gudiwada amarnath
-
‘పవన్.. బాబు సూపర్ సిక్స్కు గ్యారంటీ నువ్వే కదా’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే, అప్పులు చేసి కూడా పేదలకు చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో మోసం చేసిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల నిలదీయాలని పిలుపునిచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నేడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణం. చెప్పింది చెయ్యడం.. చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణం. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదు.. హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైఎస్సార్సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది.రాష్ట్రంలో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది వైఎస్ జగన్. వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు మంచి జరిగింది. కానీ, పార్టీకి కేడర్కు మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తల ద్వారానే అన్ని సేవలు అందుతాయి. ఇది పార్టీ మాటగా హామీ ఇస్తున్నాను. అన్ని వైఎస్ జగన్ను ప్రజలు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు మంచిగా బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు. ప్రజలకు రెండు లక్షల 80వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని జగన్ నిర్ణయించారు. ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు’ అని కామెంట్స్ చేశారు. -
లోకేష్.. అవన్నీ నీ కళ్లకు కనిపించడం లేదా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్ట్లు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఏ శాఖ మీదా అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం అని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మీద మాటలాడి లోకేష్ అభాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 15ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్ నిర్మాణం లోకేష్కు కనిపించలేదా?. మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయి. ఇన్ఫోసిస్ ఐటీ పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చింది. మేము తెచ్చిన టీసీఎస్ మీరు తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం. రుషికొండపై అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టారు. ఆ భవనాన్ని ప్రధాని, రాష్ట్రపతి అవసరాల కోసం వాడుకోవచ్చు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధానితో లోకేష్ చెప్పించగలరా?. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పగలరా?. ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది. వరదలు విపత్తులకు వైఎస్ జగనే కారణం అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నేను మంత్రిగా ఉన్న సమయంలో ఒప్పందం జరిగింది. 1300 ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారత దేశం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ సాధించాము. రైల్వే జోన్కు 52 ఎకరాల భూములు జనవరి నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. టీడీపీ హయాంలో బకాయిలు పెట్టిన రూ.50వేల కోట్లు వైఎస్ జగన్ చెల్లించారు. అప్పు తెచ్చిన లక్ష 20వేల కోట్లు ఏం చేశారు?.పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారు అంటున్న లోకేష్, వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమవి అని ఎలా చెప్పుకుంటారు. వాలంటీర్లకు 10వేల రూపాయలు ఇస్తామని ఎలా మేనిఫెస్టో పెట్టారు. గంజాయి రవాణా చేసే ఖైదీలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. హోం మంత్రి ముందు తన పేషీలో ఉన్న గంజాయి మొక్కను తొలగించారా లేదా?. రోజుకొక మంత్రి అవినీతి బాగోతం బయటపడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.అనంతరం, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి.జమిలి ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. రైతు పోరాటానికి విశేషమైన స్పందన లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు. -
కూటమి పాలనలో అప్పు రోజుగా ‘మంగళవారం’: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో బీసీలుకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని చెప్పారు. రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ నేతలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘వెనుక బడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారు. బీసీలకు సముచితమైన మార్గం చూపించారు. అలాగే, బీసీలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించారు. రాజ్య సభ పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించారు.పేద వానికి సంక్షేమాన్ని కూటమి పాలన దూరం చేసింది. కూటమి పాలనలో మంగళవారం అప్పు రోజుగా మారింది. ఆరు నెలల పాలనలో 60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో 2.5 లక్షల వాలంటీర్లను తొలగించారు. చంద్రబాబు తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీ లేదు. ఒక్క హామీని కూడా ఆరు నెలల కాలంలో నిలబెట్టుకోలేదు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఉసే లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు.. ‘‘వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో..ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి. .. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి. .. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్ ఇచ్చారు. -
టికెట్పై భయం లేదు.. నా భవిష్యత్తు సీఎం నిర్ణయిస్తారు: మంత్రి అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రూ. 2,500 కోట్లతో అల్ట్రాటెక్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు( బుధశారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు. తనకు టికెట్ భయం లేదని.. తన భవిష్యత్తును సీఎం నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని అన్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లో ఇమడలేరని అన్నారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని, స్టార్లు గ్రౌండ్ లెవల్లో పనిచేయడం కష్టమని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని తెలిపారు. అలా చేయనివారు వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోతేనే మంచిదన్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుందన్నారు. కాగా దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామం సమీపంలో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది దీనికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2,500 కోట్లు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
‘బాబు, పవన్.. ప్రజల ముందుకొచ్చి చెప్పే దమ్ముందా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల అగ్ని ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వ సాయంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. దత్తపుత్రుడు ఈరోజు 50వేలు, రేపు టీడీపీ నాయకులు లక్ష ఇస్తామని వచ్చారు. రాజకీయం కోసం తప్ప వీరికి ప్రజలపై ప్రేమ లేదని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, మంత్రి అమర్నాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించలేరు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో, అంతక ముందు గానీ విశాఖను రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఉంది. సీఎం జగన్ వైజాగ్ వస్తే తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పోతుందన్న భయంలో టీడీపీ ఉంది. సీఎం జగన్ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం వీరికి నచ్చదు. అందుకే విశాఖ నుంచి పాలనపై విషం చిమ్ముతున్నారు. ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తు తీసుకువస్తున్న సీఎం నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలుస్తారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా మార్చడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, పచ్చ మీడియా నేతల మాదిరిగా హైదరాబాద్ నుంచి కాకుండా మన విజయవాడ నుంచి సీఎం జగన్ విశాఖ వస్తున్నారు. సీఎం జగన్ ప్రజల సౌలభ్యం కోసం 26 జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు నిజంగా కొత్త జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను వ్యతిరేకిస్తే ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. చంద్రబాబు, పవన్ పొలిటికల్ టూరిస్ట్లు. ఈ ఇద్దరు పొలిటికల్ టూరిస్టులు వికేంద్రీకరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరికి అమరావతి నుంచి పాలన జరగాలన్న కోరిక ఉంది. అమరావతి అనే భ్రమను ప్రజల్లో ఇంకా ఉంచాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘పవన్తో పాటు, నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప. టీడీపీ పాలనలో జీఎస్డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్డీపీ ఒకటో స్థానంలో ఉంది. జీఎస్డీపీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయి. ఈజ్ ఆఫ్ డుయింగ్లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంఎస్ఎంఈకి పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్ఎంఈ రంగంలో 650 శాతం అభివృద్ధి సాధించింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నాము. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ను నిర్మిస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతోనే మా పొత్తు: సీఎం జగన్ -
బడుగు బలహీనర్గాలకే కీలక పదవులు: బూడి మూత్యాల నాయుడు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గురువారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అడీప్ రాజు, ఎమ్మెల్సీ కళ్యాణి, విశాఖ డెయిరీ చైర్మెన్ అడారి ఆనంద్. తదితరులు హాజరయ్యారు. ఎంపీ సత్యవతి పాయింట్స్ ►పేదరికం నుంచి బయట పడడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ►ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ►వచ్చే ఎన్నికల్లో 175 కు 175 వైఎస్సార్సీపీ సాధిస్తుంది. బూడి ముత్యాల నాయుడు పాయింట్స్ ►ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారు. ►ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు బలహీన వర్గాలు స్థానం కల్పించారు. ►కీలకమైన పదవులు బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ►నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారు. ►కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాటశాలను మార్చారు. ►ఇంగ్లీష్ మీడియంను అలీబాబా 40 దొంగలు హేళన చేశారు. ►చంద్రబాబు, గంటా, అయ్యన్న, బండారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ►పేదలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటా. ►ఇంగ్లీష్ మీడియం చదువులు లేక గతంలో ఎంతో మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ►దివంగత నేత ఫీజ్ రియంబర్స్ మెంట్ వలన పేదల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. ►బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు పాయింట్స్ ►స్వాతంత్ర్యం తరువాత చాలామంది పేదలకు న్యాయం జరగలేదు. ►కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ►దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ పథకాలపై విమర్శలు చేసిన వారు నేడు ప్రశంసిస్తున్నారు. ►సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాఫీ కొట్టారు ►ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా? ►రైతు డ్వాక్రా రుణా మాఫీ చేశారా? ►ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ►అధికారం కోసమే చంద్రబాబు హామీలు ఇచ్చారు. ►పేద వారు తమ అవసరాలు కోసం కోర్టులకు వెళ్ళలేరు. ► పాలకులు ప్రజలు కష్టాలు తెలుసుకొని పాలన చేయాలి. ►దేశానికి ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ►సమాజంలో అంతరాలను తగ్గించడం వంటివి సైకోలు చేస్తారా లోకేష్. ►ఒక రోడ్డు, ఒక బిల్డింగ్ వేస్తే అభివృద్ధి కాదు. ►ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభవృద్ధి. ►టీడీపీ జెండా కట్టిన వారికే పథకాలు ఇచ్చారు. ►సీఎం జగన్ పాలన పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారు. ►సీఎం జగన్ ఒక రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు. ►చంద్రబాబు కూడా అవినీతి జరిగిందని చెప్పలేక పోతున్నారు. ►గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ►కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం గెలిసింది అని టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ►271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►అన్ని ఆధారాలు తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే కోర్టులో నిరూపించుకోవాలి. ►టీడీపీ పాలనలో నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ►సీఎం జగన్ పాలనలో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ►ఎన్నికలు ముందు మయ మాటలతో చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తారు రాజన్న దొర డిప్యూటీ సీఎం ►మనకు మంచి ఎవరు చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి. ►పేదలు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ►టీడీపీ నాయకుల మయ మాటల ఎవరు నమ్మొద్దు. ►బలహీన వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. ►సమాజాన్ని సమ సమాజంగా సీఎం జగన్ మార్చారు. ►గిరిజనులు కోసం 20 వేల కోట్ల కర్చు చేశారు. ►పేదలు పక్ష పాతి సీఎం జగన్ ►బురద మా మీద జల్లలని చూస్తే పందుల్లా మీదే బురద పడుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయింట్స్ ►సామాజిక న్యాయానికి ముత్యాల నాయుడే ఒక ఉదాహరణ. ►రాజకీయాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సీఎం జగన్, ముత్యాల నాయుడిని పక్కన పెట్టుకున్నారు. ►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ►దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ఏ నాయకుడు వేయలేదు. ►కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. ►మళ్ళీ 28 రోజుల తరువాత జైలుకు వెళ్లాల్సిందే. ►ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్గానే పోటీ చేస్తారు. ►చంద్రబాబుకు 1000 కోట్ల చేతి కర్ర పవన్ రూపంలో దొరికింది. -
‘ఏపీలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ పేర్కొన్నారు. తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించడంతో పాటు ఏసీఏ(ఆంధ్రక్రికెట్ అసోసియేషన్) మంచి సహాయ సహకారాలు అందించిన కారణంగానే దేశం తరఫున ఆడే అవకాశం దక్కిందన్నాడు. శుక్రవారం విశాఖలో క్రికెటర్ భరత్ను మంత్రి గుడివాడ్ అమర్నాథ్, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మాట్లాడిన శ్రీకర్ భరత్.. ‘నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు. నా తల్లి దండ్రులు ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ మంచి సహాయ సహకారాలు అందించింది. నా ఎదుగుదలలో ఏసీఏది కీలక పాత్ర. ఏసీఏ సహాయ సహకారాలు మర్చిపోలేనిది. పట్టుదలతో విజయం సాధించవచ్చు. దేశానికి ఆడడం గర్వంగా భావిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం జగన్ సార్ ను కలిశాను. సీఎం జగన్ సార్ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అనేది మంచి కార్యక్రమం’ అని భరత్ స్పష్టం చేశాడు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘దేశానికి గర్వకారణం భరత్. 140 కోట్ల మంది ప్రజల్లో భారత్ క్రికెట్ జట్టుకు భరత్ ఎంపిక కావడం సంతోషం. అడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను సీఎం వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వత భరత్, రాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చెప్పారు. గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం, 1000 చదరపు గజాల స్థలం ఇవ్వడానికి సీఎం జగన్ నిర్ణయించారు. భరత్ అకాడమీ పెడితే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధోనీలా భరత్కు మంచి భవిష్యత్ ఉంది. క్రికెట్ ఆడే యువతకు భరత్ ఆదర్శం’ అని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి పాయింట్స్ మాట్లాడుతూ.. ‘పట్టుదలతో శ్రీకర్ భరత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.దేశం గర్వించదగ్గ బిడ్డను మనకు భరత్ తల్లి దండ్రులు అందించారు.పట్టుదలతో వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో స్థానం సంపాదించారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ భరత్కు ఉంది. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తారు. ఏసీఏ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అన్ని రకాల క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. -
ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్..
