్బక్స్ను స్థాపించిన వాళ్లలో ఒకరు. ఆపై వైఎస్ ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. 2022 గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కోసం ఆయన బెంగళూరు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మన ఫిల్టర్ కాఫీ, మసాలా దోసెలకు ఆయన ఫిదా అయ్యారు. చైనీస్, పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బానిసలవుతున్న ఈ తరం.. మన ఆహారపు అలవాట్ల వైపు మళ్లాలంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Vidyarthi Bhavan (@vidyarthibhavan) -
ఇక ఆపండి ప్లీజ్! నూడుల్స్ తినాలనే ఉత్సాహం చచ్చిపోయింది
-
Viral Video: ఇక ఆపండి ప్లీజ్! నూడుల్స్ తినాలనే ఉత్సాహం చచ్చిపోయింది
ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కడుపులో ఆకలి గంటకొట్టిన ప్రతిసారీ చూసేది దాని వంకే కదా. చాలామందికి తినడం నచ్చితే.. కొద్దిమందికి మాత్రమే వండటం ఇష్టం ఉంటుంది. ఫుడ్ మీద ఆసక్తితో నిత్యం కొత్త కొత్త వంటకాలను సృష్టిస్తుంటారు. ఏదో ఒకటి ఢిఫరెంట్గా తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.అయితే అన్ని వంటకాలు అద్భుతంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మనం చేసే వంటకం అట్టర్ప్లాప్ అవుతుంది. అచ్చం ఇలాగే ఓ ఫుడ్ బ్లాగర్ వెరైటీ వంటకంతో ముందుకొచ్చింది. అంజలి ధింగ్రా అనే యువతి దోశ, నూడుల్స్ కాంబినేషన్తో చేసిన ఫుడ్ను ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసింది. పాన్పై దోశ వేసి.. మరోపక్క కొరియన్ నూడుల్స్ను కుక్ చేసింది. తరువాత నూడుల్స్ను ముందుగా చేసిన ప్లెయిన్ దోశపై స్టఫ్ చేసింది. దాన్ని టేస్ట్ చేస్తూ వీడియోలో కనిపించింది. కొరియన్ ఫ్యూజన్ దోశ క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. అయితే ఈ కాంబినేషన్ ఫుడ్ లవర్స్ను అంతగా ఆకట్టుకోలేదు. ‘దోశ సరిగ్గా రాలేదు..లోపల వెన్న అలాగే కనిపిస్తోందని, నూడుల్స్ తినాలనే ఉత్సాహం చచ్చిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ వీడియోను ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది, ఇలాంటి డిష్ ట్రై చేయవద్దని మరికొంతమంది చెబుతున్నారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: మహిళలతో ఆడిపాడిన మంత్రి మల్లారెడ్డి -
Recipe: సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి !
బియ్యపు రవ్వ.. అటుకులతో చేసే సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో ఇంట్లో ఇలా తయారు చేసుకోండి! కావలసినవి: ►బియ్యపురవ్వ – రెండు కప్పులు ►అటుకులు – కప్పు ►పచ్చికొబ్బరి తురుము – కప్పు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – దోసె వేయించడానికి తగినంత. సూర్నాలి దోశ తయారీ ఇలా: ►బియ్యపురవ్వను శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన రవ్వలో ఉన్న నీటిని తీసేసి మిక్సీజార్లో వేయాలి. ►అటుకులను కూడా కడిగి జార్లో వేయాలి. ►వీటికి కొబ్బరి తురుముని జోడించి కొద్దిగా నీటిని కలిపి దోసెపిండిలా రుబ్బుకోవాలి. ►రుబ్బిన పిండిని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. ►మరుసటి రోజు ఉదయం ఉప్పు కలిపి దోసెలు పోసుకోవాలి. ►దోసె కాలడానికి సరిపడినంత నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సుర్నాలి దోసె రెడీ. ►ఈ దోసె ఏ చట్నీతోనైనా చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: Oats Uthappam Recipe: ఓట్స్ ఊతప్పం తయారీ విధానం ఇలా! Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! -
చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..
శ్రీకాకుళం (కంచిలి): చెన్నై–కోల్కతా జాతీయ రహదారి.. అటు తమిళనాడు నుంచి పైన పశి్చమ బెంగాల్ వరకు ఎన్నో రుచులను పరిచయం చేస్తూ ఉంటుంది. వాటిలో సిక్కోలుకూ స్థానముంది. ఈ దారిలో ఒక్కో ఊరూ దాటిన కొద్దీ ఒక్కో రుచి ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్ఛాపురం వైపుగా మీ బండి వెళ్తుంటే.. కంచిలి మండలం భైరిపురం జంక్షన్లో కమ్మటి సువాసనలతో దోసెలు మనసు దోచేలా ప్రయాణికులను పిలుస్తూ ఉంటాయి. ‘సుదర్శన్ టిఫిన్ సెంటర్’ పేరుతో ఉండే ఈ టిఫిన్ సెంటర్లో దోసె తినకపోతే హైవే జర్నీ సంపూర్ణం కానట్టే లెక్క. ఒకప్పుడు ఫైవ్స్టార్ హొటల్లో చెఫ్గా పనిచేసిన సుదర్శన్.. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. ఆ ఏముందిలే.. అన్ని ఊళ్లలోనూ ఉన్నవే కదా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. అన్ని హొటళ్లలా ఉండకపోవడమే దీని స్పెషాలిటీ. జిల్లాలో చాలా హొటళల్లో దోసెలు దొరుకుతాయి. అన్నీ కలిపి లెక్కేస్తే ఓ ఆరు రకాలు కూడా ఉండవు. కానీ సుదర్శన్ మాత్రం తన హొటల్ లో రకరకాల దోసెల రుచి చూపిస్తారు. ఇప్పుడు అదే ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతను గుర్తించిన వినియోగదారులు అటు బరంపురం, ఇచ్ఛాపురం నుంచి ఇటు కంచిలి, సోంపేటల వైపు నుంచి వచ్చి ఈ రుచుల్ని ఆస్వాదించడం నిత్యం కనిపిస్తుంది. రవ్వ దోసె, ఉల్లి దోసెతోపాటు పన్నీర్ దోసె, స్వీట్ కార్న్ దోసె, ఎగ్ ఖీమా దోసె, చికెన్ ఖీమా దోసె, సుదర్శన్ స్పెషల్ దోసెలు ఇక్కడ నోరూరిస్తాయి. రేటు కూడా మరీ ఎక్కువ కాదు. చికెన్ ఖీమా దోసె రూ.70 పెడితే వచ్చేస్తుంది. మిగతా దోసెలు కూడా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ టిఫిన్ సెంటర్ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల వాసుల మనసు కూడా దోచింది. కస్టమర్ల సంతృప్తే ముఖ్యం నా టిఫిన్ సెంటర్కు వచ్చి తినే వినియోగదారుల సంతృప్తే నాకు దీవెనలు. ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవంతో ఈ టిఫిన్ సెంటర్ను ప్రారంభించా. ఆ తరహాలో సౌకర్యాలు, రుచులతో నిర్వహించాలనే కోరికతో మాత్రమే నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష నాకు లేదు. తక్కువ ధరలకే ఇలాంటి టిఫిన్స్ను అందించి, అందరి మన్ననలు అందుకోవడం నాకు కొండంత బలాన్నిస్తుంది. – సుదర్శన్, కుక్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రుచులు అమోఘం నేతితో తయారు చేసే వివిధ రకాల దోసెలు ఇక్కడ టిఫిన్ సెంటర్లో స్పెషల్. వీటి రుచులు కూడా అమోఘంగా ఉన్నాయి. కాస్త దూరమైనా అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేస్తుంటాం. ఇక్కడ తయారు చేస్తున్న దోసెల రుచి ప్రత్యేకం. జిల్లాతోపాటు, వివిధ పట్టణాల్లో సైతం దోసెలు తిన్నా కూడా, ఇక్కడ లభ్యమయ్యేవి చాలా బాగుంటాయి. – రంగాల సుమన్, వినియోగదారుడు -
Narendra Modi: దోశ తెప్పించుకుని తిన్న మోదీ
సాక్షి, హైదరాబాద్: కార్యవర్గ భేటీ సందర్భంగా అందరికీ శాఖాహార భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వంటకాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారని.. తెలంగాణ వంటకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారని భేటీ ఫుడ్ కమిటీ చైర్మన్ చాడ సురేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ వంటకాలను వడ్డించనున్నట్టు తెలిపామని వివరించారు. దీనితో మోదీ దోశ తెప్పించుకుని తిన్నారని వెల్లడించారు. చదవండి: ('తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా') -
సెట్ దోశ కాదు.. సీటుపై దోశ
ఎండలు ఎలా మండుతున్నాయో తెలుసుగా.. అయితే.. కొందరు వామ్మో ఎండలు అని చిరాకు పడకుండా.. తమలోని క్రియేటివిటీకి ఇలా పదును పెడుతున్నారు. పెనంలా బాగా వేడెక్కిన తన స్కూటర్ సీటుపై ఓ వ్యక్తి ఇదిగో ఇలా దోశ వేసేశాడు.. ఈ వీడియోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ గొయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట హల్చల్ చేస్తోంది. పునరుత్పాదక శక్తిని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడని కొందరు వ్యాఖ్యానించగా.. ఇంధనాన్ని ఆదా చేస్తూ.. దేశంలో ధరలను తగ్గించడంలో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వానికి సాయపడుతున్నాడంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేశారు. వీడియోను చూడాలంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి.. -
వైరల్ వీడియో : సెట్ దోస కాదు.. సీటు దోస
-
ఇంతకీ ఇది ఏం దోశ.. తెలియడం లేదా?
ఇంటర్నెట్లో దీనిపై భారీ చర్చనే నడిచింది. కొందరు ఎగ్ దోశ అని చెబితే.. మరికొందరు వాళ్లమ్మ వేసే మినప్పిండి దోశ సేమ్ ఇలాగే ఉంటుందని.. కాబట్టి.. ఇది అదే అని వాదించారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ మాత్రం ఎహే.. ఇది ప్లెయిన్ దోశ అంటూ తేల్చేశారు. ఇంతకీ మీరేమంటారు? ఏం దోశ ఇది.. మసాలానా.. లేక మరేదైనానా.. సరిగ్గా తెలియడం లేదా.. టైం అప్.. నిజమేంటంటే.. అసలు ఇది దోశనే కాదు.. ఓ గ్రహం.. అది కూడా సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్దదైన బృహస్పతి(జుపిటర్). గతంలో నాసాకు చెందిన అంతరిక్ష నౌక ‘కసీని’ కక్ష్యలో తిరుగుతూ ఈ గ్రహాన్ని కింద నుంచి ఫొటో తీసింది. తాజాగా నాసా దీన్ని మళ్లీ విడుదల చేయడం.. ఈ ఫొటో దోశను పోలి ఉండటంతో ట్విట్టర్లో ‘ఇది ఏం దోశ’’ అనే చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా నెటిజన్లు సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి చేశారు. -
మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ఉదయం రామచంద్రపురంలో నడుచుకుంటూ తిరిగారు. ఖుర్ఫాన్ హోటల్ వద్ద ఆగి కష్టం సుఖం మాట్లాడారు. తానే స్వయంగా పెనం మీద దోశ వేశారు. టీ తాగుతూ అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడారు. చదవండి👉: నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు! -
ఇడ్లీ, దోశ బ్రేక్ఫాస్ట్లను ఇలా సరికొత్త రుచితో వండుకొని తింటే..
అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల్లో రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు అంతగా సహించవు. రుచి లేదని బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ, దోశల తయారీలో కొన్ని కొత్త పదార్థాలను జోడించి వండితే.. రెండు తినేవారు నాలుగు తింటారు. బ్రేక్ఫాస్ట్లను సరికొత్త రుచితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.. సొరకాయ దోశ కావలసినవి.. మీడియం సైజు సొరకాయ – ఒకటి, బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు, ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ – దోశ వేయించడానికి సరిపడా. తయారీ: ►ముందుగా సొరకాయ తొక్క తీసి శుభ్రంగా కడగాలి. తరువాత గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి. ►ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ►ఈ పేస్టుని ఒక పెద్దగిన్నెలో వేసి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి. ►ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కనపెట్టాలి. ►తరువాత వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లుకుని దోశలా పోసుకోవాలి. ►దోశను రెండువైపుల క్రిస్పీగా కాల్చితే సొరకాయ దోశ రెడీ. చదవండి: Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే! సగ్గుబియ్యం ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, ఇడ్లీ రవ్వ – కప్పు, పుల్లటి పెరుగు – రెండు కప్పులు, బేకింగ్ సోడా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు – 8 తయారీ: ►ముందుగా సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను కడగాలి. ►ఒక పెద్దగిన్నెలో సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు పేసి కలపాలి. ►ఈ మిశ్రమంలో రెండు కప్పులు నీళ్లుపోసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టాలి. ►నానిన పిండికి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ►ఇడ్లీ ప్లేటుకు కాస్త ఆయిల్ రాసి జీడిపప్పులు వేసి, వీటిపైన పిండిని వేయాలి. సిమ్లో పదిహేను నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. ఏ చట్నీతోనైనా ఈ ఇడ్లీ చాలా బావుంటుంది. -
రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు(ఫిబ్రవరి15) నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే. అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!! మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. బీట్రూట్తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
రూపాయికే గులాబీ దోశ
-
రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..?
