Interim budget
-
ఈ రైల్వే షేర్లు కొంటే దశ తిరిగినట్లేనా..?
-
డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్... రూ. 50,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది. అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి లోక్సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదీ తీరు.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, ఆర్వీఎన్ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్మెంట్) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది. -
దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘వికసిత భారత్’నాలుగు స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను మరింత శక్తివంతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అని కొనియాడారు. గురువారం బడ్జెట్ అనంతరం ఆయన టీవీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’పునాదిని బలోపేతం చేసే హామీని ప్రస్తుత బడ్జెట్ ఇస్తోందని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సమగ్రంగా, వినూత్నంగా ఉందని, దేశ పురోభివృద్ధిపై పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రశంసించారు. భారతదేశ యువ త ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించిన ట్లు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ప్రకటించినట్లు గుర్తుచేశారు. గ్రామాలు, నగరాల్లో పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని, మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. తొ లుత 2 కోట్ల మంది మహిళలను ’లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించకున్నామని, ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇకపై అంగన్వాడీ సభ్యు లు, ఆశావర్కర్లు సైతం లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తాజా బడ్జెట్లో ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయాలను భారీగా పెంచినట్లు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయించారని, ఆర్థికవేత్తల భాషలో చెప్పాలంటే ఇది తీపి కబురేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల 21వ శతాబ్దంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని, కోట్లాది మంది యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘వందేభారత్ స్టాండర్డ్’కింద 40 వేల ఆధునిక కోచ్లను తయారుచేసి, సాధారణ ప్యాసింజర్ రైళ్లలో చేర్చాలని బడ్జెట్లో ప్రకటించారని, ఇది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే మార్గాల్లో లక్షల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించారు. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ పేద, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించడం, వారికి కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించడంపై బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్ల ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని అన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆదాయపు పన్ను ఉపశమన పథకంతో దాదాపు కోటి మంది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన లబ్ధి కలుగుతుందన్నారు. నానో డీఏపీ వినియోగం, పశువుల కోసం కొత్త పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని వివరించారు. -
అభివృద్ధి నినాదంతో బడ్జెట్: నిర్మలా సీతారామన్
-
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్పై కసరత్తు, బడ్జెట్ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
పద్దు.. పొడిచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మధ్యంతర సమీక్షకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆశించిన మేరకు ఈ ఏడాది రాబడులు రాని కార ణంగా బడ్జెట్ను సమీక్షించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో శాఖల వారీగా అంచనాలు, రాబడులు,ఖర్చులు, తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చు పద్దులపై అంచనాలను సవరిం చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. తొలి ఆరు నెలల ఆర్థిక పరిస్థితులు, రాబోయే 6 నెలల అంచనాలను విశ్లేషి స్తున్న ఆర్థిక శాఖ అధికారులు.. 2020–21 బడ్జెట్ ప్రతిపాదనల్లో 15–20% రాబడి రాకపోవచ్చన్న అంచనాలతో శాఖల వారీ సవరణ ప్రతిపాదనలను రూపొం దించే పనిలో పడ్డారు. ఈ మేరకు త్వరలోనే అన్ని శాఖలకు నోట్ పంపి ఆయా శాఖల కచ్చిత ప్రతి పాదనలకు అనుగుణంగా సవరించిన అంచనాల బడ్జెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.1.30 లక్షల కోట్ల వరకు.. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,76,393 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ ప్రతిపాదించిన దానికి కొంచెం అటుఇటుగా రాబడులు, ఖర్చులు ఉంటాయి. ఇంతకుముందు మూడేళ్ల బడ్జెట్ను పరిశీలిస్తే 2019–20లో 96 శాతం, 2018–19లో 75 శాతం, 2017–18లో 79 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఈసారి కరోనా ప్రభావంతో ఇది మరికొంత తగ్గి 75 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. తొలి ఆరు నెలల్లో వచ్చిన రూ.63,970 కోట్లకు తోడు మరో 70 వేల కోట్లు కలిపి రూ.1.30 లక్షల కోట్లు రావచ్చని భావిస్తోంది. ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం, రూ.20 వేల కోట్ల వరకు రుణాలు, మరో రూ.5 వేల కోట్లకు పైగా ఇతర ఆదాయం కలిపి ఆ మేరకు సమకూరుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటు గత మూడేళ్ల రాబడులు పరిశీలించినా చివరి ఆరు నెలల ఆదాయం రూ.70 వేల కోట్లు దాటలేదు. ఖర్చులు కూడా ఆ మేరకు.. ఆదాయ పరిస్థితి అలా ఉంటే.. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వరకు అనివార్య చెల్లింపులు జరపాల్సి ఉంది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.25 వేల కోట్లు, అప్పుల వడ్డీ లేకుండా రూ.7 వేల కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.14 వేల కోట్లు, పింఛన్లకు రూ.8 వేల కోట్లు, సబ్సిడీల కింద రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. ఇందులో సబ్సిడీ ఖర్చులు తగ్గించుకున్నా రూ.3 వేల నుంచి 4 వేల కోట్లే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేతిలో పెద్దగా నిధులు మిగిలే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లోనే బడ్జెట్ అంచనాలను సవరించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు గణనీయంగా పెంచుకోవాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇందులో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధపడితే రూ.10–15 వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశముంది. ఇక ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం వేయలేదు. కొంతమేరకు పన్నులు పెంచడం, భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడం ద్వారా నిధుల వెసులుబాటు కలగనుంది. మరి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది.. రాబడులు పెంచుకునే దిశలో ముందుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా..? వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకుని ప్రభుత్వ శాఖల అదనపు ఖర్చులను తగ్గించుకునే దిశలో బడ్జెట్ అంచనాలను సవరిస్తారా అన్నది భవిష్యత్ అవసరాలను తేల్చనున్నాయి. -
గత కేటాయింపులే బడ్జెట్లో కొనసాగింపు..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మధ్యంతర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్బీఎఫ్సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. -
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడం లక్ష్యంగా.. వారికి 20 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇచ్చేందుకు నిర్ణయించింది. దీన్ని 2018 జూలై ఒకటి నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు కాకుండా వచ్చే జూన్లో చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు మీడియాకు వెల్లడించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలివీ... ► అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలననుసరించి సత్వరం చెల్లింపులు చేయాలని నిర్ణయం. ► వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై చర్చ జరిగింది. తక్కువ ధరకు ఎవరు టెండర్లు వేస్తే వారికిచ్చేయాలని నిర్ణయం. ► జేఎన్టీయూ అమరావతి పేరిట కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం. దీన్ని మోడల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో 70 ఎకరాల భూమిని ఎకరా రూ.10 లక్షల చొప్పున, విశాఖ రూరల్ మండలం యెండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా రూ.కోటి చొప్పున అకార్డ్ యూనివర్సిటీకి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► హెల్త్ సైన్సెస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టేందుకు ఆమోదం. డిగ్రీ కళాశాల కూడా ఇవ్వాలని నిర్ణయం. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం. ► అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ► జలవనరుల శాఖకు చెందిన భూముల్లో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అంగీకారం. ► కర్నూలు జిల్లా సున్నిపెంటలో 76.4 ఎకరాలు, వెలిగోడు దగ్గర 20 ఎకరాల భూముల్లో పేదలకు పట్టాలివ్వడానికి ఆమోదం. ► కాకినాడ వెంకట్నగర్లోని 1,040 చదరపు గజాల భూమిని కల్యాణమండపం నిర్మాణంకోసం వీవర్స్ కమ్యూనిటీకి 25ఏళ్ల లీజుకివ్వాలని నిర్ణయం. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో పరిగి, సెరికొలెం గ్రామాల్లోని 256.61 ఎకరాల భూమిని బెనిఫిసెంట్ నాలెడ్జ్ పార్కుకు ఇవ్వాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు అంగీకారం. ► రాజమహేంద్రవరంలోని రామకృష్ణ మఠానికి రూ.23,49,981 విలువ గల ప్రాపర్టీ టాక్స్ బకాయిల నుంచి మినహాయింపు. ► విశాఖ జిల్లా ఎండాడలో అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మిస్తున్న భవనానికి సంబంధించి రూ.48,36,273 విలువ గల బిల్డింగ్ లైసెన్స్ ఫీజు మినహాయింపునకు ఆమోదం. ► ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లిలో 48.53 ఎకరాల ప్రభుత్వభూమిని అఫర్డబుల్ హౌసెస్ నిర్మాణంకోసం విజయవాడలోని రాజీవ్ స్వగృహæ కార్పొరేషన్ సీఎండీకి అప్పగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేటలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు 6.96 ఎకరాల అగ్రి భూమి గుంటూరు టెక్స్టైల్ పార్క్ యాజమాన్యానికి కేటాయింపు. ఎకరాకు రూ.18,15,000 చెల్లించే షరతుపై కేటాయింపు. ► కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు బదులుగా అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 20 ఎకరాలు కేటాయింపు(కేవలం సంస్థ పేరులో స్వల్ప మార్పు)నకు ఆమోదం. ► ప్రకాశం జిల్లా కొండెపి మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి ఎం.కళ్యాణికి ఒంగోలులో ఉచితంగా స్థలం కేటాయింపుకు నిర్ణయం. ► కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 50 ఎకరాల భూమిని.. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి కేటాయింపు. సమగ్ర ఇంటెలిజెన్స్ శిక్షణ అకాడమీకోసం భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం ► ఏపీ ఎకనమిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు విజయవాడ గ్రామీణ మండలం.. జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో 153 ఎకరాల భూమి కేటాయింపు. దీనిలో వేమవరంలో 60 ఎకరాలు, జక్కంపూడిలో 93 ఎకరాలున్నాయి. జక్కంపూడిలో మార్కెట్ ధర ఎకరాకు రూ.కోటి, వేమవరంలో మార్కెట్ ధర ఎకరా రూ.50 లక్షల చొప్పున ధర నిర్ధారణ. ► విజయనగరం జిల్లా కవులవాడ, రావాడ, ముంజేరు, కంచేరుపాలెం, గూడెపువలస, కంచేరు గ్రామాల్లో 500.14 ఎకరాల భూమిని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కేటాయింపు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 70.18 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉచితంగా అప్పగించేందుకు నిర్ణయం. ► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచిలో కియా మోటార్స్ ఆర్వోబీ, వై జంక్షన్ ఏర్పాటుకు 5.89 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలోనే ట్రక్ టెర్మినల్, రైల్వే సైడింగ్ ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయింపు. ► విశాఖ జిల్లా పాడేరు ఏరియా ఆసుపత్రి 100 పడకల స్థాయి నుంచి 200 పడకల జిల్లా ఆస్పత్రి స్థాయికి పెంపు. ► ల్యాండ్ హబ్(భూసేవ) ప్రాజెక్టు నిమిత్తం అవసరమైన సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు అంగీకారం. ► కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం. ► చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోటాలలో రూ.191.19 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఆమోదం. ► నంద్యాలలో ప్రస్తుతమున్న 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతీకరణ ప్రతిపాదనకు ఆమోదం. మొత్తం 46 పోస్టులు మంజూరు. -
ఎన్నికల చక్రం
చూస్తుండగా కాలం గిర్రున తిరిగొచ్చింది. ఎన్నికలు మళ్లీ రానే వస్తున్నాయ్. నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నడంలో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లు నూటికి నూరు శాతం ఓట్ల బడ్జెట్గానే అంతా నిర్ధారించారు. అయినా జనం మాయలో పడు తూనే ఉంటారు. భ్రమలోపడి, ఆ మాటలు నమ్మి మీటనొక్కి వస్తుంటారు. వేలికి నల్లమచ్చ పొడిపించుకుని గంపెడాశతో బయటకొస్తారు. అక్కడ నుంచి నెలా రెండు నెలలు ఇంకో డ్రామాకి తెర లేస్తుంది. అంకాల వారీగా అది పూర్తవుతుంది. పదవుల్ని పంచుకుంటారు. అంతా సంకల్పాలు చెప్పి కంకణాలు ధరిస్తారు. కొత్త చాంబర్లు, కొత్తకార్లు అన్నీ ప్రజాసేవలోకి దిగుతాయ్. అసంతృప్తులు కూడా తొంగి చూడటం ప్రారంభం అవుతుంది. ఇక్కడికి ఆరు నెలల పుణ్యకాలం గడిచిపోతుంది. మళ్లీ చలికాలం మొదలవుతుంది. పది పన్నెండుసార్లుగా కోటి ఆశలతో ఓట్లు వేస్తున్న వారికి అవే అవే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయ్. ప్రజా సమస్యల మీద నుంచి ప్రభుత్వాలు దృష్టి మళ్లించి నాలుగైదు నెలలు దాటింది. పాత మాటలు పక్కనపెట్టి సర్కార్లు కొత్త వాగ్దానాలు చేస్తున్నాయ్. ఈ మధ్య ఒక పెద్దాయన, ‘ఇప్పుడు జనాభాకి మునుపటిలో అయోమయంగానీ తికమకగానీ లేదండీ. స్పష్టంగా అనుకునే ఓట్లు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘మంచి ధరకి ఓటు వేస్తున్నారు కొందరు, మనవాడని వేస్తున్నారు కొందరు. అందుకని మాయ మాటల్లో పడే సమస్యే లేదు’ అని ముక్తాయించారు. ఓటర్ ప్రజకు వడ్డించాల్సిన భక్ష్యాలన్నీ ప్రభుత్వాలు బడ్జెట్ విస్తట్లో వడ్డించాయ్. వాళ్లకి అందులో తినేవి ఏవో ఉత్తుత్తివేవో అర్థం కాలేదు. ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడింకా కొత్త జల్లులు పడే అవకాశం లేదు. సమయం దాపురించేసింది. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపాలో తేల్చుకున్నారని చాలామంది స్పష్టంగా చెబుతున్నారు. అభ్యర్థి తేలితే అంతా ఖరారేనంటున్నారు. అన్ని వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయ్. అన్నింటినీ ప్రజ సమభావంతోనే స్వీకరిస్తోంది. మన దేశంలో నేతల ఆరోపణలన్నీ సీరియస్గా తీసుకోవడం జనం మానేసి చాలా కాలమైంది. అవి చాలాసార్లు కాలక్షేపం, కొన్నిసార్లు వినోదంగా మారాయి. స్వతంత్రం రాకముందు నుంచి రైతు సమస్యల గురించి మన నాయకులు ఉద్ఘోషిస్తున్నారు. గాంధీ గ్రామ స్వరాజ్యం మీద కలలు కన్నారు. గ్రామసీమలు చూస్తుండగా దివాళా తీశాయి. రైతుకి సిమెంటు రోడ్డు కంటే నీరు పారే పంటకాలువ, మురుగు కాలువ ముఖ్యం. వాటిని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. పట్టించుకున్నా వాటికి కమిటీలు వేసి, రాజకీయం చేసి వదులుతారు. ఏదో వంకన అస్మదీయుల్ని పెంచి పోషించడమే అవుతుంది. ప్రభుత్వం పెట్టే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా, ముందు విధిగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం. గ్రామాలు అనేక కారణాల వల్ల మరుగున పడిపోయాయి. ఆదాయాలు లేవు, బతుకు తెరువులు లేవు. పట్నవాసంతో సమంగా ఖర్చులు పెరిగాయి. విద్య, వైద్య సౌకర్యాలు పూజ్యం. వలసలకి ఇదే కారణం. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, డాక్టర్లో ఇతర చిరుద్యోగులు గ్రామంలో ఉండరు. దగ్గర బస్తీలో మకాం పెడతారు. గుళ్లో పూజారి సైతం నగరంవైపు పరుగులు పెడతాడు. వాళ్ల పిల్లలకీ చదువులు కావాలి. వారి పెద్దలకీ వైద్యం కావాలి. వాళ్లకీ వ్యాపకం, వినోదం కావాలి. ఈ తరుణంలో ఓట్ల ప్రస్తావనలు వచ్చి, అందరికీ పల్లెలు గుర్తొస్తాయి. నివాసయోగ్యంగా సకల సదుపాయాలతో ఉన్న గ్రామాలు చాలా తక్కువ. గడిచిన నాలుగైదు దశాబ్దాలలో పల్లెలు కళా విహీనమయ్యాయి. అన్నీ పట్టించుకునే మీడియా కూడా గ్రామ ప్రాంతాలను పట్టించుకోదు. గ్రామంలో కుక్కని మనిషి కరిచినా అది వార్త కాదు. జానపద కళల అభివృద్ధికి, కొన్ని క్రీడలకి గ్రామాలు ఆటపట్టుగా నిలుస్తాయ్– అభివృద్ధి చేస్తే. అన్ని క్రీడలకు పుట్టిల్లు పల్లెటూళ్లేనని మర్చిపోకూడదు. పల్లెని విస్మరించడమంటే తల్లిని విస్మరించడమే! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘చంద్రబాబు మరో డ్రామాకు సిద్ధమయ్యారు’
సాక్షి, విజయవాడ : ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అమలు చేయాలేని చంద్రబాబు మళ్లీ రైతుల కోసం రూ.5000 కోట్లు అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో మరో డ్రామాకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఒకవైపు కేంద్రం సహకరించలేదంటారు, మరోవైపు రాష్ట్రం అభివృద్ధి పథంలోనడుస్తుందని చంద్రబాబు చెపుతుంటారని చెప్పారు. కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. -
ఆర్బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈ వారంలో కూడా స్టాక్ మార్కెట్పై ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థికవేత్త ధనన్జయ్ సిన్హా పేర్కొన్నారు. ఫార్మా ఫలితాలు.. పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్, సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్కేర్ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎక్సైడ్ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అలహాబాద్ బ్యాంక్.. గురువారం (7న) టాటా మోటార్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్హెచ్పీసీ, బీపీసీఎల్, ఇంజనీర్స్ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా ఉద్యోగ గణాంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘మళ్లీ క్రూడ్ ధరల జోరు కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71కి చేరుకుంది. 70.80 వద్దనున్న కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్ 72.60 వద్ద ఉంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40– 69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్ గ్రూప్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. గత నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,264 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. -
కేంద్ర బడ్జెట్ ట్రైలర్ మాత్రమే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ జనరంజకంగా ఉందని, ఇదే ఇంత బాగా ఉంటే.. జూలై లో ఉండే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. శనివారం నిజా మాబాద్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా పేదలకు పది శాతం రిజర్వేషన్లు అందించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. రూ.5 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు నిర్ణయంతో దేశంలో నాలుగు కోట్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.3 వేల పెన్షన్ పథకంతో సుమారు 30 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ బడ్జెట్లో రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారనే విమర్శలను రాంమాధవ్ ఖండించారు. కేంద్రం రైతులకు రూ.6 వేలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి.. విమర్శించడం తగదన్నారు. రాష్ట్రం ఇచ్చే పెట్టుబడి సాయం తోపాటు, కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రైతులకు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది బంపర్ ఆఫర్ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ప్రశ్నించగా.. ఏపీ ప్రజా ప్రతినిధులకు నిరసన తెలపడం తప్ప వేరే పనిలేదన్నారు. మోదీ భయంతోనే కేసీఆర్ ముందస్తుకు.. ప్రధాని మోదీ హవాలో ఓటమి పాలవుతామనే భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని రాంమాధవ్ విమర్శించారు. మోదీకి దీటైన నాయకులు ఏ పార్టీలో లేరన్నారు. ఫ్రంట్ల పేరుతో విజయవాడ నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. 13న రాష్ట్రానికి అమిత్షా.. ఈ నెల 13న నిజామాబాద్లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరుకానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. ఫిబ్రవరి 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ పార్లమెంట్కు సంబంధించి బూత్ ఇన్చార్జిల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
రైతులపై వరాల జల్లు
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిసింది. ముఖ్యంగా రైతులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ఏడాదికి ఆరు వేల రూపాయలు అందజేసేందుకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని ప్రవేశపెట్టింది. దీనికితోడు పంట రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీని ప్రకటించింది. అంగన్వాడీల వేతనాలను యాభై శాతం పెంచాలనే నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇవ్వడానికి ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్’ స్కీంను ప్రవేశపెట్టారు. వేతనజీవులకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇస్తుండటంతో వారికి మరింత మేలు చేకూరనుంది. సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులపై వరాలు కురిపించింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే రైతు బంధు పథకం అమలు చేస్తుండగా కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేలు అందనున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాలోని 2,03,788 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.122.27 కోట్ల నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. ఈ పథకం 1 డిసెంబర్ 2018 నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో మొత్తం 2,18,747 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2.5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్నకారు రైతులు 51,885 మంది ఉన్నారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలోపు వ్యవసాయ సాగుభూమి ఉన్న సన్నకారు రైతులు 1,51,903 మంది ఉన్నారు. ఐదు ఎకరాలలోపు వ్యవసాయసాగు భూమి ఉన్న 2,03,788 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి చేకూరనుంది. ఏడాదికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 2,03,788 మంది రైతులకు రూ.122.27 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడత ఆర్థిక సహాయం రూ.40.75 కోట్లు మార్చిలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎకరాను యూనిట్గా తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరిగేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పటంతోపాటు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే జిల్లాలో పంటరుణాలపై 2 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో ఏటా లక్ష మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటున్నారు. వీరిలో సగానికిపైగా రైతులు సకాలంలో రుణాలు చెల్లించటం జరుగుతుంది. దీంతో 50వేల మంది రైతులకు 2 శాతం వడ్డీ మాఫీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గోవుల ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. మత్స్యకార్మికులు కిసాన్ క్రెడిట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపితే 2 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. ఇదికూడా జిల్లాలోని మత్సకార్మికులకు లాభం చేకూర్చనుంది. ఆనందంలో అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనం 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 865 మంది అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం పెరగనుంది. జిల్లాలో మొత్తం 885 అంగన్వాడీలు ఉండగా వీటిలో 865 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి రూ.10,500 వేతనం అందుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.4500 కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6వేల తనవాటాగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంచి తన వాటాగా ఉద్యోగులకు ఇకపై రూ.6750 చెల్లించనుంది. దీంతో అంగన్వాడీలకు ఇకపై ప్రతినెలా రూ.12,750 వేతనం అందనుంది. అసంఘటిత రంగ కార్మికులకు మేలు కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు వరం ప్రకటించింది. 60 ఏళ్ల వయస్సుదాటిన వారికి ప్రతినెలా రూ.3వేల పింఛన్ ఇవ్వనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్’ పేరిట అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇస్తుంది. ఇందుకోసం రూ.15వేల లోపు ఆదాయం ఉన్న అసంఘటితరంగ కార్మికుల నుంచి ప్రతినెలా రూ.100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 4,300 మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారు. వీరందిరికీ పింఛన్ పథకం వర్తిసుంది. అయితే జిల్లాలో పదివేల మందికిపైగా అసంఘటితరంగ కార్మికులు ఉన్నట్లు అంచనా. సర్వే చేసి వీరి పేర్లను నూతన పథకంలో చేర్చాలని సీఐటీయూ నేతలు కోరుతున్నారు. పన్ను మినహాయింపు.. వేతన జీవులకు కేంద్రం బడ్జెట్లో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,500 మంది ఉద్యోగులకు మేలు జరనుంది. మెదక్ జిల్లాలో మొత్తం 6,400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1500 మంది ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారు. కేంద్రం నిర్ణయంతో వీరందరికీ మేలు జరనుంది. -
2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లోక్సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర సర్కారు వరాల వర్షం కురిపించింది. మరోసారి గెలుపే లక్ష్యంగా సాగిన ఈ బడ్జెట్లో వేతన జీవులకు, రైతాంగానికి భారీగా తాయిలాలు ప్రకటించింది. ఆర్థిక మంత్రి పీయూష్గోయల్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత ఇచ్చింది. ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గృహ కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది. అసంఘటిత కార్మికులకు అండ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం దిశగా అడుగులు పడ్డాయి. 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇవ్వన్నుట్లు బడ్జెట్లో పొందుపర్చారు. అయితే ఈ కార్మికులు నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వయసు 60 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయి. రియల్ రంగం జోరుమీదుండటంతో భవన నిర్మాణ కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలోని సుమారు 1.60 లక్షల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఊరట వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఊహించనిరీతిలో పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వేతనజీవులకు వెసులుబాటు కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తుండగా..వీరందరికి తాజా నిర్ణయంతో ఐటీ చెల్లింపు బాధల నుంచి విముక్తి కలుగనుంది. జిల్లాలోని ఐటీ హబ్లో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఐటీ నిపుణులకు కూడా కొంతమేర పన్ను మినహాయింపు దక్కనుంది. వీరేగాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణసంస్థల్లో పనిచేస్తున్న మరో లక్ష మందికి కూడా ఆదాయ పన్ను పరిమితి పెంపుతో రాయితీ లభించనుంది. ఇంకోవైపు ప్రవేటు రంగ సంస్థల్లో పనిచేసే వేతన జీవులకు కూడా ఈ నిర్ణయం కలిసి రానుంది. 2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయి. రైతుబంధు కింద రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా కేంద్రం కూడా ఐదెకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా చిన్నకారు రైతులకు ఈ సాయం అందనుంది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నారు. ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా 2,13,208 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై రూ.127.92 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అంగన్వాడీలకు మేలు మధ్యంతర బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. వారి వేతనాలను 50 శాతం పెంచారు. ప్రస్తుతం ప్రతి అంగన్వాడీ టీచర్కు నెలకు రూ. 10,500 గౌరవ వేతనాన్ని అందజేస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3 వేలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోంది. బడ్జెట్లో పొందుపర్చిన మేరకు ఇకపై కేంద్రం వాటా రూ.6 వేలు ఉండనుంది. అంటే టీచర్లకు రూ.13,500 వేతనం అందనుంది. ఫలితంగా జిల్లాలో సుమారు 1,580 మంది అంగన్వాడీ టీచర్లకు మేలు ఒనగూరనుంది. -
అన్నదాతకు..భరోసా!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ జిల్లారైతుల్లో ఆశలు నింపింది. సాగు భారంగా మారి, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలను ఆశ్రయించిన రైతుల సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలోనే సాగును పండగ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేర రెండు పంట సీజన్లకు కలిపి ఏటా ఎకరాకు రూ.8వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని రూ.10వేల వరకు పెంచుతున్నామని ప్రకటించింది. తాజాగా, శుక్రవారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతుబంధును పోలిన పథకాన్నే ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ప్రతి ఎకరాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయమే రూ.16వేలు అవుతుంది. దీంతో రైతుల పెట్టుబడి కష్టాలు తీరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, ఐదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతి ఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల రైతులు, రైతు సంఘాల నేతలు హర్షం ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకూ తీపి కబురు అంగన్వాడీ టీచర్లకూ కేంద్ర బడ్జెట్ తీపి కబురే అందించింది. వారు ప్రస్తుతం తీసుకుంటున్న వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రతిఏటా జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు అదనంగా రూ.19.41కోట్లు చెల్లింపులు జరగనున్నాయి. జిల్లాలో 2093 అంగన్వాడీ కేద్రాలు ఉండగా, వాటిలో 261 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే టీచర్లకు ప్రతినెలా రూ.6700 వేతనం అందుతోంది. అంటే ఏటా రూ.2,09,84,400 వేతనాలు అవుతుండగా 50 శాతం పెంపుతో అదనంగా మరో రూ.1,04,92,200 లభించనున్నాయి. మరో 1,832 కేంద్రాల్లో అంతే సంఖ్యలో ఉన్న ఆయాలకు ప్రతినెలా రూ.6700 వేతనం లభిస్తోంది. వీరికీ ఏటా అదనంగా రూ.1,04,92,200 ముట్టనున్నాయి. ఇదే కేంద్రాల్లో పనిచేస్తున్న 1832 మంది అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.10వేల వేతనం అందుతోంది. ఇక నుంచి ఈ వేతనం రూ.15వేలు కానుంది. రూ.10వేల చొప్పున ఏటా రూ.21,98,40,000 ఖర్చు అవుతుండగా, ఇపుడు అదనంగా మరో రూ.10,99,20,000 అందనున్నాయి. మొత్తంగా అంగన్వాడీ టీచర్లకు ఏటా రూ.19,40,58,600 వేతనాల రూపంలో కేంద్రం అందించనుంది. ఒక్కసారిగా యాభై శాతం పెరిగిన వేతనాలతో అంగన్వాడీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హర్షం కేంద్ర బడ్జెట్ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపింది. ఇదివరకటి ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో ఎక్కువ మంది ఉద్యోగులు పన్నుల భారంనుంచి బయట పడుతున్నారు. గతంలో రూ.2.50లక్షల రూపాయల వార్షిక వేతన ఆదాయం ఉన్న ప్రతిఉద్యోగి ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తాన్ని ఈసారి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్ మినహాయించే రూ.5లక్షల సీలింగ్ పెట్టడంతో ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 41,500 మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు సగానికిపైగానే ఉంటారని అంచనా. ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు. -
వరాల..వాన
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వరాల జల్లు కురిసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చింది. ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట, వేతన జీవికి పన్ను మినహాయింపులు భారీగా లభించాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలందరినీ ఆకట్టుకునేలా.. అందరికీ ప్రయోజనం కలిగించేలా పలు అంశాలను ఈ 2019–20 తాత్కాలిక బడ్జెట్లో చేర్చారు. అందరికీ మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ‘ఎన్నికల’ల బడ్జెట్ను పీయూష్ గోయల్ ద్వారా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుకు తోడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఊరట. అలాగే అసంఘటిత కార్మికులకు పెన్షన్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కోసం కేంద్రం పద్దుల్లో పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్పై మొత్తంగా అన్నివర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుండగా.. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఓట్లను రాబట్టే ఎన్నికల బడ్జెట్గా వర్ణిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుంట నుంచి 1.25 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 2,74,368 మంది కాగా, 1.25 నుంచి 2.5 ఎకరాలున్న వారు 1,72,669 మంది, 2.5 నుంచి 5 ఎకరాలున్న వారు 1,45,008 మంది రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6000 నగదు బదిలీ పథకం వల్ల మొత్తం 5,92,045 మందికి లబ్ది చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ పథకం 2018 డిసెంబర్ నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్కు రూ.750 కోట్ల కేటాయించగా, దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ప్రకృతి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ, సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనుండటం శుభపరిణామం. అసంఘటిత కార్మికులకు అండ... అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ పథకం ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ రానుంది. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీనిద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12,45,806 మందికి మేలు జరుగనుంది. ఇందులో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల సంఖ్య 5,84,654 మంది ఉండగా, భవనాలు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో 6,61,052 మంది కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుస్తోంది. వేతనజీవులకు ఊరట... వేతన జీవులకు, పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. మహిళలు, మహిళా ఉద్యోగులకు భరోసా... మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి అనేక రాయితీలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే 6కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిన కేంద్రం మరో రెండు కోట్ల కనెక్షన్లను ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 వేల వరకు కనెక్షన్లు రానున్నాయి. మాతృత్వయోజన పథకం కింద మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవులు ఇవ్వడం హర్షనీయం. సుమారు 23,478 మంది మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు వర్తించనున్నాయి. అంగన్వాడీలకు పెరగునున్న వేతనం మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మహిళా టీచర్లు, ఆయాలకు వేతనాలను 50 శాతం పెంచడం వల్ల ఉమ్మడి జిల్లాలో 6,235 మంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 వస్తుండగా రూ.1,500 పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంకా అమల్లోకి రావడం లేదు. అదేవిధంగా ఆయాలకు రూ.7,500లకు అదనంగా రూ.750 పెంచినట్లు ప్రకటించినా, ప్రస్తుతం రూ.7,500 వస్తోంది. కొత్తపల్లి–మనోహర్బాద్ లైన్కు రూ.200 కోట్లు... ఈ బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.64,587 కోట్లు కేటాయించినట్లు పేర్కొనగా... గతంతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బాగానే విదిల్చారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ 150 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ను 2006–07లో ప్రతిపాదించారు. ఆ సమయంలో దాని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. గడిచిన నాలుగేళ్లుగా ప్రతీ ఏటా రూ.137 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 32 కిలోమీటర్ల దూరం వరకు మనోహరాబాద్–గజ్వేల్ మధ్య పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. కాజీపేట–బల్హర్షా మధ్య 202 కిలోమీటర్ల దూరం వరకు మూడవ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని 2015–16వ ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయించి రూ.2,063 కోట్లు అంచనా వేశారు. గడిచిన నాలుగేళ్లుగా రూ.360 కోట్లు కేటాయించగా ప్రస్తుత పనుల నిమిత్తం రూ.265 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రాఘవపూర్ నుంచి మందమర్రి వరకు మూడవ రైల్వే ట్రాక్ వినియోగంలోకి రాగా రాఘవపూర్–పొత్కపల్లి–బిజిగిరిషరీఫ్–ఉప్పల్ మధ్య రెండవ విడత పనులు చేపట్టేందుకు నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ బడ్జెట్ ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రాజకీయ లబ్దికి ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్లో చెప్పిన అంశాలు అమలు కావడం సాధ్యం కాదని తెలిసినా ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలులో ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఐదేళ్లలో చాలా సాధించాం. చట్టంలో లేకపోయినా తెలంగాణకు ఎయిమ్స్ సాధించాం. ఇంకా చాలా అంశాలకు సంబంధించి గెజిట్ విడుదల కావాల్సి ఉంది. – బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ ఎంపీ కేసీఆర్ పథకాలను ఫాలో అయిన కేంద్రం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లాభం జరుగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎకరానికి, ఫసల్కు రూ.5వేలు ఇస్తున్నం. కేంద్రం మాత్రం రెండున్నర హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు రూ.6వేల చొప్పున ఇచ్చేలా బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సంస్కరణలు చేపట్టాం.. సంక్షేమం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నరు. కానీ నల్లధనం ఎంత మేరకు వెనక్కి తీసుకువచ్చారో... నోట్ల రద్దు తర్వాత ఎన్ని డబ్బులు తిరిగి వచ్చాయో చెప్పలేని పరిస్థితి. అయితే సంక్షేమం అని చెప్పి తెలంగాణ మోడల్ మొత్తం తీసుకున్నరు సంతోషం. – కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ ఓట్ల కోసమే మభ్యపెట్టే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకే చేసిన ప్రయత్నంగా కనబడుతోంది. నాలుగున్నరేళ్లుగా రైతాంగం సమస్యలపై ఊసేత్తని బీజేపీ సర్కార్ ఒక్కసారిగా రైతుల కోసం ఎకరాకు రూ.6వేలు అంటూ వరాలు కురిపించడం రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని అర్థమవుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక వంటనూనె, చక్కెర, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. ఈ దిగుమతులు వ్యవసాయరంగ సంక్షోభాన్ని తెలుపుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడితే మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. –కటుకం మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు సామాన్యులకు లాభం లేదు.. ఇది ఓట్ల బడ్జెట్ మాత్రమే. దీంతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రూ.6వేలు మూడు విడతలుగా చెల్లించడం కంటి తుడుపు మాత్రమే. ఉద్యోగాలివ్వడంలో విఫలమయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీ సర్కార్పై ప్రజలు సర్జికల్ స్ట్రయిక్ చేస్తారు. –అంబటి జోజిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు -
కిసాన్.. ముస్కాన్!
