JC Brothers
-
జేసీ కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్
-
జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు. -
తాడిపత్రికి జేసీ బ్రదర్స్ అరాచకాలు
-
వైఎస్సార్సీపీలో చేరిన జేసీ బ్రదర్స్ లీగల్ అడ్వైజర్..!
-
ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా?
అనంతపురం జిల్లాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ కుటుంబం ఒకటుంది. ఆ కుటుంబ పెద్ద ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనకో తమ్ముడున్నాడు. అన్నదమ్ములు ఇద్దరికీ నోటి తీట, దుడుకుతనం కూడా ఎక్కువే. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల రాజకీయ ప్రభ మసకబారింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు. జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పేర్లు అనంతపురం జిల్లాలో అందరికీ పరిచయమైనవే. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి విజయం సాధించిన దివాకరరెడ్డి నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ముందుగానే ఊహించి హస్తానికి హ్యాండిచ్చి కుటుంబం అంతా సైకిల్ సవారీ స్టార్ట్ చేసింది. తాడిపత్రి అసెంబ్లీ సీటు తమ్ముడు ప్రభాకరరెడ్డికి ఇచ్చి.. తాను అనంతపురం ఎంపీగా పోటీ చేశారు దివాకరరెడ్డి. ఇద్దరూ విజయం సాధించారు. ఇక 2019లో తాను తప్పుకుని కొడుకు పవన్రెడ్డిని అనంతపురం నుంచీ ఎంపీ సీటుకు పోటీ చేయించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో జేసీ బ్రదర్స్ రాజకీయాలు ముగిసిపోయాయి. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వైఎస్ జగన్ జైత్రయాత్ర ముందు తుడిచిపెట్టుకుపోయింది. ఆ షాక్ నుంచి జేసీ కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పవన్రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జేసీ దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ జేసీ ప్రభాకర్రెడ్డి లేదా ఆయన కుమారుడికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని జేసీ దివాకర్రెడ్డి డైలమాలో పడ్డారు చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి ట్వీట్ అందుకే రాయల తెలంగాణా పేరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కి.. రాజకీయంగా గందరగోళం సృష్టించి..లబ్ది పొందాలని జేసీ దివాకర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నిరుద్యోగులను జేసీ దివాకర్ రెడ్డి కలుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి కలిసి చర్చించారు. రాయల తెలంగాణ అంశంతో పాటు శింగనమల అసెంబ్లీ స్థానంపై జేసీతో శైలజానాథ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో రోజు రోజుకూ బలహీన పడుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం.. రెచ్చగొట్టే కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. నోటి దురుసుతో అధికారులు, ప్రత్యర్థులపై తిట్లు లంకించుకోవడం, దాడులకు దిగడం ద్వారానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులుగా ఉండే జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయంగా ఉనికి నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలకు కూడా దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. -
పరిటాల రవి హత్యకు ఆయుధాలు సరఫరా చేసింది జేసీ బ్రదర్సే
-
లోకేష్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం
సాక్షి, అనంతపురం: నారా లోకేష్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీచేశారు. తనపై లోకేష్ లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే నేరుగా తేల్చుకుంటానని పేర్కొన్నారు.. జేసీ ప్రభాకర్రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయిని, తాడిపత్రి టీడీపీ కార్యకర్తలను చంపింది జేసీ బ్రదర్స్ కాదా అని ప్రశ్నించారు ‘టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది. ప్రబోధానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేయించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి గుర్తు లేదా’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ! -
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్కు కోర్టు సమన్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్తో సహా 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు. -
టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్కు గట్టి షాక్
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): టీడీపీ కంచుకోట నరసాపురంలో జేసీ బ్రదర్స్ (దివాకర్రెడ్డి– ప్రభాకర్రెడ్డి)కు గట్టి షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడైన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు దాదాపు 160 కుటుంబాల వారు టీడీపీకి గుడ్బై చెప్పారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి నేతృత్వంలో వీరంతా మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ మారడం టీడీపీ కంచుకోటకు బీటలు బారినట్లయ్యింది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తుండటంతో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు వేమనాథరెడ్డి, ఎంపీపీ రామ్మూర్తిరెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హాజీవలి, మండల యూత్ కన్వీనర్ కమలాకర్రెడ్డి, పార్లమెంటు జనరల్ సెక్రటరీ రవిప్రసాద్రెడ్డి, సీనియర్ నాయకులు చిక్కేపల్లి రామేశ్వర్రెడ్డి, ముచ్చుకోట అమర్నాథరెడ్డి, నరసాపురం రామచంద్ర (కాశీ), ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చింతకాయల విజయ్కు షాకిచ్చిన చంద్రబాబు -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
జేసీ బ్రదర్స్కు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ బ్రదర్స్కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జేసీ దివాకర్రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన దివాకర్ రోడ్లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన వ్యాపార భాగస్వామి సి.గోపాల్రెడ్డి కుటుంబానికి చెందిన సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6.31 కోట్ల నగదు, బ్యాంకులో మరికొంత నగదు, బంగారు ఆభరణాలతోపాటు రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి కుటుంబాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా దర్జాగా అక్రమ దందాకు పాల్పడ్డాయి. బీఎస్ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా జేసీ కుటుంబం అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 154 బీఎస్ 3 మోడల్ బస్సులు, లారీలను తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నిబంధనల ప్రకారం బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దాంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి, వాటిని బీఎస్ 4 వాహనాలుగా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్వోసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్లలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో 101 వాహనాలు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్గఢ్లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాదు ఆ వాహనాల్లో కొన్నింటిని అక్రమంగా ఇతర రాష్ట్రాల్లోని వారికి విక్రయించేశారు. అలా విక్రయించాలంటే పోలీసుల నుంచి ఎన్వోసీ పొందాలి. కానీ స్థానిక పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీలు సృష్టించి మరీ అమ్మేశారు. వాటిని కొన్న వారు తాము మోసపోయామని గుర్తించి అనంతపురంలోని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారించిన అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 2020 జూన్లో జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డితో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్పై విడుదల అయ్యారు. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడ్డట్టు దర్యాప్తులో వెల్లడైంది. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించగా, బీమా పత్రాలన్నీ నకిలీవని వెల్లడైంది. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర రవాణా శాఖ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. అనంతరం ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్లను కూడా జప్తు చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్వోసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఈడీ అధికారులు హైదరాబాద్లో ఇటీవల విచారించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అశోక్ లేలాండ్లో కొందరి పాత్రపైనా ఈడీ ఆరా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక అశోక్ లేలాండ్ కంపెనీ పాత్ర ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన కొందరి సహకారంతోనే ఈ దందా సాగించినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దాంతో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులను కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
రెచ్చిపోయిన జేసీ వర్గీయులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. కాగా, తాడిపత్రిలోని మూడో వార్డులో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక, గాయపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. -
కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?
ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు కావడం కామనే. తెలుగుదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు ఎంపీగా పనిచేసిన ఆ నేతపై పచ్చ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారట. అందుకే ఈసారి టిక్కెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? కాల్వ కేరాఫ్ రామోజీ క్యాంపస్ కాలువ శ్రీనివాస్. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన తరచుగా మీడియాలో కనిపించేవారు. ఈనాడు జర్నలిస్ట్గా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలువ తొలిసారి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. టీడీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా.. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాల్వకు జేసీబీతో బ్రేక్ చంద్రబాబు కావాలని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కాలువ శ్రీనివాస్కు గతంలో మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే ప్రస్తుతం ఆయనకు జేసీబీ (జేసీ బ్రదర్స్) రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్కు రాయదుర్గం టిక్కెట్ దక్కదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కోసం రాయదుర్గం టిక్కెట్ త్యాగం చేసిన దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాయదుర్గం నియోజకవర్గంపై కన్నేసిన దీపక్ రెడ్డి.. చంద్రబాబు, నారాలోకేష్ లతో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. కార్యకర్తల విరాళాలు కాల్వ పాలు.! కాలువ శ్రీనివాస్ వైఖరిపై గత కొంత కాలంగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పార్టీ పదవులు ఇప్పిస్తానని పలువురు నేతల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కాలువ శ్రీనివాస్పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఫండ్ అభ్యర్థులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్ను పక్కన పెట్టి.. దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టుకున్నట్లు సమాచారం. కిం కర్తవ్యం.? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కాలువ శ్రీనివాస్ తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్. పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేతల ద్వారా కాలువ శ్రీనివాస్ లాబీయింగ్ ప్రారంభించినట్లు అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రచారం సాగుతోంది. -
అలజడులు సృష్టించేందుకు జేసీ బ్రదర్స్ యత్నం..
తాడిపత్రి అర్బన్: తాడిపత్రి... ఈ పేరు వింటే ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలు.. ముఠా పోరు.. విధ్వంసాలు.. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా దాడులు.. ప్రతీకార జ్వాలల్లో దహనమయ్యే గడ్డి వాములు, గుడిసెలు, గృహాలు కళ్ల ముందు మెదలాడుతాయి. ఆధిపత్య పోరులో ఓ వర్గం సాగించిన దౌర్జన్యానికి మూడు దశాబ్దాలుగా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ అతలాకుతలమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ ఎన్నికల చరిత్ర చూసినా పచ్చని పల్లెల్లో అల్లకల్లోలమే ఆవిష్కృతమవుతుందనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేశారు. పోలీసు యంత్రాంగానికి పూర్తీ స్వేచ్ఛనిచ్చారు. దీంతో తాడిపత్రిపై ఇప్పటి వరకూ పడిన ఫ్యాక్షన్ ముద్ర కాస్త చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో నెలకొన్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని చెడగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా జేసీ సోదరులు గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు తెరలేపారు. ఇందుకు ఇటీవల జేసీ సోదరుల సొంతూరు జూటూరులో జరిగిన దాడులే నిదర్శనం. జేసీ బ్రదర్స్ అడ్డాగా.. తాడిపత్రి పేరు వినగానే స్ఫురణకు వచ్చే పేరు జేసీ బ్రదర్స్ . 1982లో సమితి ప్రెసిడెంట్గా జేసీ దివాకర్రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఫ్యాక్షన్కు బీజం వేశారు. తాడిపత్రి మండలం హుసేనాపురంలో గృహ దహనాలు, పెద్దపప్పూరు మండలం తురకపల్లి, తాడిపత్రి మండలం వెలమకూరు గ్రామాల్లో హత్యోదంతాలు, ఇతర గ్రామాల్లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉందన్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పెద్దపప్పూరు మండలంలోని పసులూరు గ్రామంలో మహిళల పోలింగ్ కేంద్రంలోకి జేసీ వర్గీయులు చొరబడి రిగ్గింగ్కు పాల్పడ్డారు. దీనిపై అప్పటి పోలింగ్ విధుల్లో ఉన్న విశ్రాంత సైనికోద్యోగి ఫిర్యాదు మేరకు అప్పటి ఎన్నికల ఇన్చార్జ్ దోతాంగే (ఐపియస్ అధికారి).. జేసీ దివాకర్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కలి్పంచక పోవడంతోనే అప్పట్లో జేసీ సోదరుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయన్న విమర్శలు వినిపించాయి. 2004 నుంచి హ్యాట్రిక్ విజయాలతో తాడిపత్రి అడ్డాగా కొనసాగుతున్న జేసీ సోదరుల ఆధిపత్యానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయంతో చుక్కెదురైంది. సేవ్ తాడిపత్రి పేరుతో హైడ్రామా.. మూడు దశాబ్దాలుగా జేసీ సోదరుల ఆగడాలతో తాడిపత్రి వాసులు విలవిల్లాడారు. గ్రానైట్, ట్రాన్స్పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, సిమెంటు ఫ్యాక్టరీలు... ఒకటేమిటీ తాడిపత్రిలో ప్రతిదీ ఆదాయ వనరుగా మార్చుకుని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి ఒక్కరూ వీరికి కప్పం చెల్లించారు. కాదని ఎదురు మాట్లాడిన వారి ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేశారు. మున్సిపాలిటీ వాహనంలో చెత్త తీసుకొచ్చి వారి ఇంటి ముందు పోసి కక్షసాధింపులకు దిగేవారు. అద్దె ఇంట నివాసమున్న వారిని తక్షణమే ఖాళీ చేయించేవారు. అధికారం కోల్పోయిన తర్వాత జేసీ సోదరుల నోటి నుంచి వెలువడుతున్న మాటలు, వారు ఉపయోగించిన భాషను చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకున్నారు. ఈ క్రమంలోనే తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు తాజాగా ‘సేవ్ తాడిపత్రి’ పేరుతో జేసీ ప్రభాకరరెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. పేరుకు సేవ్ తాడిపత్రి అయినా.. దీని వెనుక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జేసీ ప్రభాకరరెడ్డి సాగిస్తున్న ప్రయత్నాలను తాడిపత్రి వాసులు పసిగట్టారు. జేసీ సోదరుల ఆగడాలపై పెద్దారెడ్డి పోరు.. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలపైనే పోరుబాట సాగిస్తూ వచ్చారు. దీంతో పెద్దారెడ్డిని అప్పట్లో ఇబ్బందులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అక్రమంగా కేసులు మోపి, జైలుకు పంపించేందుకు ప్రయత్నించారు. అయినా పెద్దారెడ్డి వెనుకడుగు వేయక అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జేసీ సోదరులకు తగిన గుణపాఠం చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. -
జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: జూటూరులో జేసీ దివాకర్రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. -
కదులుతున్న అక్రమాల పుట్ట.. స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు!
టీడీపీ పాలనలో జేసీ సోదరులు (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో అక్రమంగా రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్తో నాలుగు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించారు. ఎట్టకేలకు వీరి అక్రమాల పుట్ట కదులుతోంది. నిన్న త్రిశూల్... నేడు దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాడిపత్రి అర్బన్: జేసీ సోదరులు అడ్డగోలు వ్యాపారాలు, అవినీతి అక్రమాలతో రూ.కోట్లు పోగేసుకున్నారు. ఒకేనంబర్పై పలు బస్సులను అనధికారికంగా నడిపారు. దివాకర్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి దివాకర్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సును సీజ్ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బస్సులను సీజ్ చేయడం సంచలనం రేపింది. కండీషన్ లేని బస్సులు నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, ట్రావెల్స్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై నిఘా అధికమైంది. అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి, ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ ‘పెద్దమనిషి’ ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. నిజాయితీ అధికారులకు వేధింపులు మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలోని అక్రమాల గురించి తెలిసి షాక్ అయ్యారు. ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దందా ఏ స్థాయిలో సాగిందో ఈ జరిమానాలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి నిజాయితీ అధికారి ఇక్కడ ఉంటే ఆటలు సాగవని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్కు ప్రతాప్రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని ఏ1గా, గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్రెడ్డిని ఇక్కడి నుండి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించేది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ట్రాన్స్పోర్టు ద్వారా రూ.300 కోట్లు అర్జాస్ స్టీల్ప్లాంట్ కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2వేల ఎకరాల వరకు స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇస్తూ వచ్చేవారు. అయతే ఇందుకు సంబందించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్ప్లాంట్లో వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్ళలోట్రాన్స్పోర్టు ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టారు అర్జాస్ స్టీల్ ప్లాంట్లో డ్రైస్లాగ్ను టన్ను రూ.10 తో టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అ్రల్టాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100కోట్ల ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్గా వ్యవహరించేవాడు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. దేవుని మాన్యాన్నీ వదలని సోదరద్వయం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు ఆ భూములన్నీ జేసీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించారు. మూడు నెలల క్రితం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆదర్శ మున్సిపాలిటీని గలీజు చేసి.. తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం. జేసీ సోదరులు, వారి అనుచరులు ఆదర్శ మున్సిపాలిటీ మాటున రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్రెడ్డి బినామీగా వ్యవహరించిన ఎస్.వి.రవీంద్రారెడ్డి తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనికి గుడ్విల్ రూపంలో రూ.2.66 కోట్లు మున్సిపాలిటీకి బకాయి చెల్లించాల్సి ఉంది. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73 కోట్లు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు. ఈ మొత్తం కాంప్లెక్స్ను దాదాపు 50 మంది వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశారు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల చొప్పున అద్దె వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్లో 64, 68 షాపులు కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి సంబంధించి రూ.3.52 లక్షలు గుడ్విల్ రూ.3.33 లక్షలు బాడుగ కలిపి మొత్తం రూ.7.83 లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నాడు. వ్యాపారులకు మాత్రం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సబ్లీజుకు ఇచ్చుకున్నాడు. రెండు కాంప్లెక్స్లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్కు జేసీ ప్రభాకర్రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్రెడ్డి – ప్రభాకర్రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్డివిజన్లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ..
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి.. అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం నలుగురు జేసీ వర్గీయుల సస్పెన్షన్కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫార్సు చేశారు. దీంతో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ వర్గీయులు తీర్మానం చేశారు. చదవండి: (బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్) -
‘పల్లెకు టికెట్ ఇస్తే పనిచేయం’
అనంతపురం (పుట్టపర్తి టౌన్): వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పనిచేసేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ కార్యవర్గ సభ్యుడు పెద్దరాసు సుబ్రహణ్యం స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి ఆరామంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి వ్యవహార శైలితో నియోజవర్గంలో టీడీపీ భూస్థాపితం అవుతోందని చెప్పారు. కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా, సీనియర్ నాయకులకు వెన్నుపోటు పొడిచారన్నారు. కియా వద్ద, అనంతపురం పట్టణాల్లో 1,300 ఎకరాలు, రూ. 4 వేల కోట్ల ఆస్తి కూడబెట్టుకున్నారని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి కానీ పల్లె ఆస్తులపై ఈడీ ఎందుకు దాడులు జరపడం లేదని ప్రశ్నించారు. తమకు ఒక్క కళాశాల ఉంటే సీ గ్రేడ్లో ఉందని, పల్లెకు 40 కాలేజీలు ఉంటే అన్నీ ఏ గ్రేడ్లో ఉన్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ ఏ లోటు లేకుండా అందుతోందన్నారు. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అవకాశం కల్పిస్తే అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చిస్తామని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో, ప్రత్యామ్నాయం ఎంచుకోవడమో చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారాదప్ప, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు కోట్ల డైమండ్ నెక్లెస్.. జేసీ అక్రమ ఆస్తులు చూసి ఈడీ షాక్
-
జేసీ బ్రదర్స్పై ఈడీ కేసు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. తమను సంప్రదించిన ఈడీ అధికారులకు.. ఏపీ రవాణా శాఖ అధికారులు వివరాలు అందజేశారు. ఫోర్జరీ వ్యవహారంపై ఈడీ అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు ఏపీ రవాణా శాఖ అధికారులు. ‘‘బీఎస్-3 వాహనాలు వాడొద్దని సుప్రీంకోర్టు నిషేధించింది. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన 154 వాహనాలకు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే జేసీ ట్రావెల్స్ పై 27 క్రిమినల్ కేసులు పెట్టాం. పైగా నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్, బోగస్ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. ..ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ కు ప్రత్యేక నివేదిక పంపాం. ఆ వివరాల ఆధారంగానే జేసీ బ్రదర్స్ పై విచారణ జరుగుతోందని భావిస్తున్నాం. ఏఏ అంశాలపై ఈడీ విచారణ చేస్తోందో మాకు తెలియదు’’ అని ఏపీ రవాణాశాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. -
కూకట్పల్లిలో కృతిశెట్టి సందడి.. ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వస్త్ర షోరూం జె.సి. బ్రదర్స్లో సినినటి కృతిశెట్టి సందడి చేశారు. కూకట్పల్లిలో ఈ షోరం ప్రారంభోత్సవానికి వచ్చిన కృతిశెట్టి మాట్లాడుతూ.. జె.సి.బ్రదర్స్ షోరూంను అద్భుతంగా తీర్చిదిద్దారని, వస్త్రాల కలెక్షన్ చాలా ట్రెండీగా ఉందని చెప్పారు. రానున్న పండుగ సీజన్కి ఇది ఒక ట్రెండీ షాపింగ్ డెస్టినేషన్ అవుతందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్దన్రెడ్డి, మర్రి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా జంటనగర ప్రజలకు మార్కెట్లో అందరి కన్నా తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కస్టమర్లకు మరింత సౌకర్యంగా సేవలందించాలనే ఉద్దేశంతోనే కూకట్పల్లిలో ఉన్న తమ బ్రాంచిని అత్యాధునిక వసతులకో ఇంత పెద్ద ప్రాంగణంలోకి మార్చామని వెల్లడించారు. ఇక కృతిశెట్టి విషయానికొస్తే.. . చైల్డ్ ఆర్టిస్ట్గా, మోడల్గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది ఈ కన్నడ బ్యూటీ `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్గా మారిపోయింది. ఒకే ఒక్క మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా కృతిశెట్టి స్థానం సంపాదించింది. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్ సింగరాయ్`, సుధీర్బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. అలాగే నితిన్తో ‘మాచర్ల నియోజకవర్గం’చిత్రంలోనూ ఆమే హీరోయిన్. మరోవైపు ఇటీవల `బంగార్రాజు`లో నాగచైతన్య సరసన హీరోయిన్గా ఎంపికైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జేసీ బ్రదర్స్కు టీడీపీ ఝలక్
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: టీడీపీ అధిష్టానం జేసీ వర్గానికి ఝలక్ ఇచ్చింది. బుధవారం రాత్రి ప్రకటించిన పార్టీ అనంతపురం పార్లమెంటు కమిటీలో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ‘రాయలసీమ ప్రాజెక్టులపై సీమ నేతల సదస్సు’లో పురుడుపోసుకున్న విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదని సదస్సులో జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు) మంగళవారం కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్రెడ్డి ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పారు. దీంతో అనంత టీడీపీ నేతలు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. రెండు నెలల క్రితమే వేసిన పార్లమెంట్ కమిటీని రద్దు చేసి బుధవారం రాత్రి ఆఘమేఘాలపై కొత్త కమిటీని నియమించింది. ఇందులో జేసీ వర్గానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షునిగా, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ చౌదరిని ప్రధాన కార్యదర్శిగా 40 మందితో కమిటీని ప్రకటించింది. ఇందులో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. వారు కూడా ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నవారేనని, జేసీ వర్గంతో సంబంధం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: అబద్ధాల్లో అపూర్వ సోదరులు -
జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదయ్యింది. నిన్న మద్యం మత్తులో ట్రాన్స్కో సబ్స్టేషన్ వద్ద హంగామా సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులు.. ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. జేసీ అనుచరులు 26 మందిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాన్స్కో కార్యాలయంలో విందు పార్టీ ఏర్పాటు చేసి గొడవకు కారణమైన ఇద్దరు ఉద్యోగులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిన్న అసలేం జరిగిందంటే.. తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్చైర్పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్కో ఉద్యోగులు శివనాగేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్స్టేషన్లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్కుమార్రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్స్టేషన్లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. చదవండి: పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. భార్యపై అనుమానం.. తెల్లవారు జామునే నిద్రలేచి.. -
తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ..
సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్కు మున్సిపల్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్రెడ్డి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రిలో 24వ వార్డు నుంచి ఆయన బరిలో దిగారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ ప్రభాకర్రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి విదితమే. జేసీ ప్రభాకర్రెడ్డిపై వైఎస్సార్ సీపీ నేత జగదీశ్వర్రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రభాకర్రెడ్డి గెలుపుపై జేసీ దివాకర్రెడ్డి టెన్షన్ పడుతున్నారు. గత ఎన్నికల్లో 24వ వార్డు నుంచి జగదీశ్వర్ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కౌన్సిలర్గా గెలిపించేందుకు జేసీ ఫ్యామిలీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్రెడ్డి.. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి పోటీ చేయడం గమనార్హం. తాడిపత్రిలో ఓటర్లకు జేసీ బ్రదర్స్ ప్రలోభాలు తాడిపత్రిలో ఓటర్లను జేసీ బ్రదర్స్ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న 10 మంది జేసీ బ్రదర్స్ అనుచరులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రూ.82 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతూ పట్టుబడ 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు -
తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు
తాడిపత్రి(అనంతపురం): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువతను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ నాయకులు ముమ్మర యత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే క్రికెట్ కిట్లు పంపిణీ చేసేందుకు సిద్దపడ్డారు. ఇందులో భాగంగా స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్మెంట్లో, జేసీ సోదరుల అనుచరుడి పెంట్హౌస్లో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను గురువారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ, స్పర్శ పేరుతో ముద్రించి కిట్లను సిద్ధం చేయించారు. ముందస్తు సమాచారంతో పట్టణ సీఐ ప్రసాదరావు, ఎస్ఐలు రామకృష్ణ, ప్రదీప్కుమార్, మహిళా ఎస్ఐ లక్ష్మి, సిబ్బంది బృందావనం అపార్ట్మెంటు పైభాగంలో గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అప్పటికే పంపిణీ చేయగా మిగిలిన క్రికెట్ కిట్లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కిట్లు ఉంచిన గదికి తాళం తీసేందుకు పోలీసులు రెండు గంటలకుపై శ్రమించాల్సి వచ్చింది. రాత్రి 8 గంటలకు పెంట్హౌస్కు చేరుకున్న పోలీసులు అతి కష్టంపై 11 గంటల సమయంలో గది తాళాలను తెరవగలిగారు. చదవండి: బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! నాకు సీఎం పదవి అవసరమా?: చంద్రబాబు -
జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం..
సాక్షి, తాడిపత్రి : ప్రభుత్వం మారింది..అధికారం పోయింది..అయినా జేసీ సోదరుల అనుచరులు సెప‘రేటు’ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో తాడిపత్రి పట్టణం అక్రమ మద్యం విక్రయాలకు కేరాఫ్గా మారింది. ఉదయం 6 గంటల నుంచి మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. తద్వారా రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీసోదరుల అనుచరులే అక్రమ వ్యాపారులు : జేసీ సోదరుల అనుచరులు కొందరు బస్టాండు కేంద్రంగా, మరికొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అక్రమ మద్యం వ్యాపారులు రోడ్లపై నిలబడి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. డబ్బులు ఉంటే చాలు తాడిపత్రి పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, దుకాణాలు తెరవని సమయంలోనూ మద్యం దొరుకుతోంది. ప్రభుత్వ దుకాణాల్లో కంటే క్వాటర్పై రూ.50 నుంచి రూ.100 అధికంగా ఇవ్వాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం బ్రాండ్లకు ఫుల్ బాటిల్పై రూ.400 నుంచి రూ.600 వరకు అదనపు ధరకు అమ్ముతున్నారు. బస్టాండు వద్ద తోపుడు బండిపై విక్రయించడానికి ఉంచిన అక్రమ మద్యం బాటిళ్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ... తాడిపత్రి పట్టణ పరిధిలో మొత్తం 8 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారుగా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. వారి నుంచి మద్యం తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవక ముందు ఉదయం, మద్యం దుకాణాలను మూసి వేసిన తర్వాత రాత్రివేళలో అదును చూసి విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు: తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఏదైనా పత్రికల్లో ప్రచురితమైనప్పుడు, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే ఇక్కడి అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారుల నుంచి మమూళ్లు ముడుతుండడంతోనే అధికారులు ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాడులు నిర్వహిస్తున్నాం అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. అక్రమ మద్యం స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాం. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే దాడులు చేస్తున్నాం. ఇప్పటికే పట్టణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించాం. ఎవరైనా అక్రమ మద్యం అమ్ముతూ రెండు సార్లకు పైబడి పట్టుబడితే వారిని బైండోవర్ చేస్తున్నాం. – గోపాల్నాయక్, ఎక్సైజ్ ఎస్ఐ, తాడిపత్రి -
జేసీ పవన్ను ముందుగానే హెచ్చరించాం
సాక్షి, తాడిపత్రి: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసుల వాహన శ్రేణి కవాతుతో పాటు, ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ను నిర్వహించారు. ఈ వాహన శ్రేణి స్థానిక గాంధీ సర్కిల్ వద్దకు చేరుకున్న అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రాకూడదన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ పవన్కు ముందుగానే తాము హెచ్చరికలు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టిన కారణంగానే కడపలో నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్.కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్స్టేషన్ పరిధిలో కూడా జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి, జేసీ పవన్రెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు నమోదు చేశామన్నారు. -
‘లోకేశ్ను మాలోకం అనేది అందుకే’
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లోకేశ్ ను మాలోకం అనేది అందుకే. జెసి కుటుంబాన్ని ఓదార్చడానికెళ్లాడా, వీళ్లు తక్కువోళ్లు కాదు, శాస్తి జరిగింది అని తిట్టడానికి వెళ్లాడా? వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇదే అనుమానం వస్తుంది. తనను, తండ్రిని కూడా అరెస్టు చేస్తారేమో అని అమాయకత్వం నటించాడు. చేసిన స్కాములు ఒకటా రెండా’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. అవినీతి కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు అరెస్టయిన నేపథ్యంలో జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మరో ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. (‘ఎర్రన్నాయుడు బాబును ప్రాధేయపడ్డారు’) లోకేశ్ ను మాలోకం అనేది అందుకే. జెసి కుటుంబాన్ని ఓదార్చడానికెళ్లాడా, వీళ్లు తక్కువోళ్లు కాదు, శాస్తి జరిగింది అని తిట్టడానికి వెళ్లాడా? వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇదే అనుమానం వస్తుంది. తనను, తండ్రిని కూడా అరెస్టు చేస్తారేమో అని అమాయకత్వం నటించాడు. చేసిన స్కాములు ఒకటా రెండా. — Vijayasai Reddy V (@VSReddy_MP) June 16, 2020 చిరకాల మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు.@SRKRSajjala pic.twitter.com/ssmWLve0AR — Vijayasai Reddy V (@VSReddy_MP) June 16, 2020 -
చంద్రబాబుకు టీడీపీ నేతల షాక్.. ఫోన్లు స్విచ్చాప్!
సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడిన నేపథ్యంలో వారికి అండగా నిలబడాలన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. జేసీ కేసులో ఆయన రాంగ్ స్టెప్ వేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి రాగా.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పరిటాల సునీత లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. (ఫోర్జరీ పత్రాల్లో సంతకాల ఆధారంగానే కేసులు) అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఉన్నం హనుమంతచౌదరి, జితేంద్ర గౌడ్, కందికుంట ప్రసాద్ సైతం వీరి బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అడ్డంగా దొరికిపోయిన జేసీ కుటుంబంపై సానుభూతి ఎందుకంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా నేతలంతా లోకేష్ వెంటే ఉండాలంటూ ఎన్టీఆర్ భవన్ నుంచి మెసేజ్లు రావడంతో.. టీడీపీ ముఖ్య నాయకులంతా ఫోన్లు స్విచ్చాప్ చేసి ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా.. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే.(‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు) -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపివేశారు. అయితే నేడు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి రానున్నారు. కాగా.. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో ఉంట్నున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు కడప జైలుకి జేసీ ప్రభాకర్రెడ్డి -
‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అనంతపురం: నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో జేసీ సోదరులతో చేయి కలిపిన పాత్రదారులపై ఉచ్చు బిగిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొక్కి అక్రమార్జన కోసం జేసీ సోదరులు అడ్డదారులు తొక్కారు. జాతీయస్థాయి స్కాం ఎక్కడ బయట పడుతుందోనని మరిన్ని నేరాలకు పాల్పడ్డారు. ఇందులో కొందరు అధికారులు, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు ప్రమేయముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. 154 బీఎస్–3 వాహనాలకు రిజిస్ట్రేషన్.. ప్రభుత్వం నిషేధించిన బీఎస్–3 లారీలు, టిప్పర్లను నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో ఒకేసారి 154 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అక్రమ బాగోతంలో కీలక నిందితుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, జఠాధర కంపెనీ డైరెక్టర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు బీఎస్–3 వాహనాలపై ఆంక్షలు విధించింది. 2017, ఏప్రిల్ 1 తర్వాత సదరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టారీత్యా నేరం. ఈ విషయం తెలిసినప్పటికీ జేసీ సోదరులు వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఎన్ఓసీలతో జిల్లాకు తీసుకొచ్చారు. ఒక్కో వాహనంపై రూ.3 నుంచి రూ.4 లక్షల్లోపు ఖర్చు చేసి రూ. కోట్లు లబ్ధి పొందారు. చదవండి: అనంతపురం జైలు వద్ద హైడ్రామా! మరింత లోతుగా దర్యాప్తు.. జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడడంతో ఆధారాలు సేకరించిన అధికారులు శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డిలను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులందరిపైనా వేటు పడే అవకామున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అవినీతి అక్రమాలు బయటపడిన తర్వాత రాష్ట్ర రవాణాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరుగా నాగాలాండ్కు వెళ్లి సదరు వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ సోదరులు సదరు వాహనాలను కనుమరుగు చేసేందుకు యత్నించారు. కొన్ని వాహనాలను ఇతరులకు విక్రయించగా.. మరికొన్నింటిని ఇతర రాష్ట్రాలకు బదలాయించారు. ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..! పాత్రదారులందరిపైనా వేటు.. జేసీ బ్రదర్స్ కంపెనీలు చేసిన అవినీతి కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులందరిపైనా త్వరలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వాహనాల లావాదేవీల్లో పాత్రదారులను ఇప్పటికే గుర్తించారు. అయితే వాహనాలు కొని మోసపోయి వారిపైనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేసారి నాగాలాండ్ నుంచి 154 వాహనాలు (అందులో వందకు పైగా జిల్లాకు) ట్రాన్స్ఫర్ అయినా ఆర్టీఏ అధికారులు పసిగట్టలేదు. నకిలీ పోలీసు క్లియరెన్స్ల ద్వారా ఇతరులకు విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్ర కూడా లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని అరెస్ట్లుంటాయని సమాచారం. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో పాత్ర ఉందని భావిస్తున్న వారిందరిలోనూ ఆందోళన ప్రారంభమైంది. -
కడప జైలుకి జేసీ ప్రభాకర్రెడ్డి
సాక్షి, అమరావతి: జేసీ బ్రదర్స్ కంపెనీ.. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు ఫోర్జరీ, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు వాడినందునే రవాణా శాఖ పోలీసులతో క్రిమినల్ కేసులను నమోదు చేయించింది. ఆ తప్పుడు పత్రాల్లో ఉన్న సంతకాల ఆధారంగానే కేసులు పెట్టింది. ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 27 క్రిమినల్ కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాలు కొనుగోలు చేసిన వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే చీటింగ్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు ఆయా జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు కూడా తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు) మార్చిలోనే రవాణా శాఖ లేఖ ఈ ఏడాది మార్చి 11న నేషనల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు రవాణా శాఖ లేఖ రాసింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 56 వాహనాలకు సంబంధించిన బీమా పత్రాలను పరిశీలిస్తే 55 వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలు బీమా కంపెనీల వద్ద లేవు. దీంతో వాహనాల బీమా పత్రాలు సైతం నకిలీవేనని తేలింది. ► జేసీ బ్రదర్స్ కంపెనీ అక్రమంగా 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించింది. ఇందులో ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ రద్దు చేసింది. ► ఈ 95 లారీల్లో 80 లారీలు అనంతపురంలో, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 2 ఉన్నాయి. ఇంకా ఆరు లారీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. ► 154 వాహనాల్లో నాగాలాండ్లో 98, ఏపీలో 32, ఇతర రాష్ట్రాల్లో 24 లారీలను జేసీ బ్రదర్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించింది. 62 వాహనాలు సీజ్ చేశాం బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో.. అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. 154 వాహనాల్లో 101 ఏపీలోనే ఉన్నాయి. తాజాగా వాటిలో 95 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశాం. – ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్ కడప కేంద్ర కారాగారానికి జేసీ ప్రభాకర్రెడ్డి కడప అర్బన్/అనంతపురం క్రైమ్: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిలను అనంతపురం పోలీసులు ఆదివారం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మొదట అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లె కారాగారానికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ కరోనా కేసు నమోదు కావడంతో అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. తాడిపత్రి జైలుకు మార్చాలని జడ్జి ఆదేశించడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కడప జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేయడంతో అనంతపురం నుంచి తెల్లవారుజామున 3.58 గంటల సమయంలో కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా జైలు అధికారులు కరోనా పరీక్షలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలుగా ప్రభాకర్రెడ్డికి 2707, అస్మిత్రెడ్డికి 2708 నంబర్లను కేటాయించారు. -
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి అరెస్ట్
అనంతపురం క్రైం: జేసీ బ్రదర్స్ దివాకర్ ట్రావెల్స్ ముసుగులో పాల్పడ్డ అక్రమాలకు సంబంధించి శనివారం తెల్లవారుజామున అనంతపురం పోలీసులు హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిలను అరెస్ట్ చేశారు. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రెండు బృందాలుగా వెళ్లి వారిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తీసుకొచ్చారు. ► దివాకర్ రోడ్ లైన్స్కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించి, విక్రయించారని ఉప రవాణా శాఖాధికారి ఇటీవల వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ► ఈ కేసులో ఏ1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి), ఏ2గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ3గా నాగేంద్ర, ఏ4గా బాబయ్య, ఏ5గా జేసీ విజయ (జేసీ దివాకర్ రెడ్డి సతీమణి), ఏ6గా జేసీ అస్మిత్ రెడ్డిలపై 420, 467, 468, 471, 472, 120బీ, 201, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డిలకు అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వన్టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ► ఏ3 నాగేంద్ర, ఏ4 బాబయ్య ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. ఏ1 జేసీ ఉమారెడ్డి, ఏ5 జేసీ విజయలను అరెస్టు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా దివాకర్ ట్రావెల్స్పై అనంతపురం వన్టౌన్లో 8, తాడిపత్రిలో 16 కేసులు, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి ఒక కేసు నమోదైంది. ► అనంతపురం వన్టౌన్లో నమోదైన కేసుల్లో కొన్నింటికి ముందస్తు బెయిల్ లభించింది. ప్రస్తుతం ఒక కేసు విషయంలో వీరిని రిమాండ్కు తరలించారు. మరో కేసుపై నేడో రేపో పీటీ వారెంట్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ► ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను పోలీసులు రెడ్డిపల్లి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో తిరిగి అనంతపురం తీసుకువచ్చారు. -
ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్మాల్
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమ వ్యవహారాలు విస్తుగొలుపుతున్నాయి. జేసీ బ్రదర్స్కు చెందిన కంపెనీ చేసిన అక్రమాలు రవాణా శాఖ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంలో వీరి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బస్సుల్ని తిప్పి అక్రమాలకు తెగబడ్డారు. దొంగ పర్మిట్లతో బస్సులు నడపడం ఓ ఎత్తు అయితే.. తాజాగా బయల్పడిన దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిషేధిత బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారం కలకలం రేపింది. ఈ అక్రమ వ్యవహారాన్ని రవాణా రంగ నిపుణులు నేషనల్ ఫ్రాడ్గా పేర్కొంటున్నారంటే దీని తీవ్రత ఎంతో ఇట్టే అర్థం అవుతోంది. దివాకర్ రోడ్లైన్స్కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించి ఇతర రాష్ట్రాల వారికి విక్రయించిన ఘటనలో ఆర్టీఏ అధికారుల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో వారి బాగోతాల చిట్టాలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అధికారులు సీజ్ చేసిన లారీల ఛాసీలు బీఎస్4 పేరుతో అక్రమాలు – బీఎస్–3 శ్రేణి వాహనాలను అత్యధికంగా కాలుష్యం వెదజెల్లే వాహనాలుగా గుర్తించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 29న వాటి తయారీని నిషేధించింది. 2017 ఏప్రిల్ 1 తర్వాత ఈ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్ చేయరాదని ప్రకటించింది. – అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ట్రాన్స్పోర్టు రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుభవంతో అశోక్ లైలాండ్ కంపెనీకి చెందిన లారీలు, టిప్పర్లను కారుచౌకగా కొట్టేయాలని భావించారు. – జేసీ ప్రభాకర్రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిలకు చెందిన జఠాధర ఇండస్ట్రీస్, జేసీ ప్రభాకర్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్రెడ్డికి చెందిన సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీలు.. గడువు మీరిపోయి విక్రయం కాకుండా నిలిచిపోయిన 154 లారీలను నాగాలాండ్కు వెళ్లి అశోక్ లైలాండ్ కంపెనీ నుంచి తుక్కు(స్క్రాప్) కింద అతి తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. – ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీతో సి.గోపాల్రెడ్డి పేర్ల మీద తప్పుడు పత్రాలు సమర్పించి 2018లో నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత కొన్ని లారీలను వారే నిర్వహిస్తుండగా మరికొన్నింటిని ఇతర లారీ ఓనర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్రాలతో బీమా కంపెనీలను బురిడీ కొట్టించారు. ఇలా బట్టబయలు.. – ఈ వాహనాలు రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో తొలుత 66 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్ లే లాండ్ కంపెనీకి ఏపీ రవాణా అధికారులు లేఖ రాశారు. అ కంపెనీ అదే నెల 23న పూర్తి వివరాలు పంపించింది. – కాలం చెల్లిన బీఎస్–3కి చెందిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్ లే లాండ్ కంపెనీ తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ ప్రధాన రికార్డులను పరిశీలించింది. – ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఎన్ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్ రా«జధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించగా అక్రమాల డొంక కదిలింది. – వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్ లే లాండ్ కంపెనీ ఇన్వాయిస్లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. పైగా ఇన్వాయిస్లను మార్చి సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్ పొందాయి. – ఉత్తరాఖండ్లోని కళ్యాణ్పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్ లే లాండ్ కంపెనీలు ఆ ఇన్వాయిస్లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. తాడిపత్రిలో గత శుక్రవారం అధికారులు సీజ్ చేసిన బీఎస్3 టిప్పర్లు కేసు నమోదు – వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్ పోలీసు స్టేషన్లో జేసీ బ్రదర్స్ కంపెనీపై రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. – జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. తదనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేస్తే దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిట్గా ఉన్నాయంటూ తప్పుడు పత్రాలు – తుక్కు కింద బీఎస్–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. – వీటన్నింటికీ నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్గా ఉన్నాయంటూ, బీఎస్–4 ప్రమాణాలతో ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ చేయించారు. వీటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. – ఆయా వాహనాల ఛాసిస్ నంబర్లను రవాణా అధికారులు పరిశీలించగా, అన్నీ బీఎస్–3కు చెందినవేనని తేలింది. ఇదే విషయాన్ని అశోక్ లే లాండ్ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధరించారు. – దీంతో 154 వాహనాల లావాదేవీలు నిషేధించేందుకు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కు లేఖ రాశారు. ఇందులో 28 వాహనాలను ఇప్పటికే ఎన్ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ‘వాహన్’ డేటాబేస్లో అన్ని వాహనాలను బ్లాక్ చేయాలని కోరారు. – ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో 24, కర్నూలులో 3.. మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. – ఈ 154 వాహనాల్లో ప్రస్తుతం ఆంధ్రపదేశ్లో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, నాగాలాండ్లో 3, తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాలో, 8 నెల్లూరు, 5 చిత్తూరు, 3 కడప, 2 వాహనాలు గుంటూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పటి వరకు 53 వాహనాలను సీజ్ చేశారు. అక్రమాలు కప్పిపుచ్చే యత్నం – ప్రభుత్వం అక్రమాలను వెలికి తీయడంతో జేసీ సోదరులు వాటిని కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇటీవల జేసీ నివాసం వద్దకు వెళ్లి గొడవకు దిగారు. మరికొందరు వారి నివాసం వద్ద ధర్నా చేసిన దాఖాలాలు కూడా ఉన్నాయి. – పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించడంతో జేసీ సోదరులు వారితో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. ఒక్కొ లారీ యజమానికి రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా 35 మందికి చెల్లించినట్లు సమాచారం. -
జేసీ ట్రావెల్స్: అంతులేని అక్రమాలు..!
-
జేసీ ట్రావెల్స్: అంతులేని అక్రమాలు..!
సాక్షి, తాడిపత్రి: జేసీ బద్రర్స్కు చెందిన మోటార్ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో పలు దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీ తుక్కు కింద విక్రయించిన వాహనాలను సేకరించిన తాడిపత్రికి చెందిన జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ వాటికి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో వాటిని నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ 68 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్ లీలాండ్ కంపెనీకి మెయిల్ చేయగా, అన్ని అంశాలను పరిశీలించిన కంపెనీ అదే నెల 23న అంటే, ఈ ఏడాది జనవరి 23వ తేదీన పూర్తి వివరాలు పంపించింది. కాలం చెల్లిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్ లీలాండ్ కంపెనీ తెలిపింది. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) ఆ కంపెనీలు ఎవరివి?: జఠాధర ఇండస్ట్రీస్ జేసీ ప్రభాకర్రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్రెడ్డికి చెందింది కాగా, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ జేసీ ప్రభాకర్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్రెడ్డికి చెందింది. పలు అశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి.. ఆ సమాచారం అందుకున్న తర్వాత రవాణా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా, ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఎన్ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించినట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్ రాజధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పూర్తి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాలు సేకరించగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. (జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్లోనూ స్కాం) అక్రమాలు ఎలా?: తమ వాహనాల రిజిస్ట్రేషన్ కోరుతూ, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ తరపున జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన జేసీ ఉమాదేవి దరఖాస్తుపై సంతకం చేశారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్ లీలాండ్ కంపెనీ ఇన్వాయిస్లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. అంతే కాకుండా అశోక్ లీలాండ్ కంపెనీ ఇచ్చిన ఇన్వాయిస్లను అసంపూర్తిగా సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్ పొందాయి. ఉత్తరాఖండ్లోని కళ్యాణ్పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్ లీలాండ్ కంపెనీలు ఆ ఇన్వాయిస్లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. బీఎస్–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి విక్రయించరాదని, అదే విధంగా ఆరోజు నుంచి వాటికి ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయొద్దని సుప్రీంకోర్టు మార్చి 29, 2017న ఆదేశాలు జారీ చేసింది. బీఎస్–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలు ఒకవేళ మార్చి 31, 2017 నాటికి విక్రయించి ఉంటే, వాటి రిజిస్ట్రేషన్కు మాత్రం కోర్టు మినహాయింపు ఇచ్చింది. అంతులేని అక్రమాలు: ఈ నేపథ్యంలో పై రెండు కంపెనీలు యథేచ్ఛగా మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించాయని తేలింది. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అవి రహదారులపై తిరగడానికి ఫిట్గా ఉన్నట్లు చూపి, ఎక్కడో సుదూరంలో ఉన్న నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించారు. అంతే కాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే వాటికి ఎన్ఓసీ సంపాదించి, ఇక్కడ అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సొంత జిల్లా కావడంతో యథేచ్ఛగా ఆ వాహనాలు తిప్పారు. ఆ విధంగా వారు చీటింగ్కు పాల్పడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, రహదారులపై తిరగడానికి ఏ మాత్రం అనువుగా లేని, తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి జిల్లాలో తిప్పారు. రహదారి భద్రత లేకపోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యానికి కూడా కారకులయ్యారు. ఇంకా ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు: వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలను నకిలీ, తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం, వాటికి ఎన్ఓసి పొంది 2 రోజుల నుంచి 2 వారాల్లోనే అనంతపురంలో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇంకా వాటిని యథేచ్ఛగా జిల్లాలోనూ, దేశంలోనూ తిప్పడం కచ్చితంగా చీటింగ్కు పాల్పడడమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడమే. ఇంకా ఏమేం చేశారు?: అంతే కాకుండా వాటిలో పలు వాహనాలను ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విక్రయించాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, తాడిపత్రికి చెందిన సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే తుక్కు కింద బీఎస్–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ మరో 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. వాటికి కూడా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్గా ఉన్నాయంటూ, బీఎస్–4 ప్రమాణాలతో కూడి ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ పేర్ల మీదే కాకుండా, కొన్ని వాహనాలను వ్యక్తిగత పేర్లతోనూ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయా వాహనాల ఛాసిస్ నెంబర్లను పరిశీలించగా, అన్నీ బీఎస్–3కు చెందినవే తప్ప, బీఎస్–4 ప్రమాణాలతో కూడినవి కావని తేలింది. ఇదే విషయాన్ని అశోక్ లీలాండ్ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధారించారు. వాటన్నింటినీ బీఎస్–4 ప్రమాణాల వాహనాలుగా చూపడానికి నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించారు. 154 వాహనాల లావాదేవీల నిషేధం: రాష్ట్రంలో 101 వాహనాలు రిజిస్టర్ అయి ఉండగా, వాటికి సంబంధించి మరే లావాదేవీ జరగకుండా డేటా బేస్ బ్లాక్ చేశారు. 28 వాహనాలను ఇప్పటికే ఎన్ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ఆ వాహనాలపై ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్ చేయాలని అధికారులు కోరారు. ఇంకా మిగిలిన వాహనాలను ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ల రద్దు: రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో 89 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. వాటిలో అనంతపురం జిల్లాలో 77 వాహనాలు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 5 చొప్పున, గుంటూరు జిల్లాలో మరో 2 వాహనాలు ఉన్నాయి. మిగిలిన వాహనాలకు సంబంధించి ఆర్సీ రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో 6 వాహనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అందువల్ల వాటి ఆర్సీ రద్దు చేయాలంటే హైకోర్టు అనుమతి కావాలి. అందుకే అధికారులు వేచి చూస్తున్నారు. ఇంకా కడప జిల్లాలో 3 వాహనాలు, అనంతపురం జిల్లాలో మరో 3 వాహనాల ఆర్సీలు రద్దు చేయాల్సి ఉంది. మొత్తం 154 వాహనాలకు సంబంధించి ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ‘వాహన్’ డేటాబేస్లో వాటిని బ్లాక్ చేయమని కోరుతూ రవాణా శాఖ జాయింట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన ఆ వాహనాల ఆర్సీల రద్దు కోసం ఆయా రాష్ట్రాలను కోరాలని అధికారులు నిర్ణయించారు. ఆ వాహనాలు రహదారులపై కనిపిస్తే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులను ఏపీ అధికారులు కోరారు. వాహనాల స్వాధీనం: రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో ఇప్పటికే 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా మిగిలిన 41 వాహనాల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 వాహనాలను స్వాధీనం చేసుకోగా, కడప, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 14 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ కేసుల నమోదు: ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో రవాణా అధికారి (డీటీసీ) 24 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కర్నూలు డీటీసీ మరో 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీకి చెందిన గోపాల్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి మంతనాలు: తమ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పలువురితో జేసీ ప్రభాకర్రెడ్డి మంతనాలు జరిపి, వారితో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు తిరిగి ఇస్తానని, అందువల్ల తమపై ఫిర్యాదు చేయవద్దని 35 వాహనాల యజమానులను ఆయన కోరినట్లు సమాచారం. అందువల్లనే ఆయా వాహనాలకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నకిలీ ఇన్సూరెన్సు పాలసీలు: నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్తోనే వారి అక్రమాలకు తెర పడలేదు. వాహనాల రిజిస్ట్రేషన్కు అవసరమైన ఇన్సూరెన్సు పత్రాలను కూడా వారు నకిలీవి ఆర్టీఏ అధికారులకు సమర్పించారు. ఇంకా కేసులు ఫైల్ చేయాల్సి ఉంది!: ఆ విధంగా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు యథేచ్ఛగా బేఖాతరు చేయడం, ఫిట్నెస్, రోడ్ సేఫ్టీ లేకున్నా ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి వాహనాలను యథేచ్ఛగా రహదారులపై తిప్పడమే కాకుండా, చివరకు ఇన్సూరెన్సు పత్రాలు కూడా నకిలీవి సమర్పించిన ఈ రెండు కంపెనీలపై ఇంకా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
-
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. చదవండి: జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్లోనూ స్కాం -
జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్లోనూ స్కాం
సాక్షి, అనంతపురం: బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించి అతి పెద్ద కుంభకోణానికి జేసీ సోదరులు పాల్పడ్డారు. ఈ అవినీతి బాగోతం రాష్ట్ర ఉన్నతాధికారులు బయటపెట్టారు. అయితే సదరు వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు యజమానులతో కుమ్మక్కయ్యారు. విడిభాగాలు తొలగించుకున్న తర్వాత సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలు అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. అప్పటికే ట్రావెల్స్ రంగంలో ఆరితేరిన జేసీ సోదరులు అతి తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశారు. సుప్రీంకోర్టు బీఎస్3 వాహనాల విక్రయాలు రద్దు చేయాలని ఉత్తర్వులు వెలువడించిన తర్వాత షోరూంలలో నిలిచిపోయిన వాహనాలను కొనుగోలు చేశారు. అదికూడా నాగాలాండ్ రాష్ట్రంలో అశోక్లైలాండ్ కంపెనీ చెందిన దాదాపు 160 వాహనాలు కొనుగోలు చేశారు. ఈ తంతంగమంతా ఆలస్యంగా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సదరు వాహనాలన్నీ బీఎస్3 కాగా నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్4గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ జిల్లాకు వచ్చి మీడియా సమావేశంలో ధ్రువీకరించారు. ఇలా జిల్లాలో దాదాపు 80 వాహనాలున్నాయని గుర్తించారు. మిగిలినవి వివిధ జిల్లాలో తిరుగుతున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలి’ యజమానులకు సహకరిస్తున్న ఆర్టీఏ ఉద్యోగులు దాదాపు నాలుగు నెలల క్రితం ఆర్టీఏ జాయింట్ కమిషనర్ జిల్లాకు వచ్చి జేసీ బ్రదర్స్ అవినీతి వ్యవహారం బయటపెట్టారు. సదరు వాహనాలను జప్తు చేయడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ జిల్లాలో అధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. ఇప్పటి వరకూ 50 వాహనాలు సీజ్ చేశారు. మిగిలిన 30 వాహనాలను గుర్తించాల్సి ఉంది. అయితే నాలుగు నెలల క్రితమే వాహనం నెంబర్తో సహా ఏఏ వాహనాలు అక్రమంగా రిజిస్ట్రర్ అయ్యాయో అధికారులు బహిర్గతపర్చారు. దాని ఆధారంగా యజమానులను సులభంగా గుర్తించవచ్చు. కానీ ఇక్కడి అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. పైగా యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం.. నాగాలాండ్లో కొనుగోలు చేసిన వాహనాలను కొన్నింటిని జేసీ ఉమారెడ్డి పేరుతో ఉండగా మరికొన్ని జఠాధర కంపెనీకి సి. గోపాల్రెడ్డితో ఉన్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం చేయడంతో అక్రమార్కులు ముందు జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని వాహనాలను ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టారు. మరికొన్నింటికి విడిబాగాలు తొలగించి విక్రయించేశారు. ఏకంగా టైర్ల వద్ద నుంచి బ్యాటరీలు, ఇంజన్, బాడీ మొత్తం తొలగించిన వాహనాలు కూడా ఉన్నాయి. కేవలం ఛాసీలు మాత్రమే ఉంటుండడంతో అవే వాహనాలను తీసుకొచ్చి ఆర్టీఏ కార్యాలయంలో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ఇలా తొలగించడానికి వీల్లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆర్టీఏ ఉన్నతాధికారులు సదరు యజమానులపై సానుభూతి చూపిస్తుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ -
జేసీ బ్రదర్స్ కంపెనీపై 24 క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన జేసీ బ్రదర్స్ కంపెనీ జటాధర ఇండస్ట్రీస్పై 24 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ (రోడ్ సేఫ్టీ) ఎస్ఏవీ ప్రసాదరావు తెలిపారు. మంగళవారం విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో అదనపు కమిషనర్ పి.శ్రీనివాస్, జాయింట్ కమిషనర్ (ఐటీ, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్) ఎల్ఎస్ఎం రమాశ్రీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రసాదరావు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ► అశోక్ లేలాండ్ కంపెనీ ఉత్పత్తి చేసిన బీఎస్–3 లారీలను తుక్కు (స్క్రాప్) కింద విక్రయించగా.. వాటిని జేసీ బ్రదర్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ► వాటిలో 98 లారీలను నాగాలాండ్లో, 32 లారీలను ఏపీలో, తమిళనాడు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో 24 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ► ప్రస్తుతం ఈ 154 లారీల్లో ఏపీలో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్గఢ్లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మరో మూడు లారీలు గుర్తించాల్సి ఉంది. ► వీటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన మొత్తం లారీలను బ్లాక్ లిస్ట్లో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కు లేఖ రాశారు. ► జాతీయ డేటాబేస్ ‘వాహన్’ నుంచి ఈ రిజిస్ట్రేషన్లు తొలగించాలని కోరాం. ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశాం. మిగిలిన ఆరు లారీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. ► ఇందులో 80 లారీలు అనంతపురం, 5 కర్నూలు, మరో 5 చిత్తూరు, కడపలో 3, గుంటూరులో 2 చొప్పున ఉన్నాయి. లారీల బీమా పత్రాలను పరిశీలించగా.. అవి కూడా నకిలీవేనని తేలాయి. యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు సమాచారం ఇచ్చాం. ► అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు వివిధ జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. ► వారిని జేసీ బ్రదర్స్ సంప్రదించి వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు రూ.12 నుంచి రూ.14 లక్షలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు మా దృష్టికి వచ్చింది. ► ఈ వ్యవహారానికి సంబంధించి జటాధర కంపెనీ డైరెక్టర్లు జేసీ ఉమాదేవి, అస్మిత్ రెడ్డి, సి.గోపాలరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మేశారు
-
‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలి’
సాక్షి, విజయవాడ: జేసీ ట్రావెల్స్ 154 బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. జటాధర ఇండస్ట్రీస్ పేరు మీద 50 వాహనాలు, సి.గోపాల్రెడ్డి పేరుతో 104 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. కర్ణాటకలో 33, తెలంగాణలో 15 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు, ఆంధ్రప్రదేశ్లో 101 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ తెలిపారు. అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. డేటా బేస్లో ఈ వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. దేశంలో ఈ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నా.. సీజ్ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. (కరోనా: కేంద్రం కొత్త మార్గదర్శకాలు) ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నేషనల్ డేటాబేస్లో అప్డేట్ చేయాలని కోరినట్లు ప్రసాదరావు తెలిపారు. అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాలు రిజిస్ట్రేషన్లు రద్దు చేశామన్నారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులు ఉన్నందున.. రిజిస్ట్రేషన్ల రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశామని, మరో 39 వాహనాలు సీజ్ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో 12 వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామన్నారు. జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలు చేసిన వారిని ముందే హెచ్చరించామని, 71 నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని పేర్కొన్నారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్రెడ్డి జటాధర ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. (యజమాని ఆత్మహత్య చేసుకున్న చోటే శునకం..) (జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్) -
జేసీ బ్రదర్స్ కాళ్లబేరం!
అధికారంలో ఉన్నన్నాళ్లూ మా అంతటోళ్లులేరని విర్రవీగిన జేసీ సోదరులు.. ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. వారు చేసిన ఒక్కో అక్రమం వెలుగుచూస్తుండగా జైలు భయంతో అన్నదమ్ములిద్దరూ ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే బీఎస్–3 వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన జేసీ సోదరులు.. వాటిని ఇతరులకు అంటగట్టి భారీగా వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం వెలుగుచూడగా.. బాధితులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో జేసీ సోదరులు కాళ్లబేరానికి దిగుతుండటం గమనార్హం. తుక్కులారీల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జేసీ సోదరులు కాళ్ల బేరానికి దిగినట్టు తెలుస్తోంది. కేసులు పెట్టవద్దంటూ తమ నుంచి లారీలు కొన్న వారిని వేడుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తాము విక్రయించిన తుక్కు లారీలను వెనక్కి తీసుకుని సదరు యజమానులకు లారీకి రూ.14 లక్షల చొప్పున ముట్టచెబుతున్నారు. అంతేకాకుండా తమ మీద కేసులు పెట్టకుండా రూ.100 బాండ్ పేపరు మీద వారితో సంతకాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చదవండి: తిమ్మిని బమ్మిని 'జేసీ'.. మొత్తం 154 వాహనాలు బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించిన ఘటనలో రోజుకో అక్రమ వ్యవహారం వెలుగుచూస్తోంది. కేవలం నాగాలాండ్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కూడా ఈ దందా సాగించినట్లు సమాచారం. మొత్తంగా 154 బీఎస్–3 లారీలను బీఎస్–4గా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొన్ని లారీలను రవాణాశాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. మిగిలిన లారీల కోసం వెతుకుతున్నారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, చండీఘర్ రాష్ట్రాల రవాణాశాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖలు రాశారు. సదరు బీఎస్–3 తుక్కు లారీలు కనపడితే వెంటనే సీజ్ చేయాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో కొనుగోలు వాతావరణంలో కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు అనుగుణంగా బీఎస్–3 వాహనాల రిజిస్ట్రేషన్లను 2017 ఏప్రిల్ 1 నుంచి చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో బీఎస్–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్–3 వాహనాలను.. బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ నాగాలాండ్లోని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 68 లారీలను స్క్రాప్ కింద తక్కువ ధరకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అనంతరం ఇదే విధంగా తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా కాలం వాహనాలు కొనుగోలు చేశారు. మొత్తంగా 154 వాహనాలను తక్కువ ధరకే కొనుగోలు చేసి బీఎస్–4గా పేర్కొంటూ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో తిప్పారు. జేసీ.. మీదీ బతుకేనా? తుక్కులారీ రూ.20 లక్షలకు విక్రయం తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ఘడ్లల్లో కూడా బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా మార్చి నకిలీ డాక్యుమెంట్లతో వాహనాలను తిప్పారు. ఇందులో కొన్ని లారీలను పలువురికి రూ.20 లక్షల చొప్పున విక్రయించారు. వాస్తవానికి ఆ లారీలకు మార్కెట్లో రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షల మేర ఉండటంతో తమకు తక్కువ ధరకే వస్తుందన్న భావనతో పలువురు వీరి నుంచి లారీలను కొనుగోలు చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు విచారణ ప్రారంభించి.. మొత్తం వ్యవహారాన్ని బయటకు లాగారు. అంతేకాకుండా ఈ వాహనాలను సీజ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తమను మోసగించి తుక్కులారీలను విక్రయించారంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారిని జేసీ బ్రదర్స్ బతిమలాడుతూ కేసు పెట్టవద్దని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా లారీకి రూ.14 లక్షల చొప్పున వెనక్కు చెల్లించడంతో పాటు.. కేసులు పెట్టబోమని వారి నుంచి రూ.100 బాండు పేపరు మీద సంతకాలు తీసుకుంటున్నారు. తద్వారా తమపై నేరుగా కేసు నమోదు కాకుండా జేసీ సోదరులు తిప్పలు పడుతున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో బలమైన ఆధారాలు ఉండటంతో కేసుల నుంచి తప్పించుకోవడం అంత సులువుకాదని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జేసీ సోదరులు.. తోడుదొంగలు.. -
తిమ్మిని బమ్మిని 'జేసీ'..