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణరావు, మాజీ ఎంపీపీ ధనమ్మ, విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజా ఉన్నారు. సీఎం జగన్కు వీరికి వైఎస్సార్సీపీ పార్టీ కండువా తప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత..: మంత్రి జోగి రమేష్ -
పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. తనతోపాటు ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాకు వెళ్లి.. విశాఖ, భువనేశ్వర్, ఇతర ఆసుపత్రిలో బాధితులను చేర్పించి, పరామర్శించామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. కోరమండల్లో ఎక్స్ప్రెస్లో 309 మంది, యశ్వంత్పూర్ రైలులో 33 మంది ఉన్నారని పేర్కొన్నారు. రెండు రైళ్లలో ప్రయాణించిన 342 మందిలో 329 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. 12 మందికి స్వల్ప గాయాలైనట్లు గుర్తించామన్నారు. విశాఖ ఆసుపత్రిలో 9 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్లను కేంద్ర మంత్రులు అభినందిచారని చెప్పారు. అంబులెన్స్లు, మహాప్రస్థానం వాహనాలను ఒడిశాలోనే ఉంచామని తెలిపారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఒడిశాలోనే ఉన్నారన్నారు. రైలు ప్రమాదం ఘటనలో బాలాసోర్లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లా వ్యక్తి మరణించాడని, బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ‘ఏపీకి చెందిన వారి కోసం కాల్స్ రాలేదు. ఖమ్మం వ్యక్తి అంబటి రాములు విజయవాడ నుంచి వెళ్తున్నట్లు కాల్ వచ్చింది. పక్క రాష్ట్రం అయినప్పటికీ సమాచారం కోసం ఆరా తీస్తున్నాం. ఒడిశా రైలు ప్రమాదంలో 276 మంది చనిపోగా.. 187 మృతదేహాలను మార్చురీలో ఉన్నాయి. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటున్నాం. మన అంబులెన్స్లు, మహాప్రస్థానం వాహనాలు కావాలని కేంద్ర మంత్రులు అడిగారు. మన ప్రభుత్వం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ మాట కేంద్ర మంత్రులే చెప్పారు. పక్క రాష్ట్రాల వారికి కూడా సహకారం అందిస్తున్నాం. బాధితులు ఆస్పత్రుల నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితులకు సేవచేయడం ముఖ్యం.. పబ్లిసిటీ కాదు’ అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం గురించి తెలియగానే సీఎం జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మర్నాడు ఉదయమే నేను, ముగ్గురు ఐఏఎస్లు, మరో ముగ్గురు ఐపీఎస్లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి, వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మేం అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తుండగానే అదే రోజు సాయంత్రం విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొందరు అధికారులు వచ్చి మాతో జాయిన్ అయ్యారు. వివిధ శాఖల సమన్వయంతో..: రెస్క్యూ ఆపరేషన్లో ఇక్కడ్నుంచి వెళ్లిన మాతో పాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురు తహశీల్దార్లు, ఒక డిప్యూటీ డీఎంహెచ్వో, 9 మంది డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, పోలీసు, ఆర్టీవో సిబ్బంది మాతో కలిపి పని చేశారు. ఆయా శాఖల్ని సమన్వయం చేసుకుంటూ రైలు ప్రమాద ప్రయాణికుల్ని గుర్తించగలిగాం. 108 సర్వీసులు 20.. ఇంకా 19 ప్రైవేటు అంబులెన్స్లు, 15 మహాప్రస్థానం వెహికల్స్ను వెంట తీసుకెళ్లాం. ఒక్కో 108 సర్వీస్లో నలుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద 5 అంబులెన్స్లతో సేవలందించాం. ఇంకా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇచ్చాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలు చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో కంట్రోల్ రూంకు అందిన ఫోన్ల సమాచారం ద్వారా.. ఎక్కడికక్కడ రిజర్వేషన్ల ఛార్ట్ల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నెంబర్ల ప్రకారం వారితో మాట్లాడి వారి ఆచూకి తెలుసుకోవడం, వారు సేఫ్గా స్వస్థలాలకు చేరే వరకు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్రేంద్ర ప్రధాన్గార్లను కూడా కలిసి మాట్లాడాం. సీఎంగారి ఆదేశాల మేరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాపైనా చెప్పాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుమూర్తి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. తమిళనాడు, బీహార్.. తదితర రాష్ట్రాల్లో కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్లే ఏర్పాటు చేయగా, మన దగ్గర కంట్రోల్ రూమ్లతో పాటు, వివిధ జిల్లా కేంద్రాల్లో అధికారుల్ని అప్రమత్తం చేసి చేపట్టిన రెస్యూ్క ఆపరేషన్ విధానం, మన చొరవను కేంద్ర మంత్రులు అభినందించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చదవండి: ‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ -
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో మంత్రి అమర్నాథ్ భేటీ
భువనేశ్వర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద ప్రాంతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఆదివారం కటక్లో మంత్రి అమర్నాథ్ సమావేశమయ్యారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కాల్ సెంటర్లు నిర్వహణ ద్వారా బాధితులను త్వరగా గుర్తించి సహాయం అందించామని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాకు ఒక కాల్ సెంటర్ నిర్వహణను రైల్వే మంత్రి అభినందించారు. చదవండి: ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది? అంతకుముందు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. . కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందినవారు 342 ప్రయాణిస్తున్నారని వారిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు మరోవైపు ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్లో మార్పులు చేసిన వారిని కూడా గుర్తించామని వెల్లడించారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయన్నారు. కవచ్కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు. చదవండి: ‘వైఎస్ జగన్ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
AP: మీ వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే..
సాక్షి, అమరావతి: ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పద్దుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్ప్రెస్లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు. కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం 8333905022 నంబర్ వాట్సాప్కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు. వ్యవస్థలన్నీ విశాఖపట్నం నుంచే పనిచేస్తాయని స్పష్టం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు. వ్యవస్థలన్నీ విశాఖ నుంచే పనిచేస్తాయి. మే 3వ తేదీన భోగాపురం ఎయిర్పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. విశాఖ రాజధానిగా టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. -
‘ఏపీలో ఎవరు పెట్టుబడులు పెడతామన్నా ఆహ్వానిస్తాం!’
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కోసం ముందస్తు సన్నాహక సదస్సు జరిగిందని చెప్పారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఈ సదస్సుకు 48 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారని చెప్పారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సుకి దేశంలోని విభిన్న పారిశ్రామిక వేత్తలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రంగా ఉందన్నారు. దేశంలోకి 11 ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి అందులో మూడు ఏపీకే రావడం శుభపరిణామని చెప్పారు. అలాగే 69 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఏపీ విధానాలను కోనియాడుతున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఎవరూ పెట్టుబడులు పెడతామన్న సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ప్రపంచానికి తెలియ జెప్పే క్రమంలోనే విశాఖలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. అంతేగాదు ఈ సమ్మిట్ను విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని అమర్నాథ్ తెలిపారు. (చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్) -
విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తాం : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
అనకాపల్లిలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
-
పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ అవాస్తవ ప్రచారం : గుడివాడ అమర్నాథ్
-
లోకేష్ పాదయాత్ర పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
విశాఖలో ఐటీ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ ఐటీ హబ్గా మారుతున్న విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్ (ఐటాప్), ఏపీఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏపీఐఎస్, ఎస్టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్–2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్సైట్ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజున ఎస్టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, రెండో రోజున బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని వివరించారు. ఐటాప్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు. -
సీఎం ప్రసంగం.. మంచి మెసేజ్లా ఉంది
సాక్షి, విశాఖపట్నం: తమకు రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని రాష్ట్ర శ్రేయస్సు మాత్రమే ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ స్పష్టంచేసిన తీరు మంచి నాయకత్వం, ఉత్తమ పరిపాలన విధానమని.. అలాగే, సీఎం ప్రసంగం రాబోయే తరాలకు మంచి మెసేజ్ ఇచ్చినట్లుగా ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వ విధానాన్ని, పెండింగ్ సమస్యలను ఆయన స్పష్టంగా.. క్లుప్తంగా వివరించి వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధానిని కోరారన్నారు. తాను ఎందరో సీఎంల వద్ద పనిచేసినప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రసంగం తీరుచూశాక జగన్పట్ల ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రధాని బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది ఉత్తరాంధ్ర వాసులందరికీ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పవన్ది అజ్ఞానం.. రామోజీ కండ కావరం నిన్న ఇక్కడికి ఒక సెలబ్రిటీ వచ్చి.. తనను ప్రధాని కలవమన్నారని చెప్పారు. ప్రధానిని కలిసొచ్చిన తర్వాత మీడియాతో.. తాను ప్రభుత్వంపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అంతేకానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవి అడిగానని చెప్పలేదు. అలా చెప్పిఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ, పవన్ ఒక అజ్ఞానిలా ప్రవర్తించాడు. ఇక వారికి వత్తాసు పలికే ఈనాడు పత్రిక ‘కొండ కావరం’ అని రుషికొండపై మరీ దిగజారి వార్త రాసింది. అది నిజానికి రామోజీరావుకు, ఈ పత్రికకు ఉన్న కండ కావరం. ఉత్తరాంధ్ర భాషలో దానిని ఒళ్లు బలుపు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, ఉత్తరాంధ్రపైనా ఎంత అక్కసు, కక్ష ఉందో ఈ వార్త ద్వారా అర్థమవుతోంది. రుషికొండపై నిర్మాణాల్లో తప్పేమిటి? రుషికొండపై ఎందుకు వారు తప్పుడు కథనాలు రాస్తున్నారు? రుషికొండ మీద ప్రభుత్వం కొన్ని భవనాలు కడుతోంది. అందులో తప్పేముంది? రుషికొండ మీద గతంలోనే గెస్ట్హౌస్ ఉంది. శిథిలమైన దాన్ని తొలగించి ఇప్పుడు కొత్త భవనాలు కడుతుంటే ఏమిటి తప్పు? ప్రభుత్వం ఏమైనా రామోజీ ఫిల్మ్సిటీ మాదిరిగా వేల ఎకరాల్లో భవనాలు కడుతోందా? సుమారు రూ.11 వేల కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు జరిగాయి. ఇంకా అభివృద్ధి పనులు జరగాలని ఆలోచించాలే తప్ప ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడమేమిటి? రాష్ట్ర ప్రయోజనాలే సీఎంకు ముఖ్యం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సీఎం జగన్ చెబుతుంటారు.. అందుకు తగ్గట్లే ఆయన వ్యవహరిస్తున్నారు. సీఎంకి రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నారు. అభిమానం ఉండబట్టే విశాఖ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు, పచ్చ మీడియా వాస్తవాలు గుర్తించి ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. జగనన్న లేఅవుట్ చూస్తాడట.. చూడనివ్వండి పవన్కళ్యాణ్ ఆదివారం మా జిల్లా విజయనగరానికి వెళ్తాడట. జగనన్న లేఅవుట్ కాలనీ చూస్తాడట. చూడనివ్వండి. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద లేఅవుట్ అది. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వారిలో 10 వేల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. పనులు సాగుతున్నాయి. అది కాలనీ కాదు. ఒక ఊరు అని చెప్పాలి. 10 వేల ఇళ్లు అంటే దాదాపు 40 వేల జనాభా. అంటే ఒక పట్టణంలా ఉంటుంది. మా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. రాష్ట్రంలో సొంత ఇల్లులేని ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు. కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. -
ప్రధానితో పవన్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
పవన్ కంటే కేఏ పాల్ నయం