సాక్షి వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తుండిపోయేలా వరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలోనే సమ్మాన్ నిధి పేరుతో రెండు హెక్టార్లు (5 ఎకరాలు) ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. రైతులకు మేలుచేసే బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ శుక్రవారం ఉదయం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినవిషయం విధితమే. ఈ బడ్జెట్ ఇన్నాళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఊరటనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేలు అందిస్తోంది. మరో అడుగు ముందుకేస్తూ ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం తరహాలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్లో 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే ఏడాదికి మూడు పర్యాయాలు రెండు ఎకరాల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. రైతుబంధు స్ఫూర్తితో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారివారి రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంలో రైతుబంధు పథకం కీలకంగా మారింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా అధిక శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు. కిసాన్కు సమ్మాన్ ఎన్నికల ముందు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల మద్దతు పొందడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఎకరానికి రూ.6 చొప్పున సంవత్సరంలో మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఐదు ఎకరాలున్నవారికే.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం జిల్లాలో 1,52,621 మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో 1,21,839 మంది రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రూ.125 కోట్ల 16 లక్షలను పంపిణీ చేశారు. అదే రబీ సీజన్లో 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 85,944 , రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులు 31,474 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులే అర్హులుగా ప్రకటించగా నిజానికి జిల్లాలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. 4 హెక్టార్లలోపు భూమి ఉన్న వారు 15,557 మంది, 10 హెక్టార్ల లోపు ఉన్న వారు 4,002 మంది, 10 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న వారు 350 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతోంది. నాగర్కర్నూల్ జిల్లాలో.. జిల్లాలో ఒక హెక్టారు భూమి ఉన్న రైతులు 1,42,416 మంది ఉన్నారు. అలాగే రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు 67,658 మంది ఉన్నారు. అదేవిధంగా 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతుల 33,672 , 4 నుంచి 10 హెక్టార్లలోపు 8563 మంది, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 841 మంది రైతులు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో... ఒక హెక్టారు 1,80,328, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 77,611 మంది, 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 38,264, 4 నుంచి 10 హెక్టార్లలోపు 11,618, 10 హెక్టార్లకు పైగా ఉన్న వారు 1263 మంది ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో.. ఈ జిల్లాలో ఒక హెక్టారు ఉన్న రైతులు 76,414 మంది, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 39,038 మంది ఉన్నారు. అలాగే నాలుగు హెక్టార్ల లోపున్నవారు 20,267 మంది, 4 నుంచి 10 హెక్టార్లలోపు 6,026, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 620 మంది రైతులు ఉన్నారు. -
వైఎస్ అభయహస్తం బాటలో కేంద్ర పింఛన్ పథకం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అమలు చేసిన ఒక పథకానికి అచ్చుగుద్దినట్టు అలానే ఉండే పథకాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి డ్వాక్రా మహిళలందరికీ 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఎంతో కొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం తీరునే ఇప్పుడు దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన మహిళలు సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అనేక అంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకు రాగా వారి కోసం అభయహస్తం పేరుతో పింఛన్ల పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ పేరున ఏడాదికి రూ.365 చొప్పున చెల్లిస్తుంది. మహిళ వాటా, ప్రభుత్వ వాటా రెండు కలిపి ప్రభుత్వమే ఆ డబ్బులను ఎల్ఐసీ వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీంలో పెట్టుబడిగా పెడుతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి పింఛన్లు చెల్లిస్తోంది. సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ.500 నుంచి రూ.2,600 మధ్య పింఛను చెల్లించాలి. మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పు ఇవ్వడం.. ఒక వేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే బీమాగా కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేయడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 34 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో 3,21,703 మంది ఈ పథకం ద్వారా ప్రతి నెలా ప్రస్తుతం పింఛన్లు అందుకుంటున్నారు. వైఎస్ ముందు చూపుతో ఆనాడే ఆదర్శ పథకం అసంఘటిత కార్మికుల కోసం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో సభ్యులుగా చేరిన వారు ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది అభయహస్తం పథకానికి అచ్చుగుదినట్టుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో ఇలాంటి విన్నూత పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అవి దేశానికి ఆదర్శంగా మారాయని అంటున్నారు. అయితే, అభయహస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న అభయహస్తం’ అని పేరు మార్చిందే గానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మంది డ్వాక్రా మహిళలకు పింఛన్ల లబ్ధి కలిగేలా చేయడానికి మాత్రం అసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది. -
ఏపీకి తీరని అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్ట ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరును బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్యాయం చేసింది కేవలం ఈ ఒక్క బడ్జెట్లో మాత్రమే కాదని, గత నాలుగేళ్లు బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ ఆమోదించిన నాలుగు బడ్జెట్లలో జరిగిన అన్యాయమే పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశంలో 2018 నాటికి బ్యాంకులకు రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిలు ఉంటే.. 25 శాతం కూడా రికవరీ చేయని దుస్థితి నెలకొందన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థలో చెలామణిలోకి రాని నల్లధనం రూ.70 లక్షల కోట్లు ఉంటే.. రూ.1.3 లక్షల కోట్లు పన్నుల రూపంలోకి తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అంటున్నారని, అయితే ఇందులో 30 శాతం పన్ను, 30% పెనాల్టీ పోనూ వచ్చింది కేవలం 50% నుంచి 60% ఆదాయం మాత్రమే అన్నారు. మొత్తంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయడంతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. -
ఏపీకి మళ్లీ మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఇక చట్టబద్ధమైన హామీల ప్రస్తావనగానీ, ప్రత్యేక హోదా ఊసుగానీ ఈ బడ్జెట్లో లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. అలాగే 2019–20కి కూడా ఈ పద్దు కింద నిధులు కేటాయించ లేదు. పూర్తిస్థాయి బడ్జెట్లో జాతీయ సంస్థలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొన్ని జాతీయ సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీలో కలిపి చూపారు. ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును – 0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి. -
బడ్జెట్ తయారీ ఇలా..
బడ్జెట్ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో ఓ లుక్కేయండి! సెప్టెంబర్లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్కు కేటాయిస్తుంది. అక్టోబర్లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్ ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ బడ్జెట్కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ఫోన్ ట్యాపింగ్ బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. మూడో కన్ను.. ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ప్రత్యేకం బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుం డా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆహారంపైనా.. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ఫిబ్రవరి 1న.. ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు. బడ్జెట్ లీక్.. పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్ కావడంతో అప్పట్నుంచీ మింట్రోడ్లోని సెక్యూరిటీ ప్రెస్కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. -
సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించి 2018–19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు. డీవోపీటీకి 241 కోట్ల నిధులు న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎస్టీమ్), ముస్సోరీలో లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ (క్యాట్)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్లో ప్రకటించారు. పర్యావరణానికి రూ.3,111 కోట్లు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిశాంత్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు. లోక్పాల్కు, సీవీసీకి అంతంతే న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్పాల్కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్పాల్కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు. సీబీఐకి రూ.777 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్లాండ్ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, నకిలీ ఎన్కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జతిన్ మెహతా, మెహుల్ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది. -
రోడ్ల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి
న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని పీయూష్ గోయల్ చెప్పారు. వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ ఉవ్విళ్లూరు తోందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ చారిత్రకమైనదని రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్వాగతించారు. దీని ద్వారా 40–50 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులపై తాజా బడ్జెట్లో గోయల్ ప్రస్తావించిన విషయాలు.. ► రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్–విద్యుత్ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ► ఢిల్లీ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్లలో ఏళ్లుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ► రోడ్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు కేటాయించారు. ► బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరుకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది. ► కోల్కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది. ► రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది. ► సిక్కింలోని పాక్యాంగ్ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది. ► స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం: 64,587కోట్లు రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ: 1,58,658 కోట్లు ► అరుణాచల్ప్రదేశ్లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి. ► ఈ మేరకు ఈశాన్య భారత్లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి. ► వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ► 15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. ► ఈసారి పీఎంజీఎస్వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు. ► 2014–18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు. -
దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాలకు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్డీ తీసుకున్నారని అర్థమవుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న నాయకులతో ప్రతిపక్ష నేత హైదరాబాద్ లోటస్పాండ్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘ఈ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన లేదు. ముఖ్యమంత్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో దానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ’ అని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను వదిలేసి లేని ప్యాకేజీకి ఊకొట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఇదే అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానాలు చేయించాడని గుర్తు చేశారు. ఆ రోజు మేం ఇది తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నల్లచొక్కాలతో వస్తే.. మమ్మల్ని సభలో నానా మాటలు అని ఈరోజు చంద్రబాబు నల్లచొక్కాలు వేసుకొచ్చారని జగన్ మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తినందుకు తమ ఎమ్మెల్యేలపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారని, ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తుంటే, 2016 సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో మాట్లాడ్డానికి తనకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని జగన్ గుర్తు చేశారు. ఈరోజు ఎవరూ లేకుండా చూసి అసెంబ్లీలో చంద్రబాబు భారీ డైలాగులు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదు. 2017 జనవరి 27న ఇదే వ్యక్తి ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంతకంటే ఏ రాష్ట్రానికి ఇచ్చారో చెప్పండి అంటూ వరుసగా నాలుగు సంవత్సరాలు కేంద్రం ఏపీకి అద్భుతంగా సహాయం చేసిందని ఇదే చంద్రబాబు చెప్పారు. హత్యచేసిన వాడే ఆ హత్యకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు డైలాగుల్ని చూసినా అలాగే ఉంది. నాలుగేళ్లపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. వాళ్లు ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే.. ఏమీ మాట్లాడరు. ఆ మంత్రులు దిగిపోతూ ప్రెస్మీట్ పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చెప్పారు. నాలుగేళ్లుగా ఏ బడ్జెట్ను కూడా చంద్రబాబు గాని, కేంద్రంలోని ఆయన మంత్రులు గానీ వ్యతిరేకించలేదు. విశాఖ మెట్రో రైల్కు రూ.1 లక్ష రూపాయలు ఇచ్చినా, పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోయినా చంద్రబాబు జై కొట్టారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటారు? ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్దిగా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ గుణపాఠం తప్పదు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
రాష్ట్ర రైతులకు కేంద్రం ‘పెట్టుబడి’ 2,824 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకం కింద తెలంగాణలో 47.08 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు రూ. 2,824 కోట్ల పెట్టుబడి సాయం పొందనున్నారు. ఆయా రైతులందరికీ రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో (ఏటా రూ. 6 వేలు) వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. ప్రస్తుత రబీ సీజన్కు అంటే గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తున్నందున ఈ ఏడాది మార్చి నాటికి రైతులకు డబ్బు జమ అవుతుందని భావిస్తున్నారు. అందుకు అవసరమైన రైతు బ్యాంకు ఖాతా నంబర్లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులకు ప్రయోజనం... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం వల్ల రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం రైతుల సంఖ్య 57.24 లక్షలుకాగా అందులో ఐదెకరాల లోపున్న సన్న, చిన్నకారు రైతుల సంఖ్య 47.05 లక్షలుగా (అంటే 90 శాతం మంది) ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో అత్యధికంగా ఎకరం లోపు భూమి ఉన్నవారు 14.86 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సన్న, చిన్నకారు రైతుల చేతిలో 95.59 లక్షల ఎకరాలు (అంటే 68.05 శాతం) ఉంది. ‘రైతుబంధు’ఆదర్శంగా... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అమలు చేయడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రైతుల బ్యాంకు ఖాతాలు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని, కాబట్టి సార్వత్రిక ఎన్నికల నాటికి రైతు బ్యాంకు ఖాతాలను సేకరించి ఇవ్వడమనేది సులువైన వ్యవహారం కాదని చెబుతున్నారు. లక్ష్యం ఒకటే అయినా ... రాష్ట్రం అమలు చేస్తున్న రైతుబంధు పథకం, కేంద్రం తెచ్చిన పెట్టుబడి సాయం పథకం లక్ష్యం రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే అయినప్పటికీ వాటి అమలు మాత్రం వేర్వేరుగా ఉంది. తెలంగాణలో రైతుబంధు కింద ప్రస్తుతం ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తుండగా కేంద్రం ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే ఏటా రూ.6 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ లెక్కన ఐదెకరాలున్న ఒక రైతు.. రైతుబంధు ద్వారా ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.40 వేలు పొందితే కేంద్ర పథకం ద్వారా రెండు సీజన్లకూ కలిపి రూ.6 వేలే పొందుతాడు. దీనిపై పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో రైతుబంధు కింద అన్ని వర్గాలూ పెట్టుబడి సాయం పొందుతుండగా మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకంతో ఇప్పుడు సన్న, చిన్నకారు రైతులకే అదనంగా కేంద్ర సాయం అందనుందని వ్యవసాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి అమలు చేస్తే కేంద్రానికి పేరు రాదన్న భావనతోనే విడిగా అమలు చేస్తున్నారంటున్నారు. తెలంగాణ ఊసే లేదు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రైతుబంధు తరహాలో ఐదెకరాలలోపు రైతుకు ఏటా రూ.6 వేల చొప్పున సాయాన్ని ప్రకటించింది. ఈ ఒక్క విషయంలోనే తెలంగాణ చర్చకు వచ్చింది తప్ప బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ప్రస్తావనే లేదు. ఏపీ, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ అంశంలో తప్ప మరెక్కడా తెలంగాణ ప్రస్తావన రాలేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఏపీకి, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. 2019–20కి కూడా నిధులు కేటాయించలేదు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, పలు జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని కొన్ని పద్దుల్లో చూపారు. తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్కు నిధుల ప్రస్తావన ఈ బడ్జెట్లో కనిపించలేదు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేదు. కేంద్ర పన్నుల్లో వాటా ఇలా.. తెలంగాణకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే మొత్తం (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం దక్కింది. ఇది రూ.20,583.05 కోట్లకు సమానం. గత ఏడాదికంటే దాదాపు రూ.2,022 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.6,665.84 కోట్లు, ఆదాయ పన్ను రూ.5,600.58 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,229.45 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.1,293 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.794 కోట్లు ఉన్నాయి. 2014–15తో పోల్చితే ఇప్పుడు కేంద్ర పన్నుల్లో వచ్చే వాటా రెట్టింపు కావడం విశేషం. -
స్త్రీ, శిశు.. సంక్షేమానికి 20 శాతం అధిక నిధులు
న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్ ప్రసంగంలోకానీ, విజన్ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్జీవోలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రధాన కేటాయింపులు ► ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు. ► ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం. ► జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్ఎన్ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు. ► శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల. ► బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల. ► అంగన్వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు. ► నేషనల్ క్రెచ్ స్కీమ్కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు. ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు. ► మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు. ► ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. ► మహిళా సాధికారత, సశక్తిత మిషన్కు బడ్జెట్ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల. ‘ఆమె’కోసం రూ.1,330 కోట్లు న్యూఢిల్లీ: మహిళల రక్షణ, సాధికారతకోసం బడ్జెట్లో రూ.1,330 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్కన్నా ఈ మొత్తం రూ.174 కోట్లు అధికమని శుక్రవారం లోక్సభలో ఆయన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత నాలుగేళ్లుగా మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ‘మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి’సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతంపైగా మహిళలు ఉన్నారని, సులువైన రుణ పద్ధతి ద్వారా వారు స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారని గోయల్ చెప్పారు. అలాగే 26 వారాల ప్రసూతి సెలవుల ద్వారా మహిళలకు ఉపాధిలో ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య ఆరుకోట్లు దాటిందని, మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
పాతపని పూర్తిచేసేందుకే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో పెండింగ్లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే కేంద్రం ఎక్కువ ఆసక్తి చూపించింది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. పాత వాటికి నిధుల కేటాయింపునకే పెద్దపీట వేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాజీపేట డివిజన్ హోదా, వట్టినాగులపల్లి టెర్మినల్ నిర్మాణం తదితర డిమాండ్లు ఈ బడ్జెట్లోనూ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. కాజీపేట–బల్లార్షా మూడో లైనుకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. మరోవైపు అక్కన్నపేట–మెదక్ రైలు మార్గం ఈఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్కు మార్గంలోనూ మనోహరాబాద్–గజ్వేల్ వరకు ట్రయల్ రన్కు అధికారులు సిద్ధమవుతుండటం శుభసూచకం. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు. కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు.. 1. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు 2. మునీరాబాద్–మహబూబ్నగర్ మార్గానికి రూ.275 కోట్లు 3. భద్రాచలం–సత్తుపల్లి లైన్కు రూ.405 కోట్లు 4. కాజీపేట–బల్లార్షా మూడో లైన్కు రూ.265 కోట్లు 5. సికింద్రాబాద్–మహబూబ్నగర్ డబ్లింగ్కు రూ.200 కోట్లు 6. కాజీపేట–విజయవాడ మూడోలైన్కు రూ.110 కోట్లు 7. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రూ.20 కోట్లు 8. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్కు రూ.5 కోట్లు 9. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్షాప్కు రూ.10 కోట్లు 10. మౌలాలిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు తీరని కలలు... 1980 నుంచి తీరని కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈసారి కూడా మోక్షం దక్కలేదు. కాజీపేటను డివిజన్గా మార్చాలన్న డిమాండ్, లాలాగూడలో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న డిమాండ్ ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి, వట్టినాగులపల్లి టెర్మినళ్ల నిర్మాణం ఇంకా సాకారం కావడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నందునే ఇది ఆలస్యమవుతోంది. ఈ సర్వే పనులకు టెండర్లు పిలుస్తారా? 1. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ 95 కిలోమీటర్లు 2. నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రూ.125 కోట్లు 3. కరీంనగర్–హుజూరాబాద్–ఎల్కతుర్తి: 60 కిమీ ‘ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ’ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఓట్ల కోసమే పెట్టినట్టుందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలను వదిలి వ్యాపారుల మన్ననలు పొందేలా ఉన్న ఈ బడ్జెట్తో బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోమారు తేలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్లో ఏఐసీసీ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నును మినహాయించినట్టు ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. బడాబాబులకు ఐటీ తగ్గించి పేదలను పట్టించుకోకుండా అంకెలు చూపెట్టారని, మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదింపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రచారం మాదిరిగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా గతంలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధర, ఈనామ్ లాంటివన్నీ విఫలమవడంతో ఇప్పుడు కొత్తగా రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ముందుకొచ్చారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు మంచిదని పేర్కొన్నారు. అయితే, దీన్ని గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్నికల కోణంలో ఉందన్నారు. -
ఆరోగ్యం..ఆయుష్మాన్!
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6,400 కోట్లను ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం. ఇతర విశేషాలు.. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు. ► ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు. ► జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు. ► ఎన్హెచ్ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1,844 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ► ఎయిడ్స్, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం. ► ఎయిమ్స్కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు. ► జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు. ► కేన్సర్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు. ► టెర్షరీ కేర్(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు. ► నర్సింగ్ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు. ► ప్రభుత్వ మెడికల్ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు. ‘ఆయుష్మాన్’తో 3 వేల కోట్లు ఆదా: పీయూష్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటిదాకా ఉచితంగా వైద్యం చేయించుకున్న సుమారు 10 లక్షల మంది పేదలు రూ.3 వేల కోట్లను ఆదాచేసుకున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చౌక ధరలకే ఔషధాల్ని అందిస్తోందని, గుండెలో అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపుతో లక్షలాది మంది పేదలు ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, అందులో 14 ఆసుపత్రుల్ని ఎన్డీయే ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. పేదలకు ఆరోగ్య సేవల్ని చేరువచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉటంకిస్తూ..2030 నాటికి ఎలాంటి అవాంతరాలు లేని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాంటి ఆరోగ్య భారత నిర్మాణంలో మహిళలనూ సమాన భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు. దీర్ఘాయుష్మాన్ భవ... ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం నోచుకోని పల్లెలున్న భారతమిది. ఇక్కడ నిరుపేదకు సుస్తీ చేస్తే చావే శరణ్యం. కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని సాకారం చేసే సార్వత్రిక ఆరోగ్య బీమానిచ్చే ఏ పథకాన్నయినా దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించాల్సిందే. కాకపోతే గత బడ్జెట్లో ప్రకటించి ఊరుకున్నారు. ప్రయోగాలకే పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికలొస్తున్నాయి కనక పూర్తి స్థాయి కేటాయింపులు చేస్తూ... వెల్నెస్ సెంటర్ల నుంచి ఎయిమ్స్ దాకా పూర్తిస్థాయి వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చే విజన్నూ ఆవిష్కరించారు. ఏ ప్రభుత్వమున్నా ఆ విజన్ సాకారం కావాలన్నదే నిరుపేదల ఆకాంక్ష. ఎందుకంటే వారికి కావాల్సింది వైద్యం మరి. -
వార్షికాదాయం 9 లక్షలు దాటినా పన్ను లేదు!