సాక్షి, అమరావతి: అక్రమ ‘మార్గాల్లో’ దోచేయడంలో టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్ను మించిన వారు లేరని మరోమారు నిరూపితమైంది. పర్మిట్లు లేకుండా బస్సులు తిప్పినా.. ఫోర్జరీ పత్రాలతో లారీలు, బస్సులను విక్రయించినా తమకు అడ్డే లేదన్నట్లు వ్యవహరించారు. ఈ అక్రమాలను మించి రవాణా శాఖ నివ్వెరపోయేలా మరో అక్రమ బాగోతం బయటపడింది. కాలం చెల్లిన అమ్మకూడని లారీలను తయారీ సంస్థ స్క్రాప్ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని దక్కించుకుని ఏకంగా నాగాలాండ్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారం రవాణా శాఖ విచారణలో తేలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 70 లారీలను ఇలా అక్రమ మార్గాల్లో తిప్పుతుండటంపై అధికార వర్గాలే నిర్ఘాంతపోతున్నాయి. నేషనల్ ఫ్రాడ్గా ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేసి మరీ.. కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని బీఎస్–3 వాహనాలను నిషేధిస్తూ 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో వాహన కంపెనీలు ఆ వాహనాల అమ్మకాలను నిలిపేశాయి. 2017లో చంద్రబాబు జమానాలో జేసీ బ్రదర్స్ 70 బీఎస్–3 వాహనాలను దక్కించుకుని నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించారు. సాధారణంగా నాగాలాండ్ రిజిస్ట్రేషన్ అంటేనే రవాణా శాఖకు అనుమానాలు తలెత్తాలి. కానీ అధికారం అండ ఉండటంతో అప్పట్లో రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో జేసీ బ్రదర్స్ ఆ కాలం చెల్లిన లారీలను అప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రోడ్లపై తిప్పుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లారీల ఛాసిస్, ఇంజన్ వివరాలను అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులకు మెయిల్ చేశారు. ఈ లారీలను తాము స్క్రాప్ కింద అమ్మేశామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారుల బృందం కొన్ని రోజుల క్రితం నాగాలాండ్కు వెళ్లింది. నిషేధించిన లారీల రిజిస్ట్రేషన్కు జేసీ బ్రదర్స్ బినామీలు ఏ పత్రాలు సమర్పించారని అక్కడి రవాణా అధికారులను అడగ్గా, వారు కొన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. వాటిని పరిశీలించిన రవాణా అధికారుల బృందం జేసీ బ్రదర్స్ నిషేధిత వాహనాలను తిప్పుతున్నారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వైనంపై క్రిమినల్ కేసుల్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ అక్రమ బాగోతంలో జేసీ బ్రదర్స్ బినామీ సంస్థ.. జటాధర ఇండస్ట్రీస్, జేసీ అనుచరుడు గోపాలరెడ్డి ఉన్నట్లు తేలింది. దీంతో 70 లారీలను సీజ్ చేయనున్నారు. వీటిలో 43 లారీలు అనంతపురం ప్రాంతంలో.. మరో 27 లారీలు బెంగళూరులో ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు. ఫోర్జరీ పత్రాలతో రెండు బస్సుల విక్రయం నకిలీ పత్రాలతో, పోలీసుల ఫోర్జరీ సంతకాలతో నిరభ్యంతరాల పత్రాలు చూపి ఆరు లారీలను బెంగళూరులో విక్రయించిన వైనంపై అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు కేసులు నమోదు చేసి జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారమంతా దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కనుసన్నల్లోనే సాగినట్టు వారిద్దరూ పోలీసుల విచారణలో వెల్లడించారు. లారీలనే కాకుండా రెండు బస్సులను కూడా ఇదే విధంగా అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనా కేసు నమోదు చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలకు రవాణా శాఖలో కొందరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఊతమిచ్చారన్న విమర్శలున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. -
జేసీ సోదరులు.. తోడుదొంగలు..
తాడిపత్రి: ‘‘జేసీ సోదరులు తోడు దొంగలు. త్రిశూల్ ఓ బినామీ కంపెనీ. మాజీ ఎంపీ జేసీ తన ఇంట్లోని వంట మనిషి, డ్రైవర్, చికెన్ షాపు యజమానుల పేర్లతో ఈ కంపెనీని సృష్టించి రూ.300కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని అక్రమంగా దోచుకున్నాడు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరించడమే కాకుండా లీజులను పొడిగిస్తూ పరోక్షంగా మద్దతు పలికారు.’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి త్రిశూల్ కంపెనీ అక్రమ మైనింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఓ పరిశ్రమ నెలకొల్పితే కానీ ఖనిజాన్ని తవ్వుకునేందుకు వీలు లేదన్నారు. అలాంటిది సేల్స్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారన్నారు. కంపెనీలో బినామీలుగా ఉన్న వ్యక్తులకు 5శాతం వాటా కల్పించి, జేసీ సోదరులు తమ వద్ద 95 శాతం వాటా ఉంచుకుని ఈ బాగోతాన్ని నడిపించారన్నారు. మాజీ ఎంపీ జేసీ వియ్యంకుడు వేణుగోపాల్రెడ్డి తనకు త్రిశూల్తో ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పించడమే లీజు రద్దుకు కారణమన్నారు. అయితే ఇప్పటికీ కోర్టుకు వెళ్తానని జేసీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమాజానికి ఆయన ఓ వైరస్ అని, ఈ సోదరుల వద్ద జిల్లాలో వీరి వెంట నడుస్తున్న నేతలందరికీ అది వ్యాప్తి చెందుతోందన్నారు. ఇతరుల కడుపుకొట్టి దోపిడీ చేయడం జేసీ సోదరులకే చెల్లిందన్నారు. వీరి అవినీతి సీరియల్ను తలపిస్తోందన్నారు. ట్రాన్స్పోర్టులో కూడా అనేక కుంభకోణాలు ఉన్నాయన్నారు. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
జేసీ.. మీదీ బతుకేనా?
సాక్షి, తాడిపత్రి: ‘‘జేసీ బ్రదర్స్...మీదీ ఓ బతుకేనా...ఊరుమీద పడి దోచుకోవడం తప్ప... అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఏనాడైనా పట్టించుకున్నారా..? ఆలయాలను అడ్డుపెట్టుకుని దోచుకున్నారు. ట్రాన్స్పోర్టు వ్యవహారంలో నకిలీ పత్రాలను సృష్టించి డ్రైవర్లకు అందాల్సిన బీమా సొమ్మును కూడా స్వాహా చేస్తున్నారు. చివరకు చికెన్ సెంటర్ల వ్యాపారులతో కూడా కమీషన్లు తీసుకున్న సంస్కృతి మీ చరిత్ర జిల్లా ప్రజలందరికీ తెలుసు...మీరా నాపై ఆరోపణలు చేసేది. నిజంగా దమ్ముంటే జేసీ ప్రభాకర్రెడ్డి నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం...మీరు సిద్ధమా..?’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ సోదరులకు సవాల్ విసిరారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని...నాడు చేసిన పాపాలే నేడు జేసీ సోదరులను వెంటాడుతున్నాయని, వారికి కేసుల భయం పట్టుకుందన్నారు. జేసీ సోదరుల 40 ఏళ్ల దుర్మార్గపు పాలనకు ప్రజలు ముగింపు పలికారని, అందుకే వారికి మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పినా జేసీ సోదరుల తీరులో ఇంకా మార్పురాలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. మీ ఆరాచకాలు అప్పుడే మరిచారా..? జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకున్న విషయాన్ని జిల్లా ప్రజలు ఇంకా మరచిపోలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షపార్టీ నేతలపై దొమ్మీ కేసులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అయితే అప్పట్లో పోలీసులు వాస్తవాలను తెలుసుకుని అసలైన నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులను వెంటబెట్టుకొని ప్రబోధానంద ఆశ్రమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దాడి చేశాడని, దాడిలో పాల్గొన్న వారి పేర్లను మాజీ ఎంపీ జేసీనే స్వయంగా పోలీసులకు అందజేసి విచారణకు సహకరిస్తే చార్జీ షీటు వేస్తారన్నారు. అంతేగానీ పోలీసులను బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. ప్రబోధానంద ఆశ్రమం ఘటనలో అరెస్టులు ఆపకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యనించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సామాన్యునికి ఓ న్యాయం... జేసీ కుటుంబానికి మరో న్యాయమా అని పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే ఇలా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇలాగే పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తే తాను కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద నిరాహార దీక్షకు పూనుకుంటానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి హెచ్చరించారు. బహిరంగ చర్చకు సిద్ధమా..? తనపై జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే జేసీ నివాసం వద్దకే చర్చకు వస్తానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో పోటీ చేసిన తమ కుమారులను ఎక్కడో ఉంచి ఇక్కడ అమాయకపు ప్రజలతో జేసీ సోదరులు చెలగాటమాడుతున్నారన్నారు. వారి కుమారులైతే క్షేమంగా ఉండాలి గానీ... నియోజకవర్గ ప్రజలు మాత్రం కక్షలు కార్పణ్యాలతో కొట్టుకు చావాలా..? అని ప్రశ్నించారు. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా నిద్రపోతున్నారన్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించేందుకు జేసీ సోదరులు కుట్రపన్నుతున్నారని, ఎవరూ కుట్రలకు బలికావద్దని పిలుపునిచ్చారు. -
ప్రబోధాశ్రమ ఘటనలో జేసీకి షాక్
అనంతపురం, తాడిపత్రి: చిన్నపొలమడ సమీపంలోని ప్రబోధాశ్రమంపై 2018 సెప్టెంబర్ 17న జరిగిన దాడి చేసిన కేసులో జేసీ సోదరుల (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి – మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి) ప్రధాన అనుచరులను తాడిపత్రి రూరల్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆకుల చంద్రశేఖర్, బాబు (బార్ బాబు), మిద్దె హనుమంతరెడ్డి, గన్నెవారిపల్లి మాజీ సర్పంచ్ చింబిలి వెంకరమణ ఉన్నారు. జేసీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన టౌన్బ్యాంకు అధ్యక్షుడు, బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు దద్దం సుబ్బరాయుడు ముందస్తు సమాచారంతో పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలిసింది. అరెస్టయిన నలుగురినీ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారిని రిమాండ్కు ఆదేశించారు. మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం? ప్రబోధాశ్రమ ఘటనలో పాల్గొన్న మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కేవలం 25 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో జేసీ సోదరులు వేలాదిమంది అనుచరులతో కలిసి ఆశ్రమంపైన, అక్కడి భక్తులు, వాహనాలపైన దాడిచేసిన విషయం విదితమే. త్వరలోనే మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. -
హిమగిరి బార్ నిర్వాహకులపై కేసు
అనంతపురం, తాడిపత్రి: మద్యం అమ్మకాలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో తాడిపత్రిలోని హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ‘మద్యం చీప్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్ సూపరిండెంట్ నారాయణస్వామి, స్థానిక ఎక్సైజ్ సీఐ దశరథరామిరెడ్డి సిబ్బందితో కలిసి హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లను మంగళవారం తనిఖీ చేశారు. ఇక్కడ ఎక్కువ శాతం చీప్ లిక్కర్ విక్రయిస్తున్నట్లు తేలినట్లు తెలిసింది. 6బీ, 7బీ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు? సాక్షిలో వచ్చిన కథనంతో ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు ఉదయమే రెస్టారెంట్లో ఉన్న నకిలీ మద్యాన్ని తరలించినట్లు తెలిసింది. భారీగా నకిలీ మద్యం నిల్వ ఉండడంతో ఎక్సైజ్ అధికారులు వచ్చి ఎక్కడ తనిఖీ చేస్తారో అని ముందు జాగ్రత్తగా ‘తగ్గింపు ధరకే మద్యం విక్రయాలు’ అని బార్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడమే కాకుండా బార్లో ఉన్న నకిలీ మద్యాన్ని మరోచోటుకు తరలించేసినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడం విశేషం. -
పొట్టి రవిపై పీడీ యాక్టు
జేసీ కోటలో ఆయనో అరాచకశక్తి. పెద్దాయన (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి) అండ.. చిన్నాయన (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి) సపోర్టు చూసుకొని పాతికేళ్లుగా తాడిపత్రిలో ఆయన చెప్పిందే వేదం. ఏకంగా తాడిపత్రికి ‘చిన్నబాస్’గా ఎదిగాడు. రూ.కోట్లకు పడగెత్తాడు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ నాయకుడు, జేసీ ప్రభాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి. నియోజకవర్గంలో పొట్టిరవిగా చలామణి అవుతూ సెటిల్మెంట్స్ కింగ్గా పేరుగడించాడు. పాతికేళ్లుగా అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అతడ్ని ‘టచ్’ చేయడానికే పోలీసులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. సమాజ భద్రతకు, ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న పొట్టిరవిపై తాజాగా పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించడం జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. సాక్షి, అనంతపురం : తాడిపత్రి మండలం దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడు సంగటి రవీంద్రారెడ్డి. 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. అప్పటి నుంచి జేసీ సోదరుల నమ్మకాన్ని చూరగొన్న రవీంద్రారెడ్డి క్రమక్రమంగా వారికి నమ్మినబంటుగా మారాడు. అప్పటి నుంచి జేసీ సోదరులను అడ్డుపెట్టుకుని చేయని దందా అంటూ లేదు. తాడిపత్రిలో మీడియాను తన గుప్పిటో పెట్టుకుని హవా నడిపించాడు. స్వయంగా ఓ మీడియాను స్థాపించడమే కాకుండా మిగతా పత్రికల్లో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేయించడంతో పాటు తన సొంత మీడియాలో అసభ్యకరంగా రాతలు రాయించడం లాంటి బ్లాక్మెయిల్ కార్యకలాపాలకు పాల్పడేవాడు. దీంతో పాతికేళ్లుగా తాడిపత్రిలో చీకటిరాజ్యం బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయింది. పెద్ద, చిన్న బాస్లతో పాటు పొట్టిరవి పేరు చొప్పుకొని అనేక మంది తాడిపత్రిలో పేకాట, మట్కా డాన్లుగా ఎదిగారు. గతేడాది పక్కా సమాచారంతో తాడిపత్రిలో ఓ ఇంటిపై కడప సీఐ హమీద్ఖాన్ దాడిచేసి నిందితులను పట్టుకునేందుకు యత్నించాడు. పోలీసులనే తిప్పికొట్టే పనిలో భాగంగా సీఐ హమీద్ఖాన్తో పాటు మరో కానిస్టేబుల్పై దాడి చేయడంతో పాటు పోలీసులు వచ్చిన వాహనాన్ని తగలబెట్టించారు. తాడిపత్రిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల విషయం స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ వారి జోలికెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రబోధానంద కేసులో ఏకంగా పోలీసుస్టేషన్పైకే దాడికి యత్నించిన ఘటనలో పొట్టి రవి కీలకంగా వ్యవహరించాడు. సహకార ఉద్యోగి హత్య కుట్ర భగ్నం తాడిపత్రిలో ఇటీవల సహకార సొసైటీ ఉద్యోగి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. హత్యకు యత్నించే ముందు దుండగులు ఎస్వీ రవీంద్రారెడ్డితో ఫోన్లో సంభాషించారు. తర్వాత తప్పించుకున్న విషయం కూడా తెలియపరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ కేసులో పొట్టి రవి కూడా నిందితుడని తేలింది. దీంతో ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్వీ రవీంద్రారెడ్డిపై పీడీ యాక్టు తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు పోలీసులు ప్రకటించారు. హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఇతని నుంచి సమాజ ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పీడీ యాక్టుపై కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రవీంద్రారెడ్డిపై నమోదైన కేసుల్లో కొన్ని.. 2003లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన(క్రైం నెంబర్155/03,332,160 ఐసిఎస్). 2004లో ( క్రైం నెంబర్ 43/04,147, 148,324,332,435,27 ) ఆయుధ చట్టం కింద కేసు. 2015లో అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో హెడ్కానిస్టేబుల్ వన్నూర్రెడ్డి ఫిర్యాదు మేరకు(క్రైం నెంబర్ 246/15) రూరల్ పీఎస్లో కేసు. 2017లో తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామ సమీపంలో శ్రీ ప్రభోదాశ్రమానికి చెందిన ఓ ట్యాంకర్ను దగ్ధం చేసిన కేసులో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో (క్రైంనెంబర్292/17) కేసు నమోదు. 2018లో వినాయక చవితి నిమజ్జనోత్సవం సందర్భొంగా చెలరేగిన ఘర్షణల్లో వద్దిపాటి దేవేంద్ర ఫిర్యాదు మేరకు (క్రైం నెంబర్ 210/18) కేసు. ఈ ఘటనలో ఎస్వీ రవీంద్రారెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు.(క్రైం నెంబర్ 210, 211, 212, 227) 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనీల్కుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసు(క్రైం నెంబర్ 182/19). -
నా కొడకల్లారా... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం
తాడిపత్రి: ‘రేయ్ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా... నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా... మీరు పోవాలా నా కొడకల్లారా.... మీ లారీలు అన్ని తిరుగుతాయా... రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు. ఇన్నాళ్లూ వెంట ఉన్న వారంతా ఇప్పుడు తనను వీడి పోతున్నారన్న అక్కసుతో వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆదివారం ఉదయం పార్టీ మారిన వారంతా రాత్రి తిరిగి పచ్చకండువా కప్పుకోక తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కనకాద్రిపల్లికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి జేసీ సోదరుల అండతో తాడిపత్రిలో గ్రానైట్ రవాణా చేసేవాడు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలకు బ్రేక్పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంతకాలం వారి పంచన ఉంటూ బానిసలుగా బతికిన వారు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వీడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రభాకరరెడ్డి....ఎలాగైనా తనను కాదని పోతున్న వారిని బెదిరించి తిరిగి టీడీపీ కండువా కప్పే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆదివారం గ్రానైట్ వ్యాపారి సుబ్బారావుకు జేసీ ప్రభాకరరెడ్డి ఫోన్ చేసి బెదిరించాడు. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టారు. దీంతో సదరు సుబ్బారావు ‘అయ్యా వస్తాలే’ అని చెప్పి...మరో టీడీపీ కార్యకర్త కొనంకి రమేష్నాయుడుతో కలిసి వెంటనే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వద్దకు వెళ్లాడు. వారు కనిపించగానే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి బూతులతో వారిపై విరుచుకుపడ్డాడు. తనను కాదని వెళ్తే అంతేనంటూ బెదిరించాడు. దీంతో వారు తిరిగి పచ్చకండువా కప్పుకుని ఆయన పంచన చేరారు. -
చంద్రబాబుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్
సాక్షి, తాడిపత్రి: అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకు రాని కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. 2009 ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు పడిన కార్యకర్తలను చంద్రబాబు ఎందుకు ఆదుకోలేదన్నారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు మంగళవారం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల ఘర్షనలో చింతా భాస్కర్రెడ్డి మృతి చెందడం జరిగిందన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని గుర్తు చేశారు. అప్పుడు పరామర్శకు రాని ఆయన... ఇప్పుడు రావడం రాజకీయ నాటకంలో భాగమన్నారు. టీడీపీ హయాంలోనే శాంతిభద్రతలు క్షీణించాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఘటన ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. జేసీ సోదరులు దాడి చేసినప్పుడు ఏమయ్యావ్..? 2009 ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో ఉన్న జేసీ సోదరులు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారని.. టీడీపీ నాయకుడు, తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీప్రసాద్ ఇంటికి నిప్పు పెట్టారని పెద్దారెడ్డి గుర్తుచేశారు. అయితే అప్పట్లో మురళీప్రసాద్కు నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ప్రకటించిన చంద్రబాబు.. నేటికీ ఆ మొత్తాన్ని ఇవ్వలేదన్నారు. ఆ ఐదేళ్లూ దురాగతాలే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, జేసీ సోదరుల దురాగతాల వల్ల పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల భాస్కర్రెడ్డి బలయ్యారని పెద్దారెడ్డి గుర్తు చేశారు. మరి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం తాడిపత్రిలో పోలీసుల తీరు చాలా బాగుందని పొగడ్తలు కురిపించిన వారే.. ఇప్పుడు పోలీసుల చర్యలను తప్పుపడుతున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని, దీనికి తామేమీ అడ్డుచెప్పలేదన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారనే అక్కసుతో పోలీసుల తీరుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని గుర్తించాలన్నారు. జేసీ పవన్ క్రికెట్ బుకీ పలుకేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ దర్జాగా పోలీస్స్టేషన్కు వెళ్లి రావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జేసీ పవన్ కుమార్రెడ్డి ఓ క్రికెట్ బుకీ అని, అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాము రైతు కుటుంబం నుంచి వచ్చామని, తనకు విద్య లేకపోయినా సంస్కారం ఉందన్నారు. అందువల్లే నియోజకవర్గ ప్రజలు తనకు పట్టం కట్టారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. -
అనంతపురంలో టీడీపీకి ఒక్కరూ మిగలరా?
టీడీపీ నేతలను కేసుల భయం వెంటాడుతోంది. మరికొందరు తమ ఆస్తులను, కాంట్రాక్టులను కాపాడుకునే క్రమంలో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ వైపు చూస్తున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండ చూసుకొని జిల్లాలో టీడీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని చెప్పడంతో టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అందరికంటే ముందుగా తన ఇల్లు సర్దుకోవడం గమనార్హం. సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. సూరి పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. జేసీ బ్రదర్స్ జేపీ నడ్డా, రాంమాధవ్తో రెండురోజుల కిందట చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కూడా లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబం చూపు కూడా పరిటాల సునీత కుటుంబం కూడా బీజేపీ వైపు చూస్తోంది. సునీత అల్లుడు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి లైన్క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని, లేదంటే టీడీపీలో భవిష్యత్ ఉండదని సునీత అల్లుడు చెబుతున్నట్లు సమాచారం. శ్రీరాం కూడా తన బావ ఆలోచనకు అనువుగా కమలం పంచన చేరేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అయితే సునీతతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కోటరీలోని కొందరు పరిటాల అంటే టీడీపీ అనే ముద్ర ఉందని, బీజేపీలో చేరితే టీడీపీ శ్రేణులు తమతో వస్తాయా? రావా? అనే ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే వరదాపురం సూరి బీజేపీలో చేరిన నేపథ్యంలో సునీతను ధర్మవరానికి వెళ్లి సమావేశం నిర్వహించాలని, అలాగే ధర్మవరం ఇన్చార్జ్గా కొనసాగాలని సునీతకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అధినేత అభిప్రాయాన్ని సునీత సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాప్తాడు ఇన్చార్జ్గా శ్రీరాం ఉన్నాడని, ధర్మవరం విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇన్చార్జ్ బాధ్యతలను తిరస్కరించడం వెనుక త్వరలో వారు కూడా పార్టీ మారాలనే నిర్ణయమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేసీ బ్రదర్స్ చర్చలు కూడా సఫలం తాడిపత్రిలో 40 ఏళ్లుగా ఏక చత్రాధిపత్యం నడిపిన జేసీ బ్రదర్స్కు మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. వారసులిద్దరూ ఓడిపోయారు. జిల్లాలో టీడీపీ ఘోర ఓటమికి జేసీ బ్రదర్స్ కూడా కారణమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దివాకర్రెడ్డి కూడా టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్న పరిస్థితిని బీజేపీ అవకాశంగా తీసుకుని ఏపీలో బలపడాలనే యోచనలో ఉందని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు జేసీ పవన్రెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల కిందటే బీజేపీ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చి చేరిక తేదీపై మీరే నిర్ణయం తీసుకోవాలని ‘జూనియర్ బ్రదర్స్’కు చెప్పినట్లు సమాచారం. కాబట్టి సూరి తర్వాత జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబంలో ఎవరు ముందు ఢిల్లీ విమానం ఎక్కుతారా? అనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ చేరికల వెంటనే కందికుంట ప్రసాద్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. నట్టేట ముంచిపోయాడు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడం పట్ల ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వారం రోజులకే సూరి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత నియోజకవర్గానికి అడపాదడపా వస్తూ క్యాడర్ను కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేయడం జరుగుతోంది. క్లాస్–1 కాంట్రాక్టర్ అయిన సూరీ నితిన్సాయి కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఎస్సీ) పేరిట ధర్మవరం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల పనులు చేస్తుండగా.. వీటిలో కొన్ని మధ్యలో ఉండగా, మరికొన్ని బిల్లులు కాకుండా పెండింగ్లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో టీడీపీలోనే కొనసాగితే ఆయా పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోవడంతో పాటు, నాణ్యతకు సంబంధించి విచారణ జరిగితే ఇబ్బందులు తప్పవనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సూరి అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. ఈ నేపథ్యంలో తన పనులకు ఆటంకం కలిగి, ఆదాయానికి గండిపడుతుందని భావించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అయితే ఇంతకాలం ఆయనను నమ్మి పని చేసినందుకు తమతో పాటు పార్టీని నట్టేట ముంచిపోయాడని క్యాడర్ రగిలిపోతోంది. తన సొంత ప్రయోజనాల కోసం ఇంతమందిని బలి చేస్తున్న ఆయనకు భవిష్యత్ లేదని, తాము ఆయన వెంట నడిచే ప్రసక్తే లేదని కార్యకర్తలు, నాయకులు తేల్చి చెబుతున్నారు. -
నవోదయం
జిల్లా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. హోరుగాలిలో ఊక ఎగిరిపోయినట్టు.. జోరువానలో ఉప్పు కరిగినట్లు.. వైఎస్ జగన్ సునామీలో రాజకీయ వటవృక్షాలు కొట్టుకుపోయాయి. జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ ఇచ్చారో అంతకు మించి వైఎస్సార్సీపీని ఆదరించారు. ఈ ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుండగా.. టీడీపీ డీలా పడింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ తరఫున హిందూపురంలో బాలకృష్ణ మాత్రమే గెలుపొందారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్బ్యాలెట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు. తొలిరౌండ్ నుంచి వైఎస్సార్సీసీ ఆధిక్యతను ప్రదర్శించింది. ప్రతిరౌండ్లోనూ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఉదయం 11 గంటలకే ఫలితాల ట్రెండ్ తేలిపోయింది. హిందూపురం, మినహా తక్కిన 12 నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అయితే ఉరవకొండలో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలతో అర్ధరాత్రి దాటినా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఉద్ధండులకు భంగపాటు జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. వీరి కనుసన్నల్లో జిల్లా రాజకీయం నడిచింది. అయితే ఇది గతం. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల నుంచి రాజకీయ వారసులుగా బరిలోకి దిగిన పరిటాల శ్రీరాం, జేసీ పవన్ కుమార్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిటాల రవీంద్ర వారసుడిగా శ్రీరాం బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి చేతిలో 25,575 ఓట్లతో ఘోరపరాభావం చవిచూశారు. పరిటాల కుటుంబం పాతికేళ్ల రాజకీయప్రస్థానంలో తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. ఈ దెబ్బతో పరిటాల కుటుంబానికి ఇక రాజకీయ సమాధి తప్పదనే చర్చ జరుగుతోంది. సామాన్యులు.. ‘అనంత’ విజేతలు ఈ ఎన్నికల్లో అందరిచూపు ఇద్దరి సామాన్యులపైనే ఉంది. అనంతపురం జిల్లాలో పలు స్టేషన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్, ఇదే జిల్లాలో గ్రూపు–1 అధికారిగా పనిచేసిన తలారి రంగయ్యలు ఇద్దరు ప్రధాన నేతలపై పోటీగా దిగారు. జేసీ దివాకర్రెడ్డి వారసుడిపై రంగయ్య, టీడీపీ అత్యంత బలంగా ఉండే హిందపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ బరిలోకి దిగారు. అయితే ఈ పోరులో ‘అనంత’ వాసులు సామాన్యుల పక్షాన నిలిచారు. కురబ, బోయ సామాజిక వర్గానికి చెందిన మాధవ్, రంగయ్యలను అఖండ మెజార్టీతో గెలిపించి దీవించారు. మాధవ్, రంVýæయ్య ఇద్దరూ 1.38 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారు. సామాన్యులకు రాజకీయ ఎదుగుదల కల్పించాలనే ఏకైక కారణంతో వీరిద్దరికీ వైఎస్ జగన్ టిక్కెట్ల కేటాయించారు. ఈ ఇద్దరినీ ప్రజలు ఆశీర్వదించారు. వీరితో పాటు రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ను కూడా హిందపురం బరిలో నిలిపారు. దురదృష్టవశాత్తూ ఈయన బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. మంత్రులు, చీఫ్విప్ల స్థానాల్లో వైఎస్సార్సీపీ స్వీప్ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసుల, శాసనసభ, మండలి చీఫ్విప్లు పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన రాప్తాడు, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కీలక పదవుల్లో కొనసాగుతున్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి 25,575 ఓట్లతో గెలుపొందగా, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి 14,463 ఓట్లు, పుట్టపర్తిలో శ్రీధర్రెడ్డి 31,276 ఓట్లతో విజయం సాధించారు. ఫలించిన శింగనమల సెంటిమెంట్ శింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. 46,221 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధించారు. అలాగే వీరితో పాటు గుంతకల్లు వెంకట్రామిరెడ్డి 48,532 ఓట్లతో, కళ్యాణదుర్గం ఉషాశ్రీచరణ్ 19,534 ఓట్లతో విజయం సాధించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి 7,941 ఓట్లు, మడకశిరలో తిప్పేస్వామి 12,917 ఓట్లు, కదిరిలో సిద్ధారెడ్డి 27,063 ఓట్లతో విజయం దక్కించుకున్నారు. ‘అనంత’లో అఖండ మెజార్టీ అనంతపురం నియోజకవర్గ చరిత్రలో తిరుగులేని మెజార్టీని వెంకట్రామిరెడ్డి సాధించారు. 27,285 ఓట్లతో అనంత వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఇంత మెజార్టీ రాలేదు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురునాథరెడ్డి 24,739 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు ఆ మెజార్టీని వెంకట్రామిరెడ్డి అధిగమించారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని ఆ పార్టీ శ్రేణులు పండుగలా చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో కేక్కట్ చేశారు. గెలుపొందిన నియోజకవర్గాల్లో కేక్ కటింగ్లు, ఆలయాల్లో మొక్కుల చెల్లింపులు, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రతీ పల్లెలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఫలితాల రోజు కూలీల మొదలు ఉద్యోగుల వరకు ఎవ్వరూ పనులకు పోకుండా, విధులకు వెళ్లకుండా ఉదయం నుంచి టీవీలకు అతుక్కుని ఫలితాలు వీక్షించారు. ఫలితాలు జగన్కు అనుకూలంగా ఉండటంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు. రైతులు, మహిళలు, వృద్ధులు కూడా వైఎస్సార్సీపీ విజయాన్ని వేడుకగా చేసుకున్నారు. రాజకీయంగా జేసీ కుటుంబానికి కాలం చెల్లు జేసీ దివాకర్రెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయచరిత్రలో కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేశారు. రాజకీయ అరంగేట్రంలో ఇండిపెండెంట్గా పోటీచేసి ఓడిపోవడం మినహా ఎప్పుడూ దివాకర్రెడ్డి ఓటమి చవిచూడలేదు. అయితే జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఈ ఐదేళ్లలో నోటికి ఎంతమాటొస్తే అంతమాట అంటూ జనాల్లో చులకనయ్యారు. తాడిపత్రిలో అవినీతి, అరచకాలతో ‘రౌడీరాజ్యం’ నడిపించారు. ఈ క్రమంలో దివాకర్రెడ్డి వారసుడు పవన్రెడ్డి లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే జేసీ ప్రభాకర్రెడ్డి వారసుడిగా బరిలోకి దిగిన జేసీ అస్మిత్రెడ్డి 8వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. తొలి నుంచి జేసీ కుటుంబం తాడిపత్రికి వరకు మాత్రమే పరిమితమై రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి జిల్లాలో చక్రం తిప్పాలని భావించారు. అయితే ఐదేళ్లకే కోలుకోలేని దెబ్బ తగలింది. తాజా ఓటమితో జేసీ కుటుంబం శకం ముగిసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జేసీ వైఖరే అని ఆ పార్టీ శ్రేణులు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో జేసీ బ్రదర్స్ పేరు ఇక ‘అనంత’ రాజకీయాల్లో వినపడకపోవచ్చని తెలుస్తోంది. -
గద్వాల నుంచి వచ్చిన జేసీ బ్రదర్స్ స్థానికులా?
