Malayalam Movie
-
ఓటీటీకి వచ్చేసిన త్రిష థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని.. ఎలా ఉందంటే?
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.- ఇంటూరు హరికృష్ణ. -
ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు
ఈ ఏడాది తెలుగు సినిమా రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. మిగతా చిత్రపరిశ్రమల్లో ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఎందుకంటే జనవరి నుంచి వరసగా మలయాళంలో ప్రతి నెలా ఒకటి రెండు హిట్ సినిమాలు వచ్చాయి. అవి కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. అలా ఈ ఏడాది రిలీజైన కొన్ని మలయాళ బెస్ట్ మూవీస్.. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి. వాటి సంగతేంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)మొత్తంగా 18 సినిమాల్ని వేరే ఆలోచన లేకుండా చూసేయొచ్చు. వీటిలో కామెడీ, యాక్షన్, హారర్, థ్రిల్లర్, రొమాంటిక్.. ఇలా అన్ని జానర్స్ ఉన్నాయి. పైపెచ్చు ఈ జాబితాలో ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఏడాది మంచి సినిమాలు చూస్తూ ముగించాలనుకుంటే ఈ మూవీస్ బెస్ట్ ఆప్షన్. అస్సలు డిసప్పాయింట్ అయ్యే అవకాశముండదు.ఈ ఏడాది రిలీజైన బెస్ట్ మలయాళ మూవీస్భ్రమయుగం - సోనీ లివ్ (తెలుగు)ఆవేశం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)మంజుమ్మల్ బాయ్స్ - హాట్స్టార్ (తెలుగు)ద గోట్ లైఫ్ - నెట్ఫ్లిక్స్ (తెలుగు)అడియోస్ అమిగో - నెట్ఫ్లిక్స్ (తెలుగు)ఏఆర్ఎమ్ - హాట్స్టార్ (తెలుగు)ఆట్టం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ - ముబి (మలయాళం)అన్వేషిప్పిన్ కండేతుమ్ - నెట్ఫ్లిక్స్ (తెలుగు)గురువాయుర్ అంబలనడియిల్ - హాట్స్టార్ (తెలుగు)కిష్కింద కాండం - హాట్స్టార్ (తెలుగు)గోళం - అమెజాన్ ప్రైమ్ (తెలుగు)ప్రేమలు - ఆహా (తెలుగు)పని - సోనీ లివ్ (తెలుగు) (ఇంకా స్ట్రీమింగ్ కావాలి)తలవన్ - సోనీ లివ్ (తెలుగు)ఉళ్లోరుక్కు - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)సూక్ష్మదర్శిని - ఓటీటీలోకి రావాల్సి ఉందివాళా - హాట్స్టార్ (తెలుగు)(ఇదీ చదవండి: 2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?) -
తెలుగు రిలీజ్ అవుతున్న మలయాళ హిట్ సినిమా
రీసెంట్గా మలయాళంలో హిట్టయిన సినిమా 'పని'. ప్రముఖ నటుడు జోజూ జార్జ్.. ప్రధాన పాత్రలో నటించిన దర్శకత్వం వహించాడు. ఈ నెల 13న థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అభినయ జోజూకి జోడీగా నటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో మంగళవారం జరిగింది.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)ఈ మూవీ డిసెంబర్ 20న సోనీ లివ్ ఓటీటీలో వస్తుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగు రిలీజ్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యంగానే ఉండనుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ చెప్పారు. తెలుగు వెర్షన్.. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత తర్వాతే ఓటీటీలోకి వస్తుందని అన్నారు.'పని' కథ విషయానికొస్తే.. రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే తీశారు. కానీ జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్ప్లేతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు జోజూ జార్జ్. గతంలో తెలుగులో 'ఆదికేశవ' మూవీలో విలన్గా ఇతడు నటించాడు.(ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న 'పుష్ప'.. శ్రీవల్లి మిస్!) -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా 'కిష్కింద కాండం' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)'పుష్ప 2'లో భన్వర్ సింగ్ షెకావత్గా త్వరలో రాబోతున్న ఫహాద్ ఫాజిల్.. రీసెంట్గా మలయాళంలో 'బౌగెన్విల్లా' అనే సినిమా చేశారు. కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మాదిరి హిట్ అయిన ఈ చిత్రాన్ని డిసెంబరు 13 నుంచి సోనీ లివ్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు.'బౌగెన్విల్లా' విషయానికొస్తే డాక్టర్ రాయిస్ థామస్ (కుంచకో బోబన్), రీతు (జ్యోతిర్మయి) భార్యాభర్తలు. వీళ్లిద్దరూ ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో రీతు గతం మర్చిపోతుంది. అంతకు కొన్నిరోజుల క్రితం రీతు.. ఓ అమ్మాయిని ఫాలో అవుతుంది. ఆమె మినిస్టర్ కూతురు. కొన్నాళ్లకు మిస్ అవుతుంది. దీంతో ఆమె కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ కోషి (ఫహాద్ ఫాజిల్) రీతు దగ్గరకు వస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)Every petal tells a story, every twist leaves you guessing. #Bougainvillea blooms this 13th December only on #SonyLIV.#Bougainvillea #BougainvilleaOnSonyLIV #SonyLIV #AmalNeerad #KunchackoBoban #Jyothirmayi #FahadFaasil #Srindaa #VeenaNandakumar #Sharafudheen pic.twitter.com/NdXQkBMWiZ— Sony LIV (@SonyLIV) November 30, 2024 -
మరో వివాదం.. 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలపై ఐటీ రైడ్
ఈ ఏడాది రిలీజైన అద్భుత సినిమాల్లో 'మంజుమ్మెల్ బాయ్స్' ఒకటి. పేరుకే మలయాళ మూవీ గానీ తెలుగు, తమిళంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ ఇదంతా నాణెనికి ఒకవైపు. మరోవైపు చూస్తే నిర్మాతలు.. తమతో పాటు మూవీని నిర్మించిన భాగస్వామిని మోసం చేశారు. లాభాల్లో వాటా ఇవ్వలేదని అతడి కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్మాణ సంస్థ ఆఫీస్పై రైడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)స్నేహితుడు గుహలో పడిపోతే మిగిలిన 10 మంది స్నేహితులు కలిసి అతడిని ఎలా కాపాడారు అనే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ప్రముఖ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగానూ వ్యవహరించాడు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే లాభాలకు.. కట్టిన ట్యాక్స్కి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా ఐటీ రైడ్లో అధికారులు గుర్తించారు. కొచిలోని పరవ ప్రొడక్షన్ ఆఫీస్లో గురువారం తనిఖీలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్లోనే 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు.. వివాదంలో చిక్కుకున్నారు. తాను కూడా సినిమా నిర్మాణంలో భాగమని.. అయితే లాభాల్లో వాటా ఇచ్చే విషయంలో మోసం చేశారని ఓ వ్యక్తి.. వీళ్లపై మారాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అది కోర్ట్ వరకు చేరుకోవడంతో సదరు నిర్మాతల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఐటీ రైడ్స్ చేయడంతో మరోసారి 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు హాట్ టాపిక్ అయ్యారు. మరి ఎన్ని కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారనేది అధికారులు బయటపెట్టాల్సి ఉంది!(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో మాత్రం థ్రిల్లర్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా సెప్టెంబరులో రిలీజైన ఓ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. రూ.5 కోట్లు పెడితే రూ.50 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ 'కిష్కింద కాండం'. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 19 నుంచి హాట్స్టార్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్)'కిష్కింద కాండం' విషయానికొస్తే.. అజయన్ (అసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పటికే అజయన్కి పెళ్లయి బాబు కూడా పుడతాడు. కానీ భార్య చనిపోవడంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇది జరిగిన కొన్నిరోజులకే కొడుకు మాయమవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయన్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా స్టోరీ.చివరి వరకూ సినిమాలో ట్విస్ట్ను కొనసాగించడంతో పాటు థ్రిల్ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు సినిమా తీశాడు. 'కిష్కింద కాండం' టైటిల్ పెట్టడానికి కూడా కారణముంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సందర్భంలో మనిషి శవం ఉండాల్సిన చోట కోతి శవం కనిపిస్తుంది. ఇలా మొదటి నుంచి చివరివరకు ట్విస్టులు, థ్రిల్స్ మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బిగ్బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?) -
తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి
మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా ఫామ్లోనే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గ్యాప్ దొరికితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మలయాళంలోనూ గతేడాది ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రమే తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఉత్తరాదికి చెందిన తమన్నా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది నవంబర్లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఘోరంగా ఫెయిల్ అయింది. రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో డిజిటల్ మార్కెట్ కూడా జరగలేదు. అలా మూలన పడిపోయింది.ఇన్నాళ్లకు 'బాంద్రా' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 15న లేదా 22న స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు. 'బాంద్రా' విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్స్టర్తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ)
నడి సముద్రంలో ఓ బోటు. అందులోనే రెండున్నర గంటల సినిమా అంటే.. హా ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ 'కొండల్' అనే డబ్బింగ్ బొమ్మ నిజంగానే ఆశ్చర్యపరిచింది. చూస్తున్నంతసేపు సముద్రం మధ్యలో బోటులో ఉన్నామా అనేంతలా మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?'కొండల్' కథ విషయానికొస్తే.. అదో సముద్ర తీర ప్రాంతం. ఎందరో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లలో ఒకడే ఇమ్మాన్యుయేల్ (ఆంటోని వర్గీస్). ఎలాంటి వాడితోనైనా సరే ఢీ కొట్టే రకం. ఓసారి కొత్త బృందంతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తాడు. తమ బోటులోకి కొత్తగా వచ్చిన ఇతడిపై జూడ్ (షబీర్) గ్యాంగ్ కన్నేసి ఉంచుతారు. కొన్నిరోజులకు ఇమ్మాన్యుయేల్ గురించి ఓ సీక్రెట్ తెలుస్తుంది. కాదు కాదు అతడే చెబుతాడు. దీంతో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు? ఇమ్మాన్యుయేల్ ఎవరు? డేనియల్ అనే వ్యక్తితో ఇతడికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)'కొండల్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో రివేంజ్ స్టోరీతో తీసిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. రెండున్నర గంటల సినిమాలో దాదాపు రెండు గంటల పాటు కథంతా సముద్రం మధ్యలో ఓ బోటులోనే ఉంటుంది. అసలు బోటులో ఏం స్టోరీ చెప్పగలరు? మహా అయితే ఏం చూపిస్తారులే అని మనం అనుకుంటే పప్పులే కాలేసినట్లే.మత్స్యకారులు జీవితాలు ఎలా ఉంటాయి? రోజుల తరబడి వేటకు వెళ్లిన వాళ్లు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు? ఒకవేళ వేటకు వెళ్లిన వాళ్లలో గ్రూపులు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే విషయాలని చాలా నేచురల్గా చూపించారు. ఇవన్నీ ఓ వైపు నడుస్తుంటాయి. మరోవైపు రివేంజ్ డ్రామా నడిపిన విధానం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా స్టోరీ సెటప్ కోసం వాడుకోగా.. ఇంటర్వెల్కి హీరో గురించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో vs విలన్ అన్నట్లు సాగుతుంది. అయితే సెకండాఫ్లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్లో షార్క్ ఫైట్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఇంకా చెప్పాలంటే షార్క్ ఫైట్ అనేది 'దేవర'లో కంటే ఈ సినిమాలో ఇంకాస్త రిచ్గా చూపించారు.సినిమాలోని సీన్స్తో పాటు ప్రతి మాట కూడా ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నటీనటులెవరు అనే విషయం పక్కనబెడితే తెరపై పాత్రల స్వభావం మాత్రమే కనిపిస్తుంది. మూవీలో యాక్ట్ చేసిన ఏ ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసుండరు. కానీ సినిమా మొదలైన కాసేపటికే లీనమైపోతాం. ఓటీటీలో ఏదైనా మంచి యాక్షన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే 'కొండల్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్హిట్గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్ను అలరించేందుకు వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా.. ఈ ఏడాది జూన్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రెసా పాల్ తెరకెక్కించారు.Don't miss the heartwarming journey of #littlehearts. Premieres October 24th on aha. pic.twitter.com/GRHtwgghY7— ahavideoin (@ahavideoIN) October 21, 2024 -
