Kapil Sharma
-
బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపులు, సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనలతో చిత్రపరిశ్రమలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పాకిస్తాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.రిప్లై రాలేదంటే తీవ్ర పరిణామాలుఈమెయిల్లో ఏముందంటే..? నువ్వేం చేస్తున్నావో ప్రతీది గమనిస్తున్నాం. ఓ సున్నిత విషయాన్ని నీ దృష్టికి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాం. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు, అలా అని నిన్ను వేధించడమూ లేదు. ఈ మెసేజ్ను సీరియస్గా తీసుకోవాలని, అలాగే దీన్ని సీక్రెట్గా ఉంచాలని కోరుతున్నాం.. ఇట్లు బిష్ణు అని రాసుంది. అంతేకాకుండా ఎనిమిది గంటల్లో ఈ మెసేజ్కు రిప్లై ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.వరుసగా బెదిరింపులుకపిల్ కంటే ముందు సుగంధ మిశ్ర, రెమో డి సౌజ, రాజ్పాల్ యాదవ్కు సైతం ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్న షోలో భాగమైన కపిల్ శర్మను, అతడి టీమ్ మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలేంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే గత వారం సైఫ్ అలీఖాన్ ఇంట్లో అతడిపై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్ను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన నటుడికి వైద్యులు సర్జరీ చేశారు. తన శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తి మొననను తీసేశారు.చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్ -
అట్లీ కలర్పై కామెంట్స్.. గొర్రెలాగా అనుసరించొద్దు: నెటిజన్కు కపిల్ శర్మ కౌంటర్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్గా ఎదిగారు.. ఎవరైనా స్టార్ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్పై కపిల్ శర్మ స్పందించారు.తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024 -
స్టార్ డైరెక్టర్పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ కమెడియన్.. దివాళా తీయాల్సి వచ్చింది!
సినీ ఇండస్ట్రీలో రిచెస్ట్ కమెడియన్ ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అంతలా ఫేమస్ అయ్యారు కమెడియన్ కపిల్ శర్మ. ది కపిల్ శర్మ షో ద్వారా బాలీవుడ్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇటీవలే జ్విగాటో సినిమాతో ప్రేక్షకులను అలరించిన కపిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తకర విషయాలు పంచుకున్నారు.గతంలో తాను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయని కపిల్ శర్మ తెలిపారు. ఫిరంగి, సన్ ఆఫ్ మన్జీత్ సింగ్ చిత్రాలు ఆర్థికంగా చాలా దెబ్బ కొట్టాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలతో నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన భార్య సహకారంతోనే మళ్లీ తిరిగి కోలుకున్నట్లు కపిల్ శర్మ తెలిపారు.కాగా.. ఫిరంగి చిత్రంలో కపిల్ శర్మతో పాటు ఇషితా దత్తా, మోనికా గిల్ నటించారు. ఈ సినిమాకు రాజీవ్ దర్శకత్వం వహించారు. 2017లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పంజాబీలో తెరకెక్కించిన సన్ ఆఫ్ మంజీత్ సింగ్ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రానికి విక్రమ్ గ్రోవర్ దర్శకత్వం వహించారు. అంతకుముందు 2015లో తెరకెక్కిన కిస్ కిస్కో ప్యార్ కరోతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా
బాలీవుడ్లో స్టాండప్ కమెడియన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ నటించిన జ్విగాటో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నందిత దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. షహానా గోస్వామి హీరోయిన్గా నటించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానుంది.భువనేశ్వర్ నేపథ్యంలో సాగే ఫుడ్ డెలివరీ బాయ్ కథ ఇది. జ్విగాటో మూవీలో సాధారణ ప్రజల జీవితాన్ని ఎంతో అద్బుతంగా డైరెక్టర్ నందిత దాస్ చూపించారు. అయితే, ఈ సినిమా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం, బుసాన్ అంతర్జాతీయ చిత్రోత్సవం వంటి వేదికలపై ప్రదర్శితమైంది. తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్ను పంచుకుంది.సాధారణ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయాక ఫుడ్ డెలివరీ ఏజెంట్గా మారాల్సి వస్తుంది. అయితే, ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడనేది అసలు కధ. ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్గానే వచ్చాయి. ఐఎండీబీలో రేటింగ్ కూడా మెరుగ్గానే ఉంది. -
అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సీనియర్ నటుడు ఆగ్రహం
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో ది కపిల్ శర్మ షో. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోకు హాజరవుతుంటారు. అయితే ఈ షో బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను తాను చూడడని.. వినోదం కంటే అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ..'ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసేందుకు కపిల్ శర్మ కష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన హోస్ట్గా వ్యవహరిస్తోన్న ది కపిల్ శర్మ షో, బిగ్బాస్ను కూడా నేను చూడను. ఎందుకంటే వాటిలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది నాకు అస్సలు నచ్చదు. మరో రెండు సంఘటనల వల్ల నాకు కపిల్ అంటే చిరాకు కలిగింది. గతంలో ఓసారి ఆయన షో చూశా అందులో శక్తిమాన్ గెటప్ వేసుకొని.. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. మేము ఎంతో గొప్పగా ఆ పాత్రను సృష్టిస్తే.. అలా చేయడం నచ్చలేదు. అవార్డుల ఫంక్షన్లో కూడా ఓసారి ఇలాగే ప్రవర్తించాడు. నా పక్కనే కూర్చున్నప్పటికీ నన్ను పలకరించలేదు. అందుకే అతనిపై ఉన్న కాస్తా గౌరవం కూడా పోయింది' అని ముఖేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బీటౌన్లో వైరల్గా మారాయి. -
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్ నటులైన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ప్రకారం వీరు ముగ్గురూ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీరు డబ్బును కూడా స్వీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి కూడా కపిల్ శర్మ హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు) గడువు కోరిన రణ్బీర్ కపూర్! అయితే ఇప్పటికే అక్టోబర్ 6న అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్కు ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అయితే హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న మొత్తం... అతనితో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏంటి? మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరి 2023లో దుబాయ్లో తన వివాహ వేడుక కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కాగా.. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్తో కలిసి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. (ఇది చదవండి: రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?) ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources (file pics) pic.twitter.com/rKXxUgtucl — ANI (@ANI) October 5, 2023 -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో చక్కటి ఫాం హౌస్తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్లో అందమైన ఫామ్హౌస్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్హౌస్లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్మెంట్కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
డబ్బు, గుర్తింపు ఉన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: కమెడియన్
నటించడం సులువేమో కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నటులే ఒప్పుకున్నారు. అయితే పైకి నవ్వుతూ కనిపించినంతమాత్రాన వారి జీవితాల్లో ఏ కష్టాలూ లేవనుకుంటే పొరపాటే! లోపల ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం చిరునవ్వుతోనే దర్శనమిస్తారు. తాజాగా ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ ఒకానొక దశలో మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. నందితా దాస్ 'జ్విగాటో' సినిమాలో కపిల్ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్లలో తాను డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించాడు. 'ఒక సెలబ్రిటీగా కోట్లాది మందికి నేను తెలుసు.. ఎందుకంటే నేను వారికి వినోదాన్ని పంచుతాను. కానీ ఇంటి లోపల అడుగుపెట్టాక ఒంటరివాడిని అనిపించేది. సముద్రం ఒడ్డుకు వెళ్లి అలల అందాన్ని చూడాలనుకున్నా అది నాకు సాధ్యపడదు. రెండు గదుల రూములో ఒక్కడినే ఉండేవాడిని. సాయంత్రానికే అంతా చీకటయ్యేది. అప్పుడు నేనెంత విచారంగా ఫీలయ్యానో మాటల్లో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లైతే ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నా గుండెలోని బాధను చెప్పుకుని మనసు తేలిక చేసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరని భావించాను. మానసికంగా కుంగిపోయాను. అలా జరగడం అదే మొదటిసారని నేను చెప్పను. నా బాల్యంలోనూ నేను ఒంటరితనాన్ని ఫీలయ్యాను. కానీ ఎవరూ దాన్ని గుర్తించలేదు. తర్వాత బాగానే పేరు తెచ్చుకున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ నాకంటూ ఎవరూ లేరు అన్న బాధ నన్ను వెంటాడేది. ఒక ఆర్టిస్టు అమాయకుడిగా ఉన్నాడంటే అతడు పిచ్చోడేం కాదు. కానీ నా చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించేకొద్దీ నా కళ్లు తెరుచుకున్నాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు కపిల్ శర్మ. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్
బాలీవుడ్ స్టార్ కమెడియన్లలో కపిల్ శర్మ ఒకరు. ఆయన హోస్ట్గా వ్యవహరించే ద కపిల్ శర్మ షో కొత్త సీజన్ త్వరలో మొదలు కాబోతోంది. దీనికోసం కమెడియన్ కొత్త అవతారమెత్తాడు. మరింత యంగ్గా తయారై ఫ్యాన్స్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మేరకు ఓ ఫొటోను తన ట్విటర్లో వదిలాడు కపిల్. కొత్త సీజన్ కోసం కొత్త లుక్.. త్వరలోనే రాబోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో బ్లాక్ టీ షర్ట్పైన వైట్ కోట్ వేసుకుని స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చాడు కపిల్. అంతేకాదు, మునుపటి కంటే బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. అతడి లుక్ చూసి షాకైన అభిమానులు 'ఏంటి సర్, మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేకున్నాం.. మీ వయస్సును ఎలా రివర్స్ చేసుకోగలుగుతున్నారు?', 'వయసు పెరుగుతున్నా నిత్యం యంగ్గా ఉండే అనిల్ కపూర్ నుంచి ఏదైనా రహస్యాన్ని రాబట్టారేమో!', 'మీరు ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కపిల్ శర్మ షో మూడో సీజన్ ఈ ఏడాది జూన్లో ప్రసారమైంది. మరి నాలుగో సీజన్ను ఎప్పుడు మొదలు పెడ్తారనేది అధికారికంగా వెల్లడించేవరకు వేచి చూడాల్సిందే! ఇకపోతే ఈ షోలో కృష్ణ అభిషేక్, కికు శారద, సుదేశ్ లాహిరి, భారతీ సింగ్, సుమోన చక్రవర్తి పలువురు ఉండనున్నారు. New season, new look 🤩 #tkss #comingsoon 🙏 pic.twitter.com/Q9ugqzeEJO — Kapil Sharma (@KapilSharmaK9) August 21, 2022 చదవండి: కార్తికేయ 2 సక్సెస్పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు -
స్టార్ కమెడియన్ చెంప పగలగొట్టి బయటకు గెంటేశా: డైరెక్టర్
గదర్: ఏక్ ప్రేమ కథ.. బాలీవుడ్లోని మోస్ట్ ఐకానిక్ చిత్రాల్లో ఇది ఒకటి. సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరోహీరోయిన్స్గా నటించారు. యాక్షన్ డైరెక్టర్ టీను వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఇప్పటి స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కూడా నటించాడట. కానీ అతడి పార్ట్ను ఎడిటింగ్లో తీసేశారు. దానికన్నా ముందు అతడిని కొట్టి మరీ సెట్స్ నుంచి తరిమేశారట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా చెప్పుకొచ్చాడు. 'అది ఒక రైలు సన్నివేశం. సెట్స్లో చాలామంది ఉన్నారు. అందరూ రైలు వెంబడి పరిగెత్తాలని చెప్పాను. యాక్షన్ అనగానే అందరూ అదే చేశారు, ఒక్క వ్యక్తి తప్ప.. అతడే కపిల్. అందరూ ఒక వైపు పరిగెడుతుంటే కపిల్ మాత్రం రివర్స్లో పరిగెడుతున్నాడు. ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్పాను. నీవల్ల పదేపదే రీటేక్ తీసుకోవాల్సి వస్తోంది. సరిగ్గా చేయు అని ఎన్నిసార్లు హెచ్చరించినా అతడు తీరు మార్చుకోలేదు. నేను చెప్పింది కాకుండా తనకు నచ్చింది చేశాడు. దీంతో కోపం వచ్చి కెమెరా ఆఫ్ చేసి కపిల్ వెంట పరిగెత్తి అతడి చెంప చెల్లుమనిపించాను. వెంటనే అతడిని ఇక్కడి నుంచి పంపించేయమని అక్కడున్నవాళ్లకు చెప్పడంతో వాళ్లు అతడిని బయటకు గెంటేశారు' అని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ టీనూ వర్మ ఇక ఇదే సంఘటనను కపిల్ శర్మ టాక్ షోలోనూ బయటపెట్టాడు కపిల్. 'డైరెక్టర్ చెప్పినదానికి నేను వ్యతిరేక డైరెక్షన్లో పరిగెత్తాను.. అలా నాకు చీవాట్లు చెంపదెబ్బలు పడ్డాయి. సినిమా రిలీజయ్యాక నేను నటించిన సీన్ చూపిద్దామని మా ఫ్రెండ్స్తో థియేటర్కు వెళ్లాను. కానీ తీరా నేను ఉండే సన్నివేశాన్ని తొలగించారని అర్థమైంది' అని పేర్కొన్నాడు. చదవండి: నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్ సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు -
ఫుడ్ డెలివరి బాయ్గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్
సోషల్ మీడియాలో సెలబ్రెటీ షాకింగ్ ఫొటో దర్శనం ఇచ్చింది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రముఖ హాస్య నటుడు డెలివరి బాయ్గా అవతారం ఎత్తి ఒడిసా రోడ్లపై కనిపించాడు. ఇక ఆయనను లైవ్గా చూసిన వారంత నమ్మలేక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకి ఆ నటుడు ఎవరంటే బాలీవుడ్ పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ. ఆయన ఫుడ్ డెలివరి చేస్తూ ఒడిసా రోడ్లపై కనిపించాడు. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్ ఆయనను దగ్గరగా చూసినవారు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన ఫొటోలు వైరల్గా మారాయి. కాగా ప్రస్తుతం కపిల్ శర్మ నటి, దర్శకురాలు నందిత దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన ఫుడ్ డెలివరి బాయ్ పాత్రలో కనిపించానున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ ఒడిసాలో షూటింగ్ను జరుపుకుంది. అక్కడ ఎల్లో కలర్ టీ-షర్ట్, డెలివరి బ్యాగ్, బ్లాక్ హెల్మెట్తో ద్విచక్ర వాహనంపై వెళుతూ కనిపించాడు. ఇక ఆయనను అలా చూసిన ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. దీనికి ‘సర్ మిమ్మల్ని నేను లైవ్లో చూశాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్పై కపిల్ స్పందిస్తూ.. ‘ఎవరికి చెప్పకు’ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా బీటౌన్లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోతో స్టార్ కమెడియన్గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. Kisi ko batana mat 🤓 https://t.co/3rCAjuPKva — Kapil Sharma (@KapilSharmaK9) March 18, 2022 -
డెలీవరీ బాయ్గా కమెడియన్ కపిల్ శర్మ
Kapil Sharma To Play Food Delivery Boy In Nandita Das Film: నందితా దాస్ మంచి నటి మాత్రమే కాదు.. మంచి దర్శకురాలు కూడా. 2008లో ‘ఫిరాక్’ చిత్రం ద్వారా దర్శకురాలిగా మారిన నందిత ఆ తర్వాత పదేళ్లకు ‘మాంటో’ చిత్రం తెరకెక్కించారు. ఈ గ్యాప్లో ఓ షార్ట్ ఫిలిం చేశారు. తాజాగా దర్శకురాలిగా మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో టీవీ వ్యాఖ్యాత కపిల్ శర్మ మెయిన్ లీడ్ చేయనున్నారు. ఇందులో కపిల్ ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. సహానా గోస్వామి కథానాయిక. ‘‘మీ ఆర్డర్ స్వీకరించాం’’ అంటూ, ‘‘ఒక కామన్ మేన్ కథ ఇది అని, ఈ పాత్రకు కపిల్ సరిపోతారనిపించి తీసుకున్నాను’’ అని నందితా దాస్ పేర్కొన్నారు. -
అక్షయ్తో వివాదం.. వివరణ ఇచ్చిన ప్రముఖ కమెడియన్
Kapil Sharma Gave Clarity On Rift Between Him And Akshay: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ కమెడియన్లో నటుడు కపిల్ శర్మ ఒకరు. కమెడీ నైట్ విత్ కపిల్ శర్మ షో ఆయన ఎంతో పాపులర్ అయ్యారు. సినీ సెలబ్రెటీలతో చిట్చాట్ నిర్వహించి తనదైన కామెడీ పంచ్లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే కమెడియన్లో కపిల్ శర్మ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తన సినిమాల ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గతంలో పలుమార్లు ఈ షోలో పాల్గొన్నారు. చదవండి: Trolls On Kajal Aggarwal: కాజల్ బాడీపై ట్రోల్స్.. మద్దుతుగా నిలిచిన సమంత, లక్ష్మి మంచు ఈ క్రమంలో ఈ షోలో జరిగిన ఓ ఘటనపై అక్షయ్, కపిల్పై కోపంగా ఉన్నాడని, అందుకే తన తాజా చిత్రం బచ్చన్ పాండే ప్రమోషన్ కోసం ఈ షోకు రావడం లేదంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వివాదం బాగా ముదరడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారిద్దరిపై వస్తున్న వార్తలపై రిసెంట్గా కపిల్ శర్మ స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అక్షయ్కి నాకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను చూశాను. అవును మా మధ్య చిన్నపాటి డిస్టబెన్స్ వచ్చింది. కానీ అప్పుడే దానిపై అక్షయ్తో మాట్లాడాను. సమచార లోపంతోనే ఇది జరిగింది. ఆ వెంటనే అక్షయ్కి ఫోన్ చేసిన మాట్లాడి వివరణ ఇచ్చాను. ఇప్పుడు అంతా సర్థుకుంది. చదవండి: రణ్బీర్తో నాకు పెళ్లయిపోయింది.. బయటపెట్టిన ఆలియా త్వరలోనే ఆయన బచ్చన్ పాండే ప్రమోషన్ కోసం మా షోలో సందడి చేయనున్నారు, అక్షయ్ నాకు పెద్దన్నలాంటివారు. ఆయన ఎప్పుడు నాపై కోపంతో ఉండరు’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా ఇటీవల ఆత్రంగి రే మూవీ ప్రమోషన్స్ కోసం అక్షయ్ కుమార్ కపిల్ శర్మ షోకు వచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూలో చేయడంపై కపిల్ ఈ షో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్య్వూలో కపిల్ పలు సరదా ప్రశ్నలు వేసి అక్షయ్ని ఆటపట్టించారు. అయితే ఇది ఎడిటింగ్లో తీసేయాలని అక్షయ్ చెప్పడంలో షో నిర్వహకులు ఒకే అన్నారు. కానీ తీరా చూస్తూ ఈ సన్నీవేశాలు అనుకొకుండా నెట్టింట లీక్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహరంలోనే అక్షయ్, కపిల్పై కోపంగా ఉన్నారని సమాచారం. Dear friends,was reading all the news in media about me n Akshay paji, I have jus spoke to paji n sorted all this, it was jus a miss communication, all is well n very soon we r meeting to shoot Bachhan pandey episode. He is my big bro n can never be annoyed with me 😊thank you 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) February 8, 2022 -
ఈ స్టార్ కమెడియన్ ఒక మిలియనీర్ !.. ఆస్తులు ఎంతంటే ?