సాక్షి, అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అభ్యర్థి తలారి పీడీ రంగయ్య తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాభిమానం సంపాదిస్తే వారి కులాన్ని, వారి స్థోమతను చూడరని, కేవలం వారి గుణాన్ని చూసే ప్రజా క్షేత్రంలో విజయాన్ని అందిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అర్హతను కలిగి ఉంటారని, వారు గతంలో పనిచేసిన అధికారిగా కాకుండా వారు చేసిన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందనే నినాదాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికే పట్టం కట్టేందుకు ప్రజలు తోడ్పడుతారని వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో కనీస మర్యాద కలిగి ఉండడం ద్వారా వారు తమ గుర్తింపును సాధించుకున్నారనే విషయాన్ని గమనించాలన్నారు. అలాంటి వారిని గుర్తించి వారి కుటుంబ నేపథ్యం, ప్రజా క్షేత్రంలో వారికి ప్రజలతో ఉన్న సంబంధాలను ఆధా రంగా చేసుకుని ఉన్నతమైన వ్య క్తులను ఎంపిక చేసి అనంతపురం, హిం దూపురం పార్ల మెంటు, హిం దూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా కేటాయించిందనే విషయం ప్రతి సామాన్య ఓటరుకు తెలిసిందేనన్నారు. జీవితాన్ని చదివిన వారే.. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ , హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనన్నారు. జీవితాలను చదివిన ఉన్నత ప్రతిభావంతులేనని చెప్పారు. పేదరికం నుంచి పైకి వచ్చినవాళ్లేనని, ప్రజా సమస్యల పరిష్కారినికై ప్రజాప్రతినిధులుగా కావాలనుకున్నారని తెలిపారు. అదే వారు చేసిన తప్పుగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలో లేని అసమానతలను ప్రత్యేకంగా రుద్దాలనుకోవడం అవివేకమన్నారు. సీసీ పేరు చెప్పగలరా పిచ్చి పిచ్చి రాతలు రాయడం కాదు. వాటికి నియమాలు నిబద్ధత, విశ్వసనీయత అనే అంశాలను కలిగి ఉండాలన్నారు. తాను జిల్లాలో పనిచేసిన సమయాల్లో క్యాంప్ క్లర్క్ ఎవరో పేరు చెప్పగలరా? ఆ విధంగా పావులు కలిపిన దాఖలాలే లేవు? అలాంటి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా దారుణమన్నారు. ఈ విషయంలో తప్పకుండా డిఫర్మేషన్ కోరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాడిపత్రి రాజకీయాన్ని నడపలేదు రాష్ట్రంలోనే బీహార్ తరహా రాజకీయం తాడిపత్రిలో కొనసాగుతోందన్నారు. అలాంటి రాజకీయాలకు చరమగీతం పాడాలనే ఉద్ధేశ్యంతో వైఎస్సార్సీపీ ఉన్నత ప్రమాణాలు కలిగిన ప్రతిభావంతులను గుర్తించి పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు. దీనిని సాధారణ ప్రజలు ప్రత్యేకంగా గౌరవిస్తున్నారని చెప్పారు. జిల్లా ప్రజల అభిమానమే కీలకం ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. జిల్లాకు చెందిన వారు కాకపోయిన సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలను ఈ జిల్లా ఆదరించిందని గుర్తుచేశారు. జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డిని శ్రీకాళహస్తి, డోన్ నుంచి గెలిపించిన తీరును గమనించాలన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహరావును నంద్యాల ప్రజలు గెలిపించి ప్రధానిని చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలోని సోమందేపల్లికి చెందిన సాయిప్రతాప్ను కడప జిల్లాలోని ప్రజలు ఆదరించారని చెప్పారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారేనని, వారు పేదవారికం కష్టాలను అనుభవించిన వారేనన్నారు. స్థానికులు ఎలాగో చెప్పాలి గద్వాల నుంచి వలస వచ్చి తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్న వారు లోకల్ ఎలా అవుతారనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన వారు అయినందుకు ఇలాంటి నీచమైన రాజకీయాలను చేస్తున్నారు తప్ప వేరేది కాదన్నారు. బోయ, కురుబ, ముస్లిం సామాజిక వర్గాలకు ఒక న్యాయం... కమ్మ వారికి మరో న్యాయంగా నీచ రాజకీయాలను చేయాలను కోవడం దారుణమన్నారు. -
బెదిరించే కళ్లు.. ఒళ్లంతా కుళ్లు!
సాక్షి, తాడిపత్రి అర్బన్: రెండునర్న దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జేసీ సోదరులు రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీలో చేరారు. ఎంపీగా జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి గెలవడం.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వారి అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. తమ స్వార్థం కోసం నదులను చెరబట్టారు. ఇసుకను తోడేసి రూ.కోట్లు పిండేశారు. ప్రజాప్రతినిధులైన వారే దగ్గరుండి మరీ మట్కాతో పాటు పేకాట కేంద్రాలను నడిపించారు. ఇక జేసీ ట్రావెల్స్ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. ఇలా చెప్పుకుంటూపోతే జేసీ బ్రదర్స్ అరాచకాలు కోకొల్లలు. సొంతూర్లోనూ అరాచకమే.. జేసీ బ్రదర్స్ అరాచకాలకు వారి సొంత గ్రామమైన జూటూరు రైతులు కూడా బలయ్యారు. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల క్షేత్రానికి అవసరమైన భూములను రైతులను భయపెట్టి, వేధించి అతితక్కువ ధరకే స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాట వినకపోతే ఎక్కడ చంపేస్తారోననే భయంతో రైతులంతా వారు ఇచ్చింది తీసుకుని భూములు అప్పగించారు. అంతేకాకుండా బ్రోకర్లను నియమించుకుని అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నిస్తే కేసులే.. తమ అరాచకాలను ఎవరు ప్రశ్నించినా జేసీ బ్రదర్స్ తట్టుకోలేరు. అది సొంత పార్టీ నేతలైనా సహించలేరు. ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ నేతలను కూడా అక్రమ కేసుల్లో ఇరికించారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరుతో డబ్బులు డిమాండ్ చేశారని, తాము ఇవ్వకపోవడంతో చెక్పోస్టులను ఏర్పాటు చేసి మరీ ఇబ్బందులకు పెడుతున్నారని గ్రానైట్ పరిశ్రమల యాజమానులు వాపోతున్నారు. పట్టణంలో ఎక్కువగా మట్కా కంపెనీలు జేసీ సోదరుల అండతోనే నడుస్తుండటం గమనార్హం. 2016లో నవంబర్లో టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సుమారు రూ.200 కోట్లపైగా అవినీతికి పాల్పడ్డారని కౌన్సిల్ సమావేశంలోనే ఎత్తిచూపారు. దీంతో జేసీ పీఆర్ సొంత పార్టీ కౌన్సిలర్ అని కూడా చూడకుండా అతన్ని కౌన్సిల్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయించారు. జేసీ సోదరుల అవినీతిపై గళం వినిపించిన జగ్గీ బ్రదర్స్పై కూడా జేసీ సోదరులు పగబట్టారు. రెండు దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకున్న జగ్గీ బ్రదర్స్ను పార్టీని నుండి సస్పెండ్ చేయించారు. ప్రధాన అనుచరుడైన కాకర్ల రంగనాథ్ జేసీ సోదరులను వ్యతిరేకించారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ సోదరులు 2018లో జనవరిలో అతని సమీప బంధువు, శేఖర్కు చెందిన ‘అన్నా ట్రాన్స్పోర్టు’ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. జేసీ సోదరుల అరాచకాలతో విసిగిపోయిన టీడీపీ సీనియర్ నాయకుడు హీరాపురం ఫయాజ్బాషా 2018 నుంచి స్తబ్దుగా ఉండిపోయారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఫయాజ్బాషాకు చెందిన స్థలం మున్సిపాలిటీదని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అయితే ఫయాజ్బాషా కోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. నడిబొడ్డున బార్.. ధర్నా చేసిన వారిపై దాడులు పట్టణ నడిబొడ్డున జేసీ బ్రదర్స్ ఆధ్వర్యంలోనే హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు.. ప్రజల నివాసాలకు 500 మీటర్ల సమీపంలో మద్యం షాపులు ఉండకూడదు. కానీ జేసీ బ్రదర్స్ పట్టణ నడిబొడ్డున మద్యం వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఆ మద్యం షాపును తొలగించాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా చేయగా.. జేసీ సోదరులు తమ అనుచరులతో దాడులు చేయించారు. జేసీ అరాచకాలు లెక్కకు మించి.. పెద్దవడుగూరు మండలం అప్పెచెర్లకు చెందిన సింగ్ల్విండో అధ్యక్షుడు చిట్టెం విజయభాస్కర్రెడ్డిని 2015 మార్చి 31న క్రిష్టిపాడులోని సింగిల్విండో కార్యాలయంలోనే జేసీ అనుచురులు అంతమొందించారు. ఈ కేసులో రాజీకి రావాలని జేసీ సోదరులు విజయభాస్కర్రెడ్డి బంధువులను, కుటుంబీలను కోరారు. అయినా వారు నిరాకరించడంతో 2018లో ఏప్రిల్లో వారి ఆస్తులను, వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశారు. తమ ఎదుగుదలకు అడ్డొస్తున్నాడనీ, తాము డిమాండ్ చేసినా డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో చిన్నపొలమడలోని ప్రభోదాశ్రమంపై కక్ష పెంచుకున్న జేసీ సోదరులు.. వినాయక నిమజ్జనం ముసుగులో 2018 సెప్టెంబర్ 15న చిన్నపొలమడలోని ఆశ్రమంపై దాడి చేయించారు. ఆ మరుసటి రోజు ఎంపీ జేసీ స్వయంగా వందలాది మంది అనుచరులతో ఆశ్రమం వద్దకు వెళ్లి దాడికి తెగబడ్డారు. ఈ ఘటన కేవలం అప్పటి సీఐ సురేంద్రనాథ్రెడ్డి, ఎస్ఐ రామక్రిష్ణారెడ్డిల పర్యవేక్షణ లోపంతోనే జరిగిందని నిర్ధారించిన పోలీసు ఉన్నతాధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు. 2018 సెప్టెంబర్ 16 ఎంపీ జేసీ తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్స్టేష్ను ముట్టడించారు. ప్రభోదానందస్వామిని అరెస్టు చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ‘‘చేతకాని పోలీసులు’’ అని విమర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులను కొజ్జాలుగా అభివర్ణిస్తూ పోలీస్స్టేషన్ గేటుకు తాళాలు వేసి సుమారు 48 గంటలపాటు స్టేషన్లోనే బైఠాయించారు. 2018 ఫిబ్రవరి 27న వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్బాషాపై ఎమ్మెల్యే జేసీ అనుచరులు దాడికి యత్నించగా... దాడి నుంచి గయాజ్బాషా చాకచక్యంగా తప్పించుకున్నారు. దీంతో జేసీ అనుచరులు ఆయన బీడీ ఫ్యాక్టరీపై దాడి చేసి సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు. 2015లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీగా పనిచేసిన ప్రతాప్రెడ్డి గ్రానైట్ అక్రమ రవాణా, జీరో వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. ఏడాదికి రూ.1.5 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రూ.7 కోట్ల వరకూ తీసుకెళ్లారు. దీంతో ప్రతాప్రెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేందుకు జేసీ సోదరులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. చివరకు చంపేస్తామని బెదరించారు. ఈ క్రమంలోనే ఏడీ ప్రతాప్రెడ్డి.. తనకు జేసీ ప్రభాకర్రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డితో ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జేసీ సోదరులు తమ అధికారం ఉపయోగించి ఆయన్ను తాడిపత్రి నుంచి బదిలీ చేయించారు. 2014 సెప్టెంబర్ 12న మహిళా బ్యాంకు మేనేజర్ ఎల్.మంజుల పట్ల ఎమ్మెల్యే జేసీ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏటీఎం కేంద్రాని తాళం వేశాడు. దీంతో ఆమె ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తప్పుడు కేసుగా కొట్టిపారేశారు. దీంతో ఆమె ప్రైవేటు కేసు వేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2018 డిసెంబర్ 30న ఎమ్మెల్యే జేసీ ప్రధాన అనుచరుడు మట్కాడాన్ రషీద్.. సోదాల కోసం వచ్చిన కడప సీఐ హమీద్ ఖాన్పై దాడి చేశాడు. పోలీసు వాహనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటనలో పోలీసులు కొందరిని అదుపులోనికి తీసుకోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే జేసీ... స్థానిక పోలీసు స్టేషన్ సర్కిల్లో తన అనుచురులతో కలసి బైఠాయించారు. మట్కా నిర్వాహకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోనూ దందా అనంతపురం న్యూ సిటీ : నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా జేసీ ట్రావెల్స్ నిర్వహిస్తున్న స్థలం మల్లికార్జనాచారిది. 2000లో అతను ఆ స్థలాన్ని బాబాయ్య అనే వ్యక్తికి ఇచ్చాడు. అయితే బాబయ్య స్థల యజమానికే తెలియకుండా జేసీ బ్రదర్స్కు అద్దెకు ఇచ్చాడు. దీంతో జేసీ బ్రదర్స్ నెలకు రూ.2 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ 19 ఏళ్లుగా జేసీ ట్రావెన్స్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఏ ఆధారం లేని తన ఇద్దరు కుమారులకు బిజినెస్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేందుకు షాపు ఖాళీ చేయమని మల్లికార్జునాచారి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరగా.. ఆయన ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. దీంతో బాధితుడు 2018 నవంబర్ 8న అప్పటి డీఎస్పీ వెంకట్రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది జనవరి 18న జేసీ ట్రావెల్స్ ఎదుట కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులతో కలసి ధర్నా చేశారు. బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు మల్లికార్జునాచారి కుటుంబీకులు వారికి మద్దతు తెలిపిన సీపీఐ నాయకులనే అదుపులోకి తీసుకున్నారు. కానీ జేసీ బ్రదర్స్లో ఎటువంటి మార్పు రాలేదు. తాడిపత్రి తరహాలో నగరంలోనూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు. -
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు షాక్
రాజకీయంగా తమకు ఎదురులేదని మిడిసిపడుతున్న జేసీ బ్రదర్స్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. జేసీ సోదరులు కాంగ్రెస్లో కొనసాగినన్ని రోజులూ తాడిపత్రిలో టీడీపీని తమ భుజాలపై మోసిన టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీరంతా సిద్ధమయ్యారు. జేసీ బ్రదర్స్ ఎన్నికల నుంచి తప్పుకుని వారసులను బరిలో నింపిన తరుణంలో ఊహించని ఈ పరిణామం ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలే టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న తరుణంలో బలమైన కేడర్ దూరం కావడంతో ఓటమి భయం వెంటాడుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ఉన్న జేసీ బ్రదర్స్ అరాచకాలకు తాడిపత్రి అడ్డా. రాజకీయంగా అడ్డొచ్చిన వారిని ఆర్థికంగా దెబ్బతీస్తారనే చర్చ ఉంది. అవసరమైతే హత్యా రాజకీయాలకూ వెనుకాడరనే ముద్ర వీరి సొంతం. చీనీచెట్లు నరికించడం, మూడో కంటికి తెలియకుండా ప్రాణాలు తీస్తూ తమకు ఎదురొస్తే ఎంత ప్రమాదమో చాటి చెప్పిన ఘటనలు అనేకం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో తాడిపత్రిలో టీడీపీ తరఫున పేరం నాగిరెడ్డి, గుత్తా వెంకట నాయుడు, కాకర్ల రంగనాథ్, జగదీశ్వరరె డ్డి, జయచంద్రారెడ్డి, ఫయాజ్లు టీడీపీని తమ భుజాలపై వేసుకుని జేసీ బ్రదర్స్తో పోరాడారు. అందుకే 2014 ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో జేసీ దివాకర్రెడ్డి 4వేల నుంచి 6వేల మెజార్టీతో విజయం సాధించారు. ఈక్రమంలో 2014 ఎన్నికల సమయంలో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. అయితే కాంగ్రెస్ కేడర్లోని భోగాతి నారాయణరెడ్డి కుటుంబం మాత్రమే జేసీ బ్రదర్స్ వెంట నడిచింది. మిగతా వారంతా వైఎస్సార్సీపీలో చేరారు. ఇక టీడీపీలో కీలక నేతగా ఉన్న పేరం నాగిరెడ్డి కూడా 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మిగతా టీడీపీ నేతలంతా కేడర్ను ఒప్పించి జేసీకి పనిచేయించారు. ఫలితంగా జేసీ ప్రభాకర్రెడ్డి 21,772 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత తమ విజయానికి అంతలా కష్టపడిన టీడీపీ నేతలైన జగదీశ్వర్రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను జేసీ సోద రు లు పూర్తిగా దూరం పెట్టారు. అంతటితో ఆగక ఆర్థికంగా ఇతరత్రా వేధింపులకు ది గారు. దీంతో వారంతా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరో 19 మంది కీలక నేతలు కూడా జేసీ బ్రదర్స్ను విభేదించి దూరంగా ఉంటున్నారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడిపత్రికి రానున్నారు. చాలాకాలం తర్వాత తాడిపత్రికి వస్తుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు కూడా కదనోత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వర్రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలతో పాటు తాడిప త్రి ఎంపీపీ గురులక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి, కాకర్ల జగన్నాథ్, చిత్తరంజన్రెడ్డి, మాజీ ఎంపీపీ రంగనాయకులు, జేసీ స్వగ్రామం జూటూరుకు చెందిన రా మ్మోహన్రెడ్డి, హనుమంతరెడ్డి, మహదేవరెడ్డి, నాగరంగయ్య, ఎంపీటీసీ సభ్యు లు వెంకటనారాయణ, పెద్దయ్య, బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ పుల్లన్న, రామేశ్వరరెడ్డి, ఉమాపతినాయుడు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్గౌడ్, ఖా జామైనుద్దీన్, లయన్స్క్లబ్ ప్రెసిడెంట్ రోఖియాబేగమ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరనున్నారు. దీంతో తాడిపత్రిలో టీడీపీ ఖాళీ అయినట్లే. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ పెత్తనానికి చెక్ పడినట్లేనా? : తాడిపత్రిలో పెద్దారెడ్డి రాకతో వైఎస్సార్సీపీ బలం పుంజుకుంది. టీ బంకులు, హోటళ్లతో పాటు ఎక్కడ నలుగురు గుమికూడినా ‘ఈ దఫా జేసీ వాళ్లకు ఇబ్బందే’ అనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీలో జోరుగా సాగుతున్న చేరికలు టీడీపీని పూర్తిగా కుంగదీశాయి. ప్రభాకర్రెడ్డి వారసుడిగా అస్మిత్రెడ్డి అరంగేట్రం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే తాడిపత్రి ఫలితం ఎలా ఉండబోతుందో ఇట్టే తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతోనే వారి రాజకీయ భవిష్యత్తుకు ఫుల్స్టాప్ పడినట్లయిందని.. ఇక వారి వారసులకు విజయం దక్కదని పార్టీని వీడుతున్న టీడీపీ నేతలు ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. -
జేసీ సోదరులకు షాక్
సాక్షి, పెద్దవడుగూరు: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ సోదరులకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. వారి అరాచకాలు భరించలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతూ ఆపార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్ సీపీ కండువాలు వేసుకోగా...శుక్రవారం మండల పరిధిలోని చిత్రచేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు రఘునాథరెడ్డి, ఆయన కుమారులు రంగారెడ్డి, రవీంద్రారెడ్డిలతో కలసి తాడిపత్రి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ఏళ్లుగా జేసీ సోదరులకు అండగా నిలిచినా...తమకు కనీస గౌరవం, గుర్తింపు ఇవ్వలేదన్నారు. పైగా టీడీపీ పాలనలో తాడిపత్రిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇక ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అందువల్లే వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపేందుకు 150 మంది అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు తనవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
జేసీకి ‘కాక’ర్ల బ్రదర్స్
సాక్షి, తాడిపత్రి అర్బన్: జేసీ సోదరుల పతనం ప్రారంభమైంది. ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా దూరం కాగా.. సొంత ఊళ్లోనే వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. తాజాగా వ్యతిరేక వర్గం కూడా కేతిరెడ్డి తరఫున ప్రచారం చేస్తూ ఒక్కసారి మార్పును కోరుకుందామని ప్రజలను కోరుతున్నారు. ఈ కోవలోనే కాకర్ల రంగనాథ్ సోదరులు మంగళవారం తాడిపత్రి మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘‘తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలకు ఎక్కువయ్యాయి, వాటిని నిలువరించాలంటే వైఎస్సార్ సీపీ తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యకు ఓటు వేయండి.. అందరం ఒక్కసారి మార్పును కోరుకుందాం.. వైఎస్సార్ సీపీని గెలిపిద్దాం’’ అని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట హుస్సేనాపురం గ్రామానికి కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డితో పాటు వచ్చిన కాకర్ల సోదరులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డితో పాటు కాకర్ల రంగనాథ్ సోదరులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, కాకర్ల రంగనాథ్ జగన్నాథ్(జయుడు) రంగనాయకులు, కేతిరెడ్డి సాయి ప్రతాప్రెడ్డి, జగ్గి సోదరులు జగదీశ్వర్రెడ్డి, కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, చిత్తరంజన్రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వెంకటేష్, రామ్శేఖర్, మాజీ కౌన్సిలర్ నాగరంగయ్య, డీఎన్ పెద్దయ్య, మోహన్రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఓటర్లకు జేసీ బ్రదర్స్ చీరలు, శాలువాలు
మిగిలింది మూడు నెలలు. ఇప్పటి వరకు ఓటర్ల బాగోగులు పట్టించుకోని నేతలకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్నికలు వచ్చేసరికి.. ఎలాగైనా ఓట్లు రాబట్టుకునే క్రమంలో అధినేత చంద్రబాబును అనుకరిస్తూ ప్రలోభాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలు.. వర్గ విభేదాలు.. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చీరలు.. శాలువాలు.. హాట్బాక్స్ల పంపిణీతో ఓటర్లకు వల వేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డ్రైవింగ్ లైసెన్స్లు తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ బ్రదర్స్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇన్నాళ్లు వెంట నడిచిన ద్వితీయ శ్రేణి ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో నియోజకవర్గంలో క్రమంగా పట్టు కోల్పోతున్నారు. వరుస పరిణామాలు ఓటమి దిశగా తీసుకెళ్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించిన తర్వాత పార్టీ బలోపేతమైంది. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు తప్పవనే నిర్ధారణతో ఓటర్లను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలనే దిగజారుడు రాజకీయాలకు జేసీ బ్రదర్స్ తెర తీశారు. జేసీ సోదరులు, వారి పిల్లలు ఎదగడం మినహా.. వాళ్ల వెంట నడిస్తే ఒరిగేదేమీ లేదని తెలుసుకున్న పార్టీ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ సోదరులు నాయకులను వదిలేసి.. ఓటర్లకు ఓల వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే చీరలు.. శాలువాలు.. హాట్బాక్స్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికితో పాటు తాడిపత్రిలో చీరలు పంపిణీ చేశారు. సూరత్ నుంచి నాసిరకమైన చీరలు తెప్పించి ఓటర్ల చేతుల్లో పెడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పంపిణీ కష్టంగా ఉంటుందని గ్రహించి, జేసీ ప్రభాకర్రెడ్డి, తనయుడు అస్మిత్రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘స్పర్శ’ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. సూరత్ నుంచి లారీలతో తెప్పించినా చాలాచోట్ల చీరలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపని పరిస్థితి. కేవలం ఎన్నికల కోసం వీరు ఇదంతా చేస్తున్నారని, చీరలకు కక్కుర్తి పడేవారు లేరని మహిళలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో శాలువాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి హాట్బాక్స్లు ఇచ్చారు. ఇలా ధనబలంతో ప్రతి వర్గాన్నీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో మరో ప్రలోభం: రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ నెల 21 నుంచి ‘డ్రైవింగ్ లైసెన్స్ మేళా’ నిర్వహిస్తున్నారు. 27వరకూ కొనసాగుతుంది. లైసెన్స్ల జారీ అనేది ఆర్టీఓ కార్యాలయాల్లో నిత్యం నడిచే తంతు! అయితే లైసెన్స్లు తాము ఇప్పించి ప్రజలకు మేలు చేస్తున్నామనే భావనతో అధికారులను రప్పించి, మీసేవ సెంటర్ ఏర్పాటు చేసి మంత్రి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేసి కార్యక్రమం నడిపిస్తున్నారు. ఎల్ఎల్ఆర్కు రూ.310, ఫోర్వీలర్కు రూ.460 చొప్పున లైసెన్స్ కావాల్సిన వాళ్లు చెల్లిస్తున్నారు. పోనీ ఇదైనా ప్రజాప్రతినిధి చెల్లించి ఉచితంగా లైసెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఎవరిడబ్బులు వారు చెల్లించి లైసెన్స్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వారి ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి తనయుడు మారుతి ఏకంగా టీడీపీ కార్యాలయంలో మేళాను ఏర్పాటు చేశారు. ఉరవకొండలో కూడా మండలి చీఫ్విప్ పయ్యావుల కేశవ్ మేళా నిర్వహించారు. తాడిపత్రిలోనూ జేసీ బ్రదర్స్ ‘లైసెన్స్ మేళా’ పూర్తి చేశారు. కనీసం అధికారులు కూడా మేళాను టీడీపీ కార్యాలయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేసి నిర్వహించకూడదని మరిచి టీడీపీ దారిలోనే నడుస్తున్నారు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో చీఫ్విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి ఏకంగా డబ్బులు అసంతృప్త నేతలు, కార్యకర్తలతో పాటు గ్రామాల్లో పది ఓట్లు ప్రభావితం చేయగలరనే వ్యక్తులను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. నాలగున్నరేళ్లలో రూ.కోట్ల రూపాయాలు అక్రమంగా అర్జించి ఎన్నికల ముందు ఓటర్లకు చిల్లర విదిల్చి ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే చర్యలకు అవలభించారు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడనుండటంతో ఆలోపే ఇలాంటి కార్యక్రమాలు ముగించేలా వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు వాళ్లని నమ్మే పరిస్థితి లేదని, జిల్లాలో టీడీపీకి ఘోర పరాభావం తప్పదని విపక్షపార్టీ నేతలు విమర్శిస్తున్నారు. జేసీ బ్రదర్స్పతనంతో ప్రలోభాలు 1. పాత టీడీపీ నేతలైన కాకర్ల రంగనాథ్, గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, జయచంద్రారెడ్డి, ఫయాజ్బాషాలు జేసీ బ్రదర్స్పై వ్యతిరేకతతో పార్టీకి దూరమయ్యారు. 2. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో వేలు పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించిన భక్తులే ఇక్కడ 15వేల మంది ఉన్నారు. వీరంతా జేసీ బ్రదర్స్ను వ్యతిరేకిస్తున్నారు. 3. ఇన్నాళ్లూ జేసీతో నడిచి, అత్యంత కీలకంగా వ్యవహరించే భోగాతి నారాయణరెడ్డి జేసీ బ్రదర్స్తో విభేదించారు. ఇక కలిసే ప్రసక్తే లేదని మధ్యవర్తులకు తేల్చి చెప్పారు. ఇక లాభం లేదనుకొని నాయకులను వదిలేసి ఓటర్లకు వల వేయడం ప్రారంభించింది జేసీ కుటుంబం. -
తాడిపత్రి పోలీసుల అత్యుత్సాహం!
-
తాడిపత్రి పోలీసుల అత్యుత్సాహం!