హోటల్లో దోసె తినాలంటే రూ.20 నుంచి రూ.50లోపు వెచ్చించాలి. అయితే ఓ వృద్ధురాలు రూపాయికే దోసె విక్రయిస్తూ సామాన్యుల కడుపు నింపుతోంది. ఎర్రకారం, బొంబాయి చట్నీతో దోసె తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తనకు కూలి గిట్టుబాటు అయితే చాలు పెద్దగా లాభాపేక్ష ఏమీ లేదని చెబుతోంది. తాడిపత్రి టౌన్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. అలా దోసెలు వేసి అమ్మగా వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. 15 ఏళ్ల తరువాత బియ్యం, వంట నూనె ధరలు పెరగడంతో దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది. చాలా రుచిగా ఉంటాయి నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి సావిత్రమ్మ అవ్వ దగ్గర దోసెలు తింటున్నాను. నూనె, బియ్యం ధరలు పెరిగినప్పటికీ పేదలకు అందుబాటులో రుచిరకంగా ఆతీ్మయంగా దోసెలు అమ్ముతోంది. కాలనీలో దోసెల అవ్వ అంటే తెలియని వాళ్లు ఉండరు. – జబ్బార్ బాషా, కాల్వగడ్డ, తాడిపత్రి -
భారత్లో బిర్యానీతో పాటు ఇది కూడా చాలా ఫేమస్..?
మోమోస్ ఫుడ్ భారతదేశంలో రికార్డుల మీద రికార్డు సృష్టిస్తుంది. ఈ మోమోస్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే వంటకంగా నిలచింది. ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో విడుదల చేసిన నివేదికలో కూడా అదే విషయం వెల్లడైంది. జొమాటో నివేదిక ప్రకారం, 2021లో 1.06 కోట్లకు పైగా వినియోగదారులు ఈ మోమోలను ఆర్డర్ చేశారు. కరోనా మహమ్మారి కాలంలో కూడా మోమోస్ ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. భారత్లో బిర్యానీతో పాటు మోమోస్ కూడా చాలా ఫేమస్ ఆహారంగా నిలుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జొమాటోలో అత్యంత ఎక్కువ మంది తినే ఆహార జాబితాలో మోమోస్ అగ్రస్థానంలో ఉంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో గత ఏడాది 2021లో బిర్యానీని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. భారతదేశంలో ప్రతి సెకనికి ఒక బిర్యానీని డెలివరి చేసినట్లు కంపెనీ తెలిపింది ఆ తర్వాత 2వ స్థానంలో దోసాను 8.8 మిలియన్లకు పైగా ఆర్డర్ చేసిన వంటకంగా వెల్లడించింది. అక్టోబర్ నెలలో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జొమాటో నుంచి 10,62,710 మంది ఆన్ లైన్ ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఒక అహ్మదాబాద్ కస్టమర్ 2021లో రూ.33,000 విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. జొమాటో, స్విగ్గీలలో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారంగా బిర్యానీ నిలిచింది. (చదవండి: అద్భుతం.. మైండ్తో ట్వీట్ చేసిన తొలి వ్యక్తి!) -
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
వరంగల్ నగర ప్రజల జిహ్వచాపల్యం భలేగాఉంది. ఉదయం టిఫిన్ను ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటుండగా, అదేస్థాయిలో ఆయిల్ ఫుడ్ అయిన పూరీని కూడా అంతే ఇష్టపడుతున్నారు. మరికొందరు వడ, దోశ కూడా భుజిస్తున్నారు. ఉదయాన్నే విధులకు హాజరుకావాల్సి ఉండడంతో ఇంట్లో అల్పాహారం తయారీకి తగిన సమయం లేకపోవడంతో హోటళ్లవైపు చూస్తున్నారు. ఇంట్లోకంటే రుచిగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. ఇంటివారిని ఉదయాన్నే ఇబ్బంది పెట్టకుండా బయట టిఫిన్ చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. అదేసమయంలో కరోనా సమయం కాబట్టి హోటళ్లకంటే ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నారు. వరంగల్ నగరంలో ప్రజల అల్పాహార రుచులపై ‘సాక్షి’ సోమవారం పలుచోట్ల సర్వే నిర్వహించింది. వరంగల్, హనుమకొండలో 8 టిఫిన్ సెంటర్లలో సాక్షి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 20 ఏళ్లలోపు వారికి పూరీ అంటేనే ఇష్టం.. కాజీపేట ఏరియాలో నిట్, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ ఏరియాలోని రెండు హోటళ్లలో జరిపిన సర్వేలో యువత పూరీ ఇష్టపడుతున్నారు. ఫాతిమానగర్లోని ఓ మెస్లో నిట్ విద్యార్థులు పూరీనే అధికంగా తీసుకున్నారు. 10 నుంచి 20 ఏళ్ల వయస్సు గల 25 మందిని సర్వే చేయగా.. ఎవరు కూడా ఇడ్లీని ఇష్టపడడం లేదు. పూరీపైనే ఆసక్తి కనబరిచారు. హన్మకొండలోని మరో ప్రధాన హోటళ్లలో ఇడ్లీ 10 మంది.. పూరీ ఆరుగురు ఇష్టపడ్డారు. వీరంతా యువతే కావడం గమనార్హం. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు.. క్షణం తీరికలేని ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో బిజీ లైఫ్లో సైతం ఆహార విషయంలో కచ్చితమైన జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఉదయం తీసుకునే టిఫిన్స్పై ప్రజల అభిప్రాయాన్ని అధ్యయనం చేయగా అత్యధిక శాతం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆయిల్ఫుడ్కు దూరంగా ఉండాలనుకోవడం, సులువుగా జీర్ణం అవుతుండడం, ఆరోగ్యవంతమైన ఫుడ్ కావడమే ముఖ్య కారణం. యువత పూరీ, దోశ, వడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవీ తినడానికి రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా 15ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు హోటళ్లలో టిఫిన్స్ కోసం వచ్చారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువత ఎక్కువగా ఇడ్లీ, వడ, పూరీ, దోశను ఆర్డర్ చేశారు. 40ఏళ్ల పైపడిన వారు ఇడ్లీ ఎంచుకున్నారు. ఇందులో ఎక్కువ ఇడ్లీ, వడ కాంబినేషన్ తిన్నారు. కొంతమంది ఫేమస్ హోటల్స్ అని తెలవడంతో రుచిచూద్దామనే ఆలోచనతో వచ్చామని చెప్పగా, మరికొందరు ఫ్రెండ్స్తో టిఫిన్స్ ఆరగించామని వివరించారు. ఉదయం ఇడ్లీ, పూరీ, బొండా, వడ లాంటి టిఫిన్లను నగర వాసులు ఇష్టపడుతుండగా, సాయంత్రం ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి టిఫిన్లకు ఎక్కువగా గిరాకీ ఉంటున్నదని నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో ఒకే వెరైటీ... ఇంట్లో చేస్తే ఒకే వెరైటీ టిఫిన్ చేస్తారు. అదే హోటల్కు వెళితే ఇడ్లీ సాంబార్తో, చట్నీ, నెయ్యి, కారంతో లాగించేయొచ్చు. ఇలా ఇంట్లో కుదరదు. ఇడ్లీతోపాటు వడ, పూరీ, చక్కరపొంగలి, పెసరట్టు, దోశతోపాటు వెరైటీలు తినొచ్చు.- గాండ్ల మధు, వరంగల్ రుచికరంగా ఉంటాయంటే వచ్చా కరీమాబాద్ జంక్షన్లో టిఫిన్స్ రుచికరంగా ఉన్నాయని తెలిసి ఫెండ్స్తో కలిసి వచ్చాను. అప్పుడçప్పుడు మాత్రమే హోటల్స్లో తినడానికి ఇష్టపడతాను. - బొల్లం రాకేశ్, వరంగల్ పూరీ నా ఫేవరెట్ నేను ప్రతి రోజూ పూరీని టిఫిన్గా తింటాను, పూరీ నా ఫేవరెట్ టిఫిన్. మా ఇంట్లో చేసిన టిఫిన్ కంటే అన్నపూర్ణ హోటల్లోని పూరీ ఇష్టంగా తింటాను. స్కూల్కు వెళ్లే సమయంలో పూరీని టిఫిన్ బాక్స్లో తీసుకువెళ్లేందుకు ఇష్టపడతాను. – కట్కూరి అనుష్క, కాజీపేట ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదని నా వయస్సు 55 సంవత్సరాలు. దాదాపు 40 ఏళ్లుగా టైలర్ వృత్తిలో ఉన్నా. వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తుంటాను. నేను తీసుకునే ఆహారం ఈజీగా జీర్ణం కావాలంటే ఇడ్లీ తీసుకోవడమే మంచిది. పొద్దున్నే ఇడ్లీ కాకుండా పూరీ, వడ లాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణం కావు. ఆయిల్ఫుడ్ తిని అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడం కంటే వితౌట్ ఆయిల్తో చేసిన ఇడ్లీ తినడం ఆరోగ్యానికి మంచిదే కదా. – పొడిశెట్టి వెంకటేశ్వర్లు, టైలర్, కుమార్పల్లి సర్వే ఇలా.. వరంగల్, హనుమకొండ ఏరియాల్లో మొత్తం 8 ప్రధాన టిఫిన్ సెంటర్లలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పరిశీలన.. తీసుకున్న శాంపిల్స్ : 105 ఆన్లైన్లో.. 39 పార్సిల్ 46 హోటల్లో తిన్నవారు 128 ఇడ్లీ : 19 పూరీ : 12 వడ : 10 దోశ, ఇతరాలు : 14 ఇడ్లీ : 10 పూరీ : 19 వడ : 04 దోశ, ఇతరాలు : 17 చదవండి: అందరి చూపు చిరుధాన్యాలపైనే.. కారణం ఏంటంటే! -
చికెన్ దోశ.. ఇలా వేసేద్దాం!
కావలసినవి: దోశ పిండి, చికెన్ ముక్కలు– 200గ్రాములు, కరివేపాకు– రెండు రెమ్మలు, ఉల్లిపాయ–ఒకటి, జీలకర్ర– అరటేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు–టేబుల్ స్పూను, సన్నగా తరిగిన పచ్చి మిర్చి– ఒకటి, మిరియాలపొడి– టేబుల్ స్పూను, కారం –అరటేబుల్ స్పూను, పసుపు –అరటేబుల్ స్పూన్, గరం మసాల–టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు–టేబుల్ స్పూను, టమోటా ప్యూరీ– టేబుల్ స్పూను, నెయ్యి–రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, ఆయిల్–తగినంత. తయారీ: ► స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ వేసి కలపాలి ► ఇవన్నీ వేగి కాస్త ఆయిల్ పైకి తేలిన తరువాత గరం మసాల, కారం, కొత్తమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలు వేగనివ్వాలి ∙వేగాక అరకప్పు నీళ్లు పోసి చికెన్ ముక్కలు వేసి పదిని నిమిషాలపాటు ఉడకనివ్వాలి. చికెన్లో నీళ్లన్నీ అయిపోయి డ్రైగా మారిన తరువాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టాలి దోశ వేసే ప్యాన్ పెట్టి దోశను పలుచగా వేయాలి. దాని మీద చికెన్ మిశ్రమం, నెయ్యి వేసి దోశంతా పరిచేలా రాయాలి. తరువాత దోశను రోల్ చేసి ఐదు నిమిషాలు కాలనిస్తే క్రిస్పి చికెన్ దోశ రెడీ అయినట్లే. -
నాన్న కోసం దోశ వేసిన అల్లు అర్హ..