Kapil Sharma Will Become Millionaire With His Shows: బీటౌన్లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మతో స్టార్ కమెడియన్గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా కపిల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ స్టార్ కమెడియన్పై త్వరలో బయోపిక్ కూడా రానుంది. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఇదిలా ఉంటే పలు నివేదికల ప్రకారం కపిల్ శర్మ మొత్తం ఆస్తులు రూ. 242 కోట్లు అని తెలుస్తోంది. నెలకు రూ. 3 కోట్లకుపైగా సంపాదిస్తున్నాడట కపిల్. కపిల్ శర్మ తన నెల మొత్తం సంపాదనతో ఒక లక్జీరియస్ ఇల్లు కొనగలడని సమాచారం. ఇప్పటికే కపిల్ శర్మ ఇల్లు ముంబైలోని చాలా పాష్ ఏరియాలో ఉందట. ఇంతేకాకుండా అతను టీవీ ఎపిసోడ్ కోసం రూ. 40 నుంచి 90 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. కపిల్ శర్మకు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయట. ఇవికాకుండా మెర్సిడెస్ బెంజ్, వోల్వో ఎక్స్సీ 90, రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్డీ4 వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే ఈ స్టార్ కమెడియన్ ఒక రకంగా మిలియనీర్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్లో 'ఐయామ్ నాట్ డన్ ఎట్' షోకు హోస్ట్గా కూడా చేస్తున్నాడు కపిల్. -
అర్ధరాత్రి షారుక్ ఇంటికి తాగి వెళ్లాను, అప్పుడు..: కమెడియన్
నటుడు, కమెడియన్ కపిల్ శర్మ ఓసారి పిలవని పార్టీకి వెళ్లాడట. అది కూడా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇంట్లో జరుగుతున్న పార్టీకి! తాజాగా ఈ విషయాన్ని ఆయన నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న 'కపిల్ శర్మ: ఐయామ్ నాట్ డన్ ఎట్' అనే షోలో వెల్లడించాడు. 'కపిల్ శర్మ షోతో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. కానీ ఇది నాలో కొన్ని తప్పుడు ఆలోచనలకు సైతం బీజం పోసింది. నా కజిన్ మన్నాత్లోని షారుక్ ఖాన్ ఇంటిని చూడాలని ఉందని చెప్పింది. అప్పుడు నేను తాగి ఉన్నాను. అయినా సరే అదేం పట్టించుకోకుండా చలో అంటూ కారు తీసుకుని వెళ్లాం. అక్కడ పార్టీ జరుగుతోంది. సెక్యూరిటీ గార్డులు నన్ను చూసి పార్టీకి ఆహ్వానించారేమోననుకుని గేట్లు తెరిచారు. లోపలకు ఎంటర్ అయ్యాం కానీ మేము చేస్తోంది తప్పనిపించింది. ఉన్నపళంగా బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అంతలోనే షారుక్ మేనేజర్ మమ్మల్ని చూసి లోనికి ఆహ్వానించాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 3 అవుతోంది. నేను నిక్కర్ వేసుకుని ఉన్నాను. అలాగే ఇంట్లో అడుగు పెట్టగా ఎదురుగా షారుక్ భార్య గౌరీ మేడమ్ తన ఫ్రెండ్స్తో ఉన్నారు. ఆమె కూడా నాకు ఇన్విటేషన్ అందిందేమోననుకుని పలకరించింది. షారుక్ లోపల ఉన్నాడంటూ ఓ గదివైపు వెళ్లమని సూచించింది. అలా గదిలోకి వెళ్లగానే ఆయన ఎప్పటిలాగే డ్యాన్స్ చేస్తున్నారు. కొంత కంగారుపడుతూనే తన దగ్గరకు వెళ్లి.. భాయ్ సారీ.. నా కజిన్ మీ ఇల్లు చూడాలనుందంటే తీసుకువచ్చాను అని చెప్పాను. అప్పుడతను నువ్వు ఇంట్లోకేంటి.. నా బెడ్రూమ్లోకి కూడా రావచ్చన్నాడు. ఆ తర్వాత ఇద్దరం డ్యాన్స్ చేశాం. తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి స్టాఫ్ నాతో ఫొటోలు తీసుకున్నారు. వాటిని షారుక్ స్వయంగా తీశాడు' అని చెప్పుకొచ్చాడు. -
పాపులర్ కమెడియన్పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా ఉన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తాజా ఎపిసోడ్లో సోనూసూద్, కపిల్ శర్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా తన తల్లి సరోజ్ సూద్ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు సోనూసూద్. ‘మా అమ్మగారికి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ నాకు ఉత్తరాలు రాసేవారు అమ్మ. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం.. అయినా ఉత్తరాలెందుకు? అని మా అమ్మ గారిని ఓ సందర్భంలో అడిగాను. ‘నేను నిన్ను విడిచి వెళ్లిపోయినప్పుడు ఈ ఉత్తరాలు నీ దగ్గర ఉంటాయి. ఫోన్ రికార్డ్స్ చెరిగిపోతాయి’అన్నారు. మా అమ్మ రాసిన లేఖలు(దాదాపు 25)నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ నాతో లేరు. కానీ ఆ ఉత్తరాలు చదువుతుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. నేను కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’ అన్నారు సోనూసూద్. అలాగే సరోజ్ రాసిన ఓ లేఖను షోలో చదివి వినిపించారాయన. -
‘మీకు డబ్బులు ఎలా వస్తాయి’.. నా భర్త చాలా కష్టపడతాడు: శిల్పా శెట్టి
Raj Kundra Arrest: లండన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. ఆ తర్వాత వారితో బలవంతంగా అడల్ట్ చిత్రాలు నిర్మించి.. వాటిని కొన్ని యాప్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడనే ఆరోపణల మీద పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా ఆదాయం గురించి భార్య శిల్పా శెట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కపిల్ శర్మ షోకు ఓ సారి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితా శెట్టి గెస్ట్లుగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ, రాజ్ కుంద్రాను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు ఎప్పుడు చూసినా టైం పాస్ చేస్తూ.. జాలీగా గడుపుతారు. ఇంత లగ్జరీ బతకడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. అసలు ఏం పని చేయకుండా మీకు డబ్బు ఎలా వస్తుందని’’ ప్రశ్నిస్తాడు. అంతేకాక ‘‘మీరు ఎప్పుడు చూసినా పార్టీలకు వెళ్తూ, భార్యతో షాపింగ్ అంటూ తిరుగుతారు. సినీ తారలతో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతుంటారు. ఇన్ని పనులు చేస్తూ, బిజీగా ఉంటారు.. మీకు డబ్బులు సంపాదించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది’’ అని కపిల్ శర్మ ప్రశ్నిస్తాడు. అందుకు శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, షమితా ముగ్గురు పెద్ద పెట్టున నవ్వుతారు. ఆ తర్వాత శిల్పా శెట్టి బదులిస్తూ.. ‘‘నా భర్త చాలా కష్టపడతారు.. ఒక్కోసారి ఆయన గంటలకొద్ది పని చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది దొరకదు’’ అని సమాధానం చెప్పారు. ఏళ్ల నాటి ఈ వీడియో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజనులు ‘‘కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇన్నాళ్లకు సరైన సమాధానం లభించింది’’.. ‘‘సినిమా అవకాశాల పేరుతో యువతుల జీవితాలను నాశనం చేస్తూ.. తాను మాత్రం ఖరీదైన జీవితం గడుపుతున్నాడు’’.. ‘‘అవును పాపం.. పోర్న్ సినిమాలు తీయడానికి.. అమాయకులైన ఆడవారిని మోసం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు’’ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. शिल्पा शेट्टी के पति राज कुंद्रा को क्राइम ब्रांच ने अश्लील फिल्में बनाने के आरोप मे किया गिरफ्तार. Finally everyone got the right answer of the question asked by kapil sharma on #TheKapilSharmaShow many years ago.#RajKundra #shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/TcMFujKiyu — Dessie Aussie 🇮🇳🇭🇲 (@DessieAussie) July 19, 2021 -
కపిల్ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా?
మీరు హాయిగా నవ్వుకోవాలనుకుంటున్నారా? కపిల్ శర్మ షో చూడండి. మనసారా నవ్వాలనుకుంటున్నారా? అతడే చిరునామా. పగలబడి? డిటో. తండ్రి చిన్నప్పుడే కేన్సర్తో చనిపోయాడు. చదువుకోవడానికి డబ్బులు లేకపోతే టెలిఫోన్ బూత్లో పని చేశాడు. నవ్వించాలి అనుకుని నవ్వించి తీరాడు. కపిల్ శర్మ ఒక నవ్వుల అంబాసిడర్. సగటు మనిషి బాధలకుఅతడు కాసేపు పని చేసేదైనా సరే బెస్ట్ వ్యాక్సిన్. 2005. దేశంలో నవ్వుల విస్ఫోటనం జరిగింది. స్టార్ టీవీలో ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మొదలయ్యింది. దాని విజేతగా ‘సునీల్ పాల్’ పది లక్షలు బహుమతి గెలుచుకున్నాడు. మొదటిసారి దేశంలో ‘నవ్వు’కు ‘నవ్వించేవారికి’ చాలా డిమాండ్ వచ్చి పడింది. రోజువారి బతుకులో జనం కాసేపు నవ్వుకోవడానికి అవసరమైన ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారని ఈ షో హిట్ కావడం వల్ల తెలిసింది. ఇవాళ తెలుగు టీవీ చానల్స్లో ప్రసారం అవుతున్న కామెడీ షోస్కు ఈ ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మూలం. అలాంటి ప్రోగ్రామ్ ఆ సమయంలో చాలామందిని ఇన్స్పయిర్ చేసింది. అమృత్సర్కు చెందిన కపిల్ శర్మను కూడా. అమృత్సర్ కుర్రాడు కపిల్ శర్మ అమృత్సర్లో ఒక హుషారైన కుర్రాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అయితే కేన్సర్ బారిన పడి కుటుంబాన్ని కష్టాల్లో పడేశాడు. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కపిల్ నవ్వును ఒక ఔషధంగా తీసుకున్నాడు. ఫ్రెండ్స్ను బాగా నవ్వించేవాడు. జీవితంలో నవ్వును వెతుక్కునేవాడు. కపిల్ చాలా మంచి గాయకుడు. నాటకాలు వేసేవాడు. కాలేజీలు అతణ్ణి పిలిచి సీట్లు ఇచ్చేవి. మా కాలేజీలో చదివి మా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొను అని ఆహ్వానించేవి. కపిల్ శర్మ అలా కాలేజీల కోరిక మేరకు కమర్షియల్ ఆర్ట్ డిగ్రీని, కంప్యూటర్ కోర్సును చదివాడు. రెండూ అన్నం పెట్టలేదు. తాను నమ్ముకున్న నవ్వే అన్నం పెట్టింది. మొదట ఓడి తర్వాత గెలిచి 2005లో ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ చూసి 2006లో కపిల్ శర్మ ఆడిషన్స్కు వెళ్లాడు. అతను రిజెక్ట్ అయ్యి అతని ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు. కాని కపిల్ శర్మ ఓటమిని అంగీకరించలేదు. 2007లో మళ్లీ ఆడిషన్స్ కు వెళ్లాడు. ఈసారి సెలెక్ట్ అయ్యాడు. అంతేనా? పోటీదారులను దాటుకుని ఆ సీజన్ విజేతగా నిలిచాడు. ‘ఆ సమయంలో వచ్చిన 10 లక్షల డబ్బు నా చెల్లెలి పెళ్లికి ఉపయోగపడింది. లాఫ్టర్ చాలెంజ్లో గెలిచిన వెంటనే షోస్లో పాల్గొని 30 లక్షలు సంపాదించి చెల్లెలు పెళ్లి చేశాను’ అని కపిల్ శర్మ చెప్పుకున్నాడు. కపిల్ శర్మలో స్పీడ్, ఆర్గనైజ్ చేసే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షో ప్రారంభించి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత ‘ది కపిల్ శర్మ షో’ మొదలెట్టి హిట్ కొట్టాడు. అతని షో ఉన్న చానెల్ టిఆర్పిల్లో ముందుండేది. అందుకే చానల్స్ అతని కోసం వెంటపడ్డాయి. మరోవైపు ప్రయివేట్ షోస్, టూర్స్ అతి త్వరలో కపిల్ సంపన్నుడు అయిపోయాడు. ‘నా షోలో పాల్గొంటానని మీరు కల్లో అయినా అనుకున్నారా’ అని అమితాబ్ వంటి పెద్దలను తన షోలో అడిగి నవ్విస్తాడు కపిల్ శర్మ. నిజానికి అమితాబ్ లాంటి వాళ్లు ‘నేను నీ షోకు వస్తానని కల్లో అయినా అనుకున్నావా’ అని అడగాలి. కాని కపిల్ శర్మ రివర్స్. తన షోకు వచ్చిన సెలబ్రిటీలను మధ్యతరగతి సగటు మనషికి ఉండే డౌట్స్ అడుగుతాడు కపిల్ శర్మ. తన షోకు వచ్చినవారి గురించి పూర్తి హోమ్వర్క్ చేసి వారి మీద పంచ్లు వేస్తాడు కపిల్ శర్మ. అందుకే అతను షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారికి కూడా చాలా ఇష్టమైన కమెడియన్ అయ్యాడు. గతంలో రాజూ శ్రీవాత్సవ్, జానీలీవర్ వంటి కామెడీ స్టార్లు షోలు చేశారు. కాని వారికి కపిల్ శర్మ అంతటి సక్సెస్ రాలేదు. కపిల్లో ఉండే స్పాంటేనిటీ, నవ్వు, వెకిలితనం లేకుండా నవ్వు రాబట్టగలిగే ప్రతిభ అందుకు కారణం. డిప్రెషన్: కపిల్ తనకొచ్చిన పేరుకు తానే భయపడిపోయాడు. ఇది అందరు సెలబ్రిటీలకు ఉండే సమస్యే. కాని కపిల్ ఎక్కువ భయపడ్డాడు. ఈలోపు తన షో పార్ట్నర్ సునీల్ గ్రోవర్ అతనితో విడిపోయాడు. స్క్రిప్ట్స్ రాసేవాళ్లు కొందరు వెళ్లిపోయారు. ఈర్ష్యాసూయలు అతని మీద దుష్ప్రచారం చేశాయి. ఆ సమయంలో కపిల్ షో మూతపడింది. అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కపిల్ శర్మ ఔట్ అని చాలామంది అనుకున్నారు. కాని కపిల్ తన గర్ల్ఫ్రెండ్ జిన్నిని వివాహం చేసుకున్నాక ఆమె సపోర్ట్తో ఒకటిన్నర సంవత్సరం తర్వాత తిరిగి షో ప్రారంభించాడు. ఈసారి అతని శ్రద్ధ, ప్రవర్తన చూసి మెల్లగా ప్రేక్షకులు అతనికి పూర్వవైభవం తెచ్చారు. ఇప్పుడు ‘ది కపిల్ శర్మ’ షో అత్యంత సక్సెస్ఫుల్ షోగా నిలిచి ఉంది. మొన్నటి ఏప్రిల్ 2తో కపిల్ శర్మకు 40 ఏళ్లు వచ్చాయి. ఒక వ్యక్తి నలభై ఏళ్లకు ఎవరి మద్దతు లేకుండా ఇంత స్థాయికి ఎదగడం చాలా స్ఫూర్తినిచ్చే విషయం. -
వీల్చైర్లో కమెడియన్.. ఆందోళనలో ఫ్యాన్స్!