'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.ఎవరెలా చేశారు?యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.-చందు డొంకాన -
కేన్స్ అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్కి రెడీ
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తీసిన సినిమా 'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్'. కని కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది మేలో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందనతో పాటు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా మన దగ్గర థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్' సినిమాని అక్టోబరు 2న ఫ్రాన్స్లో రిలీజ్ చేయనున్నారు. అంతకు ముందే సెప్టెంబరు 21న కేరళలోని కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేస్తారని తెలుస్తోంది. భారత దేశవ్యాప్తంగా తెలుగు హీరో రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణ సంస్ఛ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.మలయాళ వెర్షన్ సినిమా 'ప్రభయయ్ నీనచతళం' పేరుతో రిలీజ్ కానుంది. కథ విషయానికొస్తే ముంబైలో పనిచేస్తున్న కేరళ నర్సులు ప్రభ, అను జీవితాల్లో జరిగిన సంఘటనల ఏంటి? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్తో దీన్ని తెరకెక్కించారు. ఇకపోతే వచ్చే ఏడాది ఆస్కార్ బరిలోనూ ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ దేశం ఈ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) -
షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి
ప్రముఖ నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేవతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించింది. కొద్దిరోజుల క్రితం కోజికోడ్కు చెందిన సజీర్ (33), దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్పై సంచలన ఆరోపణలు చేశాడు. సుమారు పదేళ్ల క్రితం తనపై దర్శకుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూనే, రేవతి పేరును కూడా బయటపెట్టాడు. తన వ్యక్తిగత ఫోటోలు రేవతికి రంజిత్ పంపాడని అతడు ఆరోపించాడు. దీంతో ఈ వార్త పెను సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!)అవి నిజం కాదు సజీర్ చేసిన ఆరోపణలపై నటి రేవతి ఇప్పుడు స్పందించింది. దర్శకుడు రంజిత్.. యువకుడి నగ్న చిత్రాలని తనకు పంపారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్లో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే?సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ రంజిత్ని సంప్రదిస్తే ఒక హోటల్కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సజీర్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నటి రేవతి పేరును తీసుకొచ్చాడు. 'దర్శకుడు రంజిత్ గదిలోకి నేను వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫొటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను' అని సజీన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్కుమార్) -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్డోర్లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్డోర్లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్షిప్కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా
మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రీసెంట్గా ఓ నివేదిక సమర్పించింది. ఇందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడి రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు మోహన్ లాల్ తొలుత రాజీనామా చేయగా.. పాలక మండలిలోని మిగిలిన సభ్యులందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఈ మేరకు 'అమ్మ' సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో వీళ్లంతా నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. అలానే రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి, కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.అమ్మ సంఘంలో నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మలయాళ చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీల వల్ల బోలెడు ఉపయోగాలు. ఇందుకు తగ్గట్లే పలు భాషల్లో డబ్బింగ్ చిత్రాలన్నీ నేరుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. గతేడాది రిలీజైన 'నల్ల నిళవుల రాత్రి' చిత్రాన్ని 'కాళరాత్రి' పేరుతో డైరెక్ట్ ఓటీటీలో తెచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీల్లో ఉన్నాయ్?)బాబు రాజ్, చెంబన్ వినోద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'కాళరాత్రి'.. ఆగస్టు 17 అంటే ఈ శనివారమే ఓటీటీలోకి రానుంది. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. ఒరిజినల్ లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో అది కూడా నేరుగా ఓటీటీలోనే వచ్చేస్తుంది. కాబట్టి వీకెండ్లో మంచి ఆప్షన్ అవ్వొచ్చు.'కాళరాత్రి' విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం. తక్కువ ధరకే వచ్చేస్తుందని 266 ఎకరాలని తోట కొనడానికి వెళ్తారు. తీరా చూస్తే తోట మధ్యలో గెస్ట్ హౌస్. దీంతో అక్కడ పార్టీ చేసుకుంటారు. అనూహ్య ఘటనలు జరిగి వీళ్లలో కొందరు చనిపోతారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు ఎలా చనిపోతున్నారు అనేదే స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?
కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'ఆట్టం' (మలయాళం) నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అవార్డ్ వచ్చేంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉందోనని తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.'ఆట్టం' విషయానికొస్తే.. కేరళలో ఓ నాటక బృందం. పనిచేసుకుంటూ వీలు దొరికినప్పుడు నాటకాలు ప్రదర్శించే 12 మంది. వీళ్లకి తోడు అంజలి (జరీన్ షిబాబ్) అనే అమ్మాయి. ఓసారి వీళ్ల ప్రదర్శన ఓ విదేశీ జంటకి తెగ నచ్చేస్తుంది. దీంతో తమ రిసార్ట్లో వీళ్లకు ఆతిథ్యమిస్తుంది. రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. తన గదిలో కిటికీ పక్కన పడుకున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అంజలితో అలా ప్రవర్తించింది ఎవరు? దీన్ని ఎలా బయటపెట్టింది అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?)మనుషులు పైకి కనిపించేంత మంచోళ్లు కాదు. ప్రతిఒక్కరిలోనూ రెండు ఫేస్లు ఉంటాయి. పైకి మంచిగా కనిపిస్తుంటారు కానీ కొన్నిసార్లు అవసరానికి తగ్గట్లే ప్లేట్ ఫిరాయించేస్తుంటారు. మంచోడిని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసేలా మాట్లాడటానికైనా అస్సలు మోహమాటపడరు. ఇలా మనకు బాగానే తెలిసిన కాన్సెప్ట్తో తీసిన సినిమా 'ఆట్టం'.ఇందులో హీరోయిన్తో ఎవరు అసభ్యంగా ప్రవర్తించారో చెప్పే క్రమంలో మనిషి నైజం, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం.. వ్యక్తి మనకు నచ్చకపోతే అతడేం చేసినా మనకు నచ్చదని చూపించిన వైనం అలరిస్తుంది. అలానే అందరూ ఎవరికీ వాళ్లు ఆలోచిస్తారు కానీ బాధింపబడ్డ అమ్మాయి మానసిక పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోకపోవడం లాంటి సీన్లు మనిషి ఇప్పుడున్న కాలంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పకనే చెబుతాయి. (ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
OTT: మలయాళ మూవీ ‘పేరడైజ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘పేరడైజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రముఖ దర్శకులు మణిరత్నం సమర్పించిన సినిమా ‘పేరడైజ్’. శ్రీలంక, ఇండియా రచయితలు కలిసి రాసిన కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రసన్న దర్శకుడు. రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ‘పేరడైజ్’ పూర్తిగా శ్రీలంకలో తీసిన సినిమా. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... ఓ జంట తమ ఐదో వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకలోని ఓ సుదూర గెస్ట్ హౌస్కు వెళుతుంది. ఆ గెస్ట్ హౌస్ కొండల మధ్యలో చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దానికి దరిదాపులో ఓ చిన్న గ్రామం ఉంటుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికీ శ్రీలంక దేశం మొత్తం ఉద్యమంతో ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. ఈ జంట నివసిస్తున్న గెస్ట్ హౌస్లో ఓ రాత్రి దొంగతనం జరిగి వారి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వీరు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నదే కథ. ఈ సినిమా మొత్తంలో స్క్రీన్ప్లే కొంత ల్యాగ్ అపించినా ఆఖరి ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనిది. అలాగే సినిమా మొత్తంలో సీతమ్మ, హనుమంతులు తిరిగిన ప్రదేశాలు చూపించడం, వాటి వివరణ ఇవ్వడం బావుంది. సినిమా మొత్తం చాలావరకు గ్రీనరీ చూడవచ్చు. ఎందుకంటే లంక అనేది రావణుని పేరడైజ్ కాబట్టి. మరి... మీరు కూడా ఈ ‘పేరడైజ్’ని ప్రైమ్ వీడియోలో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం
ఓటీటీలోకి మరో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. పెద్దగా హడావుడి లేకుండానే నెటిజన్ల కోసం అందుబాటులోకి వచ్చేసింది. మర్డరీ మిస్టరీ కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ మలయాళంలో చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్గా నిలిచింది. పలువురు దర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది ఫుల్ ఫామ్లో ఉంది. జనవరి నుంచి మొదలుపెడితే హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. అలానే చిన్న సినిమాలతోనూ అలరిస్తోంది. అలా జూన్లో థియేటర్లలో రిలీజైన మూవీ 'గోళం'. హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు కొత్తగా పరిచయమైన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: చైతూ- శోభిత నిశ్చితార్థం.. వీళ్లిద్దరూ తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్తో పాటు చాలామంది 'గోళం' చిత్రం చూసి మెచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్లో తీసినా స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇది నచ్చేసింది.'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్గా పలుకుబడి ఉన్నోడు కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ అయిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానిస్తాడు. మరి కిల్లర్ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ) -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో హిట్ సినిమా ఓటీటీ రిలీజ్కి రెడీ అయిపోయింది. గత నెలల థియేటర్లలోకి వచ్చిన 'వర్షంగల్కు శేషం' అనే మలయాళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన దీన్ని 80ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మూవీస్కి రిలేట్ అయ్యే కథలంటే ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చేస్తుంది!'వర్షంగల్కు శేషం' కథ విషయానికొస్తే.. 80-90ల్లో కేరళ. వేణు(ధ్యాన్ శ్రీనివాసన్)కి చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి. వీటి ద్వారానే సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయమవుతాడు. ఇతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుంగదని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చెన్నై (ఒకప్పటి మద్రాసు) వెళ్తారు. మురళి ప్రయత్నంతో వేణు దర్శకుడు అవుతాడు. కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా ఎలా చేశారు? చివరకు ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
'పుష్ప' విలన్ క్రేజీ మూవీ.. 'ఆవేశం'తో హిట్ కొట్టాడు
సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్ గా నిలిచింది మాత్రం 'టిల్లు స్క్వేర్'నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరసపెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజైతే చూసి ఆదరించడంతో పాట కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. 'ఆవేశం' అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. తాజాగా మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'ఆవేశం' కథ విషయానికొస్తే.. బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరుమోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫహాద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రంపై ఆల్రెడీ తెలుగు నిర్మాతల దృష్టి పడిందట. 'పుష్ప'తో ఫహాద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి త్వరలో 'ఆవేశం' రిలీజ్ పక్కా ఉంటుందట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు.. తెలుగులోనూ వస్తోన్న థ్రిల్లర్ మూవీ!
