goutam adani
-
నేడు కుంభమేళాకు గౌతమ్ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. నేడు (మంగళవారం) అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు రానున్నారు.గౌతమ్ అదానీ తన పర్యటనలో భాగంగా తొలుత త్రివేణీ సంగమంలో స్నానం చేయనున్నారు. అలాగే బడే హనుమంతుని దర్శనం చేసుకోనున్నారు. అదానీ గ్రూప్.. ఇస్కాన్, గీతా ప్రెస్ల భాగస్వామ్యంతో మహా కుంభమేళాలో భక్తులకు పలు సేవలు అందిస్తోంది. మహాకుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అదానీ గ్రూప్ మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది.గౌతమ్ అదానీ నేడు ఇస్కాన్ ఆలయంలో నిర్వహించే భండార సేవలో కూడా పాల్గొననున్నారు. మహా కుంభమేళాలో అదానీ అందిస్తున్న సేవలను చూసి భక్తులు మెచ్చుకుంటున్నారు. గీతా ప్రెస్ సహకారంతో అదానీ గ్రూప్ భక్తులకు ఆధ్మాత్మిక పుస్తకాలను వితరణ చేస్తోంది. ఈ విధంగా ఆదానీ సంస్థ ఆధ్యాత్మిక సాహిత్యం గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదేవిధంగా ఆదానీ గ్రూప్ భక్తులకు ప్రయాగ్రాజ్లో ఉచిత ప్రయాణి సౌకర్యాన్ని అందిస్తోంది. ఇది మహా కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉంది. ఇది కూడా చదవండి: Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్’ గాయని ఘనత ఇదే -
పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం.. రాజ్నాథ్తో రాహుల్ గాంధీ
ఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్కు వస్తున్న రాజ్నాథ్ సింగ్కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్నాథ్ స్వీకరించారు.#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz— ANI (@ANI) December 11, 2024 నవంబర్ 20న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
‘‘100 కోట్లు వెనక్కి సరే.. ఒప్పందాల మాటేమిటి రేవంత్?’’
సాక్షి,హైదరాబాద్ : రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇస్తున్నారు సరే.. అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్రెడ్డి .. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో హరీష్ రావు స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ...మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024 -
అదానీ విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:అదానీ విషయంలో కాంగ్రెస్ ఢిల్లీలో ఒకలా,గల్లీలో మరోలా మాట్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(నవంబర్22) తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘అదానీ అవినీతిపరుడైతే..రేవంత్రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్గాంధీ చెప్పాలి. రాహుల్గాంధీకి చిత్తశుద్ధి ఉంటే..తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి.కెన్యా లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు..రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు?మహారాష్ట్ర వెళ్ళి అదానీని గజదొంగ అన్న రేవంత్ తెలంగాణలో మాత్రం గజ మాల వేస్తున్నాడు. అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి చెప్పాలి. అదానీ వ్యవహరంతో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది. మోదీ,అమిత్ షా,రాహుల్,రేవంత్,కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి.అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి.స్కిల్ యూనివర్శిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్పా? కాదా? కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి,అదానీ రహస్య సమావేశం అయిన మాట వాస్తవం. అదానీతో ఒప్పందాలు రేవంత్ సర్కార్ రద్దు చేసుకోవటం లేదు?అదానీ వేల కోట్ల ఒప్పందాలపై రోజూ విమర్శించే రాహుల్ గాందీ సమాధానం చెప్పాలి.రాహుల్ గాంధీకి తెలిసే రేవంత్రెడ్డి విరాళం తీసుకున్నారా? బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే..కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా?కేసీఆర్ హాయాంలో ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. అదానీతో మేము ఫోటోలు దిగిన మాట వాస్తవం. అంతే మర్యాదగా బయటకు పంపించాం. రేవంత్రెడ్డి మాత్రం అదానీకి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికాడు.అదానీతో రేవంత్ చేసుకున్న 12,400కోట్ల రూపాయల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. బడేబాయ్ మోదీ ఆదేశాలను చోటా బాయ్ రేవంత్ అమలు చేశాడు.తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు రేవంత్ సహకారం. అదానీ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మసకబారింది. అదానీ వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమ వద్దని ఆందోళనా చేసినా రేవంత్ పట్టించుకోలేదు’అని కేటీఆర్ తెలిపారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో మిగిలేది ఆ ఐదుగురే: హరీశ్రావు -
అదానీని ఇవాళే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. #WATCH | Delhi: When asked if he would raise the issue of US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, in Parliament, Lok Sabha LoP Rahul Gandhi says, "We are raising this issue. It is my responsibility as LoP, to raise this… pic.twitter.com/UenrnN2dej— ANI (@ANI) November 21, 2024ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్ మదహబి పురి బుచ్ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. #WATCH | Delhi: On US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, Lok Sabha LoP Rahul Gandhi says, "JPC is important, it should be done but now the question is why is Adani not in jail?...American agency has said that he has… pic.twitter.com/rAzVUoquqN— ANI (@ANI) November 21, 2024 -
స్కూటర్పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.1962లో అహ్మదాబాద్లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.1998లో కిడ్నాప్గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్ను 1998లో అహ్మదాబాద్లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.ఉగ్రవాదుల దాడి1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: గూగుల్కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్. -
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!
ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(62) తన 70వ ఏటా పదవీవిరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. 2030ల్లో వ్యాపార సామ్రాజ్య పట్టపు పగ్గాలను తన వారసులకు కట్టబెడుతానని చెప్పారు. ఈమేరకు బ్లూమ్బర్గ్ నివేదికలో వివరాలు వెలువడ్డాయి.గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులు అవుతారని నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ..అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. చిన్న కుమారుడు జీత్ అదానీ..అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ..అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ..అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.ఇదీ చదవండి: నెట్వర్క్లో అంతరాయం.. బిల్లులో రాయితీ!ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ..‘వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యమైంది. నా తర్వాత కంపెనీలోకి వచ్చిన వారంతా చాలా నిబద్ధతతో పని చేస్తున్నారు. ఇప్పటికే కుమారులు, ఇతర బంధువులు కొన్ని కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. క్రమానుగతంగా కంపెనీ ఎదిగేందుకు తర్వాతితరం బాధ్యతలు చేపట్టాలి. దీనిపై ఉమ్మడి నిర్ణయాధికారానికే ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు. ఇదిలాఉండగా, ఇటీవల అదానీ గ్రూప్ కోర్ సంస్థగా ఉన్న అదానీ ఎంటర్ప్రైజెస్ మొదటి త్రైమాసికంలో రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని పోస్ట్ చేసింది. -
వయనాడ్ ఘటన: గౌతమ్ అదానీ భారీ విరాళం
వయనాడ్లో కొండచరియలు విరిగిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించిన జనం నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో వీరికి అండగా నిలబడటానికి ప్రముఖ వ్యాపార దిగ్గజం 'గౌతమ్ అదానీ' కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.వయనాడ్ బాధితుల సహాయార్థం గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళంగా ప్రకటించారు. వయనాడ్లో జరిగిన ప్రాణనష్టం పట్ల అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 200 కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా సుమారు ఏడువేలకంటే ఎక్కువమంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదయినా గురైనవారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.Deeply saddened by the tragic loss of life in Wayanad. My heart goes out to the affected families. The Adani Group stands in solidarity with Kerala during this difficult time. We humbly extend our support with a contribution of Rs 5 Cr to the Kerala Chief Minister's Distress…— Gautam Adani (@gautam_adani) July 31, 2024 -
గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!
ఇజ్రాయెల్లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియా ఓడరేవు డార్ ఎస్ సలామ్ తర్వాత నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయంగా కీర్తి గడిస్తున్న అదానీ పోర్ట్ కార్యకలాపాలు వియత్నాంలో కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది. దీనికోసం అదానీ గ్రూప్ వియత్నాంలో ఓడరేవును నిర్మించాలని యోచిస్తోంది.భారతదేశంలో ప్రముఖ ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోంది. తద్వారా లాభాలను గడిస్తోంది.భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), వియత్నాంలోని డా నాంగ్లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, పెట్టుబడులకు సంబంధించిన మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు.గౌతమ్ ఆదానీ.. తన అదానీ పోర్ట్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని అధిక ఉత్పత్తి లేదా అధిక జనాభా ఉన్న దేశాలలో ఓడరేవులను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం మొత్తం వాణిజ్య పరిమాణంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి పొందుతోంది. ఇది 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..అదానీ గ్రూప్ కేరళలోని విజింజం ఓడరేవును ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ మొదటి దశ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ పోర్ట్ 2028-29 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. దీనికోసం ఏకంగా రూ. 20000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. -
బీహెచ్ఈఎల్కు జాక్ పాట్.. అదానీ పవర్ నుంచి భారీ ఆర్డర్
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ రూ.3,500 కోట్ల భారీ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ) ఏర్పాటు కోసం అదానీ పవర్ నుండి రూ. 3,500 కోట్ల ఆర్డర్ను అందుకున్నట్లు బీహెచ్ఈఎల్ తెలిపింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 2x800 మెగావాట్ల టీపీపీని ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుంచి బీహెచ్ఈఎల్ ఆర్డర్ దక్కించుకున్నట్లు బీహెచ్ఈఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది.ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ సంస్థ తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్లలో బాయిలర్, టర్బైన్ జనరేటర్లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, అదానీ-బీహెచ్ఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంతో జూన్ 5న బీహెచ్ఈఎల్ షేర్లు 3 శాతం లాభంతో రూ.253.85 వద్ద ముగియగా, అదానీ పవర్ షేర్లు రూ.723 వద్ద స్థిరపడ్డాయి. -
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. -
మరో బిజినెస్లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్కు చెందిన అదానీ వన్ యాప్లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
హిండెన్బర్గ్ను ఎదురొడ్డి.. నష్టాల నుంచి బయటపడ్డ అదానీ
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్బెర్గ్ నివేదించింది.హిండెన్బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం. -
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
సాక్షి, వేములవాడ : కాంగ్రెస్ యువరాజు రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన నోరు మెదపరేం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్సభ ఎన్నికల తరుణంలో వేములవాడలో బీజేపీ శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న మోదీ.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎందుకు సైలెంట్ అయ్యారు ఐదేళ్లుగా ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్.. ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్..ఆపై అంబానీ-అదానీ అంటూ జపం చేసిన రాహుల్ గాందీ లోక్సభ ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.తెలంగాణ గడ్డమీద నుంచితెలంగాణ గడ్డమీద నుంచి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతున్నా అంబానీ, అదానీల నుంచి ఎంత తీసుకున్నారు? మీ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? లేకపోతే ఓవర్ నైట్లోనే అంబానీ, అదానీలను విమర్శించడం ఎందుకు మానేశారని ప్రశ్నించారు.పదునైన అస్త్రాలను రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రముఖ వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతేకాదు బీజేపీ 22 మందిని బిలియనీర్లుగా మార్చిందని వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజల్ని లక్షాదికారుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే తాజాగా, వేములవాడ సభలో పదే పదే రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు -
‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’
అదానీ గ్రూప్ స్టాక్స్పై షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో గతేడాది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో పెద్దమొత్తంలో స్టాక్ ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఆ నివేదిక వెలువడినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద భారీగా పతనమైంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అదానీ ఇటీవల తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ హిండెన్బర్గ్ వ్యవహారాన్ని ఎలా కట్టడిచేశామో తెలిపారు. ‘హిండెన్బర్గ్ ఆరోపణలను వచ్చాక తొలుత వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పూర్తిగా పాత సమాచారాన్నే ఆ సంస్థ కొత్త రూపంలో పేర్కొంది. ఆ వివాదం వెంటనే తొలగిపోతుందనుకున్నాను. ప్రపంచంలో ఓ కార్పొరేట్ కంపెనీపై జరిగిన అతిపెద్ద దాడి అది. సాధారణంగా షార్ట్సెల్లర్లు చేసే దాడులకు వ్యాపార కోణమే ఉంటుంది. కానీ, మాపై జరిగినది కేవలం ఫైనాన్షియల్ మార్కెట్లకే పరిమితం కాలేదు.. రాజకీయ కోణం కూడా సంతరించుకుంది. చాలా సమన్వయంతో మమ్మల్ని దెబ్బకొట్టాలనుకున్నారు. చాలా తొందరగానే హిండెన్బర్గ్ కుట్రను అర్థం చేసుకున్నాను. గతంలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. దాంతో మా సొంత ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లు విలువైన ఎఫ్పీవోను వెనక్కి తీసుకొన్నాం. రూ.75,000 కోట్ల నగదు, రూ.17,500 కోట్ల ప్రీపెయిడ్ మార్జిన్ లింక్డ్ ఫైనాన్సింగ్తో నిధి ఏర్పాటు చేశాం. సీఈవోలు, ఎగ్జిక్యూటివ్లను వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలని సూచించాం. ఖావ్డ, ధారావి వంటి కొత్త ప్రాజెక్టుల రూపంలో వ్యాపార విస్తరణను కొనసాగించాం. వార్రూమ్ ఏర్పాటు చేశాం. దాంతో ఇన్వెస్టర్లకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాం. ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. ఈ వ్యవహారం నుంచి ఓ విషయం నేర్చుకొన్నాం. మంచి పనిచేయడమే కాదు.. మన గురించి అందరికీ తెలియాలి. కమ్యూనికేషన్ మరింత పెంచుకోవాలి. హిండెన్బర్గ్ వ్యవహారం మొత్తంలో చిన్న వాటాదారులు దెబ్బతినడమే నన్ను బాధించింది. మా కంపెనీలు తిరిగి పుంజుకొన్నాక హిండెన్బర్గ్ నివేదికలో నిజం లేదని తేలింది’ అని గౌతమ్ అదానీ వివరించారు. -
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
హిండెన్ బర్గ్ వివాదం నుంచి తేరుకుని.. అదానీ మరో కీలక నిర్ణయం!