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ నయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో కేఏ పాల్ 175 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారని.. పవన్ కూడా 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నోవాటెల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేసేందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జనసైనికులు బానిసలుగా బతకాలన్నారు. పవన్.. వంగవీటి గురించి మాట్లాడిన మాటలు, ఆయనను హత్య చేసిన వారిని కౌగిలించుకున్న విషయాలను ఎలా చూడాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అమరావతి రైతులు పాదయాత్ర మానుకోవాలని కోరారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి అమర్నాథ్ అన్నారు. నగరంలోని ఒక హోటల్లో మంగళవారం అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా 100 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా హబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
ముద్రగడపై దాడి జరిగినప్పుడు పవన్ ఎక్కడున్నారు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
కాపుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులు తెలిపారు. కాపులకు గత మూడేళ్లలో పలు పథకాల ద్వారా రూ.27 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చారని, గ్రామ గ్రామాన దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. త్వరలో విజయవాడలో కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ తమకు పది సీట్లు ఇవ్వాలని ఎవరినో కోరారంటే పార్టీని తాకట్టు పెట్టేందుకే కదా? అని కాపు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. పవన్కు ధైర్యం ఉంటే 175 సీట్లలో సింగిల్గా పోటీ చేస్తామని ప్రకటించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్సార్సీపీనే వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు. కాపు యువతకు వివరిద్దాం.. అధికారంలో ఉండగా కాపులను అణగదొక్కిన చంద్రబాబుకు తన సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్న పవన్కళ్యాణ్ రాజకీయ దిగజారుడుతనాన్ని కాపు ప్రజాప్రతినిధులు తూర్పారబట్టారు. వంగవీటి మోహన్రంగా హత్యకు కారకుడైన చంద్రబాబుతో పవన్ అంటకాగటాన్ని తప్పుబట్టారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చేసి వేలాది మంది కాపులపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేసిన చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కాపు యువతకు అర్థమయ్యేలా వివరించాలని తీర్మానించారు. ఇటీవల కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన వ్యాఖ్యలను సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎంపీలు వంగా గీత, బాలశౌరి, బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, గెడ్డం శ్రీనివాసనాయుడు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్బాబు, సామినేని ఉదయభాను, కిలారి వెంకట రోశయ్య, ఆరాని శ్రీనివాసులు, బొత్స అప్పల నరసయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా నాగశేషు తదితరులు పాల్గొన్నారు. భేటీలో చర్చించిన అంశాలను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. పవన్ కుమ్మక్కు రాజకీయాలు: కొట్టు టీడీపీ కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో రూ.1,824 కోట్లు మాత్రమే విదిల్చింది. ముఖ్యమంత్రి జగన్ కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ ఇప్పటిదాకా డీబీటీ ద్వారా రూ.16,485 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.10 వేల కోట్లతో మొత్తం రూ.27 వేల కోట్లు కాపులకు అందచేశారు. 70,83,377 మంది కాపులకు సాయం చేశారు. టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కుమ్మక్కై కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. చెప్పులు చూపిస్తూ అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు. విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. రంగాకు రక్షణ కల్పించని టీడీపీ సర్కారు:దాడిశెట్టి రాజా, మంత్రి శాసనసభ సాక్షిగా తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని నాడు వంగవీటి రంగా కోరితే టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. నాడు మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య రంగా హత్యపై రాసిన పుస్తకాన్ని పవన్ చదవలేదా? కాపుల్లో ఉద్వేగాన్ని రగిల్చే కుట్ర: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి టీడీపీ హయాంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా చూపించాలనుకున్న చంద్రబాబు పాలనలో కాపులపై కేసులు పెట్టడమే కాకుండా వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టారు. విశాఖలో సెక్షన్ 30 ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు ఆయన అధికారంలో ఉండగా రాజమహేంద్రవరంలో మూడేళ్ల పాటు సెక్షన్ 30 అమలు చేసిన విషయం గుర్తు లేదా? రంగా హత్య కుట్రను వక్రీకరించి కాపుల్లో ఉద్వేగాన్ని రేపాలని కుట్రలు పన్నుతున్నారు. కాపులకు చంద్రబాబు కంటే సీఎం జగన్ లక్ష రెట్లు మేలు చేస్తున్నారన్నారు. సీఎం దృష్టికి తెస్తాం: మంత్రి బొత్స వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే టికెట్ల నుంచి మంత్రులు, నామినేటెడ్ పదవుల వరకు ముఖ్యమంత్రి జగన్ కాపులకు పెద్దపీట వేశారు. కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలతోపాటు కాపులకు సమాన ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. భేటీలో చర్చించిన అంశాలను క్రోడీకరించి కార్యాచరణతో సీఎం దృష్టికి తెస్తాం. ఇటీవల ఓ సెలబ్రిటీ పార్టీ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతోంది. కాపు రిజర్వేషన్లపై ఆది నుంచి ప్రభుత్వం ఒకే విధానంతో ఉంది. వాస్తవాలను వక్రీకరించి అపోహలు కల్పించడం లేదు. రాజ్యాంగపరంగా ఎంతవరకు చేయగలమో అది చేస్తాం. కేంద్రం ఈడబ్లు్యఎస్కు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో రాష్ట్రానికి సౌలభ్యం కల్పిస్తే అత్యధికంగా 25 శాతానికి పైబడి ఉన్న కాపులకు మేలు చేయవచ్చు. గంటలోనే బాబును కలసిన పవన్: మంత్రి అంబటి రాంబాబు టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ. అధికారంలో ఉండగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని అణచివేసి ఆయన కుటుంబ సభ్యులను వేధించింది. కాపులను గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ. కాపు సామాజిక వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, మేయర్లు పార్టీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు సర్కారు బనాయించిన అక్రమ కేసులను సీఎం జగన్ ఎత్తివేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, కాపు ప్రజా ప్రతినిధులను దూషించిన విధానం గర్హనీయం. ఆయన రాజకీయాలకు అనర్హుడు. రంగా హత్య జరుగుతుందని తెలిసినప్పుడు ప్రతి గ్రామం నుంచి కాపులు వెళ్లి ఎందుకు కాపలా కాయలేదని ప్రశ్నించిన పవన్ అనంతరం గంటలోనే దీనికి కారకుడైన చంద్రబాబును కలవడం ఎంత వరకు సమంజసం? 3 తీర్మానాలకు ఆమోదం 1) జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అన్ని నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాపు నేతలను ఆహ్వానించి కాపు సంక్షేమ రోడ్ మ్యాప్ రూపొందించేలా భారీ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం. 2) కాపుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆమోదం. 3) సీనియర్ కాపు నేతలతో చర్చించి కాపుల సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం. -
వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం
-
డబ్బా పెరుగన్నం.. డబ్బుల సంచీ!
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లి డబ్బా పెరుగన్నం తిని డబ్బుల సంచి సర్దుకుని వచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అమరావతి గురించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ప్రజలు ఎవరూ మరచిపోలేదన్నారు. ‘ఆయనకు నిలకడలేదు. పరిణతి లేకుండా మాట్లాడుతున్నారు. ట్విట్టర్లో ఒక మాట.. మైకు ముందు మరో మాట! ఇదీ పవన్ తీరు. కర్నూలుపై మనసులో మాట ఎటు పోయింది? ఆయన ఆలోచనలు పూర్తిగా దారి తప్పాయి’ అని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి ‘అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా 15న విశాఖలో విశాఖ గర్జన నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అమరావతిని రాజధానిగా కోరుకుంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. దమ్ముంటే అమరావతి కోసం కుప్పం ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. అప్పుడు వారికే తెలిసొస్తుంది. మూడు రాజధానులే అజెండాగా ఎన్నికలకు వెళతాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం. పాదయాత్రను ఇప్పటికైనా వారు విరమించాలి. విశాఖ ప్రజలు అచ్చెన్నాయుడిని చూసి భయపడుతున్నారు. విశాఖలో టీడీపీ నేతల చేతుల్లో ఉన్న 450 ఎకరాల భూమిని కాపాడాం. అమరావతి విషయంలో టీడీపీ, జనసేన ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు. -
‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుంది. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. టీడీపీ అధినేత డైరెక్షన్లోనే పాదయాత్ర నడుస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు భయపడి వారి గొంతు నొక్కేసుకుంటున్నారు’ అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు అంటూ కామెంట్స్ చేశారు. -
పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కోర్టు చెప్పలేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 9న పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణ అంశంపై సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. జేఏసీ ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు రైతుల పేరిట జరుగుతున్న యాత్రపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రజల ఆకాంక్షకు భిన్నంగా అమరావతి యాత్ర జరుగుతోందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రజలు వికేందీకరణకు వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రే ఈ యాత్ర అని దుయ్యబట్టారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కోర్టు చెప్పలేదని స్పష్టం చేశారు. యాత్రలో చెప్పులు చూపించడం, తొడలు కొట్టడం లాంటి పనులు చేయమని చెప్పలేదని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడాలని ఉన్నా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 29 గ్రామాల కోసం అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 29 గ్రామాల కోసం 26 గ్రామాల కోసం 26 జిల్లాలు విడిచిపెట్టాలని కోరడం అన్యాయమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాదయాత్ర విరమించాలని మరోసారి కోరుతున్నట్లు పేర్కొన్నారు. -
భారీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడిదారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణపై సోమవారం సచివాలయంలో సీఐఐ ప్రతినిధులు, ముఖ్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్ర పరిశ్రమ, సముద్రయానం తదితర రంగాలతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న అన్ని రంగాల శాఖల అధికారులు సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ అవసరంలేదని, అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలన్నారు. వారి అభిప్రాయాలతో ఆడియో, వీడియోలు రూపొందించి వాటితో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ద్వారా లోగో, థీమ్ రూపొందించాలని ఆదేశించారు. ఈ రంగాలే కీలకం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఇప్పటికే గుర్తించిన 32 వేల మెగావాట్ల సామర్థ్యంలో 20 వేల మెగావాట్లకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంవోయూలు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 12 వేల మెగావాట్లకు ఈ సదస్సులో పెట్టుబడులు తేవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు సూచించారు. ఫార్మా పరిశ్రమలకు నక్కపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు 6 వేల ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబుకు సూచించారు. ఉన్నత విద్య అభివృద్ధికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలను ఆహ్వానించాలని ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమచంద్రా రెడ్డిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు, సముద్ర రవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తొలుత సీఐఐ ప్రతినిధి నీరజ్ జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సదస్సు ప్రయోజనాలు, లక్ష్యాలు, ఫలితాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, విస్తృత ప్రచారం తదితర అంశాలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, సంచాలకులు జి.సృజన, ఐటీ కార్యదర్శి సౌరబ్ గౌర్, రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత పాల్గొన్నారు. -
యువతకు లక్షల ఉద్యోగాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శల్లో వాస్తవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో ఉద్యోగాలిచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజా రంజకంగా పరిపాలిస్తున్న సీఎంపై కేంద్ర మంత్రి విమర్శలు హాస్యాస్పదమన్నారు. జగన్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్న విషయాన్ని కేంద్ర మంత్రి తెలుసుకోకుండా సుజనాచౌదరి టీడీపీ కార్యాలయం నుంచి తెచ్చిన స్క్రిప్ట్ను చదవడం బాధాకరమన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను విక్రయించేందుకు కేంద్రం సిద్ధపడుతోందని, అందులో మీ కమీషన్ ఎంతో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలవరానికి రూ.2,900 కోట్లను ఇప్పటికీ చెల్లించలేదన్నారు. పవన్కల్యాణ్ పార్టీ కమ్మ జనసేన కాదని ఎలా అనగలమని ప్రశ్నించారు. సీఎం జగన్ దంపతులు ఎంతో గౌరవంగా చిరంజీవిని సాగనంపారన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వచ్చి లోకేశ్ రాజకీయాలు చేయడం అవసరమా? అంటూ మంత్రి అమరనాథ్ ధ్వజమెత్తారు. -
టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడు?