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్లోని గుణకేవ్లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥 Grand release worldwide on April 6th. Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024 -
బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత
ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మలయాళ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. అందరూ ఈ సినిమా గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీని డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ ఏకిపారేశారు. ఇదో చెత్త సినిమా, కేరళ వాళ్లంతా లోఫర్స్ అని దారుణమైన విమర్శలు చేశారు. ఇంతకీ ఏమైంది? 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుహలో కేరళ కుర్రాడు పడిపోయాడు. అప్పుడు కూడా వచ్చిన స్నేహితులు అతడిని రక్షించారు. ఇదే కథతో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా తీశారు. ఇప్పటివరకు దీనికి రూ.150 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన కుర్రాళ్లంతా మందు తాగుతూ, జల్సా చేస్తూ ప్రమాదానికి గురవుతారు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రచయిత జయమోహన్ ఘోరమైన విమర్శలు చేశారు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) రచయిత ఏమన్నారు? 'కేరళ అడవుల్లో, అక్కడి యువకులు తాగి పడేసిన మందు బాటిల్స్ విరగ్గొడుతున్నారు. ఆ పెంకులు గుచ్చుకుని చాలా ఏనుగులు చనిపోతున్నాయి. మలయాళ టూరిస్టులు ఎక్కడికెళ్లినా అలాంటి పనులే చేస్తారు. తాగి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పని. అదో చెత్త సినిమా. నా దృష్టిలో 'మంజుమ్మల్ బాయ్స్'.. ఓ పనికిమాలిన మూవీ' అని జయమోహన్ విమర్శించారు. రైటర్ జయమోహన్ వ్యాఖ్యలపై సగటు కేరళ ప్రేక్షకుడు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరో కొందరు చేసిన పనికి ఇలా అందరినీ ఆపాదించి చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అందరూ హిట్ అని తెగ మురిసిపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి జయమోహన్ వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం? (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు. సస్పెన్షన్లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్లో ఉంటుంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. ఎవరెలా చేశారు? అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ సంస్థల లెక్కలు మారిపోయాయి. అప్పట్లో ఎగబడిపోవట్లేదు. కోట్లు పెట్టి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోవట్లేదు. ఇప్పుడు దీని వల్ల కొన్ని హిట్ చిత్రాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ దీని ఓటీటీ లెక్క మాత్రం ఇంకా తెగట్లేదట. ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' రచ్చ లేపింది. ఫిబ్రవరిలో మాత్రం టాలీవుడ్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు ఇదే ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నాయి. వీటిలో ఒకటే 'మంజుమ్మల్ బాయ్స్'. కేరళలోని మంజమ్మల్ అనే ఊరిలోని కొందరు కుర్రాళ్లు.. కొడైకెనల్ ట్రిప్కి వెళ్తారు. ఇందులో ఒకడు అనుకోకుండా ఓ గుహలో పడిపోతాడు. మిగతా వాళ్లందరూ కలిసి ఈ ఒక్కడిని ఎలా కాపాడారు ఏంటనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) స్టోరీ సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ.. సర్వైవల్ డ్రామా సినిమాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంంటోంది. కేరళ, తమిళనాడులో దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూళ్లు, ఓవరాల్గా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా తెగలేదట. మూవీ టీమ్ ఏమో రూ.20 కోట్ల వరకు అడుగుతుంటే.. పలు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో 'మంజుమ్మల్ బాయ్స్'ని చాలామంది చూసేశారు. కాబట్టి ఓటీటీలో ఓ మాదిరి రీచ్ ఉంటుందని ఆయా సంస్థలు కారణాన్ని చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మార్చి 15న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ సౌండ్ పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్ విడుదలపై, అలానే ఓటీటీ స్ట్రీమింగ్పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) -
'అమీర్పేట్లో అలాంటి కోచింగ్ కూడా ఉంటే బాగుండు'..!
మలయాళంలో హిట్గా సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ప్రేమలు'. కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ట్రైలర్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి రొమాంటిక్ ప్రేమకథ యూత్ను అలరించండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమాలు రానున్నాయి. ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్తో కలిసి హైదరాబాద్కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెబుతూ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏ సినిమా? '2018' ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజ జీవిత సంఘటనలతో 90స్ బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకున్నాయి. (ఇదీ చదవండి: శివరాత్రికి ఓటీటీలో హనుమాన్ సినిమా) సినిమా కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) సబ్ ఇన్స్పెక్టర్. హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లిన లవ్లీ అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని ఆనంద్కి అప్పగిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో ఇతడిని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో కేసు. ఇది ఓ అమ్మాయి పరువు హత్య కేసు. ఇలా రెండు డిఫరెంట్ కేసుల్ని ఎస్ఐ ఆనంద్, తన బృందంతో కలిసి ఎలా డీల్ చేశాడు? చివరకు ఏమైందనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా స్టోరీ. ఓటీటీలో ఎప్పుడు? మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మధ్యే సరైన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. కాబట్టి ఇది తెలుగు ఆడియెన్స్కి నచ్చే ఛాన్సులున్నాయి. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
మలయాళ బ్లాక్బస్టర్ హిట్ సినిమా.. తెలుగు రిలీజ్కి రెడీ
మరో మలయాళ హిట్ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ప్రేమలు'.. కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్కి రెడీ అయింది. (ఇదీ చదవండి: లండన్లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ.. 'ప్రేమలు' సినిమా తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారట. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్స్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. 'ప్రేమలు' సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్తో కలిసి హైదరాబాద్కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఉన్నంతలో 'ఊరి పేరు భైరవకోన' మాత్రమే ఎంటర్టైన్ చేస్తోంది. మరోవైపు ఈ వారమే రిలీజైన మలయాళ చిత్రాలు 'భ్రమయుగం', 'ప్రేమలు' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటి గురించి తెలుగు ప్రేక్షకుల డిస్కస్ చేస్తుండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఈ రెండు మూవీస్లో అంతలా ఏముంది? కలెక్షన్స్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సినిమా అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉండాల్సిందే. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో తీసిన 'భ్రమయుగం'లో నటించాడు. నలుపు తెలుపు కలర్కి తోడు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ మెల్లమెల్లగా కనెక్ట్ అవుతున్నారు. స్టోరీ పరంగా అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. హైదరాబాద్లోనూ దీనికి డిమాండ్ గట్టిగానే ఉందండోయ్. రెండు రోజుల్లోనే దీనికి రూ.10 కోట్ల వరకు వసూళ్లు దక్కాయి. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) 'ప్రేమలు' అనే మలయాళ యూత్ఫుల్ లవ్స్టోరీ కూడా వారం క్రితం థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. బ్యాక్ డ్రాప్ అంతా దాదాపు హైదరాబాద్లోనే ఉండటంతో మనోళ్లు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్స్ కూడా రూ.35 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లు పెట్టి తీస్తే ఈ రేంజు వసూళ్లు వచ్చేసరికి మన నిర్మాతలు కూడా దీన్ని రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసేయాలని చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలు కూడా వేటికవే విభిన్నంగా ఉండటంతో పాటు కాస్త డిఫరెంట్ ఫీల్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన 'భ్రమయుగం' కొందరికి కనెక్ట్ కాగా.. యూత్కి నచ్చే విషయంలో 'ప్రేమలు' ఫుల్ మార్క్స్ కొట్టేస్తోంది. టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలో వీటిని తెలుగులో కూడా డబ్ చేసి వదలబోతున్నారట. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్కి ముందే నోటీసులు) -
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జయరాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు. కాగా.. జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్లో రిలీజవ్వగా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగమతి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్లో కనిపించనున్నారు. -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
సూపర్స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్!