హిండెన్ బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్ల కోసం తన బిజినెస్ జెట్ ఫ్లైట్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి రవాణా సౌకర్యం కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 12కి చేరిన బిజినెస్ జెట్లు ఈ ఆరు పిలాటస్ పీసీ-24 జెట్లను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ మొత్తం బిజినెస్ జెట్ల సంఖ్య 12 అవుతుంది. అదానీతో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్లు వ్యాపార కార్యకలాపాల కోసం చేసే జర్నీ సజావుగా, సమర్థంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినందున మొత్తం ఆరు విమానాలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని సమాచారం. సుప్రీం తీర్పుతో కోలుకున్న అదానీ 2023లో జరిగిన నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు తన కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 80 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి 2023 జనవరిలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీ, అతని సంస్థ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా అదానీ తన గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోవడంతో సుమారు 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అత్యంత ధనవంతుడిగా అయితే, ఏడాది తర్వాత సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై అదనపు దర్యాప్తు అవసరం లేదని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.దీంతో అదానీ కంపెనీ నష్టాల నుంచి త్వరగా కోలుకొని, తన సంపదను తిరిగి పొంది ముకేశ్ అంబానీని అధిగమించి స్వల్పకాలం పాటు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. -
గౌతమ్ అదానీకి షాక్.. అంతకంతకూ పెరుగుతున్న ముఖేష్ అంబానీ సంపద!
2023 వ్యాపార వేత్తలకు కలిసి వచ్చిందా? లేదంటే నష్టాల్ని మూటగట్టుకున్నారా? హిండెన్ బర్గ్ రిపోర్ట్తో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఎంత సంపదను కోల్పోయారు?ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ డీమెర్జర్ కావడం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఎంతమేరకు కలిసి వచ్చింది. వీళ్లిద్దరితో పాటు మిగిలిన వ్యాపార వేత్తలకు ఈ ఏడాది ఎలాంటి ఫలితాల్ని ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు.బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ ఈ ఏడాది అత్యధికంగా 9.98 బిలియన్ డాలర్ల సంపదను సమకూర్చుకున్నారు. దీంతో ఆయన మొత్తం ఆస్తి విలువ 97.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రపచం వ్యాప్తంగా సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. అంబానీ సంపాదన పెరిగేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీస్ షేర్లు రాణించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ భాగం. అయితే జులై 20, 2023న ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ డీమెర్జర్ అయ్యింది. అనంతరం స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్టాక్ మార్కెట్లోని లిస్టింగ్కు ఊహించని స్పందన రావడంతో పాటు రిలయన్స్ షేర్లు సైతం 9 శాతం వృద్దిని నమోదు చేశాయి. ఫలితంగా ముఖేష్ అంబానీ ఈ అరుదైన ఘనతను సాధించారు. అదానీకి అంతగా కలిసిరాలేదు మరో అపరకుబేరుడు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిండెన్బర్గ్ వంటి నిరాధారమైన నివేదికలతో అదానీ షేర్లు కుప్పకూలాయి. దీంతో 2023లో ఆయన 37.3 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్ డాలర్లతో దేశీయ రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో అత్యధికంగా 21 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుకున్న హెచ్సీఎల్ 2023లో ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ హెచ్సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ సంపద 9.47 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. హెచ్సీఎల్ షేరు ధర 41 శాతం పెరిగింది. సాహో సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ సంపద కూడా 8.93 బిలియన్ డాలర్లు అందుకొని 24.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతేకాదు జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ ఎనర్జీ షేర్లు రాణించడంతో మహిళా సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్ 24.7 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. పరుగులు తీసిన డీఎల్ఎఫ్ షేర్లు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లు స్టాక్ మార్కెట్లో పరుగులు తీశాయి. ప్రీసేల్స్తో పాటు కొత్త కొత్త ప్రాజెక్ట్లు లాంచ్ చేయడం డీఎల్ఎఫ్కు కలిసొచ్చింది. ఆ సంస్థ షేర్లు 91 శాతం వృద్దిని నమోదు చేశాయి. దీంతో ఆ కంపెనీ అధినేత కుషాల్ పాల్ సింగ్ సంపద 7.83 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద విలువ 16.1 బిలియన్లకు చేరుకుంది. అదే దారిలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సైతం ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో 158 ఏళ్లుగా సేవలందిస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ను నియంత్రిస్తున్న షాపూర్ మిస్త్రీ ఈ ఏడాది తన సంపదకు 7.41 బిలియన్ డాలర్లు జోడించారు. ఆయన నికర విలువ ఇప్పుడు 35.2 బిలియన్ డాలర్లు. కుమార్ మంగళం బిర్లాతో పాటు మరింత మంది 2023లో తమ నికర విలువను బాగా పెంచుకున్న ఇతర బిలియనీర్లలో ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన కుమార్ మంగళం బిర్లా (7.09 బిలియన్ డాలర్లు), రవి జైపురియా (5.91 బిలియన్ డాలర్లు), సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి (5.26 బిలియన్ డాలర్లు), లోధా గ్రూప్ మంగళ్ ప్రభాత్ లోధా (3.91 బిలియన్ డాలర్లు), ఎయిర్టెల్ నుంచి సునీల్ మిట్టల్ (3.62 బిలియన్) ఉన్నారు. మరోవైపు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా సంపద 7.09 బిలియన్ డాలర్లు అధికం కాగా, సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 5.26 బిలియన్ డాలర్లు, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ 3.62 బిలియన్ డాలర్లు పెరిగింది. -
డిజిటల్ ఎకానమీపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: దాదాపు 175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీ డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చెయిన్ తదితర ఉత్పత్తులు, సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అబుధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) అనుబంధ సంస్థ సిరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్తో అదానీ ఎంటర్ప్రైజెస్లో (ఏఈఎల్) భాగమైన అదానీ గ్లోబల్ జట్టు కట్టింది. సిరియస్ డిజిటెక్ ఇంటర్నేషనల్ పేరుతో జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది అబుధాబీ కేంద్రంగా పని చేస్తుంది. సిరియస్ జేవీలో సిరియస్కు 51%, అదానీ గ్రూప్నకు 49% వాటాలు ఉంటాయి. అంతర్జాతీయంగా డిజిటల్ పరివర్తన విభాగంలో సిరియస్ అనుభవం, దేశీ మార్కెట్పై అదానీ గ్రూప్ పరిజ్ఞానంతో భారత డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై సిరియస్ జేవీ దృష్టి పెట్టనుందని ఏఈఎల్ తెలిపింది. ప్రస్తుతం 175 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ ఎకానమీ 2030 నాటికి ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లుగా ఎదగనుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ఫ్రాతో పాటు ఫిన్టెక్, హెల్త్టెక్, గ్రీన్టెక్ తదితర రంగాల్లోనూ అధునాతన కృత్రిమ మేథ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), బ్లాక్చెయిన్ మొదలైన వాటిని మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు సిరియస్ జేవీ కృషి చేస్తుందని తెలిపింది. -
మరో మీడియా సంస్థను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్ బీక్యూ ప్రైమ్ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్ఎస్లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
జెట్ స్పీడ్తో తన సంపదను పెంచుకుంటూ పోతున్న గౌతమ్ అదానీ!
భారత బిలియనీర్ గౌతమ్ అదానీ జెట్ స్పీడ్తో తన సంపదను పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలో తొలి 20 ధనవంతుల జాబితాలో 19వ స్థానాన్ని దక్కించుకున్నారు. మంగళవారం అదానీ గ్రూప్లోని 10 నమోదిత కంపెనీల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దీంతో ఆ ఒక్కరోజే అదానీ గ్రూప్ మొత్తం కంపెనీల మార్కెట్ కేపిటల్ వ్యాల్యూ లక్ష కోట్లకు చేరింది. అదే రోజు అదానీ వ్యక్తిగత సంపద సైతం 6.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోని ఇతర బిలియనీర్లు జూలియా ఫ్లెషర్ కోచ్ అండ్ ఫ్యామిలీ (64.7 బిలియన్ డాలర్లు), చైనాకు చెందిన జాంగ్ షన్షాన్ (64.10 బిలియన్ డాలర్లు), అమెరికాకు చెందిన చార్లెస్ కోచ్ (60.70 బిలియన్ డాలర్లు)లను వెనక్కి నెట్టారు. ఒక్క రోజులో లక్ష కోట్లు నవంబర్ 28,2023 నాటికి అదానీ గ్రూప్లోని 10 కంపెనీల మొత్తం విలువ రూ.11,31,096కి చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ మంగళవారం ఒక్కరోజే మార్కెట్ విలువ రూ.1.04లక్షల కోట్లకు పెరిగింది. అయితే, గ్రూప్ మార్కెట్ క్యాప్ జనవరి 24న గరిష్ట స్థాయి రూ.19.19 లక్షల కోట్ల నుంచి 41 శాతం తగ్గింది.ఇక స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్కు చెందిన కంపెనీలు భారీ ర్యాలీ చేయడానికి కారణం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలే కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సెబీని అనుమానించలేం హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు పై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ‘సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలన్నిటినీ వాస్తవాలుగా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేదని పేర్కొంది. అదానీ-హిండెన్బర్గ్ అంశంలో దాఖలైన పలు కేసులపై వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. -
విల్మర్ కంపెనీ వాటా మొత్తం విక్రయించడానికి సిద్దమైన అదానీ
ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం పొందిన ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త 'గౌతమ్ అదానీ' (Gautam Adani) విల్మర్ లిమిటెడ్లోని తన మొత్తం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత? విక్రయిచాలనుకుంటే దానికిగల కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వంట నూనెలు సహా ఇతర ఆహార, పానీయ ఉత్పత్తుల్ని విక్రయించే అదానీ విల్మర్లో గౌతమ్ ఆదానీ వాటా 43.97 శాతం ఉంది. ఈ వాటాలను మొత్తం విక్రయించడానికి మల్టీనేషనల్ కన్జూమర్ గూడ్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ఇవన్నీ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీ నష్టాలు అదానీ విల్మర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వెల్లడించిన ఫలితాల ప్రకారం ఏకంగా రూ. 130.73 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు తెలిసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48.76 కోట్ల లాభాలను ఆర్జించిన కంపెనీ ఈ ఏడాది ఊహకందని నష్టాలను పొందాల్సి వచ్చింది. ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ బిజినెస్లో నష్టాలు వచ్చినట్లు సమాచారం. అదానీ విల్మర్ మొత్తం వ్యయం రూ. 12,439.45 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే! అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' ఇప్పటికీ కొన్ని ఆర్థిక పరమైన చిక్కులో ఉన్నట్లు.. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇంకా కోలుకోలేకపోయినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం తన గ్రూప్కు చెందిన కంపెనీ వాటాల్ని మొత్తం విక్రయించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. -
విమానాల లీజింగ్ వ్యాపారంలోకి అదానీ పోర్ట్స్
ముంబై: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) తాజాగా విమానాల లీజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సొంతంగా ఉడాన్వత్ లీజింగ్ ఐఎఫ్ఎస్సీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 2.5 కోట్లు అదీకృత మూలధనంతో దీన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. టాటా గ్రూప్లో భాగమైన ఎయిరిండియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) గిఫ్ట్ సిటీలో సొంత ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. -
భారత్ కుబేరుల్లో అంబానీ టాప్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా 360 వన్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితా 2023లో అగ్రస్థానంలో నిల్చారు. రూ. 8.08 లక్షల కోట్ల సంపదతో ఆయన టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. గత ఏడాది వ్యవధిలో అంబానీ సంపద స్వల్పంగా రెండు శాతం పెరిగింది. అటు మరో దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 4.74 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద 57 శాతం కరిగిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాలు, షేర్లలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల దెబ్బతో అదానీ సంస్థల షేర్లు కుదేలవడం ఇందుకు కారణమని హురున్ ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. ఆగస్టు 30 తేదీ ప్రాతిపదికగా హురున్ ఈ జాబితాను రూపొందించింది. ఈసారి లిస్టులో 138 నగరాలకు చెందిన 1,319 మంది కుబేరులకు చోటు దక్కింది. రూ. 2.78 లక్షల కోట్ల సంపదతో (36 శాతం వృద్ధి) సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా మూడో స్థానంలో, రూ. 2.28 లక్షల కోట్లతో (23 శాతం వృద్ధి) హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ ఆ తర్వాత ర్యాంకులో ఉన్నారు. గత ఏడాది వ్యవధిలో భారత్లో ప్రతి మూడు వారాలకు కొత్తగా ఇద్దరు బిలియనీర్లుగా ఎదిగారు. ప్రస్తుతం 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో వారి సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. మరిన్ని విశేషాలు.. ►గోపిచంద్ హిందుజా (5), దిలీప్ సంఘ్వి (6), ఎల్ఎన్ మిట్టల్ (7), కుమార మంగళం బిర్లా (9), నీరజ్ బజాజ్ (10) టాప్ టెన్లో ఉన్నారు. ►డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సంపద 18 శాతం క్షీణించి రూ. 1.43 లక్షల కోట్లకు పడిపోవడంతో ఆయన 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ►అసమానతలు పెరిగిపోతుండటంపై ఆందోళన నేపథ్యంలో ఏడాది వ్యవధిలో 51 మంది కుబేరుల సంపద రెట్టింపయ్యింది. అంతక్రితం ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య 24గా నమోదైంది. ►నగరాలవారీగా చూస్తే 328 బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ (199), బెంగళూరు (100), హైదరాబాద్ (87) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలిసారిగా టాప్ 20 నగరాల్లో తిరుప్పూర్ చోటు దక్కించుకుంది. ►ప్రైవేట్ ఈక్విటీ రంగం నుంచి తొలిసారిగా కేదార క్యాపిటల్కు చెందిన మనీష్ కేజ్రివాల్ చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద రూ. 3,000 కోట్లు. ► ప్రెసిషన్ వైర్స్కు చెందిన మహేంద్ర రాఠిలాల్ మెహతా 94 ఏళ్ల వయస్సులో లిస్టులో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా... టాప్ 100లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రూ. 55,700 కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి 23వ ర్యాంకులో నిల్చారు. 196% సంపద వృద్ధితో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాకు చెందిన పీవీ పిచ్చిరెడ్డి (రూ. 37,300 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ. 35,800 కోట్లు) వరుసగా 37, 41వ ర్యాంకుల్లో ఉన్నారు. హెటిరో గ్రూప్ చైర్మన్ బి. పార్థసారథి రెడ్డి కుటుంబం రూ. 21,900 కోట్ల సంపదతో 93వ స్థానంలో, అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపదతో 98వ స్థానంలో, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లతో 99వ ర్యాంకులో ఉన్నాయి. -
దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ది వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో వాల్ట్ డిస్నీకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు పలునివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బిలియనీర్ గౌతమ్ అదానీ, మీడియా మొఘల్, సన్ నెట్ గ్రూప్ అధినేత కళా నిధి మారన్తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్లో నిర్వహించే కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా, స్పోర్ట్స్ రైట్స్, లోకల్ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్తో సహా ఇతర ఆస్తుల్ని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తేలింది. ముఖేష్ అంబానీతో చర్చలు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సైతం ఆస్తుల అమ్మే అంశంపై చర్చలు ఇప్పటికే జరిగాయని బ్లూమ్బెర్గ్ గతంలో నివేదించింది. తద్వారా భారత్లో డిస్నీ తన వ్యాపారాన్ని అమ్మేడం లేదంటే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ దెబ్బ.. ఆపై హెచ్బీఓ కాంట్రాక్ట్ సైతం జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా దక్కించుకున్న తరువాత ఆస్తుల అమ్మకం తెరపైకి వచ్చింది. దీనికితోడు వార్నర్ బ్రదర్స్కు చెందిన హెచ్బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్స్టార్కు సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు. దీంతో ఆస్తుల్ని అమ్మేందుకు మొగ్గుచూపింది. అదానీ వర్సెస్ మారన్ ఆస్తులు,స్టాక్స్ను కొనుగోలు చేసేందుకు కళానిధి మారన్ సుమఖత వ్యక్తం చేస్తుండగా.. అదానీ సైతం తన మీడియా సంస్థ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ను (ఎన్డీటీవీ)ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, క్రయ,విక్రయ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలుగులోకి రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
హిండెన్బర్గ్ 2.0: అదానీ గ్రూప్పై మరో పిడుగు.. ఓసీసీఆర్పీ సంచలన ఆరోపణలు
అదానీ గ్రూప్ స్టాక్స్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్బర్గ్ తర్వాత వెల్లడించాడు. హిండెన్బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ గ్రూప్కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి. ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ.. ఇదిలా ఉండగా ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే అదానీ గ్రూప్ స్టాక్లు రెడ్ జోన్లోకి జారిపోయాయి. అదానీ పవర్ షేర్లు 3 శాతానికి పైగా నస్టపాయాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ ధర 3.3 శాతానికి పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 2.50 శాతం మేర నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ 2.25 శాతం మేర నష్టపోయాయి. -
అదానీ గ్రీన్ ఎనర్జీలో క్యూఐఏకి వాటాలు
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్)లో ఖతార్కు చెందిన సార్వభౌమ నిధి ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 2.5 శాతం పైగా వాటాలను కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 3,920 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎంఎల్)లో 2020లో 25.1 శాతం వాటాలు కొనుగోలు చేసిన క్యూఐఏ మళ్లీ అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. స్టాక్ ఎక్ఛేంజీల డేటా ప్రకారం ప్రమోటర్ గ్రూపు సంస్థ ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ .. ఏజీఈఎల్లో సుమారు 4.49 కోట్ల షేర్లను (2.8 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 920 చొప్పున మొత్తం రూ. 4,131 కోట్లకు విక్రయించింది. క్యూఐఏ అనుబంధ సంస్థ అయిన ఐఎన్క్యూ హోల్డింగ్ 4.26 కోట్ల షేర్లను (దాదాపు 2.68 శాతం వాటా) కొనుగోలు చేసింది. సగటున రూ. 920 రేటు చొప్పున ఇందుకోసం మొత్తం రూ. 3,920 కోట్లు వెచ్చించింది. -
పేరు మార్చుకున్న అదానీ కంపెనీ..
న్యూఢిల్లీ: అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ తన పేరును మార్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్గా ఈ నెల 27వ తేదీ నుంచి పేరు అమల్లోకి వచ్చినట్టు అదానీ ట్రాన్స్మిషన్ ప్రకటించింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అహ్మదాబాద్ శాఖ నుంచి పేరు మార్పునకు సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అందుకున్నట్టు తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి అవసరమైన పత్రాలను కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా కంపెనీగా ఉంది. 14 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, ముంద్రా సెజ్లలో 12 మిలియన్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. జూన్లో ముగిసిన మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఆమోదించడానికి, ప్రకటించడానికి కంపెనీ బోర్డు సమావేశం జూలై 31న జరగనుంది. -
అదానీ గ్రూప్ సంస్థల్లో మరో కీలక పరిణామం!
న్యూఢిల్లీ: Gautam Adani Raised rs 11,330 crore : ప్రణాళికలకు అనుగుణంగానే నిధుల సమీకరణ చేపట్టినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో గత నాలుగేళ్లలో రూ. 73,800 కోట్లు(9 బిలియన్ డాలర్లు) సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు గ్రూప్ కంపెనీలలో వాటాల విక్రయాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ఇటీవలే మూడు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు(1.38 బిలియన్ డాలర్లు) సమీకరించిన అంశాన్ని ప్రస్తావించింది. 10ఏళ్ల కాలానికిగాను పెట్టుబడుల పరివర్తన నిర్వహణ (ట్రాన్స్ఫార్మేటివ్ క్యాపిటల్ మేనేజ్మెంట్) ప్రణాళికల్లో భాగంగా నిధుల సమీకరణ చేపడుతున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. వివిధ పోర్ట్ఫోలియో కంపెనీల కోసం 2016లో ఈ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేసింది. దీనిలో భాగంగానే ఇటీవల అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు అందుకున్నట్లు వివరించింది. దీంతో గ్రూప్ స్థాయిలో అత్యధిక పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినట్లు తెలియజేసింది. -
కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్పై ఐఆర్సీటీసీ ఏమందంటే?
ఆన్లైన్ ట్రైన్ బుకింగ్ సంస్థ ట్రైన్మ్యాన్ (స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రై.లిమిటెడ్)ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఈ స్టార్టప్ను దక్కించున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న ట్రైన్ మ్యాన్ పోటీగా రానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్లపై ఐఆర్సీటీసీ స్పందించింది. यह भ्रामक कथन है। Trainman IRCTC के 32 अधिकृत बी2सी (बिजनेस टू कस्टमर) भागीदारों में से एक है। हिस्सेदारी बदलने से इसमे कोई अंतर नहीं आयेगा। सभी एकीकरण और संचालन IRCTC के माध्यम से किए जाते रहेंगे। यह केवल IRCTC का पूरक होगा और IRCTC के लिए कोई खतरा या चुनौती नहीं है। https://t.co/7ERSbMj6JR — IRCTC (@IRCTCofficial) June 18, 2023 ఐఆర్సీటీసీ గుర్తింపు పొందిన బిజినెస్ టూ కస్టమర్ సర్వీసులు (బీ2సీ) అందించే 32 సంస్థల్లో ట్రైన్ మ్యాన్ ఒకటి. 0.13 శాతం మాత్రమే ప్రయాణికులకు ట్రైన్ టికెట్ల రిజర్వేషన్తో పాటు ఇతర సర్వీసులు అందిస్తుంది. కానీ, ఇండియన్ రైల్వేస్లో రోజుకు 14.5లక్షల రిజర్వేషన్ టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. వాటిలో 81శాతం ఇ-టికెట్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. Will Adani compete with IRCTC? No. IRCTC is a 100% monopoly in railway ticketing. Whether you book tickets from IRCTC or from aggregators like Paytm, MakeMyTrip or now Adani acquired Trainman, IRCTC makes money. It earned Rs 70 crore via Paytm in FY 2022, @ Rs 12 per ticket. 1/ pic.twitter.com/pwOOzxQ6Ud — ICICIdirect (@ICICI_Direct) June 19, 2023 ప్రస్తుతం, ఐఆర్సీటీసీకి ట్రైన్ మ్యాన్ పోటీ అంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అదానీ గ్రూప్.. ట్రైన్ మ్యాన్ను కొనుగోలు చేయడం వల్ల కార్యకలాపాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఐఆర్సీటీసీ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఐఆర్సీటీసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్ మొదట ఐఆర్సీటీసీతో పోటీ పడుతుందని, తరువాత స్వాధీనం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణల్ని సైతం ఐఆర్సీటీసీ కొట్టిపారేసింది. చదవండి👉 స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్మ్యాన్’! -
స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్మ్యాన్’!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ael) ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్ఫామ్ ట్రైన్మ్యాన్ సంస్థను కొనుగోలు చేసింది. సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఏఈఎల్కి చెందిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్) 100 శాతం స్టేక్ కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు వెల్లడించింది. అయితే, ఎంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందనే ఆర్ధిక పరమైన అంశాల గురించి ప్రస్తావించలేదు. ఉత్తరాఖండ్ ఐఐటీ - రూర్కీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వినీత్ చిరానియా, కరణ్కుమార్లు గురుగావ్ కేంద్రంగా ఐఆర్సీటీసీ గుర్తింపుతో ట్రైన్ టికెట్ సేవల్ని అందించేలా ఎస్ఈపీఎల్ను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ట్రైన్మ్యాన్ యాప్ ప్రయాణికులు సులభంగా ట్రైన్ టికెట్లతో పాటు ఇతర సౌకర్యాల్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థనే అదానీ గ్రూప్ను సొంతం చేసుకుంది. ఇటీవల, ఎస్ఈపీఎల్ కార్యకలాపాల నిమిత్తం 1 మిలియన్ డాలర్లను అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఇక, పెట్టుబడి పెట్టిన సంస్థల్లో గుడ్వాటర్ కేపిటల్, హెమ్ ఏంజెల్స్ వంటి సంస్థలున్నాయి. ఈ క్రమంలో రైల్వే సేవల్ని అందించే స్టార్టప్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
రూ. 21,900 కోట్లు చెల్లించేసిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: ముందస్తు చెల్లింపుల కార్యాచరణలో భాగంగా 2.65 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 21,900 కోట్లు) రుణాలను తీర్చివేసినట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి పొందనున్నట్లు గ్రూప్ విడుదల చేసిన క్రెడిట్ నోట్ పేర్కొంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నివేదిక తదుపరి అదానీ గ్రూప్ రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. లిస్టెడ్ కంపెనీల షేర్ల తనఖా సంబంధిత 2.15 బిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించినట్లు నోట్ వెల్లడించింది. అంతేకాకుండా అంబుజా సిమెంట్ కొనుగోలుకి తీసుకున్న 70 కోట్ల డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు తెలియజేసింది. 20.3 కోట్ల డాలర్ల వడ్డీతోకలిపి రుణాలు చెల్లించినట్లు వివరించింది. కాగా.. ప్రమోటర్లు గ్రూప్లోని నాలుగు లిస్టెడ్ కంపెనీలలో షేర్ల విక్రయం ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్ నుంచి 1.87 బిలియన్ డాలర్లు(రూ. 15,446 కోట్లు) సమకూర్చుకున్నట్లు క్రెడిట్ నోట్ తెలియజేసింది. రుణభార తగ్గింపు చర్యలు.. యాజమాన్య పటిష్ట లిక్విడిటీ నిర్వహణ, నిధుల సమీకరణ సమర్థతలను చాటుతున్నట్లు పేర్కొంది.అదానీ గ్రూప్లో అకౌంట్ల అవకతవకలు, షేర్ల ధరల కృత్రిమ పెంపు వంటివి జరిగినట్లు హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది. అయితే అదానీ గ్రూప్ వీటిని కొట్టిపారేయడంతోపాటు.. ముందస్తు రుణ చెల్లింపులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన
ఒడిశా రైలు దుర్ఘటన పట్ల అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి పిల్లలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఓ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. ‘ఒడిశా రైలు ప్రమాదం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోవాలని నిర్ణయించాం. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యాన్ని, మృతుల పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత’ అని గౌతమ్ అదానీ ట్విటర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట ఒడిశాలోని బాలాసోర్లో జూన్2న జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 280 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं। हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा। पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है। — Gautam Adani (@gautam_adani) June 4, 2023 -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
అదానీ - హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం!