-
గాల్లో ఎగిరే దోశలు.. వీడియో వైరల్
ముంబై : అందరిలా రెగ్యులర్గా దోశలు వేస్తే స్పెషల్ ఏముంది అనుకున్నాడేమో ఏకంగా గాల్లోనే కస్టమర్ ప్టేట్లలోకి సర్వ్ చేస్తున్నాడు ముంబైకి చెందిన వ్యక్తి. మంగల్దాస్ మార్కెట్లోని శ్రీ బాలాజీ దోశ సెంటర్లో దోశలను గాల్లో చాలా ఎత్తు నుంచి తిన్నగా ప్లేట్లోకి వచ్చేలా సర్వ్ చేస్తారు. దీనికి సంబంధించిన వీడియోను 'స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్' అనే ఫేస్బుక్ పేజీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. వీడియో అప్లోడ్ చేసిన వారం రోజుల్లోనే ఏకంగా 8.44 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో దోశలు వేసే వ్యక్తితో పాటు అక్కడి దోశలు సైతం పాపులర్ అయ్యాయి. ఎగిరే దోశలు నెటిజన్లను విపరీతంగా ఆకర్సిస్తున్నాయి. గంటల్లోనే లైకులు, షేర్ చేస్తూ ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 1.3 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. అమేజింగ్ టాలెంట్ అంటూ నెటిజన్లు అతన్ని పొగడ్తలతో ముంచెతుతున్నారు. అమేజింగ్ టాలెంట్ అంటూ ఓ వర్గం అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరేమో విమర్శిస్తున్నారు. దోసలని అలా గాల్లోకి విసిరేయడం వల్ల ఆహారం పట్ల అది అగౌరవం చూపించినట్లు అవుతుందని, అంతేకాకుండా ఫుడ్తో ఆడుకోవడం చెత్త మార్కెటింగ్ స్టంట్ అని తిట్టి పోస్తున్నారు. చదవండి : (వైరల్.. పాలు అమ్మడానికి హెలికాప్టర్ కొనేశాడు) (కొత్త టిక్టాక్ ఛాలెంజ్: తోలు పీకేసుకుంటున్నారు!) -
ప్రియురాలికి దోశ ఆర్డర్: అడ్డంగా దొరికిన భర్త
లక్నో: కట్టుకున్న భర్త పరాయి ఆడదాన్ని చూస్తే కాళికా అవతారం ఎత్తుకుంది ఇల్లాలు. అలాంటిది ఏకంగా ప్రియురాలితో కలిసి చాటుగా టిఫినీలు తినిపించుకుంటుంటే ఊరుకుంటుందా? శివాలెత్తిపోతుంది. ఇదిగో ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ కూడా తన భర్త వేరే మహిళతో కలిసి ఉండటం చూసి వారిని పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని బాందాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇదివరకే పెళ్లైంది. ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయిన అతడు తన ప్రియురాలిని వెంటేసుకుని గుడికి వెళ్లాడు. (చదవండి: ఘోర విషాదం : పొగమంచు ఎంత పని చేసింది!) కానీ ఆలయంలోకి వెళ్లకుండా కారులో కూర్చొని దోశ ఆర్డర్ చేశాడు. వేడి వేడి దోశ వచ్చేలోపే నిప్పులు చెరుగుతూ అతడి భార్య కళ్ల ముందు ప్రత్యక్షమైంది. భర్త నిర్వాకం తెలిసి తన సోదరుడిని వెంటేసుకుని మరీ రంగంలోకి దిగిన ఆమె వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. "నేనుండగా నీకు ఇంకొకరు కావాల్సి వచ్చిందా?, ఇలా ఎందరితో తిరుగుతావు?' అంటూ భర్తకు చీవాట్లు పెడుతూ ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లింది. ఇదేమీ మొదటిసారి కాదని, తన భర్త చాలామంది అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బోరుమంది. అయితే పోలీసులు మాత్రం అతడిని హెచ్చరించి వదిలేశారు. (చదవండి: ‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’) -
చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
ఏం తిందాం? రెస్టారెంట్కు వెళ్లినా... ఇంటికి పార్శిల్ తెప్పించుకున్నా వచ్చే మొదటి ప్రశ్న. అడగడం పూర్తయిందో లేదో... సమాధానం వచ్చేస్తుంది. బిర్యానీ... అదీ చికెన్ బిర్యానీ. బిర్యానీకి హైదరాబాద్ ఎప్పుటినుంచో ఫేమస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. మనోళ్లు చికెన్ బిర్యానీ అంటే చాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. భారతీయులకు చికెన్ బిర్యానీయే అత్యంత ప్రీతిపాత్రమైన డిష్ అని మరోసారి రుజువైంది. అంతేకాకుండా నాన్వెజ్, వెజ్ అనే తేడాలు లేకుండా 2020లో మనదేశంలో ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువగా బిర్యానీ పార్శిల్ ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం ఆర్డర్లలో... అత్యధికంగా ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. దేశంలో 2020 జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చిన లక్షలాది ఆర్డర్లను ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’విశ్లేషించింది. స్విగ్గీ విడుదల చేసిన ఐదో ఎడిషన్ స్టాట్‘ఈట్’స్టిక్స్ రిపోర్ట్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్ హెల్తీఫుడ్కు మెట్రోల మొగ్గు: హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల కోసం మొగ్గుచూపుతున్నట్టు తేలింది. సూపర్ గ్రెయిన్స్ ఆధారిత ఆహారాన్ని కోరే ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది 127 శాతం పెరిగింది. శాకాహార పదార్థాల ఆర్డర్లు 50 శాతం, అధికప్రొటీన్ ఫుడ్ ఆర్డర్లు 49 శాతం పెరిగాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవడం, మధ్యాహ్నభోజనం ఓ మోస్తరుగా, రాత్రిపూట మితంగా తినడమనేది పాటించదగ్గ ఆరోగ్యసూత్రం. మెట్రోల్లో దీన్ని జనం ఆచరిస్తున్నారని తేలింది. సగటున 427 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్లో, 350 కేలరీల ఫుడ్డును లంచ్కు, సగటున 342 కేలరీలనిచ్చే ఆహారాన్ని డిన్నర్లో తీసుకుంటున్నారని తమ ఆర్డర్లను బట్టి స్విగ్గీ విశ్లేషించింది. హైఫైబర్ ఇడ్లీ, హైప్రోటీన్ కిచ్డీ, కొవ్వుతక్కువుండే సలాడ్లు, శాండ్విచెస్, గ్లూటెన్ రహిత ఐస్క్రీమ్లను ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ఎక్కువ తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్కూ డిమాండే.. పానీపూరి, ఇతర స్ట్రీట్ఫుడ్ను సైతం వినియోగదారులు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 2 లక్షలకు పైగా పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేశారు. పీఎం స్వనిధి స్కీంతో భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని 125 నగరాల్లోని 36 వేల వీధివ్యాపారుల ద్వారా మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్ రకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ ప్రకటించింది. ► ఈ ఏడాది నమోదైన 3 లక్షల మంది కొత్త స్విగ్గీ వినియోగదారుల మొట్టమొదటి ఆర్డర్ చికెన్ బిర్యానీయే. ► ఈ ఏడాది 1 వెజ్బిర్యానీకి 6 చికెన్ బిర్యానీ నిష్పత్తిలో ఆర్డర్లు వచ్చాయి ► లాక్డౌన్ మొదలు ఇప్పటివరకు పానీపూరీల కోసం 2 లక్షల ఆర్డర్ చేశారు ► స్విగ్గీ ద్వారా ఇంట్లో వండుకోవడానికి తెప్పించుకునే మాంసాహారంలోనూ చికెన్దే అగ్రస్థానం. 6 లక్షల కేజీల చికెన్ను డెలివరీ చేశారు. తర్వాతి స్థానంలో చేపలు నిలిచాయి. ► మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో బెంగళూరుది మొదటిస్థానం. ► ఈ ఏడాది ‘లాక్డౌన్ బర్త్డేస్’సెలబ్రేషన్స్ కోసం 6 లక్షల కేక్లు డెలివరీ అయ్యాయి. ► స్విగ్గీ డెలివరీ స్టాఫ్కు భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు వినియోగదారులు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్పులిచ్చారు . హైదరాబాద్ అభి‘రుచు’లు 1) చికెన్ బిర్యానీ 2) ఇడ్లీ 3) మసాలా దోశ 4) చికెన్ 65 5) పన్నీర్ బటర్ మసాలా 6) వడ 7) మటన్ బిర్యానీ 8) వెజ్ బిర్యానీ ఆర్డర్లలో టాప్–5 నగరాలు 1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్ 5) ఢిల్లీ -
బెడిసి కొట్టిన పాస్తా దోశ.. తప్పక చూడాల్సిందే
ప్రతిసారి ఒకే రకమైన వంటకాలను తిని బోర్ అనిపించినవారు అప్పుడప్పుడు కొత్తగా రకరకాల వంటకాలను పృష్టిస్తుంటారు. ఏవేవో పదార్థాలను కలిపి వినూత్నంగా తయారు చేయాలి అనుకుంటారు. అయితే ఇవి కొన్నిసార్లు అవి సానుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి. అచ్చం అలాగే తమిళానాడులోని ఓ వ్యక్తికి కొత్తగా ఏదో తినాలనిపించినట్టుంది. వెంటనే రెడ్ సాస్ పాస్తా దోశ’ అనే పేరుతో ఓ విచిత్రమైన దోశను వేశాడు. అంతేగాక దీనిని వీడియో తీసీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. (స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!) దాదాపు నిమిషం నిడివిగల ఈ వీడియోలో దోశ పెనంపై పిండి వేసి దానిపై ఉల్లిపాయ. టమాట, క్యాప్సికమ్, కెచప్, సాస్, మసాలాలు, వెన్న వేసి వాటిని, దోశ మొత్తం సమానంగా కలిపాడు. ఆ తర్వాత దానిపై ఉడికించిన పాస్తా, కొంత క్రీమ్ వేసి మళ్లీ మిక్స్ చేశాడు. చివరగా దోశపై ఎక్కవ మొత్తంలో చీజ్ను తురిమి ముక్కలుగా చేసి ఇచ్చారు. అయితే ఈ దోశ నెటిజన్లకు రుచింపలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ వంటకాన్ని చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ‘ఇది అసహ్యంగా ఉంది. ఇందులో టన్నుల కొద్దీ జున్ను, వెన్న, నూనె ఉంది. దీన్ని చూస్తే ఆకలి చచ్చిపోతుంది. ప్లీజ్ ఇంకోసారి ఇలా చేయకండి’. అంటూ కామెంట్ చేస్తున్నారు. (నోరూరించే ఎగ్ దోశ వేసిన హీరోయిన్) Tamil Friend jab iss type ka dosa Dekhta bahut Gaaliya deta hai 😹😹 pic.twitter.com/CVNPEHutTz — RDX 🚩🚩 (@India_Maharaj) August 22, 2020 -
కోవిడ్ పరిస్థితులు దోసెలు వేయడం నేర్పాయి
సాక్షి, కర్నూలు: ఉదయం టిఫిన్లో దోసెకు ప్రత్యేక స్థానం ఉంది. హోటళ్లలో పలు రుచుల్లో లభించే దోసెలకు ఎన్నో పేర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆనియన్ దోసె మొదలు చైనీస్, ఆమెరికా, కోన్, 70 ఎం.ఎం, ఎమ్మెల్యే దోసె ఇలా.. ఎన్నో వెరైటీల్లో లభిస్తుంది. ఎప్పుడైనా ఎమ్మెల్యే దోసె తిన్నారో లేదో గాని.. ఒక ఎమ్మెల్యేనే దోసె వేసిన సంగతి ఇది. కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇందుకు ప్రజా ప్రతినిధులు అతీతులు కాలేదు. ఎప్పుడూ వంట, వార్పు ఎరుగని ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్రెడ్డి కూడ గరిట పట్టాల్సి వచ్చింది. నియోజక వర్గం అభివృద్ధి పనుల విషయంపై ఆయన ఇటీవల అమరావతికి వెళ్లారు. అయితే కోవిడ్ 19 కారణంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న ఆయన వంట చేసుకోడానికి స్వయంగా గరిట చేపట్టారు. (‘వర్క్ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్!) ఉదయం దోసలు చేసుకుని, ఇందులోకి బంగాళ దుంపకూర వండారు. మధ్యాహ్నం వంట చేసుకున్నారు. ఈ విషయం తెలిసి వంట ఎప్పుడు నేర్చుకున్నారని ‘సాక్షి’ అడుగగా అవసరం అన్ని నేర్పుతుందంటూ చమత్కరించారు. కోవిడ్ పరిస్థితిలో హోటళ్లు మూత పడ్డాయని, రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో అల్పాహారం, భోజనం ఎంత వరకు సురక్షితమో తెలియని పరిస్థితిలో వంట చేసుకోవడమే మేలని భావించి అమరావతిలో ఉన్నన్ని రోజులు వంట చేసుకుంటానని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు అవసరం అయిన జాగ్రతలు తీసుకోవాలని కోరారు. ఏమవుతుందిలే అని మొండిగా వెళ్లితే ఒక్కో సారి అదే ప్రమాదానికి చేరువ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. -
అంతరిక్షంలో దోశ
వాషింగ్టన్ : మొన్నటికి మొన్న సూర్యుడి వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగా అబ్బుపరిచిందో తెలిసిన విషయమే. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించిందీ నాసా. ఇది చూసిన నెటిజన్లు సూర్యుడికి నానాటికీ ఫైర్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అంటూ చమత్కరించారు. ఈసారి బృహస్పతి ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కానీ ఆ గ్రహాన్ని బృహస్పతి అని పిలవడానికి చాలామందికి మనసొప్పడం లేదు. అందుకు బదులుగా దోశ, మసాలా దోశ అంటూ రకరకాల దోశ పేర్లతో పిలుచుకుంటున్నారు. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) దీనికి కారణం అది దోశ ఆకృతిలో కనిపించడమే. తొలిసారిగా ఈ ఫొటో చూసినవారెవరైనా అది దోశ అని భ్రమించి తప్పులో కాలేస్తారు. 2000వ సంవత్సరంలో నాసా తీసిన బృహస్పతి ఫొటో ప్రస్తుతం ఆహారప్రియులను తెగ ఆకర్షిస్తోంది. "ఇది ఖచ్చితంగా దోశలాగే కనిపిస్తుంది అనేవాళ్లు చేతులెత్తండి" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "లేదు లేదు, నోరూరిస్తున్న దోశను పట్టుకుని బృహస్పతి అంటారేమిటి? అది అబద్ధం" అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు. (వైరల్గా నాసా విడుదల చేసిన సూర్యుడి వీడియో..) -
నోరూరించే ఎగ్ దోశ వేసిన హీరోయిన్
నిత్యం షూటింగ్లు, మూవీ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉండే నటీనటులు ఏ మాత్రం కాస్త సమయం దొరికితే ఏదైనా డిఫరెంట్గా చేయాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా కోలీవుడ్లో బిజీ మారిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ షూటింగ్ స్పాట్లో నోరూరించే వేడివేడి ఎగ్దోశ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తను దోశ వేసిన వీడియోను ఐశ్వర్యా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్ కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. పా.రంజిత్ నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి దర్శకుడు అమీర్ శిష్యుడు సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో నాని ‘టక్ జగదీష్’ చిత్రంలో కూడా నటిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదవండి: ఐశ్వర్యకు మరో బంపర్ ఆఫర్ ప్రదీప్ మాచిరాజు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ -
నోరూరించే ఎగ్ దోశ వేసిన హీరోయిన్
-
వేడి వేడి ఐస్ క్రీం దోసేయ్!.. ఫాల్తూ ఐటమ్స్..