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన కొత్త సినిమా 'మలైకోట్టై వాలిబన్'. లిజో జోస్ పల్లిచోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిలిమ్స్, మ్యాక్స్ ల్యాబ్, సరిగమ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తీసిన ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ.. దర్శకుడి అద్భుత పనితనమని హీరో మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. టీజర్లో చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా
ఓటీటీల వచ్చిన తర్వాత మూవీ లవర్స్ చాలా సదుపాయం అయిపోయింది. ఎందుకంటే మహా అయితే లేదంటే మరోవారం అంతే. హీరో ఎవరనేది సంబంధం లేకుండా ఆయా మూవీస్.. ఓటీటీల్లో రిలీజైపోతున్నాయి. ఇప్పుడు కూడా అలానే ఓ స్టార్ హీరో నటించిన హిట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది. కానీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్మాల్ స్క్రీన్పై రానుండటం షాకింగ్ విషయం. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) ఏంటా సినిమా? మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది రిలీజైన బెస్ట్ సినిమా '2018'. ఇందులో హీరోగా నటించిన టొవినో థామస్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఓటీటీల్లో పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల్ని సంపాదించాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'అదృశ్య జలకంగళ్'. వార్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో.. టొవినో డీ గ్లామర్ రోల్ చేశాడు. ఓటీటీలో ఎప్పుడు? ఈ నవంబరు 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. హిట్ టాక్తో పాటు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాంటి ఈ చిత్రాన్ని.. రెండే వారాల్లోకి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. డిసెంబరు 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సినిమాని నిర్మించింది. ఓటీటీలో కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ అయిన ఈ మూవీని మరీ రెండు వారాల్లోనే ఓటీటీలో తీసుకొస్తుండటం మూవీ లవర్స్కి మంచి కిక్ ఇస్తోంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'భ్రమయుగం'. రాహుల్ సదాశివం దర్శకుడు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమూల్దా లైజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జవీర్ సంగీతమందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పాడు. అయితే పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందని స్వయంగా దర్శకుడు చెప్పాడు. ఈ క్రమంలోనే చిత్ర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా 'భ్రమయుగం' ఉంటుందని దర్శకుడు చెప్పాడు. వచ్చేది ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. అన్ని భాషల్లో సినిమాలు అందుబాటులోకి రావడం ఓటీటీల వల్లే మరింత సులువుగా మారింది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను సీనీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్చున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఓ వరంలా మారిందనే చెప్పాలి. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైన మలయాళ చిత్రం కాసర్ గోల్డ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాసర్ గోల్డ్ ఈనెల 13న ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అసలు కథేంటంటే.. ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ గోల్డ్ పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఈ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్, దీపక్ పారంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు) -
ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య థియేటర్లలో కావొచ్చు.. ఓటీటీలో కావొచ్చు సరైన మాస్ మసాలా యాక్షన్ మూవీ రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఓ మలయాళ సూపర్హిట్ మూవీ.. ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన 'RDX' ఓ చిన్న సినిమా. కానీ అదే రోజు విడుదలైన దుల్కర్, నివీన్ పౌలీ చిత్రాలని మించి బ్లాక్బస్టర్ అయింది. 'ఆర్డీఎక్స్' ప్రత్యేకత ఏంటి? స్టోరీ పరంగా చూస్తే ఇదేం కొత్త కథ కాదు. మాస్, ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్షిప్, లవ్ ఇలా అన్నీ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా. అయితే తెలిసిన కథే అయినా దర్శకుడి డిఫరెంట్ ప్రెజంటేషన్ మలయాళంలో అందరికీ బాగా నచ్చేసింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత విడుదలకు రెడీ) ఓటీటీ డేట్ ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. సెప్టెంబరు 24న అంటే ఈ ఆదివారం ఓటటీలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మలయాళం మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో మిగతా భాషల్ని జోడించొచ్చని అనిపిస్తుంది. 'RDX' కథేంటి? రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోని వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ల ఫ్రెండ్ గ్జేవియర్ (నీరజ్ మాధవ్). చర్చి ఫెస్టివల్లో తన తండ్రిపై చేయి చేసుకున్నాడని ఓ అల్లరి ముకని డోని చితకబాదుతాడు. ఆ తర్వాత అదే రౌడీ గ్యాంగ్.. డోని ఇంటికొచ్చి చిన్న పిల్లలని వదలకుండా ఫ్యామిలీ మొత్తంపై దాడి చేస్తారు. అసలు ఈ దాడి చేసిన గ్యాంగ్ ఎవరు? వాళ్లకు డోని కుటుంబంపై పగ ఎందుకు? మరి డోని, రాబర్ట్, గ్జేవియర్.. గ్యాంగ్పై పగ ఎలా తీర్చుకున్నారనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
పోటీ లేదులే..
‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం లోనిది. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ఎల్వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్ పాడారు. -
ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
మలయాళంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!) ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ! The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV 2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory @ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j — Sony LIV (@SonyLIV) May 29, 2023 -
Malaikottai Vaaliban: మోహన్లాల్ యువకుడు!
ఆరు పదుల వయసులో ఉన్న మోహన్లాల్ని యువకుడు అంటున్నారు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ. మోహన్లాల్ టైటిల్ రోల్లో లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మలైకోట యువకుడు అని అర్థం). ఈ చిత్రంలోని మోహన్లాల్ లుక్ని విడుదల చేశారు. ఓ యాక్షన్ సీన్కి సంబంధించిన లుక్ ఇది. ‘‘జనవరి 18న రాజస్థాన్లోని జై సల్మేర్లో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాం. హై బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ పేర్కొన్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు. ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్ లీడ్లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన సూపర్హీరో అయ్యప్పన్ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్ జోసెఫ్, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. -
Tamannaah Bhatia: యువరాణిలా తమన్నా
పదిహేనేళ్లకు పైగా అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న తమన్నా తొలిసారి ఓ మలయాళ సినిమా చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘రామ్లీల’ (2017) తర్వాత హీరో దిలీప్, దర్శకుడు అరుణ్ గోపీ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా తెరకెక్కుతోంది. ‘బాంద్రా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె కెరీర్లో ఇదే తొలి మలయాళ సినిమా. కాగా కొచ్చిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో తమన్నా పాల్గొననున్నారు. ఈ నెల 20 నుంచి తమన్నా ఈ సినిమా షెడ్యూల్లో జాయిన్ అవుతారట. ఆ తర్వాత ముంబై లొకేషన్స్లో మరో షెడ్యూల్ను ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో తమన్నా యువరాణి తరహా పాత్ర చేస్తున్నారని టాక్. ఈ పాత్ర మలయాళం, హిందీ భాషలు మాట్లాడుతుందట. కొచ్చితో పాటు ముంబై నేపథ్యంలోనూ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కొత్త సంవత్సరాన్ని ఈ ఇద్దరూ గోవాలో జరుపుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్త గురించి ఇటు తమన్నా కానీ అటు విజయ్ వర్మ కానీ స్పందించలేదు. -
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఆహాలో మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కరోనా సమయంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్కు వెళ్లాలంటనే జంకిన సినీప్రేక్షకుడు ఎంచక్కా ఉన్నచోటునే సినిమా చూసే అవకాశం కల్పించడంతో ఓటీటీకి జై కొట్టాడు. అలా దేశంలో పలు ఓటీటీ ప్లాట్ఫామ్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వాటికి గట్టి పోటీనిస్తూ తెలుగులో ఆహా ఓటీటీ లాంచ్ చేశారు. దీనికి సినీప్రియుల నుంచి విశేషాదరణ లభించింది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఆహా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ శుక్రవారం మరో మలయాళ మూవీని ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఫహద్ ఫాజిల్ నటించిన తొందిముతలమ్ దృక్షక్షియుం అనే మూవీని దొంగాట పేరుతో మే 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్వీట్ చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ సినిమాను ఈ ఫ్రైడే చూసేయండని పేర్కొంది. Friday release alert!! #FahadhFaasil's National Award winning film Thondimuthalum Driksakshiyum as #DongataOnAHA in Telugu premieres May 6. Witness the rich performance of the thief 🙌#DileeshPothan #SandeepSenan #SurajVenjaramoodu #NimishaSajayan pic.twitter.com/uNKJebaA0V — ahavideoin (@ahavideoIN) April 30, 2022 చదవండి: అనిల్ అదృష్టం, బిగ్బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
సంచలన హైడ్రామా పడ.. ఆ నలుగురు ఏమయ్యారు?