అదానీ - హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదికపై విచారణ జరిపించేందుకు సుప్రీం కోర్టు ఆరుగురు ప్యానెల్ సభ్యులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్యానల్ సభ్యులు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. మే 12న దీనిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం విచారించింది. అయితే నిపుణుల ప్యానెల్ విచారణ నిమిత్తం మరింత గడువు కోరిందా? లేదంటే నివేదికను అందించిందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ దేశీయ స్టాక్ మార్కెట్ చట్టాల్ని ఉల్లంఘించిందో? లేదో? దర్యాప్తు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను అంచనా వేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. నిబంధనలను పటిష్టం చేయడానికి, భారతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు సుప్రీం కోర్టు ప్యానెల్ను ఏర్పాటు చేసింది. సీల్డ్ కవర్లో ఏముందో? తాజాగా, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు తమకు మరో 6 నెలలు పొడిగించాలని సెబీ సుప్రీంను కోరినట్లు సమాచారం. దీనిపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఆరుగురు ప్యానెల్ సభ్యులు సుప్రీంకు నివేదిక అందివ్వగా.. ఆ సీల్డ్ కవర్ నివేదికలో ఏముందో అన్న చర్చ వ్యాపార వర్గాల్లో మొదలైంది విమర్శలు.. ఖండించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సుప్రీం కోర్టు విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా.. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జేపీ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్ను కమిటీ సభ్యులుగా పేర్కొంది. చదవండి👉 హిండెన్బర్గ్పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు! -
రుణ చెల్లింపుపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: ఇటీవల రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్ తాజాగా 13 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,066 కోట్లు) రుణాలను ముందస్తుగా చెల్లించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని బిలియనీర్.. గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తోంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ కొద్ది రోజులుగా రుణాలను ముందుగానే చెల్లిస్తోంది. దీనిలో భాగంగా గత నెలలో 2024 జూలైలో గడువు తీరనున్న 13 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను బైబ్యాక్ చేసేందుకు అదానీ పోర్ట్స్ టెండర్కు తెరతీసింది. ఈ బాటలో మరో 4 రుణాలను తిరిగి చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. టెండర్కు 41.27 కోట్ల డాలర్ల విలువైన బాండ్లు దాఖలైనట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. -
అదానీ పవర్కు లాభాలే లాభాలు
న్యూఢిల్లీ: అదానీ పవర్ మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.5,242 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,645 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.13,307 కోట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించి రూ.10,795 కోట్లకు పరిమితమైంది. లాభం వృద్ధి చెందడానికి రుణ వ్యయాలు తగ్గడం, సబ్సిడరీల విలీనం కలిసొచ్చినట్టు అదానీ పవర్ లిమిటెడ్ తెలిపింది. మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 30 శాతానికి పైగా పెరిగి రూ.9,897 కోట్లకు పెరిగింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ నికర లాభం 118 శాతం పెరిగి రూ.10727 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.14,312 కోట్లుగా నమోదైంది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,912 కోట్లు, ఆదాయం రూ.13,789 కోట్ల చొప్పున ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 52 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను చేరుకుంది. అదానీ పవర్కు 14,410 మెగావాట్ల స్థాపిత థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉంది. -
లాభాల్లో అదానీ పవర్ సూపర్ - గతం కంటే రెట్టింపు వృద్ధితో పరుగులు..
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన 'అదానీ పవర్ లిమిటెడ్' (Adani Power Ltd) 2023 ఆర్థిక సంవత్సరం (FY23) క్యూ4లో భారీ లాభాలను ఆర్జించింది. నికర లాభం 12.9 శాతం పెరిగి రూ. 5242.48 కోట్లకు చేరింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ ఆదాయం పెరగటానికి మెరుగైన టారిఫ్ రియలైజేషన్, హయ్యర్ వన్ టైమ్ రికగ్నైజేషన్ వంటివి మాత్రమే కాకుండా అధిక బొగ్గు దిగుమతి కూడా కారణమని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. FY23లో అదానీ పవర్ నికర లాభం రూ.10,726 కోట్లకు పెరిగింది. అయితే అంతకు ముందు సంవత్సరం ఈ ఆదాయం రూ. 4,911.5 కోట్లు కావడం గమనార్హం. ఆంటే మునుపటికంటే ఈ సారి ఆదాయం రెండు రెట్లు కంటే ఎక్కువని స్పష్టమవుతోంది. ఇక త్రైమాసికం వారీగా పరిశీలిస్తే.. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 10,795 కోట్లు కాగా, అంతకు ముందు సంవత్సరం త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 13,308 కోట్లు. FY22లో కంటే FY23 ఆదాయం 35.8 శాతం పెరిగి రూ. 43,041 కోట్లకు చేరింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దాని ఆర్ధిక వృద్ధికి మాత్రమే కాకుండా తరువాత దశకు స్ప్రింగ్బోర్డ్గా పనిచేస్తుందని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ ఆదానీ' అన్నారు. అంతే కాకుండా దేశం మౌలిక సదుపాయాల సమ్మేళనంగా నిలబడటానికి అదానీ గ్రూప్ స్థిరంగా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా!) ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రస్ట్, టాక్స్, డిప్రెషియేట్ అండ్ అమోర్టైజేషన్ (EBITDA) ముందు కంపెనీ ఆదాయం (FY22లో) రూ. 13,789 కోట్లు నుంచి రూ. 14,312 కోట్లు పెరిగింది. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం పెరిగి, గ్యాస్ ఉత్పత్తి కూడా క్యూ4లో స్వల్పంగా మెరుగుపడింది. మొత్తం మీద ఆదానీ కంపెనీ భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఫ్యూచర్ గ్రూప్ ఎవరిదో.. రేసులో రిలయన్స్, అదానీ సంస్థలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ రిటైల్ను సొంతం చేసుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. రేసులో రిలయన్స్, అదానీ, జిందాల్ తదితర పలు గ్రూప్లు, సంస్థలు పోటీపడుతున్నాయి. వెరసి కంపెనీ ఆస్తుల కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) 49 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగమైన ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను ఐదు క్లస్టర్స్గా విడదీశాక రుణదాతలు ఈవోఐ బిడ్స్కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. -
రాహుల్ గాంధీకి గౌతమ్ అదానీ కౌంటర్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బిలియనీర్ గౌతమ్ అదానీ కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు అంతా పారదర్శకమేనని, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుపుతూ అదానీ గ్రూప్ నివేదికను విడుదల చేసింది. అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ..అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలపై అదానీ గ్రూప్ కౌంటర్గా పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలిపింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ 2019 నుండి గ్రూప్ సంస్థలలో 2.87 బిలియన్ డాలర్ల వాటా విక్రయాల వివరాలు, అలాగే 2.55 బిలియన్ డాలర్లు గ్రూప్ కంపెనీల వ్యాపారాల్లోకి ఎలా వచ్చాయన్న విషయాలనూ వివరించింది. కాగా, అదానీ గ్రూప్లో విదేశీ పెట్టుబుడులపై ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. ఇది గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ‘ఉద్దేశపూర్వక’ ప్రయత్నమని పేర్కొంది -
ఆసియా కుబేరుల్లో మళ్లీ అంబానీనే నెం.1.. అదానీకి ఎన్నో స్థానమంటే!
ఆసియా ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 83.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. ప్రపంచ ధనవంతుల స్థానాల జాబితాలో 9వ స్థానం దక్కించుకున్నారు. ఆసియా దేశాల రిచెస్ట్ పర్సన్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయినట్లు బ్లూమ్ నివేదించింది. ఈ ఏడాది జనవరి 24న దాదాపు 126 బిలియన్ల విలువతో అదానీ ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే హిండెన్బర్గ్ రీసెర్చ్ నిరాధారమైన నివేదికల కారణంగా అదానీ షేర్లు పతమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సంపాదనలో సరికొత్త రికార్డ్లు ఫోర్బ్స్ - 2023 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతీయులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. దేశం మొత్తం మీద బిలియనీర్ల జాబితా 169 మందికి చేరింది. గత ఏడాది ఆ సంఖ్య 166గా ఉంది. హెచ్సీఎల్ అధినేత శివ్ నాడార్ సంపద ఏడాది క్రితం నుండి 11 శాతం తగ్గి $25.6 బిలియన్లకు పడిపోయింది. అయితే అతను దేశంలోని అత్యంత సంపన్నల జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశీయ వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనావాలా దేశంలో బిలియనీర్ల జాబితాలో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయినప్పటికీ అతని నికర విలువ ఏడాది క్రితం నుండి 7 శాతం పడిపోయి $22.6 బిలియన్లకు చేరుకుంది. స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ 5వ స్థానంలో ఉన్నారు. తర్వాత ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్, దిలీప్ శాంఘ్వీ, రాధాకిషన్ దమానీలు ఉన్నారు. కుమార్ మంగళం బిర్లా 9వ స్థానంలో, ఉదయ్ కోటక్ 10వ స్థానంలో ఉన్నారు. కొత్తగా ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జీరోధా అధినేత, అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ 36 ఏళ్ల నిఖిల్ కామత్ చేరారు. చదవండి👉 మంచులా కరిగిన ఆస్తులు.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు! -
త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్..