సాక్షి బిజినెస్ డెస్క్: ఈ బడ్జెట్లో సెక్షన్ 87–ఏ కింద లభించే పన్ను రిబేటును పెంచడంతో చిన్న వేతనజీవుల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతోంది. ఈ రిబేటుతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర పన్నుమిన హాయింపులను కూడా పూర్తిగా వినియోగిం చుకుంటే రూ.10 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో రూ.3.50 లక్షలలోపు పన్ను ఆదాయంపై రూ.2,500 పన్ను రిబేటు లభించేది. ఇప్పడు ఈ రిబేటును రూ.5 లక్షల పన్ను ఆదాయంపై రూ.12,500కు పెంచారు. ఇప్పుడు వీటికి అదనంగా సెక్షన్ 80–సీ కింద లభించే రూ.1.50 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2,00,000, ఎన్పీఎస్కు చెల్లించే రూ.50 వేలు పన్ను మినహాయింపులను వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం వచ్చేవారు కూడా ఒక్క రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పన్ను ఆదాయం (టాక్సబుల్ ఇన్కమ్) రూ.5,00,000 కన్నా ఒక్క రూపాయి దాటినా ఈ రిబేటు వర్తించదు. అప్పుడు ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను లెక్కించి చెల్లించాల్సిందే. ఈ రిబేటును పెంచడంతో వార్షిక ఆదాయం రూ.5.50 లక్షలలోపు ఉన్న వారు ఎటువంటి పొదుపు చేయాల్సిన అవసరం లేకుండానే పన్ను భారం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5 లక్షల వార్షికాదాయం గలవారికి నేరుగా రూ. 12,500 మేర రిబేటు లభిస్తుందని, దీంతో వారిపై పన్ను భారం ప్రసక్తి ఉండదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి మాత్రం ’పాత’ పన్ను రేట్లు యథాప్రకారం కొనసాగుతాయన్నారు. అయితే పీపీఎఫ్, జీపీఎఫ్, బీమా పథకాలు, మొదలైన వాటిల్లో రూ. 1.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో రూ. 6.5 లక్షల వార్షికాదాయ వర్గాలూ పన్ను రిబేటు ప్రయోజనాలు పొందవచ్చని సుశీల్ వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంచడంతో వేతన జీవులకు మరో రూ. 10 వేల మేర అదనపు ప్రయోజనమూ లభిస్తుందన్నారు. దీంతో సుమారు 3 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందగలరన్న సుశీల్ చంద్ర.. ఖజానాకు మాత్రం రూ. 4,700 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందన్నారు. రూ. 5 లక్షల దాకా ఆదాయవర్గాలకు రిబేట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 18,500 కోట్ల దాకా ఆదాయం పోతుందన్నారు. -
మినహాయింపు ఎన్నికల తర్వాతే..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు డీమానిటైజేషన్ సహా నల్లధనం కట్టడికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో బయటకు వెల్లడించని రూ.1.30 లక్షల కోట్ల ధనం పన్ను పరిధిలోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.‘‘నల్లధన నియంత్రణ చట్టం, పరారీలో ఉన్న నేరస్తుల చట్టం, డీమోనిటైజేషన్ వంటి నిర్ణయాలు రూ.1,30,000 కోట్లను పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. రూ.50,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఈ కాలంలోనే రూ.6,900 కోట్ల మేర బినామీ ఆస్తులు, రూ.1,600 కోట్ల మేర విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. 3,38,000 షెల్ కంపెనీలను గుర్తించి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు ఆ కంపెనీల డైరెక్టర్లను డిస్క్వాలిఫై చేశాం’’ అని మధ్యంతర బడ్జెట్లో భాగంగా మంత్రి చెప్పారు. ఎన్నికల తర్వాత అధికాదాయ వర్గాల వారికి కూడా పన్ను మినహాయింపు లుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సంకేతమిచ్చారు. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రూ.ఐదు లక్షల ఆదాయం దాటిన వారికి పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేక పోయామని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో వీరికి ప్రయోజనం కల్పిస్తామని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో కొన్ని పరిమితులున్నాయని, దీంతో అన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం రాగానే పన్ను ప్రణాళికల గురించి ఆలోచించే మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నికల వరకు ఆగకుండా ఇప్పుడే ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆదాయ పన్ను విభాగం పూర్తిగా ఆన్లైన్ విధానంలో పనిచేస్తోందని, గతేడాది 99.54% రిటర్నులు ఆన్లైన్ ద్వారానే వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో రిటర్నుల స్క్రూట్నీ కూడా మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 85శాతం ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో 85 శాతం మంది పన్నుచెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2019–20 తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదించిన విధానాలు, రాయితీలతో మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, పేదవర్గాలు లబ్ధి పొందుతారని ఓ టీవీ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ కాదు. నాలుగున్నరేళ్లుగా మేం ఈ అంశాలపై నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం’అని మంత్రి అన్నారు. ప్రధాని చెబుతున్నట్లు ‘అందరితో కలిసి అందరికీ ప్రగతి ఫలాలు’ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, మత్స్య, పశుపోషణ రంగాల్లో పనిచేసే వారందరి కోసం ఈ బడ్జెట్ను రూపొందించాం. మధ్య తరగతి కొనుగోలు శక్తి పెరగడానికి, వస్తు, సేవల వినియోగం, అభివృద్ధికి కృషి చేశాం’ అని ఆయన వివరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి మొత్తం 22 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామంటూ మంత్రి.. ఇది కాకుండా పేద రైతులకు ఏటా రూ.6 వేల కోట్ల మేర మేలు చేకూరుస్తున్నట్లు తెలిపారు. -
మిడిల్ క్లాస్ మోదీ..
మధ్య తరగతికి.. మహా ఊరట! ఇది..ముచ్చటగా 3 కోట్ల మందిపై ప్రధాని వేసిన సమ్మోహనాస్త్రం. ఏడాదికి 5 లక్షల రూపాయల్లోపు ఆదాయాన్ని ఆర్జించేవారు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. వీరేకాదు.. రకరకాల మినహాయింపులు, ఇన్వెస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 8–9 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా పైసా పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చు. కాకపోతే ఏడాదికి దాదాపుగా రూ.10 లక్షలు, ఆపైన ఆర్జించేవారికి మాత్రం ఈ బడ్జెట్తో ఒరిగిందేమీ లేదు. అందుకే కావచ్చు.. ఈ ఏడాదికి తాము ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ వర్గాల గురించీ ఆలోచిస్తామన్నారు గోయల్. న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ప్రధాని మోదీ మిడిల్ క్లాస్ వేతన జీవుల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. పన్ను శ్లాబులను మార్చకుండా వారికి ఉపశమనం కల్పించారు. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.5 లక్షలలోపు ఉంటే.. వారెలాంటి పొదుపులూ చేయకపోయినా పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ మేరకు సెక్షన్ 87ఏ కింద ఇస్తున్న రిబేటును రూ.2,500 నుంచి రూ.12,500కు పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెక్షన్ 87ఏ రిబేటు పరిమితి రూ.3.50 లక్షలుండగా దీన్ని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్కమ్) ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గోయల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాక లోక్సభ కొన్ని నిమిషాల సేపు బీజేపీ కార్యవర్గ సమావేశం మాదిరిగా మారిపోయింది. ఎన్డీఏ ఎంపీలంతా మోదీ... మోదీ అంటూ సభను మార్మోగించారు. ఈ రిబేటు పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల మంది ఉద్యోగులకు రూ.18,500 కోట్ల మేర పన్ను భారం తగ్గుతుందని గోయల్ ప్రకటించారు. అంతేకాదు సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల మినహాయింపు, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీ, ఆరోగ్య బీమా ప్రీమియం వంటి ఇతర మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం ఉన్న వారూ పన్ను కట్టక్కర్లేదు. అయితే ట్యాక్సబుల్ ఇన్కమ్ కనక రూ.5 లక్షలకన్నా రూపాయి దాటినా.. వారు మునుపటిలానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా అమలు చేసిన సంస్క రణలు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల ఆదాయం పెరిగిందని, ఈ ప్రయోజనాన్ని తిరిగి వారికి అందించాలని ఉన్నా ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో వేతనజీవుల వరకు మాత్రమే పరిమితమవుతున్నామని గోయల్ స్పష్టం చేశారు. బేసిక్ లిమిట్లో మార్పు లేదు... బడ్జెట్ ప్రసంగంలో గోయల్ రూ.5 లక్షలలోపు వారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించడంతో అందరూ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు భావించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం... పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని, కేవలం సెక్షన్ 87 రిబేటు పరిమితిని రూ.3,50,000 నుంచి రూ.5,00,000 మాత్రమే పెంచామని, మును పటి శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని వివరణ ఇచ్చింది. సెక్షన్ 87ఏ పరిమితిని పెంచడం వల్ల పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షలలోపు గనక ఉంటే... వారికి గరిష్టంగా రూ.12,500 ప్రయోజనం లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచడం వల్ల రూ.2,080 నుంచి రూ.3,120 వరకు ప్రయోజనం లభించనుంది. ఈ రెండింటిని కలిపితే గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరనుంది. రెండో ఇంటికీ ‘క్యాపిటల్’ గెయిన్స్ ఏదైనా ఇంటిని విక్రయించినపుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలను రెండు ఇళ్లకు వర్తింప చేస్తూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏదైనా ఒక ఇంటిని విక్రయించినపుడు దానిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ పన్ను భారాన్ని తప్పించుకోవాలంటే ఈ లాభాలతో మరో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇంతకాలం ఇది కేవలం ఒక ఇంటి కొనుగోలుకే వర్తించేది. ఇప్పుడు దీన్ని రెండు ఇళ్లను కొనుగోలు చేయడానికి అనుమతించారు. ఈ విధంగా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకూ వచ్చే మొత్తానికి దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు వర్తిస్తాయి. కాకపోతే ఈ ప్రయోజనాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా వేతన జీవులు ఉద్యోగార్థం ఒక ఇంటిలో ఉండి మరో ఇల్లు ఖాళీగా ఉంచినా దానిని ఊహాజనిత ఆదాయంగా లెక్కించి పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు రెండో ఇంటిని ఊహాజనిత ఆదాయం నుంచి మినహాయించారు. పెన్షన్దారులకు ఊరట కేవలం వడ్డీనే ఆదాయంగా ఉన్న వారికి మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద ఆదాయ పన్ను) పరిమితిని 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.10,000 దాటితే టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ టీడీఎస్ చెల్లించకూడదనుకుంటే... తమ మొత్తం ఆదాయం పన్ను పరిమితికి లోబడే ఉందని నిర్ధారిస్తూ బ్యాంకుకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే రూ.40,000 దాటేదాకా ఎలాంటి టీడీఎస్ ఉండదు. డిక్లరేషన్ అవసరం లేదు. అదే విధంగా ఇంటి అద్దెల రూపంలో వసూలు చేసే మొత్తంపై కూడా టీడీఎస్ పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు ఇంటద్దెల రూపంలో వచ్చే ఆదాయం ఏడాదికి రూ.1.80 లక్షలు దాటితే (నెలకు రూ.15వేలు) టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.2.40 లక్షలకు (నెలకు రూ.20 వేలకు) పెంచారు. -
విదేశాంగశాఖకు రూ.16 వేల కోట్లు
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. గత బడ్జెట్లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. మాల్దీవులకు సాయం రూ.125 కోట్ల నుంచి రూ.575 కోట్లకు పెరిగింది. భూటాన్కు సాయం గత ఏడాది రూ.2,650 కోట్లు కాగా ఈసారి రూ.2,615 కోట్లకు తగ్గించింది. అఫ్గానిస్తాన్కు రూ.325 కోట్లు, బంగ్లాదేశ్కు రూ.175 కోట్లు, శ్రీలంకకు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.5 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. నేపాల్కు రూ.700 కోట్లు కేటాయించారు. -
వ్యవసాయం గట్టెక్కించేనా?
అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 184 రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు దిగడంతో రైతన్నల ఆగ్రహజ్వాలలు ఢిల్లీ పీఠాన్ని తాకాయి. ఇటీవల హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయానికి అన్నదాతల ఆగ్రహమే కారణమని నిర్ణయానికొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలపై అధ్యయనం చేసి, చివరికు తెలంగాణ,ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెట్టుబడి సాయమే మంచిదన్న నిర్ణయానికొచ్చింది. కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాల జల్లులు కురిపిస్తూ ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కానీ దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకమే. – సాక్షి, హైదరాబాద్ వ్యవసాయ సంక్షోభం ఎలా ఉందంటే.. - మన దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా, 2016–17 నాబార్డ్ ఆర్థిక సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై రూ.1.04 లక్షల అప్పు భారం ఉంది. - దేశం మొత్తం మీద 52శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయినట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఒ) వెల్లడించింది. - రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 92.9శాతం మంది రైతులు రుణగ్రస్థులు కాగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ (89.1%), తమిళనాడు (82.5%) ఉన్నాయి. - ప్రభుత్వ పథకాలపై 64 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నట్టు సీఎస్డీఎస్ అధ్యయనంలో తేలింది. - సాగు కమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోవడం, ఎకరా, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతుల సంఖ్య పెరగడంతో వారు బేరమాడేశక్తిని కోల్పోతున్నారు. దీంతో దళారులు చెప్పే «ధరకే పంటని అమ్ముకుంటున్నారు. - పంటల ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదు. - గోదాములు, శీతల గిడ్డంగుల కొరతతో పంట ఉత్పత్తులు తొందరగా చెడిపోవడం కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది. - డీజిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనంతో ఎరువుల ధరలు ఎగబాకడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. - ప్రత్యామ్నాయ మార్గాలుంటే వ్యవసాయ రంగాన్ని వదులుకోవాలని సుమారు 40 శాతం రైతులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణంలో 40 శాతం వాటా.. ద్రవ్యోల్బణానికి, వ్యవసాయాదాయానికి మధ్య మౌలికంగా కొంత వైరుధ్యం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వినిమయ ధరల సూచి (సీపిఐ)లో 40% వరకు ఆహార పదార్థాలే ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దేశ ద్రవ్యవిధానంలో కీలకమైన అంశం. ద్రవ్యోల్బణం తగ్గడం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వ్యవసాయాదాయాన్ని నియంత్రించడం మంచిది కాదు. విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ–ఆర్థిక సమస్య ఇది. సాయం కంటితుడుపేనా? 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ పెట్టుబడి సాయం రూపంలో తాయిలాలు ప్రకటించింది. భారత్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య 50 శాతానికి పైనే అయినా, ఆ రంగం నుంచి వస్తున్న స్థూల జాతీయోత్పత్తి అంతకంతకు తగ్గిపోయి 17–18 శాతానికి చేరుకుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఆహార ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేయడం కంటి తుడుపు చర్యేనన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పిం చడం, వ్యయ భారాన్ని తగ్గించడం, పంట నిల్వ వసతుల్ని మెరుగుపరచడం లాంటి వాటిపై దృష్టి సారించాలి. రాష్ట్రాల వారీగా అక్కడున్న ఖర్చుల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించాలని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఐఐటీ, ఐఐఎంలకు నిధుల కోత
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లతోపాటు నియంత్రణ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపులను 2018–19తో పోలిస్తే కేంద్రం తగ్గించింది. 2019 విద్యాసంవత్సరం నుంచి జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం కోటా కల్పించి, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పెంచిన నేపథ్యంలో ఆయా సంస్థలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఐఐఎంలకు గత ఏడాది రూ.1,036 కోట్లు కేటాయించగా ఈసారి 59.9 శాతం కోతపెడుతూ 415.41 కోట్లు కేటాయించారు. ఐఐటీలకు గత ఏడాది రూ.6,326 కోట్లు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్లో రూ.6,223.02 కోట్లు కేటాయించారు. 2017–18లో ఐఐటీలకు రూ.8,337.21 కోట్లు ఇచ్చారు. యూజీసీకి గత ఏడాది 4,722.75 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు దాన్ని రూ.4,600.66 కోట్లకు తగ్గించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి గత ఏడాది 485 కోట్లు ఉంటే ఈసారి దాన్ని 466 కోట్లకు తగ్గించారు. మొత్తమ్మీద చట్టబద్ద నియంత్రణ సంస్థలకు గతఏడాదితో పోలిస్తే 2.70 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ సంస్థలకు రూ.5,066.66 కోట్లు ప్రతిపాదించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,207.75 కోట్లు కేటాయించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లకు ఈ బడ్జెట్లో రూ.660 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత ఏడాది రూ.689 కోట్లుగా ఉంది. -
షూటింగ్ కష్టాలకు తెర!
న్యూఢిల్లీ: సినిమా షూటింగ్లకు అనుమతుల జారీని సరళతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రకటించారు. పైరసీని అరికట్టేందుకు యాంటి క్యామ్కార్డింగ్ నిబంధనలు తెస్తున్నట్లు చెప్పారు. భారత్లో చిత్రీకరణ జరిపే విదేశీ సినిమాలకు మాత్రమే సింగిల్ విండో అనుమతుల జారీ విధానం ఉండగా ఇప్పుడు భారతీయ సినిమాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు గోయల్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. పైరసీని అరికట్టేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కామ్కార్డింగ్ను నిరోధించే నిబంధనలను పొందుపరుస్తామన్నారు. సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని, చిత్ర నిర్మాతలకు కూడా తాజా నిర్ణయం మేలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతుల జారీతో చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొన్నాయి. -
రైతుకు రొక్కం!
న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ రైతులపై వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ పథకం కోసం ఏటా 75 వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా రూ.2వేల ఆర్థిక సాయం ఈ ఏడాది మార్చి లోగా రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో ఈ పథకం కోసం రూ. 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు ఉత్తరాది కీలక రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అసంతృప్తే కారణమని విశ్లేషణలు వినిపించాయి. అందువల్లే రైతుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కేంద్రం ప్రకటించిందని విశ్లేషకులంటున్నారు. రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల వాతావరణ పరిస్థితులతో నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. రుణాలను సకాలంలో చెల్లించేవారికి 3 శాతం అధికంగా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా 2 శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతుల కోసం రూ.750 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులను చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా అందించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ పంటరుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైతులకు జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అందించే సహాయంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ఇచ్చే 3 శాతం ప్రోత్సాహాన్ని వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కూడా వర్తింపజేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహాన్ని రుణాలు రీషెడ్యూల్ చేసిన కాలం మొత్తానికి అందించనున్నట్లు గోయల్ వివరించారు. ‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లినపుడు రైతులు సహజంగానే తమ రుణాలను తిరిగి చెల్లించలేరు. అలాంటి రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నారు. వారికి రీషెడ్యూల్ చేసిన తొలి సంవత్సరం మాత్రమే 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేస్తున్నారు.’’ అని గోయల్ పేర్కొన్నారు. రాయితీతో కూడిన రుణాలను సులభంగా అందజేయడానికి, రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడానికి గాను ఒక పరిపూర్ణమైన ప్రక్రియను ప్రారంభించనున్నామని,ఇందుకోసం సులభంగా పూర్తిచేసే దరఖాస్తు ఫారాలను అందించనున్నామని తెలిపారు. పేద, భూమిలేని రైతులు ఉత్పాదక వ్యయాలను ఎదుర్కోవడానికి వారికి నిర్మాణాత్మక ఆదాయం అవసరమని తెలిపారు. సంచార తెగలను పైకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తామన్నారు. పెరిగిన కేటాయింపులు.. రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు 2019–20 మధ్యంతర బడ్జెట్లో పాడి రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఉపశమన చర్యలను ప్రతిపాదించారు. పశుసంవర్థక, మత్స్యకార రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్రకటించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,49,981 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు రూ. 86,602 కోట్లతో పోలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ రూ. 70,075 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరం రూ.74,986 కోట్లు. పేద రైతాంగానికి నిర్దిష్ట ఆదాయ సహాయాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి.. సాగులో ఆదాయం తగ్గిపోవడానికి చిన్న కమతాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం వంటి పలు కారణాలున్నాయని పేర్కొన్నారు. 12 కోట్లమందికి లబ్ధి.. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి, కూలీలు ఇంకా ఇతర అవసరాలు తీర్చడం కోసం రైతులకు పీఎం కిసాన్ పథకం ఉపకరిస్తుందని గోయల్ తెలిపారు. రైతు అప్పుల ఊబిలో చిక్కకుండా ఈ పథకం కాపాడుతుందని, ముఖ్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రక్షిస్తుందని మంత్రి వివరించారు. ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని, దాదాపు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని గోయల్ పేర్కొన్నారు. రైతులు సంపాదించడానికి, గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ పథకం దారి చూపుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అత్యంత నిరుపేద రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరడమే కాక, సాగు సీజన్కు ముందు అవసరమయ్యే అత్యవసర ఖర్చులకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గోకుల్ మిషన్కు నిధుల పెంపు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణ లక్ష్యం ఎంత అనేది ఆర్థిక మంత్రి వివరించలేదు. 2018–19లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.11 లక్షల కోట్లను దాటి రూ. 11.68 లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి గోయల్ తెలిపారు. రైతులకు రుణాలను అందుబాటులో ఉంచడం కోసం గత ఐదేళ్లలో వడ్డీ రాయితీని రెట్టింపు చేసినట్లు ఆర్థికమంత్రి వివరించారు. అందువల్లే 2018–19లో పంట రుణాలు రూ.11.68 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. రైతుల కష్టాలు తొలగించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి వివరిస్తూ.. మట్టి నాణ్యతా కార్డులు, నాణ్యమైన విత్తనాలు, నీటి పారుదల పథకాలు, ఎరువుల కొరత లేకుండా చూడడం వంటివాటి గురించి వివరించారు. పశుసంవర్థక శాఖ, మత్స్యకార రంగాలకు కూడా గణనీయమైన మద్దతు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగాల ప్రాధాన్యతను గుర్తించినందునే ఈ ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’కు నిధులను రూ.750 కోట్లకు పెంచినట్లు గోయల్ తెలిపారు. కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆవుల ఉత్పాదకతను పెంచడం, గో వనరుల వృద్ధికి అవసరమైన జన్యుపరమైన ప్రయోగాలను విస్తరించడం వంటి పనులను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. గో సంరక్షణ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయించడం కూడా ఈ వ్యవస్థ విధుల్లో భాగమే. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఫిషరీస్కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గోయల్ వెల్లడించారు. అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేసే దేశాలలో రెండో అతి పెద్ద దేశం భారతదేశమేనని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 6.3శాతమని మంత్రి వివరించారు. ఇటీవలి సంవత్సరాలలో చేపల ఉత్పత్తిలో సగటున 7శాతం వృద్ధి రేటు కూడా నమోదు చేశామని ఆయన తెలిపారు. 1.45 కోట్ల మందికి ఇది ప్రధాన జీవనాధారంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 50 శాతం ఎక్కువ ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నామని గోయల్ వివరించారు. చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రభుత్వం 22 పంటల కనీస మద్దతు ధరలు 50 శాతం పెంచిందని ఆయన తెలిపారు. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, చెరకు,పత్తి, ఇతర ఉద్యానవన పంటల ఉత్పత్తి భారీగా జరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని,దాంతో సరైన ఆదాయం రాక దేశంలోని అనేక ప్రాంతాల రైతులు పూర్తి నిస్పృహలో ఉన్నారని ఆర్ధికమంత్రి వివరించారు. తెలంగాణ, ఒడిశా పథకాలతో పోల్చలేం రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం కిసాన్’ పథకాన్ని వ్యవసాయ రంగ నిపుణులు స్వాగతించారు. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణలోనూ, ఒడిశాలోనూ కొనసా గుతున్న పథకాలతో పోల్చలేమని వారు వ్యాఖ్యా నించారు. ఆ రాష్ట్రాలలో రైతులకు ఇస్తున్న మొత్తం కన్నా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద ఇచ్చే మొత్తం చాలా తక్కువని పేర్కొంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం లేదా ఒడిశాలో అమలు చేస్తున్న కాలియా పథకం కన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం మొత్తం చాలా తక్కువని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ ఎంజేఖాన్ వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే రైతులకు ఆ ఫలాలు అందుతాయని ఇన్సెక్టిసైడ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ వ్యాఖ్యానిం చారు. ధరల పతనం, పెరుగుతుండే ఖర్చులు వంటి ఇబ్బందుల నుంచి రైతులను కాపాడడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని పీడబ్లు్యసీ ఇండియాకు చెందిన అజయ్ వ్యాఖ్యానించారు. రైతన్నల కష్టాలు తీరాలంటే వారు ఎదుర్కొన్న సమస్యలన్నిం టినీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది. ధరలు, పంట సేకరణ, పంపిణీల్లో సమస్యలకు సమష్టిగానే పరిష్కార మార్గాలు కనుగొనాలి. – ఎంఎస్ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త రైతులకు ప్రయోజనం కలిగించే బడ్జెట్: నాబార్డ్ ముంబై: కేంద్ర బడ్జెట్ను జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) స్వాగతిం చింది. వ్యవసాయ రంగంపై దృష్టి సారించిందని, బడ్జెట్ ప్రతిపాదనలతో చిన్న రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం తన పూర్తి స్థాయి బడ్జెట్ను రైతులకు మార్కెట్ అనుసంధాన వసతులు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, వాటి తయారీపై పెట్టొచ్చని నాబార్డ్ చైర్మన్ హెచ్కె భన్వాలా పీటీఐతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వడ్డీ రాయితీతోపాటు అనేక స్వాగత చర్యలున్నాయని అన్నారు. ప్రాథమిక ఆదాయ మద్దతుతో చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ రంగాలకు 5 శాతం వరకు వడ్డీ రాయితీని కల్పించడం వల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, వీటి అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.6,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని దీంతో విత్తనాలు, ఎరువులు, తదితరాల కొనుగోలుకు వినియోగించవచ్చన్నారు. అన్నదాత కరుణిస్తాడా? ఓట్ల కోసమైతేనేం.. చిన్న రైతుల ఖాతాల్లోకి నాలుగు నెలలకోసారి 2వేల రూపాయలు వచ్చిపడతాయి. అందరి ఆకలీ తీర్చే అన్నదాతకు.. ఇదేమీ కడుపు నింపేసేది కాకపోయినా.. విత్తనాలకోసం వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాల్సిన దుస్థితి తప్పుతుంది. ఐదెకరాల లోపు కమతాలున్న 12 కోట్ల మంది రైతులపై నరేంద్ర మోదీ విసిరిన అస్త్రమిది. వీరికి తొలివిడత మొత్తం కూడా ఈ ఏడాది మార్చి 31లోగా.. అంటే ఎన్నికల్లోగానే చేతికందుతుంది. దీంతో పాటు వైపరీత్యాల బారినపడ్డ రైతుల రుణాలకు వడ్డీ రాయితీని కూడా పెంచారు. మోదీ తీసుకున్న ఈ ‘జై కిసాన్’ నినాదం ఏ తీరానికి చేరుస్తుందో! దేశంలో 5 ఎకరాలలోపు భూములున్న రైతులు 12 కోట్ల మంది మార్చి 31లోగా ఇవ్వటానికి కేటాయించింది రూ.20వేల కోట్లు 2019–20 బడ్జెట్లో పూర్తి కేటాయింపులు రూ.75వేల కోట్లు -
దశావతారాలు!