వాస్తవ కథ తెర రూపానికి క్రియేటివిటీని జోడించడం షరా మామూలుగా మారింది ఈరోజుల్లో. కానీ, మలయాళ చిత్రం ‘పడ’(సైన్యం)కి అలాంటివేం ఎదురు కాలేదు. ఎందుకంటే.. ఇదొక నాటకీయమైన పరిణామం. నలుగురు అతివాదులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనే పడ చిత్రానికి కథ. ఇందుకోసం ఓ కలెక్టర్ను కలెక్టర్ కార్యాలయంలోనే కొన్ని గంటలపాటు బంధించి.. అధికారులతో పాటు రాజకీయ నాయకులనూ హడలెత్తిస్తారు. చివరికి డిమాండ్ నెరవేర్చే హామీతో.. కలెక్టర్ నిర్బంధం నుంచి విడిచిపెట్టి, పోలీసులు తమనేం చేయకూడదనే షరతు మేరకు స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తారు. ఆఖర్లో.. మీడియా ముందు తాము తెచ్చినవి డమ్మీ ఆయుధాలంటూ ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పడ కథ ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఆ నలుగురు అతివాదులు ఏమయ్యారు?. అసలు పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఎపిసోడ్కి ముందు.. తర్వాత ఏం పరిణామాలు జరిగాయి?. ఈ హైడ్రామా చివర్లో ఆ నలుగురు మీడియా ముందు ఇచ్చిన ట్విస్ట్ను కలెక్టర్ రెడ్డి ఎందుకు నమ్మట్లేదు?.. 1996 అక్టోబర్ 4వ తేదీన.. అయ్యన్కాళి పడ గ్రూప్ ఉద్యమకారులు కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్లు.. అప్పటి పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని తొమ్మిది గంటలపాటు బంధీ చేశారు. కలెక్టర్ ఆఫీస్కు రోజూవారీ వచ్చే ఫిర్యాదుదారుల్లాగా వచ్చి.. తుపాకీ, డైనమెట్లు చూపించి సిబ్బందిని బెదిరించి కలెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు తొమ్మిది గంటలకు పైగా ఈ హైడ్రామా నడిచింది. మావోయిస్ట్ సానుభూతి పరులైన ఈ గ్రూప్ సభ్యులు.. వివాదాస్పదమైన ఆదివాసీ ల్యాండ్ బిల్లు రద్దు కోసం ఈ పని చేశారు. చాలాకాలం నుంచే రెక్కీ.. 1996లో ఈకే నాయర్ నేతృత్వంలోని(ముఖ్యమంత్రి) లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సర్కార్ కేరళ షెడ్యూల్ తెగల (భూముల బదిలీపై పరిమితి, అన్యాక్రాంతమైన భూముల పునరుద్ధరణ) చట్టాన్ని సవరించింది. ఈ సవరణల ద్వారా తమ భూమిపై ఆదివాసీల హక్కులకు భంగం కలుగుతుందనేది అయ్యన్కాళి పడ ఆవేదన. అందుకే పాలక్కాడ్ కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని బంధించి.. డమ్మీ ఆయుధాలతో నిరసన వ్యక్తం చేయాలని, తద్వారా దేశం దృష్టిని ఆ అంశంపైకి మళ్లించాలని ప్లాన్ వేసింది. ఈ మొత్తం ఆపరేషన్కి రావుణ్ణి మాస్టర్ మైండ్. కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్ నలుగురు సభ్యులు. తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకుని ఈ ఆపరేషన్కి ముందుకొచ్చారు వాళ్లు. వాస్తవానికి ఈ ఆపరేషన్ను చాలాకాలం వాయిదా వేస్తూ వచ్చారు. అందుకుకారణం.. నలుగురిలో ఒకరు వెనుకంజ వేయడం. చివరికి.. ఆవ్యక్తి సైతం ముందుకు రావడంతో పనులు మొదలుపెట్టారు. పాలక్కాడ్ కలెక్టరేట్ దగ్గర రెండువారాలు రెక్కీ వేశారు. పర్యావరణ వేత్తల ముసుగులో కలెక్టరేట్కు వెళ్లారు. ఈ ఆపరేషన్లో బాబును రాజకీయ మధ్యవర్తిగా, రమేషన్ మిలిటరీ కమాండర్ పాత్ర పోషించారు. మార్షల్ ఆర్ట్స్లోనూ ఆ నలుగురు శిక్షణ తీసుకున్నారు. గుడ్డు పొరలు, ప్లాస్టిక్ పైపులు, వైర్లు టేపుతో డమ్మీ డైనమెట్లు, డమ్మీ తుపాకీ.. ఇలా కొంత సామాగ్రిని బ్యాగుల్లో వేసుకుని వెళ్లారు. కూడా ఆకలి తీర్చుకునేందుకు డ్రైఫ్రూట్స్, విటమిన్ సి ట్యాబెట్స్, బ్రెడ్ బిస్కెట్లు అరటి పండ్లు మోసుకెళ్లారు. వాస్తవానికి.. వాళ్ల లక్ష్యం డిప్యూటీ కలెక్టర్. కానీ, ఆ ఆఫీస్ దూరంగా ఉండడంతో.. కలెక్టర్ను లక్ష్యంగా చేసుకున్నారట. తొమ్మిది గంటల హైటెన్షన్ 1996 అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10.30 ప్రాంతంలో.. కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్ నలుగురు అయ్యన్కాళి పడ సభ్యులు పాలక్కాడ్ కలెక్టర్ రెడ్డిని బంధించారు. ఆపై తమ డిమాండ్ను సీఎస్ సీపీ నాయర్తో పాటు కోజికోడ్లోని ఏషియన్ నెట్ ఛానెల్(ఆ టైంకి కేరళలో అదొక్కటే ప్రైవేట్ ఛానెల్)కు సమాచారం అందించారు. మధ్యలో కలెక్టర్ను తన భార్యతోనూ ఫోన్లో మాట్లాడించి.. ఆమెనూ బెదిరించారు కూడా. మధ్యలో పోలీసుల బలవంతపు చర్యను అడ్డుకునేందుకు క్రాకర్స్ మందు గుండును కాల్చి భయపెట్టారట. ఇక మధ్యవర్తిత్వం కోసం ఉద్యమవేత్త ముకుందన్ మీనన్, జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్.. ఈ ఇద్దరి పేర్లను తొలుత పరిశీలించారు. చివరగా.. అడ్వొకేట్ వీరచంద్ర మీనన్ మధ్యవర్తిగా వ్యవహరించమని కోరారు. మధ్యవర్తి వీరచంద్ర మీనన్ చర్చలతో చివరకు హామీ మీద చర్చలకు సిద్ధమయ్యారు. అదే రాత్రి.. జిల్లా జడ్జి కే. రాజప్పన్ ఆచారీ సమక్షంలో కలెక్టర్ను వదిలేయడంతో పాటు ఎలాంటి కేసు లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు. ఆ నలుగురూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యే జేబులో పైసా లేకుండా వెళ్లారట. అందుకే అడ్వోకేట్ వీరచంద్ర మీనన్ కారులోనే త్రిస్సూర్లో దిగి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. వేట.. అరెస్టులు పాలక్కాడ్ కలెక్టర్ బంధీ వ్యవహారంలో కలెక్టర్ రెడ్డి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదు చేయలేదు. దీంతో జడ్జి ఆచారీ ఎలాంటి కేసులు ఉండవనే హామీ ఇవ్వడంతో పోలీసులను వాళ్లను వదిలేసినట్లు సినిమాలో చూపించారు. కానీ, కలెక్టర్ రెడ్డితో బలవంతంగా పోలీసులు కేసు పెట్టించారని శివకుట్టీ ఆరోపిస్తున్నారు. ఆ నలుగురి కోసం వేట ఉధృతిన సాగింది. ఈ నలుగురినే కాదు.. ఆ సమయంలో ఆదివాసి భూహక్కుల కోసం పోరాడిన కొందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడు నెలల తర్వాత.. అజయన్ మన్నూర్ను మువట్టుపులలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఏడాదిన్నరలో రమేషన్, శివకుట్టీని వయనాడ్, అట్టపుడి ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అయితే నాలుగో నిందితుడు బాబు మాత్రం ఘటన జరిగిన 14 ఏళ్లకు .. అంటే 2010లో పాలక్కాడ్ కోర్టులో సరెండర్ అయ్యాడు. ఈ వ్యవహారంలో బాబు తప్ప అందరినీ దోషులుగా నిర్ధారించింది కోర్టు. బాబును కలెక్టర్ రెడ్డి గుర్తు పట్టకపోవడమే అందుకు కారణం!. వాస్తవానికి ముగ్గురు నిందితులకు పదమూడున్నర ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని, కానీ, కుట్రకు సంబంధించిన ఆరోపణలేవీ రుజువు కాకపోవడం, వాళ్లది ఉన్నత లక్ష్యం కావడం, కలెక్టర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా వ్యవహరించినందుకుగానూ నిందితులకు మూడున్నరేళ్లకు శిక్ష తగ్గించింది కోర్టు. ఆపై అభ్యర్థన పిటిషన్ల మేరకు.. ఆ శిక్షను ఏడాదికే కుదించారు. ఈ కేసులో అప్పీల్ పిటిషన్ ఇంకా కేరళ హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ వ్యవహారంలో ఆ నలుగురు మొత్తంగా.. 113 రోజులపాటు రిమాండ్లో గడిపారు. The four 'extremists' called up @NewIndianXpress office in Palakkad, and informed their intention to hold a press conference. Express was told to alert this to other media offices in Palakkad, as per this report. In the film, Express was changed to Asianet? https://t.co/hxPCYGtEbx — Rajesh Abraham🇮🇳 (@pendown) April 1, 2022 నాటకీయత లేదు కానీ.. ఆంధ్రప్రదేశ్ అబ్దుల్లాపురంలో పుట్టిన డబ్ల్యూఆర్ రెడ్డి.. కేరళ 1986 క్యాడర్కు చెందిన అధికారి. అయితే పాలక్కాడ్ ఘటన తర్వాత రాజకీయంగానూ ఆయన విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆయన మావోయిస్టుల సానుభూతిపరుడని, పలక్కడ్ ఘటనలో నిందితులకు సహకరించారనే విమర్శల్ని ఎల్డీఎఫ్ గుప్పించింది. అయితే.. రాజకీయాల్లో, ప్రత్యేకించి కేరళ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు ఆయన. విమర్శలను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. పడ కథలో నాటకీయత అనే అంశం కనిపించలేదు. చాలా బాగా తీశారు. క్లైమాక్స్లో మీడియా వాళ్లను ప్రశ్నిస్తున్నప్పుడు, వారు కేవలం బొమ్మ పిస్టల్ మరియు నకిలీ పేలుడు పదార్థాలను మాత్రమే తీసుకెళ్లారని చెప్పారు. వారు ఆయుధాలు కలిగి ఉన్నారని నేను 'అనుకోవడం' లేదు. ఎందుకంటే వారు నిజంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నాకు తెలుసు. ఆ విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. వారి బ్యాగ్లను తనిఖీ చేయడానికి, వారి వాదనను ధృవీకరించడానికి ఎవరు ఆ సమయానికి ప్రయత్నించలేదు. బదులుగా, కథనాన్ని వేగంగా మార్చడంలో వాళ్లు విజయం సాధించారు. ఇదంతా జర్నలిజం వైఫల్యంగా నేను భావిస్తున్నాను. వాళ్లు నాకు ఎలాంటి హాని తలపెట్టలేదని, మర్యాదపూర్వకంగా వ్యవహరించారని మాత్రమే జడ్జి ముందు చెప్పాను. అంతేగానీ కేసు పెట్టనని అనలేదు(బహుశా అది దర్శకుడి క్రియేటివిటీ ఏమో!). ఆ మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి నాపై లేదు అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు రెడ్డి. కేరళలో కొన్నాళ్లపాటు పని చేసిన తర్వాత కేంద్రం సర్వీసులకు ఆయన బదిలీపై వెళ్లారు. నటుడు అర్జున్ రాధాకృష్ణన్(ఎడమ).. డబ్ల్యూఆర్ రెడ్డి (ఫైల్ ఫొటో.. కుడి వైపు) పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఉదంతంలో.. డమ్మీ ఆయుధాలతో పది గంటలపాటైన నిలువరించగలిగామని చెప్తున్నారు అజయన్. అయితే అప్పటి సీఎం ఈకే నాయర్.. ఆ ఘటన జరిగిన సమయానికి ఎమ్మెల్యే కూడా కాదు. తలస్సెరీ బై ఎలక్షన్ హడావిడిలో ఉన్నారాయన. ఆ ఎన్నికలు ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే కలెక్టర్ను కాపాడాలనే ప్రయత్నాలు చేయించారు. ఒకవేళ.. ఈరోజుల్లో గనుక అలాంటి ఘటనే జరిగి ఉంటే.. ఈపాటికే చచ్చి ఉండేవారేమో అంటున్నారు ఆ నలుగురు. మరి ఇంత చేసి.. వాళ్ల డిమాండ్ ఏమైంది?.. ఎవరూ పట్టించుకోలేదు. మీడియా అదంతా బంధీ నాటకంగా అభివర్ణించింది. ఆ తర్వాత ఆ విషయమూ, బంధీ వ్యవహారమూ కనుమరుగు అయి పోయాయి. పడ సినిమా షూటింగ్లో దర్శకుడు కమల్ దళిత నేత అయ్యన్కాళి పేరిట వెలిసిన రెబల్ గ్రూప్(మావోయిస్ట్ సానుభూతి).. అయ్యన్కాళి పడ. ప్రస్తుతం ఈ నలుగురు ఉద్యమవేత్తలుగా క్రియాశీలకంగా ఉన్నారు. కలెక్టర్ను బంధించిన ఘటన ఆధారంగానే.. జర్నలిస్ట్ కమ్ దర్శకుడు అయిన కేఎం కమల్ ‘పడ’ సినిమాను తీశాడు. ప్రకాశ్ రాజ్, కున్జక్కో బోబన్, దిలీశ్ పోతన్, ఇంద్రన్స్, సలీం కుమార్, వినాయకన్, జోజు జార్జ్ లాంటి తారాగణంతో సినిమాను తెరకెక్కించాడు. పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఘటన జరిగిన సమయంలో కమల్ జర్నలిజం డిప్లోమా స్టూడెంట్గా ఉన్నాడట. 2018 నుంచి నాలుగేళ్లపాటు ఈ ఉదంతంలో ఉన్న అందరినీ కలుసుకుని.. సినిమాగా తెరకెక్కించాడు. క్యారెక్టర్ల పేర్లకు మాత్రమే కొంచెం మార్పులు చేశాడు. అందుకే సినిమా పట్ల ఆ నలుగురే కాదు.. ఎవరూ పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం చేయలేదు. పడ మూవీ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది -
ఆ బడా నిర్మాతకు మలయాళం రొమాంటిక్ మూవీ రైట్స్..