అనకాపల్లి టౌన్: టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ సూటిగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. రాజకీయ పార్టీని స్థాపించి.. ఆ తర్వాత ఇతర పార్టీలకు కొమ్ముకాస్తున్న పవన్కు జగన్ పాలనపై మాట్లాడే అర్హత లేదన్నారు. టీడీపీకి ఉపయోగపడాలన్నదే పవన్ కల్యాణ్ పాలసీ అని, ఆ పార్టీ మేలు కోసమే జనసేన పార్టీ పెట్టారని నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని.. మరి టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం వచ్చిందో, లేదో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ రాజకీయాలకు అలవాటు పడ్డ పవన్ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వాతంత్య్రం వచ్చిందా, లేదా అని ప్రశ్నించారు. ముందు టీడీపీ నుంచి స్వాతంత్య్రం తెచ్చుకుని తమ గురించి మాట్లాడాలన్నారు. పవన్కు టీడీపీ నుంచి స్వాతంత్య్రం రానప్పుడు తమ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బాబుకు మేలు చేద్దామనే తాపత్రయం ఎందుకు? కులం, ప్రాంతాన్ని చూసి పార్టీ పెట్టలేదంటూ పవన్ ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు మేలు చేద్దామనే తాపత్రయం పవన్కు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పవన్ వల్ల చంద్రబాబుకు మేలు తప్ప రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి మేలు చేకూరదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బాబుతో లాలూచీ ఉంటే వాటిని అంతర్గతంగా చూసుకోవాలని.. వాటిని వదిలేసి ఎవరికో మేలు చేయడం కోసం తమపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,300 కోట్లతో చేపట్టిన ఏటీసీ టైర్ల కంపెనీని ప్రారంభించి.. 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని తెలిపారు. పవన్కు సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు కళ్లకు కనిపించడం లేదా? అని నిలదీశారు. పథకాలెందుకని ప్రశ్నించడం ఏమిటి? గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని రాష్ట్రంలోకి తెచ్చిన మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా సమస్యలను స్థానికంగానే పరిష్కరిస్తున్నారని కొనియాడారు. అవినీతి లేకుండా సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పథకాలెందుకని పవన్ ప్రశ్నించడం ఏమిటన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. గ్రామాల్లోకి వెళ్లి పేదలను అడిగితే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి గురించి చెబుతారని చెప్పారు. రాష్ట్రంలో పేదోడి ఆనందాన్ని చూడలేక నోటికొచ్చిన విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. -
గిరిజన అభివృద్ధిలో కొత్త శకం
సాక్షి, పాడేరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో గిరిజనాభివృద్ధిలో నవ శకం మొదలైందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనుల పక్షపాతిగా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పాడేరులోని తలారిసింగి ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్ గిరిజన సంప్రదాయ తుడుమును మోగించి, విల్లంబులు ఎక్కుపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించక ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ రాలేకపోయారని, కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తారన్నారు. రాష్ట్రంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్రంలో రూ.14 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.5 లక్షల కుటుంబాలకు 2 లక్షల 50 వేల ఎకరాల అటవీ భూములను పంపిణీ చేసి, సీఎం జగన్ సర్వ హక్కులు కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత వరకు రూ.8 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం గిరిజనులకు అందించిందన్నారు. బాక్సైట్ జీవోలన్నింటిని రద్దు చేయడం చరిత్రాత్మకమన్నారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో ఉత్సవాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన సీతంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్, సీతంపేట ఐటీడీఏ పీవో నవ్య, ఆర్డీవో హేమలత తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ఐటీడీఏ పీవో ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. సంక్షేమాభివృద్ధి సీఎం జగన్ సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న గిరి పుత్రులకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన ట్వీట్ చేశారు. -
ఎంఎస్ఎంఈ లపై ప్రత్యేక దృష్టి సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ఇకపై నెలకు 20 రోజులు ప్రజల్లోనే
సాక్షి, అమరావతి: ఈసారి కుప్పంతో సహా 175 శాసనసభా స్థానాల్లోనూ గెలుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం వర్క్షాప్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై నెలకు 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ మార్గ నిర్దేశం చేశారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ తీరు సరికాదు కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై ఆయా బోర్డులు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కృష్ణా బోర్డు సమావేశాలకు రెండుసార్లు గైర్హాజరై ఎక్కువ నీటి కేటాయింపులు కావాలని తెలంగాణ అడగడం సమంజసం కాదన్నారు. పోలవరం ఒక్కో స్టేజీలో ఒక్కో విధంగా నీటి నిల్వలు ఉంటాయన్నారు. ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందన్నారు. పోలవరంలో తొలుత 41.71 టీఎంసీల వరకు నీటిని నింపి కాలువల ద్వారా పంపుతారని చెప్పారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై కచ్చితమైన సమయం చెప్పలేమన్నారు. రాజకీయ ప్రత్యర్థుల ఇంటికీ వెళ్లమన్నారు: పేర్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇతర పార్టీల్లో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లకు సైతం వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయాలని సూచించారన్నారు. వర్క్షాపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ విమర్శలు చేసినా నవ్వుతూ ముందుకు సాగాలని సీఎం సూచించారన్నారు. అర్హులందరికీ పథకాలు అందించాలని, ఏవైనా సాంకేతిక లోపాలుంటే సరిదిద్దాలని నిర్దేశించారన్నారు. టీడీపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తానే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని నూతన వస్త్రాలు కుట్టించుకున్న చంద్రబాబు ప్రజాభీష్టాన్ని గుర్తించక ఓటమి చవి చూశారన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?: మంత్రి రోజా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా అవగాహన లేకుండా మాట్లాడారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. మూడేళ్లలోనే 95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీ తరహాలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడుందని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. వేగంగా వినతుల పరిష్కారం: ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రతి ఇంటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించాలని సీఎం జగన్ ఆదేశించారని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు. ప్రజల నుంచి అందే వినతులను నమోదు చేసి వేగంగా పరిష్కరించాలని సీఎం నిర్దేశించారన్నారు. ఇకపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారన్నారు. అన్ని స్థానాల్లో విజయదుందుభి: జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ గెలవాలని సీఎం జగన్ నిర్దేశించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కరించాలని సూచించారన్నారు. గడప గడపకు కార్యక్రమంలో నేతలు ఎలా పాల్గొంటున్నారనే అంశంపై నియోజకవర్గాల వారీగా నివేదికలు సిద్ధం కానున్నాయన్నారు. విజ్ఞప్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే సుధ గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల నుంచి అందే వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధ తెలిపారు. నెలకు 20 రోజుల చొప్పున పది సచివాలయాల్లో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మరింత సమర్థంగా నిర్వహించడంపై నిరంతరం చర్చించాలని సీఎం సూచించారన్నారు. నో వన్ లెఫ్ట్ బిహైండ్ నినాదంతో: గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి ప్రజా స్పందనను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మరింత మెరుగ్గా నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. ‘నో వన్ లెఫ్ట్ బిహైండ్’ అనే నినాదంతో 175 స్థానాలను సాధించాలని సీఎం నిర్దేశించారన్నారు. -
గ్యాస్ లీకేజీ: ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఎలా అయింది అన్న విషయంపై ఆరా తీశారు. అయితే, దీనిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించాము. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు. ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఈజెడ్లో ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తాము. ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశ్యం’’ అని అన్నారు కోలుకుంటున్న బాధితులు ఇదిలా ఉండగా.. గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జి అవుతున్నారు. శనివారం ఉదయం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక, మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. ఇది కూడా చదవండి: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు' -
సీఎం జగన్కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే బాబు తట్టుకోలేకపోతున్నారు
-
జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందన్నారు. 18 లక్షలు మంది ప్రయాణికులు పోకలు సాగిస్తున్నారన్నారు. మలేసియా, బ్యాంకాక్, సింగపూర్లకు విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందన్నారు. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? దావోస్లో 18 అంశాలపై సదస్సు జరుగుతుందని, వీటిలో 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు. వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్య, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బీచ్ ఐటీ అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని.. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటికి బీజం పడిందని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మరింత ప్రగతి సాధిస్తోందని, బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందని పేర్కొన్నారు. -
దావోస్లో బ్రాండ్ ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా చాటిచెప్పేలా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు లాంటి నవరత్న పథకాలతో గడప వద్దకే పరిపాలన చేరువ చేయటాన్ని దావోస్ సదస్సు వేదికగా తెలియచేసేలా ఏపీ పెవిలియన్ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు దావోస్లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దావోస్లో జరిగే పర్యటన వివరాలను గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు తెలియచేశారు. జనవరిలో జరగాల్సినా.. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈఎఫ్లో మెంబర్ అసోసియేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ప్రతిష్టాత్మక ఫోరం ప్లాట్ఫాం పార్టనర్గా చేరనుందని, దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా డబ్ల్యూఈఎఫ్కు చెందిన సీఈవో స్థాయి చర్చలు, ప్రాజెక్టులు, వర్క్షాప్స్లో నేరుగా పాల్గొనే అవకాశం లభించనుంది. సాంకేతిక ఆవిష్కరణల పునాదులపై పారదర్శకత, అధికార వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు సీఎం జగన్ నిబద్ధతతో కృషిచేస్తున్నారని సమావేశాలకు ఆహ్వానించేందుకు వచ్చిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బెండే ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ సమావేశాలు జనవరిలోనే జరగాల్సినా కోవిడ్ థర్డ్వేవ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడినట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలతో సారూప్యం కోవిడ్తో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ‘కలసి పని చేయడం – నమ్మకాన్ని పునరుద్ధరించడం’ అనే లక్ష్యంతో దావోస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఇవి దగ్గరగా ఉన్నట్లు మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను ప్రచారం చేసేలా సమావేశాల కోసం రూపొందించిన లోగోను మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఆవిష్కరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చాటే విధంగా రూపొందించిన బుక్లెట్ను మంత్రి ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన లాంటి 9 అంశాలకు బుక్లెట్లో ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. 10 రంగాలపై ఫోకస్ దావోస్ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 2,200 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా 18 రంగాలపై చర్చలు జరగనుండగా విద్య, వైద్యం, నైపుణ్యం, తయారీ రంగం, లాజిస్టిక్స్, ఆర్థికసేవలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, వినియోగదారుల వస్తువులు, ఎఫ్ఎంసీసీ లాంటి పదిరంగాల్లో అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు. సీఐఐ నేతృత్వంలో 23న వైద్యరంగం, 24న విద్య, నైపుణ్యరంగం, డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా అడుగులులాంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది పెట్టుబడుల సమావేశం కాదని, కోవిడ్తో మారిన వాణిజ్య పరిణామాలపై చర్చించి వ్యాపార అవకాశాలు, సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు డబ్ల్యూఈఎఫ్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు. -
ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు
విజయనగరం అర్బన్/సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నానికి పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న చంద్రబాబు.. చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి కపట ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకమూ పేదలకు అందలేదన్నారు. ‘తెలుగుదేశం పార్టీకి బాధలే బాధలు’ అని చంద్రబాబు చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు డాక్టర్ సురేష్బాబు, రఘురాజు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. విశాఖ రాజధాని కావడం తథ్యం 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు విశాఖ నగరాన్ని ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నా«థ్ నిలదీశారు. ఆయన విశాఖ లో మాట్లాడుతూ.. అబద్ధాల బాబు ఇప్పుడు విశాఖకు వచ్చి విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా? అని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలా? రాజధాని కావాలా? అని చంద్రబాబుని ఉత్తరాంధ్ర వాసులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దీనికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ రాజధాని కావడం తథ్యమని చెప్పారు. చంద్రబాబుకు సీఎం పీఠం ఎలా వచ్చిందో, ఎవరిని వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నాడో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా డీబీటీ ద్వారా దాదాపు రూ.1.39 లక్షల కోట్లు పేదల చేతిలో పెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ధరలను కూడా రాష్ట్రంపై నెడుతున్నాడని విమర్శించారు. కేంద్రమన్నా, నరేంద్రమోదీ అన్నా చంద్రబాబుకి భయమని మంత్రి వివరించారు. -
ఏడ్చే వారు రాజకీయాలకు పనికిరారు
అవనిగడ్డ: చంద్రబాబు ఏడ్చినప్పుడే టీడీపీ పని అయిపోయిందని, ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డలో నలుగురు నూతన మంత్రులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మేరుగ నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తానేమీ అనకపోయినా ఏదో అన్నట్టు చంద్రబాబు ఏడ్చారని అన్నారు. గెలుపు ఓటములు, ఒడుదొడుకులు వచ్చినా హీరోలా ఉండేవారే రాజకీయాల్లో ఉంటారని చెప్పారు. జగన్ వ్యతిరేక శక్తులందరినీ విడిపోనివ్వనని పవన్ కల్యాణ్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన సీఎం అవడానికి పార్టీ పెట్టారో, చంద్రబాబుని సీఎం చెయ్యడానికి పార్టీ పెట్టారో ముందు తేల్చుకోవాలని అన్నారు. అమర్నాథ్ మాట్లాడుతూ 2024లో మళ్ళీ జగన్ని సీఎంని చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. మేరుగ మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.1.32 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు సీఎం ఖర్చుపెట్టారని చెప్పారు. జోగి రమేష్ మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం మిగతా రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుబాబు, ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్, అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతిని«ధి పి.రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే ఊరుకోం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు, ఈనాడుకు, ఎల్లో మీడియాకు ఎప్పుడూ కడుపుమంటగానే ఉంటుందని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా విషపురాతలు రాస్తే ఈ ప్రాంతవాసిగా సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ‘రుషికొండ సాగరతీరంలో పరిమితులకు మించి ప్రభుత్వం తవ్వకాలు జరుపుతోందని ఒక దుర్మార్గమైన వార్తాకథనాన్ని ఈనాడు ప్రచురించింది. కేంద్రం నుంచి సీఆర్జెడ్ అనుమతులున్నా.. లేవంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. పూర్వం ఇక్కడ బిల్డింగులుండేవి.. ఇక్కడ పాతవయ్యాయని కొత్తగా తమ ప్రభుత్వం నిర్మిస్తే ‘రుషికొండ పిండి’ పేరుతో అవాస్తవాలను చంద్రబాబు రాయిస్తున్నారు. అడుగడుగునా విశాఖ అభివృద్ధిని చంద్రబాబు, టీడీపీ పాంప్లెట్ అయిన పనికిమాలిన పేపర్ ఈనాడు రామోజీరావు అడ్డుకుంటూనే ఉన్నారు..’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలోగల వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ మతాలకు, కులాలకు అతీతంగా అందరినీ ఆదరించిందని చెప్పారు. ఈనాడు పత్రికకు పునాదులు పడింది కూడా విశాఖలోనే అన్న విషయం మరిచిపోయి విషపు రాతలు రాస్తున్నారన్నారు. ‘తిండిపెట్టిన విశాఖ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటావా..? చంద్రబాబు చెప్పినట్లు విశాఖపై విషపు రాతలు రాస్తావా? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా రామోజీరావు తీరు ఉంది..’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసం రామోజీరావు ఈనాడుని టీడీపీ పాంప్లెట్గా తయారుచేసి విషపు రాతలు రాస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకి, ఈనాడు రామోజీరావుకి ఉత్తరాంధ్ర అంటే ఎందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. ‘అప్పుడు విశాఖ రైల్వేజోన్ చేయాలని మా పార్టీ ఉద్యమంచేస్తే మీ పార్టీ నేతలతో అడ్డుకున్నావు. పేదలకు ఇళ్ల పట్లాలిస్తే కోర్టులో కేసువేసి అడ్డుకున్నావు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే కోర్టుల్లో అడ్డుకున్నావు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా, విశాఖ అన్నా అంత కోపం ఎందుకో చెప్పాలి. అమరావతిలో కొన్న భూములకు రేట్లు తగ్గుతాయనే బాధ చంద్రబాబులో సుస్పష్టంగా కనబడుతోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం తథ్యం’ అని చెప్పారు. దేశంలోనే అద్భుత నగరంగా విశాఖను తమ నాయకుడు తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. కౌలు రైతులకు అండగా సీఎం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. తమ నాయకుడు రైతులకు అన్నివిధాల అండగా నిలుస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం పవన్కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. 1.23 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలిస్తున్నాం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారని చెప్పారు. ఇది దేశచరిత్రలోనే ఓ రికార్డని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చివారిలో లక్షమందికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలతో ఇల్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. -
‘దత్తపుత్రుడు’ అట్టర్ ఫ్లాప్ ఖాయం
దొండపర్తి (విశాఖ దక్షిణ)/ సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో చంద్రబాబు బ్యానర్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘దత్తపుత్రుడు’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయం. ఒకరు లోకల్ (విశాఖ), మరొకరు నేషనల్ (పూణె), ఇంకొకరు ఇంటర్నేషనల్ (రష్యా).. ఇలా బహు భార్యత్వంతో విలువలు లేని వ్యక్తి దత్తపుత్రుడు పవన్. ఇప్పుడు మూడో భార్యతో కూడా ఉన్నారో లేదో తెలీదు. చంద్రబాబు ఎన్ని తప్పుడు పనులు చేసినా ప్రశ్నించని పవన్ను దత్తపుత్రుడు అనక ఇంకేమనాలి?’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబులు ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని మద్దిలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అప్పుడు ఎందుకు స్పందించ లేదు? ► జనసేన పార్టీకి ప్రత్యేకంగా ఆశయాలు, సిద్ధాంతాలు లేవు. ఈ పార్టీ చంద్రబాబు ఆశయాల కోసమే పని చేస్తోంది. కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు రూ.87 వేల కోట్లు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి, మోసం చేసిన చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? ► రైతుల ఆత్మహత్యలపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకోవద్దని చంద్రబాబు ఆదేశించడంతో పాటు అసెంబ్లీ సాక్షిగా రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన విషయం గుర్తు లేదా? మద్యం తాగడం, ఇతరత్రా సమస్యల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు చెప్పినపుడు పవన్కల్యాన్ ఎందుకు స్పందించలేదు? ► ముగ్గురు భార్యలను మార్చినట్లు.. రాజకీయ పార్టీ పెట్టిన అయిదేళ్లలో అత్యధిక పార్టీలతో పొత్తులు పెట్టుకున్న రికార్డు పవన్ పార్టీకే ఉంది. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉంటుందా? కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కక్ష పూరితంగా జగన్పై కేసులు వేశాయి. ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయారు. జైలు జీవితాన్ని అనుభవించినంత మాత్రన జగన్ ముద్దాయి కారని గ్రహించే ప్రజలు పట్టం కట్టారు. సొంతపుత్రుడిని వదిలేసి.. ► చంద్రబాబు సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడి కోసం పరితపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ అప్పుడే పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. వ్యతిరేక ఓట్లు చీల్చడానికి నాడు పాట్లు పడిన పవన్.. నేడు అవి చీలకూడదని బహిరంగంగా చెబుతుండటం చంద్రబాబును సీఎం చేయాలనే కదా! ► వీరు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్కే ప్రజలు పట్టం కడతారు. ఈ విషయాన్ని ‘సమావేశాల్లో జై పవన్ అని అరుస్తారని, ఓట్లు మాత్రం జగన్కే వేస్తారని’ పవనే స్వయంగా తన సభలో అంగీకరించారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ ► 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం వైఎస్ జగన్ రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున 52 లక్షల మంది రైతు కుటుంబాలకు సుమారు రూ.19 వేల కోట్లు అందించారు. ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్, కౌలు రైతులకు నష్ట పరిహారం, మరణించిన కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు. ► టీడీపీ సర్కార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 469 మంది రైతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ పరిహారం ఇవ్వడం పవన్కు కన్పించడం లేదా? ఇలాంటప్పుడు ఆయన్ను దత్తపుత్రుడు అని, చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్ అని ఎందుకు అనకూడదు? ప్రజా సంక్షేమం కోసం జనసేన ఉద్భవించి ఉంటే.. ఒంటరిగా పోటీచేసే దమ్ము పవన్ కళ్యాణ్కు ఉందా? నిర్మాత దొరికితే సినిమా తీస్తాం ► వైఎస్సార్సీపీ నేతలపై వ్యంగ్యోక్తులు విసిరే పవన్ కళ్యాణ్.. ఆయనపై మాత్రం సెటైర్లు వేయవద్దని కోరడం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్కు స్క్రీన్ప్లే రాయడం తెలిస్తే.. మాకు సినిమా తీయడమూ తెలుసు. నారా వారి దత్తపుత్రుడు.. బాబు దత్తపుత్రుడు పేర్లతో సినిమా తీయడానికి కథ సిద్ధంగా ఉంది. దర్శకుడూ దొరుకుతారు. ఐదారుగురు హీరోయిన్లు అవసరం కాబట్టి బడ్జెట్ ఎక్కువవుతుంది. నిర్మాత దొరకగానే సినిమా తీస్తాం. ► కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఆది నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. వంగవీటి మోహన రంగా హత్య.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు తీవ్రంగా వేధించిన తర్వాత ఆ సామాజిక వర్గాలు టీడీపీకి మరింత దూరం జరిగాయి. ► ఆ సామాజిక వర్గాల ఓట్ల కోసం చంద్రబాబు విసిరిన గేలానికి ఎరే పవన్ కళ్యాణ్. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు కాళ్లదగ్గర పడేయడమే పవన్ కల్యాణ్ ఉద్దేశం. చంద్రబాబు ప్యాకేజీలకు ఆశపడి పవన్ ఆయనకు చాకిరి చేస్తున్నారు. -
పథకాల రద్దుకు ‘పచ్చ’ కుట్ర.. విషం కక్కుతున్న ఎల్లో బ్యాచ్
సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై పక్కా ప్రణాళికతో కులనాగులు విషం కక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలచుకుందో ‘ఈనాడు’తో చెప్పిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ రద్దుచేయాలనే కుట్రకు చంద్రబాబు అండ్ కో బరితెగించారు. తమకు పొరపాటున ఎవరైనా ఓటువేస్తే రాష్ట్రంలో పేదలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సర్వ మంగళం పాడాలన్న చంద్రబాబు కర్కశ మనస్తత్వాని ఈనాడు పత్రిక అద్దంపట్టింది. పేదలంటే వీరికి ఎంత కడుపుమంటో అర్థంమవుతోంది’.. అని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఆపాలి’.. అంటూ ఈనాడులో వచ్చిన కథనంపై వీరు ముగ్గురూ మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో స్పందించారు. ‘ప్రభుత్వం ఏవో రెండు మూడు కార్యక్రమాలు అమలుచేస్తూ మిగిలిన వాటిని నిలిపివేస్తేనే మనకు మనుగడ ఉంటుంది’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చెప్పించి ఈనాడులో ప్రచురించడం దుర్మార్గమన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఆ ఐఏఎస్లు అప్పుడేం చేశారు? పేదలకు ఆగర్భ శత్రువుల్లా మాట్లాడటం దారుణం. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలను రద్దుచేస్తాననే సంకేతాన్ని ‘ఈనాడు’ ద్వారా చంద్రబాబు ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదంటూ మాజీ ఐఏఎస్లు మాట్లాడం దారుణం. ఈనాడులో రాసిన వార్తకు వంతపాడిన ఐఏఎస్ అధికారులిద్దరూ గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పనిచేశారు. అప్పుడు చంద్రబాబు పెద్దఎత్తున అప్పులు తెచ్చిన సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే.. అలాగే, పోలవరం చూడటానికి, సింగపూర్ ఏజెన్సీకి, అమరావతి డిజైన్లకు చంద్రబాబు వందలాది కోట్లు దుబారా చేస్తుంటే వీరిరువురూ ఏంచేశారు? రాష్ట్రంలో పేదలందరూ బాగుండాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆలోచనైతే.. టీడీపీ నేతలు మాత్రమే బాగుండాలన్నది చంద్రబాబు నైజం. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. సంక్షేమ పథకాలకు ఖర్చుచేసే సొమ్ములో సగం టీడీపీ నేతలకు, జన్మభూమి కమిటీల్లోని ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన జేబుల్లోకి చేరేవి. మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అవకాశమిస్తే దానిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు తపనపడుతున్నారు. కానీ.. అది జరగని పని. మీ కుట్రలను ప్రజలు డేగకళ్లతో గమనిస్తున్నారు. వారు మళ్లీ కొట్టే దెబ్బకు చంద్రబాబు అండ్ కోకు కూసాలు కదలడం ఖాయం. పథకాలపై ఎల్లో బ్యాచ్ ఉద్దేశం ఇదా? ► అమ్మఒడి, చేయూత, వైఎస్సార్ ఆసరాను ఆపేయాలా? ► 52.4 లక్షల రైతు కుటుంబాలకు అందించిన వైఎస్సార్ ‘రైతుభరోసా’ను నిలిపేయాలా? ► 31 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చెయ్యొద్దా? ► విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా కానుకను అడ్డుకోవాలనేది వారి ఉద్దేశమా? ► జగనన్న గోరుముద్ద పథకానికి మంగళం పాడాలా? ► ఆసుపత్రులను చక్కగా తీర్చిదిద్దుతున్న నాడు–నేడు పథకాన్ని అటకెక్కించాలా? ► చంద్రబాబు మాదిరిగా రైతులకు సున్నావడ్డీ, పంటల బీమాను ఆపేయాలా? ► అలాగే, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఆపేయాలన్నది రామోజీరావు, చంద్రబాబు ఉద్దేశమా? ► వైఎస్సార్ పెన్షన్ కానుక కూడా ఇవ్వొద్దా? ► వైఎస్సార్ నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలను నిలిపివేయాలా? ► జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి పథకాలను ఏం చేయాలన్నది మీ ఉద్దేశ్యం? ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆసరా వంటి గొప్ప పథకాలను అటకెక్కించాలా? ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆపేయాలా? -