ముంబై: బాలీవుడ్ నటుడు, స్టార్ కమెడియన్ కపిల్ శర్మ వీల్చైర్లో ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కపిల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఇప్పటికే సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారు. అత్యంత ఆదరణ పొందిన కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’కు విరామం ఇస్తున్నట్లు కపిల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య గిన్నీ చరాత్ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆమెకు దగ్గరగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ జంట ఫిబ్రవరి 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ శుభవార్తను కూడా కపిల్ అభిమానులతో పంచుకున్నాడు. వీల్చైర్లో కపిల్: ఫొటో కర్టెసీ: వైరల్ భయానీ అంతా సక్రమంగా సాగుతుందనుకున్న వేళ ముంబై ఎయిర్పోర్టులో కపిల్ వీల్చైర్లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కలవరానికి గురయ్యారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కపిల్.. ‘‘నేను బాగానే ఉన్నాను. జిమ్లో వర్కౌట్లు చేస్తున్నపుడు వీపు భాగంలో గాయమైంది. త్వరగానే కోలుకుంటాను. నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. కాగా బుల్లితెరపై ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా కపిల్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక 2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్ను పెళ్లి చేసుకోగా.. ఈ దంపతులకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రెండోసారి తండ్రైన స్టార్ కమెడియన్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ రోజు ఉదయం ఆయన భార్య గిన్ని చరాత్ పండంటి మగ బిడ్డకు జన్మినించారు. ఈ విషయాన్ని కపిల్ శర్మ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. ‘నమస్కార్.. ఈ రోజు ఉదయం నా భార్య మగ బిడ్డకు జన్మినించింది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటీనటులు, అభిమానులు కపిల్కు శభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి చిన్న అతిథి రాబోతున్నాడన్న శుభవార్తను గతవారం కపిల్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: అందుకే బ్రేక్ తీసుకుంటున్నా: కపిల్ శర్మ) 2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో వివాహం చేసుకున్న కపిల్ శర్మ-గిన్ని చరాత్లకు 2019 డిసెంబర్లో కూతురు అనైరా శర్మ జన్మించింది. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. Namaskaar 🙏 we are blessed with a Baby boy this early morning, by the grace of God Baby n Mother both r fine, thank you so much for all the love, blessings n prayers 🙏 love you all ❤️ginni n kapil 🤗 #gratitude 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) February 1, 2021 -
చిన్నప్పటి ఫోటో: స్టార్ కమెడియన్ను గుర్తుపట్టారా!
మనకు బాగా తెలిసిన సెలబ్రిటీలను తమ చిన్నప్పటి ఫోటోలు చూస్తే సులభంగా గుర్తుపట్టేస్తాం.. కానీ కొంత మందిని మాత్రం ఎంత చూసిన వారు వీరేనని గుర్తించడం చాలా కష్టం.. పేరు చెబితే కానీ వాళ్లేవరో అస్సలు మనసుకు తట్టదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ బ్యాలం నాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ఉన్న ఈ చిత్రంలో తలపై క్యాప్ ధరించి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న వ్యక్తి హిందీ బుల్లితెరపై పాపులర్ హాస్యనటుడు. పక్కన ఉన్నది తన సోదరుడు. ఇది సరిగ్గా 28 ఏళ్ల క్రితం దిగిన ఫోటో. దీన్ని చూస్తుంటే అతనెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. చదవండి: బ్రేక్ తీసుకుంటున్నా: స్టార్ కమెడియన్ అయినప్పటికీ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఏంటీ సాధ్యపడటం లేదా. సరే ఇక మేమే సమాధానం చెప్తాం. అతనెవరో కాదు.. బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ. అవును కపిల్, తన సోదరుడితో కలిసి 28 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ ఫోటో తీసినప్పుడు కపిల్కు 11 ఏళ్లు కాగా ఇప్పుడు 39 సంవత్సరాలు. అంతేగాక గతేడాది నవంబర్లో కపిల్ ఇంటర్ చదువుతున్నప్పటి ఓ ఫోటోను ఆయన ఫ్యాన్స్ పేజీలో షేర్ చేశారు. ఇదిలా ఉండగా విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’ కొన్నాళ్లపాటు వాయిదా పడనున్న విషయం తెలిసిందే. కపిల్ శర్మ భార్య గిన్నీ చరాత్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కావడంతో కొన్ని రోజులు కుటుంబంతో కలిసి గడిపేందుకు షోకు బ్రేక్ చెప్పాడు. View this post on Instagram A post shared by Kapil Sharma (@kapilsharma) -
బ్రేక్ తీసుకుంటున్నా: స్టార్ కమెడియన్
ముంబై: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’ కొన్నాళ్లపాటు వాయిదా పడనుంది. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారాలు నిలిచిపోనున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కపిల్ శర్మ నిర్ధారించారు. అయితే పూర్తిగా షో ముగిసిపోదని, చిన్న బ్రేక్ మాత్రమేనని అతడు పేర్కొన్నాడు. అదే విధంగా.. తాము త్వరలోనే మరో బుల్లి అతిథిని ఇంట్లోకి ఆహ్వానించబోతున్నామంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా కపిల్ శర్మ గురువారం ట్విటర్లో ఫ్యాన్స్తో ముచ్చటించాడు. (చదవండి: కమెడియన్కు రూ. 5.5 కోట్ల కుచ్చుటోపి!) ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... ‘‘అవును కపిల్ శర్మ షోకి చిన్న విరామం ఇస్తున్నా. అంతేగానీ పూర్తిగా కాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా భార్యకు తోడుగా ఉండాలి. ఎందుకంటే మా రెండో బిడ్డ త్వరలోనే ప్రపంచంలోకి రానుంది. అందుకే ఈ బ్రేక్’’ అని కపిల్ శర్మ స్పష్టం చేశాడు. ఇక తమకు పుట్టబోయేది పాపైనా, బాబు అయినా ఫర్వాలేదని, అనైరాకు తోబుట్టువు రావడమే సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్ను కపిల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది. -
ముద్దు పెట్టలేదని రిజెక్ట్ చేసింది: అక్షయ్
బాలీవుడ్లో సక్సెస్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు ఖిలాడి హీరో అక్షయ్ కుమార్. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. పూర్తిగా కమర్షియల్ చిత్రాలనే కాక.. తనలోని నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు కూడా చేస్తూ.. విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా హౌస్ఫుల్ 4 ప్రమోషన్లో భాగంగా అక్షయ్, కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్, రిజెక్షన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అక్షయ్. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్కు వెళ్లాను. అంటే తనతో కలిసి సినిమాకు వెళ్లి అట్నుంచి అటే రెస్టారెంట్కి వెళ్లి భోంచేసే వాళ్లం. అయితే నాలో ఉన్న సమస్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. తనతో బయటకు వెళ్లినప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయడం.. తన చేతిని పట్టుకోవడం.. కిస్ చేయడం లాంటివి చేయలేదు. దాంతో ఆమె నన్ను రిజెక్ట్ చేసింది’’ అన్నారు. అయితే దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు ప్రపోజ్ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉటుంది. కానీ మీరేమో ముద్దు పెట్టలేదు అందుకే వదిలేసింది అంటున్నారు.. బహుశా మీరే తప్పులో కాలేసిట్లున్నారు. అయినా మీకు ట్వింకిల్ లాంటి అందమైన భార్య లభించాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసింది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్) ఇక అక్షయ్-ట్వింకిల్ ఖన్నాల వివాహ బంధానికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ‘‘నేను నీతో భాగస్వామ్యంలో ఉన్నాను... మనం ఇరవై సంవత్సరాల సమైక్యతకు చిహ్నంగా నిలిచాము. నువ్వు ఇప్పటికీ నా హృదయాన్ని కదిలిస్తావు.. నన్ను నడిపిస్తావు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ నవ్వు నన్ను సేదదీరుస్తుంది. వార్షికోత్సవ శుభాకాంక్షలు టీనా’’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అక్షయ్ కుమార్. ఇక ప్రస్తుతం ఆయన బచ్చన్ పాండే చిత్రంలో నటిస్తున్నారు. -
కమెడియన్కు రూ. 5.5 కోట్ల కుచ్చుటోపి!
ముంబై: ప్రముఖ కమెడి కింగ్ కపిల్ శర్మకు ముంబై క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం సమన్లు ఇచ్చింది. ఇటీవల ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ రిజిస్టర్డ్ కార్ల కేసులో ఆయన స్టెట్మెంట్ కోసం ఏపీఐ సచిన్ వాజ్ ఆయనను పలిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ ఈరోజు మధ్యాహ్నం ముంబ్రై క్రైం బ్రాంచ్ కార్యాలయంలో హజరయ్యారు. ఆనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వానిటీ వ్యాన్ కారు తయారి కోసం ఇటీవల కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రియాకు 5.5 కోట్ల రూపాయలను చెల్లించాను. అయితే అతడు డబ్బులు తీసుకుని నా పని చేయకుండ తప్పించుకుని తిరుగుతున్నాడు. (చదవండి: ఆ సమయంలో చనిపోవాలనుకున్న: హీరో రాజా) దీంతో నేను ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కు గతేడాది ఫిర్యాదు చేశాను. చాబ్రియాపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు పేపర్లో చదివాను. దీంతోనే ముంబై కమిషనర్ను కలవాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే నా వాంగ్ములం తీసుకునేందుకు పోలీసులు పిలిచారు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా డిసెంబర్ 9న చాబ్రియాను అరెస్టు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, 465, 467, 468, 471, 120(బీ) చట్టం కింద కేసు నమోదు చేశారు. -
‘మీరు సారీ చెప్తారా.. దేవుడి లీల’
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. తర్వాత ఒకరికొకరు క్షమాపణలు కొరతారు. కొన్ని సార్లు ఎవరు తప్పు చేస్తే వారే ముందుగా సారీ చెప్తారు. వివాహ బంధంలో ఇవన్నీ సహజం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. అయితే తమ మధ్య గొడవలు వస్తే ముందుగా తానే సారీ చెప్తాను అంటున్నారు అందాల నటి ఐశ్యర్య రాయ్. అభిషేక్తో గొడవపడితే తానే ముందుగా క్షమాపణలు కోరతానని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఇది పాత వీడియో. దీనిలో కపిల్ శర్మ, ఐశ్యర్య రాయ్, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. ఇక వీడియో విషయానికి వస్తే కపిల్ శర్మ, ఐశ్వర్యని ఉద్దేశించి.. ‘అభిషేక్తో గొడవపడితే.. ముందుగా ఎవరు క్షమాపణలు కోరతారు’ అని ప్రశ్నిస్తాడు. వీరి సంభాషణ పూర్తి కాకముందే నవజోత్ మధ్యలో కల్పించుకుని.. ‘అసలు ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. అభిషేకే ముందుగా సారి చెప్తాడు’ అంటారు. (చదవండి: అందం, అణకువల కలబోత) View this post on Instagram A post shared by @aishwariarai_georgia on Oct 20, 2020 at 12:32am PDT దాంతో ఐశ్యర్య ‘అలా ఏం కాదు. తనతో గొడవపడితే ముందుగా నేనే సారీ చెప్తాను. గొడవను కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేనే క్షమాపణ చెప్తాను’ అని తెలిపారు. ఈ సమాధానం విని కపిల్ శర్మ ఒక్క నిమిషం స్టన్ అవుతాడు. ‘మీరు సారీ చెప్తారా.. ఇంత అందమైన భార్య క్షమాపణలు కోరడం అంటే నిజంగా దేవుడి లీలే’ అంటాడు. దాంతో ఐశ్వర్యతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. అభిషేక్, ఐశ్వర్యల వివాహం 2007లో జరిగింది. వీరికి ఓ కుమార్తె ఆద్యా ఉన్నారు. ఇక తాజాగా ఐశ్యర్య పుట్టిన రోజు సందర్భంగా అభిషేక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరిద్దరు గులాబ్జామూన్ అనే చిత్రంలో నటించనున్నారు. -
క్షమాపణలు కోరిన స్టార్ కమెడియన్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కాయస్థ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాడు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తన బృందం తరఫున తాను క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నాడు. అసలు విషయమేమిటంటే.. మార్చి 28న ప్రసారమైన ది కపిల్ శర్మ షోలో చిత్రగుప్తుడి గురించి జోకులు పేల్చారు. ఈ నేపథ్యంలో తమ ఆరాధ్య దైవమైన చిత్రగుప్తుడి గొప్పతనాన్ని అసహాస్యం చేశారంటూ కాయస్థ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం అఖిల్ భారతీయ కాయస్థ సభ అధినేత కపిల్కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కపిల్ శర్మను బాయ్కాట్ చేయడంతో పాటుగా.. అతడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని హెచ్చరించారు.(బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు) ఇక ఈ విషయంపై స్పందించిన కపిల్ శర్మ తాజాగా వారిని క్షమాపణలు కోరాడు. ఈ మేరకు.. ‘‘ప్రియమైన కాయస్థ సమాజానికి నమస్కారం. చిత్రగుప్తుడిపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. ఇతరుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మీరంతా ఎల్లప్పుడూ సంతోషంగా, క్షేమంగా నవ్వుతూ ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా. హృదయపూర్వక నమస్కారాలు’’అని కపిల్ ట్వీట్ చేశాడు.(నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా) प्यारे कायस्थ समाज के लिए 🙏 @kayasthasabha @SubodhKantSahai pic.twitter.com/sord7gTxba — Kapil Sharma (@KapilSharmaK9) May 21, 2020 -
స్టార్ కమెడియన్కు అభిమానుల బిగ్ సర్ప్రైజ్
తమ అభిమాన నటుడు వస్తున్నాడంటే ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా ఉండదు. ఇక ఆ కార్యక్రమం అభిమాన నటుడికి సైతం చిరకాలం గుర్తుండిపోవాలని కొంతమంది అభిమానులు ఓ ఐడియా వేశారు. అది చూసిన బాలీవుడ్ ప్రముఖ కమెడియన్, నటుడు, వ్యాఖ్యాత కపిల్ శర్మకు ఆనందంతో నోట మాట రానంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘ద కపిల్ శర్మ షో’ టీమ్ తొలిసారిగా విదేశాల్లో లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. దీనికోసం కపిల్, తన తల్లిని వెంటబెట్టుకుని టీమ్తో సహా దుబాయ్కు వెళ్లాడు. అక్కడ లైవ్ ప్రోగ్రాంకు హాజరైన అభిమానులు ఈ కమెడియన్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. కపిల్ ముద్దుల కూతురు అనైరా ఫొటోలు ఉన్న టీషర్టులతో కార్యక్రమానికి హాజరయ్యారు. అది చూసిన ఈ కమెడియన్ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారంటూ దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. అందులో చాలామంది యువతీయువకులు బ్లాక్ టీ షర్ట్పై అనైరా చిత్రం ఉన్న దుస్తులను ధరించి ఉన్నారు. కాగా కపిల్ శర్మ- గిన్ని చత్రత్ దంపతులకు అనైరా గతేడాది డిసెంబర్ 10న జన్మించింది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్న ఈ నటుడు తన గారాలపట్టి ఆడుకోడానికి ఓ గిటార్ను సైతం కొనుగోలు చేశాడు. చదవండి: అమ్మాయి పుట్టింది: కపిల్ శర్మ కూతురి ఫొటో షేర్ చేసిన స్టార్ కమెడియన్ -
కమెడియన్ కూతురు ఫొటో వైరల్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తొలిసారిగా తన కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కూతురిని ఆత్మీయంగా చూస్తున్న ఫొటోకు... ‘ మా హృదయం అనైరా శర్మ’ అనే క్యాప్షన్ జతచేసి తన పేరును వెల్లడించాడు. ఈ క్రమంలో అనైరా ఫొటో క్షణాల్లో వైరల్గా మారింది. గంట సేపట్లోనే ఐదున్నర లక్షలకు పైగా లైకులు సాధించి దూసుకుపోతోంది. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్ను కపిల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు గత నెలలో కుమార్తె జన్మించింది. View this post on Instagram Meet our piece of heart “Anayra Sharma” ❤️ 🙏 #gratitude A post shared by Kapil Sharma (@kapilsharma) on Jan 15, 2020 at 2:56am PST -
అమ్మాయి పుట్టింది: కపిల్ శర్మ