జ్వరం వచ్చినపుడు ఇడ్లీని చక్కెరతో తినమని అమ్మ సలహా ఇస్తే.. కాంబినేషన్ నచ్చక తినడానికి తెగ ఇబ్బంది పడిపోయేవాళ్లం. కానీ, ఇడ్లీని, దోశను తియ్యగా వేడి వేడి ఐస్ క్రీంతో తినాల్సి వస్తే! ఆ ఆలోచనే వింతగా ఉంది కదూ. ఆ వింత ఆలోచనే ఓ టిఫిన్ సెంటర్ను కంట్రీ ఫేమస్ చేసేసింది. అందరిలా ఆలోచిస్తే మనకు పక్కోడికి తేడా ఏముంటుంది అనుకున్నాడు బెంగళూరులోని ఓ టిఫిన్ సెంటర్ యాజమాని. అందుకే కొత్తగా ఆలోచించాడు. దోశ, ఇడ్లీ, వడలను చట్నీ, సాంబార్తోనే ఎందుకు తినాలి.. ఐస్ క్రీమ్తో తింటేపోలా.. అన్న ఆలోచనే తన వ్యాపారాన్ని మూడు ఐస్క్రీం ఇడ్లీలు.. ఆరు ఐస్క్రీం దోశల్లా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం ఆ టిఫిన్ సెంటర్ మెను సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీంతో ఆ టిఫిన్ సెంటర్ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర దృష్టిలో పడింది. వారి సృజనాత్మకతకు ఆయన ఫిదా అయిపోయాడు. ఐస్క్రీం ఇడ్లీ ‘‘నేను ఐస్ క్రీం దోసకు ఫ్యాన్ను కాను. అయినప్పటికి వారి సృజనాత్మకతకు ఫిదా అయ్యాను. దేశంలోని వీధి వర్తకులు తరిగిపోని సృజనాత్మకత గనులు. మా కంపెనీలో ప్రాడక్ట్ డిజైన్ విభాగంలో పనిచేసే వారిని ప్రతిరోజూ వీధి వర్తకులను కలిసి, స్ఫూర్తి పొందమని చెబుతా’ అంటూ టిఫిన్ సెంటర్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఉంచి ట్వీట్ చేశారు. అయితే టిఫిన్ సెంటర్ ఐడియా అద్భుతం అంటూ కొంతమంది వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. మరికొందరు ఇదేం బాలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ‘ ఫాల్తూ ఐటమ్స్.. ముందు ఎమ్ అండ్ ఎమ్ మీద దృష్టి పెట్టండి’ అంటూ ఓ నెటిజన్ మహీంద్రపై మండిపడ్డాడు. -
తీన్మార్ దోశ.. మనసు దోచె
మియాపూర్ : మసాల దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశల రుచి చూస్తుంటారు...దోశల్లో వెరైటీలను తినాలనుకుంటున్నారా... మియాపూర్ రావాల్సిందే. ఒకేచోట 111 రకాల దోశలు ఆహారప్రియుల మది దోచుకుంటున్నాయి. చందానగర్లోని ప్రధాన రహరిదారిలో ఉన్న బిందు టిఫిన్సెంటర్లోఈ వెరైటీ దోశలు లభిస్తున్నాయి. ఏమేం దోశలంటే.. తీన్మార్ దోశ, పిజ్జాదోశ, కాజుదోశ, దిల్కుష్దోశ, పావ్బాజీ దోశ, ప్రకృతి దోçశ, కేరళ ఓపెన్, అమెరికన్ చొప్సే దోశ లున్నాయి. ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా పన్నీర్దోశ, మష్రూమ్దోశ, స్వీట్కార్న్ దోశ, బేబీకార్న్, మైసూర్ మసాలదోశ ఇష్ట పడుతుంటారు. ఇంకా ప్లెయిన్ దోశలో 8 రకాలు, మసాల దోశలో 15 రకాలు, పెసరదోశలో17, రాగిదోశలో 18 రకాలు, చెజ్వీన్ 21 రకాలు లభిస్తాయి. మియాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల నుంచి దోశె ప్రియులు ఇక్కడికివస్తుంటారు. సంగారెడ్డి జిల్లా ఇంకేమూరి గ్రామానికి చెందిన పండరిరెడ్డి, సంజీవరెడ్డిలు దీనిని నిర్వహిస్తున్నారు. బెంగళూర్లో చూసి.. బెంగళూరులోని హోటల్లో 100 రకాల వెరైటీ దోçశలు తయారీని చూశారు. దీంతో అలాంటి టిఫిన్ సెంటర్ హైదరాబాదులో నిర్వహించాలని అనుకున్నారు.ఒక మాస్టర్ దగ్గర దోçశల వెరైటీలను నేర్చుకున్నారు. టాటా మ్యాజిక్ బండిని టిఫిన్ సెంటర్గా తయారు చేసుకున్నారు. -
మురళీ సార్.. దోశను చంపుతున్నారు
ఒకప్పుడు దూస్రాలతో బ్యాట్స్మన్ను బెంబేలెత్తించిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దోస తింటున్న ఫొటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న మురళీధరన్, తన టీం సభ్యులతో కలసి బ్రేక్ఫాస్ట్లో దోశ తింటున్నప్పుడు కీపర్ శ్రీ వాత్సవ గోస్వామి ఫొటో తీశాడు. ‘మురళీ సార్ దోశను చంపుతున్నారు’ అనే అర్థంతో సన్ రైజర్స్ జట్టు ఆటగాడు గోస్వామి చేసిన ట్వీట్పై చాలామంది నెటిజన్లు జోకులు వేస్తూ, షేర్ చేస్తున్నారు. మురళీధరన్ దోశ తింటున్న ఫొటో షేర్ చేసిన శ్రీవాత్సవ గోస్వామికి పంజాబ్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. సారథి కేన్ విలియమ్స్ గైర్హాజరీలో ఆడిన ఆ మ్యాచ్లో రైజర్స్ జట్టు ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ 53 బంతుల్లో 85 పరుగులతో అదరగొట్టడంతో రైజర్స్ 181 పరుగులు చేయగలిగింది. కానీ ఛేదనలో భీకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి కోల్కత్తా జట్టును సులభంగా విజయ తీరాలకు చేర్చాడు. -
పే..ద్ద దోసె
చెన్నై, కొరుక్కుపేట: సాధారణంగా దోసె అనగానే చిన్న ప్లేటు సైజులో చూసి ఉంటాం .. అంతకుమించితే కాస్తా పెద్ద సైజ్లో చూసి ఉండవచ్చు . అయితే చెన్నైకు చెందిన చెఫ్లు ఒకటా ... రెండా ... ఏకంగా 100 అడుగల దోసెను తయారు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ అరుదైన రికార్డు ఐఐటీ –మద్రాçసు ఆవరణలో ఆవిషృతమైంది.ప్రముఖ చెఫ్, విద్యా వేత్త డాక్టర్ వినోద్కుమార్ సారథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐఐటీ –మద్రాసు వేదికగా గిన్నిస్ రికార్డు సాధన కోసం 100 అడుగుల పొగవు గల దోసె త యారు చేశారు. ఇందులో నగరంలోని శరవణ భవన్కు చెందిన 60మంది చెఫ్ల బృందం కలసి ఏకకాలంలో 100 అడుగుల పొడవు సునాయాసంగా తయారు చేసి విజయవంతం చేశారు. 100 అడుగుల దోసెకు 37.5 కిలోల పిండి , 10 అడుగలు రైస్ ఫ్లే్లవర్, రెండుకిలోల చిక్పీస్ , గ్రీన్ గ్రామ్ 500 గ్రాములు , 500 గ్రాముల సాల్ట్, ఉపయోగించనట్టు చెఫ్ వినోద్కుమార్ తెలిపారు. 2014 సంవత్సరంలో అహ్మదాబాద్ లోని హోటల్ దాస్పల్లా పేరుమీదుగా ఉన్న 54 అడుగుల 8.69 లో ఉన్న రికార్డును బద్దలు కొట్టినట్టు ఆయన వెల్లడిం చారు. ఇందులో శరవణ భవన్ జీఎం మదన్, ఎండీ హెచ్ఆర్ దామోదరన్ , నటుడు నకుల్ ఆయన సతీమణి శృతి నకుల్ పాల్గొ్గన్నారు. -
తారల పేర్లతో తినే పదార్థాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘వేడి వేడి దీపికా పదుకోన్ దోశ, పసందైన దోశ!’ అని వినబడగానే ఒక్క ఆమె అభిమానులకే కాకుండా ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయేమో! అమెరికాలోని ఆస్టిన్లో ‘దోశ లాబ్స్’ హోటల్లో పశ్చిమిరపకాయలు, ఆలు కుర్మాతో కూడిన ‘దీపికా పదుకోన్ దోశ’ను విక్రయిస్తున్నారంటూ వార్త ఒకటి జనవరి ఒకటవ తేదీన వైరల్ అయింది. దాంతో భారత్లోని పుణెలో ఆమె పేరుతో ‘పరంతా తాళి’ అంటూ భోజనాన్ని విక్రమిస్తున్నారంటూ ట్వీట్లు వెలువడ్డాయి. ఆ మాటకొస్తే ఆమె ఒక్కదాని పేరు మీదనే కాకుండా పలువురు సినీ తారల పేర్ల మీద భారత్లోని పలు ప్రాంతాల్లో పలు హోటళ్లు తిను బండారాలు విక్రయిస్తున్నారు. కొందరైతే సినీ తారలు సినిమాల్లో నటించిన పాత్రల పేరిట కూడా తినుబంఢారాలను విక్రయిస్తున్నారు. ముంబైలోని నూర్ మొహమ్మది హోటల్లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరు మీద ‘చికెన్ సంజూ బాబా’ను విక్రయిస్తున్నారు. 95 ఏళ్ల పురాతనమైన ఆ హోటల్ యజమాని ఖలీద్ హకీమ్, సంజయ్తో తనకున్న అనుబంధానికి గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నారు. ఆ హోటల్లో 1986లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ సెక్షన్ను సంజయ్ దత్ రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. అప్పడు సంజయ్కి హోటల్ యజమాని ఓ చికెన్ డిషన్ను సర్వ్ చేశారు. అప్పటి నుంచి ఆ డిష్కు ఆయన పేరే పెట్టారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో మూడేళ్ల జైలు నిర్బంధం అనంతరం 2016, పిబ్రవరిలో సంజయ్ విడుదలైనప్పుడు ఈ హోటల్ యజమాని 12 గంటలపాటు చికెన్ సంజు బాబా డిష్ను ఉచితంగా ప్రజలకు పంచి పెట్టారు. ముంబైలోని ‘అర్బన్ తడ్కా’ హోటల్లో బాలివుడ్ నటుడు ఓం పురి పేరిట ‘మటన్ సాగ్వాలా’ను కొన్నేళ్లుగా విక్రయిస్తున్నారు. పాలకూరతో చేసిన ఆ మటన్ను తినేందుకు ఓం పురి తరచుగా ఆ హోటల్కు వచ్చేవారట. అందుకు ఆ పేరు పెట్టారట. బాండ్రాలోని శాంటే హోటల్లో బాబీ డియోల్ పేరుతూ ‘బాబీ కేక్ను విక్రయిస్తున్నారు. బాబీ డియోల్, ఆయన కుటుంబం ఆ హోటల్కు తరచూ వచ్చి ఆ కే క్లు తినేవారట. అలా ఆయన పేరూ అలా స్థిర పడింది. 2013లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా!’ అక్షయ్ కుమార్ నటించిన పాత్ర పేరు ‘షోయబ్దిని’ ఓమన్ రిసార్ట్లోని ఓ కాక్టెయిల్కు పెట్టారు. చిరు దోశ కూడా! తెలుగు సినీ నటుడు చిరంజీవి పేరిట తెలగునాట నూనే లేకుండా ఆవిరి మీద ఉడికించే ‘చిరు దోశ’ కూడా చెలామణì లో ఉంది. ఆన్లైన్లో ఎక్కువగా కనిపించే ఈ దోశ హైదరాబాద్లోని చిరంజీవి ఇంటి నుంచే పాకిందట. 2015లో ఈ దోశపై పేటెంట్ హక్కులు పొందేందుకు ఆయన కుమారుడు రామ్ చరణ్ ప్రయత్నించారట. మైసూర్లోని ఓ చిన్న ఫుడ్ కార్నర్లో ఈ దోశను చిరంజీవి కనిపెట్టారట. హైదరాబాద్లోని ‘చట్నీస్’ కూడా కొంతకాలం ‘చిరంజీవి దోశ’ అంటూ స్టీమ్డ్ దోశను చెలామణి చేసింది. -
ఏక్ దీపిక దోసె పార్సిల్