ఆయన పొలిటికల్ టూరిస్టు
సాక్షి, అమరావతి/గన్నవరం: పవన్కల్యాణ్ రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టు అని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు పవన్కల్యాణ్ అనే వ్యక్తి ఉన్నట్టు సరిగా గుర్తుండదన్నారు. ‘పవన్ కల్యాణ్ రోజుకో డైలాగ్ చెబుతారు. ఈ రోజు చెప్పింది రేపు, రేపు చెప్పింది ఎల్లుండి మర్చిపోతారు. నిన్న అనంతపురంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు..’ అని పేర్కొన్నారు. ఎవరికోసమో దత్తపుత్రుడిగా పనిచేస్తున్న వ్యక్తికి తమ నాయకుడిపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. ఎటువంటి సిద్ధాంతాలు, ఆలోచనలు లేని ఓ రాజకీయ పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం సమయం వృథా చేసుకోవడమేనని చెప్పారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల ప్రత్యేకతల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచస్థాయి ఐటీ హబ్గా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. చేనేత సంఘాలు, కార్మికులకు బకాయిల విడుదల చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమల, చేనేత, జౌళిశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్లో ఏర్పాటు చేసిన ఆప్కో షోరూమ్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత సంఘాలకు, కార్మికులకు ఉన్న అన్నిరకాల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. వారి అవసరాల కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చేందుకు కూడా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చారని తెలిపారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్రావు మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు షోరూమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో మెగా షోరూమ్ను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆప్కో ఎండీ చదలవాడ నాగమణి, చేనేత, జౌళిశాఖ సంయుక్త సంచాలకుడు కన్నబాబు, ఆప్కో మార్కెటింగ్ మేనేజర్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సభా సంప్రదాయాలకు టీడీపీ పాతర
సాక్షి, అమరావతి: ‘కోడిపందాల వద్ద, సినిమా హాళ్లలో విజిల్స్ వేసినట్టుగా శాసనసభలో విజిల్స్ వేస్తూ.. గేలి చేస్తూ టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇంత బరి తెగింపు ముందెన్నడూ చూడ లేదు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ సభ్యులు హేయమైన రీతిలో గాలితనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు శాసనసభ సభ్యులో.. ఆకతాయిలో అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ఈ రోజు ఇంకా దిగజారి విజిల్స్ కూడా వేస్తూ దారుణంగా ప్రవర్తించారు. ప్రజలు అవకాశం ఇచ్చి ఇక్కడికి పంపినప్పుడు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి సభలో హుందాగా వ్యవహరించాలే తప్ప మరీ ఇంతగా బరి తెగించకూడదు. గత్యంతరం లేక టీడీపీ సభ్యులను సభ నుంచి పంపుతున్నాం. టీవీలో చూస్తోన్న చంద్రబాబును సంతృప్తి పర్చడమే ధ్యేయంగా సభలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ అంటే కోడి పందేల దిబ్బగా దిగజార్చుతున్నామనే స్పృహ కూడా లేదు. ఇలాంటి వాళ్లకు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని ధ్వజమెత్తారు. కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశామని మాట్లాడటం, చెప్పుతో కొట్టుకోవడం వంటి చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాని పేర్కొన్నారు. ఏబీవీ.. పోలీస్ అధికారిగా వ్యవహరించండి ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిగా కాదు.. కనీసం హోంగార్డుగా కూడా పనికిరాని వ్యక్తి అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతగా కాకుండా ఓ పోలీసు ఆఫీసర్గా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు మా మీద పరువు నష్టం కేసు వేస్తామంటున్నారు. మీతో పాటు టీడీపీ మీద ఐదు కోట్ల ఆంధ్రులు పరువునష్టం దావా వేస్తారు. సీఎంవో ఉద్యోగి శ్రీహరి తన జీవితంతో ఆడుకున్నాడని ఏబీవీ అంటున్నారు. ఐపీఎస్గా 30 ఏళ్ల సర్వీసులో ఉండి మిమ్మల్ని మీరే కాపాడుకోకపోతే పోలీస్ అధికారిగా మీరు అన్ఫిట్ కదా! పెగసస్ స్పై వేర్ను చంద్రబాబు కొనుగోలు చేసినట్టుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఎక్కడా మాట్లాడ లేదని లోకేష్ చెబుతున్నారు. ఆమె ఆ విషయం చెప్పకపోతే నువ్వెందుకు ట్వీట్ చేశావ్ లోకేష్? మీ గెజిట్ ఈనాడులో కూడా వార్తలు వచ్చాయిగా.. కన్పించ లేదా? ఓ సీఎం చెప్పిన విషయంపై చర్చించకుండా ఎలా ఉండగలం? సభలో ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకో పారిపోయారు. వాళ్లే కొనుగోలు చేస్తారు. మళ్లీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే ఒకరికొకరు వత్తాసు పలుకుతుంటారు’ అని అన్నారు. -
చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: పెగాసస్ను చంద్రబాబు ఎవరి కోసం కొన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియతో మాట్లాడుతూ.. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. పెగాసస్ వెనుక ఎవరెవరు ఉన్నారో వెలికితీయాలని అన్నారు. ఈ సాఫ్ట్వేర్తో చంద్రబాబు ఏం చేశారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎవరి సంభాషణలు వినడానికి పెగాసస్ కొన్నారో తెలియాలని మండిపడ్డారు. ఇతరుల ఫోన్ సంభాషణలు దొంగతనంగా వినడం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు. చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు అని ఎద్దేవా చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాన్ని బయట పెట్టిందని గుర్తుచేశారు. పెగాసస్ స్పైవైర్ కొనుగోళ్లు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఎవరి రహస్యాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ వ్యవహారం చేశారో బయటకు రావాలన్నారు. ఇది కేవలం ఏపీ వ్యవహారం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా కేంద్రం భావించాలని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఫోన్ సమాచారం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని మండిపడ్డారు. ఇంత పెద్ద నేరానికి పాల్పడిన చంద్రబాబుపై చర్యలు అవసరమని అన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో సెక్షన్ 8 గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ఓ సీనియర్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చెప్పిన దశలో చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. -
లోకేష్.. ఎన్టీఆర్ వారసుడివి కాదు
సాక్షి, విశాఖపట్నం: లోకేష్ ఎన్టీఆర్ వారసుడు కాదని.. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తికి వారసుడని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహానికి దండలు వేసినంత మాత్రాన ఆయన వారసులైపోరని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం తండ్రీ కొడుకులు భువనేశ్వరినే వాడుకున్నారంటే.. ఇంతకన్నా దిగజారుడు నాయకులుండరని అన్నారు. అమర్నాథ్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మీద అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు నోటీసు ఇవ్వడానికి వస్తే అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. అయ్యన్నని అరెస్ట్ చేస్తే టీడీపీ హయాంలో ఆయనతో పాటు బాబు చేసిన గంజాయి అక్రమ లావాదేవీలు బయటపడతాయన్న భయంతో లోకేష్ దాన్ని రాజకీయం చేయాలనే విశాఖకి వచ్చాడన్నారు. టీడీపీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయగలదా అని సవాల్ విసిరారు. బాలయోగి, మాధవరెడ్డి మరణంలో చంద్రబాబు పాత్ర ఉందేమోనన్న అనుమానం ప్రజలకు ఉందన్నారు. చచ్చిన పాములాంటి బండారు సత్యనారాయణమూర్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమరనాథ్ అన్నారు. -
చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూములను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భూకబ్జాదారుల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని గుర్తు చేశారు. విశాఖ నడిబొడ్డున సైతం భూములను ఆక్రమించారని మండిపడ్డారు. ఈ భూకబ్జాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ నేతల చేశారన్నారన్నారు. తప్పు చేసిన ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చదవండి: తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు: మంత్రి అవంతి -
Gudivada Amarnath: రాష్ట్రానికి రాబందులా చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ విపత్తు వేళ మెరుగైన సేవలందిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆపద్బాంధవుడిగా నిలుస్తుంటే... చంద్రబాబు రాబందులా తయారయ్యారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విపత్తులు ఎప్పుడొస్తే అప్పుడు చంద్రబాబు వికృతానందం పొందుతారని విమర్శించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో అద్దాల మేడలో కూర్చొని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్తో మరణించినవారికి కొవ్వొత్తులు వెలిగించి బాబు సంతాప కార్యక్రమం నిర్వహించారని.. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో ఆయన వల్ల మృతి చెందిన 29 మందికి ఒక్క కొవ్వొత్తి అయినా ఎందుకు వెలిగించలేదని నిలదీశారు. సరిహద్దుల్లో అంబులెన్స్లను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటే తెలంగాణలో ఉన్న చంద్రబాబు ఇదేమిటని కేసీఆర్ను ప్రశ్నించలేదన్నారు. కేసీఆర్ జైలులో వేస్తారన్న భయమే దీనికి కారణమని ఎద్దేవా చేశారు. రఘుపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదా? ప్రజలు కోవిడ్తో మరణిస్తుంటే స్పందించని చంద్రబాబు రఘురామకృష్ణరాజును ఎలా కాపాడాలి? ఏబీఎన్ రాధాకృష్ణని ఎలా కాపాడాలి? రామోజీరావుని ఎలా కాపాడాలి? అనే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్ ఫార్ములాను మిగతా కంపెనీలకు బదిలీ చేస్తే దేశంలో ఉన్న ప్రజలకు వ్యాక్సిన్ తొందరగా అందుతుందన్న సీఎం సూచనను కేంద్రం అమలు చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. జాతీయ మీడియా సైతం సీఎం సూచనలను అభినందించిందన్నారు. -
'చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు'
సాక్షి,విశాఖ: టీడీపీ నేతలకు విశాఖ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని, టీడీపీపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయిందన్నారు. ఏపీకి తండ్రీకుమారుల శని పట్టుకుందని, లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. 'కుప్పం నియోజకవర్గం ప్రజలే చంద్రబాబును నమ్మలేదు, చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి' అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, విశాఖ ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. విశాఖను చంద్రబాబు వాడుకున్నారు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు విశాఖ ఉపయోగపడింది తప్ప..విశాఖకు చంద్రబాబు ఎన్నడూ ఉపయోగపడలేదని ఆరోపించారు. చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదని, చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. విశాఖకు అండగా నిలబడేది సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేది సీఎం జగనేనని పేర్కొన్నారు. చదవండి : (మళ్లీ చెంప చెళ్లుమనిపించిన బాలయ్య) (చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన) -
నువ్వేంటి.. నీ స్థాయేంటి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం : వంగవీటి మోహనరంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ అక్రమాలేమిటో విశాఖ ప్రజలకు తెలుసని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ నువ్వేంటి.. నీ స్థాయేంటి?.. నీ స్థాయికి విజయసాయిరెడ్డి ప్రమాణానికి రావాలా?’ అంటూ మండిపడ్డారు. రేపు(ఆదివారం) ఉదయం 11 గంటలకు సాయిబాబా ఆలయానికి వస్తానని, వెలగపూడికి దమ్ముంటే సాయిబాబా ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. వెలగపూడి అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ విజయసాయిరెడ్డిపై మీరు అక్రమ కేసులు పెట్టారని ఏనాడో నిరూపితమైంది. వెలగపూడి అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. విశాఖ పారిపోయి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత?. నీ ఆస్తుల వివరాలు చెప్పగలవా?. హత్య కేసులో ఉన్న వ్యక్తులు విశాఖలో రాజకీయాలు చేస్తున్నారు. ( ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’ ) వాగు పోరంబోకు భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నించలేదా?. 225 గజాల వాగు పోరంబోకు భూమిని వెలగపూడి ఆక్రమించాడు. టీడీపీ నేతల చెరలో ఉన్న 171 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించగలిగాం. భూ కబ్జాదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు.. పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా సెంటు స్థలం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. విశాఖలో కూడా పేదలకు ఇళ్లు రాకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోంద’’ని అన్నారు. -
బాబు 420 అయితే.. వెలగపూడి 840..