‘అమ్మాయి పుట్టింది. మీ అందరి ఆశీస్సులు కావాలి. జై మాతాదీ... లవ్ యు ఆల్’ అంటూ బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తనకు కూతురు జన్మించిన విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేశాడు. ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్, సింగర్ గురురాంధవా తదితర సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కపిల్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతేడాది తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్ను కపిల్ వివాహమాడిన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య డిసెంబరు 12న వీరి వివాహ వేడుక పంజాబీ సంప్రదాయ ప్రకారం జరిగింది. ఈ క్రమంలో కపిల్ తన హోం టౌన్ అమృత్సర్లో డిసెంబరు 14న సన్నిహితుల కోసం, ముంబైలో డిసెంబరు 24న ఇండస్ట్రీ ప్రముఖుల కోసం.. రెండు రిసెప్షన్ పార్టీలు ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తనకు తండ్రిగా ప్రమోషన్ రావడంతో కపిల్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాడు. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ.. స్టార్ కమెడియన్గా ఎదిగాడు. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్గా కూడా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ‘ద కపిల్ శర్మ షో’తో కపిల్ బిజీగా ఉన్నాడు. Blessed to have a baby girl 🤗 need ur blessings 🙏 love u all ❤️ jai mata di 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) December 9, 2019 -
అప్పుడే సిగరెట్ తాగడం మానేశా: నటి
‘రెండేళ్ల క్రితం... నా ప్రియమైన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో భాగంగా స్మోకింగ్ మానేశా. టర్కీకి వెళ్లాను. నికోటిన్, పొగ లేనేలేదు. అప్పటి నుంచి మళ్లీ దాని జోలికే వెళ్లలేదు. అయితే అది చాలా కష్టమైన పని. నిజానికి నరకం. కానీ ఇప్పుడు నా శరీరం పొగను తిరస్కరిస్తోంది. పొగ తాగేవాళ్లు ఉన్నచోట ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. జాన్ గ్రీన్ అన్నట్లుగా.. వదిలేంత వరకు కష్టమే కానీ ఒక్కసారి ఆ అలవాటు వదిలేస్తే ప్రపంచంలో అంతకన్నా తేలికైన విషయం మరోటి ఉండదు. ఇదంతా ఇప్పుడెందుకు అనే కదా మీ అనుమానం. కాస్త ఆగండి. ఒక నటిగా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇష్టపడేవాళ్లతో పాటు విమర్శించే వాళ్లు, తిట్టుకునే వాళ్లూ ఉన్నారు. వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పోస్టు’ అంటూ నటి సుమోనా చక్రవర్తి తాను పొగత్రాగడం మానేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సిగరెట్ కాలిపోతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సుమోనా... ‘నేను వదిలేశా... మరి మీరు?’ అంటూ ధూమపానం మానుకోవాలని సూచించారు. కాగా పలు హిందీ సీరియళ్లలో నటించిన సుమోనా కపిల్ శర్మ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందారు. ఇక పొగ తాగొద్దంటూ ప్రచారం నిర్వహించిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా... తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి, భర్తతో కలిసి ధూమపానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొగ తాగడాన్ని నిషేధించాలంటూ సుమోనా సోషల్ మీడియా వేదికగా పిలుపునివ్వడం విశేషం. View this post on Instagram 2 Years Ago! the week following a dear friend’s bday... I QUIT. Simply went cold turkey. No nicotine patch, no vape. Nothing. Haven’t touched since then. Was it difficult, hell yeah. But now my body rejects smoke. Cant stand in a room where ppl are smoking anymore. . “It is so hard to leave- Until you leave. And then it is the easiest goddamned thing in the world” - John Green . . Why am i sharing this? Because being an actor is a part of my life. People follow us. Like us. Love us. Criticise us. Admire us. Hopefully with this i can inspire a few. The most important reminder being we are all flawed human beings which is quite non existent on social media. So here’s a small dose of reality. #soonerthebetter #itsnevertoolate #allthatglittersisnotgold A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on Jul 23, 2019 at 11:13am PDT -
మల్లికా శెరావత్కు వింత అనుభవం
ముంబై: తన ఉదరం(బెల్లీ)పై కోడిగుడ్డు ఫ్రై చేసేందుకు ఓ నిర్మాత ఉబలాటపడ్డాడని బాలీవుడ్ కథానాయిక మల్లికా శెరావత్ వెల్లడించారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన వింత అనుభవాలను కపిల్ శర్మ కామెడీ షోలో పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా కొత్తగా ఏదైనా చేయాలని నిర్మాత భావించాడు. నన్ను చాలా హాట్గా చూపించాలని ఉబలాటపడ్డాడు. ఈ పాటలో నీ ఉదరంపై కోడిగుడ్డు ప్రై చేసినట్టు చూపిస్తానంటూ కొరియోగ్రాఫర్ ద్వారా అడిగించాడు. ఇది అక్షరాల నిజం. వాస్తవానికి నిర్మాతే నన్ను అడగాలనుకున్నాడ’ని మల్లికా శెరావత్ వెల్లడించారు. దీనికి మీరు ఒప్పుకున్నారా అని సహ వ్యాఖ్యాత అర్చనా పూరన్ సింగ్ అడగ్గా.. ఒప్పుకోలేదని మల్లిక జవాబిచ్చారు. తనకు ఎదురైన మరో వింత అనుభవం గురించి ఇటీవల మరో సందర్భంలో మల్లిక చెప్పారు. కొత్తదనం పేరుతో ఓ పాటలో తన నడుముపై వేడివేడి రోటీలు చేస్తున్నట్టు చూపిస్తానని ఒక దర్శకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడట. చాలా మంది నటులు తమ ప్రియురాళ్లకు అవకాశం ఇచ్చి తనను పక్కన పెట్టడంతో 30 సినిమాల వరకు పోగొట్టుకున్నానని మల్లిక వాపోయారు. వాళ్లను ఇప్పుడు తలచుకుంటే బుద్ధిహీనుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. శృంగార తారగా తన మీద ముద్ర పడటంతో తమతో సన్నిహితంగా గడపాలని చాలా మంది నటులు అడిగారని తెలిపారు. తెరపై అలాంటి దృశ్యాల్లో కనిపించినప్పడు ఏకాంతంగా తమతో గడపటానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించేవారని చెప్పారు. ఇలా చేయడం ఇష్టం లేక ఎన్నో సినిమాలు వదులుకున్నానని, మన దేశంలో నాలాంటి మహిళలను సమాజం ఏవిధంగా చూస్తుందనే దానికి ఈ ఘటనలు అద్దం పడతాయని అన్నారు. -
వాళ్లుండగా నేనెందుకని వెళ్లలేదు: కమెడియన్
ముంబై : బాలీవుడ్ ఫేమస్ కామెడీ షో ‘‘ది కపిల్ శర్మ షో’’ గురించి తెలియని వాళ్లుండరు. కపిల్ శర్మ హోస్ట్గా వ్యవహరించిన ఈ షో ఎంతో ప్రజాధరణ పొందింది. అయితే షోలో నటించిన సునీల్ గ్రోవర్కు కపిల్ శర్మకు విభేదాలు తలెత్తడంతో షో మూసుకోవాల్సి వచ్చింది. షో ఆగినా కపిల్, సునీల్ల మధ్య యుద్ధం మాత్రం ఆగలేదు. ట్విటర్ వేదికగా ఒకరినొకరు తెగ విమర్శించుకున్నారు. అప్పట్లో వీరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఉండేది పరిస్థితి. ప్రస్తుతం వేడి వాతావరణం కొద్దిగా చల్లబడినట్టుగానే అనిపిస్తోంది. సునీల్ గ్రోవర్కు శుభాకాంక్షలు తెలుపుతూ కపిల్ చేసిన ఓ ట్వీట్.. దానికి సునీల్ స్పందన రెండూ ఇప్పుడు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కపిల్ శర్మ చాలా రోజుల తర్వాత ‘‘ది కపిల్ శర్మ షో సీజన్2’’ పేరిట తన షోను పునప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాలో సునీల్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం సల్మాన్, కత్రినాలు కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ బుధవారం సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్రబృందానికి కపిల్ శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్, కత్రినా, సునీల్ ఇలా పేరుపేరున కపిల్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే కపిల్ శర్మ షోకు ఎందుకు వెళ్లలేదని సునీల్ను ప్రశ్నించగా.. ‘‘సల్మాన్, కత్రినాలు ప్రమోషన్ చేస్తుండగా నా అవసరం ఏముంటుంది. అంతేకాకుండా నా మనసు వెళ్లడానికి అంగీకరించలేదు కాబట్టి వెళ్లలేద’’ని చెప్పటం గమనార్హం. -
ఫ్యాన్స్కు కపిల్ వెడ్డింగ్ గిఫ్ట్!
బాలీవుడ్లో ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు దీప్వీర్, ప్రియానిక్ల వివాహ వేడుకలతో బిజీగా ఉన్న బీ- టౌన్ సెలబ్రిటీస్ మరో గ్రాండ్ వెడ్డింగ్కు సిద్ధమవుతున్నారు. స్టార్ కమెడియన్ కపిల్ శర్మ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న తన చిరకాల స్నేహితురాలు గిన్ని చరాత్తో ఏడడుగులు వేయనున్నాడు. అయితే దీప్వీర్, ప్రియానిక్ల పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు రెండు రోజుల వరకు బయటకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా కపిల్ తన అభిమానుల కోసం యూట్యూబ్ చానల్లో పెళ్లి వేడుకను లైవ్స్ట్రీమింగ్ చేయనున్నాడు. పెళ్లి కంటే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 11 నుంచే లైవ్స్ట్రీమింగ్ మొదలుకానుంది. ‘కపిల్ శర్మా కీ షాదీ హై!! పూరే ఇండియా కో ఆనా హై’ (కపిల్ శర్మ పెళ్లికి భారత్ మొత్తం రావాలి)పేరిట ‘కపిల్ పెళ్లి పిలుపు’లకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో కపిల్ పెళ్లి కోసం పంజాబ్కు వెళ్లాల్సిన పని లేకుండానే హాయిగా ఎక్కడ ఉన్నా సరే పెళ్లి వేడుక వీక్షించవచ్చు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా అత్యంత సన్నిహితుల మధ్య కపిల్ పెళ్లి వేడుక పంజాబీ సంప్రదాయ ప్రకారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి కూడా. ఇక హోం టౌన్ అమృత్సర్లో డిసెంబరు 14న సన్నిహితుల కోసం, ముంబైలో డిసెంబరు 24న ఇండస్ట్రీ ప్రముఖుల కోసం.. కపిల్ రెండు రిసెప్షన్ పార్టీలు ఇవ్వనున్నాడు. -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ కమెడియన్
స్టార్ కమెడియన్, నటుడు, నిర్మాత కపిల్ శర్మ పెళ్లి తేదిని ప్రకటించాడు. ఈ ఏడాది డిసెంబర్ 12న తన ప్రేయసి గిన్నీ ఛత్రాత్ను వివాహం చేసుకొబోతున్నట్లు వెల్లడించాడు. అనంతరం డిసెంబర్ 14న ముంబైలో బాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. వివాహ వేడుక మాత్రం గిన్ని స్వంత ఊరైన జలంధర్లో జరగనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం గురించి కపిల్ ‘పెళ్లి చాలా సింపుల్గా చేసుకోవాలని భావించాను. కానీ నా వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని మా అమ్మ కోరిక. ఎందుకంటే నా సోదరుడు, సోదరి వివాహ సమయంలో మా ఆర్థిక పరిస్థితులు ఇప్పటిలా లేవు. దాంతో వారి వివాహాన్ని చాలా సింపుల్గా చేశాము. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో నా పెళ్లైనా ఘనంగా చేయాలని మా అమ్మ ముచ్చటపడుతోంది. ఆమె సంతోషం కోసం నేను కూడా ఇందుకు అంగీకరించాను’ అని తెలిపారు. అంతేకాక ‘గిన్ని కూడా తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వారు కూడా తమ కుమార్తె వివాహాం గురించి ఎన్నో కలలు కన్నారు. వారి సంతోషాన్ని కాదనడం సరికాదనిపించింది. అందుకే నా వివాహ వేడుక చాలా ఘనంగా జరుగుతుంది’ అని తెలిపారు. ఇన్ని రోజులు కపిల్ తాను తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన పంజాబీ చిత్రం ‘సన్నాఫ్ మన్జీత్ సింగ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 12 విడుదలయ్యింది. -
పెళ్లిపీటలెక్కనున్న స్టార్ కమెడియన్!
స్టార్ కమెడియన్, బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. డిసెంబరులో తన గర్ల్ఫ్రెండ్ జిన్నీని కపిల్ వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ‘అమృత్సర్లో పంజాబీ సంప్రదాయంలో, నాలుగు రోజుల పాటు కపిల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా బీ- టౌన్ సెలబ్రిటీలంతా పంజాబ్ చేరుకుంటారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ముంబైలో కపిల్ రిసెప్షన్ పార్టీ ఉంటుందని’ వారు పేర్కొన్నారు. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ స్టార్ కమెడియన్గా గుర్తింపు పొందాడు. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్గా కూడా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా అక్టోబరు 12న విడుదల కానుంది. ఇక జిన్నీతో తనకున్న అనుబంధాన్ని 2017లో ట్విటర్ వేదికగా కన్ఫామ్ చేసిన కపిల్ త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నాడు. -
బాలీవుడ్లో ట్వీట్లు.. తిట్లు
సాక్షి, న్యూఢిల్లీ: తనను బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని చూస్తున్నారని బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్ శర్మ ఆరోపించారు. ఈ మేరకు స్పాట్ బాయ్ ఎడిటర్ విక్కీ లాల్వాణీ, గతంలో తన వద్ద మేనేజర్లుగా పనిచేసిన ప్రీతి సిమోస్, నీతి సిమోస్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే నిందారోపణలు చేస్తున్నారంటూ ట్విటర్ వేదికగా వారిపై బూతు పురాణం మొదలు పెట్టారు. మీడియాపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పాట్ బాయ్ డిజిటల్ మీడియాలో తన కెరీర్పై, ఆర్థికాంశాలపై, ఇతరులతో ఉన్న సంబంధాలపై అనుచిత విమర్శలు చేసి మానసికంగా కుంగదీశారని కపిల్ తన ఫిర్యాదులో వాపోయారు. ప్రీతి సిమోస్, నీతి సిమోస్లతో కలిసి డిజిటల్ మీడియా వేదికగా లాల్వాణీ తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీని కపిల్ తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఎవరికీ భయపడను.. ‘కొందరు మూర్ఖులు మన పేరుని మసకబార్చి డబ్బులు నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. లేనిపోని ఆరోపణలు చేస్తారు. కానీ, ఒక్క విషయం. అబద్ధాన్ని నిజమని నమ్మించానికి కొన్ని యుగాలైనా సరిపోవు’ అంటూ కపిల్ ట్వీటాడు. కపిల్ చేసిన అసభ్యకర ట్వీట్లను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే కొద్ సేపటికే వాటన్నింటిని తొలగించారు. తర్వాత తన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైందనీ.. తిట్లతో కూడిన ట్వీట్లు తనవి కావని కపిల్ మరో ట్వీట్ చేశారు. అందరికీ హాయ్..! నా అకౌంట్ హ్యాకింగ్ గురికాలేదు. నేను పెట్టిన ట్వీట్లను నా సహచరుల ఒత్తిడి మేరకు తొలగించాను.. అంటూ కపిల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి కుక్కల మాటలకు నేను భయపడను. చిల్లర కోసం ఎంతకైనా దిగజారే చెత్తగాళ్లు.. అంటూ లాల్వాణిని ఉద్దేశించి కపిల్ మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కపిల్ శర్మ బుల్లితెరపై మొదలుపెట్టిన ‘ఫ్యామిలీ టైం విత్ కపిల్ శర్మ’ ప్రోగ్రాం ఎంటర్టైన్మెంట్ను కాకుండా పుకార్లను బాగా ప్రసారం చేస్తోందనే విమర్శల కారణంగా అది ఫ్లాప్ షో గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. -
నేనే పీఎం అయితే, వాళ్లను ఉరితీసేవాణ్ణి!
సాక్షి, ముంబై: కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సల్మాన్ భాయ్కి విధించిన శిక్ష చాలా కఠినమైనదని, ఇప్పటికే ఆయన జీవితంలో ఎన్నో అనుభవించాడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ చేసిన ఎన్నో మానవతా సేవా కార్యక్రమాలను గుర్తించాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ కపిల్శర్మ కూడా సల్మాన్ మద్దతుగా ముందుకొచ్చాడు. సల్మాన్ చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించకుండా అతనికి న్యాయవ్యవస్థ తీవ్ర విధించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను ఎంతోమంది బడాబాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనేవాళ్లు. వాళ్లను నేను కలిశాను. సల్మాన్ మంచి వ్యక్తి. ఆయన ప్రజలకు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఆ తప్పు చేశారో లేదా తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు’ అంటూ కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే నకిలీ, వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తుందంటూ మరో ట్వీట్లో మీడియాపై మండిపడ్డారు. ‘మీ పేపర్లు అమ్ముకునేందుకు నెగిటివ్ కథనాలు రాయకండి. అతను మంచి వ్యక్తి. త్వరలోనే జైలునుంచి బయటకు వస్తాడు. ఎంతో పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా మీరు మాట్లాడారు. నెగిటివ్ వార్తలు ప్రచారం చేసేందుకు ఎంతో తీసుకుంటారు’ అంటూ ఓ వెబ్సైట్ను ఉద్దేశించి దుర్భాషలాడారు. ‘చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేస్న్యూస్ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని’ అంటూ కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన ట్వీట్లపై విమర్శలు రావడంతో ఆయన వాటిని డిలీట్ చేశారు. ఆ ట్వీట్లను పట్టించుకోవద్దని, తన అకౌంట్ను హ్యాక్ చేశారని మరో ట్వీట్లో కపిల్ శర్మ తెలిపాడు. ఈ ట్వీట్ల వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఆ ట్వీట్ను కూడా కపిల్ శర్మ తొలగించడం గమనార్హం. Bhai @KapilSharmaK9 tere tweets tere naye show se jyada funny hain. 😂😂 pic.twitter.com/XiClPvhBXn — PhD in Bakchodi (@Atheist_Krishna) April 6, 2018 -
రచ్చకెక్కిన కమెడియన్లు..!