పది లక్ష్యాలతో భారతదేశ దశ దిశలో మార్పు తెస్తామంటూ సార్వత్రిక ఎన్నికలవేళ మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్తో జనం ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వం పదిలక్ష్యాలను నిర్దేశించింది. బడ్జెట్ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్తో పునాదివేశారు. ఇది తాత్కాలికం కాదని ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పుకిది నాంది అని ప్రకటించారు. పది లక్ష్యాలతో దారిద్య్రం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత లాంటి రుగ్మతలను రూపుమాపి సరికొత్త భారతాన్ని నిర్మించడం, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రగతిపథంలో మున్ముందుకు సాగడమే ఈ ప్రభుత్వ ఉద్దేశమని పీయూష్ గోయల్ తెలిపారు. 1 మౌలిక సదుపాయాల మదుపు ప్రజా జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రోడ్లు, రైల్వే, సీపోర్టు, విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు వేయడం. దీనికోసం అధికంగా నిధులు కేటాయించింది. గ్రామసడక్ యోజనకింద రూ. 19 వేల కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించింది. 2 డిజిటల్ ఇండియా సరికొత్త ఆవిష్కరణలతో, నూతన కంపెనీల స్థాపన ద్వారా యువతకు ఉపాధికల్పన. దేశంలో లక్ష గ్రామాలను డిజిటల్ విలేజెస్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన. 3 హరిత భారతం ఇంధన అవసరాలకు విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి పెట్టి పర్యావరణానికి మేలు చేయడంతో హరిత భారత నిర్మాణానికి బాటలు వేసుకోవడం. 4 గ్రామీణ భారతానికి దన్ను గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి గ్రామీణ భారతాన్ని పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం. 5 నదుల ప్రక్షాళన మానవాళికి ప్రధానాధారమైన జలవనరులను కాపాడుకోవడానికీ, భారత ప్రజలందరికీ పరిశుభ్రమైన, రక్షిత మంచినీటిని అందుబాటులోకి తేవడానికి నదులను ప్రక్షాళన చేయడం. 6 సముద్రాలను జయిద్దాం రాబోయే పదేళ్లలో సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి పరచడం. సముద్ర ఆధారిత ప్రాజెక్టుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవడం. 7 అంతరిక్షంలోకి దూసుకెళ్లడం అంతరిక్ష రంగానికి అత్య«ధిక ప్రాధాన్యతినివ్వడం. అందులో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో ఈ రంగానికి భారీగా నిధుల కేటాయింపు. 2020 కల్లా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం. 8 పౌష్టికాహారం వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆహారభద్రత అనే దీర్ఘకాలిక లక్ష్యానికి మార్గనిర్దేశనం చేయడం. ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారాన్ని పండించుకోవడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం. 9 ఆరోగ్యానికి అందలం ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత స్థానాన్ని కల్పించడం. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో మారుమూల గ్రామ ప్రజలతో సహా సర్వజనానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. 10 సుపరిపాలన ప్రజాజీవితంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం సాధ్యమైనంత వరకూ తగ్గించి, ప్రజలందరికీ సుపరిపాలనా ప్రయోజనాలందించడం, సత్వర స్పందన, బాధ్యతాయుత, స్నేహపూరిత అధికార యంత్రాంగం, ఇ–గవర్నెన్స్కు సోపానం వేయడం. -
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
పార్లమెంటులో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ (54) మోదీ ప్రభుత్వం అమలు పరిచిన ఆర్థిక సంస్కరణలన్నింటికీ సూత్రధారి. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అనారోగ్య కారణంగా తాత్కాలిక ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన గోయల్ ఆ హోదాలోనే ‘మధ్యంతర’బడ్జెట్ ప్రవేశపెట్టారు. చార్టెర్డ్ అకౌంటెంట్గా, న్యాయ విద్యార్థిగా అత్యున్నత ప్రతిభా పాటవాలు చూపిన గోయల్ 2014 ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రచారం ద్వారా ఎన్డీఏ విజయానికి దారులు వేశారు. విపత్కర సమయాల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేస్తూ ‘పని రాక్షసుడి’గా పేరుపడ్డారు. రైల్వే మంత్రిగా బులెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లతో భారతీయ రైల్వేను పరుగులు పెట్టిస్తున్నారు. రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన నిరంతర విద్యుత్, స్వచ్ఛ ఇంధనం, ఉదయ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన వంటి పథకాల రూపకర్త గోయలే. దేశంలోని 5,97,464 గ్రామాలను పూర్తిగా విద్యుదీకరించినందుకుగాను గోయల్కు రెండు రోజుల క్రితమే పెన్సిల్వేనియా వర్సిటీ కర్నాట్ బహుమతిని ప్రదానం చేసింది. అంచెలంచెలుగా.. స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో చేరిన గోయల్ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని అనతికాలంలోనే కేబినెట్ స్థాయికి ఎదిగారు. బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రిగా బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించారు. ఉజ్వల పథకం కింద దేశంలో ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని పెంచి కరెంటు ఖర్చు తగ్గించారు. త్వరగా, వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న గోయల్కు జ్ఞాపకశక్తి అపారం. సీఏలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించారు. న్యాయవిద్యలో ముంబై యూనివర్సిటీలోనే సెకండ్ ర్యాంకు సంపాదించారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డుల్లో పని చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరే నాటికి గోయల్ బీజేపీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన తర్వాత పార్టీ మరెవరినీ కోశాధికారిగా నియమించకపోవడం గమనార్హం. కార్పొరేట్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న పీయూష్ గోయల్ తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. గోయల్ తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా, కేంద్రంలో మంత్రిగా పని చేశారు. తల్లి చంద్రకాంత గోయల్ మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019–20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల కాలానికి అయ్యే వ్యయాలకు గాను పార్లమెంటు ఆమోదం కోరారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్–మే నెలల్లో పూర్తవుతాయి. తదుపరి ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను వచ్చే జూలైలో కొత్త ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది. -
చదివింపులు 10%
న్యూఢిల్లీ: విద్యారంగానికి 2019–20 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్లో ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 56,386.63 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. వైద్య సంస్థలతోపాటు ప్రధాన విద్యాసంస్థల్లో పరిశోధనల రంగంలో పెట్టుబడులు, సంబంధిత మౌలిక వసతుల కోసం ‘రివైటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (రైజ్)’అనే కొత్త పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో 2022నాటికల్లా రూ. లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారు. కొత్తగా ఎస్పీఏలు.. ►‘స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)’పేరుతో రెండు పూర్తిస్థాయి సంస్థలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి అదనంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో 18 ఎస్పీఏలను స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా ఏర్పాటుచేస్తారు. దీనికోసం ఐఐటీ/ఎన్ఐటీల డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ప్రతిపాదనలను సమర్పించాలని గోయల్ కోరారు. ►ఈసారి ప్రభుత్వం పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.608.87 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్లో రూ.350.23 కోట్లుగా ఉంది. ►విద్యలో నాణ్యత పెరగాలంటే సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని, ‘బ్లాక్బోర్డు’నుంచి ‘డిజిటల్ బోర్డుకు’మారాలని చెప్పారు. టీచర్లు అధునాతన సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు సాధించేందుకు, వారికి డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ‘దిక్షా’ను అభివృద్ధి చేశామన్నారు. -
చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్లు
దేశ ఆర్థిక స్థితిని బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్లో కేటాయింపుల ఆధారంగానే దేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంక్షేమపథకాలకు కేటాయింపులు, కీలక నిర్ణయాలుండే ఈ బడ్జెట్పై సామాన్యుడి దగ్గర్నుంచి.. కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఏడాదికోసారి ఆర్థిక శాఖ మంత్రి.. తమ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు, ప్రపంచానికి వెల్లడిస్తారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్ల గురించి తెలుసుకుందాం. బ్లాక్ బడ్జెట్ 1973 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను దేశ చరిత్రలో బ్లాక్ బడ్జెట్గా పిలుస్తారు. రహస్య లేదా పేర్కొనలేని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగినందునే ఈ బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్ అంటారు. 1973–74లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్రావ్ చవాన్ భారీ ద్రవ్యలోటుతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రూ.550 కోట్లు. ఇందులో రూ.56 కోట్లను బొగ్గుగనులు, సాధారణ బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ల జాతీయీకరణకు కేటాయించారు. ఈ బడ్జెట్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నవశకానికి నాంది 1991 భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలికినట్లుగా పేర్కొన్న బడ్జెట్ను 1991లో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక సరళీకరణకు బీజం వేసినందునే.. దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో నవశకానికి నాందిపలికిన బడ్జెట్ అని అంటారు. పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం ఎగుమతి, దిగుమతి విధానంలో మార్పులు తెచ్చింది. తద్వారా దేశ ఆర్థిక విధా నాలను ప్రపంచ వాణి జ్యానికి అనుగుణంగా.. సరళీకృతం చేశారు. 220%గా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 150%కి తగ్గించారు. ఈ బడ్జెట్ విధానాల కారణంగానే.. రెండు దశాబ్దాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిచింది. డ్రీమ్ బడ్జెట్ 1997 భారత చరిత్రలో 1997లో నాటి యునైటెడ్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘డ్రీమ్ బడ్జెట్’గా నిలిచిపోయింది. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల్లో మార్పులు తీసుకొచ్చిన బడ్జెట్ ఇది. అప్పుడు 40%గా ఉన్న ఆదాయపన్ను రేటును 30%కు తీసుకొచ్చింది ఈ బడ్జెట్లోనే. చాలా చోట్ల సర్చార్జీలను, రాయల్టీ రేట్లను తగ్గించారు. పన్నుల భారం తగ్గడంతో దీన్ని ప్రజలు స్వాగతించారు. మిలీనియం బడ్జెట్ 2000 కొత్త శతాబ్దంలో (2000) యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్ను మిలీనియం బడ్జెట్ అంటారు. భారత సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ బడ్జెట్ బాటలు వేసింది. ఇందులో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలను విడతలవారిగా తగ్గించారు. కంప్యూటర్లు, సీడీలు మొదలైన 21 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. తద్వారా ఐటీ రంగం జోరు పెరిగేందుకు కారణమైంది. ఇది కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు కూడా ప్రశంసించారు. రోల్బ్యాక్ బడ్జెట్ 2002 బడ్జెట్ అంటే ప్రతిసారీ కొత్త ప్రణాళికలు, వాటి అంచనాలను ప్రకటించమేనని తెలుసు. కానీ 2002–03కోసం యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్లో పథకాలు ప్రతిపాదించారు. ఇందులో ఎల్పీజీ సిలిం డర్ల ధరలు పెంచడం, సర్వీస్ టాక్స్ పెంపు వంటి నిర్ణయాలు ప్రకటించారు. అయితే విపక్షాలనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. అందుకే ఇది దేశ చరిత్రలో రోల్బ్యాక్ బడ్జెట్గా నిలిచిపోయింది. -
హౌ ఈజ్ ద జోష్..?
న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగం దాదాపు ఉత్సాహంగా సాగింది. ఇటీవల సూపర్ హిట్ అయిన బాలీవుడ్ సినిమా ‘ఉడీ.. ది సర్జికల్ స్ట్రైక్స్’ను ప్రస్తావిస్తూ.. ‘హౌ ఈజ్ ద జోష్?’అంటూ విపక్ష సభ్యుల్ని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పీయూష్ గోయల్ రైతులకు నగదు బదిలీ పథకం, ఆదాయ పన్ను మినహాయింపులు వంటి పలు కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తూ, బల్లలు చరుస్తూ స్వాగతించారు. సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రసంగాన్ని చదవడానికే పరిమితమవుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా పీయుష్ గోయల్ కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు విపక్ష సభ్యుల్ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అజెండా గురించి పీయూష్ ప్రస్తావిస్తూ ‘నేను ఉడీ సినిమా చూశాను. అందులో మంచి జోష్ ఉంది..’అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. మరోవైపు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో పాటు మరికొందరు బీజేపీ సభ్యులు సైతం ‘హౌ ఈజ్ ద జోష్?..’అంటూ కాంగ్రెస్ నేతలను వ్యంగ్యంగా ప్రశ్నించారు. పీయూష్ రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటన చేయగానే బీజేపీ సభ్యులు బల్లల చరుస్తూ.. మోదీ, మోదీ అంటూ నినాదించారు. దీంతో నిమిషం పాటు గోయల్ తన ప్రసంగాన్ని ఆపారు. ప్రధాని కూడా పలు ప్రకటనలప్పుడు బల్లను కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత గోయల్ మోదీ వైపు తిరిగి నవ్వుతూ నమస్కారం చేశారు. అనంతరం మోదీ చిరునవ్వుతో గోయల్ వద్దకు వెళ్లి వెన్నుతట్టి అభినందించారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నవ్వుతూ పీయూష్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమవ్వడానికి ఐదు, ఏడు నిమిషాల ముందు లోపలికి వచ్చిన గోయల్ కేంద్ర మంత్రు లు నితిన్ గడ్కరీ, ఉమా భారతి, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ల పాదాలకు నమస్కారం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత చాలా మంది ఎంపీలు గోయల్ వద్దకు వెళ్లి అభినందించారు. అదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో నిల్చొని ఉన్న తన కుటుంబసభ్యుల్ని చేయి ఊపుతూ పలకరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో పలువురు బీజేపీ నేతలు ‘రాహుల్ పారిపోయాడు’అంటూ ఎగతాళి చేశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ విప్ జ్యోతిరాదిత్య సింథియా, డిప్యూటీ స్పీకర్ ఎం.తుంబిదురై సభకు గైర్హాజరయ్యారు. -
‘శ్రమ’కు ప్రతిఫలం
న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెలకు రూ.15,000 దాకా వేతనం పొందుతున్న వారికి ప్రత్యేక పింఛన్ పథకాన్ని శుక్రవారం బడ్జెట్లో ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమ–యోగి మాన్ధన్(పీఎంఎస్వైఎం) పేరిట అమలు చేసే ఈ పథకంలో కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3,000 చొప్పున పింఛన్ అందజేస్తారు. ఇందుకోసం కార్మికులు, ప్రభుత్వం తమ వంతు వాటాగా నెలకు రూ.100 చొప్పున పింఛన్ ఖాతాలో జమ చేయాల్సి ఉం టుంది. ‘‘భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 50 శాతం అసంఘటిత రంగంలోని కార్మికుల శ్రమ నుంచే వస్తోంది. రిక్షా తొక్కేవారికి, పూట గడవడానికి ఇళ్లలో సేవకులుగా పనిచేస్తున్న వారికి, చిన్నాచితకా కంపెనీల్లో ఉపాధి పొందుతున్న వారికి వృద్ధాప్యంలో సమగ్ర సామాజిక భద్రత కల్పించడం తప్పనిసరి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు 29 ఏళ్ల వయసులో పీఎంఎస్వైఎం పథకంలో చేరొచ్చు. నెలకు కేవలం రూ.100 చొప్పున చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా రూ.3,000 చొప్పున పింఛన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల వయసులోనే చేరితే నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం అంతేమొత్తాన్ని తన వాటాగా ప్రతినెలా కార్మికుల పింఛన్ ఖాతాలో జమ చేస్తుంది. పీఎంఎస్వైఎం పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్ పథకాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని అన్నారు. పీఎంఎస్వైఎం పథకానికి తాజా బడ్జెట్లో కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఈ ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో పలు వరాలు ప్రకటించింది. ప్రతి కార్మికుడికి కనిష్ట పెన్షన్ను రూ.1,000 నిర్దేశించింది. అలాగే కార్మికుడు సర్వీసులో ఉండగా మరణిస్తే ఈపీఎఫ్వో ప్రస్తుతం రూ.2.5 లక్షలు చెల్లిస్తోంది. కేంద్రం దీన్ని ప్రస్తుతం రూ.6 లక్షలకు పెంచింది. అన్ని కేటగిరీల అంగన్వాడీలు, ఆశా యోజన కార్మికుల గౌరవ వేతనాలను 50 శాతం పెంచేసింది. ఉద్యోగాల సృష్టిలో గొప్ప ప్రగతి సాధించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. గత రెండేళ్లలో ఈపీఎఫ్వో సభ్యత్వాలు 2 కోట్లు పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రూ.10 లక్షల గ్రాట్యుటీపై పన్ను విధిస్తుండగా, దీన్ని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంటే రూ.20 లక్షల గ్రాట్యుటీపై ఎలాంటి పన్ను ఉండదు. ఒక సంస్థలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు లేదా ఉద్యోగం మానేసినప్పుడు గ్రాట్యుటీ తీసుకోవడానికి అర్హులని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అన్ని వర్గాల కార్మికుల కనీస ఆదాయం 42 శాతం పెరిగిందని అన్నారు. విధివిధానాలేవీ? అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ.. ఈ పథకం విధివిధానాలను మాత్రం వెల్లడించలేదు. ఏయే రంగాల్లో, ఎలాంటి పనులు చేసుకునే వారికి ఇస్తారో స్పష్టం చేయలేదు. ఉదాహరణకు 59 ఏళ్ల కార్మికుడు ఒక సంవత్సరంపాటు నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే.. 60 ఏళ్ల వయసు దాటగానే అతడికి పెన్షన్ అందజేస్తారా? అనే దానిపై అనుమానాలున్నాయి. దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరిలో ఎంతమందికి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. పీఎంఎస్వైఎం పథకంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. పింఛన్తో పాటు.. గౌరవం! చిన్నచిన్న దుకాణాల్లో, ఇళ్లలో పనిచేస్తూ మనచుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. పనిచేసినంతకాలమే వారికి గౌరవమైనా.. ఆదాయమైనా! వయసు మళ్లితే జీవితమే కష్టం. అలాంటి వారికి నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఈ పింఛన్ల కోసం రాజకీయ నాయకుల దగ్గర లైన్లలో నిల్చుని పేర్లు రాయించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇది గౌరవంగా పొందే పింఛను. పని చేసినన్నాళ్లూ వారు నెలకు రూ.55 నుంచి 100 వరకూ నామమాత్రపు మొత్తం చెల్లింస్తే చాలు. అంతేమొత్తాన్ని ప్రభుత్వమూ చెల్లిస్తుంది. విద్యారంగం దేశంలో అసంఘటిత రంగంలో పనివారు 42 కోట్లు తాజా పథకంతో లబ్ధి పొందేవారు 10 కోట్లు -
మోదీ సర్కార్ ఎలక్షన్ సినిమా.. నమో ఓటర్
ఇదో విచిత్రమైన కొత్త సంప్రదాయం. బడ్జెట్ తేదీలనే కాదు.. తీరునూ మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. నాలుగున్నరేళ్లుగా ప్రవేశపెట్టడానికి ఇష్టపడని డ్రీమ్ బడ్జెట్ను.. మరో 3 నెలల్లో పదవీకాలం ముగుస్తుందనగా ముందుకు తెచ్చింది. ఎన్నికలే లక్ష్యంగా.. 25 కోట్ల మంది ఓటర్లే లక్ష్యంగా సమ్మోహనాస్త్రాలు సంధించింది. 12 కోట్ల మంది రైతులకు నేరుగా ఖాతాల్లో డబ్బులు వెయ్యటమే కాదు.. 3 కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగుల జేబులనూ నింపుతోంది. మరో 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులపై పింఛన్ వల విసిరింది. నిజం చెప్పాలంటే... తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో ఉన్న రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. కాకుంటే ఎన్నికలు ఏప్రిల్లో ఉండగా... మార్చిలో ఖాతాల్లోకి డబ్బులు వేస్తామనటమే హర్షించడానికి మనస్కరించని విషయం. మూడు నెలల ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి గండికొట్టేసి... పూర్తి సంవత్సరానికి బడ్జెట్ పెట్టడమనేది ప్రజాస్వామ్యబద్ధమని మాత్రం చెప్పలేం. కార్మికుల పింఛను.. పన్ను రాయితీలు అన్నీ హర్షించదగ్గవే. కాకుంటే వీటిని గడిచిన ఐదు బడ్జెట్లలో ఎప్పుడు తెచ్చినా మరింత హర్షం వ్యక్తమయ్యేదేమో! 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో జిమ్మిక్కులు చేసింది. ఇటీవల మూడురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశ జనాభాలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి, రైతులు, అసంఘటిత రంగంలోని కార్మికులను లక్ష్యంగా చేసుకునే వ్యూహాత్మకంగా బడ్జెట్ను రూపొందించింది. మూడు నెలల్లో ప్రభుత్వం గడువు ముగుస్తున్నందున.. ఈ కాలపరిమితికే బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ, దుస్సంప్రదాయానికి తెరదీస్తూ.. ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్ పూర్తిస్థాయి బడ్జెట్ను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పూర్తిగా పన్ను రిబేట్ ఇవ్వాలని బడ్జెట్లో నిర్ణయించారు. దీంతోపాటు చిన్న, సన్నకారు రైతులను ఆకట్టుకునేలా.. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఏటా రూ.3వేల పింఛను ఇచ్చే ప్రతిపాదనలను కూడా బడ్జెట్లో పేర్కొన్నారు. బడ్జెట్ మొత్తం- రూ.27,84,200 కోట్లు రెవెన్యూ వసూళ్లు- రూ.19,77,693 కోట్లు మూలధన వసూళ్లు- రూ.8,06,507 కోట్లు మొత్తం వసూళ్లు- రూ.27,84,200 కోట్లు 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏటా ఇచ్చే ఆర్థిక సాయం- రూ.6,000 రూ. 5,00,000 ఆదాయం వరకు పన్ను లేదు, శ్లాబులు మార్చకుండా రిబేటు రూపంలో మినహాయింపు 60ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి నెలా రూ. 3,000 పింఛన్ సెక్షన్ 87 రిబేటు రూ.2,500 నుంచి రూ.12,500కు పెంపు రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ఇకపై నెలకు రూ.40 వేలు వడ్డీ వచ్చినా టీడీఎస్ మినహాయించరు ఇంటద్దెపై టీడీఎస్ పరిమితి రూ.1.8 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు ఉద్యోగులకు రెండో ఇంటిపై అద్దె వస్తే దానికి పన్ను మినహాయింపు రెండో ఇంటికీ వర్తించనున్న దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు బ్రహ్మాస్త్రంగా ఆదాయపు పన్ను! ఏటా ఐదులక్షల్లోపు ఆదాయం ఉన్న మూడుకోట్ల మంది వేతనజీవులు, పింఛనర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులను టాక్స్ చెల్లించే అవసరం లేకుండా ఆదాయపన్ను పరిమితిని పెంచారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.13వేల వరకు లబ్ధిచేకూరనుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం తగ్గుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ను కూడా రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచడం ద్వారా రూ.2,080 నుంచి రూ.3,588 వరకు మేలు (ఆదాయ స్థాయిల ఆధారంగా) జరగనుంది. బ్యాంకు వడ్డీలపై టీడీఎస్ మినహాయింపును రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచడం, గృహ ఆదాయ మినహాయింపును ఒక ఇంటి నుంచి రెండో ఇంటికి కూడా వర్తింపజేయడం, ఇంటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు వేర్వేరు ఆస్తులపై పెట్టుబడి పెట్టడం వంటివి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయం విషయంలో కీలకంగా చెప్పుకోవాల్సిన అంశాలు. సన్నకారు రైతులపై దృష్టి దేశవ్యాప్తంగా 5 ఎకరాలకంటే తక్కువ భూములున్న 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఈ రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా ఏటా రూ.6వేలను (నాలుగు నెలలకోసారి 3 దఫాలుగా రూ.2వేల చొప్పున) జమచేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.75వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కోసం రూ.20వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాదాయ మద్దతు పథకం ద్వారా నిర్దేశిత 3.3% ద్రవ్యవలోటును చేరుకోవడంలో ప్రభుత్వం వెనకబడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టార్గెట్గా పెట్టుకున్న 3.1% ద్రవ్యలోటును చేరుకోవడం కూడా కష్టంగానే మారనుంది. ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయే రైతులకు 2% వడ్డీ ప్రభుత్వ సాయంగా అందిచేందుకు కూడా కేంద్రం ముందుకొచ్చింది. రూ.3వేల పింఛన్తో.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులపై వరాల జల్లు కురిపించింది. ప్రస్తుతం నెలకు రూ.100 కనీస చెల్లింపు ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ తాత్కాలిక బడ్జెట్ కేవలం ట్రయలర్ మాత్రమేనని.. లోక్సభ ఎన్నికల తర్వాత దేశాన్ని సంక్షేమంగా మార్చేందుకు మరిన్ని పథకాలు తమ వద్ద ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే రోజుకు 17 రూపాయలు ఇవ్వడం ద్వారా రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శించారు. 7% పెరిగిన రక్షణ బడ్జెట్ రక్షణరంగ బడ్జెట్ను రూ.3లక్షల కోట్లకు (గతేడాదితో పోలిస్తే 7% పెంపు) పెంచడం, ఎల్పీజీ సబ్సిడీ రూ.2.66 లక్షల కోట్ల నుంచి రూ.2.97 లక్షల కోట్లకు పెంచడం వంటివి కూడా బడ్జెట్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.90వేల కోట్ల సేకరణ, ఆర్బీఐతోపాటు వివిధ బ్యాంకుల డివిడెండ్ల ద్వారా రూ.82,900కోట్ల ఆదాయం సమకూరిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిమితి రూ.5లక్షలకు పెంచడమే ఈ బడ్జెట్ మొత్తానికి హైలైట్ అని పేర్కొన్నారు. ‘సంప్రదాయం ప్రకారం పూర్తిస్థాయి బడ్జెట్లో పన్నుల మినహాయింపుల గురించి ప్రస్తావించాలి. కానీ మధ్యతరగతి, వేతనజీవులు, పింఛనర్లు, సీనియర్ సిటిజన్లలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న వారిని.. పూర్తిస్థాయి బడ్జెట్ వరకు వేచి ఉంచకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని గోయల్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశాభివృద్ధికి ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం పునాదులు వేసిందని.. దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో దూసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే... మధ్యంతర బడ్జెట్ అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే. ఈ బడ్జెట్తో 12 కోట్లకుపైగా రైతు కుటుంబాలు, అసంఘటిత రంగంలో ఉన్న 30–40 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారు. – ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు 17 రూపాయలా.. రైతులకు ఏటా రూ.6,000 ఇస్తామని గోయల్ ప్రకటించారు. గత ఐదేళ్లలో మీ చేతకానితనంతో రైతుల జీవితాలు నాశనమైపోయాయి. రైతులకు ఏటా రూ.6 వేలు అంటే రోజుకు రూ.16.44 ఇస్తామని చెప్పడం అవమానించడమే. 2 నెలల్లో రఫేల్ ఒప్పందం, ఉద్యోగాలు, నోట్ల రద్దులో మోదీపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. – రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో బడ్జెట్ ప్రతులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది -
పల్లె.. డిజిటల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతాన్ని డిజిటల్ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్లో గట్టి ప్రయత్నమే మొదలు పెట్టింది. భారత్ నెట్ పథకం కింద అనుసంధా నించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో తెలపడమే ఇందుకు తార్కాణం. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించు కునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కృత్రిమ మేథ టెక్నాలజీలు మరింత కచ్చితంగా వాతావరణ అంచనాలు కట్టేందుకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర రంగాల్లోనూ ఉపయోగపడతాయని వాహనాల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ, ఫొటోలు, వీడియోల విశ్లేషణ వంటివి వీటిల్లో ఉన్నాయని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా డిజిటల్ గ్రామాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ గ్రామాల వ్యవస్థ మొత్తం కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా నడుస్తాయి. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా లక్ష వరకూ గ్రామాల్లో ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చాలన్నది లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్ టెక్నాల జీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కామన్ సర్వీసెస్ సెం టర్లపైనే ఉంచనున్నారు. దేశంలో ఇప్ప టికే దాదాపు మూడు లక్షల కామన్ సర్వీ సెస్ సెంటర్లు పని చేస్తున్నా యనీ, వీటి ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభుత్వ సర్వీసులను, విధానాలను డిజిటల్ రూపంలోకి మార్చేసిందని.. వీటన్నింటి ఆధారంగా 2030 నాటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తామని వివరించారు. దేశ యువత సృష్టించే అనేక స్టార్టప్ కంపెనీలు సృష్టించే డిజిటల్ ఇండియా కారణంగా లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మొబైల్ డేటా 50 రెట్లు ఎక్కువైందని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితమిదని మంత్రి వ్యాఖ్యానించారు. డిజిటల్ గ్రామాల వంటి వాటి వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు. కృత్రిమ మేథతో అనేక లాభాలు.. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ వినియోగం సర్వత్రా పెరగనుందని.. ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేథ సర్వీసుల కోసం ఓ జాతీయ పోర్టల్ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్ ద్వారా సేవలు అందిస్తామని.. ఆసక్తికర ప్రైవేట్ వ్యాపార సంస్థలు కూడా ఈ పోర్టల్ సేవలు వినియోగిం చుకోవచ్చునని మంత్రి వివరించారు. త్వరలో సిద్ధం కానున్న నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కృత్రిమ మేథ సర్వీసులు చాలా కీలకం కానున్నాయని మంత్రి చెప్పారు. దేశం ఇప్పటికే స్టార్టప్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని.. దీంతోపాటు కృత్రిమ మేథ తాలూకూ లాభాలను ప్రజల చెంతకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో ఓ విస్తృత స్థాయి కార్యక్రమం చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా.. ఇతర అత్యున్నత నైపుణ్య కేంద్రాలు కూడా ఏర్పాటు కావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఊపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేథ సర్వీసులను ఉపయోగించు కునేందుకు ఇప్పటికే తొమ్మిది రంగాలను గుర్తించామని మంత్రి అన్నారు. -
లాభం ఎవరికి.. నష్టం ఎవరికి?