అమెరికాలో టెక్సాస్ ప్రాంతంలోని దోసె ల్యాబ్స్ దగ్గర వేరే ఏ దోసె అడిగినా ఆర్డర్ కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ.. అదే ‘దీపికా పదుకోన్ దోసె’ అనగానే ఆలూ, చిల్లీతో నిండిన వేడి వేడి మసాలా దోసె మన ముందుకొస్తుంది. సినిమా స్టార్ల పేర్లు నచ్చిన వాటికి పెట్టడం చాలాసార్లే విన్నాం.. చూశాం. తాజాగా టెక్సాస్లో ‘దోశ ల్యాబ్స్’ అనే స్ట్రీట్ఫుడ్ రెస్టారెంట్లో ఓ దోసెకు దీపికా పదుకోన్ పేరును పెట్టుకున్నారు హోటల్ యాజమాన్యం. ట్వీటర్లో ఈ విషయాన్ని చూసిన దీపిక ‘ఎవరెవరికి ఆకలిగా ఉందోచ్..’ అంటూ తన ట్వీటర్లో ఈ విషయాన్ని వడ్డించారు. ‘‘కొత్త సంవత్సరం ఇంతకన్నా గొప్పగా ప్రారంభం అవ్వదనుకుంటా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారామె. వెంటనే ‘‘మేడమ్ నార్త్ ఇండియాలో (పూణే) దీపికా పదుకోన్ పరాతా ఫుల్ ఫేమస్ అంటూ మరో హోటల్ సర్వ్ చేసే మెనూ పిక్ పోస్ట్ చేస్తూ రిప్లై చేశారో నెటిజన్. ‘‘నేనా హోటల్కి వెళ్తే కచ్చితంగా ‘దీపికా పదుకోన్ దోసె ఆర్డర్ ఇచ్చేవాణ్ణి’’ అని సరదాగా పేర్కొన్నారు దీపికా భర్త రణ్వీర్ సింగ్. -
తింటే షిండే దోసే తినాలి
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్కి రెండు సందుల అవతల చూస్తే ఓ షాప్ ముందు జనం గుమిగూడి కనిపిస్తారు. అదేంటా అని మరికాస్త ముందుకు వెళ్లి చూస్తే.. బ్రాండ్ న్యూ రామ్స్ దోసె హౌస్ అని తెలుస్తుంది. అంత జనం ఉన్నారంటే అక్కడి దోసెకు ఎంత గిరాకీ ఉందో ఇట్టే తెలిసి పోతుంది. ఆ దోసె బండి ముందర బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ కార్లు క్యూ కడతాయి. ఎంతో ఓపికగా ఇచ్చిన ఆర్డరు కోసం నిరీక్షిస్తారు జనం. అక్కడి వస్తువుల ఖరీదు వంద రూపాయల కంటె తక్కువే. కాని లక్షల ఖరీదు చేసే కార్లలో వారు నిరీక్షించేలా చేస్తుంది రామ్స్ దోసె. వారి నిరీక్షణ ఫలితం చాలా ఖరీదైనదే అనుకుంటారు వారు. ఈ రెస్టారెంట్ విజయం వెనుక రహస్యం రామ్ షిండే చిరునవ్వులే. ఇది రామ్ షిండే పెట్టుకున్న రెండో బ్రాంచ్. మొదటిది నాంపల్లిలో ఉంది. దానికి రామ్ కీ బండి అని పేరు. ఇది కూడా రోడ్ పక్కనే ఉంటుంది. పదేళ్ల క్రితం ఈ దోసెల వ్యాపారం మొదలుపెట్టారు షిండే. రామ్ కీ బండి ప్రారంభించిన కొత్తల్లో దోసె పిండి రుబ్బుకుని, పెద్ద పెనం మీద దోసెలు వేసి, గిన్నెలన్నీ తనే కడుక్కునేవాడు. తను ఈ రోజు స్థాపించిన రెస్టారెంట్ చూసుకుంటే, ఆ రోజు అంత కష్టపడ్డానా అనుకుంటారు రామ్. అది నిజం కాదేమో అని కూడా అనుకుంటారు. అర్ధరాత్రి నడుపుతున్న ఆహార పదార్థాల బండ్లలో రామ్ కీ బండి కూడా ఒకటి. దీనికి ఐదుకి 4.2 రేటింగ్ ఇచ్చారు ఫుడ్ లవర్స్. నోరూరించే బటర్ దోసె కొబ్బరి చట్నీతో కలిపి తినడానికి అలవాటు పడ్డ భోజన ప్రియులు తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దోసె తినడానికి వస్తుంటారు. 1989 నుంచి అంటే సుమారు మూడు దశాబ్దాలుగా రామ్ కీ బండి దిగ్విజయంగా దోసెలు వేస్తూనే ఉంది. రామ్ కి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి ఈ బండి ప్రారంభించారు. ‘నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పడు నాన్న వెంటే తిరుగుతుండేవాడిని. దోసెలు ఎలా తయారుచేస్తున్నారు, ఇడ్లీలు ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు వంటివి చూసేవాడిని. పదేళ్ల క్రితం బండి నా చేతిలోకి వచ్చింది. నేను నాంపల్లిలో ప్రారంభించాను’ అని తెలియజేశారు రామ్షిండే. ఈరోజు ఈ దోసె బండి గురించి గూగుల్ సెర్చ్లో కొడితే వెంటనే కనపడుతుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి రామ్ జీవితమే ఒక పెద్ద ప్రేరణ. కొత్తల్లో తాను సరిగ్గా నడపలేనేమోనని చాలా భయపడ్డారట రామ్. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకున్నాడు. తాను చదువుకున్న ఎంబీఏని లెక్క చేయకుండా ఈ వ్యాపారంలోకి దిగాడు. రెస్టారెంట్ ప్రారంభించిన కొత్తల్లో రెండేళ్ల పాటు కస్టమర్లు చాలా తక్కువగా వచ్చేవారు. పెట్టుబడి డబ్బులు క్రమేపీ తరిగిపోసాగాయి. కొన్నిరోజులైతే రోజుకు కేవలం వంద రూపాయలే వచ్చేవి. కుటుంబ సభ్యులు సాయం చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. చాలాసార్లు వ్యాపారం విడిచిపోవాలనిపించింది రామ్కి. కాని అకుంఠిత దీక్షతో నష్టాల్లోనే నడుపుతూ వచ్చాడు. అప్పుడే వచ్చింది రామ్కి ఒక మంచి ఆలోచన. ‘నగరంలో చాలా చోట్ల టేస్టీ దోసెలు దొరుకుతుండగా నా దగ్గరకే ఎందుకు వస్తారు? కొత్తరకం దోసెను కనిపెట్టాలి’ అనుకున్నాడు. ఆ ఆలోచన నుంచి వచ్చినవే చీజ్ దోసె, బటర్ దోసె, పనీర్ దోసె. అంతే క్రమేపీ ఆహారప్రియులు ఈ దోసెలకు ఆకర్షితులవడం ప్రారంభించారు. పిజ్జా దోసె దొరికే మొట్టమొదటి చోటు ఇదే. ‘నేను ఇచ్చే క్వాలిటీ చూసి మరింత మంది నా దగ్గరకు వస్తున్నారు’ అంటారు రామ్ షిండే. నాంపల్లి తర్వాత జూబ్లీహిల్స్లో ప్రారంభించిన దోసె హౌజ్కి మంచి స్పందన వచ్చింది. ఇక్కడకు సినీనటులు, వీఐపీలు, యువత అధికంగా వస్తుంటారు. ‘యువత వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటారు, ఆ ప్రచారమే చాలు’ అంటూ సరదాగా అంటారు. ఈ రోజుకీ రామ్తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేస్తారు. మూడు గంటలకల్లా నాంపల్లి బండి దగ్గరకు వెళ్తారు. రెస్టారెంట్లో రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటారు. నాకిది కష్టంగా అనిపించదు. క్యాంటీన్లో వారంతా సంతోషంగా తింటుంటే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది’ అంటారు రామ్ షిండే. -
దోసె వేసి మనసు దోచి
బెంగళూరు బసవనగుడి గాంధీ బజార్... నిత్యం దోసె ప్రియులతో కిటకిటలాడుతూ ఉంటుంది... అక్కడి వెన్న దోసె నోటిలో వేసుకుంటే వహ్వా అనిపిస్తుంది. కాని దాని కోసం గంటసేపు నిరీక్షించాల్సిందే.. అంత డిమాండ్ ఉన్న హోటలే విద్యార్థి భవన్... ఇటీవలే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థి భవన్ ఈ వారం ఫుట్ ప్రింట్స్... ‘ఏడున్నర దశాబ్దాలుగా అదే వెన్న దోసె తింటున్నాం’ అనుకుంటారు బెంగళూరు వాసులు. వారికి ఇదేమీ కొత్త కాదు. ప్రతిరోజూ కనీసం మూడు వేల మంది విద్యార్థి భవన్ టిఫిన్లు రుచి చూస్తుంటారు. ఇందులో రచయితలు, కళాకారులు, సినీతారలు, కార్పొరేట్ వృత్తులవారు... ఒకరనేమిటి... అందరూ వెన్న దోసె రుచికి ఎగబడవలసిందే. 1943 లో దక్షిణ కన్నడ ప్రాంతం సాలిగ్రామం నుంచి వెంకటరమణ ఊరల్ కన్నడిగుల కోసం ప్రత్యేకమైన దోసెలు వేయడం ప్రారంభించారు. ఇరుకు సందుల్లో ఉండే విద్యార్థి భవన్లో దోసె తినడానికి సంపన్న వర్గాలు సైతం వస్తుంటారు. లోపల ఖాళీ లేకపోతే ఎంతో ఓరిమిగా బయటే నిరీక్షిస్తుంటారు ఈ దోసె ప్రియులు. ఇక్కడకు వెన్న దోసె తినడానికి ఎంత మంది వస్తున్నారని లెక్కించకుండా, వేస్తున్న దోసెల సంఖ్యను లెక్కిస్తారు. మామూలు రోజుల్లో రోజుకి 1250, శని ఆదివారాలు 2200 దోసెలు వేయాల్సిందే. లోపల ఉన్నవాళ్లు బయటకు వెళ్తేనే, బయట ఉన్నవారు లోపలకు రాగలుగుతారు. అంత రద్దీగా ఉంటుంది. ఇదీ చరిత్ర... బెంగళూరులోని అతి పురాతన ప్రదేశం బసవనగుడి ప్రాంతంలోని గాంధీ బజార్. స్వతంత్రానికి పూర్వం, ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు ఉండేవి. వీటిలో నేషనల్ కాలేజీ, ఆచార్య పాఠశాల కూడా ఉన్నాయి. ‘విద్యార్థి భవన్ను విద్యార్థుల కోసం ప్రారంభించటం వల్ల దానికి విద్యార్థి భవన్ అనే పేరు స్థిరపరిచేశారు. ప్రారంభించిన కొన్ని రోజులకే విద్యార్థి భవన్ పేరు బెంగళూరు అంతా వ్యాపించింది. ఈరోజు ప్రతి సెలబ్రిటీ ఇక్కడకు వచ్చి దోసె, కాఫీ రుచి చూడవలసిందే’ అంటారు విద్యార్థి భవన్ నిర్వాహకులు అరుణ్ కుమార్ అడిగా. అరుణ్ టెలికాం ఇంజనీర్. వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని నిలబెట్టడం కోసం తాను చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశారు. ఎటువంటి మార్పు లేదు... విద్యార్థి భవన్లో నేటికీ కేవలం ఆరు రకాల టిఫిన్లు మాత్రమే ఉంటున్నాయి. వెన్న దోసె, పూరీ సాగు, ఖారా బాత్, కేసరి బాత్, ఇడ్లీ సాంబారు, ఉప్పిట్లు, రవ్వ వడ... ఇవీ విద్యార్థి భవన్ మెనూ. ‘వీటికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేలా మేం రూపొందించాం’ అంటారు అరుణ్. 1970 ప్రాంతంలో విద్యార్థి భవన్ను ఊరల్ వంశీకులు రామకృష్ణ అడిగాకు అప్పగించారు. విద్యార్థి భవన్ పేరును రెండింతలు చేశారు రామకృష్ణ. అదే సంప్రదాయం... విద్యార్థి భవన్ను... అదే పేరు, అదే స్టాఫ్, అదే మెనూ, అదే నియమాలతో తీసుకున్నారు రామకృష్ణ అడిగా. అరుణ్ అడిగా ఈ హోటల్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పటికి, అదే ప్రాంతంలో ఉన్న ఎస్ఎల్వి హోటల్ మూతపడింది. ఆ సమయంలోనే రామకృష్ణ అడిగా ఈ వ్యాపారాన్ని తన కుమారుడు అరుణ్ అడిగాకు అప్పచెప్పాలనుకున్నారు. ‘‘మా నాన్నగారికి 60 సంవత్సరాలు నిండటంతో, ఆయన వెనుకగా ఉండి నడిపించాలనుకున్నారు. అప్పటికి నేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారితో కలిసి పనిచేస్తున్నాను. ‘మీ నాన్నగారి వ్యాపారాన్ని నువ్వు తీసుకోవడం వల్ల ఆ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ కార్పొరేట్ ఉద్యోగాన్ని నువ్వు విడిచిపెట్టడం వల్ల కంపెనీకి ఎటువంటి నష్టమూ కలగదు’ అని సలహా ఇచ్చారు నారాయణమూర్తి. ఆయన సూచన మేరకు నేను నాన్నగారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాను’’ అన్నారాయన. ప్రముఖులు... వెన్న దోసె తింటూ వారి సృజనకు అక్కడే పదును పెట్టేవారు. బిఆర్ లక్ష్మణరావు, ఫీల్డ్ మార్షల్ కరియప్ప, విద్యావేత్త హెచ్ నరసింహయ్య, సినీ నటులు విష్ణువర్థన్, అనంత్ నాగ్, శంకర్ నాగ్... ఇక్కడకు నిత్యం వచ్చే ప్రముఖులలో కొందరు. ప్రముఖ సాహితీవేత్త మస్తి వెంకటేశ అయ్యంగార్... ఏనాడూ ‘రవ్వ వడ’ను మిస్ అయ్యేవారు కారు. బసవనగుడి క్లబ్కి వెళ్తూ మార్గమధ్యంలో ఆగి పార్సిల్ చేయించుకునేవారు. డి.వి. గుండప్ప, జి.సి.రాజారత్నం వంటి కవులు ఇక్కడి ‘సాగు మసాలా’ కోసం తప్పనిసరిగా వచ్చేవారు. ప్రముఖ క్రికెట్ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్, సినీ నటి భారతి నేటికీ దోసె రుచి చూస్తున్నారు. రజనీకాంత్ను కనిపెట్టలేకపోయారు... ప్రముఖ కన్నడ సినీ నటుడు డా.రాజ్కుమార్ ఈ దోసెలు చాలా ఇష్టం. ఇక్కడ నుంచి దోసె పార్సిల్ తీసుకువెళ్లేవారు. వీరప్పన్ చెర నుంచి బయటకు వచ్చిన రాజ్కుమార్ను విద్యార్థి భవన్కు ఆహ్వానించి ఆప్యాయంగా దోసె తినిపించారు అరుణ్ అడిగా. రజనీకాంత్ తరచుగా మారువేషంలో వచ్చి ఇక్కడ దోసె తిని వెళ్తుంటారని గట్టిగా గుసగుసలు వినపడతాయి. ఎలాగైనా ఆయనను గుర్తించాలని అక్కడి ఉద్యోగులు ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నం నేటికీ ఫలించలేదట. -