సాక్షి, విశాఖ : అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే 17వేల కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అమర్నాథ్ శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చేతులెత్తి దండం పెడుతున్నా. సెంటు స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడుకు బుద్ధి రాలేదు. ప్రజల ఇళ్ల పట్టాలను అడ్డుకునే కుట్రలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అందరూ అవినీతికి పాల్పడినట్లు భావించి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు. బాబు తన పాలనలో ఒక మంచిపని చేయకపోగా ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటున్నారు. ఇళ్ల పట్టాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుంటే దాని జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. బాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీద వెలగపూడి రామకృష్ణ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. వెలగపూడి తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. ఆయన అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. ఆయనను బెజవాడలో బహిష్కరిస్తే వైజాగ్ వచ్చాడు. చంద్రబాబు 420 అయితే.. వెలగపూడి 840. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచాడు. విశాఖ ప్రజలు రాజకీయంగా ఆదరిస్తే విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరో వారం రోజుల్లో సిట్ నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తాం. సిట్ నివేదికలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. (పేదలకు పట్టాభిషేకం ) విశాఖ జిల్లాలో పట్టాల పండగ విశాఖ జిల్లాలో పేదల ఇళ్ల పంపిణీకి పెందుర్తి మండలం వాలిమెరక నుంచి శ్రీకారం జరగనుంది. విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ 73,660 మందికి ఇళ్ల పట్టాలు అందనున్నాయి. అలాగే 16,954 మందికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు. 25 వేల 743 మంది టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారు. వీటిలో విశాఖ సిటీ లో 23,576 టిడ్కో ఇల్లు పంపిణీ జరగనుంది. ఆ క్రమంలో ఈ పట్టాల పంపిణీ ద్వారా ద్వారా ఒక లక్ష 63 వేల 50 7 మందికి లబ్ధి పొందనున్నారు. -
‘చంద్రబాబుది బషీర్బాగ్ కాల్పుల చరిత్ర’
సాక్షి, విజయవాడ: రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన బాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటన్నారు. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, పార్టీ పేరులోనే రైతు ఉందని గుర్తుచేశారు. ‘నివర్’ తుపాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రతిపక్షనేతగా పరామర్శించని బాబు అసెంబ్లీలో రైతుల గురించి ఏం మాడ్లాడతారని సూటిగా ప్రశ్నించారు. రూ. 86 వేల కోట్లను మాఫీ చేస్తానని గత ఎన్నికలలో హామీ ఇచ్చి ఎంత మాఫీ చేశారో చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రంలో 50 లక్షలమంది రైతులకి రైతు భరోసా పధకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరినీ అసదుకుంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. రైతులకి వేలకోట్ల రూపాయిలని బకాయిలు పెట్టిన చంద్రబాబు రైతుల గురించి ఏముఖం పెట్టుకుని మాడ్లాడతారని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రైతు పేరు ఎత్తే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రైతు ద్రోహి, రైతులను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులను ఏనాడు చంద్రబాబు ఆదుకోలేదన్నారు. రైతు పక్షపాతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తుఫాన్ పరిహారం ప్రకటించిన తర్వాత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. మొదటి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. -
విశాఖ ఎమ్మెల్యేలతో విజయ సాయిరెడ్డి భేటీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా అభివృద్ధిపై రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నాడు నేడుతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ రకంగా సమాయత్తం కావాలి అనే అంశంపై ఆయన ఎమ్మెల్యేలతో చర్చించారు. కొన్ని పనుల్లో అధికారుల అలసత్వం వల్ల జాప్యం జరుగుతోందన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన లేవనేత్తారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో పర్యాటక అభివృద్ధి అంశాలను అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విజయసాయిరెడ్డికి వివరించారు. జొలాపుట్ నుంచి పాదువా వరకు జల మార్గంలో టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. (చదవండి: 'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది') ఆనకాపళ్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ ఎమ్మెల్యేల్లో అధిష్టానంపై అసంతృప్తితో ఉందన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ ఉనికి కాపాడుకునేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదే విధంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. డీఆర్సి మీటింగ్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని టీడీపీకి అనుబంధంగా ఉన్న కొన్ని వార్త సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా నిన్న అమరావతి వెళ్లలేదని, సీఎం కార్యాలయంలో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. అయితే జిల్లా అభివృద్ధి పార్టీ కార్యకర్తల ప్రగతి అంశాలపై కూడా విజయసాయి రెడ్డి సుదీర్ఘ చర్చ జరిపారు. రానున్నకాలంలో జిల్లాల విస్తరణ నేపథ్యం కార్యకర్తలకు పదవుల కేటాయింపు అలాగే అభివృద్ధి అంశాలపై చర్చ కొనసాగినట్లు రాజ్యసభ సభ్యులు పేర్కొన్నారు. (చదవండి: ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది) -
గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా!
సాక్షి, విశాఖపట్నం: ‘గీతం యూనివర్సిటీకి జాతిపిత మహాత్మాగాంధీ పేరు పెట్టి భూ కబ్జాలకు పాల్పడతారా? భూ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకుంటే టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మరో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెంలో వారు మీడియాతో మాట్లాడారు. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాల భూములను గీతం యాజమాన్యం ఆక్రమించిందని.. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తెల్లవారుజామున కూల్చేశారనడం సబబు కాదన్నారు. ఐదు నెలల క్రితమే గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ సర్వేయర్ సర్వే జరిపి.. 40 ఎకరాలు కబ్జా అయినట్టు తేల్చారన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వానికి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఎలివేషన్ (బదలాయింపు కోసం) దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒకటి, రెండు ఎకరాల వరకు ఎలివేషన్కు ప్రభుత్వం అనుమతిస్తుందని.. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాలు ఆక్రమించుకుంటే ఎలివేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినేట్ సమావేశంలో గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం ప్రస్తావన రాగా.. అది తమ కుటుంబానికి సంబంధించిన అంశమని చెప్పిన చంద్రబాబు సమావేశం నుంచి బయటికి వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు. 2017లో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖలో జరిగిన భూకుంభకోణాన్ని వెలికి తీశామని గుర్తు చేశారు. అప్పుడు కంటితుడుపు చర్యగా సిట్ దర్యాప్తునకు ఆదేశించి.. కేసును నీరుగార్చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుంభకోణంపై సిట్ ఏర్పాటైందని.. కోవిడ్ కారణంగా దర్యాప్తు కొంత ఆలస్యమైందని తెలిపారు. భూకుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాలకృష్ణతో ఉన్న బంధుత్వం కారణంగా గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణల్ని బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని, హత్యలు చేసిన వారినే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకున్నారని, ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న అచ్చెన్నాయుడును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు. -
చంద్రబాబు భజన మానుకోండి
సాక్షి, తాడేపల్లి : పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. త్వరగా కేసు పూర్తి చేయాలన్న సుప్రీం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రిక విలువలను ఎల్లో మీడియా కాలరాస్తూ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాయడాన్ని ఆయన ఖండించారు. మూడు రాజధానుల పక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలని ఎల్లో మీడియా చూస్తోందని, ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే కుట్రలు కుతంత్రాలు చేస్తోందని మండిపడ్డారు. ఎల్లో మీడియా ఫోర్త్ ఎస్టేట్ కిందకు రాదు ఎల్లో ఎస్టేట్ కింద వస్తుందని, ఇప్పటికైనా చంద్రబాబు భజన మానుకోవాలని హితవు పలికారు. (చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదు) వైజాగ్లో పరిపాలన రాజధాని, కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆలోచన చేస్తే చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 14 నెలల కాలంలో సంక్షేమం కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా దేశంలో మరొకరు లేరని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ప్రమాదం జరిగిన విశాఖపట్నంకు ముడి పెడుతుండటం ఏంటని అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. (మూడు రాజధానులు: రోజూవారి విచారణ జరపండి) -
ఇదే సీఎం జగన్ లక్ష్యం: అమర్నాథ్
సాక్షి, విజయవాడ: పాలనా వికేంద్రికరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లు అమోదాన్ని అందరం స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ ముందు చూపు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. (చదవండి: వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం) విశాఖపట్నంలో అన్ని రకాల వనరులున్నాయని, ఉన్నతమైన రాజధానిగా విశాఖ అవతరించ బోతుందన్నారు. దురాలోచనలతో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగులుతున్నారని, రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. -
చంద్రబాబు మాయలో పడొద్దు
-
చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
-
‘ఆయన రాజకీయం కోసమే పనిచేస్తారు’
-
ఏడాదిలోనే 90 శాతం హామీల అమలు
-
కన్నా మాట్లాడుతోంది బిజెపి లైనా?.. టిడిపి లైనా?