ఎన్నికల వేళ అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ పలు వర్గాలకు వరాలు ప్రకటించారు. రైతులకు ఆర్థిక సాయం, ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు, అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. బడ్జెట్ ప్రతిపాదనల వల్ల కొన్ని వర్గాలు లబ్ధి పొందుతాయని, మరికొన్ని నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘పది’ కోటాకు దక్కని కేటాయింపులు అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే చట్టం తెచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు తాజా బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. పేదల కోటా అమలు చేయాలంటే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 25 శాతం సీట్లు పెంచాలి. లాబోరేటరీలు, లైబ్రరీలు అదనంగా కావాలని, టీచర్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమని నిపుణులు అంటున్నారు. బడ్జెట్లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధులు వీటికి ఏ మాత్రం సరిపోవని స్పష్టం చేశారు. పది శాతం కోటా అమలు చేయాలంటే ఒక్క పంజాబ్ యూనివర్సిటీకే రూ.500 కోట్లు అవసరమని పేర్కొన్నారు. పది శాతం రిజర్వేషన్ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల సీట్లు పెరుగుతాయని పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో సూచనప్రాయంగా చెప్పారు. ఉన్నత విద్యకు కేంద్రం బడ్జెట్లో రూ. 37,461.01 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన 33,512.11 కోట్ల కంటే ఇది సుమారు 4 వేల కోట్లు ఎక్కువ. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఈ పెంపుదల సరిపోదనేది విద్యావేత్తల వాదన. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 6,604.46 కోట్లు, యూజీసీకి రూ. 4,600 కోట్లు కేటాయించారు. ఇక సాంకేతిక విద్యకు కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఐఐటీలకు రూ. 6,143.02 కోట్లు కేటాయించారు. లాభపడేది.. రైతులు ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పేరుతో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేస్తారు. మూడు విడతలుగా ఈ సాయం అందిస్తారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఎన్నికలకు ముందే వీరి ఖాతాల్లో మొదటి విడత రూ.2,000 సాయం జమ కానుంది. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను(ఐటీ) పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు పన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీలలో పెట్టుబడులు పెడితే పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల 3 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని అంచనా. గ్రామీణ భారతం పశు సంరక్షణ, మత్స్య రంగాలకు కేటాయింపులు పెంచడం, చిన్న, సన్నకారు వ్యాపారులకు వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల సంబంధిత కంపెనీలు గ్రామాలకు మళ్లే అవకాశం ఉంది. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కార్మికులు అసంఘటిత కార్మికులకు పింఛను పథకం వల్ల వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది లాభం పొందుతారని కేంద్రం అంచనా వేస్తోంది. రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం గల కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ఇవ్వనున్నట్టు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలను బడ్జెట్లో పొందుపరచడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సూచిక పైకెగిరింది. దేశంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు సమకూరుస్తామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఇంటి అద్దెపై వడ్డీ పరిమితిని కూడా పెంచారు. ఆటోమొబైల్ రంగం కూడా లబ్ధి పొందనుంది. గోయల్ ప్రసంగం చేస్తుండగానే ఎస్అండ్పీ బీఎస్ఈ ఇండెక్స్ 5.3 శాతం పెరిగింది. ప్రధాని మోదీ బడ్జెట్లో ప్రకటించిన రైతు సాయం, పింఛను పథకాలను ప్రధానమంత్రి పేరుతో రూపొందించారు. దీనివల్ల ప్రధాని నరేంద్ర మోదీ పరపతి ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది. నష్టపోయేది... బాండ్ హోల్డర్లు ఈసారి ద్రవ్యలోటు 3.4 శాతం వరకు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. దీనివల్ల మన క్రెడిట్ రేటింగ్ తగ్గే అవకాశం ఉంది. పైగా బడ్జెట్లో ఆదాయం పెంపునకు కొత్త పథకాలేమీ లేవని ప్రధాని మోదీ చెప్పారు. దీనివల్ల వివిధ రకాల బాండ్లు కొనేవారికి పెద్దగా లాభం ఉండదు. ప్రతిపక్షాలు బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులు, మధ్య తరగతి వారితోపాటు వ్యాపారులను కూడా ఆకర్షి స్తాయి. వీటి ప్రభావంతో అధికార పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడే వీలుంది. అది ప్రతిపక్షాలకు నష్టదాయకమే. వ్యవసాయ కూలీలు/కౌలు రైతులు మోదీ ప్రకటించిన రైతు సాయం భూయజమానులకే తప్ప కౌలు రైతులకు అందదు. దేశంలోని పంటలు సాగుచేస్తున్న వారిలో చాలామందికి సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. రక్షణ రంగం గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెంచారు. ఫలితంగా రక్షణ శాఖ ఆధునికీకరణ కష్టమవుతుంది. -
రక్షణకు మేం రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి 2019–20 బడ్జెట్లో రూ. 3,18,931 కోట్లు కేటాయించారు. గత ఏడాది రక్షణ శాఖ బడ్జెట్తో కేటాయింపు రూ. 2,95,511 కోట్లతో పోలిస్తే ఇది 6.87 శాతం ఎక్కువగా తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర పరికరాలు కొనడానికి బడ్జెట్ కేటాయింపులో రూ. 1,08,248 కోట్లను మూలధనంగా పేర్కొన్నారు. మూలధనం ఆర్మీకి రూ. 29,447 కోట్లు, నేవీకి రూ. 23,156 కోట్లు, ఎయిర్ఫోర్స్కు రూ. 39,302 కోట్లు కేటాయించారు. ఇక జీతాల చెల్లింపు తదితర రెవెన్యూ వ్యయానికి రూ. 2,10,682 కోట్లు కేటాయించారు. కేంద్రం ప్రభుత్వం మొత్తం మూలధనంలో 32.19 శాతం సాయిధ బలగాలకు కేటాయించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యయం మొత్తంలో 15.48 శాతం రక్షణ రంగం కేటాయింపులేనని చెప్పారు. రక్షణ రంగానికి ఇచ్చిన దానికి అదనంగా పెన్షన్ల కోసం రూ. 1,12,079 కోట్లను కేటాయించారు. సరిహద్దులను కాపాడటానికి అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమని పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులు గర్వకారణమని, అందుకే ఈ ఏడాది వారికోసం ఇప్పటివరకూ ఎవరూ కేటాయించని స్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు. నలభైఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒకే హోదా ఒకే పింఛన్ను తాము పరిష్కరించామని తెలిపారు. యూపీఏ సర్కారు 2014–15 మధ్యంతర బడ్జెట్లో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయిస్తే తాము ఆ పథకం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.35 వేల కోట్లు పంపిణీ చేశామని పీయూష్ అన్నారు. యూపీఏ ఒకేహోదా ఒకే పింఛన్ (వన్ ర్యాంక్ వన్ పింఛన్)ను మూడు బడ్జెట్లలో ప్రస్తావించినప్పటికీ అమలు చేసింది మాత్రం తామేనంటూ ఆయన.. ‘మిలటరీ సర్వీస్ పే’లో అన్ని దళాల వారికీ అలవెన్సులను గణనీయంగా పెంచామని వివరించారు. అంతేకాకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న నేవీ, వాయుసేనల సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక అలవెన్సులను కూడా ఎక్కువ చేశామని గుర్తు చేశారు. హోం మంత్రిత్వ శాఖకు 1,03,927 కేంద్ర హో మంత్రిత్వ శాఖకు కేటాయింపులు తొలిసారి లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2019–20 కేంద్ర బడ్జెట్లో హోం మంత్రిత్వ శాఖకు రూ. 1,03,927 కోట్లు కేటాయించారు. 2018–19 బడ్జెట్లో ఆ శాఖకు రూ. 99.03వేల కోట్లతో పోలిస్తే ఈ సారి 4.9 శాతం ఎక్కువ. దేశ రాజధానిలో శాంతిభద్రత కాపాడే ఢిల్లీ పోలీసులకు ఈ బడ్జెట్లో రూ. 7,496.91 కోట్లు, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సీఆర్పీఎఫ్ బలగాల కోసం రూ. 23,742.04 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సీఆర్పీఎఫ్కు దాదాపు రూ. 1,095 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం బీఎస్ఎఫ్ కోసం 19,647.59 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,061 కోట్లు అదనం. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్తో పాటు సాయిధ బలగాల కోసం మొత్తం రూ. 71,618.70 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ. 67,779.75గా ఉన్నాయి. ఇతర కేటాయింపులు.. - ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఈ బడ్జెట్లో రూ. 2,198.35 కోట్లు కేటాయించారు. - ప్రధాని, మాజీ ప్రధాని భద్రతకోసం వినియోగించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్నకు రూ. 530.75 కోట్లు ఇచ్చారు. - పోలీస్ మౌలిక వసతుల అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాల కొనుగోళ్లు, బారక్లు, ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5,117 కోట్లు ఇచ్చారు. - పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రూ. 3,378 కోట్లు, సరిహద్దులో మౌలిక వసతులు, నిర్వహణకు రూ. 2 వేల కోట్లు, మహిళల రక్షణ, సాధికారత మిషన్కు రూ. 1,330 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి రూ. 825 కోట్లు, జమ్మూకశ్మీర్లో వలసదారులు, స్వదేశానికి తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం రూ. 809 కోట్లు, స్వాతంత్య్ర పోరాటయోధుల పింఛన్ల కోసం రూ. 953 కోట్లు, నిర్భయ ఫండ్కు రూ. 50 కోట్లు కేటాయించారు. - ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు రిలీఫ్ ఫండ్కు రూ. 10,000 కోట్లు కేటాయించారు. - రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 2021 జనాభా లెక్కలకు రూ. 541.33 కోట్లు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు రూ. 50 కోట్లు, జమ్మూ కశ్మీర్లో పరిశ్రమల ఏర్పాటుకు రూ. 78.09 కోట్లు, హిందీ భాష ప్రచారానికి రూ. 4,895.81 కోట్లు కేటాయించారు. - కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ అండ్ నికోబార్ దీవులకు రూ. 4,817.48 కోట్లు, చండీగఢ్కు రూ. 4,291.70 కోట్లు, దాద్రా నగర్ హవేలీకి రూ. 1,117.99 కోట్లు, డామన్ అండ్ డయ్యు రూ. 821.4 కోట్లు, లక్షద్వీప్కు రూ. 1,276.74 కోట్లు ఢిల్లీకి రూ.1,112 కోట్లు, పుదుచ్చేరికి రూ. 1,545 కోట్లు కేటాయించారు. కంచె.. కాస్త పలచబడింది! ‘జై జవాన్’ అన్నది పేరుకేనా? సమయం దొరికినపుడల్లా సైనికుల గొప్పలు చెప్పే మోదీ సర్కారు.. రక్షణరంగానికి చేసిన కేటాయింపులెంత? ఆయుధాల దిగుమతుల్లో అతిపెద్ద దేశమైన మనకు.. ప్రస్తుత తరుణంలో రక్షణరంగ కేటాయింపులేమీ పెరగలేదు. రూ.3 లక్షల కోట్లకన్నా ఎక్కువ కేటాయించామని, ఈ స్థాయి నిధులివ్వటం ఇదే తొలిసారని చెబుతున్నారు. కానీ ఆయుధాలు కొనేది డాలర్లలో. గతేడాది డాలర్ విలువ ఇప్పటికన్నా చాలా తక్కువ. దీంతో గతేడాది కేటాయింపులు దాదాపు 44.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇపుడు రూ.3 లక్షల కోట్లు దాటినా... డాలర్లలో మునుపటేడాది కన్నా తక్కువే. డాలర్లలో గతేడాది కేటాయింపులు 44.5 బిలియన్లు డాలర్లలో ప్రస్తుత కేటాయింపులు 43 బిలియన్లు -
ప్రగతికి ‘పట్టాలు’!
న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని మరో పది వేల కోట్లు పెంచి రూ. 1,58,658 కోట్లకు పియూష్ గోయల్ చేర్చారు. అలాగే బడ్జెట్ నుంచి మూలధన సాయంగా రూ.64,587 కోట్లను రైల్వేలకు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వే చరిత్రలో 2018–19 సంవత్సరమే అత్యంత సురక్షితమైనదనీ, బ్రాడ్గేజ్ పట్టాలపై వెంట ఉన్ని కాపలా లేని రైల్వే గేట్లను సంపూర్ణంగా తొలగించామని రైల్వే, ఆర్థిక శాఖల మంత్రి పియూష్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే ఏడాదికి రైల్వేకు కేటాయించిన మూలధన వ్యయం చరిత్రలోనే అత్యధికం. ఆ మొత్తం రూ. 1.58 లక్షల కోట్లు. దేశీయంగా తయారైన పాక్షిక అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ 18) భారతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని ఇవ్వనుంది. పూర్తిగా మన ఇంజినీర్లే తయారు చేసిన ఈ రైలుతో మనం సాంకేతికతలో మరో పెద్ద అడుగు ముందుకేశాం’అని వివరించారు. రైల్వేకు వచ్చే ఆర్థిక ఏడాదిలో రూ. 2.73 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. గతేడాది ఈ అంచనా రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది. కొత్త మార్గాల నిర్మాణాలకు రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 6,114.82 కోట్లు, సిగ్నల్ వ్యవస్థ, టెలికాంలకు కలిపి రూ. 1,750 కోట్లు, ప్రయాణికులకు సౌర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 3,422 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నిష్పత్తి 96.2కు మెరుగుపడిందనీ, వచ్చే ఏడాదికి దీనిని 95 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గోయల్ చెప్పారు. త్వరలో అధునాతన బోగీలు ఇంజిన్లు, బోగీలు తదితరాల కోసం గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో 64 శాతం అధిక కేటాయింపులకు చేశారు. 2018–19 బడ్జెట్లో ఈ కేటగిరీ కోసం రూ. 3,724.93 కోట్లు కేటాయించగా, తాజా ఆ బడ్జెట్లో ఆ మొత్తం రూ. 6,114.82 కోట్లుగా ఉంది. దీంతో త్వరలోనే అధునాతన బోగీలు రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైలు బోగీల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా 200 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాజా బడ్జెట్ కేటాయింపులు ఉపకరించనున్నాయి. భారత్లో అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్ 18 (వందే భారత్ ఎక్స్ప్రెస్), కొత్త ఏసీ కోచ్లు, మెట్రో కోచ్లు తదితరాల తయారీ విజయవంతం అవ్వడంతో అదే ఉత్సాహంతో 2021 వరకు తయారీ ప్రణాళికలను రైల్వే అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇవి సరిగ్గా అమలైతే వచ్చే రెండేళ్లలో దేశంలోని వివిధ రైల్వే ఫ్యాక్టరీలు కలిసి దాదాపు 15 వేల బోగీలను తయారు చేయనున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో తిరుగుతున్న ఈమూ, మెమూ రైళ్లకు బదులుగా కొత్త బోగీలను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే మరో 6 ట్రైన్ 18లను తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫస్ట్ యాక్సిడెంట్.. ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద నలిగిపోయిన అభాగ్యుడెవరో తెలుసా? ఈయనే. పేరు విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబర్ 15న బ్రిటన్లోని లివర్పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్థర్ వెలస్లీతో మాట్లాడేందుకు పక్కనే ఉన్న పట్టాలపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వస్తోంది. రైలు దగ్గరికి రాగానే తడబడుతూ పట్టాలపై పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ 1850 తొలినాళ్లలో మన దేశంలో ఇలా ఎడ్లే ఇంజిన్లుగా అప్పటి న్యారో గేజ్ రైలును లాగేవి. -
రూరల్ రంగస్థలం!
ఇన్నాళ్లు ఒకెత్తు.. ఇప్పుడు ఎన్నికల పైఎత్తు!! గ్రామీణ రంగస్థలంపై ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మోదీ సర్కారు ఈ సారి బడ్జెట్పై పెద్ద కసరత్తే చేసింది. ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో ఓటర్ను ఆకర్షించేవిధంగా ‘ఫ్లాగ్షిప్’ ప్రణాళికను ప్రకటించారు. పేరుకు మధ్యంతర బడ్జెటైనా, పూర్తిస్థాయి బడ్జెట్ను తలపింపజేశారు. ఉపాధిహామీకి మరింత ధీమా, మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం, గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులను కుమ్మరించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. గ్రామపంచాయతీలకు డిజిటల్ సొబగులు, ప్రతిఒక్కరికి గృహవసతి కల్పన లాంటి తాయిలాలు ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ లక్ష్యానికి ఆమడదూరంలో భారత్ నిలిచింది. ఉపాధి హామీకి మరింత ఊతం - మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ దఫా బడ్జెట్లో రూ. 60వేల కోట్లు కేటాయింపు. - గతేడాది కన్నా ఈ మొత్తం రూ. 5వేల కోట్లు లేదా 11 శాతం అధికం. - అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతారు. - దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా ఉండేందుకు, అర్బన్– రూరల్ విభజనను తగ్గించేందుకు కృషి. - 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. - ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన - 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద ఇప్పటిదాకా 2,48,19,168 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం లక్ష్యం 2.5 కోట్ల కుటుంబాలు. - ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. - దీనికోసం ఇప్పటివరకూ రూ. 16320 కోట్ల వెచ్చింపు. - పేద, మధ్యతరహా కుటుంబాలకు 143 కోట్ల ఎల్ఈడీ బల్బుల అందజేత. - ఎల్ఈడీ బల్బులతో రూ.50వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఆదా. మూడు రెట్లు పెరిగిన గ్రామీణ రోడ్ల నిర్మాణం - 2022కు బదులు 2019 మార్చికే అన్ని ఆవాసాలకు రహదారులు - ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు 3 రెట్లు పెరిగాయి. - మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. ఫేజ్–3 కింద ఆవాసాలను ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లతో కలిపేందుకు లింక్ రోడ్ల నిర్మాణాలు. - హైవేల నిర్మాణంలో ప్రపంచంలోనే ముందంజ. రోజుకు 27 కి.మీ. హైవేల నిర్మాణం స్వచ్ఛ భారత్ సాకారం... - 2014–15 నుంచి ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి. బహిరంగ మలవిసర్జన అలవాటు దాదాపు కనుమరుగైంది. - ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాల సంఖ్య 5.45 లక్షలకు చేరింది. - గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. గ్రామీణ టెలిఫోనీ - భారత్ నెట్ ఫేజ్1 కింద 1, 21, 652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. - 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. - దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్బ్యాంక్ యాక్సెస్ లభించింది. - 39, 359 పంచాయతీల్లో వైఫై హాట్స్పాట్స్ ఇన్స్టలేషన్ పూర్తి. - ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ది చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం - ఈ ‘భారత్ నిర్మాణ్’ పథకానికి నిధులు జోరుగానే అందుతున్నాయి. - దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. - దీన్ని ఇప్పుడు విజన్ 2030లో భాగంగా చేర్చారు. - నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - 2019–20 కేటాయింపులు 25,853కోట్లు - 2018–19 సవరించినది 26,405 కోట్లు - ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 1.53 కోట్ల ఇళ్ల నిర్మాణం(గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కలిపి) - నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో రూ. 10వేల కోట్ల కార్పస్తో కొత్తగా హౌసింగ్ ఫండ్(ఏహెచ్ఎఫ్) ఏర్పాటు. - ఇళ్ల నిర్మాణాలు ఇందిరా ఆవాస్ యోజన కన్నా ఈ పథకం కింద ఐదు రెట్లు అధికం. 2022 నాటికి అందరికీ గృహవసతి లక్ష్యం. ఊరటనిచ్చేదే! ‘బడ్జెట్ ప్రజలకు కొంత ఊరట కలిగించేదే. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన తరహాలో కేంద్ర స్థాయిలో నగదు బదిలీని పెట్టడం హర్షించదగిన పరిణామం’ –డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్. ఊరికి మరిన్ని మెరుపులు... పదిహేనేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఉపాధి హామీకి నిధుల హామీ దొరికింది. మునుపటికన్నా మరీ ఎక్కువ కాకున్నా... ఒక మోస్తరుగా కేటాయింపులు పెరిగాయి. ఇక గ్రామ్జ్యోతి యోజనంటూ ఏటా విద్యుత్ కనెక్షన్లిచ్చిన కుటుంబాల సంఖ్య పెరుగుతున్నందుకు ఆనందించాలో... అసలింకా కరెంటుకు నోచుకోని ఇళ్లున్న దౌర్భాగ్యానికి సిగ్గుపడాలో తెలియని పరిస్థితి. గ్రామీణ రోడ్ల నిర్మాణం మాత్రం జోరుగానే సాగుతోంది. స్వచ్ఛ భారత్ ఆశయంలో ఉన్నంత ఉదాత్తత ఆచరణలో ఇంకా కనిపించాల్సి ఉందన్నది కాదనలేని నిజం. కాకపోతే దీనికి ప్రభుత్వం కన్నా ప్రజలే ఎక్కువ చేయాల్సిందన్నది వాస్తవం. ఏడాదిలో కనీస ఉపాధి రోజులు: 100 -
డిమాండ్, వృద్ధికి బలం
మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన నిర్ణయాలు డిమాండ్కు ప్రేరణనివ్వడంతోపాటు దేశ వృద్ధి రేటుకు బలాన్నిస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. కుప్తంగా చూస్తే... ఈ బడ్జెట్ మొత్తం మీద వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులు, కన్జ్యూమర్ ఉత్పత్తుల డిమాండ్కు ఊపునిస్తుంది. ద్రవ్యలోటును 3.4 శాతానికి సవరించడం కొంచెం ఆందోళన కలిగించే అంశం – సునీల్ దుగ్గల్, డాబర్ ఇండియా సీఈవో కనీస మద్దతు ధరలు, రైతులకు సంబంధించిన పథకంలో పెట్టుబడులు పెంచడం ద్వారా ఆర్థిక రంగానికి బలాన్నివ్వడం ఆహ్వానించతగినది. పన్ను మినహాయింపు పెంచడం, పన్ను రిటర్నుల ప్రక్రియను సులభతరం చేయడం అన్నవి పన్నుల భారాన్ని తగ్గించడమే కాకుండా పన్నులు చెల్లించే వారి సంఖ్యను కూడా పెంచుతుంది – సౌగత గుప్తా, మారికో ఎండీ, సీఈవో ముందుచూపుతో కూడిన బడ్జెట్ ఇది. వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు ఉండేలా చేస్తుంది. వీటికితోడు ఇటీవల పలు గృహోపకరణాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులు చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది మా రంగంలో డిమాండ్ పెంచుతుంది. – సునీల్ డిసౌజ, వర్ల్పూల్ ఇండియా ఎండీ 2030 నాటికి సమగ్ర ఆరోగ్య, చక్కని ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ‘ఆరోగ్య భారత్’ లక్ష్యాన్ని బడ్జెట్లో పేర్కొనడం ఆసక్తికరం. అయితే, ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును పెంచకపోవడం లోటు. – అజాద్మూపెన్, ఆస్గర్ డీఎం హెల్త్కేర్ చైర్మన్ నూతన భారత్ కోసం ఉద్దేశించిన బడ్జెట్ ఇది. సమాజంలోని పలు వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతల విషయంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి సమతుల్యం పాటించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్య అంతరాలను భర్తీ అంశాలను పరిష్కరించేలా ఉంది. పన్ను మినహాయింపులు, తక్కువ ద్రవ్యోల్బణం దేశీయ డిమాండ్ను, వినియోగాన్ని పెంచుతాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది – రితేష్ అగర్వాల్, ఓయో హోటల్స్ అద్భుతమైన బడ్జెట్. దేశంలో అతిపెద్ద వర్గమైన మధ్యతరగతి, రైతులకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారికి ఏదైనా చేసేందుకు ఆర్థిక మంత్రి ప్రయత్నించారు. అదే సమయంలో ద్రవ్యలోటు 3.4 శాతం స్థాయిలోనే కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నారు. ఇది ప్రజానుకూల బడ్జెట్. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. – అజయ్ సింగ్, స్పైస్జెట్ చైర్మన్, ఎండీ స్టార్టప్ల్లో పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలని, జీఎస్టీ సంబంధించి మరింత స్పష్టత ఇవ్వాలన్న పరిశ్రమ విజ్ఞప్తులకు ఈ బడ్జెట్లో చోటు కల్పించలేదు. అయితే, తగిన చర్చల ద్వారా వీటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం – ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ రెండు హెక్టార్ల భూమి (ఐదెకరాల్లోపు) ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వాలన్న పథకం లక్షలాది మంది పత్తి రైతులకు మేలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వారికి చేయూతనిస్తుంది – పి.నటరాజ్, చైర్మన్ సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ బడ్జెట్ ప్రకటనలు స్టీల్ రంగానికి మొత్తం మీద సానుకూలం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్లోనూ చోటు కల్పించారు. రైల్వేలు, రోడ్లు, జలమార్గాలు వృద్ధికి కీలకం – ఏకే చౌదరి, సెయిల్ చైర్మన్ 2030 నాటికి వాహన కాలుష్య రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం. పర్యావరణ అనుకూల వాహనాల విషయంలో ప్రభుత్వం తొలిసారిగా తన నిబద్ధతను ప్రకటించింది. తాజా ప్రకటనతో ఈ రంగంలో అనిశ్చితి తొలిగినట్టయింది. ఫేమ్–2 ప్రకటన కోసం ఆతృతగా పరిశ్రమ ఎదురుచూస్తోంది. – ఎన్.నాగసత్యం, ఈడీ, ఓలెక్ట్రా గ్రీన్టెక్ క్రెడిట్ నెగెటివ్ ... ఆదాయం పెంచే ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు లేకుండా అధిక ఖర్చులకు దారితీసే పలు చర్యలు ద్రవ్యోలోటు పెరిగేందుకు దారితీస్తాయి. ఇది సార్వభౌమ క్రెడిట్ రేటింగ్కు పెద్ద ప్రతికూలం. 2020లోనూ ద్రవ్యలోటు 3.4 శాతాన్ని చేరుకోవడం కష్టమే. వరుసగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడాన్ని మేము క్రెడిట్ నెగెటివ్గానే చూస్తాం – రేటింగ్ ఏజెన్సీ మూడిస్ -
ద్రవ్యబాటలో ఒడిదుడుకులు!
మార్కెట్ రుణ సమీకరణ రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్ నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.4.48 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరం (రూ.4.47 లక్షల కోట్లు) రుణ సమీకరణకన్నా ఇది కొంచెం ఎక్కువ. నిజానికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో 4.07 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలనే బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నికరంగా ఈ పరిమాణం రూ.4.47 లక్షల కోట్లకు పెరిగినట్లు సవరిత అంచనాలు తెలిపాయి. ఇక స్థూలంగా చూస్తే రుణ పరిమాణం రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన రుణాల రీపేమెంట్లు కూడా స్థూల రుణాల్లో కలిసి ఉంటాయి. ఈ తరహా చెల్లింపులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.36 లక్షల కోట్లు ఉంటాయని తాజా బడ్జెట్ పేర్కొంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం– చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో ప్రభుత్వానికి మార్కెట్ నుంచి రుణ సమీకరణ ఒకటి. డేటెడ్ బాండ్లు, ట్రెజరీ బిల్లుల ద్వారా ఈ నిధుల సమీకరణ జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు కట్టుతప్పనున్న విషయం స్పష్టమైపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట. మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలు పెరగనున్నట్లు ఆర్థికమంత్రి తన తాజా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. కాగా ద్రవ్యలోటును 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. రైతులకు మద్దతు ఇవ్వకపోతే... అంచనాలకు అనుగుణంగానే! ‘‘2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయాలనే అనుకుంటున్నాం. అయితే రైతులకు ఆదాయ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఇందుకు సవరించిన అంచనాల్లో (2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో) రైతులకు రూ.20,000 కోట్లను అందించాలని నిర్ణయించాం. 2019–20లో (బడ్జెట్ అంచనాలు) ఈ మొత్తం రూ.75,000 కోట్లుగా అంచనావేస్తున్నాం. అందువల్లే ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొంత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈ మద్దతు కల్పించకపోతే, ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.3%, వచ్చే ఆర్థిక సంవత్సరం 3.1%గా ఉంటుంది’’ అని గోయెల్ పేర్కొన్నారు. 2020–21 నాటికి 3% లక్ష్యమన్నారు. కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) జీడీపీలో 2.5 శాతం ఉంటుందని గోయెల్ బడ్జెట్ పేర్కొంది. తగ్గిన పన్ను ఆదాయం 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాలకన్నా స్వల్పంగా రూ.23,067 కోట్లు తగ్గుతోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అంచనాలకన్నా తగ్గడం దీనికి కారణం. జీడీపీలో స్థూల పన్ను వసూళ్లు 12.1 శాతానికి! 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో స్థూల పన్ను ఆదాయం 12.1 శాతానికి పెరుగుతుందని బడ్జెట్ అంచనావేసింది. 2020–21లో ఇది 12.2 శాతానికి చేరుతుందని పేర్కొంది. లక్ష్యాలను దాటిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం 2018–19 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను దాటడం గమనార్హం. బడ్జెట్ అంచనా రూ.11.50 లక్షల కోట్లయితే, అదనంగా మరో రూ.50,000 కోట్లతో మొత్తం రూ.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యం రూ.13.80 లక్షల కోట్లు. ఈ విభాగంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7.60 లక్షల కోట్లను కార్పొరేట్ పన్నుగా, వ్యక్తిగత ఆదాయపు పన్నుల ద్వారా రూ.6.20 లక్షల కోట్లను సమీకరించాలన్నది బడ్జెట్ ప్రణాళిక. 2018–19లో ఈ మొత్తాలు వరుసగా 6.71 లక్షల కోట్లు, రూ.5.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
బడ్జెట్.. ఎఫెక్ట్
తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్ ప్రతిపాదనల కారణంగా కొన్ని షేర్లు లాభపడగా, మరికొన్ని షేర్లు నష్టపోయాయి. సానుకూల ప్రతిపాదనల కారణంగా ఇంట్రాడేలో కొన్ని షేర్లు లాభపడినప్పటికీ, ట్రేడింగ్ చివర్లో నష్టపోయాయి. వివరాలు ఇవీ... ప్రతిపాదన రైతులకు రూ.6,000 సహాయం ప్రభావిత షేర్లు, ముగింపు ధర (లాభం/నష్టం (శాతంలో) యూపీఎల్ 778(–1), జైన్ ఇరిగేషన్ 59(–3) బేయర్ క్రాప్ సైన్స్ 4,357(0.7), శక్తి పంప్స్ 400(–0.2) రక్షణ రంగానికి రూ.3.05 లక్షల కోట్ల కేటాయింపులు వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ 88 (1 శాతం) భారత్ ఎలక్ట్రానిక్స్ 84(1 శాతం), బీఈఎమ్ఎల్ 799 (0.4 శాతం), భారత్ డైనమిక్స్ 256(–0.5 శాతం), ఎల్ అండ్ టీ 1,325(1 శాతం) ఆదాయపు పన్ను పరిమితి పెంపు హీరో మోటొకార్ప్ 2,807(7 శాతం) బజాజ్ ఆటో 2,602(2) టీవీఎస్ మోటార్ 512(2) మారుతీ సుజుకీ 6,957(5) గ్రామీణ ఆదాయం పెంపు ప్రతిపాదనలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 7 శాతం అధికంగా నిధులు హెచ్యూఎల్ 1,796(2), డాబర్ ఇండియా 452(2) ఐటీసీ 281(0.7), ఫ్యూచర్ కన్సూమర్ 44(5), ప్రతాప్ స్నాక్స్ 1,050(3) రెండో ఇంటి అద్దె మినహాయింపు పెంపు అందుబాటు గృహా రంగానికి ట్యాక్స్ హాలిడే పొడిగింపు, రెండో ఇంటి కొనుగోలుకూ క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు డీఎల్ఎఫ్ 166(1), ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 75(2) ఓబెరాయ్ రియల్టీ 450(2), గోద్రేజ్ ప్రొపర్టీస్ 746 (1) శోభ 477(1), ప్రెస్టీజ్ ఎస్టేట్స్ డెవలపర్స్ 201(0.2) పైరసీ నియంత్రణ, సినిమా షూటింగ్లకు సింగిల్ విండో పీవీఆర్ 1,575 (–2) ఈరోస్ ఇంటర్నేషనల్ 76(–2) ఐనాక్స్ విండ్ 70 (0.6) రైల్వేలకు రూ.64,000 కోట్ల కేటాయింపులు టిటాఘర్ వ్యాగన్స్ 67(–2), టెక్స్మాకో 56 (–1) , టిమ్కెన్ ఇండియా 569 (0.6), ఎస్కేఎఫ్ ఇండియా 1,897(–2) బ్యాంకులకు మూలధన నిధుల విషయమై ఎలాంటి హామీ లేదు కెనరా బ్యాంక్ 238(–5) దేనా బ్యాంక్ 12(–3) బ్యాంక్ ఆఫ్ ఇండియా 95(–8) విజయ బ్యాంక్ 43(–2) ఆశించిన స్థాయిలో పెరగని డైరీ రంగ కేటాయింపులు పరాగ్ మిల్క్ ఫుడ్స్ 205(–1) ప్రభాత్ డైరీ 56(–5) -
బడ్జెట్పై ‘కార్పొరేట్’ పలుకు...