వివాదస్పద నివేదికతో అదానీ గ్రూప్ను దెబ్బ కొట్టిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ మోసాలు, అక్రమాలను బహిర్గతం చేస్తూ మరో ‘పెద్ద’ నివేదికను త్వరలో విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా హిండెన్బర్గ్ తెలియజేసింది. అయితే ఈసారి హిండెన్ బర్గ్ ఎవరిని లక్ష్యం చేసుకుందోనన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో మొదలయింది. ఏమిటీ హిండెన్బర్గ్ రీసెర్చ్? ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్. ఈ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అక్రమాలు, దుర్వినియోగం, బహిర్గతం చేయని లావాదేవీలను ఈ సంస్థ శోధించి బయటపెడుతుంది. ఇందుకోసం కంపెనీ తన సొంత మూలధనాన్ని ఖర్చు పెడుతుంది. హిండెన్బర్గ్ వెబ్సైట్ పేర్కొన్న దాని ప్రకారం.. 2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో అవకతవకలను గుర్తించి బయటపెట్టింది. అదానీ గ్రూప్పై ఆరోపణలతో కుదుపు ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిదంటూ గత జనవరి 24న హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ను వెలువరించింది. దాన్ని మరుసటి రోజున ట్విటర్లో షేర్ చేసింది. మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా అదానీ గ్రూప్తో సంబంధం ఉన్న అనేక మందితో మాట్లాడి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించి ఈ నివేదిక వెలువరించినట్లు హిండెన్బర్గ్ పేర్కొంది. అయితే హిండెన్ బర్గ్ నివేదిక పట్ల చాలా అనుమానాలున్నాయి. కేవలం తాను షార్ట్ సెల్లింగ్ చేసేందుకు గాను, అంటే తనకు ప్రయోజనం కల్పించుకునేందుకు హిండెన్ బర్గ్ ఆరోపణలు గుప్పించిందని పలువురు విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలంటూ SEBI సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : హిండెన్ బర్గ్ పై హరీష్ సాల్వే వ్యాఖ్యలు) ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ ఈ నివేదిక వెలువడిన ఐదు వారాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్న గౌతమ్ అదానీ వెనుకబడిపోయాడు. అదానీ గ్రూప్ కూడా ఊహించని విధంగా పూర్తిగా సబ్స్క్రైబ్ చేసిన రూ.20,000 కోట్ల ఎఫ్పీవోను ఉపసంహరించుకుంది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. -
అదానీ గ్రూప్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గుజరాత్లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్ల విలువ చేసే పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2021లో అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ గుజరాత్లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్కు చెందిన స్థలంలో ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బొగ్గు నుంచి పీవీసీ వరకు ఉత్పత్తి చేసేలా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకాన్ని కలిగించేలా రుణాలను తిరిగి చెల్లించింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం నిలిపివేసింది. అందులో భాగంగానే తాజాగా ముంద్రా ప్రాజెక్టును పక్కన పెట్టింది. -
అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కుబేరుడిని చేయడమే మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానామా? అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. నరేంద్ర మోదీ గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో మోదీ ఎక్కడికెళ్లినా అదానీని సైతం వెంట తీసుకెళ్లారని గుర్తుచేశారు. PM का विदेश जाना और वहां अडानी को नए बिज़नेस डील मिलना, कोई संयोग नहीं है। ‘मोडानी’ ने भारत की फॉरेन पॉलिसी को फॉरेन ‘डील’ पॉलिसी बना दिया है। पूरा वीडियो देखें: https://t.co/63gl5II39Q pic.twitter.com/CshP26wK6D — Rahul Gandhi (@RahulGandhi) March 14, 2023 ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణం: జైరాం పార్లమెంట్లో ప్రతిష్టంభనకు ముమ్మాటికీ మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. కీలకమైన అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడం ప్రధాని మోదీకి, ఆయన సహచరులకు ఒక అలవాటుగా మారిందన్నారు. రాహుల్ విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ హయాంలోనే అదానీ వ్యాపారావేత్తగా ఎదిగారన్నారు. ‘‘గుజరాత్ కాంగ్రెస్ సీఎం చిమన్భాయ్ పటేల్ తనకు మొదటి బ్రేక్, రాజీవ్ గాంధీ రెండో బ్రేక్ ఇచ్చారని అదానీ స్వయంగా చెప్పారు. ప్రధాని మోదీని దూషించడమే ప్రతిపక్షాల ఉద్దేశం. అంబానీ–అదానీ సాకులే. యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలన వివాదాలమయం. మోదీ సర్కారు వచ్చాకే అభివృద్ధి జరుగుతోంది’’ అన్నారు. ప్రమాదంలో భావప్రకటనా స్వేచ్ఛ: ఖర్గే మాట్లాడే స్వాతంత్య్రం, నిజాలు రాసే స్వేచ్ఛ ప్రమాదంలో చిక్కుకున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్మత్ జాతీయ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు మీడియాను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఓ వర్గం మీడియా వారికి లొంగిపోయిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ కేంబ్రిడ్జి అరుపులు, లండన్ అబద్ధాలు ఆపాలని సదస్సులో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హితవు పలికారు. విపక్ష నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. చదవండి: ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్ను మార్చుకోండి.. -
రూ. 7,374 కోట్ల రుణాలు చెల్లించిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తాజాగా 2025 ఏప్రిల్లో మెచ్యూరిటీ కానున్న రూ. 7,374 కోట్లమేర రుణాలను తిరిగి చెల్లించింది. తాజా చెల్లింపులతో 4 కంపెనీలలో ప్రమోటర్ల వాటాలను తనఖా నుంచి తిరిగి పొందింది. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్కు చెందిన 3.1 కోట్ల షేర్లు(4% వాటా), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్కు చెందిన 15.5 కోట్ల షేర్లు(11.8% వాటా)తోపాటు అదానీ ట్రాన్స్మిషన్కు చెందిన 3.6 కోట్ల షేర్లు(4.5% వాటా), అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన 1.1 కోట్ల షేర్లు(1.2% వాటా) ఉన్నట్లు పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా ఇలాంటి మరిన్ని రుణాలను ముందస్తుగానే చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా గ్రూప్ రుణ భారంపై ఇన్వెస్టర్లలో తలెత్తిన ఆందోళనలకు చెక్ పెట్టే సన్నాహాలకు తెరతీసింది. కాగా.. ఫిబ్రవరి మొదట్లో చేపట్టిన చెల్లింపులతో కలిపి మొత్తం 2.016 బిలియన్ డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్టు గ్రూప్ వివరించింది. -
హిండెన్బర్గ్పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు!
అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్బర్గ్ ‘నో గుడ్ స్మార్టానీయన్’.అందుకు పూర్తిగా విభిన్నమైంది. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల నుంచి డబ్బుల్ని కొల్లగొట్టడం విచారకరమని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ - అదానీ గ్రూప్ అంశంపై ఓ మీడియా సంస్థ నిర్వహించిన డిబెట్లో పాల్గొన్న హరీష్ సాల్వే.. హిండెన్ బర్గ్ తీరును విమర్శించారు. హిండెన్ బర్గ్ నో స్మార్టానీయన్. అవకాశావాది. తమకు అనుగుణంగా నివేదికను విడుదల చేయడం, మళ్లీ అదే నివేదికను కనుమరుగు చేయడం ఏంటని ప్రశ్నించారు. హిండెన్బర్గ్ సంస్థను 'అనైతిక షార్ట్ సెల్లర్'గా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని అన్నారు. షేర్ వ్యాల్యూని తగ్గించి టన్నుల కొద్ది మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల పెట్టబుడుల్ని కాజేసింది ఎవరనేది స్పష్టం చేస్తుందని తెలిపారు. హిండెన్ బర్గ్ స్టాక్ మార్కెట్ను మానిప్యులేషన్ చేయడంలో దిట్ట. ఆ సంస్థ ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించాలి. ఉదాహరణకు కంపెనీలు స్టాక్ మార్కెట్లోని మదుపర్లని మోసం చేస్తున్నాయని నిజంగా అనిపిస్తే.. అందుకు తగ్గ ఆధారాలుంటే వెంటనే భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తే విచారణ జరిపిస్తారు. కానీ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ అలా చేయలేదు. డైరెక్ట్గా రిపోర్ట్లను అడ్డం పెట్టుకొని కంపెనీలపై దాడులకు పాల్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా అని సెబీ చూస్తూ కూర్చొదుగా. ఎవరు స్టాక్ మార్కెట్లోని అలజడని సృష్టించి తద్వారా డబ్బుల్ని సంపాదిస్తున్నారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల డబ్బుల్ని కాజేస్తున్నారో ఇలా అందర్ని వెలుగులోకి తెస్తుందన్నారు. మనదేశంలో ఇదో కొత్త గేమ్. కేపిటల్ మార్కెట్ వృద్ది సాధిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టైన ప్రతి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులు మక్కువ చూపుతుంటారు. హిండెన్ బర్గ్ లాంటి రిపోర్ట్లు వెలుగులోకి వచ్చి.. అవి అబ్ధమని రుజువయ్యే సమయానికి సదరు కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింతుందని వెల్లడించారు. కాగా, సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆరుగురు సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే, ఎస్బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్, ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖరన్ సుందరేశన్ ఉన్నారని మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే చెప్పారు. -
సీబీఐని నాకు అప్పగిస్తే.. వాళ్లను రెండు గంటల్లో అరెస్టు చేయిస్తా: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐని తనకు అప్పగిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని రెండు గంటల్లోనే అరెస్టు చేయిస్తానని చెప్పారు. డిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలతో కలిసి సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు సంజయ్. వీరిని అరెస్టు చేసిన పోలీసులు కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించవు అని పేర్కొన్నారు. 'మోదీ నియంతృత్వానికి త్వరలోనే ముగింపు ఉంటుంది. దేశంలోనే ప్రముఖ విద్యా మంత్రిని ఆయన అరెస్టు చేశారు. కేజ్రీవాల్ ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు వల్ల ఆయనపై ఎలాంటి ప్రభావం ఉండదు. దర్యాప్తు సంస్థలతో సిసోడియాను అరెస్టు చేయించడం కేంద్రం పిరికిపంద చర్య.' అని సంజయ్ సింగ్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీశ్ సిసోడియాను ఆదివారం 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది సీబీఐ. సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. చదవండి: సిసోడియాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ..ఐదు రోజుల కస్టడీపై తీర్పు రిజర్వ్.. -
ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..
రాయ్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల మూడో రోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అదానీకి, మోదీకి సంబంధమేంటని పార్లమెంటులో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసుపలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తానూ ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. 'భారత్ జోడో యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రజలు, రైతుల సమస్యలు దగ్గరుండి చూశా. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజలు నాతోపాటు నడిచారు. ఈ యాత్ర నాకు పాఠాలు నేర్పింది. నాలుగు నెలల పాటు ఓ తపస్సులా ఈ యాత్ర సాగింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాము. కానీ బీజేపీ దాన్ని తీసుకెళ్లింది.' అని రాహుల్ వ్యాఖ్యానించారు. జైశంకర్పై ఆగ్రహం.. ఆర్థికంగా చైనాను భారత్ అధిగమించలేదని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఆయనకు ఉన్న దేశభక్తి అని ప్రశ్నించారు. చైనాతో ఫైట్ చేయలేమని ఎలా అంటారని నిలదీశారు. ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పార్టీని మండల, బ్లాక్ స్థాయిలో బలోపేతం చేయాలని, ఇది కాగితాలకే పరిమితం కావొద్దని చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ కలిసి ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. కమలం పార్టీని గద్దె దించేందుకు ఎంత ధైర్యం కావాలో తమకు తెలుసన్నారు. దేశ ప్రజల కోసం దాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. చదవండి: రాష్ట్ర కాంగ్రెస్లో ఏఐసీసీ పదవులపై చర్చ .. కోమటిరెడ్డికి అవకాశం దక్కేనా? -
అదానీ, అంబానీలపై రామ్దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా తాజాగా కార్పొరేట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే కేటాయిస్తున్నారని, కానీ తమ లాంటి వారు అందరికీ మేలు చేసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, తన సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు గోవాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రామ్దేవ్ బాబా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను హరిద్వార్ నుంచి వచ్చి మూడు రోజులుగా ఇక్కడ ఉంటున్నాను. నా సమయం విలువ అదానీ, అంబానీ, టాటా, బిర్లాల కంటే ఎక్కువ. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తారు. కానీ మా లాంటివారు అలా కాదు’ అని రామ్దేవ్ బాబా పేర్కొన్నట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది. ఆచార్య బాలకృష్ణ తన నైపుణ్యంతో పతంజలి సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించారని అభినందించారు. పతంజలి వంటి సంస్థలతో భారత్ పరమ వైభవశాలిగా మారుతుందన్నారు. -
అదానీ పవర్-డీబీ పవర్ డీల్ వెనక్కి.. సంతకాలు చేయకుండానే..!