సాక్షి, అనంతపురం : తాడిపత్రి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయం వైపున నిలబడాల్సిన వాళ్లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. కోన ఉప్పలపాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ జేసీ వర్గీయులను అరెస్ట్ చేయకుండా.. యాడికి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారన్న కారణంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను నిర్భందించారు. పోలీసుల తీరుపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలేం జరిగింది.. వాల్టా చట్టానికి విరుద్ధంగా జేసీ ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి బోరు వేస్తున్నారని.. వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమపై అధికారులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో జేసీ వర్గీయులు వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. అయితే వైఎస్సార్ సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ నేత పెద్దారెడ్డి యాడికి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డ జేసీ వర్గీయులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రౌడీ రాజ్యం.. చట్టాలు అపహాస్యం
అనంతపురం: తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొంది. చట్టాలను అపహాస్యం చేస్తూ ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతోంది. విధి నిర్వహణలో ఉన్న తమపై ఏ క్షణంలో ఎవరు దాడికి పాల్పడతారో ఊహించని స్థితిలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులు పని చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఇంతకాలం పోలీసులను నయానోభయానో గుప్పిట్లో ఉంచుకుని తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటూ వచ్చిన వారే.. నేడు ఏకంగా దాడులకు తెగబడ్డారు. తమకు అడ్డువస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఈ దాడుల ద్వారా పోలీస్ శాఖకే హెచ్చరికలు జారీచేసినట్లైంది. గతంలో పట్టణ స్టేషన్లో.. 2017 డిసెంబర్ 21న తనతో ఫోనులో అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివపై అనంతపురం నగర మేయర్ స్వరూపా ఆ ప్రాంత త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తాడిపత్రికి వచ్చి మడ్డిపల్లి శివని అరెస్టు చేసి అనంతపురానికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి ఏకంగా తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్స్టేషన్కి చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి అర్బన్ సీఐ భాస్కరరెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపట్టాడు. ‘మేమైనా చేతులకు గాజులు వేసుకున్నామా? మీ వద్ద లాఠీలు ఉంటే మావద్ద కట్టెలు ఉన్నాయి’ అంటూ ఎంతకైనా తెగిస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. అధికారపార్టీ నేతలు కావడంతో పోలీసులు చేష్టలుడిగి చూడడం తప్పా ఏమీ చేయలేకపోయారు. డీఎస్పీపై ఎంపీ తిట్ల పురాణం గత ఏడాది సెప్టెంబర్ 15న చిన్నపొలమడలో చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పట్టణ పోలీస్స్టేషన్లో 48 గంటల పాటు ఎంపీ జేసీ దివాకర్రెడ్డి బైఠాయించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే కాక స్టేషన్ గేట్లకు తాళాలు వేసి మరి అప్పటి డీయస్పీ బంగి విజయ్కుమార్పై తిట్ల పురాణం అందుకున్నారు. పోలీసులను కొజ్జాలుగా సంభోదిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకే తలవంపులుగా మారింది. బరితెగించిన అనుచరులు మట్కా బీటర్లు ఇచ్చిన సమాచారంతో నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు తాడిపత్రికి వచ్చిన వైఎస్సార్ జిల్లా సీఐ హామీద్ఖాన్ బృందంపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడు, మట్కా డాన్ కె.వి.రషీద్, అతని అనుచరులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనం రేపింది. పోలీసులను ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా కట్టెలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా వారు వచ్చిన వాహనానికి నిప్పు పెట్టి దగ్దం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సీఐ పరిస్థితి రెండు రోజులైనా విషమంగానే ఉంది. ఆయనతో పాటు సిబ్బంది కోలుకోలేకపోయారంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాసీనతే కారణం తాడిపత్రిలో పనిచేసే పోలీసు అధికారులందరూ జేసీ సోదరుల కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. వారిపట్ల స్వామి భక్తిని చూపుతూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండాలి. జేసీ సోదరులతో పాటు, వారి అనుచరులు ఏమి చేసినా పల్లెత్తు మాట ప్రశ్నించకూడదు. ఈ ప్రాంతంలో మట్కా మాఫియాను తలపిస్తోంది. ఈ మాఫియాకు జేసీ సోదరులు వెనుదన్నుగా నిలిచారు. అంతేకాక మట్కా మాఫియా అందజేస్తున్న మాముళ్ల మాయలోనూ పోలీసులు చిత్తయిపోయారు. తమ డబ్బు తిన్నారు కాబట్టి తామేమీ చేసినా మౌనంగానే భరించాలనే తీరును జేసీ సోదరులతో పాటు వారి అనుచరులు కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా పోలీస్ వ్యవస్థ తాడిపత్రిలో పూర్తి నిర్వీర్యమైపోయింది. చివరకు ఇక్కడి పోలీసులకు గన్మెన్లు కావాలంటే నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతటి పతనావస్థకు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. -
తాడిపత్రిలో జేసీ సోదరుల ఆరాచకపాలన : విశ్వేశ్వర్రెడ్డి
-
‘జేసీ బ్రదర్స్పై ఫిర్యాదులను స్వీకరించడం లేదు’
సాక్షి, అనంతపురం : జేసీ బ్రదర్స్ దగ్గర ఉండి తమ ఆశ్రమంపై దాడులు చెయించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రబోదానంద స్వామి ఆశ్రమ ప్రతినిధులు విమర్శించారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ప్రెస్నోట్ విడుదల చేశారు. కోర్టు ఆదేశాలను భిన్నంగా స్థానికులను సైతం బయటకు పంపారని మండిపడ్డారు. జేసీ బ్రదర్స్పై తాము చేసిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ పోస్ట్ ద్వారా 75 ఫిర్యాదులు చేశామన్నారు. ప్రబోదానంద స్వామి భక్తులపై 30 కేసులు పెట్టారు కానీ, జేసీ దివాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. అధికారుల ఏకపక్ష వైఖరిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రబోధాశ్రమంపై ఎంపీ జేసీ అనుచరుల దాడి -
జేసీ దుర్భాషలపై ఖాకీల మౌనవేదన!
‘పోలీసులా? కొజ్జా నా ....లా? ఏ జాతికి సంబంధించిన వాళ్లు వీళ్లు’ ఈనెల16న పోలీసులపై ఎంపీ జేసీ వ్యాఖ్యలు ‘నీయబ్బ చేతగాని నా ...లు.. మీరు కనపడితే.. (రాయలేని భాష)’ ఈనెల 17న తాడిపత్రి డీఎస్పీ విజయ్కుమార్పై ఎంపీ జేసీ ‘మీకు... దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి’ 2017 డిసెంబర్ 21న తాడిపత్రి సీఐపై జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలు ‘మీ వద్ద లాఠీలు ఉంటే.. మా వద్ద కట్టెలు ఉన్నాయి.. పది నిమిషాలు సమయం ఇస్తున్నాం.. తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు’ 2017 డిసెంబర్లో సీఐపై జేసీ బ్రదర్స్ అనుచరుడు, మునిసిపల్ వైస్ చైర్మన్ జిలాన్ చేసిన వ్యాఖ్యలు ‘ఎమ్మెల్యే వస్తే పరిస్థితి చేదాటిపోతుంది, 10 నిమిషాలే సమయం ఇస్తున్నాం. ఆలోచించుకోండి’ అదే రోజు జేసీ పీఏ రవీంద్రారెడ్డి పోలీసులకు అల్టిమేటం సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇవే కాదు.. పత్రికల్లో రాయలేని దుర్భాషలు వీరి నోటి నుంచి వచ్చాయి. ఏకంగా పోలీసుల ఆత్మాభిమానం దెబ్బతినేలా, విధినిర్వహణలో నైతిక స్థైర్యం కోల్పోయేలా మాట్లాడినా పోలీసులు మాత్రం అచేతనంగా వారి ‘దుర్భాషలు’ మౌనంగా వినడం మినహా ఎదిరించిన సందర్భం లేదు. సీఐ, డీఎస్పీ స్థాయి వ్యక్తులను, ఏకంగా పోలీసు శాఖను అనరాని మాటలు అంటే, ఉన్నతాధికారులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి పోలీసు శాఖలో ఆత్మస్థైర్యం నింపే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు అధికారపార్టీ ఎమ్మెల్యే, ఎంపీ. అంటే రాజ్యంగంలో అధికార పార్టీకి, విపక్ష పార్టీకి, సాధారణ ప్రజలకు వేర్వేరు చట్టాలు, సెక్షన్లు ఉంటాయా? అనేది పోలీసులే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. తాడిపత్రి పేరు విన్నా, అక్కడి ప్రజాప్రతినిధుల ప్రస్తావన చేసినా పోలీసుల్లో నిర్లిప్తత ఆవహిస్తోంది. అది ప్రత్యేక సామ్రాజ్యంగా భావిస్తున్నారు. వీరే కాదు.. మునిసిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్తో పాటు ఏ అధికారి అయినా అక్కడి పెద్దమనుషులకు ‘జీహుజూర్’ అనాల్సిందే! లేదంటే అక్కడి నుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. నాగరికత పెరిగి, చట్టాలపై ప్రజల్లో చైతన్యం వచ్చిన ఈ రోజుల్లో ఇలాంటి ప్రాంతాలు.. ఇలాంటి వ్యక్తులు ఉండటం.. వీరి దూకుడుకు పోలీసులు కళ్లెం వేయలేకపోవడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆశ్రమం ఘటనలో ఊగిపోయిన జేసీ తాడిపత్రిలో ప్రభోదానంద ఆశ్రమంలో చెలరేగిన ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఒంటికాలిపై లేచి నోటికి ఎంతమాట వస్తే అంత అనేశారు. పోలీసులను కొజ్జానాకొడుకులు, చేతిగాని నాకొడుకులు అని దూషించినా పోలీసు ఉన్నతాధికారులెవరూ నోరుమెదపలేదు. ఇవే వ్యాఖ్యలు జేసీ బ్రదర్స్ కాకుండా విపక్ష పార్టీకి చెందిన నేతలో.. సామాన్య పౌరులో చేస్తే వారి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోచ్చు. మేయర్ స్వరూపపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యకర పోస్టింగులు పెట్టిన ఘటనలో మేయర్ ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతన్ని విడుదల చేయాలని తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్మన్ జిలాన్, జేసీ పీఏ రవీంద్రారెడ్డి స్టేషన్కు వెళ్లి సీఐ భాస్కర్రెడ్డిపై దూషణలకు దిగారు. ‘మీవద్ద లాఠీలు ఉంటే మా వద్ద కట్టెలు ఉన్నాయి’ అని పరోక్షంగా పోలీసులపై దాడి చేస్తామని బెదిరించారు. ‘మీకు 10 నిమిషాలు ఇస్తున్నా!’ అని జేసీ పీఏ సీఐలకే అల్టిమేటం ఇచ్చారు. మూడు రోజులుగా పోలీసుల్లో తీవ్ర చర్చ ఐదు జిల్లాల ఎస్పీలు, కర్నూలు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఉన్నారు. జేసీ దివాకర్రెడ్డి ఈ ఘటనలో మొత్తం పోలీసు వ్యవస్థను టార్గెట్ చేసి మాట్లాడారు. అయినా వారు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయలేదు. ఓ ప్రజాప్రతినిధి మొత్తం పోలీసు వ్యవస్థను కొజ్జాలుగా దూషిస్తే అతనిపై చర్యలు తీసుకోకపోతే, మొత్తం సిబ్బందికి ఎలాంటి సందేశాన్ని ఉన్నతాధికారులు పంపుతున్నారు అని శాఖలో చర్చ మొదలైంది. దూషణలకు దిగిన వారిని వదిలిస్తే రేపు ఎంపీ, ఎమ్మెల్యే నుంచి ఎంపీటీసీ దాకా.. ఆపై రోడ్డున వెళ్లే రౌడీషీటర్ దాకా అంతా ఇదే వైఖరి అవలంబిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు పరువును కాపాడి, యావత్ పోలీసు యంత్రాంగానికి ఆత్మస్థైర్యం కల్పించాలంటే ఈ ఘటనపై చర్చ జరిగి చర్యలు ఉండాలని ఓ డీఎస్పీ ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రబోదానందస్వామి ఆశ్రమంను ధ్వంసం చేసిన పోలీసులు
-
సర్ధుమణిగిన తాడిపత్రి.. కలెక్టర్ పూర్తి భరోసా
-
ఊపిరి పీల్చుకున్న తాడిపత్రి
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదం చల్లారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో ప్రబోదానందస్వామి భక్తులు, జేసీ సోదరుల మధ్య చెలరేగిన ఘర్షణలకు తెరపడింది. ఆశ్రమ నిర్వాహకులతో కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం జరిపిన చర్చలు ఫలించాయి. ఆశ్రమం వదిలి స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు అంగీకరించారు. తాము ఏ ఒక్కరికీ అనుకూలం కాదని... ఆశ్రమానికి రక్షణ కల్పిస్తామని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో భక్తులు శాంతించారు. ఆశ్రమం నుంచి ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారిని తరలించారు. పోలీసుల తీరు వివాదాస్పదం మరోవైపు ప్రబోదానందస్వామి ఆశ్రమంపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన పోలీసుల్లో కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంలోని సీసీ కెమెరా ను సాక్షాత్తు పోలీసులే ధ్వంసం చేయటం దుమారం రేపుతోంది. ఆదివారం రోజున ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు పోలీసులు తమ వద్ద ఉన్న లాఠీలతో సీసీ కెమెరాలను పగులగొట్టారు. జేసీ వర్గీయులకు మేలు చేసేందుకు ఇలా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబోదానందస్వామి ఆశ్రమంలో ఉన్న కొందరు భక్తులను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. దీంతోపాటు జేసీ వర్గీయుల రాళ్ళ దాడి, వాహనాల ధ్వంసం చేసిన తీరు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తక్షణమే చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని తాడిపత్రిలో శాంతిభద్రత పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత -
‘టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి’
సాక్షి, అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి మండిపడ్డారు. గుత్తి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మిథున్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. కోర్టు నుంచి కేవలం నోటీసులు రాగానే కుట్ర అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజవర్గంలో జేసీ సోదరులు, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేత పెద్దారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారని మిథున్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలపై పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారని తెలిపారు. కొంతమంది అధికారుల వల్ల పోలీసు డిపార్ట్ మెంట్కు చెడ్డ పేరు వస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదారు నెలలు మాత్రమే ఉండబోతుందని, వైఎస్సార్సీపీ విజయం ఖాయం అని అన్ని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. -
అన్న మాట.. తమ్ముడు తూటా!
చేవ లేని పోలీసు శాఖజిల్లా పోలీసులకు చేవ లేకుండా పోతోంది. పోలీసుల తీరు వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. ఫ్రెండ్లీ పోలీసులంటూ నేరస్తులకు కూడా రాచమర్యాదలు చేస్తున్న పరిస్థితి. – ఈనెల 5న విలేకరుల సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్య గత ఏడాది డిసెంబర్ 21న.. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మేయర్ స్వరూప ఆరోపించడంతో ఎమెల్మే జె.సి.ప్రభాకర్రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివరాం నాయుడు మేయర్తో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు శివరాం నాయుడుని అరెస్టు చేసి అనంతపురం త్రీటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవి మరికొందరితో కలిసి తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని ఎవరో ఏదో కేసు పెట్టారని అరెస్టు చేస్తారా! అంటూ పోలీసులపై చిందులు తొక్కాడు. నా అనుచరున్నే అరెస్టు చేస్తారా? అంటూ అప్పటి సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐలపై మండిపడ్డారు. ‘భాస్కర్రెడ్డి.. నువ్వు చాలా తమాషాలు చేస్తున్నావ్.. నీపద్ధతి ఏం బాగోలేదు.. పని చేయడం చేతకాకపోతే మీరంతా సెలవులో పోండి’’ అంటూ దుర్భాషలాడారు. అనంతపురం, తాడిపత్రి: తమ్ముడు పోలీసులను బండ బూతులు తిట్టినా.. తన వర్గీయులను వెంటేసుకుని స్టేషన్లో భయానక వాతావరణం సృష్టించినా ‘జేసీ కుటుంబం’ కావడంతో మౌనంగా భరించారు. ఇప్పుడేమో అన్న రంగప్రవేశం చేసి చేవలేని పోలీసులని ఏకంగా ఆ వ్యవస్థనే బజారుకీడిస్తే.. చెవులు మూసుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. ఇదీ జిల్లాలో జేసీ సోదరుల తీరు. అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అక్రమ కేసులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా తాడిపత్రి సబ్ డివిజన్లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తిట్టినా.. కొట్టినా.. పోలీసులు ఒకేవర్గానికి కొమ్ము కాయడం, మరో వర్గం తుమ్మినా, దగ్గినా అక్రమ కేసులు బనాయిస్తుండటం.. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులే తిరిగి ఇక్కడ పాగా వేయడం చూస్తే ఎప్పుడు, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు ♦ ఆగస్టు 16న వైఎస్సార్సీపికి చెందిన ఓబుళరెడ్డి అనే కార్యకర్తను పోలీసులు బైండోవర్ చేశారు. ♦ ఆగస్టు 30న యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్డి బాషాపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఘటనా స్థలంలో లేకపోయినా ఆయనపై పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ♦ యల్లనూరు మండలం వెన్నెపూసపల్లి గ్రామంలో వైఎస్సార్సీపి నాయకుడు రాజేశ్వర్రెడ్డిపై అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు కేసు బనాయించారు. రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్లో ఉండగా పోలీసులు అక్కడికి వెళ్లిఅరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ♦ మార్చి 2న జేసీ సోదరుల వర్గీయునికి చెందిన పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో వైఎస్సార్సీపీకి చెందిన నాయకులను ఐదుగురుని పోలీసులు గత బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని బలవంతంగా ఒప్పించి అక్రమ కేసు బనాయించారు. అయితే సంఘటన జరిగిన దాదాపు 8 నెలలకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం గమనార్హం. అయితే జేసీ దివాకర్ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన కేసులో అదుపులోకి తీసుకున్న వైఎస్సార్సీపీ నాయకులను.. ఆ కేసుతో పాటు 8నెలల క్రితం పత్రికా కార్యాలయం దగ్ధం చేసిన కేసులో శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ♦ ఆలూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గోసు రాజగోపాల్రెడ్డి ఎస్ఐ చొక్కా పట్టుకున్నాడని.. దీంతో పాటు దళితునిపై దాడి చేశాడని ఆ నాయకునిపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ♦ గత మంగళవారం వైఎస్సార్సీపీకి చెందిన మైనార్టీ నాయకుడు తన సోదరుని వివాహానికి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ నేతలు జిల్లా ఎస్పీని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ఇదే నేతపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఆ మైనార్టీ నాయకున్ని అదుపులోకి తీసుకుని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా పీడీ యాక్టు ప్రయోగించి స్వామి భక్తిని చాటుకున్నారు. టీడీపీ నేతలపై కేసులంటే భయం ♦ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్బాషా డ్రైవర్ జఫ్రూ, అఫ్రోజ్ల నివాసాలపై గత బుధవారం రాత్రి టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ విషయమై గయాజ్బాషా డీఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఎవరో ఆకతాయిలు రాళ్లు వేశారని తేలిగ్గా తీసిపారేశారు. ♦ ఆగస్టు 15న పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పార్టీ ప్రతిష్టకు భంగం కల్గించేలా పోస్టింగులు పెట్టారని జేసీ వర్గీయుడు దాసరి కిరణ్పై వైఎస్సారీపీ నేతలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సివిల్ కేసుగా పేర్కొంటూ తిరస్కరించారు. ♦ సెప్టెంబర్ 2న వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టడంపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేసుకోలేదు. ♦ సెప్టెంబర్ 2న రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు బాషా ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందకు వెళ్లగా పోలీసులు స్పందింలేదు. ♦ ఆలూరు గ్రామంలో వైఎస్సార్సీపీ వర్గీయులకు చెందిన దళితులపై పట్టణంలోని నందపాడులో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో అప్పట్లో వీరిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేవలం నామమాత్రపు కేసును నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. -
జేసీ బ్రదర్స్కు తొత్తులుగా పోలీసులు
అనంతపురం / గుత్తి: జేసీ బ్రదర్స్ (దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి)కి పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ ధ్వజమెత్తారు. వారందరూ గుత్తి స్పెషల్ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం విడివిడిగా పరామర్శించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జేసీ బ్రదర్స్ ఆడగాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయన్నారు. అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కదిరి, రాప్తాడు, ధర్మావరం, హిందూపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ సర్కార్ పోలీసుల చేత అక్రమ కేసులు బనాయింపజేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మలుగా, మరీ ముఖ్యంగా జేసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో ఉన్నారని ఘాటుగా విమర్శించారు. పోలీసులు ఇలా అక్రమ కేసులు బనాయించుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందన్నారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు రేగుతుందన్నారు. పోలీసు యంత్రాంగం అరాచకాలను, రౌడీ, గూండాయిజాన్ని అణచి వేయడానికి పని చేయాలి తప్ప ఇలా అధికారపార్టీకి తొత్తులుగా మారితే ఇక చట్టం ఎందుకని ప్రశ్నించారు. విచారణ లేకుండా కేసులు పెడుతూ పోతే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు. ఇప్పటికైనా పోలీసులు చట్టం, న్యాయం ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. పెద్దారెడ్డిని పరామర్శించిన వారిలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పైలా నరసింహయ్య, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు మీసాల రంగన్న, పేరం నాగిరెడ్డి, మంగళ కృష్ణ, బొంబాయి రమేష్, రమేష్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫయాజ్ బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఉరవకొండ వీరన్న, సీవీ రంగారెడ్డి, సుభాష్రెడ్డి, శాంతి రెడ్డి, పీరా తదితరులు ఉన్నారు. -
జేసీ బదర్స్ ముఠా అరాచకాలు తారస్థాయికి చేరాయి
-
అరాచకం.. అక్రమం
అనంతపురం రూరల్ : తాడిపత్రిలో జేసీ ముఠా అరాచకం.. అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయని తాడిపత్రి మునిసిపల్ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఇసుక, గ్రానైట్ను అక్రమంగా తరలిస్తూ జేసీ బ్రదర్స్ రూ.200 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాడిపత్రిలో జేసీ సోదరులు ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారన్నారు. గతంలో జేసీ బ్రదర్స్ తమపై అనేక అక్రమ కేసులు బనాయించారని, అవన్నీ భరించి తెలుగుదేశం పార్టీ కోసం తాము పనిచేశామన్నారు. 2014లో తన రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్కు సహకరించాలని అధిష్టానం చెప్పడంతో సర్దుకుపోయి జేసీ ప్రభాకర్రెడ్డి గెలుపునకు కృషి చేశామని చెప్పారు. అయితే జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీని నమ్ముకొన్న వారికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి అనుచరులకే పదవులు కట్టబెట్టారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోతే ఆయనా పట్టించుకోలేదన్నారు. తమను టీడీపీ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తలను జగ్జీబ్రదర్స్ ఖండించారు. సస్పెన్షన్ ప్రచారం హాస్యాస్పదం తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీకి కొన్ని రోజుల కిందటే తాము రాజీనామా చేశామన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ నుంచి తమను సస్పెండ్ చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జేసీ కుటంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో ఆ కుటుంబం మరింతగా రెచ్చిపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. పార్టీ పరువును బజారుకీడుస్తున్నా అధినేత చంద్రబాబు మౌనంగా ఎందుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.. జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యం జేసీ దివాకర్రెడ్డి గతంలో తాడిపత్రిలో నామినేషన్ వేయయడానికి కూడా భయపడి పారిపోతే అప్పుడు ఎవరు అండగా ఉన్నారో తాడిపత్రి ప్రజలకు తెలుసని జగ్గీ బ్రదర్స్ అన్నారు. ఆ రోజుల్లో వందకు రెండొందలకు అడుక్కున్న మీకు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తాడిపత్రిలో గ్రానైట్ యాజమానులు, లారీల ఓనర్లను భయపెడుతూ నెలనెలా మామూళ్లు వసూలు చేస్తుంది మీరు కాదా అని నిలదీశారు. జేసీపీఆర్ పేరుతో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిస్తుంది ఎవరో ప్రజలకు తెలుసని, లారీలను పట్టుకొని కేసులు నమోదు చేసిన అదికారులను చంపుతామని బెదిరించిందీ నిజం కాదా అని అన్నారు. తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని ఓడించే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. జేసీ బ్రదర్స్కు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి తాడిపత్రిలో మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వారి పతనమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే దానికి జేసీ కుటుంబ సభ్యులే బాధ్యులని అన్నారు. -
జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉంది
-
‘జేసీ బ్రదర్స్ మమ్మల్ని చంపేస్తారేమో!’
సాక్షి, అనంతపురం: టీడీపీకి గుడ్బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. జేసీ ఫ్యామిలీ నుంచి మా ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్కు లేఖ కూడా రాశారు. మాకు ఏ హాని జరిగినా జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కొడుకులే కారణం. ఇకపై జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా కృషిచేస్తాం’ అని జగ్గీ బ్రదర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. (పూర్తి కథనం.. తాడిపత్రిలో టీడీపీకి షాక్) -
జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై రోడ్డెక్కిన టీడీపీ నేతలు
అనంతపురం : తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు ముదిరింది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై ఓవర్గం టీడీపీ నేతలు బుధవారం రోడ్డెక్కారు. టీడీపీ కార్యకర్త శేఖర్కు చెందిన అన్నాట్రాన్స్ పోర్టులో జేసీ వర్గీయులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక కారు, లారీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలకు నిరసనగా పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలతో కలిసి నేతలు జయచంద్రారెడ్డి, కాకర్ల రంగనాథ్ బైఠాయించారు. వెంటనే జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్రించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. అంతేకాదు సాక్షి విలేకరిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, జేసి బ్రదర్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష నేతలు ప్రెస్ క్లబ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఇందులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త పెద్దారెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఆధ్యక్షులు శంకర్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు. -
జేసీ సోదరుల ఆగడాలు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా తాడ్రిపత్రిలో జేసీ సోదరుల ఆగడాలు మితిమీరుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులను అసభ్య పదజాలంతో తిడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో సామాన్యులకే కాకుండా పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులకు కూడా గన్మెన్లను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. -
‘జేసీ బ్రదర్స్ అరాచకాలు తీవ్రమయ్యాయి..’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అరాచకాలు తీవ్రమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పోలీసు స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దారెడ్డి మాట్లాడుతూ.. సాక్షాత్తు పోలీసులనే బెదిరించడం జేసీ బ్రదర్స్ నిజస్వరూపానికి నిదర్శనమన్నారు. పోలీసుల విధులను అడ్డుకున్న జేసీ బ్రదర్స్, అనుచరులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. రక్షణ కల్పించే వారినే బెదిరించి యుద్ధ వాతావరణం సృష్టించారు. వారి దౌర్జన్యాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని ఉద్దేశించి అనంతపురం మేయర్ స్వరూప బుధవారం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
‘జేసీ సోదరులకు భయం పట్టుకుంది’
సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైఎస్సార్ సీపీ నాయకులు విశ్వేశ్వర్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్సార్ సీపీ నేత ఉదయ్భాస్కర్ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు పడతాయని జేసీ సోదరులకు భయం పట్టుకుందని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే చంద్రబాబు విధానమా అని ప్రశ్నించారు. జేసీ సోదరులు పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అప్పేచర్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. -
‘జేసీ సోదరులవి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
తాడిపత్రి : జేసీ సోదరులవి బ్లాక్మెయిల్ రాజకీయాలని, సొంత పార్టీ ముఖ్యమంత్రినే బ్లాక్ మెయిల్ చేసే నీచ స్థాయికి దిగరాజారని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. మద్యం షాపుల టెండర్లలో ముడుపులు తీసుకున్నానని నిరూపిస్తే తాడిపత్రి విడిచిపెట్టి పోయేందుకు తాను సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. అలా నిరూపించని పక్షంలో జేసీ సోదరులు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజల సమస్యలను అడ్డుపెట్టుకొని రాజీనామా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునే బ్లాక్మెయిల్ చేసిన ఘనత జేసీ సోదరులదని పెద్దారెడ్డి ఏద్దేవా చేశారు. జేసీ సోదరుల బ్లాక్ మెయిల్, చిల్లర రాజకీయాలు జిల్లా ప్రజలందరికీ తెలుసునని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే అసత్య ఆరోపణలు : బార్ విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలకు ఎమ్మెల్యే జేసీ తెరలేపారన్నారు. అధికార బలంలో జేసీ సోదరులు అధికారులను బెదిరించడం పరిపాటిగా మారిందన్నారు. తాడిపత్రి ప్రాంతంలోని పరిశ్రమలను జేసీ సోదరులు దోచుకుంటున్నారన్నారు. ఆయా పరిశ్రమల్లో తమకు కాంట్రాక్టులు, పర్సెంటేజీలు ఇవ్వకపోతే పరిశ్రమల ఎదుట ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తానని బెదిరించడం జేసీ సోదరుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. గ్రానైట్ పరిశ్రమల యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే వారు ససేమిరా అనడంతో గ్రానైట్ పరిశ్రమల లోడు లారీలను తన అధికార బలంతో అడ్డుకోవడంతో గ్రానైట్ పరిశ్రమల ఉనికికే ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు మూతపడే దశలో ఉన్నాయన్నారు. జేసీ సోదరులు తాడిపత్రిని అభివృద్ధి చేయలేదని, తాడిపత్రిని అడ్డుపెట్టుకొని వారు అభివృద్ధి చెందారని విమర్శించారు. -
జేసీ సోదరులకు సిగ్గూశరం ఉందా..?
తాడిపత్రి: ‘అభివృద్ధి అంటే బస్టాపుల్లో బార్లు తెరవడమా, గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించడమా... ఇదేనా..జేసీ..నీవు చేస్తున్న అభివృద్ధి..అసలు నీకు సిగ్గు, శరం ఉన్నాయా’ అని తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కేవలం వైఎస్సార్ హయాంలోనేనని, జేసీ సోదరులు చేసింది ఏమీలేదన్నారు. ప్రజాసమస్యలపై నిరసన తెలిపే హక్కు సమాజంలో ప్రతి పౌరుని ఉందని, దాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడం చూస్తే జేసీ సోదరుల అధికార దర్పానికి నిదర్శనమన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, జేసీ సోదరులను చూపి భయపడి ప్రజలు సమస్యలపై నిలదీయలేకపోతున్నారన్నారు. ఇక నుంచి సమస్యలపై నిలదీసే వారందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దారెడ్డి హామీ ఇచ్చారు. జేసీ సోదరులు లారీ అసోషియేషన్ ముసుగులో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అల్ట్రాటెక్, గెర్డావ్ పరిశ్రమల్లో లారీ యజమానులకు లోడింగ్కు అవకాశం లేకుండా తన సొంత లారీలలోనే ముందుగా లోడింగ్ చేయాలని పరిశ్రమల యాజమాన్యాలను కూడా బ్లాక్మెయిల్ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. నిత్యం ఇతరులకు నీతులు చెప్పే జేసీ సోదరులు... వారు మాత్రం నీతిమాలిన పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ను పెంచి పోషించింది జేసీ సోదరులేనని, తన సోదరున్ని పోగొట్టుకున్నా తాను ఎంతో ఓర్పుతో ఉన్నానని పెద్దారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం వస్తోందని, జేసీ సోదరులకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో పెద్దవడుగూరు, యాడికి జెడ్పీటీసీ సభ్యులు చిదంబరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గయాజ్, రఘునాథ్రెడ్డి, రంగనాథ్రెడ్డి, సంపత్, బాలరాజు, నాగభూషణం పాల్గొన్నారు. -
పంచాయితీ!