దేశ ఆర్థిక వృద్ధికి మధ్యతరగతి వర్గాలు, చిన్న వర్తకులు, రైతులు జీవనాడి వంటివారు. బడ్జెట్ 2019లో ప్రకటించిన నిర్ణయాలు లక్షలాది మంది కలలు. – గౌతం అదానీ, అదానీ గ్రూపు చైర్మన్ ఆర్థిక రంగ దివాలా పరిస్థితి రాకుండా కీలకమైన మధ్యతరగతి, రైతాంగ విభాగాలకు ఇచ్చిన ఉపశమన నిర్ణయాలు గొప్పగా ఉన్నాయి. నియంత్రణతో కూడిన, ప్రేరణనిచ్చే కసరత్తు ఇది. ఆదాయాన్ని స్థిరీకరించి, ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు రిస్క్ను తగ్గిస్తాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ గ్రామీణ ప్రజలకు ఉపశమనం కలిగించే, వినియోగానికి ప్రేరణనిచ్చేలా బడ్జెట్ ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్య క్రమశిక్షణతో, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారం పడకుండా బడ్జెట్ను ప్రకటించినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి’’ – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినియోగాన్ని పెంచడం, వ్యవసాయం, గ్రామీణ వర్గాలు, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ప్రయోజనాలు కల్పించే కార్యాచరణ వృద్ధికి ప్రేరణనిస్తుంది. బడ్జెట్ నిర్ణయాలు ఆర్థిక రంగానికి మంచి చేస్తాయి. – సంజయ్పూరి, ఐటీసీ ఎండీ ఇది ఎన్నికల సంవత్సరం బడ్జెట్. అందరికీ ఉద్దేశించినది. రైతుల నుంచి వర్తకుల వరకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారి నుంచి మధ్యతరగతి వేతన జీవుల వరకు అందరికీ ఏదో ఒకటి ఉంది. ప్రభుత్వం చాలా సమతూకం పాటించింది. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామన్న సంకేతాన్నిచ్చింది. అయితే, ఆరోగ్య రంగానికి అదనపు కేటాయింపుల్లేకపోవడం లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ప్రోత్సాహకాలు లేకపోవడం నిరాశ కలిగించింది. – కిరణ్ మజుందార్షా, బయోకాన్ సీఎండీ వ్యవసాయం, మధ్యతరగతి వర్గాలే స్పష్టమైన లక్ష్యంతో బడ్జెట్ ఉంది. నేరుగా నగదు, పన్ను మినహాయింపుతో లబ్ధిదారులకు రూ.93,000 కోట్ల వెసులుబాటు కలిగిస్తుంది. ఈ పథకాలు వినియోగాన్ని పెంచుతాయి. గ్రామీణ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయి’’ – పవన్ ముంజాల్, హీరోమోటోకార్ప్ చైర్మన్ ప్రతీ రంగంలో, ప్రతీ వర్గంలో కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్ ఉంది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం. దీంతో వారు ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. మరింత మంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తారని, పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ చిన్న, మధ్య స్థాయి రైతులకు ఆదాయాన్నిచ్చే పథకం ఎంతో ఆహ్వానించతగినది. పశు సంరక్షణ, చేపల పెంపకం కోసం వడ్డీ రాయితీతో కూడిన రుణాలు ఆయా రంగాలకు చేయూతనిస్తుంది. ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.40,000కు పెంచడం కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు తోడ్పడతాయి. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ సంక్షోభం లేని ఆరోగ్య వ్యవస్థకు, ఆరోగ్య భారత్ విషయంలో ప్రభుత్వ కట్టుబాటును మధ్యంతర బడ్జెట్ తెలియజేసింది. ప్రభుత్వ చర్యల్లో ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా ఉండాలి. ఆరోగ్య సదుపాయాల విషయంలో పల్లెలు, పట్టణాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు అవకాశాలను కోల్పోకూడదు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు అవసరం’’ – సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ ఎండీ -
అతి లౌక్య బడ్జెట్!
మొన్న మహాత్మాగాంధీ అమరుడైన రోజు, ప్రధాని మోదీ స్టూడెంట్ కుర్రాళ్లకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు ఢిల్లీ తాలక్టోరా స్టేడియంలో మంచి క్లాసు పీకారు. ‘పరీక్షలు పండగలా ఉండాలి’ అనగానే, ‘అబ్బో! ఎలక్షన్లు మాత్రం ఉండద్దా’ అని ఓ తెలుగు కుర్రాడు గొణిగాడు. ‘మీరు పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని మోదీ అంటే ‘ఆప్ భీ’ అన్నదొక హిందీ అమ్మాయి. ‘జీవితంలో పరీక్షలు ఒక భాగమే తప్ప జీవిత సర్వస్వం కాదు’ అనగానే ‘ఎలక్షన్ల లాగా’నే అంటూ ఓ కుర్రాడు అందించాడు. ‘పిల్లలెప్పుడూ తుళ్లుతూ నవ్వుతూ ఉండాలి’ అన్నారు గంభీరంగా ప్రసంగ ధోరణిలో. అందరూ ఒక్కసారి ఫెళ్లున నవ్వారు. ఎందుకంటే ప్రధాని నవ్వడం వాళ్లెప్పుడూ పొరబాటున కూడా చూడలేదుట. భారత పూర్వ ప్రధాని చిరునవ్వడం వారి తండ్రి ఒకసారి కళ్లారా చూశారట. మరో ప్రధాని మన్మోహన్ నవ్వడం చూసిన పెద్దలు ఒకరిద్దరా సభలో ఉన్నారట. మోదీయే కాదు, ఆయన మంత్రివర్గంలో కూడా ఎవ్వరూ నవ్వరు. నీతిపరులు గంభీరంగా ఉండాలని నవ్వుతారు. పెద్ద పెద్ద జడ్జీలు, గవర్నర్లు సాధారణంగా నవ్వరు. పిల్లల్ని ఇంకొకరితో పోల్చి తక్కువ చేయవద్దని మోదీ చెప్పారు. బీజేపీ మాత్రం పోల్చుకుని అనవసరంగా పోటీ పడటం దేనికి? రేపు ఎన్నికల్లో తేడాపడితే దేశ సేవ చేయడానికి ఇంకొకరికి సువర్ణ అవకాశం వస్తుంది. మోదీ ఎక్కడున్నా ప్రజాసేవ మితం లేకుండా చెయ్యొచ్చు. స్వేచ్ఛగా బోలెడు ఉద్యమాలు చెయ్యొచ్చు. అసలు ఓం ప్రథమంగా రామమందిర నిర్మాణం మీద మహోద్యమం తీయచ్చు. దీంతో ఏంటంటే గుడి వచ్చినా రాకపోయినా, కొన్ని వర్గాల్లో గొప్ప కీర్తి మిగుల్తుంది. మొన్న పిల్లలకి వైఫల్యం నుంచి విజయం సాధించాలని చెప్పారు. ఇట్లాంటివి చెప్పడానికి భలే ఉంటాయి, కానీ వింటుంటే చెవుల్లో సెగలొస్తాయన్నాడొక స్టూడెంటు. ‘చదువు పుస్తకాల్లో మాత్రమే ఉండదు. పుస్తకాల్లోనూ ఉంటుంది’. విన్నావా, మనం కూడా మంత్రులమై ఇట్లా మాట్లాడాలిరా. వీళ్లకంటే కాషాయ డ్రెస్ వేసుకుని మాట్లాడే ప్యూర్ వేదాంతులు నయమని ఓ అమ్మాయి తెగ వేష్ట పడింది. మా స్కూలు టీచరు, మా గుళ్లో పూజారి వీళ్లు కూడా ఇవే మాటలు చెబుతుంటారు– వినే వాళ్లుంటే. పాపం వాళ్లకెవరూ ఉండరు. చాలా పెద్దాయన కాబట్టి ఎక్కడ చూసినా మైకులే– ఎవరూ విన్నా వినకపోయినా. రేడియోలు, టీవీలు మోదీ సందేశాన్ని వినిపించాయ్. అవన్నీ రేపెప్పుడో పుస్తకాలుగా వస్తాయ్. పాఠ్యగ్రంథాలు అవుతాయ్. కానీ ఆయన పవర్లో ఉండాలి. మనమే చచ్చినట్టు నిశ్శబ్దంగా వింటాం. ఇవ్వాళ పెద్ద పెద్ద వాళ్లు బడ్జెట్ సభలో తెగ కేకలు పెట్టారని పిల్లలు అనుకున్నారు. ‘ఔను, వాళ్లంటే సాటి సమానస్తులు కదా. వాళ్లకేం భయం’ అని కొందరు సమర్థించారు. బడ్జెట్ అన్నా తాయిలాలన్నా ఒకటేనా అని పిల్లలకి ధర్మ సందేహం వచ్చింది. ఎన్నికల ముందే అమ్మనాన్నలకి, మేష్టారికి మంచి చేస్తారెందుకు. ఇంకాస్త ముందు చెయ్యచ్చుకదా అని పిల్లలకి సందేహం వచ్చింది. ‘మంచి చేయడానికి ఓటు వేయడానికి ఎక్కువ టైం ఉంటే మర్చిపోరూ’ – ఓ పెద్ద కుర్రాడు దీర్ఘం తీశాడు. అసలిది గొర్రెతోక బడ్జెట్ట. కోతి తోకది తర్వాత వస్తుందిట– ఓ పెద్దాయన టీవీలో చెబుతున్నాడు. ఏ తోక అయితేనేంగానీ నేనెప్పుడూ ఏటా బడ్జెట్ ప్రసంగం శ్రద్ధగా వింటా. బంగారం, పెట్రోలు లాంటి వాటిపై పన్నులు రాయితీలు నేనసలు పట్టించుకోను. వాటిమీద ఉండేది కూడా స్వల్పంగానే ఉంటుంది. నాకు వినబుద్ధి అయ్యేవి, గుండు సూదులు, తుంగచాపలు, ఎర్రరంగు మొలతాళ్లు, కుక్కల మెడ బెల్టులు, నిక్కరు గుండీలు, సీళ్లలక్క, చింతరావి మామిడి కొయ్యలతో చేసిన పాంకోళ్లపై పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇంకా ఇట్లాంటివే బోలెడుంటాయి. ఈసారి మోదీ బడ్జెట్ అతిలౌక్యంగా కొట్టాడన్నాడొక గ్రామపెద్ద. మావూరి చిన్న టీకొట్లో స్ట్రాంగ్గా కావాలా, లైట్గా కావాలా అని అడిగితే ‘లౌక్యంగా కొట్టు’ అనడం అలవాటు. అంటే అటూ ఇటూ కాకుండా అని అర్థం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎగుమతులకు మరింత జోష్..
న్యూఢిల్లీ: ఎగుమతులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో వాటి పథకాలకు కేటాయింపులు మరింతగా పెంచింది కేంద్రం. 2019–20లో ఎగుమతి ప్రోత్సాహక స్కీములకు రూ.4,115 కోట్ల మేర కేటాయింపులను బడ్జెట్లో ప్రతిపాదించింది. 2018–19లో ముందుగా రూ. 3,551 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత సవరించిన గణాంకాల ప్రకారం ఇది రూ. 3,681 కోట్లకు పెరిగింది. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్లో పెట్టుబడులు, జాతీయ ఎగుమతి బీమా ఖాతా, వడ్డీ రాయితీ స్కీమ్ మొదలైన వాటికి ఈ నిధులను కేటాయించారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వడ్డీ రాయితీ స్కీమ్లకు కేటాయింపులు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు పెరిగాయి. 2011–12 నుంచి ఎగుమతులు సుమారు 300 బిలియన్ డాలర్ల స్థాయిలోనే తిరుగాడుతున్నాయి. 2017–18లో స్వల్పంగా 10 శాతం పెరిగి 303 బిలియన్ డాలర్లకు చేరాయి. -
రవాణా విప్లవానికి భారత్ కెప్టెన్
న్యూఢిల్లీ: అత్యధికంగా విద్యుత్ వాహనాల వినియోగంతో అంతర్జాతీయంగా రవాణా విప్లవానికి భారత్ సారథ్యం వహించగలదని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఈ క్రమంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇంధన భద్రత సాధించగలదన్నారు. ఇంధనం, గ్యాస్ దిగుమతులు తగ్గితే.. పునరుత్పాదక విద్యుత్ వనరులు గణనీయంగా వృద్ధి చెందగలవని మంత్రి వివరించారు. ‘ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే ఈ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదు. అలాగే గణనీయంగా విదేశీ మారకం కూడా ఆదా కాగలదు‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశీయంగా అమ్ముడయ్యే వాహనాల్లో 30% వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని పరిశ్రమవర్గాల అంచనా. సత్వర కార్యాచరణ ప్రణాళిక ఉండాలి .. రవాణా విప్లవానికి భారత్ సారథ్యం వహించాలంటే ప్రభుత్వం సత్వరమే నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, నిర్దిష్ట గడువు విధించుకుని అమలు కూడా చేయాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. ‘నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ప్రభుత్వం త్వరలోనే నిర్మాణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించగలదని ఆశిస్తున్నాం‘ అని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. విధానాలను తరచూ మార్చేస్తుండటం వల్ల తగ్గిపోయిన డిమాండ్కు ఊతమిచ్చేలా వచ్చే ఏడాది, రెండేళ్ల పాటు ప్రభుత్వం భారీ స్థాయిలో రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలకు ఊతమివ్వడంపై మరింతగా దృష్టి పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ స్వాగతించారు. వాయు కాలుష్య కారక ఉద్గారాలు వెలువడే స్థాయిని బట్టి వాహనాలపై పన్నులు విఢదించడం ద్వారా పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించవచ్చన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల దిగుమతులపై సుంకాలు తగ్గిస్తే.. ఆయా వాహనాల ధరలు కూడా తగ్గగలవని ట్వెంటీ టూ మోటార్స్ సహ వ్యవస్థాపకుడు పర్వీన్ ఖర్బ్ తెలిపారు. -
మోదీ.. ‘రియల్’ మేజిక్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేక మధ్యలోనే చేతులెత్తేస్తుండటం... అప్పటికే డబ్బులు చెల్లించి ఇళ్లకోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తుండటం కొన్నాళ్లుగా రియల్టీ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. రెరా వంటి చట్టాల్సి తెచ్చినా ఈ మధ్య కాలంలో రియల్టీ పుంజుకున్నది లేదు. ఈ రంగాన్ని ఆదుకోవటానికి కేంద్రం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాలూ భావిస్తున్న తరుణంలో ఈ సారి బడ్జెట్లో కేంద్రం పలు చర్యలు తీసుకుంది. అందుబాటు గృహాలపై పన్ను రాయితీలు మరో ఏడాది పాటు పొడిగించటమే కాకుండా... అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) మీద పన్ను మినహాయింపులు రెండేళ్ల వరకూ పొడిగించింది. రెండో ఇంటిపై కూడా ఆదాయ పన్ను మినహాయింపులిచ్చింది. వీటికి సంబంధించిన వివరాలు చూస్తే... ఊహాజనిత అద్దెపై పన్నుండదు.. ప్రస్తుతం ఒక వ్యక్తి పేరిట రెండు ఇళ్లున్నాయనుకోండి. అద్దెకు ఇవ్వకుండా రెండు ఇళ్లలోనూ తనే నివాసం ఉంటున్నా... ఒకదాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా భావించి, ఆ ఊహాజనిత అద్దెపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా, పిల్లల చదువు రీత్యా, లేక తల్లిదండ్రుల సంరక్షణ మొదలైన సందర్భాల్లో మధ్యతరగతి ప్రజలకు రెండు చోట్ల ఇళ్లు ఉండటమన్నది అవసరంగా మారిపోతోందని, అలా రెండు ఇళ్లలనూ తామే నివాసముంటున్నా అద్దె వస్తున్నట్లుగా భావించి ఆదాయపు పన్ను చెల్లించటమనేది ఇబ్బందిగా మారిందని తన బడ్జెట్ ప్రసంగంలో పీయూష్ గోయెల్ స్పష్టంచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్లో రెండో గృహంపై వచ్చే ఊహాజనిత అద్దెకు ఆదాయ పన్ను మినహాయింపునిచ్చారు. అంటే రెండు ఇళ్లున్న వారు తాము గనక రెండింట్లోనూ ఉంటే... ఒకదాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించి పన్ను కట్టక్కర్లేదన్నమాట. అంతేకాకుండా ఐటీ సెక్షన్ 54 ప్రకారం ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని రెండు ఇళ్లు కొనుగోలుకు వెచ్చించే అవకాశాన్ని కల్పించారు. గరిష్ఠంగా రూ.2 కోట్ల మొత్తానికి లోబడి ఈ రెండు ఇళ్లకు వెచ్చించిన మొత్తంపై మూలధన లాభాలకు మినహాయింపు కల్పిస్తారు. ఇప్పటిదాకా ఇది ఒక గృహం కొనుగోలుకు మాత్రమే వర్తించేది.కాకపోతే ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది! ఇన్వెంటరీ మీద నో ట్యాక్స్.. అమ్ముడు పోకుండా ఉన్న గృహాలపై (ఇన్వెంటరీ) పన్ను మినహాయింపును రెండేళ్ల వరకూ పొడిగించారు. ఈ ఏడాది ముగిసే నాటికి నిర్మాణం పూర్తయిన గృహాలకు కూడా ఈ మినహాయింపు వర్తింస్తుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ సుమారు 7 లక్షల వరకూ ఉంటుందని పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇన్వెంటరీ ఉన్న డెవలపర్లకు కాస్త ఊరట లభించిందన్నమాట. 2020 వరకూ సెజ్ లాభాల కొనసాగింపు.. స్టాంప్ డ్యూటీ వ్యవస్థలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించిందని.. క్లయింట్ నివాసం ఆధారంగా స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా స్టాంప్ డ్యూటీ సేకరిస్తారని బడ్జెట్లో గోయల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం స్పెషల్ ఎకనామిక్ జోన్లకు (సెజ్) అందుతున్న పోత్సాహకాలు, రాయితీల లాభాలను 2020 వరకూ పొడిగిస్తున్నట్లూ ప్రకటించారు. కాగా ఈ చర్యలు దేశంలోని వాణిజ్య రియల్టీ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని టాటా రియల్టీ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు. సెజ్లల్లోని స్టార్టప్స్, మధ్యస్థాయి కంపెనీలతో కమర్షియల్ స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ సెజ్ల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులకూ.. సెక్షన్ 80 ఐబీఏ ప్రకారం అందుబాటు గృహాలకు ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపును మరొక ఏడాది పాటు పొడిగించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అనుమతి పొందిన అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్ట్లకూ ఇది వర్తిస్తుంది. అందుబాటు ధరల్లోని గృహాలను నిర్మించే డెవలపర్లకు సెక్షన్ 80 ఐబీఏ కింద 100 శాతం ఆదాయ పన్ను రాయితీ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్ నిర్మాణ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. అందుబాటు గృహాల కార్పెట్ ఏరియా దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో 30 చ.మీ., మిగిలిన ప్రాంతాల్లో 60 చ.మీ. పరిమితికి లోబడి ఉండాలి. జీఎస్టీ తగ్గింపు కోసం మంత్రుల బృందం.. ఎన్నికల ముందు, ఆఖరి బడ్జెట్లో తప్పనిసరిగా రియల్టీ రంగంపై జీఎస్టీ తగ్గింపు ప్రకటన ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. జీఎస్టీ తగ్గింపు తోనే గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ ఉంటుందని ఎదురుచూశారు. కేంద్రం వీటికి ఫుల్స్టాప్ జీఎస్టీ తగ్గింపు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేకంగా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), బినామీ ట్రాన్సాక్షన్, ప్రొహిబిషన్ చట్టాలు వచ్చాక రియల్టీ లావాదేవీల్లో పారదర్శకత చేకూరింది. గృహాలపై జీఎస్టీ భారం తగ్గించాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది. జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఈ మంత్రుల బృందం సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ తగ్గింపు ప్రతిపాదనలను సిద్ధం చేస్తుందని భావిస్తున్నాం. తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని గోయల్ వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలపై 12%, అందుబాటు గృహాల మీద 8% జీఎస్టీ ఉంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) తీసుకున్న ప్రాజెక్ట్ల మీద జీఎస్టీ లేదు. డిజిన్వెస్ట్మెంట్తో రూ. 90వేల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2018–19లో ఈ లక్ష్యం రూ. 80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,000 కోట్లు సమీకరించిన కేంద్రం మరో రెండు నెలల్లో ఇంకో రూ. 44,000 కోట్లు సేకరణపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దాదాపు 57 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) లిస్టయ్యాయి. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 13 లక్షల కోట్లుగా ఉంటుంది. 2017–18లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 1 లక్ష కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్నట్లుగా రూ. 80,000 కోట్ల లక్ష్యాన్ని సాధించగలమనేది కేంద్రం అంచనా. ‘స్టాక్స్’పై ఒకే స్టాంప్ డ్యూటీ స్టాక్స్, బాండ్స్ వంటి ఆర్థిక సాధనాల లావాదేవీలపై ఇకపై ఒకే స్టాంప్ డ్యూటీ రేటును వర్తింపచేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ డ్యూటీని స్టాక్ ఎక్సే్చంజీలే వసూలు చేసి, ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు నివసించే రాష్ట్రాలతో కేంద్రం ఈ నిధులను పంచుకుంటుంది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన స్టాంప్ డ్యూటీ ఉంటోంది. ఈ సంక్లిష్టతలను తొలగించే దిశగా ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లావాదేవీలపై విధించే స్టాంప్ డ్యూటీలకు సంబంధించి సంస్కరణలు ప్రవేశపెడతామంటూ కేంద్రం గతేడాది ఇచ్చిన హామీని ప్రస్తుతం నెరవేర్చినట్లయింది. 2018–19 డిజిన్వెస్ట్మెంట్ ఆదాయం: 80,000 కోట్లు 2017–18లో రూ. లక్ష కోట్ల మొత్తం పీఎస్యూ షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు వచ్చింది -
ఎన్నికల బడ్జెట్
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వర్గాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఎట్టకేలకు కనికరిం చింది. పదవీకాలం ముగుస్తుండగా ‘కొసమెరుపు’లా వరాల జల్లు కురిపించి వారిని సంభ్రమాశ్చ ర్యాల్లో ముంచెత్తింది. శుక్రవారం ‘తాత్కాలిక బడ్జెట్’ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రధానంగా అటు చిన్న సన్నకారు రైతులను, ఇటు మధ్యతరగతిని సమ్మోహనపరచడానికి ప్రయ త్నించారు. ఇతరేతర వర్గాలకూ ఎన్నో తాయిలాలు పంచారు. అయిదెకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6,000 మూడు దఫాలుగా ఇస్తామని ప్రకటించారు. ఈ నగదును నేరుగా కేంద్రమే రైతులకు బదిలీ చేస్తుంది. గత డిసెంబర్ నుంచి ఇది అమల్లోకొస్తుంది. అంటే ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు రూ. 2,000 చొప్పున అందుతాయి. వేతన జీవుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడం, 60 ఏళ్ల వయసుపైబడిన అసంఘటిత రంగ కార్మికు లకు నెలకు రూ. 3,000 చొప్పున పెన్షన్ పథకం వంటివి సహజంగానే ఆ వర్గాలను ఆకట్టుకుం టాయి. తాజా ప్రతిపాదనలతో ఆదాయపన్ను పరిధి నుంచి తప్పుకునేవారి సంఖ్య 3 కోట్లు ఉండొ చ్చునని అంచనా. అలాగే 10 కోట్లమంది అసంఘటిత కార్మికులు పెన్షన్ లబ్ధి పొందుతారని లెక్కే స్తున్నారు. పదవీకాలం ముగుస్తున్న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్తో సరిపెట్టడమే సంప్రదాయంగా వస్తోంది. మోదీ సర్కారు కూడా దీన్ని తాత్కాలిక బడ్జెట్ అని చెబుతోంది. కానీ బడ్జెట్ ప్రతిపాద నలు గమనిస్తే ఇవి మూడు నెలల కాలానికి ఉద్దేశించినవి కాదని సులభంగానే తెలుస్తుంది. కొత్తగా పన్నులు విధించడం లేదా ఉన్న పన్నుల్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచే ప్రతిపాదనలు చేయడం వగైరాలకు ఫైనాన్స్ బిల్లు సవరించవలసిన అవసరం ఏర్పడుతుంది. నిష్క్రమిస్తున్న ప్రభుత్వం ఇలా తదుపరి ప్రభుత్వానికి భారం కలిగించరాదన్నది ఓటాన్ అకౌంట్ సంప్రదాయం లోని ఉద్దేశం. లోక్సభకూ, రాష్ట్రాల అసెంబ్లీలకూ జమిలి ఎన్నికలు జరపడంపై నిర్మాణాత్మక చర్చ సాగించాలని ఆమధ్య నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎప్పుడూ ఏవో ఎన్నికలు ముంచుకొస్తున్నం దువల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నదని ఆయన ఫిర్యాదు. కానీ తరచు ఎన్ని కలు వస్తే బడ్జెట్లు ఎంత బాగుంటాయో తాజా బడ్జెట్ చూశాక అందరికీ అర్ధమవుతుంది. ఇది పూర్తి స్థాయి బడ్జెట్టా, తాత్కాలికమా అన్న వివాదం సంగతలా ఉంచి ఇందులో సాధారణ రైతుల్ని పట్టించుకుని వారికి ఏదోమేర ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. నిజానికి రైతులకు ఆర్థిక ఆసరా కల్పించి వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నించే పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి ప్రకటించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుంది. ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో రైతులకు రూ. 12,500 చొప్పున అందజేస్తామని జగన్మోహన్రెడ్డి రెండేళ్లక్రితం చెప్పారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’, ఒడిశా ‘కలియా’, జార్ఖండ్ ‘ముఖ్యమంత్రి కృషి యోజన’వంటి పథకాలను ప్రకటించాయి. ఇప్పుడు కేంద్రం కూడా ఆ వరసలో చేరింది. అయితే నిజంగా రైతులకు లబ్ధి చేకూర్చదల్చుకుంటే తాజా పథకం వారి కష్టాలను ఏమాత్రం తీర్చదు. అలా తీరాలంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుకు అనుగుణంగా సాగు దిగుబడికయ్యే వ్యయానికి అదనంగా 50 శాతం చేర్చి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) నిర్ణయిస్తామని ఆ మేనిఫెస్టో చెప్పింది. నిజానికి సాగు వ్యయం అయిదారేళ్లుగా అపారంగా పెరిగింది. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగు మందులవరకూ అన్నిటి ధరలు మండుతున్నాయి. సాగు ఉపకరణాలకిచ్చే సబ్సిడీలు కొన్నేళ్లుగా కనుమరుగయ్యాయి. ఏటా కేంద్రం విడుదల చేసే ఆర్థిక సర్వేలే రైతు వార్షికాదాయం గరిష్టంగా రూ. 20,000 మించడం లేదని చెబుతున్నాయి. ఇంటిల్లిపాదీ కష్టపడటంతోపాటు కూలీలను కూడా నియమించుకుని పనిచేసే రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000(నెలకు రూ. 500) ఏ మూలకు సరిపోతాయి? ఈ బడ్జెట్లో అత్యంత కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 60,000 కోట్లు కేటాయిస్తూ చేసిన ప్రతిపాదన నిరాశ కలిగిస్తుంది. అయితే అవసరమనుకుంటే దీన్ని పెంచుతామని మంత్రి గోయెల్ హామీ ఇస్తున్నారు. నిరుటి బడ్జెట్లో ఈ పథకానికి రూ. 55,000 కోట్లు కేటాయించారు. మళ్లీ అవసరాలు పెరగడంతో ఆ కేటాయింపులు రూ. 61,084 కోట్లకు చేరాయి. అయితే ఈసారి ఆ మొత్తాన్ని మరింత పెంచకపోగా రూ. 1,084 కోట్లు కోత విధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చట్ట నిబంధనలకు అనుగుణంగా దీన్ని సక్రమంగా కొనసాగించడానికి కనీసం రూ. 80,000 కోట్లు అవసరమవుతాయని ఆ రంగంలోని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. విద్యారంగానికి చేసిన కేటాయింపులు కూడా నిరాశ కలిగిస్తాయి. నిరుడు ఆ రంగానికి రూ. 85,010 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడది 10శాతం పెరిగి రూ. 93,847 కోట్లకు చేరుకుంది. ఇది ఏమూలకూ సరిపోదని విద్యారంగ నిపుణులు చేస్తున్న వాదనలో నిజముంది. విద్య, ఉద్యోగావకాశాల్లో పేదలకు పది శాతం కోటా కల్పిస్తూ గత నెలలో సర్కారు నిర్ణయించింది. ఉన్నత విద్యాసంస్థల్లో అది అమలు కావాలంటే అదనంగా 25 శాతం సీట్లు పెంచాలి. ఇంత స్వల్ప మొత్తం అదనపు అవసరాలకు ఏమాత్రం చాలదు. ఇక ఇతర ఉన్నత సంస్థల సంగతి చెప్పనవసరం లేదు. రక్షణ వ్యయం 7 శాతం పెరిగి అది రూ. 3లక్షల కోట్లు దాటింది. ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లో ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. ఈ ఎన్నికల సంవత్సరంలోనైనా రైల్వేజోన్, ప్రత్యేక హోదా వంటి వాగ్దానాలను పరిశీలించేందుకు, సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నించలేదు. తాజా జనాకర్షణ బడ్జెట్ మరికొన్ని నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏమేరకు ఓట్లు రాబడుతుందో వేచిచూడాలి. -
క్రీడలకు రూ. 2,216 కోట్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమ మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు రూ. 2216.92 కోట్లను కేటాయించింది. గడిచిన ఏడాది కంటే తాజా బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ. 214.20 కోట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో క్రీడలకు రూ. 2002.72 కోట్లు వెచ్చించింది. బడ్జెట్ వాటాల్లో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి అత్యధికంగా నిధుల్ని కేటాయించింది. ఈ విషయాలను శుక్రవారం ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్సభలో వెల్లడించారు. ఇదీ ‘క్రీడల బడ్జెట్’ స్వరూపం ► ‘సాయ్’కి రూ. 450 కోట్లు. గతంలో (రూ. 396 కోట్లు) కంటే రూ. 54 కోట్లను ఎక్కువగా కేటాయించారు. జాతీయ శిబిరాల నిర్వహణ, క్రీడాసామాగ్రి కొనుగోలు, క్రీడాకారుల ఖర్చులకు వీటిని వెచ్చిస్తారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్) మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి గణనీయంగా రూ. 70 కోట్లకు పెంచారు. క్రీడాకారులకు అందించే ఇన్సెంటీవ్స్ కోసం రూ. 89 కోట్లను కేటాయించారు. గతంలో రూ. 63 కోట్లు మంజూరు చేశారు. ►క్రీడాకారుల ప్రోత్సాహకాలు, అవార్డుల్లో భాగంగా ఇచ్చే నగదు బహుమతుల మొత్తాన్ని రూ. 316.93 కోట్ల నుంచి రూ. 411 కోట్లకు పెంచారు. గతంతో పోలిస్తే రూ. 94.07 కోట్లు పెరిగాయి. ► ‘ఖేలో ఇండియా’కు రూ. 601 కోట్లు కేటాయించారు. ఇది గతం (రూ.550.69 కోట్లు) కంటే రూ. 50.31 కోట్లు అదనం. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు చేసే చెల్లింపుల్లో స్వల్పంగా కోత విధించారు. గతంలో రూ. 245.13 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 245 కోట్లకు పరిమితం చేశారు. -
ఓట్లకోసం పెట్టిన బడ్జెట్ : పొన్నం
సాక్షి, హైదరాబాద్ : సాంప్రదాయాలకు విరుద్దంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ప్రజాకర్షకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది కేవలం ఓట్లకోసం మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్గా తాము భావిస్తున్నామని తెలిపారు. గాంధీభవన్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 'ఐదు లక్షల ఆదాయపన్ను పరిమితి పెంపు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2014 లోనే రూ.2 లక్షల 50 వేలకు పెంచాము. చిత్తశుద్ది ఉంటే నాలుగేళ్లలో ఏటేటా పెంచాల్సింది. అలా కాకుండా ఇప్పుడు పెంచి అదికూడా 2019-20 నుంచి అమలు అంటున్నారు. నాలుగేళ్లుగా జీఎస్టీ, నోట్లరద్దు, అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గులు ప్రజలకు మేలు చేసేలా జరగలేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుంది, తప్ప మరేం లేదు. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.15 మంది ఎంపీలున్నా ఐదేళ్లుగా విభజన హామీల అమలు జరగకున్నా టీఆర్ఎస్ ఎందుకు పార్లమెంట్లో కొట్లాడటంలేదు. మోదీ పాలనతో దేశ ప్రజలకు ఒరిగింది సున్నా. రైతులు, చిన్న వ్యాపారులకు ఒరిగింది ఏం లేదు' అని అన్నారు. -
ఇది ట్రైలర్ మాత్రమే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్ సమాజంలోని అన్నివర్గాలకు లబ్ధి చేకూర్చేలా, సాధికారత కల్పించేలా ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల అనంతరం భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన పలు సంక్షేమ పథకాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ బడ్జెట్తో 12 కోట్లకుపైగా రైతు కుటుంబాలు, అసంఘటిత రంగంలో ఉన్న 30–40 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వ చర్యలతో దేశంలో ప్రస్తుతం పేదరికం రేటు గణనీయంగా తగ్గుతోంది. మధ్యతరగతి ప్రజలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంస్ఎంఈ)లకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు పొందిన మధ్యతరగతి ప్రజలకు అభినందనలు. దేశ నిర్మాణంలో మీరు చేసిన కృషికి సెల్యూట్ చేస్తున్నా’అని తెలిపారు. కిసాన్ నిధి పథకం చరిత్రాత్మకం.. ‘గతంలో ప్రభుత్వాలు రైతుల కోసం రకరకాల పథకాలు తీసుకొచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చలేకపోయాయి. కానీ ‘ప్రధానమంత్రి కిసాన్ నిధి’పేరుతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం చరిత్రాత్మకమైనది. దీనికింద 5 ఎకరాల వరకూ భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరుతుంది. నవ భారత్ నిర్మాణంలో భాగంగా పశుపోషణ, చేపల పెంపకం రంగాలపై బడ్జెట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన’కింద దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులు లాభపడతారు. ఆయుష్మాన్ భారత్, ఇతర సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు అన్నివర్గాలకు దక్కాలి. ఈ మధ్యంతర బడ్జెట్ పేదలకు సాధికారత కల్పిస్తుంది. రైతులకు ప్రోత్సాహం, ఆర్థికాభివృద్ధికి ఊతమందిస్తుంది’’అని పేర్కొన్నారు. -
ఇదో చరిత్రాత్మక నిర్ణయం : పీయూష్