Karan Johar Acquire Malayalam Movie Hridayam Rights: ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ మలయాళం బ్లాక్ బ్లస్టర్ హిట్ మూవీ రైట్స్ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ సినిమా ఏంటంటే.. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హృదయం' చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్లాల్, దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ను తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సోషల్ మీడియాతోపాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మనసు గెలుచుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రైట్స్ను సొంతం చేసుుకన్నారు. సోషల్ మీడియా వేదికగా 'నేను మీతో ఈ వార్తను పంచుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్డూడియోస్ మలయాళం న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హృదయం సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల హక్కులను పొందాయి.' అని కరణ్ జోహార్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం రణ్వీర్ సింగ్, అలియా భట్లు హీరోహీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఇందులో జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా నటించున్నారని సమాచారం. I am so delighted and honoured to share this news with you. Dharma Productions & Fox Star Studios have acquired the rights to a beautiful, coming-of-age love story, #Hridayam in Hindi, Tamil & Telugu – all the way from the south, the world of Malayalam cinema. pic.twitter.com/NPjIqwhz8l — Karan Johar (@karanjohar) March 25, 2022 -
డైరెక్టర్ బతిమాలినా.. ఆ నటుడు వినలేదు!
సూపర్హీరోయిజం అనేది జస్ట్ ఒక ఎక్స్ఫ్యాక్టర్ మాత్రమే. బేసిక్ ఎమోషన్స్తో డీల్ చేయగలిగినప్పుడు మాత్రమే అది జనాలకు ఎక్కుతుంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కనెక్టివిటీనే అందుకు ఒక ఎగ్జాంపుల్. మిన్నల్ మురళితో సక్సెస్ అందుకున్న దర్శకుడు బసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. టోవినో థామస్ లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ నెట్ఫ్లిక్స్ ‘మిన్నల్ మురళి’.. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా అలరించేదే. అయితే హీరో తర్వాత షిబు క్యారెక్టర్ జనాలకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని, అదే టైంలో ఎమోషన్స్ని సైతం పంచుతుంది. మిన్నల్ మురళి చిత్రంలో షిబు క్యారెక్టర్ని పోషించింది నటుడు గురు సోమసుందరం. కోలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈయన. ఒకవైపు ఎమోషన్స్తో పాటు నెగెటివ్ షేడ్స్ను అద్భుతంగా పండించాడు. అయితే ఈ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే ముందు దర్శకుడు చేసిన ఓ రిక్వెస్ట్ను సున్నితంగా తిరస్కరించాడట ఆయన. వాకిన్ ఫినిక్స్ లీడ్రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ చూసి.. ఆ తరహా మాడ్యులేషన్ను షిబు క్యారెక్టర్ కోసం డెవలప్ చేయమని గురు సోమసుందరానికి సూచించాడట డైరెక్టర్ బసిల్ జోసెఫ్. కానీ, గురు సోమసుందరం మాత్రం అందుకు కుదరదని తేల్చి చెప్పాడట. దీంతో బసిల్ బతిమాలడడం మొదలుపెట్టాడట. అయినా ఆయన నో అనే అనేశారట. వాకిన్ ఫినిక్స్ లాంటి నటుడంటే తనకు ఇష్టమేనని, కానీ, షిబూ క్యారెక్టర్ కోసం వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్ల ప్రభావం తనపై పడడం తనకు ఇష్టలేక ఆ పని చేయనని చెప్పానని షిబూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘థియేటర్ ఆర్టిస్టులకు శిక్షణలో ఒక విషయాన్ని నేర్పిస్తారు. సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది రీజియన్, ఇండియన్, వెస్ట్రన్ సినిమాగా విభజిస్తారు. దాని ప్రకారం ఇతర పాత్రల ప్రభావం.. తమ మీద ఉండకూడదని నటులు బలంగా ఫిక్స్ అవ్వాలి. కానీ, చాలామంది హీరోలు దీనికి భిన్నంగా.. హాలీవుడ్, ఇతర భాషల హీరోలను అనుకరిస్తారు. థియేటర్ ఆర్ట్ మీద నాకు అభిమానం ఎక్కువ. అందుకే నేను ఆ కండిషన్కు ఒప్పుకోలేదు. అయినా మా డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు 46 ఏళ్ల గురు సోమసుందరం. మలయాళం రాకపోయినా బసిల్ తనకు షిబు క్యారెక్టర్ని ఆఫర్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, కానీ, ఇప్పుడు షిబు క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఆఫర్లు సైతం వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నారు గురు సోమసుందరం . కోలీవుడ్ మూవీ ‘ఆరణ్య కాండం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన గురు సోమసుందరం.. పాండియ నాడు, జిగరతాండ, తూంగ వనం, పెట్టా, మారా, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక మిన్నల్ మురళిలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉష(నటి షెల్లీ కిషోర్) ప్రేమ కోసం పరితపించే భగ్న ప్రేమికుడిగా షిబు పాత్రలో అలరించాడాయన. -
Malik Movie Review: ఫహద్ ఫాజిల్ ‘మాలిక్’ రివ్యూ
వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ నటనతో సౌత్లో క్రేజీ స్టార్గా మారిపోయాడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ‘పుష్ప’, ‘విక్రమ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. గతేడాది ఆయన నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్’ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టైటిల్: మాలిక్ కాస్టింగ్: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్రట్, జోజూ జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రాన్స్, పార్వతి కృష్ణ, సనల్ అమన్ తదితరులు నిర్మాణ సంస్థ: యాంట్స్ టూ ఎలిఫంట్స్స్ సినిమాస్ కో నిర్మాతలు: అనీల్ కె రెడ్డి, కిషోర్ రెడ్డి సమర్పణ: మొజ్విత్,నినిన్ డైరెక్టర్: మహేష్ నారాయణన్ సంగీతం : సుశిన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ: సను వర్గీస్ ఓటీటీ: ఆహా(ఆగస్ట్12, 2022) కథ కేరళ తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి. బంధువుల కోలాహలం నడుమ హజ్ యాత్రకు బయలుదేరుతాడు సులైమాన్ అలీ అహమ్మద్ అలియాస్ మాలిక్ అలియాస్ అలీ ఇక్కా(ఫహద్ ఫాజిల్). అయితే ఎయిర్పోర్ట్లోనే ఆ పెద్దాయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసులు నమోదు చేసి అతన్ని జైళ్లో పెడతారు. అనూహ్యంగా మాలిక్ తల్లి జలజ అప్రూవర్గా మారిపోయి వ్యతిరేకంగా సాక్క్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. మరోవైపు భార్య రోస్లిన్ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ లోపు మాలిక్ గతం తెర మీదకు కదలాడుతుంది. దశాబ్దాలపాటు పోలీసులు.. రాజకీయ నేతల కుట్రల నుంచి తన నేలను, ప్రజలను కాపాడుకుంటూ ఉద్యమనేతగా ఎదిగిన మాలిక్, ‘బడా డాన్గా, మోస్ట్వాంటెడ్ క్రిమినల్’గా ఎందుకు జైలుపాలు కావాల్సి వస్తుంది? సొంతవాళ్లే అతన్ని వెన్నుపోటు పొడిచేంత నేరం మాలిక్ ఏం చేస్తాడు? రాజకీయ కుట్రల నడుమ మాలిక్ కథ ఎలా ముగుస్తుందనేది చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. ‘టేకాఫ్, సీయూ సూన్’ తర్వాత ఫహద్-మహేష్ నారాయణన్ కాంబోలో వచ్చిన మూవీ ఇది. ‘గాడ్ ఫాదర్, నాయకన్(నాయకుడు), అభిమన్యు(1991 మలయాళం), వన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికా’.. ఇలా టైంలైన్ కథల తరహాలో సాగే డాన్ కమ్ పొలిటికల్ థ్రిల్లర్ కథల తరహాలోనే ‘మాలిక్’ ఉంటుంది. కానీ, ‘రెలిజియన్ టచ్’ ఇచ్చి ఆడియొన్స్ను మెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మహేష్. భూముల ఆక్రమణలు-దాడులు, బతుకు దెరువు కోసం అక్రమ వ్యాపారాలు.. ఇలా కొన్ని వాస్తవ ఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. నలభై మూడు నిమిషాల తర్వాత మొదలయ్యే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కథను జెట్ స్పీడ్తో పరుగులు పెట్టించాడు. పవర్ఫుల్ పాత్రలు- వాటి మధ్య పేలే డైలాగులు, సెంటిమెంట్, పొలిటికల్ సీక్వెన్స్లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే మధ్య కథలో కొంచెం సాగదీత, అక్కడక్కడా కొన్ని సీన్ల కట్టింగ్తో కొంత గందరగోళంగా అనిపించినప్పటికీ.. పవర్ఫుల్ స్టోరీ ముందు ఆ మైనస్లు తేలిపోయాయి. నటనపరంగా.. ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏజ్ వైజ్ క్యారెక్టర్లలో వేరియేషన్తో రఫ్ఫాడించేశాడు. ఆయా పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం చూస్తే.. ఫహద్ ఆ క్యారెక్టర్ కోసం పడ్డ కష్టం ఏంటో కనిపిస్తుంది. అప్పటిదాకా అగ్రెసివ్ క్యారెక్టర్గా కనిపించి.. కొడుకు ప్రాణం పోయాక శవాన్ని పట్టుకుని విలపించే సీన్ హైలైట్గా అనిపిస్తుంది. అటుపై జైళ్లో ఉన్నప్పుడు మెచ్యూర్డ్ యాక్టింగ్తో కట్టిపడేస్తాడు. రోజ్లిన్గా నిమిషా.. ఫహద్తో పోటీ నటన కనబర్చింది. ఒకరకంగా సినిమాకు మాలిక్-రోజ్లిన్లు మెయిన్ పిల్లర్లుగా నిలిచారు. ఇక మాలిక్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో వినయ్ నటన మెప్పిస్తుంది. కెరీర్లో ఎక్కువగా కామెడీ వేషాలే వేసిన వినయ్.. డేవిడ్ పాత్రలో ఛాలెంజిగ్ రోల్తో అలరించాడనే చెప్పొచ్చు. వీళ్ల తర్వాత మేనల్లుడు ఫ్రెడ్డీ క్యారెక్టర్లో సనల్ అమన్, డాక్టర్ షెర్మిన్గా పార్వతీ కృష్ణన్లు మెప్పించారు. కలెక్టర్గా జోజూ జార్జ్ హుందా పాత్రలో అలరించాడు. మాలిక్ తల్లిగా జమీల, మాలిక్ గురువుగా సలీం కుమార్, పార్టీ నేతగా దిలీష్పోతన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్గా.. మాలిక్లో దర్శకుడి స్టోరీ టెల్లింగ్తో పాటు టెక్నికల్ బ్రిలియన్స్ కూడా కనిపిస్తుంది. 60వ దశకం నుంచి 2000 వరకు టైం లైన్గా మాలిక్ కథ సాగుతుంది. గతంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామాల స్ఫూర్తితో ఈ కథను తీసినప్పటికీ.. ప్రత్యేకించి కొన్ని పాయింట్లను తెరపై చూపించడం మాత్రం ఆకట్టుకుంటుంది. సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గ మూడ్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యిది. సుషిన్ శ్యామ్ సంగీతం ‘తీరమే’లాంటి సాంగ్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ మెప్పించాడు. మేకప్..కాస్టూమ్స్ కథకు తగ్గట్లు బాగున్నాయి. కథ, దర్శకత్వం బాధ్యతతో పాటు తన కథను తానే ఎడిటింగ్ చేసుకుని ‘మాలిక్’ను మరింత పక్కాగా చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు మహేష్ నారాయణన్. వెరసి.. మాలిక్ను తప్పకచూడాల్సిన ఓ పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దాడు. -
ఆస్కార్ బరిలోకి ‘జల్లికట్టు’
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జల్లికట్టు కథేంటి లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సబుమోన్ అబ్దుసామద్ శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఓ కుగ్రామంలో ఓ దున్న సృష్టించిన విన్యాసాలను అద్భుతంగా చూపించారు. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. గొడ్డుమాంసం లేనిదే వారికి ముద్ద దిగదు. ఆంటోనీ అనే వ్యక్తి ఉరందరికి బీఫ్ సరఫరా చేస్తుంటాడు. అతను తెచ్చి అమ్మె అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు.. అడవి దున్న ని కబేళాకి తరలించి, దాని మాంసం విక్రయిద్దాం అనుకునేలోపు.. అది తప్పించుకుంటుంది. అడవిని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూ.. దాగుడుమూతలు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జరిగింది? ఎంత నష్టపరచింది? అన్నదే కథ. -
నీడలో నయనతార
నయనతార లేడీ సూపర్ స్టార్. వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు. కానీ నయనతార నీడలో ఉండిపోబోతున్నారట. అయితే ఇదంతా సినిమా కోసమే. నయనతార తాజాగా మలయాళంలో ఓ సినిమా కమిటయ్యారు. ‘నిళల్’ టైటిల్తో తెరకెక్కనున్న ఈ మలయాళ థ్రిల్లర్లో హీరోయిన్గా నటించనున్నారామె. కున్చాచ్కో బోబన్ హీరోగా కనిపిస్తారు. అప్పు యన్. బట్టాత్తిరి దర్శకత్వం వహిస్తారు. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న సినిమాల చిత్రీకరణలన్నీ కోవిడ్ వల్ల బ్రేక్లో ఉన్నాయి. తక్కువ మంది యూనిట్ సభ్యులు, తక్కువ రోజుల్లో ‘నిళల్’ సినిమా చిత్రీకరణ ను ప్లాన్ చేశారు. సినిమా పూర్తయ్యే వరకూ ఏకథాటిగా షూటింగ్ జరగనుందని తెలిసింది. నయనతార పోషించే పాత్ర సినిమాకు చాలా కీలకమని, నయనతారే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని చిత్రబృందం తెలిపింది. -
విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్
తిరువనంతపురం: తమిళ స్టార్ విజయ్ సేతుపతి, హీరోయిన్ నిత్యామీనన్ జంటగా ఓ మలయాళ సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే మార్కోని మథాయ్తో మాలీవుడ్లోకి అడుగుపెట్టిన విజయ్కు మలయాళంలో ఇది రెండో సినిమా. ఆంటో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్ ఇందూ దర్మకురాలిగా పరిచయం కానున్నారు. అయితే గతేడాదే ఈ సినిమాకు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ను చిత్ర యూనిట్ సంప్రదించగా ఇద్దరూ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. చదవండి: త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి తక్కువ సిబ్బందితో కేరళలో ముందుగా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఇందూ వీఎస్ ఇంతకుముందు జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్ర నిర్మాత సలీం అహ్మద్తో కలిసి కుంజనంతంతే కడా, అమీంటే మకాన్ అబూ, పతేమారి వంటి చిత్రాల్లో పనిచేశారు. ఇది ఆమెకు మొదటి మలయాళ చిత్రం కానుంది. అదే విధంగా విజయ్ నటించిన హిట్ మూవీ ‘96’కు సంగీతం సమకూర్చిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. మనీష్ మాధవన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు. చదవండి: వివాదంలో విజయ్ సేతుపతి చిత్రం ప్రస్తుతం విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్ఆన్ విజయ్సేతుపతి అంటూ ట్విటర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ పాత్రలో మీరు నటిస్తారా అని, ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిత్యామీనన్ కోలాంబి అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరుంధతి దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: కరోనా జీవితం పోరాటంగా మారింది -
‘సీ యూ సూన్’ మూవీ రివ్యూ
నెలకు నలభై వేలు వస్తాయని చెబుతారు. గల్ఫ్కు తీసుకువెళతారు. ముందు పాస్పోర్ట్ లాగేసుకుంటారు. తర్వాత ఏం పని చేయాలో చెబుతారు. అది చట్టబద్ధమైన పని అయితే సరే. లేకుంటే? అక్కడి నుంచి తమ వాళ్లకు వీడియో కాల్స్, వీడియో మెసేజెస్ మొదలవుతాయి. సహాయం కోసం అర్థింపులు, ఆక్రందనలు. గల్ఫ్కు వెళ్లిన భారతీయ స్త్రీల బాధను చూపిన సినిమా ఇది. లాక్డౌన్ కాలంలో తీసి ఓటిటి ద్వారా విడుదల చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న విశేషం సీయూ సూన్. గల్ఫ్ దేశాలకు వెళ్లి తమ జీవితాన్ని బాగు పరుచుకున్నవారు చాలామంది ఉన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి జీవితాలు నష్టపోయిన వారు అంతకు తక్కువగా లేరు. మగవారి కష్టాలు అక్కడ శారీరక, మానసిక పరమైనవి. స్త్రీలవి అయితే కనుక శారీరక, మానసిక, లైంగిక పరమైనవి కూడా. ఇక్కడ జరుగుబాటు లేక జానా బెత్తెడు జీతంతో విసిగిపోయి మన సభ్యులు ఎవరైనా గల్ఫ్కి వెళితే కుటుంబం అంతా బాగుపడుతుందని భావించేవారు నేటికీ ఉన్నారు. రేపటికీ ఉంటారు. కాని ఆ వెళ్లిన కుటుంబ సభ్యులు స్త్రీలైతే ఏమవుతుందో... ఒక్కోసారి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పిన సినిమా ‘సీ యూ సూన్’. తాజా మలయాళ సినిమా ‘సీ యూ సూన్’ అనేది తాజా మలయాళ సినిమా. అమేజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ కథ సంగతి చర్చించే ముందు దీని నిర్మాణమే విశేషం అని తెలుసుకోవాలి. ఇది లాక్డౌన్లో అంటే ఈ సంవత్సరం జూన్లో రెండు వారాల కాలంలో ‘కొచ్చిన్’లో తీశారు. మలయాళ చిత్రసీమ అంతా షూటింగ్లు మానేసి ఉంటే ఈ సినిమా 40 మందికి పని కల్పిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసింది. ప్రసిద్ధ మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ నటించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకో ఇద్దరు ముఖ్యపాత్రలు పోషించారు. మనం చూసే సినిమాలలో నటులు కెమెరాకు నటిస్తారు. కాని ఈ సినిమాలో వాళ్లు కెమెరాకు నటించినా మనకు కంప్యూటర్ స్క్రీన్ మీద, ఫోన్ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తారు. సరిగా చెప్పాలంటే మనం మన మిత్రులతో చాటింగ్ చేస్తూ, వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నటీనటులు ప్రేక్షకులతో అలా చేస్తున్న భావన కలుగుతుంది. ఇది వినూత్న ప్రయత్నం. అందుకే షూటింగ్కి రెండు వారాలే పట్టినా ఎడిటింగ్కి