-
బాబుది మేటర్ వీక్...పబ్లిసిటీ పీక్: ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: ఇటలీ, స్పెయిల్ వంటి దేశాలలో సైతం కరోనా వైరస్ తీవ్రస్థయిలో విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కరోనా ఏవిధంగా వణికిస్తోందో మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించి పోయిన పరిస్థతులు వచ్చాయని పేర్కొన్నారు. ఇక మన రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్ధాయిలో కృషి చేస్తున్నారో కూడా మనం చూస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా ప్రతీ ఇళ్లు జల్లెడ పట్టడానికి అవకాశం ఏర్పడిందని, వాలంటీర్లతో ఏపిలో చేపడుతున్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన గత ప్రభుత్వం తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం మేటర్ పీక్....పబ్లిసిటీ వీక్.. అదే చంద్రబాబు అయితే మేటర్ వీక్...పబ్లిసిటీ పీక్ అని ఎద్దేవా చేశారు. (తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి) ఒకవేళ ఇపుడు చంద్రబాబు ఉంటే ఏ స్ధాయిలో పబ్లిసిటీ చేసుకునేవారో... ఆయన విమర్శలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరనా సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కరకట్ట పారిపోయిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. రాష్ట్రానికి ఆపద వస్తే మీరు హైదరాబాద్ పారిపోతారా? అని ప్రశ్నించారు. బాబు రాష్ట్రానికి పట్టిన 40 ఏళ్ల పొలిటికల్ వైరస్ అని.. కరోనా వైరస్ అయినా కొన్ని నెలల తర్వాత తగ్గుతుంది కానీ చంద్రబాబు వైరస్ చాలా ప్రమాదకరం అని విమర్శించారు. జనతా కర్ఫ్యూ రోజున ఆయన మనవడికి ఇంగ్లీష్ బోధిస్తున్న వీడియో చూశానని, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రాకుండా కుట్రలు చేసిన బాబు.. ఆయన మనవడకి సుమతి శతకాలు ఎందుకు బోధించలేదన్నారు. మీరు దీపం... కొడుకు కొవ్వొత్తి.. మనవడు టార్చ్ లైట్ పట్టకున్న మీ ఇంట్లోనే ఐక్యత లేదు ఇక అఖిలపక్షం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు చందాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హుద్ హుద్ తుఫాన్ నుంచి రాజధాని వరకు చందాలు వసూలు చేసిన ఘనత మీదే అని విమర్శించారు. 2001 సంవత్సరంలో గుజరాత్లో భూకంపం వస్తే.. కూడా ఏపి ప్రజలని వదలకుండా చందాలు వసూలు చేసిన మిమల్ని చందాల నాయుడు అంటే బాగుంటుందని విమర్శించారు. (ఆనంద్ మహీంద్ర లుంగీ గిఫ్ట్, హెయిర్ కటింగ్ కష్టాలు) మీరు, మీ పత్రికలు ఈనాడు, ఆంద్రజ్యోతి కూడా చందాలు వసూలు చేసి ఎపుడైనా లెక్కలు చెప్పారా.. హుద్ హుద్ తుఫాన్ సమయంలో వెయ్యి కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. రూ. 600 కోట్లు ఇవ్వలేదా...అందులో రూ. 200 కోట్లతో కూరగాయలు కొనుగోలు చేశామని మీ హోంమంత్రి అసెంబ్లీలో దొంగలెక్కలు చెప్పలేదా అన్నారు. తుఫాన్ సమయంలో విశాఖలో పెట్టుబడులు పెట్టవద్దని మీ ఎంపి మాట్లాడితే.. నోరు ఎందుకు పెగలలేదన్నారు. యుద్దంలో గెలిచినా... ఓడినా వీరుడంటాం...కానీ ఆట మధ్యలో వెళ్లిపోయిన వారిని ఆటలో అరటిపండు అంటామన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్సలు కూడా ఆటలో అరటి పండులాంటివే అని పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గబ్బిలమని, విశాఖలో కేసులు దాచి పెడుతున్నామని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి అయ్యన్నకు మందు దొరకక ప్రిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో పాజిటివ్ కేసులు దాచుకోవాల్సిన అవసరం ఏముందని, మీ నాయకుడి మెప్పుకోసం విశాఖపై తప్పుడు వ్యాఖ్యలు చేయోద్దని ఆయన మండిపడ్డారు. చదవండి: లాక్డౌన్: యమధర్మరాజు అవతారం ఎత్తి.. -
90 శాతం స్థానాల్లో విజయం వైఎస్సార్సీపీదే : ఎంపీ
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ సత్యవతి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి మూలం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 87 శాతం ఎమ్మెల్యేలను ఏ విధంగా గెలిచామో.. అదే విధంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను తమ పార్టీ గెలవడం ఖాయమన్నారు. గడిచిన 9 నెలల్లో సీఎం జగన్ అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రజల్లోకి వెళతామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. (‘టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని బాబే చెప్పారు’) నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను జాన్ -
స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది
-
‘అందుకే ప్రజలు బాబును అడ్డుకున్నారు’
సాక్షి, విశాఖపట్నం :విశాఖలో చంద్రబాబుకు ప్రజాగ్రహం కనిపించిందని అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబును ప్రజలను అడ్డుకుంటే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదని, ప్రజలను రెచ్చగొట్టి బాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో విశాఖలో భూరికార్డులు తారుమారు అయ్యాయని మండిపడ్డారు. చంద్రబాబుపై టీడీపీలోని ఓ వర్గం వారే చెప్పులు వేసినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. (చంద్రబాబు తీరుపై మండిపడ్డ పోలీసు సంఘం) పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, ఏం జరిగినా పులివెందుల పేరు చెప్పడం చంద్రబాబుకు అలవాటు అయిపోయిందని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాతో ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని.. అందుకే ప్రజలు బాబును అడ్డుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు అవమానపరుస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘ఉమ్మేస్తారన్నా కూడా బాబుకు సిగ్గు లేదు’) ‘‘చంద్రబాబుకు అమరావతి తప్ప.. రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు. తన బినామీల కోసమే అమరావతి పేరుతో డ్రామాలు అడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అందుకే ఎయిర్పోర్టులో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. బాబు, టీడీపీ నేతలు భూదందాలు చేసి వేరే వాళ్లపై నెట్టేస్తున్నారు. నిన్న(గురువారం) విశాఖ ఎయిర్పోర్టులో జరిగింది చూసి జనం కర్మ సిద్ధంతం అంటున్నారు. చేసిన తప్పుకు వెంటనే శిక్ష ఉంటుందని ఇప్పుడు రుజువైంది. ఇప్పటికైనా ప్రజలకు చంద్రబాబు క్షమపణలు చెప్పాలి.’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చదవండి : ప్రజాగ్రహానికి తలొగ్గిన చంద్రబాబు.. -
‘ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు బాబు ప్లాన్’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, ఎల్లో మీడియాతో విశాఖపై దుష్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా ప్రజలను రెచ్చగొట్టి బాబు అబ్ది పొందాలని చూస్తున్నారని, ఇప్పటికైన ఆయన తీరు మార్చుకోవాలన్నారు. బాబుకు విశాఖ ప్రజల ఓట్లు కావాలి కానీ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు మాత్రం వ్యతిరేకి అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రం బాగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటుంటే.. బాబు మాత్రం తాను మాత్రమే బాగుపడాలని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదన్నారు. ఇక సీఎం జగన్కు మంచిపేరు వస్తుందనే బాబు అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. పెల్లుబికిన ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే.. ఇక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని, ఆయనకు అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని ధ్వజమెత్తారు. ఇక బాబుపై ప్రజాగ్రహం పెల్లుబికిందని అందుకే ఎయిర్పోర్టులో బాబును ప్రజలు అడ్డుకున్నారని విమర్శించారు. అరగంట పాటు విమానాశ్రమంలో ఉండాలని పోలీసులు సూచించినా బాబు పట్టించకోలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి అబ్ధిపోందేందుకు చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
చంద్రబాబు 13 జిల్లాలకు విలన్
-
‘పెద్ద మనసు లేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం గెలిచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు గ్రామాలకు హీరో అయితే 13 జిల్లాలకు విలన్ అని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన లోక్ష్ను మండలిలోకి పంపారని, లోకేష్ పదవి పోతుందని చంద్రబాబు బాధపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చైర్మన్ను ప్రభావితం చేశారు శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకుని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లును శాసన మండలి అడ్డుకుందని, తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్ను ప్రభావితం చేశారని, టీడీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉందని రాజకీయంగా అడ్డుకున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉందని గుర్తు చేశారు. మండలి రద్దును ప్రతిపాదిస్తే సమర్థిస్తానని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.శాసనమండలి అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాజకీయ దురుద్దేశంలో మండలిలో బిల్లులను అడ్డుకున్నారని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయని మండలికి ప్రజాధనం వెచ్చించడం వృథా అని వ్యాఖ్యానించారు. పెద్ద మనసులేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారని చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు..
సాక్షి, విశాఖపట్నం: శానసమండలిలో పరిణామాలను మేధావులు, ప్రజలు బ్లాక్ డే గా భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. శుక్రవారం విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘తాను తప్పు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మనే ఒప్పుకున్నారు. ఆయన తీరును మేధావులు కూడా తప్పుబట్టారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం వెళ్లాలని ఛైర్మన్కు సూచించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్ను కనుసైగలతో శాసించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మండలి ఛైర్మన్ వ్యవహరించారు. ఆయన నిర్ణయం వల్ల కొంత ఆలస్యం మాత్రమే జరుగుతుంది. ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాని ఖునీ చేసినందుకా ఆనందోత్సాహాలు? (వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) మూడు గ్రామాలకే చంద్రబాబు హీరో ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలి. మండలి గురించి సోమవారం అసెంబ్లీలో చర్చిస్తాం. చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. ఆయన పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరు. అయితే తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మండలిని ఉపయోగించుకోవడం దారుణం. మండలిని ఆనాడు ఎన్టీఆర్ రద్దు ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అయితే అర్ధవంతమైన సభగా పెద్దల సభ ఉండాలనే మంచి ఆలోచనలతో వైఎస్సార్ ఆనాడు శాసన మండలిని పునరుద్దించారు. (చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!) పవన్కి చంద్రబాబే ఆదర్శం వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లలేరు. ఆయనది లాంగ్ మార్చ్ కాదు... రాంగ్ మార్చ్. పవన్కు వ్యక్తిత్వం, స్థిరత్వం, సిద్ధాంతాలు లేవు. మూడు రాజధానులు ఉంటే ఎందుకు తప్పు? అయిదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. రాజకీయ జీవితంలో...వ్యక్తిగత జీవితంలో పవన్కి పక్కన ఎవరో ఒకరుండాలి. పొత్తుల విషయంలో పవన్ కి చంద్రబాబే ఆదర్శం. గాజువాక ప్రజలు ఓడించారనే పవన్ కక్ష సాధిస్తున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్) -
ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు?
-
ఎంపీ సుజానాపై ఎమ్మెల్యే గుడివాడ ఫైర్
-
‘ఓ రోజు ప్రీపెయిడ్లా.. మరో రోజు పోస్ట్ పెయిడ్లా’
సాక్షి, అమరావతి : సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటిస్తేనే ఎక్కువ డబ్బు వస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్టు కనిపిస్తోందని అనకాపల్లి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరావతిలో పవన్ కల్యాణ్ పర్యటన విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా అమరావతి నుంచి రాజధాని మారుస్తానని చెప్పలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని.. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ను కూడా మేలు చేయాలనే సీఎం జగన్ ప్రతిపాదనలు చేశారని తెలిపారు. అమరావతి లో రైతులకు న్యాయం చేసే దిశలో చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని అన్నారు. ఓ రోజు ప్రీపెయిడ్లా.. మరో రోజు పోస్ట్ పెయిడ్ లా... ప్రశ్నిస్తామని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అంతకుముందు నూజివీడు గుంటూరులో రాజధాని పెడతానని చంద్రబాబునాయుడు చెప్పినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులు అని ఎవరు మాట్లాడలేదని, శేఖర్ చౌదరి అనే ఆర్టిస్ట్ తలపాగా పెట్టుకొని మాట్లాడటం వల్లే ఈ మాట వచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రీపెయిడ్.. మరోరోజు పోస్ట్ పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ రాజకీయాల్లో పవన్ ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి రైతులను చంద్రబాబు నాయుడు అనవసరంగా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ప్రాంతానికి నాయకుడా లేదా అన్ని ప్రాంతాలకు నాయకుడా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. (‘చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి’) ఆయన గురించి మాట్లాడుకోవటం దండగా నిన్నటిదాకా సింగపూర్ లో షూటింగ్ చేసి.. ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నాడని పవన్ కల్యాణ్పై మంత్రి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు అయిదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్.. ఇప్పుడు సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవటం దండగా అని ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వస్తుంటే.. తిక్కలొడి గురించి ఎందుకని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం అమరావతి కూడా అభివృద్ధి చెందలేదని.. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
పవన్, బాబులకు ఆ హక్కు లేదు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి నుంచి భోగాపురం వరకు విస్తరించి ఉన్న విశాఖపట్నం నగరం రాజధానికి అనువైనదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను చేస్తే మూడు జిల్లాల అభివృద్ది కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని పేరిట డబ్బులు వృథా చేయకూడదన్న ఉద్దేశంతోనే మూడు ప్రాంతాల అభివృద్దికి ప్రతిపాదనలు చేశారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదన్నారు. విశాఖను సమ్మర్ రాజధానిగా చేయాలని గతంలో తాము చేసిన ప్రతిపాదనల దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉత్తరాంధ్ర ప్రజల కలను నెరవేర్చారని అన్నారు. సీఎం జగన్ ఉత్తి ఆంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దనున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు విమర్శించి ప్రజల గౌరవాన్ని కోల్పోయారని, ఒకే ప్రాంతానికి, వర్గానికి మేలు చేకూరేలా వీరిద్దరి ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. పార్టీలను నడిపే హక్కు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్లకు లేదని, రాజధాని విషయంలో చంద్రబాబు శవ రాజకీయాలు చేయాలని కలలు కంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయంతో విశాఖ నగరం హైదరాబాద్ స్టాయిలో అభివృద్ది చెందనుందని, అమరావతి భూముల విషయంలో జరిగినట్టు విశాఖలో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
రాజధాని పేరుతో ప్రజాధనం దోచేశారు
-
గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం
-
‘పవన్ కల్యాణ్కు మతిభ్రమించింది’
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని దసపల్లా భూములు ప్రభుత్వానికి చెందినట్టు గుర్తించినా టీడీపీ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మంగళవారం ఆయన విశాఖలో భూఆక్రమణలపై సిట్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయం కూడా రికార్డుల మార్పిడిలో జరిగిన అక్రమ వ్యవహారమే అని మండిపడ్డారు. మెడ్ టెక్ భూముల సేకరణలో భారీ అక్రమం జరిగిందని విమర్శించారు. గత సిట్ కూడా పీలా గోవింద్పై అభియోగం మోపినా చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అమర్నాథ్ దుయ్యబట్టారు. ఈ భూ కుంభకోణాల్లో గత సీఎం ప్రమేయం వుందని ఆరోపించారు. విశాఖలో జరిగిన లక్షల కోట్ల విలువైన భూ వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తప్పకుండా బయటకు వస్తాయని నమ్ముతున్నామని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్కు మతిభ్రమించింది.. పవన్ కల్యాణ్కు మతిభ్రమించిందని.. విశాఖపట్నం వస్తే మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి విశాఖ భూ ఆక్రమణలతో సంబంధం ఉందని అనటంతో పవన్ మానసికస్థితి ఏంటో తెలియజేస్తుందని మండిపడ్డారు.పవన్ కల్యాణ్ సినిమా నిన్నటివరకు టీడీపీని.. ఇప్పుడు కొత్తగా బీజేపీని పొగుడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజాసంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే పవన్ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ ధ్వజమెత్తారు.