ఢిల్లీ : దేశ సమగ్ర వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకోలేదని తెలిపారు. ప్రతి వర్గానికి మేలు జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లింపు నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి 2018 డిసెంబర్ నుంచే అమలవుతుందని చెప్పారు. రూ. 6 వేల ఆర్థిక సాయం చిన్న రైతులకు గొప్ప ఊరటనిస్తుందని పీయూష్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో 12.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారన్నారు. ముద్ర రుణాల ద్వారా అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకున్నామన్నారు. పెన్షన్ పథకం ద్వారా కోట్లాది మందికి ప్రయోజం చేకూరనుందని తెలిపారు. -
రైతుల ఆదాయం ఇక రెట్టింపు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ అనే కొత్త పథకాన్ని శుక్రవారం నాడు పార్లమెంట్కు సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించారు. దీని కోసం 75 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ ఫథకం లక్ష్యం. ‘2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఈ కొత్త పథకంతో సాకారం అవుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు వ్యాఖ్యానించారు. అప్పుడు భారతీయులు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరింత సగౌరవంగా జరుపుకోవచ్చని ఆయన అన్నారు. ఆయన మాటల్లో నిజముందా? ఆయన వ్యాఖ్యలు నిజమవుతాయా? ఐదెకరాలలోపు భూమున్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అంటే నెలకు 500 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం అన్న మాట. ఓ రైతు కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే వారిలో ఒక్కొక్కరికి రోజుకు 3.3 రూపాయల సహాయం అందుతుందన్న మాట. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం వద్ధి రేటు జీడీపీలో 2.5 శాతం ఉంది. అది పన్నెండు శాతానికి పెరిగితే తప్పించి రైతుల ఆదాయం రెట్టింపు కాదని వ్యవసాయ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. మరో మూడేళ్ల కాలంలో 2.5 శాతం ఉన్న వద్ధి రేటు 12 శాతానికి చేరుకోవడం ఎలాసాధ్యం? రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు గత బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని కొత్త పథకం పేరిట 75 వేల కోట్ల రూపాయలకు పెంచారు. రైతు బడ్జెట్ను మూడుంబావు రెట్లు పెంచినంత మాత్రాన 2.5 శాతం ఉన్న వ్యవసాయం వద్ధిరేటు 12 శాతాన్ని ఎలా తాకుతుంది? నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో వివిధ వ్యవసాయ పంటల కనీస మద్దతు ధరలు పడిపోయాయి. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కారు. 2018లో దేశవ్యాప్తంగా రైతులు పలుసార్లు ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిని మంచి చేసుకోవడం కోసం రానున్న పార్లమెంట్ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని రైతులకు తాయిలం ప్రకటించారు. -
బడ్జెట్ లైవ్ అప్డేట్స్ : వేతన జీవులకు భారీ ఊరట
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కారు బడ్జెట్ ఉంటుందన్న భారీ అంచనాల నేపథ్యంలో తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు గోయల్ తన బడ్జెట్ చిట్టాను విప్పారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్.. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు.. (సాక్షి లైవ్ కవరేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మధ్యంతరం కాదు.. అభివృద్ధికి రోడ్ మ్యాప్ తాత్కలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మధ్యంతరం కాదిది.. అభివృద్ధికి రోడ్ మ్యాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వేతన జీవుల ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించే సందర్భం సభికులను, టీవీల ముందున్న సాధారణ ప్రజలను ఆకట్టుకుంది. సమయం: 12.45: ముగిసిన పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం. లోక్ సభ సోమవారానికి వాయిదా ఆదాయపు పన్ను పరిమితి పెంపు ఎన్నికల ముందు వేతన జీవులకు భారీ ఊరట రూ.5లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు ఇప్పటివరకు ఇస్తున్న పన్ను మినహాయింపు రెట్టింపు గృహరుణాలు, ఇంటిఅద్దెలు,. ఇన్సురెన్స్లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలకు పెంపు పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంపు నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ ఉండదు. సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు. సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు సినీనిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు సినిమా టికెట్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు పైరసీ అరికట్టడం కోసం యాంటీ కామ్ కార్డింగ్ ప్రొవిజన్ యాక్ట్ అతి తక్కువ ఖర్చుతో డేటా, వాయిస్ కాల్స్ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచంలోనే అతి తక్కవ ఖర్చుతో డేటా, వాయిస్ కాల్స్ సేవలు 24 గంటల్లో ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్ 2030 నాటికి భారత్లో ఎలక్ట్రానిక్ వాహనాలు రైల్వే బడ్జెట్ రూ. 64,587 కోట్లు రేల్వేశాఖకు రూ. 64, 587 కోట్ల బడ్జెట్ కేటాయింపు రైల్వే చరిత్రలోనే ప్రమాదాలు జరగని ఏడాది బారీగేజ్లో కాపలా లేని గేట్లను తొలగించాం. త్వరలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఒక్కరికి ఇళ్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో 10 రెట్ల వృద్ధి 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించాం దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు జాతీయ గ్రామీణుపాధి హామీ పథకానికి రూ. 60వేల కోట్ల కేటాయింపు ఈఎస్ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు రక్షణ రంగానికి భారీ కేటాయింపులు రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయింపు సైనికులకు ప్రత్యేక అలవేన్స్లు అవసరమైతే రక్షణ శాఖకు అదనంగా నిధులు ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు కార్మికుల కోసం పెన్షన్ పథకం ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్. 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా పథకం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్. అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు బోనస్ పరిమితి 21వేల పెంపు ఉపాది అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్వో సభ్యులు పెరిగారు. బోనస్ పరిమితి 21వేల పెంపు గ్రాట్యూటీ పరిధి 10 లక్షల నుంచి 30 లక్షల పెంపు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలి ఎన్పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు రైతులపై వరాల జల్లు చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం. ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లింపు 12 కోట్ల రైతులకు లబ్ధి కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు రైతు పెట్టుబడి సాయం 2018 డిసెంబర్ నుంచే అమలు రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్ పాడిపరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనపు మూడు శాతం వడ్డీ రాయితీ 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యం రంగం భారీ మార్పులు చూసింది. ప్రధాని మోదీకి ప్రజల ఆరోగ్యంపై ఎంతో ఆందోళన ఉండేది. 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయుష్మాన్ పథకం ప్రవేశపెట్టాం. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం దేశ ఆత్మవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది. 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది. జీడీపీ వృద్ధి రేటులో గణనీయ పురోగతి సాధించాం విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం గడిచిన ఐదేళ్లలో భారత్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. డబుల్ డిజిట్ ద్రవ్యోల్పణాన్ని తగ్గించాం. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్ నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాం రాష్ట్రాలికచ్చే ఆర్థిక వాటాను పెంచాం. సహకార సమాక్యస్పూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాం బ్యాంకింగ్ రంగంలో 4ఆర్ ప్రవేశపెట్టాం మొండిబకాయిలు మూడు లక్షల కోట్లు వసూలు చేశాం మా చర్యల కారణంగా నిన్నే 3 బ్యాంకులపై ఆంక్షలు తొలిగాయి. బ్యాంకుల సరైన స్థితి ప్రజల ముందుంచాలని ఆర్బీఐని కోరాం బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం. ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడటమే మా ధ్యేయం మేం అవినీతి రహిత పాలనను అందించాం. స్వచ్ఛభారత్ ద్వారా ప్రవర్తనలో మార్పు తెచ్చాం. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాం. రెరా ద్వారా నియంత్రణను విధించాం. రిజర్వేషన్లను యథాతధంగా ఉంచుతూ కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చాం. సమయం 10:55: విపక్షాల నిరసనల మధ్య మధ్యంతర బడ్జెట్ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెడుతున్నారు. సమయం 10:55: తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్కు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. సమయం 10:35: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హయాంలో నోట్ల రద్దు చేసిన ఏడాదే అత్యధికంగా భారత్ వృద్ధి రేటు 8.2 శాతం వచ్చిందని, మరోసారి నోట్ల రద్దు చేయాలన్నారు. ఈ సారి రూ.100 నోట్లు రద్దు చేయమని సూచిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. The demonetisation year was the best year of growth (8.2%) under Mr Modi. So, let's have another round of demonetisation. This time let's demonetise 100 rupee notes. — P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019 సమయం 10:16: రైల్వే శాఖలో ప్రభుత్వ పెట్టుబడులు మరింతే పెరిగే అవకాశం ఉందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇప్పటికే సీసీటీవీల ఏర్పాట్లు, వైఫై సౌకర్యాల కోసం పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వం.. ఈబడ్జెట్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని మనోజ్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. Manoj Sinha, Minister of State for Railways: The way the government has increased the investment in railways, from installing CCTV cameras to WiFi, I believe further investment in railways will certainly be increased. #Budget2019 pic.twitter.com/hCxmn2rFpW — ANI (@ANI) February 1, 2019 సమయం 10:10: మధ్యంతర బడ్జెట్ను మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పత్రాలతో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్కు చేరుకున్నారు. అంతకుముందు పీయూష్ గోయల్ రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ను కలుసుకున్నారు. #WATCH Finance Minister Piyush Goyal arrives at the Parliament with the #Budget briefcase. He will present the interim #Budget 2019-20 at 11 am #Budget2019 pic.twitter.com/4sCsHZUCBI — ANI (@ANI) February 1, 2019 సమయం 10:05: పార్లమెంట్ భవనంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. మధ్యంతర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరి సంప్రదాయం ప్రకారమే అయితే, పదవీకాలం చివర్లో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్లో కీలక విధాన నిర్ణయాలేవీ ఉండవు. పరిమిత కాలానికి ఖర్చులకు సంబంధించి అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు, సమస్యల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు రుణాలపై వడ్డీ రాయితీతోపాటు పలు ఇతర ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలను విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంటు అనుమతి కోరడానికి అదనంగా.. గ్రామీణ, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలను పీయూష్ గోయల్ ప్రకటించొచ్చని భావిస్తున్నారు. -
తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్
-
నేడే ఎన్ని‘కలల’ బడ్జెట్..!
న్యూఢిల్లీ: మోదీ సర్కారు ఎన్నికల ముందు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుందా? లేదంటే సంప్రదాయాలను అనుసరించి కేవలం పద్దులకే పరిమితం అవుతుందా? మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కారు బడ్జెట్ ఉంటుందన్న భారీ అంచనాల్లో నిజం పాళ్లు ఎంతన్నది... పార్లమెంటులో శుక్రవారం తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తేటతెల్లం చేయనుంది. ఉదయం 11 గంటలకు గోయల్ బడ్జెట్ చిట్టాను విప్పనున్నారు.. మరో మూడు నెలల్లోపే ఎన్నికలు ఉండడంతో సంప్రదాయానికి అనుగుణంగా తాత్కాలిక బడ్జెట్నే ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి సంప్రదాయం ప్రకారమే అయితే, పదవీకాలం చివర్లో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్లో కీలక విధాన నిర్ణయాలేవీ ఉండవు. పరిమిత కాలానికి ఖర్చులకు సంబంధించి అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు, సమస్యల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు రుణాలపై వడ్డీ రాయితీతోపాటు పలు ఇతర ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలను విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంటు అనుమతి కోరడానికి అదనంగా.. గ్రామీణ, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలను పీయూష్ గోయల్ ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిళ్లు.. విపక్ష కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు దేశ్యాప్తంగా రుణ మాఫీ, పేదలకు కనీస ఆదాయం ఇస్తామన్న హామీలతో పాలక బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు సవాలు విసిరింది. దీంతో తాము సైతం ఏదో ఒకటి చేయాల్సిన ఒత్తిళ్లు మోదీ సర్కారుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించి ఊరటనిచ్చే ప్యాకేజీ లేదా పథకం ఏదైనా ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల సబ్సిడీల స్థానంలో నగదు ప్రయోజనం లేదంటే సబ్సిడీలకు అదనంగా ఇవ్వడం ద్వారా గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించే రీతిలో ఉంటుందని అంచనా. ముఖ్యంగా రైతులకు తెలంగాణలో మాదిరిగా నేరుగా నగదును అందించడం లేదా వడ్డీ రహిత సాగు రుణాలను ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే, ఆహార పంటలకు ఉచితంగా బీమా కల్పించడం కూడా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలి పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి రైతాంగ సంక్షోభమే కారణమని విశ్లేషణల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలకు చోటు? ► రైతాంగానికి ప్యాకేజీ. ఇందుకోసం ప్రభుత్వంపై అదనంగా రూ.లక్ష కోట్ల వరకు భారం. ఆహార పంటలకు ఉచిత బీమా. ► వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును 60 ఏళ్లలోపు వారికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం. వృద్ధుల్లోని రెండు వర్గాలకు కూడా ఇంతే మేర మినహాయింపు పెంపు. మహిళలకు రూ.3.25 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అవకాశం. కేవలం పన్ను మినహాయింపును పెంచి, ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు చేయకపోతే ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం ఉండదని భావిస్తున్నారు. ► సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు. ► ఇళ్ల ప్రాజెక్టుల్లో జాప్యం, పెరిగిన వడ్డీ రేట్ల నేపథ్యంలో... సొంతింటికి తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచే అవకాశం. ► చిన్న వ్యాపారులకు చౌక వడ్డీకే రుణాలు ► ఉద్యోగాల కల్పన దిశగా నిర్ణయాలు. ► దేశవ్యాప్తంగా ప్రతీ పేద కుటుంబానికి నగదు ప్రయోజనాన్ని అందించే సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకంపైనా ఊహాగానాలు రాగా, ఇది భారీ బడ్జెట్తో కూడుకున్నది కావడంతో మోదీ సర్కారు దీని విషయంలో ముందుకు వెళ్లకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. తాత్కాలిక బడ్జెటే: ప్రధాని మోదీ సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలను ఫలప్రదం చేయాలని విపక్ష పార్టీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పార్లమెంటు హౌజ్లో గురువారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేడు ప్రవేశపెడుతున్న బడ్జెట్.. తాత్కాలిక బడ్జేటేనని, పూర్తిస్థాయి బడ్జెట్ కాదని విపక్ష నేతలకు ఆయన స్పష్టతనిచ్చారు. లోక్సభ ఎన్నికల ముందు జరిగే ఈ చివరి సమావేశాల్లో సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లుగా అందించిన సహకారానికి విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనున్న 48 బిల్లుల ప్రతులను సభ్యులకు అందజేశారు. ఎన్నికలున్నందున, ట్రిపుల్ తలాఖ్, పౌరసత్వ బిల్లు తదితర వివాదాస్పద బిల్లులను సభలోకి తీసుకురాకపోవడమే మంచిదని కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర విపక్ష నేతలు ప్రభుత్వానికి సూచించాయి. ఆ బిల్లులను ప్రవేశపెడ్తే సభలో జరిగే ఆందోళనలకు తాము బాధ్యులం కాబోమని స్పష్టం చేశాయి. ఆర్థిక పర్యవసానాలు ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే... ఈ తరహా నిర్ణయాలు బడ్జెట్లో ఉంటే గనుక... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి పరిమితం కావాలన్న ప్రభుత్వ లక్ష్యం సాధ్యం కాదు. పైగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అదనంగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని అంచనా. ఇప్పటికే 2018–19 సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు అంచనాలకు అనుగుణంగా లేవు. రూ.1.4 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వ్యయాలను తగ్గించకుండా, సాగు రంగానికి అధిక సబ్సిడీ ప్రయోజనాలకు చోటిస్తే అది ద్రవ్యలోటు పెరిగేందుకు దారితీస్తుందంటూ ఫిచ్ సహా ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి కూడా. -
బడ్జెట్పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ
-
బడ్జెట్పై ఆర్థిక మంత్రి స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు బదులు నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందనే వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2019-20 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సాధారణంగా ఎన్నికల ఏడాది మధ్యంతర బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆనవాయితీ.ఎన్నికల అనంతరం కొలువుతీరే ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఎన్నికలకు ముందు పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయానికి సంబంధించి అనుమతి అవసరం కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం కొద్దినెలల కాలానికి ప్రవేశపెడుతుంది. కాగా,ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడంతో గత వారం ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ సహాయమంత్రులు పొన్ రాధాకృష్ణన్, శివ్ ప్రతాప్ శుక్లాలు ఇటీవల హల్వా వేడుకతో బడ్జెట్ కసరత్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ సర్కార్ స్వస్తిపలుకుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీనే బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఏప్రిల్లో నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభానికే మంత్రిత్వ శాఖలు తమ కేటాయింపులు పొందేలా కార్యాచరణ రూపొందించుకునే వెసులుబాటు ఏర్పడింది. -
ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలి
న్యూఢిల్లీ: రానున్న మధ్యంతర బడ్జెట్పై ఫార్మా, హెల్త్కేర్ రంగం పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినప్పటికీ కొన్ని విధానపరమైన చర్యల అవసరాన్ని ప్రస్తావించాయి. ఎగుమతులకు ప్రస్తుతం ప్రోత్సాహాలు కల్పిస్తున్న ‘భారత్ నుంచి సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్)’ 2020 మార్చిలో కాల వ్యవధి తీరిపోతుందని, దీన్ని పొడిగించాలని పరిశ్రమ ప్రధానంగా కోరుతోంది. ఈ తరహా పథకాలను పొడిగించాలని పరిశ్రమ కోరుకుంటున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఇక పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వ్యయాలపై ఉన్న 150 శాతం ప్రామాణిక మినహాయింపును 200 శాతం చేయాలన్నది మరో డిమాండ్గా ఆయన పేర్కొన్నారు. ఆర్అండ్డీకి ఈ మాత్రం ప్రోత్సాహకం అవసరమన్నారు. జీఎస్టీని మినహాయించాలి... జీఎస్టీని హేతుబద్ధీకరించాలని హెల్త్కేర్ రంగం కోరుతోంది. పెరిగిన ముడి పదార్థాల ధరలతో ఆరోగ్య సంరక్షణ భారంగా మారుతోందని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎండీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను అందుబాటు ధరల్లో ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా... ఈ రంగానికి సరఫరా అయ్యే ముడి పదార్థాలపై జీఎస్టీని మినహాయించాలని సూచించారు. ఎందుకంటే ఈ ధరల భారాన్ని రోగుల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించకపోవడంతో, చెల్లించిన జీఎస్టీని సర్దుబాటు చేసుకోలేకపోతున్నట్టు ఆమె చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై ప్రభావం పడి, తమ నిధుల లభ్యత ప్రభావితమై అధునాతన టెక్నాలజీలు, నాణ్యతపై వెచ్చించే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 150 శాతం తరుగుదలను అనుమతించే సెక్షన్ 35ఏడీని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. నూతన ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఇది ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ఆమె వివరించారు. ‘‘ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. మన దేశంలో ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేసే సగటు ఖర్చు 85 డాలర్లు (6,035). ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రానున్న బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నియంత్రణలు లేకుండా ప్రైవేటు రంగానికీ విస్తరింపచేయాలి’’ అని హెల్త్కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్, సీఈవో అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రోత్సాహకాలు కావాలి... చిన్న పట్టణాల్లోనూ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను రానున్న బడ్జెట్లో ప్రకటించాలని హెల్త్కేర్ స్టార్టప్ ‘లెట్స్ఎండీ’ కోరింది. అలాగే, బీమా వ్యాప్తి కోసం చర్యలు అవసరమని ఈ సంస్థ సీఈవో నివేష్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవల వ్యయాలు పెరిగిపోతుంటే, ఈ రంగంలో బీమా విస్తరణ అతి తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం, మెడికల్ డివైజెస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు మొదలైన చర్యలతో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా హెల్త్కేర్ విభాగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్లో వీటికి తగినంత స్థాయిలో నిధుల కేటాయింపు జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం వైద్య పరికరాల రంగం 70 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీన్నుంచి బయటపడేందుకు మేకిన్ ఇండియా నినాదం తరహాలో బై ఇండియా (భారతీయ ఉత్పత్తులే కొనుగోలు చేయడం) విధానాలు కూడా అమలు చేస్తే బాగుంటుంది. – జీఎస్కే వేలు, మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ గ్రూప్ చైర్మన్ -
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పియూష్ గోయల్కు ప్రభుత్వం కేటాయించింది. దాంతో కేంద్ర తాత్కాలిక బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన గోయల్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పియూష్ గోయల్ రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా ఉండగా, ఇప్పుడు ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలను అదనంగా ఇచ్చారు. గతేడాది జైట్లీ మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్నప్పడు కూడా ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా వంద రోజులపాటు గోయల్ ఉన్నారు. ఈసారి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సరిగ్గా 9 రోజుల ముందు ఆర్థిక శాఖ బాధ్యతలు గోయల్కు దక్కడం గమనార్హం. జైట్లీ తిరిగి బాధ్యతలు చేపట్టే వరకు గోయల్ ఆర్థిక మంత్రిగా కొనసాగుతారనీ, జైట్లీ మంత్రిగా కొనసాగనున్నప్పటికీ ఆయనకు ఏ శాఖలూ ఉండవని రాష్ట్రపతి భవన్ నుంచి బుధవారం విడుదలైన ఒక ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. -
పీయూష్ గోయల్కు అదనపు బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతుండటంతో ఆ శాఖ తాత్కాలిక బాధ్యతలను గోయల్ చూసుకోనున్నారు. పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. జైట్లీ తిరిగి బాధ్యతల్లో చేరే వరకు గోయల్ ఈ బాధ్యతలను చేపట్టనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే సంగతి తెలిసిందే. -
టీచర్లకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : ఏడవ వేతన సంఘం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ అకడమిక్ స్టాఫ్, ప్రభుత్వ ఎయిడెడ్ సాంకేతిక విద్యాసంస్ధల ఉద్యోగులకూ వర్తింపచేయాలనే ప్రతిపాదనను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ 1241.78 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా పెరిగిన వేతన బకాయిలను ఆయా సంస్థలకు కేంద్రం రీఎంబర్స్ చేయనుంది. మరోవైపు ఫిబ్రవరి 1న మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో వేతన పెంపుపై 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వేతన పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ 18,000ను రూ 26,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్మెంట్ను సైతం ప్రస్తుతమున్న 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లకు పెంచాలని పట్టుబడుతున్నాయి. -
మోదీ సర్కార్ చివరి బడ్జెట్కు ముహూర్తం ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ బడ్జెట్ సెషన్కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13వరకు కొనసాగుతాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యంతర బడ్జెట్ ఎందుకు? ఎన్నికల సంవత్సరంలో ఏ ప్రభుత్వమైనా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టదు. అందుకే ఈ సారి పార్లమెంట్ ఉభయసభల్లో మధ్యంతర బడ్జెట్ను ఆర్థికమంత్రి జైట్లీ ప్రవేశపెడతారు. అయితే మధ్యంతర బడ్జెట్ కూడా దాదాపు ఫుల్ బడ్జెట్లాగానే ఉంటుంది. ప్రస్తుత ఏడాది లెక్కలు, పద్దులతోపాటు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో మధ్యంతర బడ్జెట్లో వివరిస్తారు. కాగా 2019 ఎన్నికల్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది ఆరవది.. చివరి బడ్జెట్. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే చాలా కీలకమైన ప్రస్తుత బడ్జెట్ తాయిలాలపై కసరత్తును జైట్లీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రహదారులు, ఉక్కు, రైల్వే, పవర్, పట్టణాభివృద్ధి లాంటి వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి కేంద్రం ఎలాంటి వరాలు కురిపించనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ధరల తగ్గింపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ కోత తగ్గింపు కారణంగా పలు వాహన కంపెనీల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, వీఈ కమర్షియల్ వెహికల్స్, యమహా, టీవీఎస్లు చేరాయి. టాటా తగ్గింపు లక్షన్నర వరకూ టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను రూ. 1.5 లక్ష వరకూ తగ్గించింది. తమ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.6,300-రూ.69,000 వరకూ తగ్గించామని, అలాగే వాణిజ్య వాహనాల ధరలను రూ.15,000-రూ.1,50,000 వరకూ తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులందించడానికి ఈ ధరలు తగ్గించామని వివరించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోర్డ్ కోత రూ.1.07 లక్షల వరకూ తమ వాహనాలపై రూ. 23,399 నుంచి రూ.1.07 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నామని ఫోర్డ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఫోర్ట్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించింది. వీఈ కమర్షియల్..: ఐషర్ ట్రక్కులు, బస్సులపై ధరలను తగ్గిస్తున్నామని వీఈ కమర్షియల్ వెహికల్స్ పేర్కొంది. 4 శాతం ఎక్సైజ్ సుంకం పూర్తి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని, ఈ తగ్గింపు ఈ నెల 18 (మంగళవారం) నుంచే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. యమహా ఇండియా... కంపెనీ టూవీలర్స్ ధరలను రూ.1, 033 నుంచి రూ. 3,066 వరకూ తగ్గించింది. ఎక్సైజ్ సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ శుక్రవారం తెలిపారు. ఈ కంపెనీ ఆల్ఫా, రే జడ్, రే స్కూటర్లను, వైబీఆర్ 110, ఎఫ్జడ్16, వైజడ్ఎఫ్ ఆర్15 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. టీవీఎస్ తగ్గింపు రూ.3,500 వరకూ ఎక్సైజ్ సుంకం తగ్గింపును పూర్తిగా వినియోగదారులకే అందిస్తున్నామని, తమ టూవీలర్లు, త్రీ వీలర్ల ధరలను రూ.850 నుంచి రూ.3,500 వరకూ తగ్గిస్తున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) జె. శ్రీనివాసన్ తెలిపారు. డీలర్ల దగ్గర ప్రస్తుతమున్న స్టాక్లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. ఈ కంపెనీ స్టార్ సిటీ, అపాచీ ఆర్టీఆర్ బైక్లతో పాటు జూపిటర్, వెగో స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోక్స్వ్యాగన్, మహీంద్రా, ఫియట్, మెర్సిడెస్, ఆడి, హీరో, హోండా మోటార్ సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి. -
బడ్జెట్ కాదు... బలిపీఠం!