సాక్షి, ముంబై : ప్రముఖ బాలీవుడ్ కామెడీ షో ‘‘ది కపిల్ శర్మ షో’’ హోస్ట్ కపిల్ శర్మ, కమెడియన్ సునీల్ గ్రోవర్ల గొడవ ఇప్పుడు రచ్చకెక్కింది. ట్విటర్ వేదికగా వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శనివారం సునీల్ గ్రోవర్ తన ట్విటర్ ఖాతాలో ఓ అభిమానికి ఇచ్చిన సమాధానం గొడవకు ఆజ్యం పోసినట్లైంది. కపిల్ కొత్త షో నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని, తను కూడా కపిల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లు సునీల్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా కపిల్ శర్మ స్పందిస్తూ.. ‘‘సునీల్ అబద్దం చెబుతున్నాడు. నేను వందల సార్లు సునీల్కు ఫోన్ చేశాను. సునీల్ గ్రోవర్ ఇంటికి నా మనషులను పంపించాను. స్వయంగా నేను కూడా వెళ్లాను. అయిందేదో అయిపోయింది నా పేరు పాడు చేయాలని చూస్తే ఊరుకోనని’’ కపిల్ పోస్ట్ చేశాడు. దీనికి సమాధానంగా ‘‘ ఈ నవరాత్రి ఎవరూ అబద్దం చెప్పరు ’’అని సునీల్ పోస్ట్ చేశారు. దీంతో మండిపడ్డ కపిల్ ‘‘ఇప్పటికే చాలా ఎక్కువైంది.. వ్యక్తిగతం అంటూ ఏవీ లేవు ఇక అన్నీ ట్విటర్లోనే’’ అని పోస్ట్ చేశారు. కొన్ని నెలల కిందట ఈ గొడవ కారణంగా సునీల్ గ్రోవర్ను షో నుంచి పంపేసిన విషయం తెలిసిందే. విమాన ప్రయాణంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలి వానగా మారి నెంబర్.1గా ఉన్న షోను తక్కువ రేటింగ్స్ కారణంగా నిలిపివేశారు. చాలా రోజుల తర్వాత కపిల్ శర్మ తన కొత్త షో ‘‘ఫ్యామిలీ టైం విత్ కపిల్ శర్మ’’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
బి అవేర్: కపిల్ శర్మ చాలా డేంజర్
కపిల్ శర్మ.. ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్గా, నటుడిగా, టివి వ్యాఖ్యాతగా, నిర్మాతగా చాలా సుపరిచితం. భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్తో ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంత పెద్ద సెలబ్రిటీ అయిన కపిల్ శర్మ మాత్రం తన అభిమానులకు చాలా ప్రమాదకరమట. కపిల్ శర్మ మీకు ప్రమాదకరమంటూ ఆయన అభిమానులను సైబర్ సెక్యురిటీ సంస్థ మెకాఫీ హెచ్చరిస్తోంది. అసలు ఆయనెందుకు డేంజరో తెలుసా? కపిల్ శర్మ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు అనుమానిత లింకులు, ప్రమాదకర వెబ్సైట్లు, మాల్వేర్ వంటివి వెలుగు చూస్తున్నాయని మెకాఫీ తెలిపింది. 2017లో కపిల్ శర్మనే 'రిస్కీస్ట్ సెలబ్రిటీ సెర్చ్డ్ ఆన్లైన్'గా నిలిచినట్టు వెల్లడించింది. ఇటీవల కాలంలో డిజిటల్ ప్రపంచం ఎక్కువగా పెరుగుతుండటంతో, అభిమానులు తమకు నచ్చిన సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలంటే ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు. ఇలా సెర్చ్ చేసేటప్పుడు అనుమానిత లింక్లను క్లిక్ చేయాల్సి వస్తుందని, వాటివల్ల ఏర్పడే ప్రమాదాన్ని మెకాఫీ వెల్లడించింది. సోనాక్షి సిన్హాను వెనక్కి నెట్టేసి మెకాఫీ మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీల జాబితా 2017లో తొలి స్థానంలో శర్మ నిలిచారు. శర్మ గురించి ఆన్లైన్లో వెతికేటప్పుడు 9.58 శాతం ప్రమాదకర వెబ్సైట్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. కపిల్ తర్వాత సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో, అమీర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. 8.75 శాతం ప్రమాదకరంతో ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలోకి ఎగిశారు. గతేడాది ఆమె ఏడో స్థానంలో ఉండేవారు. కపిల్ శర్మ కామెడీ షోలు కావాలంటే, అధికారిక ప్రసారాలు వచ్చేంత వరకు వేచిచూడాలని లేదా టెలివిజన్, అధికారిక వెబ్సైట్లలో మరోసారి ప్రసారం చేస్తారని మెకాఫీ ఆర్ అండ్ డీ ఆపరేషన్ల అధినేత వెంకట్ క్రిష్ణపుర్ చెప్పారు. థర్డ్ పార్టీల ద్వారా సందర్శిస్తే మాల్వేర్ చొచ్చుకుని వచ్చే ప్రమాదముందన్నారు. -
కపిల్ షో నుంచి సిద్ధూ ఔట్.. ఎందుకు?
ముంబై: తన కామెడీ నైట్ షో నుంచి కామెడీ గరు నవజ్యోత్సింగ్ సిద్దూ తప్పుకున్నాడంటూ వచ్చిన వార్తలపై కపిల్ శర్మ స్పందించాడు. సిద్ధూ స్థానంలో అర్చనా పురాణ్ సింగ్ షోలోకి రానుందని బాలీవుడ్ గుసగుసలు రావడంతో దీనిపై కపిల్ శర్మ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. గతంలో మాదిరి పరిస్థితుల దృష్ట్యా కొద్దికాలం మాత్రమే కామెడీ నైట్షోకు దూరంగా ఉంటారని కపిల్ శర్మ తెలిపాడు. ప్రముఖ హిందీ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన షోనుంచి సిద్ధూ తప్పుకున్నాడని వచ్చిన వార్తల్లో నిజంలేదని, అది అసత్య వార్త అన్నారు. గతంలో సైరాత్ ఎపిసోడ్కు సిద్ధూ అందుబాటులో లేకపోతే జాకీచాన్తోపాటు, రవీనాజీలు షోలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని కపిల్శర్మ తెలిపారు. కపిల్శర్మ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు కలర్స్ ఛానల్లో షో ప్రారంభం నుంచి కలిసి పనిచేస్తున్నారు. అనంతరం ఇద్దరూ సోని ఛానల్కు మారిపోయారు. ఇప్పుడు తాజాగా సిద్ధూ స్థానంలో అర్చన సింగ్ అలరించలేదని, కపిల్ శర్మకు, సిద్ధూ మధ్య ఉన్న ర్యాపోను మెయింటన్ చేయలేకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే గత ఏడాది చివర్లో కూడా సిద్ధూ షోనుంచి తప్పుకున్నాడు. పంజాబ్ ఎన్నికల సమయంలో కొద్దిరోజుల పాటు కపిల్శర్మ షోలో పాల్గొనలేదు. -
షోలో కుప్పకూలిన స్టార్ కమెడియన్
ముంబయి: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ తాను నిర్వహిస్తున్న షోలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇటీవల జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం కపిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈవెంట్లలో పాల్గొనేందుకు కపిల్ సిద్ధమవుతున్నారు. ఒత్తిడి కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కపిల్ షో రద్దు కావడం ఇది తొలిసారేం కాదు. ఓసారి లండన్లో పరేశ్ రావల్, కార్తీక్ అర్యాన్, కృతి కర్బందా సెట్లో రెడీగా ఉన్న సందర్బంలో షో నిర్వాహకుడు కపిల్ శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒత్తిడిలో ఉన్న కపిల్ అధిక రక్తపోటు, షుగర్ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు చెప్పారు. అసలేం జరిగింది? బాలీవుడ్ బాద్షా 'కింగ్' షారుక్ ఖాన్, అనుష్క శర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్'. ఈ మూవీ ప్రమోషన్ కోసం హీరోహీరోయిన్లు కపిల్ శర్మ షోకు రావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ఈవెంట్కు హాజరయ్యారు. సరిగ్గా కాసేపట్లో షో మొదలవుతుందనగా కపిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. షో సహ నిర్వాహకులు, సిబ్బంది చికిత్స నిమిత్తం కపిల్ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. షో రద్దు కావడంతో షారుఖ్, అనుష్కలు తిరిగి వెళ్లిపోయారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం అధిక ఒత్తిడికి లోను కావడమే కపిల్ అనారోగ్యానికి కారణమై ఉంటుందని భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. -
ఆసుపత్రిలో స్టార్ కమెడియన్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత కపిల్ శర్మ అనారోగ్యానికి గురయ్యారు. స్వల్ప అనారోగ్యంతో బుధవారం ఆయన అంధేరిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. లో బ్లడ్ ప్రెషర్ కారణగా అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శర్మ కోలుకుంటున్నారనీ, ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని బాలీవుడ్ మీడియా కథనం. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఎపుడు డిశ్చార్చ్ చేసేది ఇంకా ఆసుపత్రి వర్గాలు ప్రకటించలేదు. అయితే నేడు జరగనున్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పంక్షన్కు హాజరు లేకపోవచ్చని బాలీవుడ్.లైఫ్ తెలిపింది. ఈ గౌరవ పురస్కారానికి ఈ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ రెండవ సారి ఎంపిక య్యారు. ఒకవైపు కపిల్ షో, మరోవైపు బాలీవుడ్ సినిమా షూటింగ్ పనుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు పేర్కొంది. కాగా కామెడీ నైట్స్ విత్ కపిల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కపిల్ శర్మ తాజాగా ది కపిల్ శర్మ షో కు వ్యాఖ్యాతగా ఉన్నారు. మరోవైపు ఫిరంగి మూవీ షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కపిల్ ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. -
కపిల్కు ఎయిరిండియా హెచ్చరిక
విమాన ప్రయాణంలో అనుచితంగా ప్రవర్తించేవాళ్లపై భారత విమానయాన సంస్థలు సీరియస్గా స్పందిస్తున్నాయి. వాళ్లు ఎంత వీవీఐపీలు అయినా, సెలబ్రిటీలు అయినా కూడా లెక్క చేయడం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వస్తున్న ఓ విమానంలో టాప్ టీవీ కమెడియన్ కపిల్ శర్మ చేసిన హడావుడిని చూసి.. అతడికి హెచ్చరికలు పంపాలని నిర్ణయించింది. అసలు ఆ విమానంలో ఏమైందన్న విషయం గురించి ఎయిరిండియా చీఫ్ అశ్వనీ లొహానీ విచారణ మొదలుపెట్టారు. కపిల్కు ఎలాంటి హెచ్చరిక పంపాలో దాన్ని బట్టి నిర్ణయిస్తారు. మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో కపిల్ శర్మ తన బృందంతో కలిసి బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు. అతడు బాగా మద్యం తాగి గట్టిగా మాట్లాడుతూ, తన బృందంతో కలిసి నానా హడావుడి చేసినట్లు సమాచారం. దీనివల్ల తోటి ప్రయాణికులు బాగా ఇబ్బంది పడటంతో పాటు కొంతమంది భయపడ్డారు కూడా. కేబిన్ సిబ్బంది అతడిని కలిసి కాస్త ఊరుకొమ్మని చెప్పారు. ప్రయాణికుల్లో పెద్దవయసు వాళ్లు కూడా ఉండటంతో ఇలా చేయడం సరికాదన్నారు. దాంతో కపిల్ శర్మ సిబ్బందికి సారీ చెప్పి మాట్లాడకుండా ఉన్నాడని అంటున్నారు. కాసేపటి తర్వాత మళ్లీ తన ట్రూప్ సభ్యుల మీద అరవడం మొదలుపెట్టాడని, ఈసారి పైలట్ వచ్చి గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత చాలా సేపటి వరకు కపిల్ నిద్రపోతూనే ఉన్నాడని విమానంలో ప్రయాణించినవారిలో ఒకరు చెప్పారు. -
కాలర్ పట్టుకొని బూటుతో కొట్టిన కమెడియన్
దేశంలో ప్రముఖ కమెడియన్గా పేరొందిన కపిల్ శర్మ తన సహనటుడు సునీల్ గ్రోవర్పై విమానంలో దాడి చేసిన ఘటనకు సంబంధించి అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. తాజాగా విమానంలో ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి ఈ ఘటన ఎలా జరిగింది, అసలు కపిల్ శర్మ ఎందుకు సునీల్ గ్రోవర్ను కొట్టాడు అన్న దానిపై సవివరంగా తెలియజేశాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో షో ముగించుకొని ఎయిరిండియా విమానంలో కపిల్ శర్మ బృందం ('ద కపిల్ శర్మ షో'లో పాల్గొనే నటీనటులు, సహాయక సిబ్బంది) తిరుగుప్రయాణమయ్యారు. అయితే, 12 గంటలపాటు ప్రయాణం సాగే ఈ విమానంలో కపిల్ శర్మ గ్లెన్ఫిడ్డిక్ విస్కీని ఫుల్ బాటిల్ను లాగించాడు. అతడు తాగుతుండగానే అతని బృందం సభ్యులు విమాన సిబ్బంది తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని తినడం ప్రారంభించారు. తాగిన మత్తులో ఉన్న కపిల్కు ఇది ఆగ్రహం తెప్పించింది. 'నేను చెప్పకుండానే మీరు అన్నం తినడం ఎలా మొదలుపెట్టారు?' అంటూ కపిల్ కోపంతో కేకలు వేశాడు. దీంతో సహనటులు విస్తుపోయారు. ఈ దశలో సునీల్ గ్రోవర్ కలుగజేసుకొని కపిల్ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కపిల్ లేచి షూను అతనిపై విసిరికొట్టాడు. అతని కాలర్ పట్టుకొని లాగి.. పలుసార్లు చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో గలాటా వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కపిల్ బృందంలోని ఓ మహిళకు కూడా దెబ్బలు తగిలాయి. దీంతో విమాన సిబ్బంది కలుగజేసుకొని.. కపిల్ను శాంతింపజేయాలని ఆయన బృంద సభ్యులనుకోరారు. అతని తీరుతో భయకంపితులైన వారు తాము ఏం చేయలేమంటూ చేతులు ఎత్తేశారు. కపిల్ బృందం సభ్యులపైనా గట్టిగా కేకలు వేస్తూ.. తిట్లదండకాన్ని అందుకున్నాడు. గట్టిగా అరుస్తూ అతడు చేసిన గలాటాతో ఎకనామిక్ క్లాస్లో ఉన్న సాటి ప్రయాణికులు సైతం చికాకు పడ్డారు. పలువురు విమాన సిబ్బంది వద్దకు వెళ్లి.. పరిస్థితి సద్దుమణగడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. చాలాసేపు బృందం సభ్యులపై అరుస్తూ.. నానా దుర్భాషలు ఆడుతూ.. కపిల్ గలాటా చేశాడని ఆ ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఈ వ్యవహారం మొత్తం సునీల్ శాంతంగా, నిగ్రహంగా ఉన్నాడని తెలిపారు. అయితే, ఈ ఘటన వెలుగులోకి రాకుండా దృష్టి మళ్లించేందుకు తన ప్రియురాలు జిన్నీని పెళ్లి చేసుకోబోతున్నట్టు కపిల్ ట్విట్టర్లో ప్రకటించినట్టు తెలుస్తోంది. కపిల్ తీరుతో ఇబ్బంది పడిన సునీల్ గ్రోవర్తోపాటు.. సహ నటులు అలీ అస్గర్, చందన్ ప్రభాకర్లు కూడా 'ద కపిల్ శర్మ షో' షూటింగ్కు హాజరవ్వడం లేదని తెలుస్తోంది. -
నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్
న్యూఢిల్లీ: కమెడియన్ కపిల్ శర్మ వ్యాఖ్యాతగా ఉండే టీవీ సిరీస్లో పంజాబ్ మంత్రి నవ్జ్యోత్ సిద్ధూ కొనసాగడాన్ని.. రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తే తనకేం ఇబ్బందీ లేదని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు ఇందుకు విరుద్ధంగా ఉంటే రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి సిద్ధూను మార్చుతానని అమరీందర్ చెప్పారు. ‘ఈ విషయమై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అతుల్ నందాను అభిప్రాయం కోరాం. ఆయనింకా ఈ విషయాన్ని పరిశీలించలేదు’ అని అన్నారు. మంత్రి హోదాలో ఓ టీవీ షోలో సిద్ధూ కొనసాగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తన కుటుంబ ఖర్చుల కోసం, తన అభిరుచి మేరకే టీవీ సిరీస్లో కొనసాగుతానని సిద్ధూ ప్రకటించారు. -
క్షమాపణ చెప్పిన టాప్ కమెడియన్
ముంబై: సహనటుడు సునీల్ గ్రోవర్ పై విమానంలో దాడి చేసిన ఘటనలో బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ క్షమాపణ చెప్పాడు. సునీల్ గ్రోవర్ ను బాధ పెట్టివుంటే క్షమించాలని వేడుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని తెలిపాడు. ‘అనుకోకుండా నేను చేసిన పనికి నువ్వు బాధ పడివుంటే నన్ను క్షమించు. నేను నిన్ను ఎంతగా అభిమానిస్తానో నీకు తెలుసు. జరిగిన ఘటన నన్ను కూడా బాధించింది. నిన్నేప్పుడు అభిమానిస్తూనే ఉంటాన’ని కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. మద్యం మత్తులో సునీల్ గ్రోవర్ పై విమానంలో కపిల్ శర్మ దాడి చేయడంతో వివాదం రేగింది. కపిల్ చర్య తనను ఎంతగానో బాధించిందని సునీల్ వాపోయాడు. మహిళ ముందు తనను తీవ్రంగా అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సాటి మనుషుల పట్ల గౌరవం కలిగివుండాలని, దేవుడిలా నటించొద్దని కపిల్ శర్మకు హితవు పలికారు. అయితే కపిల్ క్షమాపణను సునీల్ అంగీకరిస్తాడా, లేదా అనేది చూడాలి. -
మా కొట్లాట దేశ రక్షణ అంశమా: కమెడియన్
సహనటుడిపై విమానంలో దాడి చేయడంపై బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ మౌనం వీడారు. సునీల్ గ్రోవర్ తన సోదరుడు లాంటి వాడని.. ఏదైనా సమస్య ఉంటే ఇరువురూ చర్చించుకుని సరిదిద్దుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. విమానంలో సునీల్పై చేయి చేసుకున్నట్లు ఒప్పుకున్నారు. అయితే, అది వారి సమస్య అని మీడియా మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. కొంతమంది పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సునీల్ అంటే తనకు ఎంతో ఇష్టమని, గౌరవం కూడా ఉందని చెప్పారు. ఐదేళ్లలో తొలిసారి సునీల్పై కోపగించుకున్నట్లు తెలిపారు. కేవలం ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా మనిషిగా కూడా సునీల్ గొప్పవారని పేర్కొన్నారు కపిల్. కానీ, తనపై నెగిటివ్ వార్తలు రావడం బాధిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. మీడియాపై తనకు గౌరవం ఉందని చెప్పారు. సునీల్, తాను గొడవపడితే అంతలా ప్రచారం చేయడానికి అదేమైనా దేశ రక్షణకు సంబంధించిన విషయమా? అని ప్రశ్నించారు. సునీల్ తన కుటుంబంలో ఒకరని చెప్పారు. కుటుంబంలో చిన్నాచితకా సమస్యలు వస్తుంటాయని అన్నారు. కాగా, విమానంలో తన సీటులో సునీల్ గ్రోవర్ కూచుని ఉండగా.. కపిల్ ఆకస్మికంగా ఆయన వద్దకు వచ్చి తిట్లదండకాన్ని షురూ చేశారు. సునీల్ను కాలర్ పట్టుకొని లేపి.. అతన్ని కొట్టారనే వార్తలు వచ్చిన తెలిసిందే. -
సహనటుడిని చితకబాదిన టాప్ కమెడియన్
దేశంలో టాప్ కమెడియన్గా పేరొందిన కపిల్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. మద్యం మత్తులో తన సహనటుడిపై ఆయన విమానంలోనే దాడి చేశాడు. లవ్ యూ జిన్నీ అంటూ కపిల్ తన ప్రియురాలిని ట్విట్టర్లో పరిచయం చేసిన 24 గంటలకే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. ఇటీవల మెల్బోర్న్, సిడీలలో స్టేజ్ షోలు నిర్వహించిన అనంతరం ఎయిరిండియా విమానం భారత్కు తిరిగొస్తుండగా సహ నటుడు సునిల్ గ్రోవర్పై కపిల్ చేయి చేసుకున్నట్టు తెలిసింది. ద కపిల్ శర్మ షోకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విమానంలో తన సీటులో సునీల్ గ్రోవర్ కూచుని ఉండగా.. కపిల్ ఆకస్మికంగా ఆయన వద్దకు వచ్చి తిట్లదండకాన్ని షురూ చేశాడు. సునీల్ను కాలర్ పట్టుకొని లేపి.. అతన్ని కొట్టాడు. కపిల్ కొడుతున్నా.. తిడుతున్నా సునీల్ మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో కపిల్ తాగి ఉన్నాడని, 'నువ్వు నా నౌకర్వి' అంటూ సునీల్ని అడ్డగోలుగా తిడుతూ దాడి చేశాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇతర బృంద సభ్యులు అక్కడికి వచ్చి.. అతన్ని పక్కకు తీసుకుపోయారని సమాచారం. ఈ ఘటనపై ఎయిరిండియా ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ద కపిల్ శర్మ షోలో సునీల్ గ్రోవర్ డాక్టర్ మషూర్ గులాటీగా కామెడీ పండిస్తున్నాడు. అతను గతంలో కపిల్ తనకు తగినంత వేతనం ఇవ్వడం లేదంటూ.. స్టార్ ప్లస్ చానెల్లో సొంతంగా కామెడీ షో నిర్వహించాడు. అది క్లిక్ కాకపోవడంతో మళ్లీ కపిల్ షోలో పాల్గొంటున్నాడు. తాజా దాడి నేపథ్యంలో ఈ ఇద్దరూ ట్విట్టర్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. -
కపిల్.. పెళ్లి చేసుకుంటున్నాడా?