విజిలెన్స్ ఏడీ బదిలీకి పట్టు ⇒భూగర్భ గనుల శాఖలో కలకలం ⇒గ్రానైట్ మాఫియా తీరు వివాదాస్పదం ⇒ఇప్పటికే ఏడీకి జేసీ అనుచరుడు రవీంద్రరెడ్డి తరపున లీగల్ నోటీసు ⇒తాజాగా ఓ పెద్దమనిషి వద్దకు వ్యవహారం ⇒నంద్యాల ఎన్నికల తర్వాత చూద్దామని హామీ గ్రానైట్ మాఫియా బరితెగిస్తోంది. అడ్డొస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించని పరిస్థితి. ఆదాయానికి గండి పడుతుందనుకుంటే.. అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం పరిపాటిగా మారుతోంది. నిజాయితీ అంటే.. మరీ చెలరేగిపోవడం, దారికి రాకపోతే.. బదిలీకి పట్టుపట్టడం వీరి నైజం. ఇక పెద్దాయన అండ ఉండనే ఉంది. ఇంకేముంది.. ఇక్కడ ఉద్యోగం అంటే ముళ్ల కిరీటమే. అనంతపురం: తాడిపత్రి కేంద్రంగా కొన్నేళ్ల నుంచి గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. వీళ్లు చెప్పిన క్వారీల నుంచే వ్యాపారులు రాళ్లు కొనుగోలు చేయాలి? చెప్పిన లారీలనే లోడింగ్కు పంపాలి? అడిగినంత ముట్టజెప్పాలి? లేదంటే వ్యాపారం మూత వేసుకోవాల్సిందే. ఆ ప్రాంతంలోని ఓ పెద్ద మనిషి అండతో కొన్నేళ్లుగా ఈ మాఫియా దందా సాగిస్తోంది. అయితే విజిలెన్స్ ఏడీగా ప్రతాప్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. తనదైన శైలిలో దందాకు చెక్ పెట్టడంతో.. అవినీతి బురదచల్లి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా ‘మాఫియా’ తీరులో మార్పు లేకపోయింది. పైగా ప్రతాప్రెడ్డిని ఎలాగైనా బదిలీ చేయించాలని పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టారు. అందుకు ఆయన కూడా తలూపినట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో 670 దాకా గ్రానైట్ మిషన్లు ఉండగా.. వీటికి మడకశిర, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి గ్రానైట్ రాళ్లు వస్తున్నాయి. తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. అయినా ఇక్కడ గ్రానైట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పదుల సంఖ్యలోని మిషన్లు చూస్తుండగానే వందల్లోకి చేరాయి. గ్రానైట్ వ్యాపారులు కళ్లెదుట కోట్లకు పడగలెత్తారు. భారీ భవంతులు నిర్మించారు. ఇవన్నీ గమనించిన ఓ పెద్దమనిషి కన్ను గ్రానైట్ వ్యాపారంపై పడింది. ఈ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని అనుచరులను ఉసిగొలిపారు. వీరంతా మాఫియాగా ఏర్పడి.. మొదట భూగర్భ గనుల శాఖ అధికారులను మచ్చిక చేసుకుని, ఆ తర్వాత వ్యాపారులు తమ కనుసన్నల్లో మెలిగేలా దారికి తెచ్చుకున్నారు. అప్పటికే సాగుతున్న జీరో వ్యాపారానికి కప్పం కట్టాలని ఆదేశించారు. లేదంటూ వ్యాపారం నడవదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చేసేది లేక వ్యాపారులంతా ‘జీ హుజూర్’ అనేశారు. ఇలా.. రెండేళ్ల పాటు వీళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యాపారం సాగింది. ఆగస్టు 21, 2015లో గుత్తి విజిలెన్స్ ఏడీగా ప్రతాప్రడ్డి బాధ్యతలు చేపట్టాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రతాప్రెడ్డికి బెదిరింపులు ఏడీ ప్రతాప్రెడ్డి రెండేళ్లుగా తనిఖీలు చేసి భూగర్భ గనుల శాఖ ఆదాయాన్ని భారీగా పెంచారు. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. దీన్ని తాడిపత్రి, అనంతపురంలోని భూగర్భగనులశాఖ అధికారులు కొందరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ప్రతాప్రెడ్డిని లొంగదీసుకునేందుకు విఫలయత్నం చేసిన గ్రానైట్ మాఫియా.. మైనింగ్ అధికారులతో చేతులు కలిపి ప్రతాప్రెడ్డిని బదిలీ చేయించేందుకు యత్నించారు. అవినీతి ఆరోపణలు చేయించారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులు కొట్టిపారేశారు. ఆ తర్వాత బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రతాప్రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఐదుగురు పేర్లతో ఉన్నతాధికారులకు ఈ నెల 2న లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తర్వాత బదిలీపై పట్టు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పీఏ రవీంద్రరెడ్డి పేరు కూడా ఏడీ ఫిర్యాదులో ఉంది. స్టీఫెన్ రవీంద్ర హయాంలో ఇతనికి కౌన్సెలింగ్ ఇచ్చారని అందులో పేర్కొన్నారు. దీనిపై రవీంద్రరెడ్డి.. ప్రతాప్రెడ్డికి లీగల్ నోటీసు పంపారు. తనకు కౌన్సెలింగ్ ఇవ్వలేదని నోటీసులో స్పష్టం చేశారు. ఈ తతంగం తర్వాత ప్రతాప్రెడ్డి వైజాగ్ వెళ్లిపోయారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆయన పరిధిలోని కొన్ని కోర్టు కేసులకు సంబంధించి కొద్దిరోజులుగా వైజాగ్లోని ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రతాప్రెడ్డి బదిలీ అయ్యారనే ప్రచారం గ్రానైట్ వ్యాపారుల్లో నడిచింది. లాంగ్లీవ్లో వెళ్లారని, ఇక తిరిగి విధులకు హాజరు కారని కూడా ఓ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ప్రతాప్రెడ్డి ఆన్డ్యూటీలో వెళ్లారని.. తిరిగి విధులకు హాజరుకానున్నారని తెలిసి.. గ్రానైట్ మాఫియా ఓ పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో భూగర్భగనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావుతో మాట్లాడి ప్రతాప్రెడ్డిని బదిలీ చేయిస్తానని సదరు పెద్దమనిషి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే ప్రతాప్రెడ్డి విషయంలో ఉన్నతాధికారులు పూర్తి సానుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతాప్రెడ్డి నిజాయితీకి బదిలీ బహుమానంగా ఇస్తారా? లేదంటే ఒత్తిళ్లను తోసిపుచ్చి కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. -
రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్దదెబ్బే!
► జేసీ బ్రదర్స్కు తాడిపత్రిలో వ్యతిరేక పవనాలు ► నేడు బీజేపీలో చేరనున్న ప్రభోదానందస్వామి కుమారుడు ► కేంద్ర, రాష్ట్ర మంత్రులు రవిశంకరప్రసాద్, మాణిక్యాలరావు తాడిపత్రికి రాక ► మట్కా, పేకాటపై డీఐజీ, ఎస్సీ సీరియస్...74మందితో జాబితా సిద్ధం ! ► అధికశాతం మంది అధికార పార్టీ నేతలు, జేసీ అనుచరులే అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? స్వపక్ష నేతలు జేసీ బ్రదర్స్ వైఖరి తాళలేక పార్టీకి దూరమవుతున్నారా? మిత్రపక్షం బీజేపీ నేతలు వీరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? ప్రభోదానంద ఆశ్రమం విషయంలో వారి జోక్యం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతోందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు జేసీ ప్రభాకర్రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో జేసీ బ్రదర్స్ డైలమాలో ఉన్నారు. దీంతోపాటు రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత తాడిపత్రి పేకాట, మట్కాపై డీఐజీ, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో అధికశాతం మంది జేసీ అనుచరులే ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి తాజా పరిణామాలతో జేసీ బ్రదర్స్తో పాటు వారి అనుచరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ అవినీతిపై కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితోనూ విభేదించి పోరాడారు. ఉన్న కౌన్సిలర్లలో జయచంద్రారెడ్డి బలమైన నేత. ఈయన పార్టీకి దూరం కావడంతో స్వపక్షసభ్యులు జేసీ బ్రదర్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘ఎవరైనా మా మాట వినాల్సిందే. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాం’. అనే ధోరణిలో సంకేతాలు పంపడం ఏమిటని బాహాటంగానే నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు.. జేసీ ప్రభాకర్రెడ్డిపై గతనెల 29న హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఆశ్రమానికి ఇసుక రవాణా చేస్తున్న లారీ అంశంలో దాసరి వెంకటేశ్ అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించి ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలిచారు. ఇదేరోజు తాడిపత్రి వాసి పైలా నర్సింహయ్యకు చికిత్స విషయంలోనూ జేసీపీఆర్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడం, ప్రభాకర్తో తనకు ప్రాణహాని ఉందని పైలా పేర్కొనడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఈక్రమంలో తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం కూడా కలకలం రేపింది. పేకాటతోనే ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది, మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికారపార్టీ నేతలు, కార్యకర్తలే అధికంగా ఉన్నారు. వెరసి ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిలో ‘బ్రదర్స్’ పాత్రపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. నేడు బీజేపీలోకి వివేకానంద ప్రభోదానంద ఆశ్రమనిర్వహణకు జేసీ బ్రదర్స్ అడ్డుపడుతున్నారనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారు. దీంతో వీరిని రాజకీయంగానే ఎదుర్కోవాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రభోదానంద స్వామి కుమారుడు వివేకానందచౌదరి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇతను కాకినాడలో ఉంటున్నారు. తాడిపత్రిలో ఆశ్రమంలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి నేడు చిన్నపొడమల ఆశ్రమానికి రానున్నారు. వీరి సమక్షంలో వివేకానంద పార్టీలో చేరనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేపనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో టీడీపీ నుంచి బలమైన వర్గం వైఎస్సార్సీపీకి దగ్గరవుతోంది. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండటంతో వారి నుంచి ఇబ్బందులు ఎదురవుకుండా టీడీపీలో కొనసాగుతున్నారు. మంచి సమయం చూసి వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో బీజేపీ రూపంలో మరోదెబ్బ తగలడం, అందులోనూ టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ ఉండటం, ఇందులో జేసీని వ్యతిరేకించేవారు చేరడంతో రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్దదెబ్బే! అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ అశోక్కుమార్ తాడిపత్రి పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా 74మందితో ఓ జాబితాతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా మట్కా, పేకాట రాయుళ్ల జాబితాను ఎస్పీకి సమర్పించినట్లు తెలుస్తోంది. తాడిపత్రి పోలీసులు చురుగ్గా లేరనే కారణంతో అనంతపురం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి తనిఖీలు చేయించే యోచనలో ‘పోలీస్ బాస్లు’ ఉన్నారు. అరెస్టుల తర్వాత ఇన్నిరోజులు పేకాట, మట్కా నిర్వహణలో తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై కూడా వారు ఆరా తీసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికశాతం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికే తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లు తాడిపత్రి వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో అధికార పార్టీ నేతలను కాపాడితే పేకాట, మట్కాకు అండగా నిలిచిలిన వాళ్లవుతారు? వదిలిస్తే సొంతపార్టీ నేతలు తమను కాపాడలేదు అనే ధోరణిలో పార్టీకి దూరం అవుతారు. ఈ క్రమంలో మొత్తం పరిణామాలతో జేసీ బ్రదర్స్ చక్రబంధంలో ఇరుక్కున్నట్లు తాడిపత్రి వాసులు చర్చించుకుంటున్నారు. -
చక్రబంధం !!
– జేసీ బ్రదర్స్కు తాడిపత్రిలో వ్యతిరేక పవనాలు – నేడు బీజేపీలో చేరనున్న ప్రభోదానందస్వామి కుమారుడు వివేకానంద – కేంద్ర, రాష్ట్ర మంత్రులు రవిశంకరప్రసాద్, మాణిక్యాలరావు తాడిపత్రికి రాక – ఇటీవల జేసీపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు – మట్కా, పేకాటపై డీఐజీ, ఎస్సీ సీరియస్...74మందితో జాబితా సిద్ధం ! – అందులో అధికశాతం మంది అధికార పార్టీ నేతలు, జేసీ అనుచరులే సాక్షిప్రతినిధి, అనంతపురం తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? స్వపక్ష నేతలు జేసీ బ్రదర్స్ వైఖరి తాళలేక పార్టీకి దూరమవుతున్నారా? మిత్రపక్షం బీజేపీ నేతలు వీరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? ప్రభోదానంద ఆశ్రమం విషయంలో వారి జోక్యం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతోందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు జేసీ ప్రభాకర్రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో జేసీ బ్రదర్స్ డైలమాలో ఉన్నారు. దీంతోపాటు రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత తాడిపత్రి పేకాట, మట్కాపై డీఐజీ, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో అధికశాతం మంది జేసీ అనుచరులే ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి తాజా పరిణామాలతో జేసీ బ్రదర్స్తో పాటు వారి అనుచరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ అవినీతిపై కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితోనూ విభేదించి పోరాడారు. ఉన్న కౌన్సిలర్లలో జయచంద్రారెడ్డి బలమైన నేత. ఈయన పార్టీకి దూరం కావడంతో స్వపక్షసభ్యులు జేసీ బ్రదర్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘ఎవరైనా మా మాట వినాల్సిందే. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాం’. అనే ధోరణిలో సంకేతాలు పంపడం ఏమిటని బాహాటంగానే నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు.. జేసీ ప్రభాకర్రెడ్డిపై గతనెల 29న హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఆశ్రమానికి ఇసుక రవాణా చేస్తున్న లారీ అంశంలో దాసరి వెంకటేశ్ అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించి ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలిచారు. ఇదేరోజు తాడిపత్రి వాసి పైలా నర్సింహయ్యకు చికిత్స విషయంలోనూ జేసీపీఆర్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడం, ప్రభాకర్తో తనకు ప్రాణహాని ఉందని పైలా పేర్కొనడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఈక్రమంలో తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం కూడా కలకలం రేపింది. పేకాటతోనే ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది, మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికారపార్టీ నేతలు, కార్యకర్తలే అధికంగా ఉన్నారు. వెరసి ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిలో ‘బ్రదర్స్’ పాత్రపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. నేడు బీజేపీలోకి వివేకానంద ప్రభోదానంద ఆశ్రమనిర్వహణకు జేసీ బ్రదర్స్ అడ్డుపడుతున్నారనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారు. దీంతో వీరిని రాజకీయంగానే ఎదుర్కోవాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రభోదానంద స్వామి కుమారుడు వివేకానందచౌదరి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇతను కాకినాడలో ఉంటున్నారు. తాడిపత్రిలో ఆశ్రమంలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి నేడు చిన్నపొడమల ఆశ్రమానికి రానున్నారు. వీరి సమక్షంలో వివేకానంద పార్టీలో చేరనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేపనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో టీడీపీ నుంచి బలమైన వర్గం వైఎస్సార్సీపీకి దగ్గరవుతోంది. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండటంతో వారి నుంచి ఇబ్బందులు ఎదురవుకుండా టీడీపీలో కొనసాగుతున్నారు. మంచి సమయం చూసి వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో బీజేపీ రూపంలో మరోదెబ్బ తగలడం, అందులోనూ టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ ఉండటం, ఇందులో జేసీని వ్యతిరేకించేవారు చేరడంతో రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్దదెబ్బే! అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ అశోక్కుమార్ తాడిపత్రి పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా 74మందితో ఓ జాబితాతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా మట్కా, పేకాట రాయుళ్ల జాబితాను ఎస్పీకి సమర్పించినట్లు తెలుస్తోంది. తాడిపత్రి పోలీసులు చురుగ్గా లేరనే కారణంతో అనంతపురం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి తనిఖీలు చేయించే యోచనలో ‘పోలీస్ బాస్లు’ ఉన్నారు. అరెస్టుల తర్వాత ఇన్నిరోజులు పేకాట, మట్కా నిర్వహణలో తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై కూడా వారు ఆరా తీసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికశాతం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికే తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లు తాడిపత్రి వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో అధికార పార్టీ నేతలను కాపాడితే పేకాట, మట్కాకు అండగా నిలిచిలిన వాళ్లవుతారు? వదిలిస్తే సొంతపార్టీ నేతలు తమను కాపాడలేదు అనే ధోరణిలో పార్టీకి దూరం అవుతారు. ఈ క్రమంలో మొత్తం పరిణామాలతో జేసీ బ్రదర్స్ చక్రబంధంలో ఇరుక్కున్నట్లు తాడిపత్రి వాసులు చర్చించుకుంటున్నారు. -
ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్
మితిమీరిన వివాదాస్పద వైఖరి - పైలా నర్సింహయ్య విషయంలో జేసీ ప్రభాకర్రెడ్డిపై తీవ్ర విమర్శలు - ప్రభోదానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో ఇప్పటికే హెచ్ఆర్సీలో ఫిర్యాదు - తాడిపత్రిలో అసాంఘిక శక్తులకు అండ! - క్రమంగా దూరమవుతున్న కేడర్ జేసీ బ్రదర్స్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన నాయకులు రోడ్డెక్కి చేస్తున్న యాగీ నవ్వుల పాలవుతోంది. ఇదే సమయంలో వివాదాస్పద వైఖరి.. అడ్డూఅదుపు లేని వ్యాఖ్యలతో వీరింతే అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధినేత మెప్పు కోసం మైకందుకోగానే ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటున్న తీరు ఆ నేతల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్షిప్రతినిధి, అనంతపురం: వేదికనెక్కి మైకు పట్టుకుంటే చాలు.. ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ ప్రజల ముఖాల్లో చిరునవ్వు చిందుతోంది. సీరియస్గా చేస్తున్న ప్రసంగం కూడా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. సీనియర్ నేతలు ఎలాంటి సందేశం ఇస్తారోనని ఎంతో ఆశతో వచ్చే ప్రజలు.. ఆ నేతల తీరుతో విసుగెత్తిపోతున్నారు. ఇదీ ఇటీవల కాలంలో జేసీ బ్రదర్స్ తీరు. జేసీ దివాకర్రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా సేవలందించారు. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో నిలిచారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తాడిపత్రి రాజకీయం సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. మున్సిపల్ వైస్ చైర్మన్గా పని చేసిన ప్రభాకర్ ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ నేతలు ఇద్దరూ ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రతి వేదికపైనా కనీస మర్యాద పాటించకుండా విమర్శలు గుప్పిస్తున్న తీరు జనాల్లో చర్చనీయాం శం అవుతోంది. ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న చాలా సందర్భాల్లో ఆయన వ్యవహారం ఇదే రీతిన ఉంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఆయనను వారించాల్సింది పోయి.. తనలో తను నవ్వుకోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిపోయిందో చెప్పకనే చెబుతోంది. తాజాగా విజయవాడ, వైజాగ్ విమానాశ్రయాల్లో వీరంగం సృష్టించిన దివాకర్రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడం గమనార్హం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత : దివాకర్రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వైఖరి మరింత వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలకోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటీవల అనంతపురం బైపాస్రోడ్డులో టెంటు వేసి విపక్షనేతపై దుర్భాషలాడారు. దీనిపై సోషియల్ మీడియాలో జేసీ బ్రదర్స్పై నెటిజన్లు తీవ్ర దాడి చేశారు. ట్రావెల్స్ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీఓ కార్యాలయంలోనూ రగడ చేశారు. తాజాగా తాడిపత్రికి చెందిన పైలా నర్సింహయ్య ఓ వ్యక్తిపై దాడిచేసినట్లు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపీఆర్ ఒత్తిడితోనే ఈ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యంతో ఉండటంతో కోర్టు ఆదేశాలతో ‘అనంత’ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పైలా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించాలని మహేశ్ అనే డాక్టర్ సిఫారసు చేశారు. అయినప్పటికీ సూపరింటెండెంట్ జగన్నాథం పైలాను రెఫర్ చేయలేదు. జేసీ ప్రభాకర్రెడ్డి జోక్యంతోనే ఇతన్ని రెఫర్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓ రాజకీయనాయకుడు, తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్సకు సాయం చేయాల్సింది పోయి, ఇలా వ్యవహరించడమేంటని రాజకీయ నేతలతో పాటు మేధావులు తప్పుబడుతున్నారు. దీంతో పాటు తాడిపత్రిలోని శ్రీకృష్ణ ప్రాంగణంలో ప్రభోదానంద ఆశ్రమం నడుస్తోంది. నిర్వాహకులను జేసీ ప్రభాకర్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్డీఓ అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. అసాంఘిక శక్తులకు అండగా? జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహించే వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తాడిపత్రి మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఓ నేత తన ఇంట్లోనే పేకాట నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా పలుసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకోలేకపోయారు. దీనిపై తాడిపత్రి వైఎస్సార్సీపీ ఇన్చార్జి పెద్దారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తమకు ఎదురులేకుండా పోయిందని భావించిన జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతుండటం, వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి వాసులు ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెట్టడం, వేధించడం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడికి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించిన ఘటన వారి వైఖరికి ససాక్ష్యంగా నిలుస్తోంది. -
ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్..
► కేసులు, వేధింపులతో భయపెట్టే యత్నం ► పైలా నర్సింహయ్య విషయంలో జేసీపై తీవ్ర విమర్శలు ► ప్రభోదానంద ఆశ్రమ ఘటనలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు ► అసాంఘిక శక్తులకు జేసీ బ్రదర్స్ అండ! ► క్రమంగా దూరమవుతున్న కేడర్ జేసీ బ్రదర్స్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన నాయకులు రోడ్డెక్కి చేస్తున్న యాగీ నవ్వుల పాలవుతోంది. ఇదే సమయంలో వివాదాస్పద వైఖరి అడ్డూఅదుపు లేని వ్యాఖ్యలతో వీరింతే అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధినేత మెప్పు కోసం మైకందుకోగానే ప్రతిపక్షం పై నోరు పారేసుకుంటున్న తీరు ఆ నేతల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తోంది. అనంతపురం: వేదికనెక్కి మైకు పట్టుకుంటే చాలు.. ఆ నోట నుంచి వచ్చే ప్రతి మాటకూ ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. సీరియస్గా చేస్తున్న ప్రసంగం కూడా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. సీనియర్ నేతలు ఎలాంటి సందేశం ఇస్తారోనని ఎంతో ఆశతో వచ్చే ప్రజలు ఆ నేతల తీరుతో విసుగెత్తిపోతున్నారు. ఇదీ ఇటీవల కాలంలో జేసీ బ్రదర్స్ తీరు. జేసీ దివాకర్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో నిలిచారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తాడిపత్రి రాజకీయం సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. మున్సిపల్ వైస్ చైర్మన్గా పని చేసిన ప్రభాకర్ ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ నేతలు ఇద్దరూ ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రతి వేదికపైనా కనీస మర్యాద పాటించకుండా విమర్శలు గుప్పిస్తున్న తీరు జనాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న చాలా సందర్భాల్లో ఆయన వ్యవహారం ఇదే రీతిన ఉంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఆయనను వారించాల్సింది పోయి.. తనలో తను నవ్వుకోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిపోయిందో చెప్పకనే చెబుతోంది. తాజాగా విజయవాడ, వైజాగ్ విమానాశ్రయాల్లో వీరంగం సృష్టించిన దివాకర్రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడం గమనార్హం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత దివాకర్రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వైఖరి మరింత వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలకోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటీవల అనంతపురం బైపాస్రోడ్డులో టెంటు వేసి విపక్షనేతపై దుర్భాషలాడారు. దీనిపై సోషియల్ మీడియాలో జేసీ బ్రదర్స్పై నెటిజన్లు తీవ్ర దాడి చేశారు. ట్రావెల్స్ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీఓ కార్యాలయంలోనూ రగడ చేశారు. తాజాగా తాడిపత్రికి చెందిన పైలా నర్సింహయ్య అనే వ్యక్తిపై దాడిచేసినట్లు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపీఆర్ ఒత్తిడితోనే ఈ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యంగా ఉండటంతో కోర్టు ఆదేశాలతో ‘అనంత’ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పైలా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించాలని మహేశ్ అనే డాక్టర్ సిఫారసు చేశారు. అయినా సూపరింటెండెంట్ జగన్నాథం పైలాను రెఫర్ చేయలేదు. జేసీ ప్రభాకర్రెడ్డి జోక్యంతోనే ఇతన్ని రెఫర్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓ రాజకీయనాయకుడు, తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్సకు సాయం చేయాల్సింది పోయి, ఇలా వ్యవహరించడమేంటని రాజకీయనేతలతో పాటు మేధావులు తప్పుబడుతున్నారు. దీంతో పాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ ప్రాంగణంలో ప్రభోదానంద ఆశ్రమం నడుస్తోంది. నిర్వాహకులను జేసీ ప్రభాకర్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్డీఓ అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. ఇసుక వ్యవహారంలో వెంకటేశ్ అనే దళితుడిని కులం పేరుతో దూషించి, బెదిరించారని.. తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్రెడ్డిపై వెంకటేశ్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దళితుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసాంఘిక శక్తులకు అండగా? జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహించే వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఓ నేత తన ఇంట్లోనే పేకాట నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా పలుసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకోలేకపోయారు. దీనిపై తాడిపత్రి వైఎస్సార్సీపీ ఇన్చార్జి పెద్దారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తమకు ఎదురులేకుండా పోయింది. జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి వాసులు ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెడుతున్నారు. అంతేకాక వేధింపులకు గురి చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడికి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించిన ఘటన వారి వైఖరికి సాక్ష్యమని.. బయటికి రాని బెదిరింపులు ఇలా చాలా ఉన్నాయనేది విపక్షాల వాదన. ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. -
జేసీ సోదరుల అండతోనే దీపక్రెడ్డి భూకబ్జాలు
- జేసీ బ్రదర్స్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి - వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి- తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అండతోనే అల్లుడు గుణపాటి దీపక్రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులు అధికారులను బెదిరించి తమ పనులు చేయించుకుంటారని, మాట వినని వారిపై దౌర్జన్యాలకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నావంటూ జేసీ దివాకర్రెడ్డి ఓ మార్వాడిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొడితే పోలీసులు చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారన్నారు. సామాన్య ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించే పోలీసులు.. ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం పచ్చచొక్కా వేసుకుంటే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చనే ధోరణితో ప్రవర్తిస్తున్నారన్నారు. ‘అధికారం’ ముసుగులో ఎంతటి అరాచకాలకైనా పాల్పడవచ్చనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘చందాలు అడగరాదు’ అంటూ జేసీ సోదరులు తమ ఇంటి వద్ద పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నారన్నారు. అయితే అవి తమకు వర్తించవన్నట్టు గత ఏడాది అమ్మవారి గుడి కోసం, ఈ ఏడాది సాయిబాబా ఆలయం నిర్మాణం కోసం చందాలు వసూలు చేస్తున్నారన్నారు. వాటితో తమ కుటుంబం మాత్రమే సస్యశ్యామలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారని విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ అందులో ఉద్యోగాల గురించి మాత్రం తమను అడగవద్దని చెప్పి నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారన్నారు. జేసీ సోదరులను ప్రజలు భయంతో గౌరవిస్తున్నారే తప్ప భక్తితో కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడులకు పాల్పడడం వారికి అలవాటైపోయిందన్నారు. జేసీ సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కుమ్మరి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరేమనుకున్నా మేమింతే!