న్యూఢిల్లీ: డీబీ పవర్కి చెందిన బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లను అదానీ గ్రూపునకు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయడానికి సంబంధించిన రూ. 7,017 కోట్ల డీల్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఒప్పందంపై సంతకాలు చేయకుండానే.. లావాదేవీకి నిర్దేశించుకున్న గడువు తీరిపోవడం ఇందుకు కారణం. 2022 ఆగస్టు 18 నాటి అవగాహన ఒప్పందం గడువు తీరిపోయిందని స్టాక్ ఎక్స్ఛేంచంజీలకు అదానీ పవర్ తెలిపింది. తేదీలను పొడిగించారా లేక ఒప్పందంపై మళ్లీ చర్చలు జరుపుతున్నారా వంటి వివరాలేమీ వెల్లడించలేదు. గడువు తేదీ ముగియడంతో ప్రస్తుతానికి ఈ డీల్ను పక్కన పెట్టినట్లే భావించాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా గతేడాది ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత తుది గడువు నాలుగు సార్లు పొడిగించారు. నాలుగో గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. ఖాతాలు, షేర్ల ధరల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు, పరిణామాలు దీనికి నేపథ్యం. -
బ్యాలన్స్షీట్ పటిష్టంగా ఉంది.. ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ భరోసా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బ్యాలన్స్షీట్ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు తాజాగా స్పష్టం చేసింది. గ్రూప్లోని వివిధ బిజినెస్లను వృద్ధి బాటలో కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంపొందించేందుకు చూస్తోంది. ఇటీవల యూఎస్ షార్ట్సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల కారణంగా గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత మూడు వారాల్లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు 125 బిలియన్ డాలర్లమేర కోత పడింది. అయితే గ్రూప్ లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో షేరు తిరిగి బలాన్ని పుంజుకోవడం గమనార్హం! అంతర్గత నియంత్రణలు, నిబంధనల అమలు, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి అంశాలపై నమ్మకంగా ఉన్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా గ్రూప్ సీఎఫ్వో జుగెషిందర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ బాటలో.. తగినన్ని నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు, రుణాల రీఫైనాన్స్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు గ్రూప్ విడిగా తెలియజేసింది. తాత్కాలికమే.. అదానీ గ్రూప్ బ్యాలన్స్షీట్ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు సింగ్ తాజాగా పేర్కొన్నారు. పరిశ్రమలోనే అత్యున్నత అభివృద్ధి సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్, పటిష్ట క్యాష్ఫ్లో, హామీగల ఆస్తులున్నట్లు వివరించారు. ప్రస్తుత మార్కెట్ ఒకసారి నిలకడను సాధిస్తే తిరిగి తమ క్యాపిటల్ మార్కెట్ వ్యూహాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు అత్యుత్తమ రిటర్నులు అందించగల బిజినెస్లను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. -
అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ.. కమిటీకి కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారం, ఈ అంశంలో వచ్చిన ఆరోపణల నిజనిజాలు తేల్చడానికి (The Securities and Exchange Board of India (SEBI)) సెబీకి అన్ని రకాల అర్హతలున్నాయని, అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయాలనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. హిండెన్ బర్గ్ రిపోర్టు, తదనంతర పరిణామాలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వం వహించిన బెంచ్ ముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. కమిటీలో ఎవరెవరు ఉండాలో నిర్ణయిస్తే.. శుక్రవారం రోజు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కమిటీలో ఎవరెవరి పేర్లు ఉండాలో ఒక సీల్డ్ కవర్లో బుధవారం సుప్రీంకోర్టుకు అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే 22 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన సెబీ... హిండెన్ బర్గ్ నివేదికలో అంశాలతో పాటు, స్టాక్ మార్కెట్లపై ఆ నివేదిక చూపించిన ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. హిండెన్ బర్గ్ తమ నివేదికను బయటపెట్టక ముందు, అలాగే నివేదికను వెల్లడించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను, దాని వెనక ఏదైనా కుట్ర ఉందా? ఏవైనా అవకతవకలు జరిగాయా అన్న అంశాలను పరిశీలిస్తున్నామని సెబీ తెలిపింది. సెబీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన సుప్రీంకోర్టు.. కమిటీ ఏర్పాటు వల్ల మరింత లోతుగా, క్షుణ్ణంగా ఈ వ్యవహారాన్ని విచారణ చేయవచ్చని తెలిపింది. పెట్టుబడిదారులు నష్టపోకుండా కేంద్రం ఏం చేయవచ్చన్నదానికి ఇది స్పష్టత నిచ్చే అవకాశం ఉందని, ఏవైనా చట్ట సవరణలు చేయాలా అన్న అంశం కూడా తెలుస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటి ఆరోపణలను హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇంతకు ముందు సుప్రీంకోర్టు విచారణ జరిపి, కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే కమిటీ సభ్యులను సూచించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. -
అదానీకి మూడీస్ షాక్.. 4 కంపెనీలకు నెగిటివ్ రేటింగ్
న్యూఢిల్లీ: ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్లోని 4 కంపెనీల రేటింగ్లో మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజాగా కోత పెట్టింది. స్థిరత్వం(స్టేబుల్) నుంచి రేటింగ్ను ప్రతికూలం(నెగిటివ్)కు దిగువముఖంగా సవరిస్తున్నట్లు మూడీస్ వెల్లడించింది. ఈ జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–1, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్లను పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఈక్విటీ విలువలు మార్కెట్లో ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా పతనమైన నేపథ్యంలో తాజా సవరణలు చేపట్టినట్లు వివరించింది. అదానీ గ్రూప్లో కార్పొరేట్ పాలన సక్రమంగా లేదంటూ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన తదుపరి గ్రూప్ విలువ 100 బిలియన్ డాలర్లను కోల్పోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 4 కంపెనీలకు రేటింగ్ను ప్రతికూలానికి సవరించినప్పటికీ మరో 8 కంపెనీలకు ‘స్థిరత్వం’ను కొనసాగించినట్లు మూడీస్ తెలియజేసింది. స్టేబుల్ రేటింగ్ను కొనసాగిస్తున్న కంపెనీలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఇంటర్నేషనల్ కంటెయినర్ టెర్మినల్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–2, అదానీ ట్రాన్స్మిషన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–1 ఉన్నట్లు వెల్లడించింది. (ఇదీ చదవండి: హిండెన్బర్గ్తో పోటీలో ఆదానీ కొత్త ప్లాన్!) -
దేశంలో అదానీ - హిండెన్బర్గ్ ప్రకంపనలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్లోని పెట్టు బడిదారులు తీవ్రంగా నష్ట పోయారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఆదానీ ప్రకంపనలు ఇంకా పార్లమెంట్లో కొనసాగుతున్నాయి. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ. పార్థివాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇన్వెస్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. నిపుణలతో కమిటీ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. హిండెన్బర్గ్ నివేదిక వివాదంపై సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. అదానీ గ్రూప్పై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని, జడ్జీతో కూడిన నిపుణులైన ప్యానల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అదానీ అంశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వివాదంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటుకు సూచించామని సీజేఐ చెప్పారు. ఆ కమిటీలో న్యాయమూర్తి, సంబంధిత నిపుణులను చేర్చవలసిందిగా తెలిపారు. రెగ్యులేటరీ ప్రక్రియపై ఆందోళన, గత రెండు వారాల్లో జరిగిన ఈ సంఘటనతో దేశ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపేందుకు కృషి చేయాలని సొలిసిటర్ జనరల్కు సూచించినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి13కు వాయిదా వేసింది. చదవండి👉 మూన్లైటింగ్పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు -
గౌతమ్ ఆదానీ మాస్టర్ ప్లాన్..హిండెన్బర్గ్కు చెక్!
హిండెన్బర్గ్తో పోరులో గౌతమ్ ఆదానీ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిండెన్బర్గ్తో న్యాయ పోరాటానికి అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ అయిన వాచ్టెల్ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. హిండెన్బర్గ్ నివేదికతో ఆదానీ గ్రూప్నకు ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు న్యూయార్క్లో ప్రముఖ వాచ్టెల్, లిప్టెన్, రోసెన్, కట్జ్ సంస్థల్లోని సీనియర్ లాయర్ల సేవలను వినియోగించుకోనున్నారు. స్టాక్ మార్కెట్లో ఆదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిదంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ బయటపెట్టిన నివేదిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డీల్ జరిగింది అక్కడే ఆదానీ గ్రూప్నకు అండగా ఉండే సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ సంస్థలో కార్యాలయంలో వాచ్టెల్తో ఈ డీల్ జరినట్లు తెలుస్తోంది. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ సంస్థ అధినేత సిరిల్ ష్రాఫ్ కుమార్తెను గౌతమ్ ఆదానీ కొడుక్కి వివాహం చేసుకున్నారు. కార్పొరేట్ సంస్థల్లో తలెత్తే సంక్షోభాలను పరిష్కరించడంలో ఈ వాచ్టెల్ సంస్థకు విశేష నైపుణ్యం ఉంది. రూ.4లక్షల కోట్లు ఆవిరి కొద్ది రోజుల క్రితం అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండేన్ బర్గ్ భారత్లో కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూప్ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 7వ స్థానానికి పడిపోయాడు. భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున నష్టపోయాయి. ఆ రిపోర్ట్ విడుదల ప్రారంభంలో కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకొన్నాయి. పార్లమెంట్లో ప్రకంపనలు స్టాక్ మార్కెట్ లోనే కాదు, ఇటు పార్లమెంట్ లోనూ అదానీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక షేక్ చేస్తుంది. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకై ఈ తరుణంలో హిండెన్బర్గ్పై గౌతమ్ అదానీ న్యాయ పోరాటానికి దిగారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ వాచ్టెల్ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అంశంలో అదానీ ఎంత మేరకు విజయం సాధిస్తానేది కాలమే నిర్ణయించాలి. -
వ్యతిరేకత ఏమోగానీ!.. మనపై నిందలు వేయకుంటే చాలు సార్!
వ్యతిరేకత ఏమోగానీ!.. మనపై నిందలు వేయకుంటే చాలు సార్! -
హిండెన్బర్గ్ ఎఫెక్ట్ : అదానీ - టోటల్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టుపై నీలినీడలు
హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్తో జత కలిసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హిండెన్బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా గతేడాది జూన్లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ నివేదికతో టోటల్ ఎనర్జీస్ వెనక్కి తగ్గింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్తో తమ పార్టనర్షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది. -
ఇదే అదనుగా అదానీ మీదే పట్టుబడుతున్నాం సార్..!
ఇదే అదనుగా అదానీ మీదే పట్టుబడుతున్నాం సార్..! -
ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు పంపించాయ్ సార్!
ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు పంపించాయ్ సార్! -
అదానీ వెనుకకు.. అంబానీ ముందుకు
ఫోర్బ్స్ బిలియనీర్స్- అదానీ వెనుకకు.. అంబానీ ముందుకు -
చాట్జీపీటీ అద్భుతం.. నేను అడిక్ట్ అయ్యా : అదానీ
న్యూఢిల్లీ: కృత్రిమమేథలో (ఏఐ) సంచలనంగా మారిన చాట్జీపీటీపై పారిశ్రామిక దిగ్గజాలకు కూడా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా ఈ జాబితాలో చేరారు. దీన్ని వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకూ ఇది కొంత వ్యసనంలా మారిందని అదానీ పేర్కొన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో అంతటా ఏఐ గురించే ప్రధానంగా చర్చ జరిగిందని లింక్డ్ఇన్లో అదానీ రాశారు. ఎంతో ఉపయోగకరమైన ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు చాట్జీపీటీ తోడ్పడగలదని ఆయన తెలిపారు. జోకులు, పద్యాలు, వ్యాసాలు మొదలుకుని కంప్యూటర్ కోడింగ్ వరకు ఎలాంటి అంశం అయినా అనంతమైన సమాచారాన్ని క్రోడీకరించి యూజర్కు కావాల్సినట్లుగా కంటెంట్ను చాట్జీపీటీ అందిస్తుంది. యూజర్లతో అచ్చం మనుషుల్లాగే సందర్భోచితంగా సంభాషిస్తుంది. ఓపెన్ఏఐ రూపొందించిన ఈ చాట్బాట్ ప్రస్తుతం ఇంకా ప్రయోగదశలో ఉంది. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
ధీరూభాయ్ రోల్ మోడల్..ముఖేష్ అంబానీ నాకు మంచి స్నేహితుడు : అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీని రోల్ మోడల్గా, అతని కుమారుడు ముఖేష్ అంబానీని స్నేహితుడిగా భావిస్తున్నట్లు బిలియనీర్ గౌతమ్ అదానీ తెలిపారు. అంతేకాదు దేశంలోనే అత్యంత సంపన్న అదానీ - అంబానీ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ధీరూభాయ్ మాకు రోల్ మోడల్, స్ఫూర్తి అని చెప్పారు. ఈ సందర్భంగా ముఖేష్ భాయ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతనిని గౌరవిస్తాను. సంప్రదాయిక పెట్రోకెమికల్స్ వ్యాపారంతో పాటు జియో, టెక్నాలజీ, రిటైల్ వంటి వ్యాపారాలకు కొత్త దిశానిర్దేశం చేశారు. అంతేకాదు దేశ పురోగతికి దోహదపడుతున్నారని కొనియాడారు. గత ఏడాది ముకేశ్ అంబానీని అధిగమించి భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో చేరినప్పుడు మీకేమనిపించింది అన్న ప్రశ్నకు అదానీ స్పందించారు. నేను ఈ సంఖ్యల ఉచ్చులో ఎప్పుడూ పడలేదని సమాధానం ఇచ్చారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 117 బిలియన్ల విలువ కలిగిన అదానీ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తర్వాత ఆసియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా కొనసాగుతున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన అదానీ, అంబానీలు భారత్ తన ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసుకునే సమయంలో వ్యాపార రంగాల్లో అడుగు పెట్టి ఏసియా దేశాల్లో ధనవంతులుగా చెలామణి అవుతున్నారు. -
అబ్బబ్బే అలాంటిదేం లేదు, క్లారిటీ ఇచ్చిన గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార కార్యకలాపాల్ని విదేశాల్లో ప్రారంభించే యోచనలో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలపై గౌతమ్ అదానీ స్పందించారు. తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ బిజినెస్, ఇతర కార్యకాలపాల్లో విదేశాల్లో సంస్థల్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, అదానీ కుటుంబ సభ్యులు వారి వ్యక్తి గత సంపదను విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇందుకోసం అదానీ దుబాయ్, న్యూయార్క్లో కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. అంతేకాదు అదానీ కుటుంబ సభ్యుల కోసం ఓవర్సిస్ ఆఫీస్లలో పనిచేసేందుకు మేనేజర్ల నియామకాలు జరుపుతున్నట్లు హైలెట్ చేసింది. ఈ వార్తలపై అదానీ యాజమాన్యం, అదానీ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. కుటుంబ సభ్యుల వ్యాపార వ్యవహారాలపై మీడియాలో వస్తున్న వార్తల్ని ఖండించారు. ఈ వదంతులపై అదానీ యాజమాన్యం స్పష్టతనిస్తూ ఓ నోట్ను విడుదల చేయడంపై రూమర్స్కు చెక్ పెట్టినట్లైంది. ధనవంతుల జాబితాలో బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ ప్రకారం..ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ తొలిస్థానం, బెర్నార్డ్ అర్నాల్ట్ రెండవ స్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ 132 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా
లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరులుగా పేరొందిన పలువురిని స్టాక్ మార్కెట్లు భారీగా ముంచేస్తున్నాయి. ఒక్క రోజులోనే 2 లక్షల కోట్లు పైగా సంపదను ఆవిరి చేశాయి. బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేగ గౌతమ్ అదానీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్లు ఒక్క రోజులోనే సుమారు 25 మిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. సోమవారం స్టాక్ మార్కెట్లలో అదానీ, ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీల షేర్లు పతనం కావడంతో ఈ భారీ మొత్తం నష్టపోయారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ అండ్ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు క్రాష్ అవ్వడంతో అదానీ ఒక్కరోజులోనే సుమారు రూ.78,913 కోట్ల నష్టం వాటిల్లింది. ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం..ఎలాన్ మస్క్ సుమారు రూ.1.26లక్షల కోట్లు నష్టపోయినట్లు తేలింది. టెస్లా షేర్ల పతనంతో కార్ల తయారీ సంస్థ మార్కెట్ విలువ 71 బిలియన్ డాలర్లు క్షీణించిందని రాయిటర్స్ నివేదించింది. భారీ నష్టాలు ఉన్నప్పటికీ, మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, లూయిస్ విట్టన్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్, తరువాత అదానీ ప్రపంచంలోనే 4వ కుబేరుడిగా కొనసాగుతున్నారు. రోజుకు రూ.1612కోట్ల సంపాదన బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేగ గౌతమ్ అదానీ సంపద.. గత ఏడాది 116శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2022 జాబితా వెల్లడించిన విషయం తెలిసిందే. గత ఏడాది రోజుకు సగటున రూ.1612 కోట్లు అదానీ అర్జించారు. మొత్తంగా 10 లక్షల 94 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అదానీ అవతరించారు. వేగంగా పెరుగుతోంది అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద అత్యంత వేగంగా పెరుగుతోంది. సరిగ్గా 10ఏళ్ల క్రితం ముఖేష్ అంబానీ సంపదలో 6వ వంతు సంపద కలిగిన అదానీ ఇప్పుడు ముఖేష్ ను దాటి చాలా ముందుకు వెళ్లారు. ప్రపంచ కుబేరుల్లో ఏకంగా రెండవ స్థానాన్ని సంపాదించుకున్నారు. రూ. 10.94 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు. 2022 అచ్చిరాలేదు ఈ ఏడాది సంపన్నులకు చేదు జ్ఞాపకాల్ని మిగులుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఆరు నెలల వ్యవధిలో ప్రపంచ బిలయనీర్ల సంపద భారీగా తరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద ఈఏడాది ఆరంభం నుంచి 62 బిలియన్ డాలర్లకు తగ్గింది. అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 63 బిలియన్ డాలర్లుకు కరిగిపోయింది. మెటా అధిపతి మార్క్ జుకర్ బెర్గ్ సంపద ఏకంగా సగానికి పైగా తగ్గింది. 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి 2022లో ఇప్పటి వరకు బిలియనీర్ల జాబితాలో తొలి 500మంది కుబేరుల సంపద 2022లో తొలి అర్ధ భాగంలో 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరయ్యింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్ధిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు భారీగా ఉద్దీపన పథకాల్ని ప్రకటించగా.. టెక్ సంస్థలు భారీగా లాభాల్ని అర్జించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల అధినేతల సంపద కూడా పెరిగింది. తాజాగా కోవిడ్ సంక్షోభం తగ్గుతుండడంతో ప్రభుత్వాలు ఉద్దీపనల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లను కూడా పెంచేందుకు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల షేర్లు కుదేలై కుబేరుల సంపద కరిగిపోతుంది. -
అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్లు, తాత్కాలిక అనుమతులిచ్చిన శ్రీలంక!
దేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీకి శ్రీలంక ప్రభుత్వం తాత్కాలిక అనుమతులిచ్చింది. దీంతో అదానీ సంస్థ ప్రాజెక్ట్ల నిర్మాణాల నిమిత్తం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది గతేడాది అక్టోబర్లో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ శ్రీలంక తీర ప్రాంతాలైన మన్నార్, జాఫ్నా, కిలినోచీలో పర్యటించారు. అనంతరం నాటి ప్రధాని గోటబయ రాజపక్సతో పెట్టుబడులపై చర్చించారు. రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై శ్రీలంక ప్రభుత్వం, అదానీ గ్రూపు ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 286 మెగావాట్లు, 234 మెగావాట్ల రెండు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ల కోసం అదానీ గ్రీన్ ఎనర్జీకి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాత్కాలిక అనుమతినిచ్చినట్లు శ్రీలంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర ప్రకటించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ), సస్టైనబుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైనట్లు విజేశేకర ట్వీట్లో తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మన్నార్ జిల్లా, కిలినుచ్చి జిల్లాలోని పూనేరిన్లలో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. 'పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు సీఈబీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కాంచన విజేశేఖర భేటీ అయ్యారు. భేటీ అనంతరం మన్నార్లో 286 మెగావాట్లు, పూనేరిన్లో 234 మెగావాట్ల ఇంధన ప్రాజెక్ట్ల కోసంఅదానీ గ్రీన్ ఎనర్జీకి తాత్కాలిక అనుమతులు జారీ చేసినట్లు విజేశేఖర తెలిపారు. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేలా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టుకునే అవకాశాన్ని అదానీ గ్రూప్కు కల్పించినట్లు పేర్కొన్నారు. -
పారిశ్రామికవేత్త అదానీకి జెడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఖర్చుని అదానీయే భరిస్తారు. నెలకి రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. ఇదీ చదవండి: 75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్గా అదానీ -
అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝున్ఝున్వాలా(62) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి గురిచేసింది. నేడు(ఆగస్టు 14న) ముంబైలో గుండెపోటుతో కన్నుమూయడంపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బిలియనీర్ హఠాన్మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి : రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? ఒక శకం ముగిసిందంటూ పలువురు పారిశశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, బిలియనీర్ గౌతమ్ అదానీ, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అండ్ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం వెలిబుచ్చారు. ఝున్ఝున్వాలా సలహాలు, సూచనలతో మార్కెట్లో విజయం సాధించిన పలువురు అభిమానులు ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుని కంట తడి పెట్టు కుంటున్నారు. పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తన గుమిగూడడంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ అని పిలుచుకునే నికర విలువ 5.8 బిలియన్ డాలర్లు (ఆగస్టు 2022 నాటికి) ఇండియాలో 36వ సంపన్నుడు. ప్రపంచంలోని 438వ బిలియనీర్గా ఉన్నారు. Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7 — Narendra Modi (@narendramodi) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Very saddened to know about the passing of the veteran investor Shree Rakesh JhunJhunwala. India has lost a gem, who made a mark not just on the stock market but on the minds of almost every investor in india.#RakeshJhunjhunwala pic.twitter.com/QX4uvBx7hA — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 14, 2022 -
వారెన్ బఫెట్కు భారీ షాక్! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ!
వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంటనూనె దాకా. పోర్ట్ల నుంచి వంట గ్యాస్ వరకు ఇలా ప్రతిరంగంలో తనదైన ముద్రవేస్తూ దూసుకెళ్తున్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు.. ప్రతి రంగంలోనూ అదానీకి విజయమే వరిస్తుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే..అడ్రస్ కనుక్కొని వెళ్లి మరీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.అందుకే తనని అందుకోవాలనే ఆలోచన కూడా ప్రత్యర్ధులకు రానంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ధనవంతుల జాబితాల్లో ఒక్కొక్కరిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఆసియా రిచెస్ట్ పర్సన్ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకున్న ఆయన..తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. గత శుక్రవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ షేర్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో అదానీ ఆస్థుల విలువ 123.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 121.7 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఇన్వెస్ట్ మెంట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ను వెనక్కి నెట్టారు. 5వ స్థానాన్ని రెండేళ్ల క్రితం అదానీ ఆస్థుల విలువ 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇంతింతై వటుడింతయై అన్న చందంగా అదానీ షేర్ వ్యాల్యూ దేశీయ స్టాక్ మార్కెట్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. అలా మార్చి 2021 నుంచి మార్చి 2022 నాటికి అదానీ గ్రూప్ స్టాక్స్ 90 బిలియన్ డాలర్లకు చేరింది. అంచనా ప్రకారం..భారత్లో అదానీ ఆస్థుల నికర విలువ 123.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. ముఖేష్ అంబానీ నికర ఆస్థుల విలువ 104.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. అదానీని క్రాస్ చేసేందుకు ముఖేష్ అంబానీకి 19 బిలియన్ డాలర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక యూఎస్ మార్కెట్లో వారెన్ బఫెట్కు చెందిన బెర్క్ షైర్ హాత్వే షేర్లు శుక్రవారం రోజు 2శాతం పడిపోవడంతో.. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 6వ స్థానానికి దిగజారినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం..ఇప్పుడు వరల్డ్ వైడ్గా అదానీ కంటే నలుగురు మాత్రమే ధనవంతులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 167.9 బిలియన్ డాలర్లు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లు..స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్' లు 269.7 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. చదవండి👉 అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..! -
అదే జరిగితే మన దేశంలో ఆకలి కేకలే ఉండవ్: గౌతమ్ అదానీ
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరితే అప్పుడు ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రించే పరిస్థితి ఉండదని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘‘2050 నాటికి 10,000 రోజులు ఉన్నాయి. ఈ కాలంలో 25 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థ పరిధి పెరుగుతుందని నేను అంచనా వేస్తున్నాను. అంటే ప్రతి రోజూ 2.5 బిలియన్ డాలర్ల మేర జీడీపీకి అదనంగా తోడవుతుంది. ఇదే కాలంలో దేశం నుంచి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించొచ్చు. అంతేకాదు 40 ట్రిలియన్ డాలర్ల మేర స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరుగుతుంది. అంటే 2050 వరకు రోజూ 4 బిలియన్ డాలర్ల చొప్పున అధికం అవుతుంది’’అంటూ ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్’ కార్యక్రమంలో భాగంగా అదానీ పేర్కొన్నారు. 2021లో 49 బిలియన్ డాలర్ల మేర అదానీ తన సంపదను వృద్ధి చేసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం. చదవండి👉 అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..! -
అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..!