స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ అంటే తెలియని టీవీ ప్రేక్షకులు సాధారణంగా ఉండరు. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్, ఇప్పుడు ద కపిల్ శర్మ షోలతో పాటు పలు అవార్డు ఫంక్షన్లలో కూడా తనదైన స్పాంటేనియస్ కామెడీతో జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతుంటాడు కపిల్. తన పంజాబీ యాసతో కూడిన హిందీతో కాస్త నాటు జోకులను కూడా మామూలు మాటల్లో కలిపేసే కపిల్ను అభిమానించేవాళ్లలో అన్ని వర్గాల వాళ్లు ఉంటారు. ఇక తన షోలకు వచ్చేవాళ్లు, అవార్డు ఫంక్షన్లకు వచ్చే హీరోయిన్లతో అతడు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది. తనకంటే పొడవైన శిల్పాశెట్టి, దీపికా పదుకొనే లాంటి వాళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తాడు. అలాంటి కపిల్.. ఇన్నాళ్లకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కపిలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ''తను నా బెటర్ హాఫ్ అని చెప్పను. ఆమె నన్ను సంపూర్ణ వ్యక్తిగా చేస్తుంది. లవ్ యూ జిన్నీ.. ఆమెను దయచేసి స్వాగతించండి. నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాను'' అని చెప్పాడు. ఈ ఫొటోను అప్లోడ్ చేయడానికి కొద్ది ముందుగా.. తన అభిమానులకు ట్విట్టర్లో చిన్న టీజర్ కూడా ఇచ్చాడు. తాను ఒక 'అందమైన' విషయాన్ని పంచుకోబోతున్నట్లు చెప్పాడు. అందుకోసం ఒక్క అరగంట ఆగాలని కోరాడు. ఈలోపు ఏం రాయలో ప్రిపేర్ అయ్యాడో ఏమోగానీ.. చివరకు తన మనసులోని విషయాన్ని ప్రపంచానికి చాటాడు. కపిల్ తన ప్రేయసిని అందరికీ చూపించడం ఇదే మొదటిసారి. దాన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే అతడు పెళ్లి కూడా చేసుకుంటాడని భావిస్తున్నారు. 2007 సంవత్సరంలో తొలిసారిగా 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో'తో కపిల్ ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత సోనీ టీవీ వాళ్ల కలర్స్ చానల్లో తన కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మంచి పాపులారిటీ సాధించాడు. హీరో హీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలంటే ముందుగా ఈ షోనే ఎంచుకుంటారు. సీనియర్ హీరోలు, హీరోయిన్లతో కూడా బాగా చలాకీగా మాట్లాడే కపిల్ పెళ్లి విషయం ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద వార్తగానే నిలిచింది. 2015లో నలుగురు హీరోయిన్లతో కలిసి తీసిన కిస్ కిస్కో ప్యార్ కరూ సినిమాతో బాలీవుడ్లో కూడా కపిల్ అడుగుపెట్టాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తన తల్లికి మూడ్ తిరిగితే రేపే పెళ్లి చేసేస్తుందని ఆ షోలో కరణ్ జోహార్తో అన్నాడు. ప్రస్తుతం కపిల్ చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. Hi..want to share something very beautiful thing with u guys ...wait for 30 mins .. — KAPIL (@KapilSharmaK9) 18 March 2017 Will not say she is my better half .. she completes me .. love u ginni .. please welcome her .. I love her so much:) pic.twitter.com/IqB6VKauM5 — KAPIL (@KapilSharmaK9) 18 March 2017 -
నేత్రదానం చేసిన టాప్ కమెడియన్!
దేశంలోనే నంబర్ వన్ కమెడియన్గా పేరొందిన కపిల్ శర్మ ఓ స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ను ఇటీవల గెలుపొందిన భారత అంధుల క్రికెట్ జట్టు తాజాగా ద కపిల్ శర్మ షోలో పాల్గొన్నది. ఈ నేపథ్యంలోనే ఆయన నేత్రదానం ప్రకటన చేశారు. 'మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' అని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకటనతో స్ఫూర్తి పొందిన పలువురు ఆయన అభిమానులు కూడా నేత్రదానానికి ముందుకొస్తున్నారు. -
టాప్ కమెడియన్పై ఎఫ్ఐఆర్
ముంబయి: ప్రముఖ టాప్ కమెడియన్ కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పర్యావరణ భద్రతా చట్టం, ఎంఆర్టీపీ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాల కేసులో ఇరుక్కున్న ఆయన ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన బంగ్లాలో కార్యాలయం నిర్మించుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు లంచం అడిగారని, అచ్చేదిన్ (మంచిరోజులు) అంటే ఇవేనా అంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ట్వీట్ చేయడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. ఈ అక్రమ నిర్మాణం వ్యవహారంలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. కపిల్ శర్మ నివాసముంటున్న బిల్డింగ్ పూర్తిగా అక్రమమైనదని దాని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉన్న కపిల్ శర్మ బంగ్లాను పూర్తిగా చట్టవిరుద్ధంగా కట్టారని వారు చెప్తున్నారు. అయతే, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మాత్రం కపిల్ శర్మ తన బంగ్లాలో పలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు పత్రాలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కాగా, కపిల్ బంగ్లా విషయంలో తాము కోర్టు ఆశ్రయించాలని భావిస్తున్నట్టు స్థానిక కోఆపరేటివ్ సోసైటీ చైర్మన్ అనురాగ్ పఠాక్ మీడియాకు తెలిపారు. -
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
కపిల్ శర్మ అనగానే కామెడీ నైట్స్ షో గుర్తుకొస్తుంది. దాంతో బాగా పాపులర్ అయిన కపిల్.. బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. దేశంలోనే అతిపెద్ద స్టాండప్ కమెడియన్గా పేరుపొందాడు. అలాంటి కపిల్ను ఎవరు మాత్రం వదులుకుంటారు, అందుకే సోనీ ఎంటర్టైన్మెంట్ సంస్థ 2017 సంవత్సరానికి అతడితో కొత్త కాంట్రాక్టు కుదుర్చుకుంటోంది. దాని ప్రకారం వచ్చే సంవత్సరంలో అతడి మొత్తం సంపాదన దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందట! ఒక్క ఎపిసోడ్కే అతడు దాదాపు 60-80 లక్షలు తీసుకుంటున్నాడు. దాంతో బాలీవుడ్లో అత్యధికంగా సంపాదించే తారల సరసన కపిల్ కూడా నిలిచాడు. ఇంతకుముందు కూడా అతడు కలర్స్ చానల్లో నిర్వహించిన కామెడీ నైట్స్ విత్ కపిల్ షో సోనీ ఎంటర్టైన్మెంట్కు మంచి లాభదాయకంగా నిలిచింది. ప్రధానంగా వారాంతాల్లో టీవీలు అంతగా చూడరు అనుకునే సమయంలో కూడా జనాన్ని టీవీల ముందు కట్టి పడేయడం కపిల్ షోకే సాధ్యమైంది. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దపెద్ద స్టార్లు కూడా ఈ షోకు వస్తుంటారు. ఇక హీరోయిన్లతో కపిల్ చేసే రొమాంటిక్ కామెడీ చూస్తే విపరీతంగా నవ్వుకోవాల్సిందే. దీపికా పదుకొనే, శిల్పాశెట్టి లాంటి పొడవైన తారల విషయంలో అయితే ముద్దుపెట్టుకోవాలంటే నిచ్చెన తెచ్చుకోవాల్సి ఉంటుందని తరచు అంటుంటాడు. ప్రియాంకా చోప్రా హాలీవుడ్కు వెళ్లి క్వాంటికో సిరీస్ చేస్తే, ఆ సిరీస్ మొత్తానికి కలిపి ఆమెకు 11 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఇప్పుడు కపిల్ శర్మ తీసుకుంటున్నది 14.7 మిలియన్ డాలర్లు అవుతుంది. అంటే, హాలీవుడ్ సంపాదన కంటే కూడా మనోడు ఎక్కువ సంపాదిస్తున్నాడన్నమాట. -
నో మేకప్.. నథింగ్!
ఎప్పుడూ గ్లామర్ డాల్ పాత్రలేనా? ఛాన్స్ వస్తే డీ-గ్లామర్గానూ కనిపిస్తా. మేకప్ లేకుండా నటించడానికి నేను రెడీ! - పలు సందర్భాల్లో తమన్నా చెప్పిన డైలాగ్ ఇది. తమిళ సినిమా ‘ధర్మదురై’లో అటువంటి పాత్రను పోషించారామె. కాటన్ చీరల్లో ఎటువంటి మేకప్ లేకుండా డాక్టర్ పాత్రలో తమన్నా నటించారు. ఇప్పుడీ సినిమా ‘ధర్మరాజు ఎం.బి.బి.ఎస్.’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. విజయ్ సేతుపతి హీరో. నిర్మాత జె.సాంబశివరావు విడుదల చేస్తున్నారు. వైద్యవృత్తిని పవిత్రంగా భావించే ఓ యువకుడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ సమస్యలను ఎలా అధిగమించాడనేది చిత్రకథ. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటల్ని త్వరలో రిలీ జ్ చేయనున్నారు. నిజం కాదు... ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ’, ‘ద కపిల్ శర్మ షో’లతో హిందీలో పాపులర్ అయిన కపిల్ శర్మ సరసన తమన్నా ఓ సినిమాలో నటించనున్నారని సోమవారం ఓ వార్త హల్చల్ చేసింది. చివరకు తమన్నా రంగంలోకి దిగి ఆ వార్తను ఖండించాల్సి వచ్చింది. ‘‘నేను ఏదైనా సినిమా ఒప్పుకుంటే, నేనే చెబుతా. ఇలాంటి పుకార్లను ఎంకరేజ్ చేయవద్దు’’ అని ట్వీట్ చేశారు. -
ఆ కమెడియన్ ఇల్లు పూర్తిగా ఇల్లీగలే!
దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జింజే టాప్ కమెడియన్ కపిల్ శర్మ. అక్రమ నిర్మాణాల కేసులో ఇరుక్కున్న ఆయన ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన బంగ్లాలో కార్యాలయం నిర్మించుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు లంచం అడిగారని, అచ్చేదిన్ (మంచిరోజులు) అంటే ఇవేనా అంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ట్వీట్ చేయడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. దీంతో ఈ అక్రమ నిర్మాణం వ్యవహారంలో పలు వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కపిల్ శర్మ నివాసముంటున్న బిల్డింగ్ పూర్తిగా అక్రమమైనదని తాజాగా దాని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉన్న కపిల్ శర్మ బంగ్లాను పూర్తిగా చట్టవిరుద్ధంగా కట్టారని వారు చెప్తున్నారు. అయతే, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మాత్రం కపిల్ శర్మ తన బంగ్లాలో పలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు పత్రాలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కాగా, కపిల్ బంగ్లా విషయంలో తాము కోర్టు ఆశ్రయించాలని భావిస్తున్నట్టు స్థానిక కోఆపరేటివ్ సోసైటీ చైర్మన్ అనురాగ్ పఠాక్ మీడియాకు తెలిపారు. -
కోర్టుకెక్కిన టాప్ కమెడియన్
స్టాండప్ కామెడీ షోలతో టీవీ ప్రేక్షకులకు బాగా చేరువైన కమెడియన్ కపిల్ శర్మ.. బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో తన అపార్టుమెంటు విషయంలో బీఎంసీ అధికారులు లంచం అడిగారంటూ ప్రధానమంత్రినే ట్యాగ్ చేసి ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ శర్మ అక్రమ కట్టడం కట్టారని, అందువల్ల దాన్ని కూల్చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తేల్చిచెప్పారు. పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలంలో అక్కడ కట్టడాలు కట్టారని, అందువల్ల అది అక్రమ నిర్మాణమని అన్నారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మతో పాటు బిల్డర్ మీద కూడా బీఎంసీ అధికారులు కేసు పెట్టారు. అయితే అపార్టుమెంటులో కొంత భాగాన్ని కూల్చేయాలన్న బీఎంసీ అధికారుల ఆదేశాలను సవాలుచేస్తూ కపిల్ శర్మ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
తమన్నా ఏం అడిగింది?
కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే షోలో పాల్గొన్నారంటే.. ఆ రోజంతా సెలబ్రిటీలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూనే ఉంటారు. ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోడానికి కూడా ఖాళీ ఇవ్వకుండా కపిల్ నవ్విస్తూనే ఉంటాడు. అయినా మధ్యలో ఎలాగోలా ఖాళీ చేసుకుని తాము అడగాలనుకున్న విషయాలు కూడా సెలబ్రిటీలు అడిగేస్తారు. తాజాగా కపిల్ షోలో మిల్కీ బ్యూటీ తమన్నా, సోనూ సూద్, ప్రభుదేవా, అలీ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి చేసిన తుటక్ తుటక్ తుటియా సినిమా ప్రమోషన్ కోసం అంతా వెళ్లారు. ఇందులో చాలా సేపు నవ్వుతూనే ఉన్న తమన్నా.. ఆ తర్వాత కపిల్ను ఒక ప్రశ్న అడిగింది. నిజంగా ఏడాదికి 15 కోట్ల రూపాయల పన్ను కడుతున్నారా అని తమన్నాకు అనుమానం వచ్చింది. తాను ఇంత పన్ను కడుతున్నా కూడా బీఎంసీ అధికారులు తనను రూ 5 లక్షల లంచం అడిగారంటూ ట్వీట్ చేసి కపిల్ దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ శర్మను ఆట పట్టించడానికో ఏమో.. తమన్నా ఈ ప్రశ్నను మాత్రం తమిళంలో అడిగింది. అదేంటో అర్థం కాక బుర్ర గోక్కున్న కపిల్.. ప్రభుదేవాను బతిమాలి హిందీలో దాని అర్థం ఏంటో కనుక్కున్నాడు. అయితే కపిల్ షోలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. కొంచెం దూరంగా జనాల మధ్యలో ప్రత్యేకంగా ఒక సింహాసనం లాంటి కుర్చీ వేసుకుని తనదైన స్టైల్లో పంజాబీ జోకులు వేస్తుండే నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాత్రం ఈ షోలో లేడు. ఈమధ్య కాలంలో పంజాబ్ రాజకీయాల కోసం ఆయన పూర్తిసమయాన్ని కేటాయిస్తుంటంతో షో కొంచెం బోసిపోయినట్లు కనిపించింది. అయితే సిద్ధు పూర్తిగా ఈ షోను వదిలిపెట్టి వెళ్లలేదని, త్వరలోనే మళ్లీ వస్తారని నిర్మాతలు చెబుతున్నారు. Had super fun and non stop dose of laughter in "The Kapil Sharma Show".. Catch me tonite @9pm @PDdancing @SonuSood #TutakTutakTutiya pic.twitter.com/eiCSUFO1ye — Tamannaah Bhatia (@tamannaahspeaks) 25 September 2016 -
టాప్ కమెడియన్ పై కేసు నమోదు!
ముంబై: దేశంలోనే అత్యధికంగా ఆదాయం ఆర్జించే టాప్ కమెడియన్ కపిల్ శర్మ. గత ఐదేళ్లలో రూ. 5 కోట్ల ఆదాయ పన్నుచెల్లించిన తనను ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు రూ. 5 లక్షలు లంచం అడిగారంటూ ఆయన ట్విట్టర్ లో పెద్ద దుమారమే రేపారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే 'మంచి రోజులు' వస్తాయన్నారు.. అవి ఇవేనా అంటూ ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ వివాదం సద్దుమణగకముందే కపిల్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై ముంబైలోని వెర్సోవా పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వెర్సోవా పరిసరాల్లోని తన బంగ్లా వెనుకభాగంలో ఉన్న రావిచెట్ల వద్ద శిథిలాలు పారవేయడం ద్వారా పర్యావరణానికి ఆయన హాని కలిగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. శిథిలాలు పారవేయడం ద్వారా కపిల్ శర్మ చట్టాలను ఉల్లంఘించారా? అన్నది గుర్తించడానికి సర్వే నిర్వహించాల్సిందిగా ఇప్పటికే ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ దీపేంద్రసింగ్ కుశ్వాహా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించిన అధికారులు.. కపిల్ శర్మ అక్రమ నిర్మాణాలు, పర్యావరణ చట్టం ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉన్న ఈ భవనాన్ని గత ఏడాది నవంబర్ లో కపిల్ శర్మ కొనుగోలు చేశాడు. అయితే, ఆ తర్వాత ఈ భవనానికి పలు మార్పులు, అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణ చట్టాలను ఆయన తుంగలో తొక్కారని మున్సిపాలిటీ అధికారులు ఆరోపిస్తున్నారు. తన భవనాలకు అనుమతుల విషయంలో ముంబై అధికారులు లంచం అడిగినట్టు ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు'
కమెడియన్ కపిల్ శర్మకు నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు పలికాడు. బీఎంసీలో అవినీతి జరుగుతోందంటూ ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేసినప్పటినుంచి కపిల్ను కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ క్రిమినల్ కాదని, అతడు మంచి మనిషని వివేక్ ఒబెరాయ్ చెబుతున్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను కలిసేందుకు సాయం చేయాల్సిందిగా వివేక్ ఒబెరాయ్ని కపిల్ శర్మ కోరినట్లు తెలుస్తోంది. తాను గత ఐదేళ్లుగా ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయపన్ను కడుతున్నానని, అయినా తనను 5 లక్షల లంచం అడిగారని కపిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకుడు జీవరాజ్ ఆల్వా కుమార్తెను పెళ్లి చేసుకున్న కపిల్.. ఇప్పుడు సమస్య నుంచి బయటపడేందుకు అవసరమైతే మామగారి వైపు నుంచి రాజకీయ పరిచయాలను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎవరికైనా సమస్యలు తీర్చగలిగే పరిస్థితిలో మనం ఉంటే ఆమాత్రం సాయం చేయాలని ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ తెలిపాడు. కేన్సర్తో బాధపడుతున్న పిల్లల కోసం తాను నిధులు సేకరిస్తుంటానని, ఇందులో భాగం పంచుకుంటానని కపిల్ శర్మ స్వయంగా తనకు చెప్పాడని కూడా వివేక్ అన్నాడు. -
చిక్కుల్లో ఇద్దరు నటులు
ముంబై: అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కమెడియన్ కపిల్ శర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దోషులుగా తేలితే వీరికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్లోని డీఎల్హెచ్ ఎన్క్లేవ్లో నివసిస్తున్నారు. అపార్ట్మెంటులోని 9వ అంతస్తులో కపిల్ శర్మ, ఐదో అంతస్తులో ఇర్ఫాన్ ఖాన్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గురించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పీ-సౌత్ వార్డ్ సబ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అపార్ట్ మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్(ఎంఆర్ టీఎస్) 1996 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 వేలు నుంచి రూ.5 వేలు జరిమానా విధిస్తారు. -
కమెడియన్ ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు
ముంబై: అవినీతి ఆరోపణలు చేసిన కమెడియన్ కపిల్ శర్మ చిక్కుల్లో పడ్డారు. ఇంటి నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కపిల్ శర్మను అరెస్ట్ చేయాలని సీనియర్ న్యాయవాది అభా సింగ్ డిమాండ్ చేశారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో సింగ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కపిల్ శర్మ మడ అడవుల(మాంగ్రూవ్స్)ను నాశనం చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారి ఒకరు తనను రూ. 5 లక్షలు లంచం అడిగారని కపిల్ శర్మ ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. అవినీతి అధికారిపై ఏసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కపిల్ ను అభా సింగ్ ప్రశ్నించారు. కపిల్ శర్మ చేపట్టిన అక్రమ నిర్మాణాలను బీఎంసీ అధికారులు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. సెలబ్రిటీలకు పోలీసులు ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. సల్మాన్ ఖాన్ కేసు పదేళ్లు నడవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కపిల్ వ్యవహారంపై మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) మండిపడగా, రానున్న బీఎంసీ ఎన్నికల్లో దీన్ని లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
ఇంతకీ కమెడియనా.. విలనా?
కమెడియన్ కపిల్ శర్మ వ్యవహారం రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. అంధేరీలోని తన బంగ్లా వద్ద మడ అడవులను కపిల్ నరికేస్తున్నాడని, అక్రమంగా కొత్త అంతస్తులు నిర్మిస్తున్నాడని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ప్రధాన కార్యదర్శి షాలిని ఠాక్రే ఆరోపించారు. కపిల్కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మద్దతు పలకకూడదని, అబద్ధాల కోరు అయిన శర్మ మునిసిపల్ చట్టాలను ఎలా ఉల్లంఘించాడో తాము సాక్ష్యాలు కూడా చూపిస్తామని అన్నారు. ఇప్పటికే ఉన్న జి ప్లస్ వన్ అంతస్తుకు అదనంగా మరో నిర్మాణం చేస్తుండటంతో కపిల్ శర్మకు జూలై 16న ఒక నోటీసు ఇచ్చారు. దానికి 24 గంటల్లోగా సమాధానం చెప్పాలన్నారు. ఆగస్టు నాలుగోతేదీ వరకు కూడా అతడి నుంచి సమాధానం రాకపోవడంతో వార్డు అధికారులు అదనంగా చేసిన నిర్మాణాలను కూల్చేశారని అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ పరాగ్ మాసుర్కర్ చెప్పారు. అయితే.. కొన్ని నెలల్లోనే బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉండటంతో పార్టీలన్నీ ఈ వివాదాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. కపిల్ శర్మ పాల్గొనే షూటింగులను తాము అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ సినిమా విభాగం చీఫ్ అమేయ ఖోప్కర్ హెచ్చరించారు. ఎప్పుడో ఆగస్టు నాలుగో తేదీన కూల్చేస్తే.. బీఎంసీ మీద ఆరోపణలు చేయడానికి కపిల్కు నెల రోజులు పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఎంసీని భ్రష్టాచార్ మునిసిపల్ కార్పొరేషన్ అని అభివర్ణించింది. -
కమెడియన్పై మండిపడిన శివసేన
బీఎంసీ అధికారులు తన నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద గొడవ చేసిన కమెడియన్ కపిల్ శర్మపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. బయటి నుంచి వచ్చి ముంబై పరువు గంగలో కలుపుతున్నాడని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. కపిల్ శర్మ స్వస్థలం పంజాబ్ అన్న విషయం తెలిసిందే. ముందుగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను కపిల్ చదువుతున్నాడని రౌత్ అన్నారు. కపిల్ శర్మను లంచం అడిగింది ఎవరో చెప్పాల్సిందిగా తాము కోరినా.. ఆయన మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదని బీఎంసీ విజిలెన్స్ శాఖ చీఫ్ ఇంజనీర్ మనోహర్ పవార్ అన్నారు. ఆయన చెబితే తాము వెంటనే విచారణ ప్రారంభించి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వీలుంటుందని చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు. -
కమెడియన్ కపిల్ శర్మకు కోపమొచ్చింది
తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ కపిల్ శర్మ కోపమొచ్చింది. అచ్చే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామంటూ సాధారణ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ప్రధాని నరేంద్రమోదీకి "అచ్చే దిన్" ఎక్కడుందంటూ ప్రశ్నలు సంధించారు. తన ఆఫీసు స్థాపనకు బలవంతపూర్వకంగా లంచంగా రూ.5లక్షలు చెల్లించాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. గత ఐదేళ్ల నుంచి 15 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్న తను, ఇప్పటికీ ఆఫీసు స్థాపనకు రూ.5 లక్షల లంచం బీఎంసీ ఆఫీసుకు చెల్లించాల్సిందని ఆరోపించారు. ఈ ట్వీట్కు జతగా మరో ట్వీట్ చేశారు. ఇదేనా తమ అచ్చే దిన్ అనే ట్వీట్ను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లోకి మొదటిసారిగా వచ్చిన ఈ కమెడియన్ యాక్టర్, తన కోపాన్ని ఈ ట్వీట్ల ద్వారా వ్యక్తపరిచారు. కపిల్ ట్వీట్లపై వెంటనే స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, లంచం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాంటూ ఎంసీ, బీఎంసీలకు ఆదేశాలు జారీచేశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేదని పేర్కొన్నారు. పాపులర్ కామెడీ షోను ఆయన నిర్వర్తిస్తున్నారు. క్రికెటర్లు, బాలీవుడ్ వంటి చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటుటారు. తన షోకు ప్రధాని మోదీ కూడా పాల్గొన్నాలని కోరుకుంటున్నాని గతంలోనే తన కోరికను వెల్లబుచ్చిన సంగతి తెలిసిందే. I am paying 15 cr income tax from last 5 year n still i have to pay 5 lacs bribe to BMC office for making my office @narendramodi — KAPIL (@KapilSharmaK9) September 9, 2016 Yeh hain aapke achhe din ? @narendramodi — KAPIL (@KapilSharmaK9) September 9, 2016 Kapilbhai pls provide all info. Have directed MC,BMC to take strictest action. We will not spare the culprit.@KapilSharmaK9 @narendramodi — Devendra Fadnavis (@Dev_Fadnavis) September 9, 2016 -
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంతో పాపులరయిన కపిల్ శర్మ సినిమా తారలకు దీటుగా సంపాదిస్తున్నాడు. నెలకు దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం అతడి ఖాతాలో పడుతున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. ఒక్కో ఎపిసోడ్కు రూ. 60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కామెడీ నైట్స్ షో సూపర్ హిట్ కావడంతో కపిల్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ సినీ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడి షోలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. స్క్రిప్టింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు అంతా తానే అయి ఈషోను కపిల్ నడిపిస్తున్నాడు. విభిన్నమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తున్నాడు. అంతేకాదు ఫిట్నెస్ పై కూడా ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నాడు. కపిల్ టీమ్ లోని వారు కూడా భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు సునీల్ గ్రోవర్ రూ.10 నుంచి 12 లక్షలు, కికు షర్దా రూ.5 నుంచి 7 లక్షలు, చందన్ ప్రభాకర్ రూ. 4 లక్షలు, సుమన చక్రవర్తి రూ. 6 నుంచి 7 లక్షలు, రొచెల్లె రావు రూ. 3 నుంచి 4 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఎపిసోడ్ కు రూ.8 నుంచి 10 లక్షలు ఇస్తున్నారని తెలిపింది. -
కమెడియన్ కు రాఖీ కట్టిన హీరోయిన్
ముంబై: కామెడీ కింగ్ కపిల్ శర్మ ఇక తన షోకు బాలీవుడ్ తారలను ఆహ్వానించాల్సిన అవసరం రాదేమో. బంధువులను స్వాగతిస్తే సరిపోయేట్టు ఉంది. ఎందుకంటే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ కపిల్ బంధువులే. ఇదంతా నిజమనుకుంటున్నారా? ఉత్తిదే. తమ సినిమాల ప్రమోషన్ కోసం తన షోకు వస్తున్న తారలను ఆట, పాటలతో వదిలి పెట్టకుండా సరదాగా బంధుత్వం కూడా కలిపేస్తున్నాడు కపిల్. ఇటీవల హీరోయిన్ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ ను సెట్లోలోనే పెళ్లాడేసి తన కల నెరవేరిందని సంబరపడిన కపిల్.. ఇప్పుడు సోదరిని ఎంచుకున్నాడు. హీరోయిన్ సొనాక్షి సిన్హాతో రాఖీ కట్టించుకుని సోదరుడిగా మురిసిపోయాడు. తన తాజా సినిమా 'అకిరా' సినిమా ప్రమోషన్ కోసం కపిల్ షోకు వచ్చిన సొనాక్షి సెట్లో సందడి చేసింది. పనిలో పనిగా తన సినిమా విశేషాలను ఏకరువు పెట్టింది. మురుగదాస్ దర్శకత్వం వహించి నిర్మించిన 'అకిరా' సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకానుంది. -
హీరోయిన్ ను పెళ్లాడిన కపిల్ శర్మ!
కామెడీ కింగ్ కపిల్ శర్మ కోరుకున్న కల నెరవేరింది. అతడిని పెళ్లి చేసుకునేందుకు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ అంగీకరించింది. అయితే ఇదంతా నిజంగా జరగలేదు. కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొనడానికి వచ్చిన జాక్వెలెస్.. అతడిని పెళ్లి చేసుకుంటానని సరదాగా అంది. అంతేకాదు సెట్లో ఇద్దరు దండలు మార్చుకుని ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోను కపిల్ శర్మ తన ట్విట్టర్ పేజీలో పెట్టాడు. తనను సంతోషంగా ఉంచుతానని జాక్వెలెస్ మాట ఇచ్చిందని.. షాపింగ్ కు, అవుట్డోర్ కు తీసుకెళతానని చెప్పిందని కామెంట్ పెట్టాడు. గిఫ్ట్ లు కూడా ఇస్తానని చెప్పిందన్నాడు. తాను నటించిన 'ది ఫ్లైయింగ్ జాట్' సినిమా ప్రచారం కోసం జాక్వెలెస్.. కపిల్ శర్మ షోలో పాల్గొంది. అయితే కపిల్-జాక్వెలెస్ పెళ్లి ఫొటో చూసి అభిమానులు సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెట్టారు. u make me the happiest man @Asli_Jacqueline promise me u take me shopping,outdoor,gifts n will take care of me 4ever pic.twitter.com/6bgXln562d — KAPIL (@KapilSharmaK9) 9 August 2016 -
అబ్బే అసభ్యత లేదు.. కేవలం జోకులే!!