నిత్యం ఏదో ఒక వివాదంలో జేసీ బ్రదర్స్ ప్రజాప్రతినిధులమనే సంగతి మరిచి దురుసు ప్రవర్తన సామాన్యులపై చేయి చేసుకోవడం, బెదిరించడమే నైజం విమానాశ్రయాల్లో దివాకర్రెడ్డి వీరంగాలు భూకబ్జా కేసులో ప్రభాకర్రెడ్డి అల్లుడు దీపక్రెడ్డి అరెస్టు దీపక్రెడ్డి దందాలకు జేసీ సోదరుల సహకారం జేసీ బ్రదర్స్... రాజకీయాల్లో వీరు అదో టైపు! నోటికి ఏదొస్తే అది మాట్లాడడం.. సామాన్యులపై చేయి చేసుకోవడం, బెదిరించడం వీరి నైజం! నిత్యం ఏదో ఒక వివాదంలో, వార్తల్లో ఉండడం పరిపాటే. ఎవరేమనుకున్నా వీరు తీరు మార్చుకోరు. జేసీ బ్రదర్స్తోపాటు తాజాగా వారి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తెలంగాణలో భూకబ్జా కేసులో అరెస్టయిన దీపక్రెడ్డిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేయడం, అదేరోజు విశాఖపట్నం ఏయిర్పోర్టులో జేసీ దివాకర్రెడ్డి వీరంగం సృష్టించడంతో జేసీ ఫ్యామిలీ, వారి వ్యవహార శైలి అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గన్నవరం ఎయిర్పోర్టులోనూ చిందులు అనంతపురంలో ప్లాస్టిక్ నిషేధం పేరుతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కొద్దినెలల క్రితం హల్చల్ చేశారు. తాడిపత్రి నుంచి భారీగా జనాలను రప్పించి నాలుగు రోజులపాటు నగరంలో కలియతిరిగారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపారులను ఇష్టానుసారంగా దూషించారు. నోటికి ఎంతమాట వస్తే అంత అనేశారు. కొంతమందిపై చేయి కూడా చేసుకున్నారు. కొన్ని దుకాణాలకు తాళాలు వేశారు. వారం రోజులపాటు తాళాలు తిరిగి ఇవ్వలేదు. దివాకర్రెడ్డి వైఖరిపై అనంతపురం జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గతంలో గన్నవరం విమానాశ్రయంలో చిందులు తొక్కారు. ఆలస్యంగా వచ్చారనే కారణంతో బోర్డింగ్పాస్ ఇవ్వకపోవడంతో సిబ్బందిపై వీరంగం వేశారు. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అలాగే ప్రవర్తించారు. సోదరుడి వైఖరీ అంతే ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇతను కూడా తాను ప్రజాప్రతినిధి అనే విషయం మరిచిపోయి మాట్లాడుతుంటారు. తోటి ప్రజాప్రతినిధుల గురించి ఏకవచనంలో సంబోధిస్తుంటారు. ఇటీవల తెలంగాణకు సంబంధించిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులను అనంతపురం రూట్లో నిలిపేస్తున్నారని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్రెడ్డి హైదరాబాద్ ఆర్టీఏ కార్యలయానికి వెళ్లి వీరంగం సృష్టించారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనంతపురం బైపాస్ రోడ్డులో టెంటు వేసి విపక్ష నేతను దుర్భాషలాడారు. దీపక్రెడ్డి చరిత్ర నేరమయం జేసీ ప్రభాకర్రెడ్డి అల్లుడు దీపక్రెడ్డి కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తే. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఇతడు 2012లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. తనకు రూ.6,781.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొని ఒక్కసారిగా జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కాడు. రూ.వేల కోట్ల ఆస్తులను అఫిడవిట్లో చూపించిన వారు రాష్ట్రంలో ఎవరూ లేరు. బహుశా దేశంలోనే లేరేమో! ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి హైదరాబాద్లోనే రూ.15,000 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి చాలాచోట్ల ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కబ్జాలు, సెటిల్మెంట్లతో రూ.వేల కోట్ల ఆస్తులను ఆక్రమంగా సంపాదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీపక్రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలకు పాల్పడడం, దాడి చేయడం, మారణాయుధాలు కలిగి ఉండడం వంటి కారణాలతో కేసులు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్లో 6 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దీపక్రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. దీపక్రెడ్డి చేసిన సెటిల్మెంట్లకు జేసీ బ్రదర్స్తోపాటు జేసీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్కుమార్రెడ్డి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. -
సంక్షేమానికి జేసీ వ్యతిరేకం
కమీషన్ల కోసం కక్కుర్తి మట్కా, పేకాటను ప్రోత్సహిస్తున్నారు జేసీ బ్రదర్స్కు కాలం చెల్లింది.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తాడిపత్రి ప్లీనరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత ‘రైతులకు ఉచిత విద్యుత్ వద్దంటారు. రూపాయికి కిలోబియ్యం దండగ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతులు, పేదల సంక్షేమానికి జేసీ దివాకర్రెడ్డి వ్యతిరేకం’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ ప్లీనరీ సోమవారం స్థానిక ఎస్బీఎం ఫంక్షన్హాలులో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా అనంత మాట్లాడారు. ‘‘హంద్రీ–నీవా ద్వారా 2012లో నీళ్లు తీసుకొచ్చాం. పాదయాత్ర చేస్తుంటే నీళ్లు ఎలా వస్తాయన్నావ్! హంద్రీ–నీవా కంటే మూణ్నెల్ల ముందు రూ.560 కోట్లతో యాడికి కాలువకు శంకుస్థాపన చేయించావ్. పీఏబీఆర్ ద్వారా 10 టీఎంసీల జలాలు కేటాయించాం. 13 ఏళ్లయ్యింది. ఇప్పటి వరకూ ఎందుకు ఆ ఫలితాన్ని ప్రజలకు ఇవ్వలేదు. పెండేకల్లుకు చెన్నారెడ్డితో శంకుస్థాపన చేయించావు. అందులోనూ కమీషన్లకు కక్కుర్తిపడ్డావు. శ్రీరామరెడ్డి పథకం ద్వారా మేం నీళ్లిస్తే...జేసీ నాగిరెడ్డి పథకం ద్వారా ఇప్పటికీ మీరు నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు తిరిగి అవుకు నుంచి తీసుకొస్తా అంటున్నావు. కొత్త పనులు మంజూరు చేయించుకుని కమీషన్లు దండుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ధ్యాస లేదు. 2012లో హంద్రీ– నీవా నీళ్లు తీసుకొస్తే ఇప్పుడు పులివెందుల, ముచ్చుమర్రి మీటింగ్కు వెళ్లి చంద్రబాబును పొగుడుతున్నారు. తాడిపత్రిని మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నావ్. జూదం ఆడేవారిని నీ చుట్టూ కోటరీలా పెట్టుకున్నావ్. కర్నూలు, కడప జిల్లాల నుంచి జూదం కోసం తాడిపత్రికి వస్తున్నారు. ఇందులో కమీషన్లు నీ ఇంటికి వస్తున్నాయ్. 1989కి ముందు నీ పరిస్థితేంటి? ఇప్పుడేంటి? తాడిపత్రికి ఏం చేశావో చెప్పు. యాడికి కెనాల్ భూసేకరణ సమస్య ఉందంటున్నావ్. 12శాతం తక్కువకు కోట్ చేసిన నేషనల్ హైవే టెండర్లనే రద్దు చేసిన ఘనుడివి. ఇది నీకు పెద్ద సమస్యనా? తాడిపత్రిలో వాక్ స్వాతంత్య్రం లేదు. మాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడి ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం తెస్తాం. జేసీ బ్రదర్స్ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. వీరికి కాలం చెల్లించింది’ అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే ప్లీనరీ ఏర్పాటు చేశామన్నారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి, తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి కన్వీనర్లు నాగేశ్వరెడ్డి, రఘునాథరెడ్డి, శరభారెడ్డి, బొంబాయి రమేష్ నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, యాడికి, పెద్దవడుగూరు జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, చిదంబరరెడ్డి, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు సూర్యనారాయణ, మైనారిటీ నాయకులు మున్నా, జబ్బార్, నియోజకవర్గ యూత్ అ«ధ్యక్షుడు బాణా నాగేశ్వరరెడ్డి, నాయకులు రవీంద్రారెడ్డి, మధురాజు, పాశం రంగస్వామి యాదవ్ ప్రసగించారు. పార్టీ స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యులు వేమనాథరెడ్డి, నాగిరెడ్డి, బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి, సీనియర్ నాయకుడు ఆలూరి రామచంద్రారెడ్డి, ఎంఏ రంగారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు సుంకిరెడ్డి, పట్టణ కన్వీనర్ కంచెం రామ్మోహన్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి జేసీ సోదరుల అరాచకాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మాట వినని వారిని మట్టుబెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. వారు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా లబ్ధి పొందిన జేసీ సోదరులు.. ఇప్పుడు వైఎస్ విజయమ్మను దూషిస్తున్నారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరిట గ్రానైట్ యాజమాన్యాల నుంచి బలవంతంగా కప్పం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి పరిశ్రమల వల్ల జేసీ సోదరులు మాత్రమే అభివృద్ధి చెందారు. నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. వారికి అండగా ఉంటాం. జేసీ కుటుంబం అరాచకాల వల్ల నష్టపోయిన వారిలో నేనూ ఉన్నా. వారికి అడ్డుకట్ట వేయాలంటే నియోజకర్గంలోని నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి. - కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తాడిపత్రి రైతులను పట్టించుకోని బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు జేబు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు రైతుల సమస్యలు పట్టడం లేదు. అధికార పార్టీ నేతలు ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. అడ్డదారిలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. - శంకర్నారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుటిల రాజకీయాలు తిప్పికొట్టండి శ్రీకృష్ణదేవరాయలు మాదిరిగా వైఎస్ రాజశేఖరరెడ్డి జనరంజక పాలన సాగించారు. చంద్రబాబు పాలన మాత్రం ప్రజాధనం దండుకోవడమే ధ్యేయంగా సాగుతోంది. ఈ ప్రభుత్వంలో నిరుపేదలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు జేసీ సోదరులు ఎంతకైనా దిగజారుతారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాలి. వై.శివరామిరెడ్డి, ప్లీనరీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ -
‘రెచ్చిపోతున్న జేసీ సోదరులు’
-
‘రెచ్చిపోతున్న జేసీ సోదరులు’
విజయవాడ: ఎంతమంది చచ్చిపోయినా ఫర్వాలేదు.. తమకేంటి అనేధోరణిలో జేసీ బ్రదర్స్ ఉన్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. డబ్బు, అధికారం ఉందని జేసీ సోదరులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘సాక్షి’ కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేయడాన్ని తప్పుబట్టారు. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేనా లేక రౌడీనా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జేసీ బ్రదర్స్ ను అదుపులో పెట్టాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం’
హైదరాబాద్: కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, కేసులంటూ పెడితే ముందు బస్సు ప్రమాదంతో 11మంది ప్రాణాలు బలితీసుకున్న జేసీ బ్రదర్స్పైనే పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ పదజాలం దారుణంగా ఉందని, వారి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై చాలా దారుణంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ల రామయ్య భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉందన్న ఆయన జేసీ బదర్స్, వర్ల రామయ్య, చింతమనేని మాటలు సరికాదని అన్నారు. మూడేళ్లు పరిపాలన చేసిన ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్రెడ్డిపై నోరు పారేసుకున్నారని, చంద్రబాబు సాక్షిగా జేసీ నోరు జారారని, ఇంకా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ముందు అరెస్టు చేయాల్సింది జేసీ బ్రదర్స్నేనని అన్నారు. హత్యారాజకీయాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకునే మనస్తత్వం చంద్రబాబుదేనని, ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబే ధ్వజమెత్తారు. వంగావీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బంధువులను నమ్మించి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని, దగ్గుపాటి, హరికృష్ణ, ఆఖరికి సొంత తమ్ముడిని కూడా మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని తీవ్ర ధ్వజమెత్తారు. రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని, ఇతరులకు చెప్పేముందు చంద్రబాబు ముందు తన సంగతి చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఎంతో మందిని బెదిరించారని, ఆయన పెట్టే పిచ్చి కేసులకు ఎవరూ భయపడరని, రోజాను అడ్డుకోవడంతో చంద్రబాబు అరాచకం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, సోనియా ఏకమై కేసులు పెట్టినా వైఎస్ జగన్ బెదిరిపోలేదని, కుట్రలు, కుతంత్రాలను వైఎస్ జగన్ ఒంటిచేత్తో ఎదుర్కొన్నారని అంబటి గుర్తు చేశారు. -
‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం’
-
జేసీ బ్రదర్స్ కోసం పడరాని పాట్లు
-
పడరాని పాట్లు
⇒ జేసీ బ్రదర్స్ను కాపాడేందుకు యత్నం ⇒ అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు కుయుక్తులు ⇒ ఇప్పటికే బాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత ⇒ కర్నూలులో దీనావస్థలో పార్టీ ⇒ జేసీ సోదరులను కాపాడకపోతే ‘అనంత’లోనూ అదే పరిస్థితి ⇒ అందుకే కేసును తప్పుదారి పట్టించడానికి క్యాబినెట్ వేదికగా మంత్రాంగం ⇒ ప్రతిపక్ష నేతపై గోబెల్స్ ప్రచారానికి వ్యూహం సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ ఘోర బస్సు ప్రమాద ఘటనలో దోషులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను ప్రమాదం నుంచి బయట పడేయడానికి శతధా ప్రయత్నిస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వాటి నుంచి బయట పడటానికి పాట్లు పడుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు తన పార్టీ ఎంపీది కావడం.. ఆ బస్సుకు రెండవ డ్రైవర్ లేకపోవడం.. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్ మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రతిపక్ష నేత నిలదీయడంతో మొత్తం ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. అందులో భాగంగానే సాక్షాత్తు క్యాబినెట్నే వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై ఎదురు దాడికి దిగారు. మరోవైపు ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు. కర్నూల్లో గంగుల కుటుంబం జగన్ వెంట నడవడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫిరాయింపుదారులను తిరిగి ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకోలేని దయనీయ పరిస్థితి. అనంతపురంలో జేసీ బ్రదర్స్ను పార్టీలో చేర్చుకున్నప్పుడు మంత్రి పదవులు ఆశ చూపారు. తీరా మూడేళ్లయినా ఆ ఊసే లేదు. ఇప్పుడు కూడా వారిని వెనకోసుకురాకపోతే అక్కడా అదే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి క్యాబినెట్ను వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. క్యాబినెట్లో ఏమి జరిగి ఉండాలి.. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి.. పలు సందేహాలు లేవనెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. ఈ విషయాలన్నింటినీ జగన్ తప్పకుండా త్వరలో పారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తారని, గట్టిగా నిలదీసి ప్రశ్నల వర్షం కురిపిస్తే తన పరువు గంగలో కలుస్తుందని ఏకంగా పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత పైనే కేసు పెట్టారు. క్యాబినెట్ మీటింగ్లో ఆసాంతం ఇదే విషయమై చర్చలు జరిపారు. జగన్ ఘటనా స్థలిలో పర్యటించినప్పటి వీడియోను క్యాబెనెట్ మీటింగ్లో పలుమార్లు వీక్షించి పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రతిపక్ష నేత నిలదీసి అడగడమే పాపమన్నట్లు తీర్మానించేశారు. వాస్తవానికి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్.. అంటే చాలా దూరం. నిజానికి ఆ బస్సులో రెండవ డ్రైవర్ లేడని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత ఇతనే రెండవ డ్రైవర్ అని ఎవర్నో చూపారు. బస్సుకు స్పీడ్ గవర్నెన్స్ కూడా లేవు. జగన్ పర్యటన తర్వాత బయట పడిన ఈ విషయాలన్నింటినీ ఇసుమంతైనా పట్టించుకోలేదు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ తప్పిదం ఏమిటి? మృతుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? దోషులకు శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఏ తరహా విచారణ జరిపించాలి? భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర విషయాలు నిమిషం పాటు కూడా చర్చించిన పాపాన పోలేదు. అంతకు ముందే అధికారుల సంఘాన్ని ఉసి గొల్పినా అనుకున్నంత ఫలితం రాలేదని భావించి, జగన్.. కలెక్టర్ను ప్రశ్నించడమే తప్పు అన్నట్లు విస్తృత ప్రచారం చేసేలా వ్యూహం రూపొందించారు. జరిగిన విషయాన్ని వక్రీకరించి, లీకులిచ్చి.. ప్రభుత్వ అనుకూల మీడియాలో ‘ఇదేం పద్ధతి’ అంటూ చిలువలు పలువలు చేసి రాయించుకున్నారు. పరామర్శకు వెళ్తే అంత ఉలికిపాటు ఎందుకు? భయమెందుకు? ఘటన స్థతికి ప్రతిపక్షనేత జగన్ వెళ్లాడనగానే ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళనకు లోనైనట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి బస్సు ప్రమాదం చోటు చేసుకున్న రోజు ప్రమాద స్థలానికి దగ్గరలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ అక్కడికి వెళ్లలేదు. కేసును పక్కదారి పట్టించేలా అధికార యంత్రాంగానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, వైద్యులు, ఇతర అధికారులు జగన్ వెంట హాలు లోపలకు వెళ్లారు. ఆ హాలులో అప్పటికే మీడియా ప్రతినిధులు, మృతుల బంధువులు ఉన్నారు. ఆ హాలులో బంధువులకు అప్పగించడానికి ప్యాక్ చేసి ఉంచిన మృతదేహాలు ఓ వైపు కనిపించాయి. అదో.. అది డ్రైవర్ మృతదేహం అని ఎవరో చూపించారు. పోస్టుమార్టం చేశారా అని జగన్ వైద్యులను అడిగారు. ఒకింత తడబాటుతో వైద్యుడు ‘లేద’ని సమాధానమిచ్చారు. దీంతో వైద్యుల వద్ద ఉన్న పోస్టుమార్టం మూడు కాపీల్లోంచి ఒకదానిని జగన్ అడిగి తీసుకుని మీడియా ప్రతినిధులకు అక్కడ జరుతుతున్న విషయాన్ని వివరించారు. ‘బస్సు డ్రైవర్ మద్యం సేవించాడా? లేదా? అనేది తెలియాలంటే పోస్టుమార్టం తప్పని సరి. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారు? కలెక్టరే దగ్గరుండి తప్పు చేయిస్తే ఎలా? చట్ట విరుద్ధంగా ఇలా చేస్తే మీతో పాటు ఇందులో ప్రమేయమున్న వాళ్లంతా జైలుకు వెళ్తారు’ అని జగన్ కలెక్టర్ను గట్టిగా నిలదీశారు. దీంతో ‘అవన్నీ ఇక్కడేం పని..పదండి’ అంటూ ‘పోస్టుమార్టం చేశామ’ని చెప్పండని కలెక్టర్ వైద్యులకు ప్రాంప్టింగ్ ఇవ్వడం వినిపించింది. కలెక్టర్ సూచనలతో వైద్యుడు.. జగన్ చేతిలో ఉన్న ఆ రిపోర్టును తిరిగి లాక్కునేందుకు యత్నించారు. ఇలా ఎందుకంటే.. సీఎం చంద్రబాబు జేసీ సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడంతో అప్పుడప్పుడు ఎంపీ జేసీ పరోక్షంగా ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఈ తరుణంలో వారిపై బస్సు ప్రమాద కేసు పెడితే అసలుకే ఎసురొచ్చి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది. మరో వైపు కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదననే ఆందోళన ఆయనలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లాక గంగుల కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడం, శిల్పా మోహన్రెడ్డి గుర్రుగా ఉండటం పట్ల ఏం చేయాలో తోచక చంద్రబాబు తల పట్టుకున్నారు. ఈ స్థితిలో జేసీ సోదరులతో వైరం పెంచు కోవడానికి బాబు ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఒక అబద్ధాన్ని పదిమార్లు పదే పదే చెప్పి.. అసలు విషయం మరుగున పడేలా చేసి, అబద్ధ మే అసలు నిజమని జనాన్ని నమ్మించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇందుకు క్యాబినెట్ సమావేశాన్నే వేది కగా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బస్సు ప్రమాదం దురదృష్టకరం
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి అనంతపురం అర్బన్: బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఇందుకు తాము చాలా బాధపడుతున్నామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. బస్సుకు ఏమైనా తమకు చింత లేదని, ప్రమాదంలో పలువురు మరణించడం, గాయపడడం బాధపెట్టిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బస్సుకు జీపీఎస్ ఉందని, ప్రమాద సమయంలో 70 నుంచి 72 కిలోమీటర్ల వేగంతోనే వెళుతోందని చెప్పారు. ఏదైనా అడ్డొచ్చి ఉంటే తప్పించే ప్రయత్నంలో గానీ, లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండి గానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామన్నారు. మృతిచెందిన డ్రైవర్, క్లీనర్ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సంబంధిత వార్తలు చదవండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి! -
జేసీ బ్రదర్స్ తో ఆర్పీ
– జేసీ సోదరులకు కలిసిన సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తాడిపత్రి టౌన్ : ఊరు చాలా బాగుందీ.. గాయిత్రీ ఆలయంలో దసరా ఉత్సవాలు బాగా జరుపుతున్నారు.. వచ్చే ఏడాది నా ఆధ్వర్యంలో తాడిపత్రి గాయిత్రీ ఆలయంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తానని సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణం సంజీవనగర్లోని గాయిత్రీ ఆలయంలో జరుగుతున్న శరన్నరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గాయిత్రీమాతన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణంలో సాంస్కతిక కార్యక్రమాలను వారు తిలకించారు. అంతకు ముందు జేసీ ఇంటిలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలను ఆర్పీ పట్నాయక్ కలిశారు. తాడిపత్రి ఊరు చాలా బాగుంది. స్వచ్ఛభారత్లో దేశ స్థాయిలో రెండవ అవార్డు రావడం పత్రికల్లో చూశామని ఆర్పీ జేసీ సోదరులతో అన్నారు. నేను హీరోగా ‘మనలో ఒకడు ’ చిత్రం ఈనెల 28వ తేదీ విడుదల కానున్నదని, ఈ సినిమా అంతా జర్నలిస్టులకు సంబంధించిన సినిమా అని ఆర్పీ తెలిపారు. ఆయన వెంట సినీ రచయిత బాలజీ, టీడీపీ నాయకులు ఎస్పీ రవీంద్రారెడ్డి ఉన్నారు. -
'ఎవరికీ భయపడలేదు...భయపడం'
అనంతపురం: టీడీపీ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...'మేం అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉంటాం. మాకు డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు అవసరం లేదు. పరిటాలకు భయపడి బెంగళూరుకు పారిపోయిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డి సోదరులది. మేం ఎప్పుడు ఎవరికీ భయపడలేదు...భయపడం' అని అన్నారు. -
వారే టీడీపీలో చేరారు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో మేము తప్ప ఎవ్వరూ మిగలరని ప్రకటించిన వాళ్లే టీడీపీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని జేసీ సోదరులను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సోమవారం అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
అనంతపురంలో ’గ్రామీణక్రీడ’
-
జేసీ బ్రదర్స్పై క్రిమినల్ కేసులు పెట్టాలి
ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల డిమాండ్ సాక్షి, కడప : పులివెందుల తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని సైతం దౌర్జన్యంగా దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోకుండా.. ఆ ఘటన స్థలి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం నీచమైన చర్య అని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ధ్వజమెత్తారు. వివేకాకు మద్దతుగా జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చిన అనంతరం జెడ్పీటీసీ సభ్యులు బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, మరక శివకృష్ణారెడ్డి, వేముల ఎంపీపీ లింగాల ఉషారాణి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ పులివెందుల తాగునీటి కోసం బృహత్తర కార్యక్రమం చేపట్టి...రూ. 55 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం చేపట్టారన్నారు. ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటిని కల్లూరు వద్ద జేసీ బ్రదర్స్, సింగనమల నాయకురాలు యామిని బాలలు అక్రమంగా గండ్లు పెట్టి తరలించుకుపోవడం దారుణం అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పులివెందులకు నీళ్లు తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సతీష్రెడ్డి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని.. నీరు రాకముందే ఇలా ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తారా అని వారు ప్రశ్నించారు. పైగా నీరు తరలించుకు పోతున్న జేసీ బ్రదర్స్ కూడా సతీష్రెడ్డి బంధువులేనని, ఒకరు తెచ్చేది.. మరొకరు తీసుకుపోయేదిలా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీలు గిడ్డంగి వారిపల్లె రవికుమార్రెడ్డి, వెంగముని యాదవ్, లక్ష్మినారాయణమ్మ, ఎంపీపీలు సుబ్బారెడ్డి, అనసూయమ్మ, కుళ్లాయమ్మ, జయసుధ, మునికుమారి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ వద్ద ధర్నా.. మద్దతు తెలిపిన అఖిలపక్షం కడపలోని జిల్లా పరిషత్ వద్ద పులివెందుల నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ధర్నా నిర్వహించారు. దౌర్జన్యంగా నీటిని తరలించుకుపోతున్నా అడ్డుకోని పోలీసులు వైఎస్ వివేకాను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. జేసీ బ్రదర్స్పై కేసు పెట్టాలని నినాదాలు చేస్తూ జెడ్పీ సమావేశహాలు బయట బైఠాయించారు. ధర్నాకు అఖిలపక్ష నేతలు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, కె.సురేష్బాబు, చంద్ర, నజీర్ అహ్మద్ తదితులు మద్దతు తెలిపారు. -
అనూహ్య మార్పు
సాక్షిప్రతినిధి, అనంతపురం : బండ్లు ఓడలు కావడం...ఓడలు బండ్లు కావడం అంటే ఏంటో 2014లో సుస్పష్టంగా తెలిసింది. పదేళ్లుగా జిల్లాలో అధికార చక్రం తిప్పిన కాంగ్రెస్పార్టీ తొలిసారి ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవకుండా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరనే మాటను నిజం చేస్తూ టీడీపీని బద్దశత్రువుగా భావించిన జేసీ కుటుంబం ‘పచ్చ’కండువాను మెడలో వేసుకుంది. తొలిసారి 11 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ గడప తొక్కారు. సినీనటుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడం..పీసీసీ, సీపీఐ రాష్ట్ర సారథులుగా ‘అనంత’ వాసులు ఎంపిక కావడం ఈ ఏడాది విశేషం. మొత్తంపైన 2014 కొందరు సీనియర్ నేతలకు పీడకలగా మిగిలిపోతే, చాలా మంది కొత్త ముఖాలకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. 2014లో..‘తీన్మార్’ ఈ ఏడాది వేసవిలో మూడు ఎన్నికలు నెలన్నర తేడాతో జరిగాయి. మునిసిపల్ ఎన్నికలతో పాటు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు వరుస క్రమంలో ముగిశాయి. దీంతో రాజకీయపార్టీలలో పదవుల పందేరం ఈ ఏడాది ముగిసింది. మళ్లీ ఐదేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేకుండా 2014లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 11 మంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్సార్సీపీ తరఫున ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలుగా విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, జేసీ ప్రభాకర్రెడ్డి, యామినీ బాల, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, వరదాపురం సూరి, జితేంద్ర, హనుమంతరాయ చౌదరి, కాలువ శ్రీనివాసులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సైకిలెక్కిన జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఉన్న ‘అనంత’ ప్రముఖ నేతల్లో జేసీ బ్రదర్స్ ఉండేవారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో ఇక తమకు భవిష్యత్తు ఉండదని గ్రహించిన వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పరిటాల రవి హత్య కేసులో జేసీ కూడా నిందితుడే అని ఆ పార్టీలోని ఓ వర్గం ఇన్నాళ్లూ ఆరోపించిన నేపథ్యంలో జేసీ రాకను పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా చంద్రబాబు పరిటాల వర్గాన్ని తేలిగ్గా తీసుకుని జేసీ బ్రదర్స్ను సైకిలెక్కించారు. దీంతో జేసీ దివాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా, ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు జిల్లా బహిష్కరణ..నేడు జిల్లా ప్రథమ పౌరుడు ఆర్వోసీలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు, ఇతరత్రా కేసులతో చమన్ సాహెబ్పై పోలీసులు జిల్లా బహిష్కరణ విధించారు. దీంతో దాదాపు పదేళ్లపాటు చమన్ జిల్లాలో కనిపించకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఉరవకొండ సమీపంలో చంద్రబాబును కలిశారు. అయితే పోలీసులు మళ్లీ జిల్లా దాటించారు. ఈ క్రమంలో రామగిరి జెడ్పీటీసీగా గెలిచిన చమన్ ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చున్నారు. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల పగ్గాలు మనకే 2014లో రెండు జాతీయ పార్టీలకు రాష్ట్ర సారథులుగా ‘అనంత’ నేతలు ఎంపికయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)అధ్యక్ష పదవి తొలిసారి అనంత వాసికి దక్కింది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పగ్గాలు రామకృష్ణ చేతికి ఇచ్చారు. ఈ పదవి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి. గతంలో నీలం రాజశేఖరరెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. హిందూపురంలో మళ్లీ నందమూరి కుటుంబం హిందూపురం అసెంబ్లీ బరిలో సుదీర్ఘ విరామంత తర్వాత మళ్లీ నందమూరి కుటుంబం నిలిచింది. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, ఆయన తనయుడు హరికృష్ణలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బాలకృష్ణ మాత్రమే ఒక్కరోజూ కూడా హాజరుకాని ఎమ్మెల్యేగా రికార్డుకెక్కారు. తొలిసారి కాంగ్రెస్కు చావు దెబ్బ జిల్లాలోని 14 అసెంబ్లీల్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం ఇదే ప్రథమం. 2004, 09 ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. పీసీసీ అధ్యక్షుని హోదాలో పెనుకొండ అసెంబ్లీ బరిలో దిగిన రఘువీరా సైతం ఓటమిపాలయ్యారు. మంత్రి శైలజానాథ్ కూడా భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. జిల్లాకు రెండు మంత్రి పదవులు 2013లో జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహించినట్లే..2014లో కూడా పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరితో పాటు కాలువ శ్రీనివాసులు చీఫ్ విప్గా, యామినీ బాల విప్లుగా కొనసాగుతున్నారు. ‘అనంత’నగర పాలక సంస్థ పీఠాన్ని తొలిసారి మహిళ అధిరోహించింది. టీడీపీలో సామన్య కార్యకర్తగా ఉన్న మదమంచి స్వరూపను ఊహించని విధంగా మేయర్ పదవి వరించింది. -
జేసీ సోదరులు గైర్హాజరు!
అనంతపురం: తమ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరైనప్పటికీ జేసీ దివాకర రెడ్డి సోదరులు మాత్రం హాజరుకాలేదు. తాడిపత్రిలోని గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యక్రమానికి ఎంపి జేసీ దివాకర రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి ఇద్దరూ గైర్హాజరయ్యారు. ఈ విషయమై ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనందునే తాము ఆ కార్యక్రమానికి హాజరుకానట్లు తెలిపారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని చెప్పారు. ** -
దౌర్జన్యాలు ఆపండి
అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని దాడులు చేస్తారా.. దళితులని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేస్తారా.. ఇక మీ దౌర్జన్యాలు ఆపండి.. లేదంటే తగిన గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 18వ తేదీ దళితులపై జరిగిన దాడి విషయంపై గురువారం జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబును ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర నారాయణ, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాసులు క లిశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులైన దళితులపై విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్ను తరిమికొడతామని చెప్పిన ముఖ్యమంత్రి దానిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మహిళలు వణికిపోతూ.. తమకు రక్షణ లేదంటూ.. బోరున విలపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదురించడానికి దళితులకు అండగా జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. దాడిలో గాయపడిన దళిత కుటుంబాలకు నష్ట పరిహారం వచ్చే విధంగా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది జేసీ బ్రదర్స్ పనే.... వీరాపురంలో జరిగిన ఘటనపై జేసి బ్రదర్స్ హస్తం ఉందని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్నారాయణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. న్యాయం చేస్తాం : ఎస్పీ వీరాపురంలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, వారికి పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా రాజశేఖర్బాబు హామీ ఇచ్చారు. సంఘటన అనంతరం ఆ గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నేతలు దిలీప్రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం నేత బండి పరుశురాం, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, పురుషోత్తమ్ ఉన్నారు. -
మా అనుమతి లేకుండా చేరతారా?