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్లో ఆమ్ఆద్మీకి మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోకపోగా సామాన్యుడినే వధ్యశిలపై నిలబెట్టారు. ఒకప్పుడు డ్రీమ్బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. తాజాగా చిదంబరం వెలువరించిన ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమ్ఆద్మీ పాలిట పీడకల లాంటిదే. ఆమ్ఆద్మీ అనే పదాన్ని రూపొందించినదీ, ప్రచారంలో పెట్టిందీ కాంగ్రెస్ పార్టీయే. కాని దాన్ని ఆచరణలో పెట్టలేదు. గత బడ్జెట్లలో చేసిన కేటాయింపుల ఫలితాలు ప్రజలకు చేరకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అనే కాకి ఎత్తుకుపోయింది. అయినా, కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కాలేదనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే తిరుగులేని ఉదాహరణ. ధరల పెరుగుదల నుంచి ఉపశమనం కలిగించడానికి ఆయనకు కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, లారీలు, మొబైల్ ఫోన్లు ఉన్నవారే కనిపించారు. ఈ చర్యల ద్వారా వీటిని ఉత్పత్తి చేసే కంపెనీల అధిపతులు, వినియోగించే ఉన్నత, మధ్య తరగతి వారే లాభం పొందుతారు. బడ్జెట్లో ఆమ్ఆద్మీ కనిపించలేదు. అవును, డ్రీమ్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారికి వారెలా కనిపిస్తారు? రేపో, మాపో ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ ఓట్ల కోసమైనా, వాళ్లకేదైనా మేలు చేయకపోతే, వాళ్ల ఓట్లు తన పార్టీకి రావనే ఆలోచన అయినా రాలేదంటే, కాంగ్రెస్ నాయకులూ, ఆ పార్టీ నాయకుడు చిదంబరం ఎంత పాషాణ హృదయం కలవారో ఓటర్లు గమనించాలి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమ్ ఆద్మీ పట్ల అదే ధోరణిని ప్రతిబింబిస్తుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, యువత, సంపన్నుల ఓట్లను కొల్లగొట్టుకోవడంపైనే ఆయన దృష్టి పెట్టారు. వీరిలో అత్యధికులు పడక కుర్చీ రాజకీయవేత్తలు, మేధావులు. ఇలాంటి వారు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్లి క్యూలో నిల్చుంటారా? రాయితీల నజరానా పారిశ్రామిక రంగాన్ని చూస్తే, స్వాతంత్య్రం వచ్చిన మొదటి రెండు మూడు దశాబ్దాలలో పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వం వైపు చూశారేమోగాని, ఆ తర్వాత బలం పుంజుకుని ప్రభుత్వాన్నే తమ వైపు చూసే స్థాయికి ఎదిగారు. బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ చేరతాయన్నట్లు ప్రజాసేవ పేరుతో నాయకులు, వినాయకులు డబ్బు సంపాదనకు పాల్పడటంతో పారిశ్రామికవేత్తలు ఈ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి డబ్బు విరజిమ్మి తమ పనులు చేయించుకోవటం ప్రారంభించడంతో ఇద్దరి మధ్య వారధి ఏర్పడింది. అవినీతే ఆ వారధి. కార్పొరేట్లకు ఊడిగం చేయడం, వారి మీద బరువు భారాలు తగ్గించడం, పన్నుల రాయితీలు ఖజానాకు చిల్లుపడినా మనం చెల్లించే పన్నుల సొమ్ముతో రాయితీలు ప్రకటించడం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మారింది. బడ్జెట్ సందర్భంగా ఇచ్చే పుస్తకాలలోని ఒక పుస్తకంలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో లెక్కలిస్తారు. గత నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు రూ. 5 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు రాయితీలందుతున్నాయి. ఈ బడ్జెట్తోపాటు ఆ పుస్తకం అందజేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇవ్వకపోయి ఉండవచ్చు. కానీ గత సంవత్సరం డిసెంబర్ 12న పార్లమెంటులో ఒక ప్రశ్నకు జవాబిస్తూ అలాంటి పన్నుల మినహాయింపు వల్ల ఖజానాకు గండిపడిన మొత్తం రూ.4.82 లక్షల కోట్లు! ఇదీ మనం పన్నుల రూపంలో చెల్లించే ఆదాయానికి పట్టిన గతి. పార్లమెంటులోనూ, బయటా అటు మంత్రులకూ, ప్రభుత్వానికీ, గులాంగిరీ చేసే ఆర్థికశాస్త్రవేత్తలు, బయట నుంచి ప్రపంచబాంకు సబ్సిడీలు తగ్గించాలని, రద్దు చేయాలని చెవినిల్లు కట్టుకొని ఒకటే నస. కానీ కార్పొరేట్లకు పన్ను మినహాయింపు(సబ్సిడీకి ఇదో మారుపేరు) పేరిట ఇస్తున్న రూ.లక్షల కోట్లపై అందరూ గప్చుప్. కానీ ఏవో పేర్లతో ప్రభుత్వం సబ్సిడీని పెంచుతుంది. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, పెంచిన సబ్సిడీ హరాయించుకుపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచితే, ఉద్యోగిత లభిస్తే, సబ్సిడీలు ఇవ్వాల్సిన పనే ఉండదు. ప్రభుత్వం ఆ పని చేయదు. ఎందుచేతనంటే ప్రజలు తమ కాళ్ల మీద నిలబడగలిగితే చదువు సంధ్యలు వస్తే పాలకుల ఓటు బ్యాంకు మాయమైపోతుంది. వాళ్ల కుర్చీలు కదలిపోతాయి. ఇదేమి నిర్వాకం దేశాన్ని కొన్నేళ్లుగా ద్రవ్యలోటు వెంటాడుతోంది. ఈ ద్రవ్యలోటును అదుపు చేయగలిగామని చిదంబరం జబ్బలు చరచుకొంటున్నారు. తాను ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టినట్టుగా అందరూ అనుకోవాలన్నది ఆయన ఆలోచన. కానీ ఎకానమీని ఎలా మేనేజ్ చేశాడని పరిశీలిస్తే... కొన్ని పీఎస్యూల వద్ద ఉన్న నిధులను పిండి, సామాజిక సేవల కేటాయింపులకు కోత పెట్టి, ఇతర రంగాలకు చేసిన కేటాయింపులను తగ్గించడం ద్వారా ఈ ద్రవ్యలోటును 4.8 శాతం నుంచి 4.6 శాతానికి నియంత్రించగలిగారు. ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడమంటే ఇదేనా? సామాజిక సేవలకు చేసిన కేటాయింపులకు కోతపెట్టడం దారుణం. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం చేసే వ్యయంలో ప్రతి రూపాయిలో 15 పైసలే చివరకు లబ్ధిదారులకు చేరుతుందని ఒక సందర్భంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం ఆ సామాజిక సేవలకు చేసిన కేటాయింపుల్లో కోత విధించటం, ఆ విధంగా ఆదా అయిన సొమ్మును ద్రవ్యలోటును పూడ్చడానికి వినియోగించటం పూర్తిగా అనైతికం, అన్యాయం. ఉదాహరణకు ఈ బడ్జెట్ ప్రకారమే మంచినీరు, పారిశుద్ధ్యం కోసం చేసిన కేటాయింపును 21.3 శాతం తగ్గించటం, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కేటాయింపు 20.6 శాతం కోత, గృహ నిర్మాణం, పట్టణాల అభివృద్ధికి కేటాయింపు 41.3 శాతం, మానవవనరుల అభివృద్ధికి 6 శాతం, రోడ్డు రవాణా, ప్రధానరహదారులకు 72 శాతం, గ్రామీణాభివృద్ధికి 22.92 శాతం తగ్గించారని బడ్జెట్ నుంచి బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఉదహరించారు. ఆఖరుకు తనతోటి మంత్రి అయిన హోంశాఖకు కూడా 31.39 శాతం కోత పెట్టారు. ఈ కోతలన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అమల్లో ఉంటాయి. అన్ని ఆహార పథకాలకు కూడా మినహాయింపు లేదు. 2013-14లో రూ.1,24,844 కోట్ల నుంచి 2014-15లో రూ.1,15,000 కోట్లకు తగ్గించారు. ఈ కోతలో ప్రధాని మన్మోహన్సింగ్ పేరుతో ప్రారంభించిన గ్రామీణ రహదారి పథకానికి గత నాలుగేళ్లుగా కోత తప్పలేదు. ప్రభుత్వం ఇల్లెక్కి ప్రచారం చేసుకొన్న మహాత్మాగాంధీ ఉపాధి పథకం మీద కూడా చిదంబరం కళ్లుపడ్డాయి. ఈ పథకానికి కేటాయింపు 2010లో రూ.3,357.9 కోట్ల నుంచి 2014-15 నాటికి రూ.3,398 కోట్లు కోత పెట్టారు. మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అన్నదానికి మన్మోహన్సింగ్ కొలబద్ద స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ). జీడీపీ వృద్ధి సాధిస్తే పరిస్థితి బాగున్నట్లు, తగ్గితే అభివృద్ధి ఆ మేరకు కుంటుపడినట్లు లెక్క. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒక సంవత్సరంలోనూ జీడీపీ వృద్ధి 9 శాతం నమోదయ్యింది. గత సంవత్సరం ఇది ఐదు శాతానికి పడిపోయింది. 2013 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో 4.4 శాతానికి దిగజారితే ఈ సంవత్సరంలో ఎట్టిపరిస్థితులలో 4.9 శాతానికి దిగువకు పడిపోదని చిదంబరం ధీమాగా చెపుతున్నారు. కానీ రకరకాల పద్దుల కింద కోతలు విధించి ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ ఈక్విటీని అయినకాడికి అమ్మేసి, ఆమ్ ఆద్మీకి సాంత్వన కలిగించే పద్దులకు కోత విధించి, ద్రవ్యలోటును 4 శాతానికి తగ్గినట్లు లెక్కలు చూపించి మనందరినీ జయహో అనమంటున్నారు. ద్రవ్యలోటును 4 శాతానికి తగ్గించినట్టుగా చెప్పుకుని చిదంబరం తన వీపు తానే చరచుకోవచ్చు. తమ నోళ్లు కొట్టి ఈ ‘ఘనత’ను సాధించారని, ఈ తగ్గింపు సాధించడానికి ఆమ్ ఆద్మీని, వారి ఆశలను వధ్యశిల ఎక్కించారని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాని డ్రీమ్బడ్జెట్ నుంచి ‘పీడకల’ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానిదే. తమిళనాడులో చిదంబరం గెలిచిన శివగంగ నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికయ్యే అవకాశం లేనట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. తథాస్తు. అలాగే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంటుందని మరో అంచనా. తథాస్తు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చే డబ్బు తీసుకొని, వారికే ఓటు వేస్తే, ఆమ్ ఆద్మీ పరిస్థితి తథాస్తు. (వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు) - వి.హనుమంత రావు -
లెక్కలతో మోసం చేశారు... : డీఏ సోమయాజులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని, ఆయన తన లెక్కలతో పార్లమెంటును మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు విమర్శించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆయన స్పందిస్తూ 2013-14 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.8 అంచనా వేయగా అది 4.6 శాతానికి తగ్గించినట్లు గొప్పగా టీవీ చానళ్లన్నింటిలో చెప్పుకుంటున్నారని వాస్తవానికి ఈ లోటు తొలి 8 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి నవంబర్-2013 వరకు) 5 శాతంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక నివేదికలో వెల్లడించిన అధికార డాక్యుమెంటులోనే ఉందన్నారు. పదేళ్లపాటు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈ విధంగా ప్రజలను ఎలా తప్పు పట్టించారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.105 లక్షల కోట్ల మేరకు జీడీపీ ఉంటే తొలి 8 నెలల్లోనే 59,557 కోట్ల మేరకు ద్రవ్యలోటు ఉందన్నారు. దీని ప్రకారమే 5 శాతం ద్రవ్యలోటు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇంకా మిగిలి ఉన్న నాలుగు నెలల ఆర్థిక సంవత్సరానికి కనీసం ఎంత లేదన్నా మరో రెండున్నర శాతం అదనంగా అంటే కనీసం 7 నుంచి 7.5 శాతం వరకూ ఉంటుందని వివరించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరిగే అవకాశం లేదని అందుకు కారణం యూపీఏ ప్రభుత్వ నిర్ణయ కార్యశూన్యతే కారణమని వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకోకుంటే జీడీపీ పెరగదని, అది పెరగకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ద్రవ్యలోటు రెవెన్యూలోటు కూడా పెరుగుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే పారిశ్రామికాభివద్ధి సూచీ మైనస్ ఒక్క శాతంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 1.5 నుంచి 2 శాతం మేరకు మాత్రమే వృద్ధిరేటు ఉందనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. 80 శాతం మంది ఆధారపడి ఉన్న పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనే వృద్ధిరేటు ఇంత అధ్వానంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపేస్తారన్నారు. సీబీఐ కేసులు పెడుతుందని, కాగ్ ప్రశ్నిస్తుందనే భయంతో గత మూడేళ్లుగా ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం అభివృద్ధికి పనికి వచ్చే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. -
పొలాలకు పోషక ఎరువులు!
* పెరిగిన సాగు రుణాల పరిమితి * వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం * రికార్డు స్థాయిలో పంటల దిగుబడి న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయదారులను ఆకర్షించేందుకు బడ్జెట్లో ‘పోషక ఎరువుల’ ఎర వేసింది! 2014-15 బడ్జెట్లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 2.80 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. యూపీఏ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఆహార చట్టం ద్వారా దేశ జనాభాలో 67 శాతం మంది తిండి గింజలను చౌకగా పొందేలా చట్టపరమైన హక్కు కల్పించామన్నారు. - వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 4.6%కి చేరుకునే అవకాశం. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.7 లక్షల కోట్లుగా నిర్దేశించగా రూ.7.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. - వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగింపు. 2006-07లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రూ.23,924 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. - పదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 213 మిలియన్ టన్నుల నుంచి 263 మిలియన్ టన్నులకు పెంపు. 2012-13లో 255 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. - ఈసారి చక్కెర, పత్తి, తృణ ధాన్యాలు, నూనె గింజలు రికార్డు స్థాయిలో దిగుబడి నమోదయ్యే అవకాశం. - 2012-13లో రూ.2.54 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి. మంచి పరిణామం: ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. పెరిగిపోతున్న సాగు ఖర్చులు, వ్యవసాయంపై దేశంలోని యువత పెద్దగా ఉత్సాహం చూపని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సరైన చర్య. -
కారు.. బైకు.. చవక
* తగ్గనున్న కార్లు, టూవీలర్ల ధరలు * 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిన ఎక్సైజ్ సుంకం * బియ్యం నిల్వ, లోడింగ్, అన్లోడింగ్పై సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు * ఉత్పాదక వస్తువులపైనా పన్ను * 12 నుంచి 10 శాతానికి తగ్గింపు * టీవీలు, ఫ్రిజ్లు, మైక్రోవేవ్ ఓవెన్లూ ఇక చవక * అన్ని మొబైల్ ఫోన్లపై 6 శాతం ఎక్సైజ్ పన్ను న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్ను పురస్కరించుకుని.. తయూరీరంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు ప్రకటించింది. దీంతో ఎస్యూవీలు (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) సహా చిన్నకార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణపరమైన ఉత్పాదకత కూడా గత కొద్దినెలలుగా మందగమనంలో ఉంది. దీంతో కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపైనా ఆర్థికమంత్రి చిదంబరం పన్ను తగ్గింపును ప్రకటించారు. దీంతో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వస్తువుల ధరలూ తగ్గనున్నారుు. - అమ్మకాలు తగ్గిన ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపశమనం కలిగేలా కార్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. చిన్న కార్లు, మోటార్సైకిళ్లు, స్కూటర్లపై 12 శాతంగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది. ఎస్యూవీలపై పన్ను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. పెద్ద వాహనాలపై సుంకం 27 శాతం నుంచి 24 శాతానికి, మధ్యతరహా కార్లపై పన్ను 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే జూన్ 20 వరకు వర్తిస్తుంది. - బియ్యం లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, నిల్వపై సర్వీస్ ట్యాక్స్ను (సేవాపన్ను) మినహారుుస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. కార్డ్ బ్లడ్ బ్యాంకులందించే సేవలను కూడా సేవా పన్ను నుంచి మినహాయించారు. - అలాగే కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర వస్తువులపై 12 శాతంగా ఉన్న పన్నును 10 శాతానికి తగ్గించారు. ఇది ఈ ఏడాది జూన్ 30 వరకు వర్తిస్తుంది. - దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులను నిరుత్సాహ పరిచే దిశగా అన్ని కేటగిరీల మొబైల్ ఫోన్ల (హ్యాండ్సెట్లు)కు సంబంధించిన ఎక్సైజ్ సుంకాలను 6 శాతానికి పునర్వ్యవస్థీకరించారు. దీంతో రూ.2 వేల లోపు ఉండే తొలిస్థారుు హ్యాండ్సెట్ల ధర పెరగనుంది. - సబ్బులు, ఓలియో రసాయనాల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక చమురు, సంబంధిత ఉత్పత్తులు, కొవ్వుతో కూడిన ఆమ్లాలు, కొవ్వుతో కూడిన మద్యంపై దిగుమతి సుంక నిర్మాణాన్ని 7.5 శాతం వద్ద హేతుబద్దీకరించింది. ఈఈపీసీ హర్షం ముంబై: కార్లు, టూ వీలర్లపై సుంకాన్ని తగ్గించడంపై ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారుల సంస్థ (ఈఈపీసీ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతికి ఊతం ఇస్తుందని ఈఈపీసీ చైర్మన్ అనుపమ్ షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వదేశీ వాహన పరిశ్రమలో తిరిగి వృద్ధిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. మనకు 2000 కోట్లు కోత.. తగ్గిన కేంద్ర పన్నుల వాటా - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాను రూ. 22,131.68 కోట్లకు తగ్గించిన కేంద్రం - వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా 26,970 కోట్లు - గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లోనూ కోత సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వస్తాయనుకున్న నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులను కూడా సవరించారు. ఈ సవరణలతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ తొలి అంచనాల్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.24,132.36 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.22,131.68 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.27,028 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలపగా, కేంద్ర బడ్జెట్లో మాత్రం రూ.26,970 కోట్లు కేటాయించారు. అంటే రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా రూ.58 కోట్లు తగ్గుతోంది. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ.77,060 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం గత బడ్జెట్లో పేర్కొంది. అయితే ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ గ్రాంట్లను రూ.61,700 కోట్లకు తగ్గించారు. ఈమేరకు రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గనున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.43,776 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ నిధులను రూ.39,836 కోట్లకు తగ్గించింది. అంటే రాష్ట్రానికొచ్చే ప్రాయోజిత పథకాల నిధులు కూడా తగ్గిపోనున్నాయి. ఇవి తగ్గుతాయ్.. * బియ్యం, సబ్బులు * మోటార్సైకిళ్లు, స్కూటర్లు * చిన్నకార్లు, ఎస్యూవీలు * వాణిజ్య వాహనాలు * దేశంలో తయూరైన మొబైల్ ఫోన్లు * టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు * కంప్యూటర్లు, ప్రింటర్లు, కీబోర్డులు, మౌజ్లు, హార్డ్ డిస్క్లు, స్కానర్లు * వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, హెరుుర్ డయ్యర్లు * వాటర్ కూలర్లు, టార్చ్లైట్లు, డిజిటల్ కెమెరాలు * ఎలక్ట్రిక్ ఐరన్స్, ఎంపీ 3..డీవీడీ ప్లేయర్లు * బ్లడ్ బ్యాంకుల చార్జీలు తొమ్మిదోసారి... ఫిబ్రవరి 17, 2014 పి.చిదంబరం తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు (8 సాధారణ, 2 మధ్యంతర బడ్జెట్లు) మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. స్వాతంత్య్రం తరువాత ఇప్పటివరకు మధ్యంతర, ప్రత్యేకమైనవి కలిపి మొత్తం 83 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. స్టూడెంట్స్కు గాలం! విద్యా బడ్జెట్లో దేనికి ఎంతెంత..? ఉన్నత విద్య- రూ.16,200 కోట్లు పాఠశాల విద్య-రూ.51,198 కోట్లు న్యూఢిల్లీ: విద్యారంగానికి కాస్త ఫర్లేదు.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.67,398 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కిందటేడాదితో పోలిస్తే దాదాపు 9 శాతం అదనం. అలాగే యూపీఏ సర్కారు ఎన్నికల ముంగిట విద్యార్థులను ఆకట్టుకునే యత్నం చేసింది. 2009, మార్చి 31కి ముందు విద్యా రుణాలు తీసుకొని 2013, డిసెంబర్ 31 వరకు వడ్డీ చెల్లించని విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వడ్డీని పూర్తిగా తామే భరిస్తామని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ ప్రతిపాదనతో 9 లక్షల మంది విద్యార్థులకు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కెనరా బ్యాంకుకు బదిలీ చేయనున్నట్టు తెలిపారు. 2009-10 బడ్జెట్లో ప్రణబ్ ముఖర్జీ... విద్యార్థులు తీసుకున్న రుణాల్లో వడ్డీపై రాయితీ ఇచ్చేందుకు సెంట్రల్ స్కీమ్ ఫర్ ఇంటరెస్ట్ సబ్సిడీ(సీఎస్ఐఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను కెనరా బ్యాంకుకు అప్పజెప్పినవిషయం తెలిసిందే. -
మళ్లీ నిరాశే..
సాక్షి, కొత్తగూడెం: రైల్వేమంత్రి బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో జిల్లాకు మొండి‘చేయి’ చూపించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోగా జిల్లాకు ప్రయోజనకరమయ్యే పలు ప్రతిపాదనలను పక్కన పెట్టారు. కనీసం భద్రాచలంరోడ్డు- కొవ్వూరు రైల్వే లైన్ సర్వేకు కూడా నిధులు విదల్చలేదు. జిల్లావాసులను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది. ఈ ప్రభుత్వం మధ్యంతర రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం, త్వరలో ఎన్నికలు రానుండడంతో జిల్లా ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై రైల్వేశాఖ మంత్రి మల్లికార్జునఖర్గే నీళ్లుచల్లారు. ఈ బడ్జెట్లో కొంతైనా జిల్లాకు వాటా దక్కలేదు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. భద్రాద్రికి చేరువయ్యే... పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ పొడిగింపు ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటోంది. ఈ లైన్ మంజూరుకు ఏటా ఏలికలు ఇస్తున్న హామీలు నీటిమూటలే అయ్యాయి. ఈ బడ్జెట్లోనూ రిక్తహస్తమే చూపారు. కొత్తగూడెం-కొవ్వూరు రైల్వే లైన్ ఐదు దశాబ్దాలుగా ముందుకు నడవడంలేదు. ప్రతి బడ్జెట్లో ఈ లైన్ సర్వేకే పరిమితమైంది. రూ. 950 కోట్ల ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు వీటిని మంజూరు చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ రైల్వేలైన్ కోసం జిల్లా ప్రజలు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల రైల్వేలైన్కు మొత్తం రూ. 337 కోట్లు అవసరం ఉంది. గత రెండు బడ్జెట్లలో రూ.5.10 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి అసలు నిధుల ఊసే లేకపోవడంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని పలు ఆర్వోబీల నిర్మాణంపై కూడా ఈ రైల్వేబడ్జెట్లో ప్రస్తావన లేదు. డోర్నకల్-మిర్యాలగూడ రైల్వేలైన్ నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. దీన్ని కేంద్రం పట్టించుకోలేదు. కాజీపేట మీదుగా విజయవాడ సికింద్రాబాద్- విశాఖ (ఏసీ) ఎక్స్ప్రెస్ రైలు కొత్తగా జిల్లాలోని ఖమ్మం స్టేషన్ మీదుగా వెళ్లడం ప్రయాణికులకు కొంత ఊరట కలిగిస్తోంది. ఇది కూడా వారంలో ఒక రోజు మాత్రమే వస్తుంది. కాగా, జిల్లాకు ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ బడ్జెట్పై ప్రజానీకం పెదవివిరుస్తున్నారు. ఈసారి జిల్లాలో రైల్వేలైన్ల సర్వేకు నిధులు మంజూరు చేయిస్తామని ఎంపీలు పలుమార్లు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని విమర్శిస్తున్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో ఎంపీలు విఫలమయ్యారని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.