దోశెడు రుచులు
ఎట్ల చేసినా అట్లు బాగుంటాయి. ఏం టైమ్లో అయినా మనసు దోశేస్తాయి. రొటీన్ని పక్కన పెట్టండి. బ్రేక్ ఫాస్ట్లో ఛీజ్ను, బ్రెడ్ను దోశెతో కలిపి కొత్త రుచిని లాగించండి. అట్ల తద్ది నోముకు దోశెడు రుచులు కలపండి. బ్రెడ్ దోశె కావలసినవి: బ్రెడ్ స్లైసులు – 10; బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; తినే సోడా – అర టీ స్పూను; నూనె – తగినంత పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు తయారీ: ♦ ముందుగా బ్రెడ్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ బియ్యప్పిండి, సెనగ పిండి, పెరుగు, నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పిండి మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ తగినంత ఉప్పు (బ్రెడ్ ఉంటుంది కనుక ఉప్పు తగ్గించి వేసుకోవడం మంచిది) జత చేయాలి ♦ ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి. పోపు తయారీ : ♦ స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ♦ జీలకర్ర జత చేసి మరోమారు వేయించాక, చివరగా కరివేపాకు తరుగు, ఇంగువ వేసి బాగా వేయించి దోశెపిండి మిశ్రమంలో వేసి కలపాలి ♦ చివరగా తినే సోడా జత చేసి బాగా కలపాలి. దోశె తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి సమానంగా పరవాలి ∙గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద పల్చగా వేయాలి ∙బాగా కాలిన తరవాత తిరగేసి మరికాస్త నూనె వేసి కాల్చాలి ∙రెండువైపులా కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో అందించాలి. ముంబై స్టయిల్ మసాలా దోశె కావలసినవి: దోశె పిండి – 3 కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; సాల్టెడ్ బటర్ – తగినంత; గరం మసాలా పొడి లేదా పావ్ భాజీ మసాలా పొడి – తగినంత; మిరప కారం – తగినంత; పొటాటో: మసాలా కోసం కావలసినవి: బంగాళ దుంపలు – 3 (ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి); నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు (పొట్టుతో) – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి); అల్లం తురుము – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ♦ ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ♦ పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో వేసి మూత పెట్టి సుమారు గంట సేపు నానబెట్టాక, నీళ్లు వడకట్టేసి, సెనగపప్పును పక్కన ఉంచాలి ♦ బంగాళ దుంపలను ఉడికించి తొక్క తీసి గరిటెతో మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ♦ స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ♦ జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ♦ వడకట్టిన సెనగ పప్పు జత చే సి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా వేయించాలి ♦ అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ♦ ఉల్లి తరుగు జత చేసి బాగా ♦ కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ♦ ఉడికించిన బంగాళదుంప ముద్ద జత చేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి ♦ ఉప్పు, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మసాలా మెత్తగా వచ్చేలా బాగా కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మసాలా దోసె తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాలనివ్వాలి ♦ గరిటెడు దోసె పిండి తీసుకుని పెనం పల్చగా దోసె వేయాలి ∙దోశె బాగా కాలుతుండగా మసాలాను ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, మిరప కారం లేదా గరం మసాలా వేసి సమానంగా పరవాలి ♦ ఆ పైన కొద్దిగా బటర్ వేయాలి ♦ చివరగా పొటాటో మసాలా మిశ్రమం కొద్దిగా తీసుకుని దోశె పైన ఉంచి దోశెను రెండు పక్కల నుంచి మధ్యకు మడిచి ప్లేట్లోకి తీసుకోవాలి ♦ పిజ్జా కటర్తో కట్ చేసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో వేడివేడిగా అందించాలి. చీజ్ దోశె కావలసినవి: దోశెపిండి – రెండు కప్పులు; ఉల్లితరుగు – అరకప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిరియాల పొడి – పావు టీ స్పూను; చీజ్ తురుము – అర కప్పు; బటర్ – తగినంత తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా బటర్ వేసి సమానంగా పరిచి, మంట బాగా తగ్గించాలి ♦ గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద దోశెలా వేయాలి ♦ దోశె కొద్దిగా కాలిన తరవాత ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మిరియాల పొడి వేసి అట్లకాడతో సరిచేయాలి ♦ చివరగా చీజ్ తురుము వేసి సరిచేయాలి ♦ అదే సమయంలో దోశె చుట్టూ బటర్ వేయాలి ♦ సన్న మంట మీద దోశె కాలుతుండగా, చీజ్, బటర్ రెండూ కరిగిపోతాయి ∙దోశె బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ♦ కొబ్బరి చట్నీ, సాంబారుతో అందించాలి ♦ టొమాటో చట్నీ, ఉల్లి చట్నీ కూడా రుచిగా ఉంటాయి. పెరుగు దోశె కావలసినవి: బియ్యం – ఒక కప్పు; గట్టి అటుకులు – పావు కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; తాజా పెరుగు – అర కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత తయారీ: ♦ బియ్యం, మినప్పప్పు, మెంతులను విడివిడిగా కడిగి, ఒకపాత్రలో వేసి తగినన్ని నీళ్లు, పెరుగు జత చేసి సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాలి ♦ వేరొక పాత్రలో అటుకులు వేసి తగినన్ని నీళ్లు జత చేసి విడిగా నానబెట్టాలి ♦ నీరంతా ఒంపేసి అటుకులు, బియ్యం, మినప్పప్పు, మెంతులు గ్రైండర్లో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ పంచదార, ఉప్పు జత చేసి రాత్రంతా నాననివ్వాలి ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి ♦ గరిటెడు పిండి తీసుకుని పెనం మీద వేసి కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి ♦ పైన మూత ఉంచి, మీడియం మంట మీద కాలనివ్వాలి ♦ దోశె పై భాగం బాగా కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పి చుట్టూ నెయ్యి వేసి కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకోవాలి ♦ కొబ్బరి చట్నీ/ కొత్తిమీర చట్నీతో అందించాలి. షెజ్వాన్ దోశె కావలసినవి: ఉల్లికాడల తరుగు – పావు కప్పు; దోశె పిండి – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావుకప్పు; క్యాప్పికమ్ తరుగు – పావుకప్పు; క్యారట్ తురుము – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; షెజ్వాన్ సాస్ – తగినంత; బటర్ – తగినంత తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, అడ్డంగా సగానికి కోసిన ఉల్లిపాయను నూనెలో ముంచి పెనం మీద నూనె పూయాలి ♦ గరిటెతో దోశెపిండి తీసుకుని పెనం మీద దోశె వేయాలి ♦ సన్నటి మంట మీద దోశెను కాలనివ్వాలి ♦ పై భాగం బాగా కాలగానే రెండు టీ స్పూన్ల బటర్, ఒక టీ స్పూను షెజవాన్ సాస్ వేసి, దోశె మీద సమానంగా పరవాలి ♦ ఆ పైన కూరగాయల తరుగు వేసి పరవాలి ♦ బాగా కాలిన తరవాత దోశెను మధ్యకు మడిచి ప్లేట్లోకి తీసుకుని పిజ్జా కటర్తో నచ్చినట్లుగా కట్ చేయాలి ♦ ఇలా తయారు చేసుకున్నాక కొబ్బరి చట్నీ, సాంబారుతో వేడివేడిగా అందించాలి. దోశె పిండి కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – రెండున్నర కప్పులు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ♦ ముందు రోజు రాత్రి ఒక పెద్ద పాత్రలో మినప్పప్పు, బియ్యప్పిండి, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి నానబెట్టాలి మరుసటిరోజు ఉదయం నీళ్లన్నీ వడకట్టేసి, మినప్పప్పు, బియ్యం, మెంతులు మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ♦ ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, రెండు మూడు గంటలు బాగా నాననివ్వాలి. ఆ తరవాత దోశెలు వేసుకుంటే మెత్తగా వస్తాయి. టిప్స్ దోసె కరకరలాడుతూ, రుచిగా ఉండాలంటే... ♦ ఒక భాగం మినప్పప్పుకు 3 భాగాల బియ్యం నానబెట్టాలి. సగం కప్పు మరమరాలు లేదా అన్నం పేలాలు విడిగా నానబెట్టాలి. నాలుగు గంటలు వీటిని నానబెట్టిన తర్వాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. ♦ కొందరు 2–3 రోజుల వరకు పిండిని ఫ్రిజ్లో ఉంచి వాడుతుంటారు. ఇలాంటప్పుడు స్టీలు గిన్నెలో ఉంచితే పిండి కొద్దిగా రంగు మారుతుంది. అలా కాకుండా ప్లాస్టిక్ లేదా సెరామిక్ పాత్రలో పిండిని పోసి ఫ్రిజ్లో భద్రపరచాలి. ♦ దోసె వేయడానికి ఫ్రిజ్లో పిండి వాడాలంటే కనీసం 15 నిమిషాలు ఆ పిండిని బయట ఉంచాలి. ♦ చట్నీతో పాటు తురిమిన ఛీజ్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇడ్లీ పొడి వంటివి దోసెకు కాంబినేషన్గా వడ్డించవచ్చు. -