దేశీయ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ..మరో బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీకి భారీ షాకిచ్చారు. ముఖేష్ అంబానీతో పాటు గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్,సెర్గీ బ్రిన్లను అధిగమించి 118బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోని 6వ అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు. ఇక ఇన్వెస్ట్మెంట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ను అధిగమించేందుకు అదానీకి కేవలం 9 బిలియన్ల సంపద అవసరం. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరగడం వల్ల కేవలం 4నెలల కాలంలో అదానీ సంపద 53శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అదానీ నెట్ వర్త్ దేశీయ స్టాక్ మార్కెట్లో గౌతమ్ అదానీకి చెందిన క్లీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్ట్, పవర్ ప్లాంట్ షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరిగాయి. దీంతో అదానీ టాప్-6 వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెనెవేబుల్ ఎనర్జీ షేర్లు ఈ ఏడాదిలో 60శాతం పెరిగాయి. మొత్తంగా అదానీ గ్రూప్కు చెందిన కంపెనీ షేర్లు 111శాతం వృద్ధిని సాధించాయి. ఇక స్టాక్ మార్కెట్లో మోస్ట్ వ్యాలీడ్ మార్కెట్ కేపిటలైజేషన్లో అదానీ గ్రీన్ ఎనర్జీతో టాప్-10 కంపెనీల్లో ఒకటిగా ఎయిర్టెల్ పోటీ పడుతుంది. గౌతమ్ అదానీ ఆస్తులు పెరగడానికి కారణం..గత శుక్రవారం అబుదబీ ఇంటర్నేషన్ హోల్డింగ్స్(ఐహెచ్సీ) అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్లో 2బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో గౌతమ్ అదానీ షేర్లు లాభాల బాట పట్టాయి. సంవత్సరంలోనే డబుల్కి డబుల్ అయ్యాయి గత శుక్రవారం కొన్ని నివేదికల ప్రకారం..అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 25శాతం పెరిగాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు 11శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 3శాతం పెరిగాయి. ఏప్రిల్ 4న బ్లూమ్ బెర్గ్ టాప్ -10..100 బిలియన్ క్లబ్లో భారత్ నుంచి అదానీ చేరారు. ఇక అనూహ్యంగా గతేడాది ఏప్రిల్ నెల నుంచి 54 బిలియన్ డాలర్ల నుంచి ఈ రోజుతో 118బిలియన్ డాలర్లను అర్జించారు. అంబానీకి షాక్ ఇదిలా ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొన్ని సంవత్సరాలుగా ఈ జాబితాలో అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు 95.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్లో 11 వ స్థానంలో ఉన్నారు. తాజాగా అదానీ..అంబానీని దాటేసి ఏకంగా ఆరో స్థానానికి చేరారు. -
భారత్కు సౌదీ నుంచి 80 టన్నుల ఆక్సిజన్
దుబాయ్: తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న భారత్కు సౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్ను పంపుతున్నట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్ను భారత్కు తరలించే మిషన్లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్తో 4 క్రయోజనిక్ ట్యాంకులు నౌకలో దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. Thank you @IndianEmbRiyadh. Indeed, actions speak louder than words. We are on an urgent mission to secure oxygen supplies from across the world. This first shipment of 4 ISO cryogenic tanks with 80 tons of liquid oxygen is now on its way from Dammam to Mundra. (1/3) https://t.co/BLZ0SbQ499 pic.twitter.com/lFKnx0hIhX — Gautam Adani (@gautam_adani) April 24, 2021 -
కోవిడ్-19లోనూ.. మన కుబేరులు భళా
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా బిలియనీర్ల సంపద పెరుగుతూ వచ్చింది. 2020లో ఏడుగురు కుబేరుల సంపదకు 60 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి వీరి మొత్తం సంపద దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరి 1 మొదలు డిసెంబర్ 11కల్లా దేశీయంగా 7గురు కుబేరుల సంపద మొత్తం 194.4 బిలియన్ డాలర్లను తాకినట్లు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం...(మార్క్ జుకర్బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ) యమస్పీడ్.. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. షేర్ల ర్యాలీ దేశీ పారిశ్రామిక దిగ్గజాల వ్యక్తిగత సంపద పుంజుకోవడానికి ఆయా కంపెనీ షేర్లు ర్యాలీ బాటలో సాగడం దోహదపడింది. గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ 120-27 శాతం మధ్య దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీకి కలసి వచ్చింది. అయితే అదానీ పవర్ 28 శాతం క్షీణించడం గమనార్హం. ప్రధానంగా ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 33 శాతం ఎగసి 13.56 లక్షల కోట్లను తాకడంతో ముకేశ్ సంపద జోరందుకుంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు 52 శాతం, విప్రో 44 శాతం పురోగమించడంతో శివనాడార్, అజీమ్ ప్రేమ్జీ సంపదలు వృద్ధి చెందాయి. ఇదేవిధంగా సన్ ఫార్మా షేరు 31 శాతం లాభపడటంతో దిలీప్ సంఘ్వీ సంపద పుంజుకుంది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 12 శాతమే లాభపడటం ప్రస్తావించదగ్గ అంశం! -
ఆర్థిక వృద్ధికి ఎయిర్పోర్టుల ఊతం
న్యూఢిల్లీ: స్థానిక ఆర్థిక అభివృద్ధికి విమానాశ్రయాలు శక్తిమంతమైన చోదకాలుగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పెద్ద నగరాలకు అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాల కొనుగోలు అనంతరం తమ ఎయిర్పోర్ట్ల వ్యాపార విభాగం మరింతగా విస్తరిస్తుందని అదానీ తెలిపారు. గ్రూప్లోని ఇతర వ్యాపారాలకు కూడా ఇది వ్యూహాత్మక అవకాశాలు సృష్టించగలదని ఆయన వివరించారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్కు చెందిన 50.50 శాతం వాటాలతో పాటు మైనారిటీ షేర్హోల్డర్ల వాటాలను కూడా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎయిర్పోర్ట్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు. దీనితో పాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మా ఆరు విమానాశ్రయాల పోర్ట్ఫోలియోకు తోడవుతుంది. ఈ పరిణామం మా ఇతర వ్యాపారాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు కూడా ఉపయోగపడగలదు‘ అని అదానీ ఒక ప్రకటనలో వివరించారు. 21 శతాబ్దంలోని టాప్ 5 అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ముంబై మారనున్న నేపథ్యంలో దేశీయంగా ఇది ప్రధాన ఎయిర్పోర్ట్గా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో దేశీయంగా 200 పైచిలుకు ఎయిర్పోర్టులు అదనంగా నిర్మించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. టాప్ 30లోని ఒక్కో నగరానికి రెండు విమానాశ్రయాలు అవసరమవుతాయని అదానీ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎయిర్పోర్ట్స్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
అదానీ పవర్ డీలిస్ట్?
బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్లోని విద్యుత్ రంగ కంపెనీ అదానీ పవర్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కంపెనీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) మార్గాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనపై తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశాయి. బైబ్యాక్ ద్వారా కంపెనీలో మిగిలిన వాటాను కొనుగోలు చేసే వ్యూహంలో ప్రమోటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో దిగ్గజ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ సైతం గ్రూప్లోని ప్రధాన కంపెనీ వేదాంతా లిమిటెడ్ను డీలిస్ట్ చేసే ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో గౌతమ్ అదానీ సైతం అదానీ పవర్ డీలిస్టింగ్ సన్నాహాలు చేపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల ద్వారా అదానీ పవర్ 12,410 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది. కంపెనీలో ఇప్పటికే దాదాపు 75 శాతం వాటా ప్రమోటర్ల చేతిలో ఉంది. బైబ్యాక్ చేపట్టడం ద్వారా మిగిలిన 25.1 శాతం వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. శుక్రవారం అదానీ పవర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం లాభపడి రూ. 36.3 వద్ద ముగిసింది. గతేడాది నవంబర్లో ఈ షేరు రూ. 74 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది. వ్యూహాత్మకం స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలపై అధిక దృష్టిని సారించేందుకు వీలుంటుందని అదానీ పవర్ భావిస్తోంది. తద్వారా కంపెనీపై యాజమాన్యానికి పూర్తిపట్లు లభిస్తుందని చెబుతోంది. దీంతో నిర్వహణ, వ్యూహాలు, ఆర్థిక అంశాలలో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణ, కొత్త అవకాశాల అన్వేషణ, విస్తరణ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. వెరసి కొత్త బిజినెస్లు, ప్రాంతాలలో కార్యకలాపాల విస్తరణ కోసమే డీలిస్టింగ్ యోచన చేపట్టినట్లు వివరించింది. వాటాదారులకు ప్రయోజనం చేకూరేలా డీలిస్టింగ్ ప్రతిపాదనను చేపట్టనున్నట్లు అదానీ పవర్ చెబుతోంది. తద్వారా కంపెనీ నుంచి బయటపడేందుకు లాభసాటి మార్గాన్ని చూపనున్నట్లు తెలియజేసింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా డీలిస్టింగ్ ధరను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. -
రేపటి నుంచి దావోస్ సదస్సు
దావోస్: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్దేవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, ఎన్ చంద్రశేఖరన్, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ సహా 100కు పైగా భారత సీఈవోలు మంగళవారం నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకునే ప్రసంగం ఇవ్వనున్నారు. సద్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీరో ఎమిషన్స్ లక్ష్యానికి కట్టుబడాలి... 2050 లేదా అంతకుముందుగానే కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్ ఎమిషన్స్) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ష్వాబ్ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది. -
మోదీ ఆప్తుడికి చుక్కెదురు
సిడ్నీ: ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన భారత పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి ఆస్ట్రేలియాలో చుక్కెదురైంది. క్వీన్స్లాండ్స్లోని క్లర్మాంట్కు సమీపంలో ఆయన కంపెనీ ప్రారంభించిన భారీ బొగ్గు వెలికితీత ప్రాజెక్టును స్థానిక కోర్టు తాత్కాలికంగా నిషేధించింది. అదానీ సంస్థ నిర్వహిస్తున్న పనులు.. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయన్న పర్యావరణవేత్తల వాదనతో కోర్టు ఏకీభవించింది. పూర్తి వివరాలు.. కార్మిచాయెల్ కోల్మైన్, రైల్ అండ్ పోర్ట్ ప్రాజెక్టు పేరుతో ఉత్తర గెలిలీ బేసిన్ (క్వీన్స్లాండ్ రాష్ట్రం)లో అదానీ గ్రూపు భారీ ప్రాజెక్టును చేపట్టింది. 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా చరిత్రలో అతి పెద్ద కోల్ మైన్ ప్రాజెక్టు కావడం విశేషం. బేసిన్ చూట్టూరా దాదాపు 160 నుంచి 400 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును విస్తరిస్తారు. అయితే సరిగ్గా అదే ప్రాంతం ప్రపంచంలోనే అరుదైన జీవవైవిధ్యం కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరుపొందింది. కానీ ఎలాగోలా అనుమతులు వచ్చాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా, మొదటినుంచి ఈ ప్రాజెక్టును జీవనాశినిగా పేర్కొంటున్న పర్యావరణ వేత్తలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. వీరి ఆందోళనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. నిజానికి కోర్టు కూడా ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపకపోయినప్పటికీ జీవవైవిధ్యం విషయంలో మాత్రం స్పందించింది. పర్యావరణ పరిరక్షకు తగిన చర్యలు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని, అప్పటివరకు అదానీ గ్రూప్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం తీర్పు వెలువరించింది. ఆరువారాల వ్యవధిలోగా పర్యావరణహిత కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.