మంట పెట్టిన వారికే సెగ తాకితే ఎలా ఉంటుందో జేసీ సోదరులకు తెలిసొచ్చినట్టుంది. తాము పాటించిన ధర్మాన్నే మరొకరు పాటిస్తే సహించలేకపోతున్నారు. తాము చెప్పింతే నీతి. తాము చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తామే వలస పక్షుల మన్న సంగతి మర్చిపోయి 'దూకుడు' నేతలను అడ్డుకుంటున్నారు. 'మా అనుమతి లేకుండా ఎవరూ పార్టీలో చేరకూడదు' అన్నట్టుగా హుంకరిస్తున్నారు. అనేక ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పదవులు వెలగబెట్టిన జేసీ సోదరులు ఎన్నికలకు ముందు టీడీపీలోకి దూకారు. కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలి తమ దారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా వారే విధంగా వ్యవహరించారనేది అందరూ చూశారు. ఎన్నికల పోరు ముగిసిన తర్వాత కూడా వారు అదే పంథాలో ముందుకెళుతున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వీరంగమాడారు. తాము వలస నేతలమన్న సంగతి మర్చిపోయి 'జంప్ జిలానీ'లను అడ్డుకున్నారు. టీడీపీలో చేరాలనుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూం బాబా ఆశలకు గండికొట్టారు. కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పరా, వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని హెచ్చరించారు. తమ నాయకుడు వీరంగమాడుతుంటే అనుచరులు చూస్తూ ఊరుకుంటారా. తమకు అలవాటైన విద్య ప్రదర్శించారు. కుర్చీలు విసిరేసి ఫ్లెక్సీలు చించేసి, తమకు తెలీకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ నిష్ర్కమించారు. జేసీ వీరంగంతో టీడీపీలో ముందునుంచి నాయకులు అవాక్కయ్యారు. ఇప్పుడే ఇలావుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ తలలు పట్టుకున్నారు. -
వెనకబడి పోయిన జేసీ
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్రెడ్డి పూర్తిగా వెనకబడిపోయారు. పార్టీ శ్రేణులు ఎవరూ సహకారం అందించకపోవడంతో ఆయనకు ఏమీ పాలుపోవడం లేదు. జేసీ ప్రభాకర్రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం.. ఇటు పట్టణ, అటు గ్రామీణ ప్రాంత ఓటర్లంతా ఏవగించుకునే దశకు చేరిందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, పలక్కపోతే, గుడ్లు ఉరిమి చూడడం లాంటి ఘటనలు ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. తొలి నుంచి తాడిపత్రి మునిసిపాలిటీలో ఓటర్లను బెదిరించి తన మాట వినని నాయకులపై అక్రమ కేసులు పెట్టించి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ వచ్చారు. అయితే ప్రభాకర్రెడ్డి తీరు మునిసిపాలిటీ వరకే పరిమితం అయింది. మొత్తం నియోజకవర్గం అంతా ఆయన ఇప్పటి వరకు తన చెప్పుచేతుల్లో పెట్టుకోలేక పోయారు. తాడిపత్రి రూరల్, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో ప్రభాకర్రెడ్డి తీరుపట్ల ఆ పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కించపరిచే రీతిలో ఆయన మాట్లాడడం పార్టీ కేడర్కు ఏమాత్రం మింగుడుపడడం లేదు. చంద్రబాబును సైతం హేళన చేసే విధంగా ఆయన మాట్లాడడం ఆ పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. తన మాట వినకపోతే ఎస్సీ, ఎస్టీలను రెచ్చగొట్టించి అక్రమ కేసులు పెట్టిస్తారనే భయం వారిలో నెలకొంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్గా ఆయన వ్యవహరించిన తీరు వైస్ చైర్మన్గా ఉన్నపుడు చైర్మన్ వెంకట్రమణను డమ్మీ చేసి పాలన వ్యవహారాలు తానే చక్కబెట్టడం, అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించడం లాంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి మాట వినని వారందర్ని నయానో..భయానో లొంగ దీసుకుని ..వారిని ఇతర కేసుల్లో ఇరికించి తన చుట్టూ తిప్పుకోవడం ఆనవాయితీగా మారిందని ఆయన బాధితులు పేర్కొంటున్నారు. గతంలో పామిడిలో ఇదే విధంగా ఓవర్గాన్ని తన వద్దకు చేర్చుకుని పలు కేసుల్లో వారిని ఇరికించి తమ చుట్టూ తిప్పుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్సు గల్లంతయింది. ఆ పార్టీ నుంచి విశ్వనాథరెడ్డి అభ్యర్థిగా ఉన్నా నామమాత్రమేనని చెప్పవచ్చు. కాగా, 1955లో ఏర్పాటైన తాడిపత్రి నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై చల్లా సుబ్బరాయుడు స్వతంత్య్ర అభ్యర్థి వలిపిరెడ్డి ఆదినారాయణరెడ్డిపై 15,840 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. -
జేసీ.. మంచోరే కానీ..!
-
నిన్న కాక మొన్న వచ్చిన జేసీ సోదరులకు టికెట్లా
ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులకు రెండు టికెట్లు ఎలా కేటాయిస్తారని రాయదుర్గం టీడీపీ ఇంఛార్జ్ దీపక్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ప్రశ్నించారు. మంగళవారం అనంతపురంలో చంద్రబాబుపై దీపక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానికంగా ఎంతో కాలంగా పార్టీకి అంకిత భావంతో పని చేస్తుంటే నిన్న కాక మొన్న వచ్చిన నాయకులకు సీట్లు కేటాయించడం ఎంత వరకు సమంజసమంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం కాలువ శ్రీనివాస్కు కేటాయించిన ఉరుకునే ప్రసక్తి లేదని దీపక్ రెడ్డి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. -
తాడిపత్రిలో ఉద్రికత్త
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ రెడ్డి బహిరంగం చర్చ నిర్వహించారు. జేసీ సోదరుల అరాచకాలపై ధ్వజమెత్తారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జేసీ కుటుంబం ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. -
'పరిటాలకు భయపడి పారిపోయిన జేసీ సోదరులు'
తాడిపత్రి: పరిటాల రవి దెబ్బకు ఒకప్పుడు జేసీ సోదరులు పారిపోయారని ఎంపీ అనంతవెంకట్రామి రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే టీడీపీలో జేసీ సోదరులు చేరుతుండడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో జేసీ సోదరులకు భయపడవద్దని, నిర్భయంగా ఓటేయాలని ప్రజలకు ధైర్యం చెప్పారు. 23న టీడీపీలో చేరుతున్నట్టు మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి నిన్న ప్రకటించారు. సమైక్యాంధ్ర అనలేని పరికిపంద చంద్రబాబు అని అనంత వెంకట్రామిరెడ్డి అంతకుముందు విమర్శించారు. చంద్రబాబు ద్వంద్వనీతే విభజనకు కారణమని, నయవంచకుడైన చంద్రబాబును నమ్మితే మరోసారి ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. వైఎస్ జగన్ వల్లే వైఎస్ఆర్ ఆశయాల సాధన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. -
జేసీ బ్రదర్స్ ట్రేడ్ మార్క్ ‘తమ్ముళ్లు’ కుతకుత
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో వర్గ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయమై నెలకొన్న సందిగ్ధం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. జేసీ సోదరుల ట్రేడ్మార్కు రాజకీయాలతో ఇప్పటికే జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి. అధికారమే పరమావధిగా చంద్రబాబు పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలమైన జేసీ సోదరులను పార్టీలోకి తీసుకోవడానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. జేసీ సోదరులు పార్టీలోకి చేరకపోయినా జిల్లాలో టీడీపీ నాయకుల్లాగానే చలామణి అవుతున్నట్లు ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. దీంతో జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఒకరికొకరు దూషించుకుంటూ.. కొట్టుకునే పరిస్థితులు ఆ పార్టీలో నెలకొన్నాయి. టీడీపీ హయాంలోనే మైనార్టీలకు పెద్ద పీట వేశామని చెబుతున్న చంద్రబాబు.. జిల్లాలో ఆ వర్గానికి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో ఆ వర్గాలు పార్టీపై కన్నెర చేస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వస్తున్న జేసీ సోదరుల ప్రతిపాదనలకు అధినేత తలొగ్గనున్నట్లు తెలుసుకున్న పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఫోన్ ద్వారా ‘మీ ఊరూ.. మీ అభ్యర్థి’ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని అధినేత తను అనుకున్న వారికి టికెట్ కేటాయించాలని స్కెచ్ వేశారని ‘తమ్ముళ్లు’ వాపోతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరుగురు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే వీరిలో హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేకు, మిగిలిన వారికీ టికెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించినా ఆయన తీరుతో అవే స్థానాలు ఇస్తారా.. లేక స్థానాల్లో మార్పు ఉంటుందా అని సిట్టింగ్లు హడలిపోతున్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడి పనిచేసిన వారిని కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన.. వచ్చే వారికి, ఆర్థికంగా బలవంతులైన వారికి టికె ట్ విషయంలో స్పష్టత ఇస్తుండడంతో పార్టీలో వర్గ రాజకీయాలు రగలుతున్నాయి. రాయదుర్గంలో కొత్తగా వచ్చిన కేవీ ఉషాదేవికి టికెట్ గ్యారెంటీ అని అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే జేసీ సోదరుల దూకుడుతో ఆమెలో ఆందోళన మొదలైంది. 2011 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగి ఓటమి చవిచూసిన దీపక్రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే జేసీ సోదరులకు దీపక్రెడ్డి స్వయాన అల్లుడు కావడంతో వారి ఒత్తిడి మేరకు దీపక్రెడ్డికి అధినేత టికెట్ ఇస్తారేమోనన్న ఆందోళన ఉషాదేవిలో నెలకొన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి తోడు టికెట్ పోటీ నుంచి తప్పుకోవాలని జేసీ సోదరులు ఇప్పటికే ఉషాదేవిని హెచ్చరించినట్లు రాయదుర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు చురుగ్గా పనిచేసిన ఉషాదేవి పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. మొదట్లో చీరలు.. జాకెట్లు, ముక్కుపుడకలు పంచుతూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అనుకోని రీతిలో జేసీ సోదరుల రంగప్రవేశంలో పరిస్థితి తలకిందులైంది. ఇక ఇన్నాళ్లు ఉషాదేవికి మద్దతు ఇస్తూ వచ్చిన మెట్టు గోవిందరెడ్డి సైతం ఈ ఎన్నికల్లో తనకు కాకపోయినా తన సతీమణికి లేదా.. తన కుమారుడి టికెట్ ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా తమకు అనుకూలంగా ఉన్న వారే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉండాలని జేసీ సోదరులు ఒక జాబితాను అధినేతకు పంపించినట్లు సమాచారం. ఇంకా పార్టీలోకి చేరకనే తమపై జేసీ సోదరులు కమాండ్ చేస్తున్నారనే ఆగ్రహం తెలుగు తమ్ముళ్ల నుంచి పెల్లుబుకుతోంది. అనంతపురం పార్లమెంటు స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీకీ బలమైన కేడర్ ఉంది. వారిని నేరుగా ఎదుర్కోవాలంటే తమకు అనుకూలమైన అభ్యర్థులను నియమించుకోవాలనే ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి జేసీ సోదరులు తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే అనంతపురం పార్లమెంటు పరిధిలో కొందరికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారంతా పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో జేసీ సోదరులు జోక్యం చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో కూడా ఇదే విధమైన ధోరణిని అవలంబిస్తుండడంతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో సహా పలువురు నాయకులు వారి తీరుపై అధినేతకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అనంతపురం అసెంబ్లీ టికె ట్ మునిసిపల్ మాజీ చైర్మన్ వి.ప్రభాకర్చౌదరికి ఇచ్చేందుకు అధినేత గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి జేసీ సోదరుల ఆగడాలు, వారి ఫ్యూడల్ పోకడలను ప్రభాకర్ చౌదరి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వారి మధ్య చాలా గ్యాప్ ఉంది. అందుకోసం ప్రభాకర్ చౌదరికి అనంతపురం టికెట్ ఇవ్వకూడదని మహాలక్ష్మికే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్కు తప్పితే తన వర్గీయుడైన కంభగిరి రాముడుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీన్ని శమంతకమణి వర్గం వ్యతిరేకిస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు కొట్రెకె మధుసూధన్ గుప్తాకు గుంతకల్లు నుంచి చోటు కల్పించాలని, కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరికి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే గుంతకల్లు నుంచి జితేంద్రగౌడ్, కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయడానికి పోలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆశలు పెట్టుకున్నారు. వీరి ప్రతిపాదన వల్ల వారి ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నాయకుల వలసలు అధికం కాగా.. పార్టీ మొత్తం కాంగ్రెస్ మయం అయిందనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమౌతోంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో కూడా జేసీ సోదరులు తమ అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. హిందూపురంలో మునిసిపల్ మాజీ చైర్మన్ జేఈ అనిల్కుమార్, జేఈ వెంకటస్వామి, బాలాజీ మనోహర్ జేసీ వర్గీయులుగా ఉన్నారు. వీరిలో ఒకరికి చోటు కల్పించాలని జేసీ ప్రతిపాదించినట్లు తెలిసింది. కదిరిలో తన వర్గీయులైన ఎస్.ఎం బాషా, డాక్టర్ సిద్దారెడ్డిని కలసి టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే.. కందికుంటకు కాకుండా వీరిలో ఒకరికి టికెట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. పుట్టపర్తి నుంచి తన పీఏ సురేష్రెడ్డికి అవకాశం కల్పించాలని అధినేతకు ప్రతిపాదించి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి పొగబెడుతున్నారు. ఇదే విధంగా జిల్లా అంతటా తమ ముద్ర ఉండేలా జేసీ సోదరులు కసరత్తు చేస్తుండడంపై టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. -
టీడీపీలో చేరేందుకు శైలజానాథ్ యత్నం
అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఝలక్ ఇవ్వనున్నారా? ఆదిలో టీడీపీలో చేరేందుకు తన సన్నిహితుడు ద్వారా జేసీ బ్రదర్స్తో నెరపిన రాయబారం విఫలమైందా? ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్ ద్వారా శైలజానాథ్ బేరసారాలు సాగిస్తున్నారా? అనే ప్రశ్నలకు టీడీపీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శింగనమలలో ఆదివారం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శమంతకమణి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు ఇదే విషయంపై మండిపడ్డాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. శాసనసభలో అడుగుపెట్టిన శైలజానాథ్.. 2009 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్ హఠాన్మరణం శైలజానాథ్కు అనూహ్యంగా స్థానం దక్కింది. జేసీ దివాకర్రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కిరణ్కుమార్రెడ్డి అంతరంగికుడిగా శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. సీఎంగా కిరణ్ ఉన్న కాలంలో ఆయన దన్నుతో శైలజానాథ్ భారీ ఎత్తున అక్రమార్జన సాగించారనే ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. కిరణ్తో కలిసి సమైక్యరాగం ఆలపిస్తూ ఆయన వెన్నంటే నడిచారు. ఇందుకు ప్రతిఫలంగానే కిరణ్.. శైలజానాథ్ను సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. కాగా, కిరణ్.. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే శైలజానాథ్ పక్క చూపులు చూశారు. వైఎస్సార్సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే తన సన్నిహితుడు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని జేసీ బ్రదర్స్ వద్దకు రాయబారం పంపారు. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పించేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్న శైలజానాథ్ ప్రతిపాదనకు జేసీ బ్రదర్స్ అంగీకరించలేదు. ఆ సీటును తమ అనుచరుడు కంబగిరి రాముడుకు ఇప్పించుకుంటామని జేసీ బ్రదర్స్ తెగేసి చెప్పడంతోనే విధిలేని పరిస్థితుల్లో శైలజానాథ్.. కిరణ్ వెంట నడిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిరణ్ ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీకి భవిత లేదనే భావనకు వచ్చిన శైలజానాథ్.. మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్తో ఆయన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పిస్తే.. పార్టీ ఫండ్ రూపంలో భారీ ఎత్తున ముట్టజెపుతానని శైలజానాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ బంపర్ ఆఫర్ను చంద్రబాబు దృష్టికి సీఎం రమేష్ తీసుకె ళ్లగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించాలని ఎమ్మెల్సీ శమంతకమణిని ఆయన కోరినట్లు తెలిసింది. శింగనమల నుంచి తన కుమారుడిని గానీ.. కుమార్తెను గానీ టీడీపీ తరఫున బరిలోకి దింపాలని శమంతకమణి భావించారు. కానీ.. ఇటీవల ఆ ఆలోచనను ఆమె విరమించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎందుకు వెనక్కి తగ్గారన్నది శైలజానాథ్కే ఎరుకని టీడీపీ నేతలు చలోక్తులు విసురుతున్నారు. శైలజానాథ్ను పార్టీలోకి చేర్చుకోవడంపై శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సీఎం రమేష్ సమావేశం ఏర్పాటు చేయమనగానే శమంతకమణి కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కానీ.. సమావేశంలో కార్యకర్తలు శైలజానాథ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అదే జరిగితే పార్టీని వీడుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల మనోభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ‘భారీ ప్యాకేజ్’ ద్వారా శైలజానాథ్కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
బీసీ.. గీసీ జాంతానై
కళ్యాణదుర్గం, న్యూస్లైన్ : కళ్యాణదుర్గం టీడీపీలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. కాలువను బీసీ అభ్యర్థిగా కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో దింపుతారనే ప్రచారం ఊపందుకోవడంతో ఉన్నం వర్గీయులు అయోమయంలో పడ్డారు. కొంత కాలంగా జేసీ బ్రదర్స్ టీడీపీలోకి చేరుతారని జేసీ ప్రభాకర్రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని ప్రచారంలోకి రావడమే కాకుండా 20 రోజుల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన పర్యటించడం టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. కాలవ శ్రీనివాసులకు కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వనున్నారనే వార్తలు ఉన్నం వర్గీయులను కలవర పెట్టాయి. ‘బీసీ.. గీసీ జాంతానై.. నేనెంత సీనియరో తెలియదా.. నాసత్తా ఎంటో నాకు తెలుసు.. నాడు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయినప్పుడు అభ్యర్థిని గెలిపించుకున్నా.. మొన్న పంచాయతీ స్థానాల్లో అత్యధికం గెలిపించుకోలేదా.. నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడి తేల్చుకుంటా..’ అని అని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉన్నం హనుమంతరాయ చౌదరి పార్టీ శ్రేణుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇక్కడి పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తున్నాయి. పార్టీ ‘ఉన్నం’ను కాకుండా మరో నేతను ఇక్కడి నుంచి బరిలోకి దింపితే సహకరించే పరిస్థితి లేదు. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో సైతం ఇదే చర్చ జరుగుతోంది. కాగా పార్టీలోని కొందరు బీసీ నేతలు మాత్రం.. కాలవకు టికెట్ ఇస్తేనే బావుంటుందని చెబుతున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తేనే గెలుపుపై అవకాశాలు ఉంటాయని వారు వాదిస్తున్నారు. లేదంటే పార్టీలో ఉన్న బీసీ కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం ఖాయమనే హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందోనని కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
దేశం కుతకుత!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంపై పరిటాల వర్గం భగ్గుమంటోంది. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే పయ్యావుల కేశవ్ జేసీ బ్రదర్స్ను టీడీపీలోకి తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించిన పరిటాల సునీత.. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. పరిటాల సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పనిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. పరిటాల రవీంద్ర, పయ్యావుల కేశవ్ 1994 ఎన్నికల్లో ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర, ఉరవకొండ నియోజకవర్గం నుంచిపయ్యావుల కేశవ్ గెలుపొంది, శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పరిటాల రవీంద్రకు చోటు దక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో జిల్లా నుంచి గెలుపొందిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక్క పరిటాల రవీంద్ర మాత్రమే ఎన్టీఆర్ వైపు నిలిచారు. పయ్యావుల కేశవ్ సహా తక్కిన 11 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దన్నుగా నిలిచారు. మనస్థాపంతో ఎన్టీఆర్ మరణించిన తర్వాత పరిటాల రవీంద్ర అప్పటి సీఎం చంద్రబాబు గూటికే చేరారు. జిల్లాలో పరిటాల రవీంద్ర ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు పయ్యావుల కేశవ్ను చంద్రబాబు ఎగదోశారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేదాలకు మొగ్గతొడిగేలా చేసింది. పరిటాల రవి కన్నుమూసే వరకూ ఇరు వర్గాలు ఉప్పునిప్పులా ఉండేవి. పరిటాల రవి చనిపోయిన తర్వాత జిల్లాలో టీడీపీపై పయ్యావుల కేశవ్ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు. పయ్యావుల కేశవ్, జేసీ దివాకర్రెడ్డి కుటుంబాల మధ్య ఆది నుంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్రెడ్డి ఒంటరయ్యారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్ను టీడీపీలోకి తేవడానికి పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం రెండేళ్లుగా వ్యక్తమవుతోంది. మంగళవారం అది కార్యరూపం దాల్చింది. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడంపై పరిటాల సునీత భగ్గుమంటున్నారు. ఇదే అంశంపై శాసనసభ లాబీల్లోనే పయ్యావుల కేశవ్ను ఆమె నిలదీశారు. జేసీ బ్రదర్స్ను పార్టీలోకి తేవడంలో తన పాత్ర ఏమీ లేదంటూ పయ్యావుల కేశవ్ ఇచ్చిన వివరణను పరిటాల సునీత కొట్టిపారేశారు. స్కూలు పిల్లాడిని అడిగినా జేసీ బ్రదర్స్ను పయ్యావుల కేశవ్ టీడీపీలోకి తెస్తున్నారని చెబుతున్నారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ఆది నుంచి తమను వ్యతిరేకిస్తోన్న పయ్యావుల కేశవ్ రాజకీయంగా తమను దెబ్బతీయడానికే టీడీపీలోకి జేసీ బ్రదర్స్ను తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. పరిటాల రవి హత్య కేసులో జేసీ దివాకర్రెడ్డిని నిందితునిగా చేర్చారని.. అలాంటి వ్యక్తి కుటుంబానికి టీడీపీ దన్నుగా నిలవడం ఏ మేరకు సబబు అని పరిటాల సునీత ప్రశ్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను జేసీ కుటుంబం వేధిస్తూ వస్తోందని.. అలాంటి కుటుంబానికి నీడనిస్తే శ్రేణులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. పరిటాల సునీత బెట్టు చేస్తోండటంతోనే జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే ముహూర్తం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇచ్చే ముహూర్తాన్ని మంగళవారం ఖరారు చేసిన నేపథ్యంలో పరిటాల సునీత క్రియాశీలకమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై తమ అనుచరులతో జోరుగా చర్చలు సాగిస్తున్నారు. తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా చేసిన ప్రకటనకు పరిటాల సునీత కట్టుబడతారా..? మరేదైనా సంచలన నిర్ణయం ప్రకటిస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీలోకి జేసీ బ్రదర్స్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆ పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, బీకే పార్థసారథి, అబ్దుల్ఘని, రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జేసీ బ్రదర్స్ను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించామని చెప్పి.. వారి చేరికపై జిల్లా నేతలను ఒప్పించే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు అప్పగించారు. కాసేపయ్యాక తిరిగి సమావేశమై జేసీ బ్రదర్స్కు అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించినట్లు సమాచారం. ఇదే అంశాన్ని ‘ఫోన్’లో జేసీ బ్రదర్స్కు చంద్రబాబు వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ నెల 23 లేదా 24న జేసీ సోదరులు టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. -
జేసీ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలి: ఓయూ జేఏసీ
జేసీ ట్రావెల్స్ యజమానులైన జేసీ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఓయూ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లక్డీకపూల్లో జబ్బార్ ట్రావెల్స్ ఎదుట ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఆ ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు. జబ్బార్ ట్రావెల్స్, జేసీ బ్రదర్స్కు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జబ్బార్ ట్రావెల్స్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలిన ఓయూ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో పోలీసులు ఓయూ విద్యార్థులును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో ఇటీవల వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది ప్రయాణికులు మరణించారు. అయితే ఆ బస్సు జబ్బార్ ట్రావెల్స్ పేరుతో తిరుగుతున్న కాగితాలు మాత్రం జేసీ బ్రదర్స్పేరుపై ఉన్నాయని దర్యాప్తులో తెలింది. దాంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం వారి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుంది. దాంతో పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజల నుంచి ప్రభుత్వానికి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
జూనియర్ జెసి బ్రదర్స్ ఏ పార్టీలో చేరతారు?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. దానికి తోడు ఇటీవల కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, పార్టీపైన చేసి వ్యాక్యలతో ఆయన పార్టీకి దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది. తాను కాంగ్రెస్లో ఉండాలనుకుంటున్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం తనను పార్టీ నుంచి వెళ్లిపోవాలని పదే పదే అంటున్నారని దివాకర రెడ్డి చెప్పారు. అయితే తనకు పార్టీ నుంచి ఇంత వరకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదన్నారు. తమ కుమారుడు, సోదరుడు ఏ పార్టీలో చేరతారనేది వాళ్లిష్టమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో ఆయన సోదరుడు జెపి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాక్యలను బట్టి జేసీ కుటుంబం పార్టీని వీడటం కాయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఆ కుటుంబం నుంచి యువతరం రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది. జెసి సోదరులు ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తమ ఇద్దరి కుమారులను రాజకీయాలలోకి దింపాలన్న ఆలోచనతో ఉన్నారు. జేసీ దివాకర రెడ్డి చేసిన వ్యాక్యలపై ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అంశంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం స్పందించింది. ఏఐసిసి సభ్యుడు అయినప్పటికీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం పీసీసీకి ఉందని కమిటీ చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. అయితే జెసికి షోకాజ్ నోటీస్ మాత్రం ఇవ్వలేదని చెప్పారు. అయనకు నోటీస్ ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని, ఆ ప్రక్రియం కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే కమిటీ ఓ దఫా సమావేశమైందని తెలిపారు. అయితే ఆ వివరాలు మీడియాకు వెల్లడించలేనని కంతేటి చెప్పారు. ఈ నేపధ్యంలో జెసి ప్రభాకర రెడ్డి జూబ్లీహిల్స్లో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతున్నందున త్వరలోనే తమ పిల్లలు రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. దివాకర రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి, తన కుమారుడు అష్మిత్ రెడ్డిలను పక్కన కూర్చోబెట్టుకొని మరీ ఆయన ఈ విషయం ప్రకటించారు. తాము వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టివేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడాలని తమపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే శ్రేయోభిలాషులు, కార్యకర్తల అభిష్టం మేరకు తాము ఏ పార్టీలో చేరేది త్వరలోనే నిర్ణయిస్థామని చెప్పారు. ఇక తమ పిల్లలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్నారు. తమ కుటుంబం సమైక్యాంద్రకే కట్టుబడి ఉన్నట్లు ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని జేసీ దివాకర రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆ పార్టీ వారు సమైక్యవాదనను చాలా బలంగానే వినిపిస్తున్నారని చెప్పారు. ఈ మాటలను బట్టి జెసి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమైన నేపధ్యంలో జెసి సోదరులతోపాటు జూనియర్ జెసి సోదరులు ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టంకాలేదు. s.nagarjuna@sakshi.com -
అక్రమ మార్గం.. వక్రభాష్యం
‘బస్సు’ దగ్ధం కేసు నుంచి తప్పించుకొనేందుకు యత్నాలు ‘జబ్బార్’ ట్రావెల్స్ను ముందు పెట్టి వ్యవహారం నడిపిస్తున్న జేసీ బ్రదర్స్? చట్టంలోని లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం 8 గంటలేనట.. రెండో డ్రైవర్ అవసరం లేదట ఇరుకు వంతెన కారణంగానే ప్రమాదం జరిగిందంటూ బుకాయింపు మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: చట్టంలోని లొసుగులను సాకుగా చూపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం చట్టంలోని నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ తప్పు తమదికాదని వాదిస్తోంది. అయితే ఈ కేసు తమ మీదికి వచ్చే అవకాశం ఉండడంతో.. జబ్బార్ ట్రావెల్స్ను ముందుపెట్టి ‘జేసీ’ బ్రదర్స్ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా పాలెం శివార్లలో దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్తో పాటు మేనేజర్ను కూడా అరెస్టు చేశారు. అయితే, అసలు ఈ కేసులో తమ తప్పేమీ లేదనేందుకు నిబంధనల్లోని లొసుగులను వాడుకొనేందుకు బస్సు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు ఎనిమిది గంటలు మాత్రమే పడుతుందని.. దాంతోపాటు ప్రమాదానికి గురైన బస్సుకు జాతీయ రహదారి పర్మిట్ లేనందున ఇద్దరు డ్రైవర్లు అవసరం లేదని, నిబంధనల ప్రకారం ఒక్కరే సరిపోతారని ట్రావెల్స్ యాజమాన్యం అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు పాలెం సమీపంలో కల్వర్టు జాతీయ రహదారిపైకి చొచ్చుకువచ్చిందునే ప్రమాదం జరిగిందని వారు వాదిస్తున్నట్లు సమాచారం. ఏడో నంబర్ జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాత కల్వర్టును తొలగించి.. కొత్త కల్వర్టు నిర్మించకపోవడం వల్ల అక్కడ రహదారిపైకి కల్వర్టు నిర్మాణం కొంత చొచ్చుకువచ్చినట్లుందని.. అందువల్లే దుర్ఘటన జరిగిందని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా.. బస్సు ఢీ కొన్న కల్వర్టు నిర్మాణాన్ని ఢిల్లీకి చెందిన జాతీయ రహదారి శాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. -
టీడీపీ గూటికి జేసీ బ్రదర్స్
-
జేసీ మూక అరాచకం
తాడిపత్రి/టౌన్/రూరల్, న్యూస్లైన్ : తాడిపత్రి పట్టణంలో జేసీ సోదరుల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ‘ఊరందరిదీ ఒకదారి అయితే... ఉలిపికట్టెది మరోదారి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పైగా అందరూ తమ ‘దారి’లోనే నడవాలంటూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని సైతం అపహాస్యం చేస్తున్నారు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర వస్తుందా అంటూ ఉద్యమకారులను హేళన చేస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు జీవితాలు, జీతాలను త్యాగం చేసి ఉద్యమిస్తుంటే... జేసీ సోదరులు మాత్రం అందుకు భిన్నంగా స్వలాభం, రాజకీయ స్వార్థంతో ‘సమైక్య’ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఆదివారం సమైక్యాంధ్ర బంద్ చేపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై స్వయాన జేసీ ప్రభాకరరెడ్డి దగ్గరుండి తన అనుచరులతో రాళ్ల దాడి చేయించారు. పోలీసుల సమక్షంలోనే వీరంగం చేసి.. భయానక వాతావరణం సృష్టించారు. బంద్లో భాగంగా వ్యాపారులు మూసేసిన దుకాణాలను దౌర్జన్యంగా తెరిపించి... భయబ్రాంతులకు గురి చేశారు. శనివారం జిల్లా అంతటా బంద్ ఉన్నప్పటికీ తాడిపత్రిలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాన్ని మాత్రం తెరిచే ఉంచారు. దాంతో సమైక్యవాదులు కార్యాలయంపై దాడి చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకరరెడ్డి ఆదివారం పట్టణంలో వీరంగం చేశారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు పట్టణవాసులు 72 గంటల బంద్ పాటిస్తుండగా... దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాడు. వ్యాపారులతో బలవంతంగా దుకాణాలను తెరిపించాడు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర రాదంటూ తన లారీలు, బస్సులను కూడా తాడిపత్రిలో యథేచ్ఛగా తిప్పించాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, నాయకులు మున్నా, మనోహర్రెడ్డి, రవీంద్రారెడ్డి, పేరం మహ్వేరరెడ్డి, ప్రకాష్బాబు, శరబారెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి, వెంకటమల్లారెడ్డి, కంచం రామ్మోహన్రెడ్డి, రవీనాథ్రెడ్డి, రఘునాథ్రెడ్డి, భాస్కర్రెడ్డి, పెద్దపేట లక్ష్మిదేవి, లక్ష్మిదేవి తదితరులు కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా తెరిపించిన దుకాణాలను తిరిగి బంద్ చేయిస్తూ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి సీబీ రోడ్డు, పోలీస్స్టేషన్ సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండు సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తన అనుచరులతో కలిసి రాళ్లు, కర్రలు తీసుకుని వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చూస్తుండగానే వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అయితే... వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా అక్కడే నిలబడి జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణ ఒత్తిడి తెచ్చారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమపైకి దౌర్జన్యంగా వస్తున్న వారిని అడ్డుకోవాలని చెప్పినా వినలేదు. కాంగ్రెస్ మూకలు విసిరిన ఓ రాయి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు తగలింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జీ చేశారు. అయినప్పటికీ జేసీ ప్రభాకరరెడ్డి అక్కడ్నుంచి కదలకుండా మరింత రెచ్చగొడుతూ అనుచరులను ఉసిగొల్పాడు. పోలీసులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ వారినే వెళ్లిపోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల రోడ్డుపై బైఠాయించారు. జేసీ ప్రభాకరరెడ్డిని, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి తీరుపై పట్టణ ప్రజలు మండిపడ్డారు.