ఇడ్లీ దోశ వడ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్కు నిధులను సమీకరించడం పెద్ద సవాలే. వినూత్న ఆలోచన, భవిష్యత్తు మార్కెట్ అవకాశాలుంటే తప్ప అంత త్వరగా పెట్టుబడులు రావు. అలాంటిది ఇడ్లీ, దోశ, వడ పిండిలను విక్రయించే సంస్థలో దిగ్గజ పారిశ్రామికవేత్త, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ పెట్టుబడి పెట్టడమంటే మామూలు మాట కాదు. రెడీ టు కుక్ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్ ఫుడ్స్’ మన దేశంలోనే కాదు! విదేశాల్లోనూ ఇడ్లీ, దోశ ఉత్పత్తులను విక్రయిస్తోంది. రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ వ్యవస్థాపక సీఈఓ పీసీ ముస్తఫా ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ‘స్టార్టప్ డైరీ’తో మాట్లాడారు. ఆయనేమంటారంటే.. ‘‘మాది కేరళలోని చెన్నాలోడె అనే మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబం కావటంతో మూడు పూట్లా తిండే కష్టం. ఇక పొద్దున్నే టిఫిన్స్ అంటే లగ్జరీనే. చదువే దారి చూపిస్తుందని కష్టపడి కోల్కతాలోని ఆర్ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆ తర్వాత మోటరోలా, సిటీ బ్యాంక్, ఇంటెల్ సంస్థల్లో ఇండియాతో పాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేశా. తర్వాత ఐఐఎం బెంగళూర్లో ఎంబీఏ కూడా పూర్తి చేశా. ఓసారి బెంగళూరులోని మా కజిన్ వాళ్లింటికి వెళ్లా. వాళ్లకు ఇంద్రానగర్లో ఓ చిన్న కిరాణా షాపుంది. రోజూ అక్కడ లోకల్ బ్రాండ్ ఇడ్లీ, దోశ ప్యాకెట్స్ బోలెడన్ని అమ్మకాలుండేవి. ఓసారి షాపులో కూర్చున్న నాకు.. ఇది ఆశ్యర్యం కలిగించింది. నాణ్యత, దినుసుల ఎంపిక వంటివేవీ పట్టించుకోకుండా ప్యాకేజ్డ్ ఫుడ్కు ఇంత మార్కెట్ ఉందా అని! దీన్నే తాజాగా, అందుబాటు ధరల్లో అందిస్తే ఎలా ఉంటుందనుకున్నా!! మా కజిన్తో కలిసి రూ.50 వేల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్ ఫుడ్ను ప్రారంభించాం. వండుకునేందుకు సిద్ధమైన రెడీ టు కుక్ ప్యాకెట్స్.. అది కూడా ప్రతి రోజూ తాజా ఉత్పత్తులు, వినూత్న ప్యాకేజింగ్, అందుబాటు ధర ఇదీ ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ ప్రత్యేకత. 8 ఉత్పత్తులు.. ప్రస్తుతం ఐడీ ఫ్రెష్ నుంచి ఇడ్లీ, దోశ, వడ, రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, మలబార్ పరాఠా, గోధుమ పరాఠా, పన్నీర్ పిండి 8 రకాల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే ఫిల్టర్ కాఫీ డికాక్షన్, టమాట, కొబ్బరి చట్నీలను తెస్తున్నాం. వచ్చే రెండేళ్లలో 15 ఉత్పత్తులను విపణిలోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, దుబాయ్లో 6 తయారీ కేంద్రాలున్నాయి. ఆయా ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 లక్షల ఇడ్లీలు. త్వరలోనే బెంగళూరులో మరో భారీ ప్లాంట్ను నిర్మించనున్నాం. దీంతో సామర్థ్యం రోజుకు కోటి ఇడ్లీలకు చేరుతుంది. పిండి రుబ్బడానికి అమెరికా సంస్థతో కలిసి సొంతంగా మిషన్లను అభివృద్ధి చేశాం. ఈ మిషన్ గంటకు 1,500 కిలోల పిండి రుబ్బుతుంది. 20 వేల స్టోర్లు; రోజుకు 20 కోట్ల వ్యాపారం.. మన దేశంతో పాటు దుబాయ్లోనూ ఐడీ ఫ్రెష్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. మొత్తం 20 వేల స్టోర్లున్నాయి. హైదరాబాద్లో 2,200, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో 1,200 స్టోర్లున్నాయి. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్లో 3 వేల స్టోర్లతో పాటు వరంగల్, కర్నూల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లకి‡్ష్యం చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. హైదరాబాద్లో రోజు కు రూ.2 కోట్లు, ఏపీలో రూ.80 లక్షల వ్యాపారం ఉంది. మొత్తం ఆదాయంలో బెంగళూరు నుంచి 40%, హైదరాబాద్ నుంచి 16% వాటా వస్తోంది. ఐదేళ్లలో వెయ్యి కోట్లు లక్ష్యం.. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.275 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అంతక్రితం ఏడాది ఇది రూ.182 కోట్లు. వచ్చే ఐదేళ్లలో వెయ్యి కోట్ల టర్నోవర్ను లకి‡్ష్యంచాం. త్వరలోనే ఒమన్, సౌదీ దేశాలకు ఆ తర్వాత సింగపూర్, శ్రీలంక, అమెరికా వంటి దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం కంపెనీలో 1,600 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో రూ.185 కోట్ల నిధులను సమీకరించాం. హీలియన్ వెంచర్ పార్టనర్స్ రూ.35 కోట్లు, అజీజ్ ప్రేమ్జీ రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టారు... అని ముస్తఫా వివరించారు. -
‘ఓటుకు నోటు కాదు’...దోశ, కాఫీ
బెంగుళూరు : ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఓటు వేయాలంటూ ప్రకటనలతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. నాయకులైతే మరో అడుగు ముందుకేసి ప్రయాణ ఖర్చులిచ్చి మరీ ఓటర్లును రప్పించి ఓటు వేయించుకుంటారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి పెంచడానికి కర్ణాటకలోని ఓ హోటల్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారికి తమ హోటల్లో ఉచితంగా దోశ, ఫిల్టర్ కాఫీని ఇస్తున్నట్లు తెలిపింది. వివరాల...గత కొంతకాలంగా ఎన్నికల్లో బెంగుళూరులోనే తక్కువ ఓటింగ్ నమోదవున్నట్లు ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తక్కువ ఓటింగ్ శాతాన్ని తగ్గించడం కోసం బెంగుళూరులోని నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని క్రిష్ణ రాజ్ ఒక వినూత్న ఆలోచన చేశాడు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి దోశ, మిగితా వారికి ఫిల్టర్ కాఫీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాడు. ఓటు వేసి వచ్చిన అనంతరం ఇంక్ మార్క్ ఉన్న తమ వేళ్లను చూపించి ఉచితంగా కాఫీ తాగొచ్చని తెలిపాడు. -
సీరియల్ నటి రాత్రిపూట రోడ్డుపక్కన...
సాక్షి, తిరువనంతపురం : నెయ్యట్టిన్కర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి. రాత్రి పూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్. అక్కడ ఒక మధ్య వయస్కురాలైన ఓ మహిళ దోశెలు వేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమెను చూసి షాక్ తిన్నాడు. ఆమెతో కాసేపు మాట్లాడి.. అదంతా వీడియో తీసి తన ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. అంతే అదిప్పుడు అక్కడ పెద్ద న్యూస్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు మాలీవుడ్ సీరియల్ కవితా లక్ష్మీ. ఏషియన్ నెట్ ఛానెల్లో ప్రసారం అయ్యే స్త్రీ ధనం సీరియల్తో ఆమె బాగా ఫేమస్. ఏదో సీరియలో లేక రియాల్టీ షోలో భాగంగా ఆమె ఇలా చేసిందనుకుంటే పొరపాటే. జీవితంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటున్న ఆమె పగటి పూట నటిస్తూ.. రాత్రిపూట ఇలా హోటల్ నిర్వాహణతో కుటుంబాన్ని వెలదీస్తోందంట. ఈ విషయాలను ఆమె స్వయంగా మనోరమ పత్రికకు వెల్లడించారు. ఆరు నెలల క్రితం ఆమె తన కొడుకు ఆమె యూకేకు పంపించారు. అయితే ట్రావెల్ ఏజెన్సీ సంస్థ వారు దారుణంగా మోసం చేయటంతో ఇప్పుడు అతను అక్కడ కష్టాలు ఎదుర్కుంటున్నాడు. దీంతో ఆమె తెలిసినవారినల్లా సాయం కోసం చెయ్యి చాచింది. ప్రోడక్షన్ కంట్రోలర్ మనోజ్, నిర్మాత మనోజ్ పానికర్లు మాత్రమే కొంత సాయం చేయగా.. ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రాలేదంట. కష్టాలు పెరిగిపోతుండటంతో ఉన్న డబ్బుతో ఓ గ్రానైట్ షోరూమ్ను ఓపెన్ చేసి.. దాని ద్వారా లోన్ కోసం యత్నించారంట. కానీ, కుదరకపోవటంతో చివరకు దాన్ని మూసేశారంట. ఇలా చివరకు ఏ దారి లేకపోవటంతో ఓ హోటల్లో కూడా పని చేసినట్లు ఆమె చెబుతున్నారు. ‘నేను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. నా కుమారుడికి ఇలా కష్టపడి నెలనెలా డబ్బులు పంపుతున్నా. ఇప్పుడు నా బాధల్లా కూతురి గురించే’ అని ఆమె చెబుతున్నారు. అన్నట్లు మళయాళ మెగాస్టార్ మమ్మూటీ రికమండేషన్తో ఈ మధ్యే ఆమెకు రెండు సీరియళ్లలో అవకాశాలు దక్కాయంట. అయినా హోటల్ నిర్వాహణ మాత్రం ఆపనని కవిత అంటున్నారు. -
భారతీయుల ఫేవరెట్ టిఫిన్ ఏదో తెలుసా?