ముంబై: పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'లో నర్సును చూపించిన తీరుపై దుమారం రేగుతుండటంతో దీనిపై ఈ షో వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్ శర్మ స్పందించాడు. తమ షోను ఆందోళనకారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. షోలో భాగంగా నర్సు గురించి జోకులు వేసినంతమాత్రాన.. అది నర్సులందరికీ వర్తిస్తుందని భావించడం సరికాదన్నాడు. నర్సులను అసభ్యంగా షో చూపిస్తున్నారన్న వివాదం నేపథ్యంలో నర్సు పాత్రను షో కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా కొనసాగిస్తామని బదులిచ్చాడు. ఆ క్యారెక్టర్తో షోలో తాము కామెడీ మాత్రమే చేస్తున్నామని, అందులో అసభ్యత లేదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చాడు. 'ద కపిల్ శర్మ షో'లో 'హాట్' నర్సుగా రోచెల్లా రావును, స్థూలకాయమున్న నర్సుగా కికు శార్దాను చూపిస్తూ వెకిలీ హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారని అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు ఇటీవల రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా నర్సులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు. -
టీవీషోలో నర్సులను అవమానించిన యాంకర్!!
దేశంలోనే నంబర్ వన్ స్టాండప్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ. ఆయన యాంకర్ కమ్ స్టాండప్ కమెడీయన్గా వచ్చే పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'. హిందీ టీవీ రేటింగ్లో టాప్ పొజిషన్లో ఉన్న ఈ షోలో తాజాగా నర్సును చూపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నర్సులను దారుణంగా అవమానించేలా ఈ షోలో చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన నర్సులు మంగళవారం కపిల్ శర్మ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు. నర్సులంటే అంత చులకనా? నర్సులకు వ్యక్తిత్వం ఉండదని, వారిని సులువుగా లోబర్చుకోవచ్చుననే తప్పుడు పద్ధతిలో కపిల్ తన షోలో మమల్ని చూపించారని, అతనిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదుచేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. గతంలోనూ నర్సులను కించపరిచేలా కపిల్ శర్మ చూపించారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పంజాబ్ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమృత్సర్కు చెందిన కపిల్ శర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. 'ద కపిల్ శర్మ షో'లో నర్సు పాత్రలో కనిపిస్తున్న రొచెల్లె రావు వేసుకున్న నర్సు యూనిఫామ్ను కూడా అసభ్యంగా చూపిస్తున్నారని, ఈ షోలో తమను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'ట్విటర్'ను నవ్వించాడు!
ముంబై: కామెడీ కింగ్ కపిల్ శర్మ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. 'ద కపిల్ శర్మ షో'తో తాజా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడికి సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. సోనీ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ప్రసారమైన ఈ కార్యక్రమం గురించి ట్విటర్ లో లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయి. 10 లక్షలకు పైగా ఇంప్రెషన్లు పెట్టారు. కపిల్ షో చూసి నవ్వు ఆపులేకపోయామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం గురించి రెండు రోజుల్లో 1,08,000 కన్వర్జేషన్లు జరిగాయని ట్విటర్ ఇండియా హెడ్ విరాల్ జానీ తెలిపారు. ఇటీవల కాలంలో ఓ టీవీ కార్యక్రమం గురించి ఇంతమంది మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కాగా, తమపై కురిపించిన అభిమానానికి కపిల్ శర్మ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. కలర్స్ చానల్ లో ప్రసారమైన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. కలర్స్ చానల్ ఈ కార్యక్రమ ప్రసారం ఆపేయడంతో సోనీలో 'ద కపిల్ శర్మ షో'తో కపిల్ గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
కపిల్ కొత్త షో లో నరేంద్ర మోదీ?
ముంబై: 'ద కపిల్ శర్మ షో' అంటూ త్వరలో టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటుడు కపిల్ శర్మ బుర్రలో ఓ కొత్త ఐడియా తళుక్కుమంది. కొత్తదనం కోసం పరితపిస్తున్న ఆయన తాను చేస్తున్న తన కొత్త కామెడీ షోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూడాలనుకుంటున్నాడట. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' అంటూ నిన్నమొన్నటి వరకు టీవీ ఛానల్ లో బాలీవుడ్ ప్రముఖులు, స్పోర్ట్స్ సెలబ్రిటీలను ఆహ్వానించి ఆకట్టుకున్న కపిల్ శర్మ తన కొత్త షోలో రాజకీయ నాయకులతో కూడా హల్చల్ చేయనున్నాడట. ఈ నేపథ్యంలో మోదీ జీవితంలోని స్ఫూర్తివంతమైన కోణాన్ని ప్రజలకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాడట. తద్వారా రాజకీయ ప్రముఖులకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండాలని కోరుకుంటున్నానని కపిల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవల అమెరికాలోని ఓ టీవీ షోలో (ఎల్లెన్ డేజనెర్స్) బరాక్ ఒబామాను చూసిన తరువాత కపిల్ మదిలో ఈ ఆలోచన వచ్చిందట. మోదీ జీవితంలోని గొప్పఅంశాలను తనకు చాలా ప్రేరణనిచ్చాయని, ఆయనతో మాట్లాడి, నిర్ణయం తీసుకుంటానన్నాడు. అయితే ఈ షోలో రాజకీయాలు, పార్టీ వ్యవహరాలకు చోటు ఉండదట. కేవలం స్ఫూర్తివంతమైన ఆయన రాజకీయ జీవితాన్ని ప్రేక్షకులకు అందించాలన్నదే తన ఉద్దేశమంటున్నాడు. ఒక మారుమూల గ్రామం నుంచి, దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన మోదీ రాజకీయ ప్రస్థానం ద్వారా ఇతరులకు ప్రేరణ కలిగించాలని భావిస్తున్నట్లు కపిల్ శర్మ తెలిపాడు. మరోవైపు సహనటుడు కృష్టతో విభేదాలంటూ వచ్చిన వార్తలను కపిల్ ఖండించాడు. అలాంటిదేమీ లేదని ఇద్దరం కలిసి ఓ షో చేయబోతున్నట్లు అతడు స్పష్టం చేశాడు. కాగా పాపులర్ హిందీ కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' వ్యాఖ్యాత కపిల్ శర్మ ఇప్పుడు మరో కొత్త కామెడీ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23 నుంచి శని, ఆదివారాలలో తొమ్మిది గంటలకి ప్రసారంకానున్నీ షో ప్రమోషన్ కోసం ఢిల్లీ, లక్నో, భోపాల్, అమృత్ సర్ లాంటి ప్రముఖ నగరాలలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. -
కపిల్ కోతి గంతులు
గాసిప్ కలర్స్ టీవీలో ప్రతి ఆదివారం కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో కడుపుబ్బ నవ్వించే కామెడీ కింగ్ కపిల్ శర్మ కంటతడి పెట్టుకునే సీన్ క్రియేట్ అయింది. మొన్నీమధ్య జరిగిన ఇంటర్నేషనల్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్కి కపిలూ హాజరయ్యాడట. మస్తుగా మందుకొట్టి కల్లు తాగిన కోతిలా గంతులేశాడట. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ పిచ్చి వాగుడు వాగాడట. ఆ మైకంలోనే అక్కడే ఉన్న మరాఠీ నటి దీపాలీ సయ్యద్ చేయిపట్టుకొని డాన్స్ చేయబోయాడట. సోయి తప్పిన కపిల్ని కొట్టినంత పని చేసిందట ఆమె. పరిస్థితి శృతిమించుతోందని గమనించిన టీవీ యాక్టర్ శరత్కేల్కర్ కపిల్ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికీ ప్రయత్నించాడనీ నేషనల్ మీడియాలో ప్రచారం. అయితే కపిల్ మాత్రం ఇదంతా శుద్ధ అబద్ధం.. నేనంటే గిట్టని వాళ్లు నా మీద చేస్తున్న దుష్ర్పచారమని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అసలు నేనా ఫంక్షన్కే వెళ్లనే లేదు.. అదెప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఇదంతా ఎవరు కల్పించారో తెలియదు. ఏమైనా దీని వల్ల నేనో పాఠం నేర్చుకున్నాను.. అందరూ నాలాగే ఉంటారనుకోవడం తప్పని. మనతో బాగా మాట్లాడిన వాళ్లందరినీ మనవాళ్లు అనుకోకూడదని’ అంటూ వాపోతున్నాడు. -
నటితో కపిల్ అసభ్య ప్రవర్తన
ముంబై: 'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదా సంపాదించుకున్న కపిల్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. మరాఠి నటి దీపాలి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి అభాసుపాలయ్యాడు. తాను చేసిన పనికి ట్విటర్ లో క్షమాపణలు చెప్పాడు. ఇంటర్నేషనల్ మరాఠి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2015 పార్టీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాగినట్టు కనబడిన కపిల్ పలువురు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తనతో డాన్స్ చేయాలని బలవంతపెట్టాడు. మరాఠి నటి దీపాలిని కూడా ఇదే విధంగా బలవంతం చేశాడు. అతడితో డాన్స్ చేసేందుకు ఆమె నిరాకరించింది. 'నాతో డాన్స్ చేయాలని ఉందని కపిల్ చెప్పాడు. కానీ నేను అంగీకరించలేదు. అతడికి దూరంగా వెళ్లిపోయా. కపిల్ ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసినవారితోనే నేను డాన్స్ చేస్తా' అని దీపాలి తెలిపింది. ఈ ఘటనపై కపిల్ శర్మ క్షమాపణ చెప్పాడు. తాను అందరిలాంటి వాడినేనని, తప్పులు చేయడం మానవ సహజమని ట్వీట్ చేశాడు. I fall, I rise, I make mistakes, I live, I learn, I've been hurt but I am alive.i am human, I am not perfect but I am thankful :) — KAPIL (@KapilSharmaK9) November 3, 2015 -
'కిస్ కిస్కో ప్యార్ కరూ' రివ్యూ
టైటిల్: కిస్ కిస్కో ప్యార్ కరూ జానర్: కామెడీ డ్రామా తారాగణం: కపిల్ శర్మ, అర్బాజ్ ఖాన్, శరత్ సక్సెనా, ఇల్లి అవ్రం దర్శకత్వం: అబ్బాస్ మాస్తాన్ సంగీతం: జావిద్ మోహిన్, అంజాద్ నదీమ్ నిర్మాత: గణేష్ జైన్, రతన్ జైన్ బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న కపిల్ శర్మ తొలి ప్రయత్నంగా వెండితెర మీద అడుగుపెడుతూ చేసిన సినిమా 'కిస్ కిస్కో ప్యార్ కరూ'. స్మాల్ స్క్రీన్ మీద తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన కామెడీ టైమింగ్నే నమ్ముకొని సిల్వర్ స్క్రీన్ మీద కూడా అడుగుపెట్టాడు కపిల్ శర్మ. సీరియస్ సినిమాల దర్శకులుగా పేరున్న అబ్బాస్-మస్తాన్ జోడీ తొలిసారిగా కామెడీ జానర్లో తెరకెక్కించిన 'కిస్ కిస్కో ప్యార్ కరూ' ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం. కథ : వాస్తవానికి ఏ మాత్రం దగ్గరగా లేని కథతో తెరకెక్కిన సినిమా ఇది. శివరామ్ కిషన్ (కపిల్ శర్మ) అనుకోని పరిస్థితుల్లో మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ ముగ్గురు భార్యలనూ ఒకళ్లకు తెలియకుండా ఒకళ్లను మెయిన్టెయిన్ చేయడం కోసం శివరామ్ కిషన్ నానా అవస్థలు పడుతుంటాడు. ఇందుకు అతని ఫ్రెండ్ లాయర్ అయిన కరణ్ (వరుణ్ శర్మ) సాయం చేస్తుంటాడు. ఈ సమస్యలు చాలవన్నట్టు అదే సమయంలో దీపిక (ఇల్లీ అవ్రం)తో ప్రేమలో పడతాడు. ముగ్గురు భార్యలుతో పాటు గర్ల్ ఫ్రెండ్కు సమయం ఇవ్వలేక కపిల్ శర్మ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అదే సమయంలో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బావమరిది, మామలను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు సాంకేతిక నిపుణులు : ఈ సినిమాతో స్మాల్ స్క్రీన్ మీదే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడ తన కామెడీ టైమింగ్కు తిరుగులేదని నిరూపించుకున్నాడు కపిల్ శర్మ. తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి పర్ఫెక్ట్ జానర్ని ఎంచుకున్న కపిల్ శర్మ.. నటుడిగా మెప్పించాడు. కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే బాలీవుడ్ ఆడియన్స్ను మెప్పించాడు. వరుణ్ శర్మ కూడా కామెడీ టైమింగ్తో అలరించాడు. అర్బాజ్ ఖాన్, శరత్ సక్సెస్ తన పాత్ర మేరకు బాగానే నటించినా, కీలక పాత్రలో నటించిన ఇల్లి అవ్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ షో తప్ప నటనపరంగా ఏమాత్రం విషయం లేదనిపించింది. తొలిసారిగా కామెడీ జానర్ను డీల్ చేసిన దర్శకలు అబ్బాస్-మస్తాన్ మంచి విజయం సాధించారు. సినిమా ఫస్ట్ టు ఎండ్ ఎక్కడా స్పీడు తగ్గకుండా నవ్వులు పూయించారు. అయితే కొన్ని సీన్స్ విషయంలో లెంగ్త్ ఎక్కువ అయినట్టు అనిపించటం మాత్రం ఇబ్బంది పెడుతుంది. సినిమా ఆద్యంతం ఎక్కడా లాజిక్కు తావులేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ముగ్గురు భార్యలూ ఒకే బిల్డింగులో ఉన్నా.. ఒకరికి ఒకరు తెలియకపోవటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. కామెడీ సినిమాలకు ప్రాణం లాంటి మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అయ్యారు. భం భం బోలో పాట ఒక్కటి తప్ప మరే సాంగ్ గుర్తుండే ఛాన్స్ లేదు. విశ్లేషణ : టీవీ స్టార్ కపిల్ శర్మ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం చేసిన తొలి ప్రయత్నంలో మంచి విజయం సాధించాడనే చెప్పాలి. ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ తన కామెడీ టైమింగ్తో సినిమాను వన్ మేన్ షోగా నడిపించాడు. ఇప్పటివరకు కామెడీ సబ్జెక్ట్ను డీల్ చేసిన అనుభవం లేకపోయినా అబ్బాస్ మస్తాన్ లు కిస్ కిస్కో ప్యార్ కరూ మూవీని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ పరంగా నిరాశపరిచినా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం సినిమాకు ప్లస్ అయ్యింది. ప్లస్ పాయింట్స్ కపిల్ శర్మ కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ లాజిక్ లేని స్టోరీ మ్యూజిక్ ఓవరాల్గా కిస్ కిస్కో ప్యార్ కరూ పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా మంచి మార్కులే సాధించింది. -
'నా ఫస్ట్ మూవీపై దిగులే లేదు'
న్యూఢిల్లీ : తన తొలి మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూ' గురించి దిగులు లేదని, ఎలాంటి ఆందోళన చెందడం లేదని బాలీవుడ్ వర్ధమాన కమెడియన్ కపిల్ శర్మ అన్నాడు. ఈ మూవీ తనకు మంచి కెరీర్ ఇస్తుందని, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం చాలా కాలం పాటు కొనసాగేలా చేస్తుందంటూ ఆశలు పెట్టుకున్నాడు. 'కమెడీ నైట్స్ విత్ కపిల్' అనే హిందీ టీవీ ప్రోగ్రాం ద్వారా తనకంటూ అభిమానులను సంపాదించకున్నాడు కపిల్. దీంతో తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకోవాలని ఉబలాట పడుతున్నాడు. అబ్బాస్-మస్తాన్ల ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ పాటలు, ట్రైలర్ లకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నాడు. కమెడీ కాంపిటీషన్ 2007, 2013లలో విజేతగా నిలిచి తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, ఆ తర్వాత తన సొంత బ్యానర్ k9 లో కామెడీ నైట్స్ విత్ కమిల్ అనే టీవీ షో రూపొందించాడు. అయితే మూవీలలో నటిస్తున్నప్పటికీ టీవీ షోలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తన తొలి మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూ' ఈ నెల 25న విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు ఈ టీవీ స్టార్. -
కపిల్ షాక్!
ఏంటో ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోలను టీవీ తారలు పెద్దగా లెక్క చేయడం లేదు! మొన్నీమధ్య అభిషేక్బచ్చన్తో ఓ షోలో కనిపించడానికి ఇద్దరు టీవీ స్టార్ నటీమణులు నో చెప్పారు. ఆ తరువాత షారూఖ్తో ఎపిసోడ్లో తన అప్పియరెన్స్ కుదరదంటూ మరో బుల్లి తెర భామ తెగేసి చెప్పింది. తాజాగా షారూఖ్కే మరో షాక్! ‘కామెడీ విత్ కపిల్’తో బాగా పాపులర్ అయిన కపిల్శర్మ... షారూఖ్ ఆఫర్ను కాదన్నాడట! బాలీవుడ్ బాద్షా యాంకర్గా లాంచ్ అవుతున్న న్యూ గేమ్ షో ‘ఇండియా పూచేగా సబ్సే షానా కౌన్’లో గెస్ట్గా కనిపించేందుకు కపిల్ కుదరదన్నాడనేది ఓ వెబ్సైట్ కథనం. అయితే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ను టెలీకాస్ట్ చేస్తున్న కలర్స్ యాజమాన్యం తమ కాంపిటీటివ్ ప్రోగ్రామ్లో కనిపించవద్దంటూ ఆర్డర్ పాస్ చేసిందట. కానీ... ఈ విషయాన్ని సదరు చానల్ ప్రతినిధులు ఖండిస్తున్నారు. కనిపించాలా... వద్దా అన్నది కపిల్ వ్యక్తిగత వ్యవహారమంటూ కొట్టిపారేశారట!