హోటల్కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇవ్వాలంటే ఏం చెబుతారు? ఒకప్పుడంటే ఏమో గానీ ఇప్పుడు మాత్రం ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా కూడా లేకుండా చాలామంది 'దోశ' కావాలనే చెబుతున్నారట. ప్లెయిన్ దోశ, ఆనియన్, మసాలా, రవ్వ, ఉల్లి రవ్వ, పెసర.. ఇలా రకరకాల దోశలు నోరు ఊరిస్తుంటే ఎవరు మాత్రం ఊరుకోగలరు? కొబ్బరి చెట్నీ, అల్లం చెట్నీ, సాంబారు ఇలాంటివి నంజుకుని తెగ లాగిస్తున్నారట. దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్ల మీద ఆన్లైన్ సర్వే చేస్తే ఈ విషయం తెలిసింది. ఒకవేళ దోశ లేదనుకుంటే మాత్రం అప్పుడు పోహా, పరోటాలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కువగా దోశలవైపే వినియోగదారుల మనసు మొగ్గు చూపుతోంది. స్విగ్గీ అనే ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ ఈ సర్వే చేసింది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ముందు దోశలవైపే జనం వెళ్తున్నారు. ఢిల్లీ జనాలు మాత్రం దాంతోపాటు చోళే భతూరే ఆర్డర్ ఇస్తుంటే.. ముంబై వాళ్లు బన్ మస్కా చెబుతున్నారు. పుణె వాసులు సాబుదానా కిచిడీ కావాలన్నారు. బెంగళూరులో ఎక్కువ మంది మసాలాదోశ, ఇడ్లీ వడ, పోహా అడుగుతున్నారు. దోశలలో తగినంతగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయని.. అందువల్ల అది ఆరోగ్యరీత్యా కూడా మంచిదని ఇండియన్ డయెటిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు షీలా కృష్ణస్వామి చెప్పారు. వారాంతాలలో అయితే దోశ ఆర్డర్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. మామూలు రోజుల్లో కంటే వారాంతాల్లో అయితే 30 శాతం ఎక్కువమంది వినియోగదారులు రకరకాల దోశలు కావాలని అడుగుతున్నారు. మామూలు రోజుల్లో చూసుకుంటే సోమ, మంగళవారాల్లో ఎక్కువమంది బయట టిఫిన్లు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఇళ్లలోనే చేసుకుంటున్నారట. -
పొలాల్లో దోశ, సాంబార్ సాగు అట..
• ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు • అందకుండా పోయిన ఇన్పుట్ సబ్సిడీ • ఆందోళనలో రైతులు మద్నూర్: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు.. ‘రైతులు తమ పంట పొలాల్లో దోశ, సాంబార్, హోటల్ పువ్వులు పండించారు. మంచి దిగుబడులు సాధించి లాభాల్లో ఉన్నారు’ అంటూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కారణంగా రైతులకు కరువు సాయం అందకుండా పోయిన వైనమిది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గా, సుల్తాన్పేట్ గ్రామాలకు చెందిన రైతులు గతేడాది ఖరీఫ్లో సోయాబీన్, పెసర తదితర పంటలు పండించారు. కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అందులో ఎక్కడా లేని విధంగా రైతులు సాంబార్, దోశ, హోటల్ పువ్వులు వంటి పంటలు పండించారని, మంచి లాభాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో వారికి ఇన్పుట్ సబ్సిడీ అందకుండా పోయింది. మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గాకు చెందిన రైతు హన్మంత్రావ్, పీరాబాయి, రుక్మిణీబాయి, దేవిదాస్, నాగ్నాథ్, అర్జున్ పటేల్, అహ్మద్ఖాన్లు దోçశ, సాంబార్, హోటల్ పువ్వులు వేశారని నమోదు చేశారు. సుల్తాన్పేట్కు చెందిన ధన్రాజ్గౌడ్ నాలుగు ఎకరాలలో సోయా వేయగా.. చిక్కుడుకాయ పండించారని, మౌలానా రెండు ఎకరాలలో హోటల్ పువ్వులు పండించారని పేర్కొన్నారు. అధికారుల నివేదిక మేరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాని రైతులు మంగళవారం తహ సీల్ కార్యాలయానికి వచ్చి అధికారులను నిలదీశారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా.. కొందరు రైతులు సాంబార్, దోశ పండించినట్లు జాబితాలో వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదని, దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. -
ఇంటిప్స్
దోసెపిండి పులిసినట్టుగా అనిపించినప్పుడు కొద్దిగా గోధుమపిండిని కలిపితే... వాసన తగ్గడంతో పాటు దోసెలు రుచిగా వస్తాయి.ఉప్పులో కొద్దిగా నిమ్మరసం కలిపి తోమితే రాగి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. బిస్కట్లు మెత్తబడకుండా ఉండాలంటే... వాటిని ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు వేయాలి. -
ఇడ్లీ - దోశ ఒక తులనాత్మక పరిశీలన - అవగాహన!
హ్యూమర్ ‘‘ఇడ్లీ, దోశలలో ఏది ఉత్తమమైంది స్వామీ’’ అని అడిగా మా గురువు గారిని. ‘‘నాయనా తుచ్ఛులైన వారు ఏది ఉత్తమమైనదీ అని అడుగుతారు. నువ్వు వెలిబుచ్చే ఇలాంటి పనికిమాలిన సందేహాలతో పొద్దుపుచ్చుతారు. కానీ తెలివైన వాళ్లు ఏది దొరికితే అది తినేస్తారు. అంతే తప్ప ఇలాంటి చచ్చు ప్రశ్నలు అడగరు నాయనా’’ అని సెలవిచ్చారు స్వామీజీ. అయినా నేను పట్టు వీడలేదు. ‘‘ఒకసారి ప్రశ్న కోసం పట్టుపట్టాక వదలకూడదని మీరే అన్నారు కదా స్వామీ. నా ప్రశ్న తర్క, మీమాంస శాస్త్రానికి సంబంధించిందని మీరెందుకు అనుకోకూడదు?’’ నేను మళ్లీ రెట్టించాను. ‘‘సరే విను. చిన్న గిన్నెతో పిండిని పెనం మీద వేశాక దోశ కావడానికి ఆ చిన్న గిన్నెతోనే దానిపై ఒత్తిడి పెడతారు. అది పెనం మీద పరుచుకునేలా విస్తరించడానికి దాని తలమీద రుద్దేస్తారు. కార్పొరేట్ కాలేజీ స్టూడెంట్లను రుబ్బుతుండటం సరికాదని నువ్వు నీ స్పీచుల్లో చెబుతుంటావు చూడు. వాళ్ల లాగే దోశ మీద కూడా అలా రుద్దడం సరికాదు నాయనా. అలా రుద్దినప్పుడు ఏమవుతుందో తెల్సా?’’ అడిగారు స్వామీజీ ‘‘ఏమవుతుంది స్వామీ...?’’ అడిగాను నేను. ‘‘దోశల్లా కార్పొరేట్ పిల్లల్లా ఎదగకుండా ఉండిపోతారు. కానీ ఇడ్లీ అలా కాదు. మెదడు వికాసం జరిగినట్లే ఇడ్లీ కూడా పొంగుతుంది. పిండి రేణువుకూ, పిండి రేణువుకూ మధ్య ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దోశ ముక్కలను ఎప్పుడైనా సాంబారులో వేశావా? ఏదో దోశతో పాటు స్పూనుతో తాగడానికి సాంబారు సరిపోతుంది గానీ... దోశముక్కలు సాంబారు అంత తేలిగ్గా పీల్చవు. అచ్చం నీ ఉపన్యాసాల్లో మన కార్పొరేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థుల్లాగే. వారూ అంత తేలిగ్గా ప్రాపంచిక విషయాలను గానీ... లోకజ్ఞానాన్నిగానీ అబ్జార్బ్ చేసుకోలేరు...’’ అంటుండగానే నేను మధ్యలోనే అడ్డుపడ్డాను. ‘‘అంటే... ఇడ్లీ పీల్చుకుంటుందా స్వామీ’’ ‘‘తప్పకుండా నాయనా... మంచి నిపుణులైన వంట చేసేవాళ్లు పిండి కలిపారనుకో. ఆ రవ్వా... ఆ మినప్పప్పు సమపాళ్లలో కలిశాయనుకో. ఇడ్లీలోని పిండికి మధ్య ఎంతెంతో పఫ్పీ స్పేస్ ఉంటుంది. ఆ మధ్యనున్న స్థలంలో సాంబారు దూరిపోతుంది. సాంబారులో నానిన ఆ ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నాయనా’’ చెబుతున్నారు స్వామీజీ. ‘‘నిజమే కదా స్వామీ’’ బదులిచ్చాను నేను. ‘‘అంతేకాదు నాయనా... జనం పెరిగారు. జనాభా పెరిగింది. వాళ్లకు తగ్గట్లుగా ఇళ్లు కూడా కావాలి కదా’’ అన్నారు స్వామీజీ. ‘‘అవును కదా. మరి దానికీ ఇడ్లీకీ సంబంధమేమిటి స్వామీ?’’ అడిగాను. ‘‘అదే నాయనా నాలాంటి జ్ఞానులకూ, నీకూ తేడా. ఇడ్లీ పాత్రలో గతంలో రెండు అంతస్తులు మాత్రమే ఉండేవి. పాత్రపెద్దదవుతూ ఉండేదీ... దానిలోని పిండి పోసే చిప్పలు పెరిగేవి. కానీ... డూప్లెక్సు భవనంలా ఇడ్లీ ప్లేట్లు రెండే ఉండేవి. కానీ ఇప్పుడు మాడ్రన్ ఇడ్లీ పాత్రను ఎప్పుడైనా హోటల్లో చూడు. బహుళ అంతస్తుల భవనాల్లో ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ర్యాకులనూ, డెస్కులనూ బయటకు లాగినట్లుగా వాటిని లాగుతుంటారు’’ అని జవాబిచ్చారు స్వామీ. ‘‘అవును స్వామీ... ఇడ్లీ పాత్రకూ, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లకూ అంత దగ్గరి సంబంధం ఉంటుందనుకోలేదు’’ అన్నాన్నేను. ‘‘అంతేకాదు... దోశ కంటే ఇడ్లీ ఎన్ని రకాలుగా ఉత్తమమో చెబుతాను ఆగు. ఉదాహరణకు మసాలా దోశ తిన్నావనుకో. అందులో మసాలా పేరిట ఉండే పదార్థం నీకు సరిపడకపోవచ్చు. కడుపులో మంట పుట్టించవచ్చు. దోశకు అది తెచ్చిపెట్టుకున్న టేస్టు. కానీ ఇడ్లీలో అలా కాదు నాయనా... మసాలాలూ, గిసాలాలూ ఏవీ లేకుండా... కేవలం ఇడ్లీ వల్లనే ఇడ్లీకి రుచి వస్తుంది. ఏదీ తెచ్చిపెట్టుకోనిదో, ఏది స్వాభావికమైనదో ఆ టేస్టు గొప్పది నాయనా’’ అన్నారు స్వామీజీ. ‘‘అయినా అరిషడ్వర్గాలనూ జయించిన మీలాంటి స్వామీజీలు రుచుల గురించి ఇంత విపులమైన వర్ణనలేమిటి స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగా. ‘‘పిచ్చివాడా... ఇడ్లీ అంటే ఏమిటి? సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం నాయనా. సాంబారు ఇడ్లీలోకి ఎలా ఇంకిపోతుందో తెలుసా? అచ్చం జీవాత్మ పరమాత్మలో లీనమైనట్లే! మాలాంటి జ్ఞానులకు ఇవన్నీ తెలుసు. కానీ తిండిబోతులైన నీలాంటి తుచ్ఛులకు అర్థమయ్యేలా చెప్పడమెలా? అయినా నువ్వే చెప్పావు కదా. తర్క మీమాంస శాస్త్రాలు నీబోటి సామాన్యులకు కూడా అర్థం కావడం కోసమే నాయనా ఈ ఉదాహరణలు’’ అని సెలవిచ్చారు స్వామీజీ. నాకు జ్ఞానోదయమైంది. అనంతాకాశం అనే సాంబారు ప్లేటులో అర్ధచంద్రుడు ఇడ్లీలా దర్శనమిచ్చాడు! - యాసీన్