రెండు నెలలు తీసుకుంది. ఒక అమ్మాయి– అబ్బాయి కథ దుబాయ్లో బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్న ఒక మలయాళ కుర్రాడు డేటింగ్ యాప్ ద్వారా దుబాయ్లోనే ఉంటున్న ఒక మలయాళ అమ్మాయిని ఆన్లైన్లో కలుసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గర ‘సిమ్’ ఉండదు కాని గూగుల్ ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఉద్యోగం కోసం ఇండియా వచ్చానని, ఇంకా పని దొరకలేదని చెబుతుంది. తన చిన్నప్పటి ఫోటోలు, కుటుంబం ఫోటోలు అన్నీ షేర్ చేస్తుంటుంది. ఇతను ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమెరికాలో ఉంటున్న తల్లికి వీడియో కాల్ ద్వారా పరిచయం చేస్తాడు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని చెబుతాడు. ఈ లోపల ఆ అమ్మాయి తాను ఉన్నచోట ఇబ్బంది పడుతున్నానని, తీసుకెళ్లమని చెబుతుంది. ఆమెను అతడు తన ఫ్లాట్కు తెచ్చుకుంటాడు. వారం తర్వాత ఆ అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఇంతకూ ఆ అమ్మాయి ఏమైంది? అనేది కథ. సమాచారం సర్వవ్యాప్తం మనం అనుకుంటాం మన మెయిల్స్, ఫేస్బుక్ చాట్స్, వాట్సప్ చాట్స్ మన కంప్యూటర్లో మనం దాచుకున్న ఫైల్స్ అన్నీ సేఫ్ అని. కాని ఇవాళ్టి సాంకేతిక పరిజ్ఞానంతో వాటన్నింటిని క్షణాల్లో ఛేదించి మన గుట్టుమట్లు తెలుసుకోవచ్చని కూడా ఈ సినిమా చెబుతుంది. అమ్మాయి అదృశ్యమయ్యాక ఆ కుర్రాణ్ణి పోలీసులు చుట్టుముడతారు. నిందితుడివి నువ్వే అంటారు. ఆ కుర్రాడు హతాశుడయ్యి కొచ్చిన్లో ఉంటున్న తన కజిన్ని సహాయం కోసం సంప్రదిస్తాడు. ఆ కజిన్ హ్యాకర్. అతడే ఆ అమ్మాయి ఏమైందో కేవలం కొచ్చిన్లో తన గదిలో కూచుని కనుగొంటాడు. ఇదంతా ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా మీడియమ్స్ ద్వారా జరుగుతుంది. నటులు మాట్లాడేది, కనిపించేది తక్కువ. ఎక్కువగా స్క్రీన్ల మీద నడిచే చాటింగులే కథను చెబుతాయి. పాస్పోర్ట్ ఎక్కడ? మన దేశంలో మనం ఎన్ని కష్టాలు పడినా కుదరకపోతే పారిపోయి ఇల్లు చేరతాం. కాని పరాయి దేశంలో పారిపోయి రావాలంటే పాస్పోర్ట్ ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్లినవారి పాస్పోర్ట్లు ఒక్కసారి ఎవరైనా తమ హ్యాండోవర్లో పెట్టుకున్నాక వారి చేతిలో కీలుబొమ్మలుగా మారక తప్పదు. తమను తీసుకెళుతున్నవారు ఎవరో, వారు ఎంత సరైన వారో, వారు గతంలో తీసుకెళ్లినవారు ఎలా ఉన్నారో చెక్ చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లడం ముఖ్యంగా స్త్రీలు వెళ్లడం ఏమాత్రం క్షేమకరం కాదని ఈ సినిమా చెబుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రమాదం ఉందనే శంక ఉన్నా నిస్సహాయతతో అందులోకి తోసే పేదమనుషుల స్వభావాన్ని కూడా ఇది చూపుతుంది. ఈ సినిమాలోని యువతి తాను ప్రమాదంలో ఉందా తమ చుట్టూ ఉన్నవారిని ప్రమాదంలోకి నెట్టిందా... ఇది చాలా ఇంటెరెస్టింగ్గా ఉంటుంది. మెచ్చుకోళ్లు సీ యూ సూన్ స్ట్రీమ్ అవడం మొదలెట్టినప్పటి నుంచి మెచ్చుకోళ్లు నెట్లో ఎక్కువగా ఉన్నాయి. దీని ముఖ్య నటులు ఫహద్ ఫాజిల్, రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్లను దీని దర్శకుడు మహేశ్ నారాయణ్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోట్లు ఖర్చు, పదుల సంఖ్యలో తారాగణం లేకుండా సందర్భానికి తగినట్టుగా కూడా సినిమా తీయొచ్చని వీరు నిరూపించారని అంటున్నారు. గత నాలుగైదేళ్లుగా మలయాళ రంగం కొత్త కొత్త కథలతో. నటులతో ప్రతిభ చాటుతోంది. ఈ లాక్డౌన్ సమయంలో దేశంలో చాలామంది మలయాళ సినిమాలు చూస్తున్నారు. తెలుగువారు కూడా. తెలుగులో ఈ స్థాయి స్ఫూర్తి అంతగా కనపడటం లేదని చెప్పాలి. అది పూర్తిగా తన మూస బంధనాలను తెచ్చుకోలేదు. సీ యూ సూన్లాంటి కత్తెరలు వాటిని తెగ్గోస్తాయని ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
డైరెక్షన్ మార్చారు
అనుపమా పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. ఇదేదో కొత్త సినిమాలో పాత్ర అనుకోకండి. నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్గా కొత్త జాబ్లోకి మారారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ విషయం గురించి అనుపమ చెబుతూ– ‘‘ఇది సరికొత్త ప్రారంభం. షంజూ జేబా అనే ట్యాలెంటెడ్ దర్శకుడికి అసిస్టెంట్గా చేయడం సంతోషంగా ఉంది. ఈ కొత్త రోల్ పట్ల చాలా ఎగై్జటెడ్గా, ఆనందంగా, నెర్వస్గా ఉన్నాను. ఈ టీమ్ పట్ల పూర్తి నమ్మకంగా ఉన్నాను. మా సినిమాకు మీ అందరి బ్లెసింగ్స్ కావాలి’’ అన్నారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న ఈ బ్యూటీ పూర్తి స్థాయి దర్శకురాలిగా కొనసాగుతారా? లేదా? వేచి చూడాలి. ప్రస్తుతం బెల్లం కొండ సాయిశ్రీనివాస్తో ‘రాక్షసుడు’ సినిమాలో నటిస్తున్నారు అనుపమ. -
చిన్న బ్రేక్ తర్వాత..
స్మాల్ బ్రేక్ తీసుకున్నారు నయనతార. అదేంటీ తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో ‘సైరా’లో నటిస్తున్నారు కదా.. చిన్న బ్రేక్ ఎప్పుడు తీసుకున్నారు అనుకుంటున్నారా? బ్రేక్ తీసుకున్నది మలయాళంలో. నిజానికి నయనతార మాతృభాష మలయాళం. అయినా మలయాళంలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకూ నయనతార తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 70 సినిమాలు చేస్తే వాటిలో మలయాళ సినిమాలు ఓ పది ఉంటాయంతే. తెలుగు, తమిళంలో మంచి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడంతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి మలయాళ సినిమాలపరంగా సంఖ్య తక్కువగా ఉంది. 2016లో మాలీవుడ్లో ‘పుదియ నిమయమ్’ చేశాక ఇప్పుడు మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారీ బ్యూటీ. నివిన్ పౌలీ హీరోగా నటించనున్న ఈ చిత్రం ద్వారా ధ్యాన్ శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం కానున్నారు. త్వరలో సినిమా ఆరంభం కానుంది. ఇది లవ్, యాక్షన్, డ్రామా మూవీ. రెండేళ్ల తర్వాత నయనతార మాతృభాషలో నటించడం అక్కడి ఆమె అభిమానులకు హ్యాపీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
రాబిన్హుడ్ టైప్
చేతిలో ఆయుధం ఉంది. గుండెల్లో తెగువ ఉంది. ఒంట్లో సత్తా ఉంది. ఇన్ని ఉంచుకుని కూడా ఒక హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అందుకో కారణం ఉంటుంది. ఇక్కడ నివీన్ పౌలీకి కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే అతను దొంగ. మాములు దొంగ కాదు. రాబిన్ హుడ్ టైప్. అంటే ధనవంతులను దోచి పేదలకు పంచుతాడన్నమాట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివీన్ పౌలీ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘కాయమ్కులమ్ కొచ్చిన్’. గోకులమ్ గోపాలన్ నిర్మించారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్లాల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఓనమ్ ఫెస్టివల్కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటి ట్రవాంకూర్ ఏరియాలో దారిదోపిడి దొంగగా హడలెత్తించిన కాయమ్కులమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని మాలీవుడ్ టాక్. ప్రియాంకా త్రిమ్మేష్, సున్నీ వాణ్నే, బాబు ఆంటోనీ తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
బన్నీ ఫ్యాన్స్ వేధింపులు ఆగట్లేదు
సాక్షి, తిరువనంతపురం: నా పేరు సూర్య చిత్రం రివ్యూ ఆమెను చిక్కుల్లో పడేసింది. అపర్ణ ప్రశాంతి అనే ప్రీలాన్స్ ఫిలిం క్రిటిక్ చిత్రం అస్సలు బాగోలేదంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ తతంగంపై గురువారం మల్లాపురం పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు మరింతగా వేధింపులు ఎక్కువయ్యాయని అపర్ణ చెబుతున్నారు. ‘గత నాలుగేళ్ల నుంచి పలు ప్రముఖ పత్రికలకు కూడా రివ్యూలు రాస్తున్నా. మోహన్లాల్, మమ్మూటీ లాంటి స్టార్ల విషయంలో కూడా ఖచ్ఛితమైన రివ్యూలు ఇచ్చా. వాళ్ల ఫ్యాన్స్ నుంచి నాకు ఏనాడూ ఇలాంటి బెదిరింపులు ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విషయంలోనే నాకీ పరిస్థితి ఎదురైంది. సంస్కారం లేకుండా అసభ్యపదజాలంతో నన్ను తిడుతున్నారు. రేప్ చేసి గుణపాఠం నేర్పుతారంట.వాళ్ల ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారన్న విషయం వారికి కనిపించటం లేదేమో. సైనికుడి సినిమాను కించపరుస్తున్నావ్. నువ్వేమైనా దేశద్రోహివా?పాకిస్థాన్ గూడఛారివా? అంటూ విమర్శించారు. సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను, నా కుటుంబాన్ని చెప్పలేని భాషలో ఇంతలా తిట్టి పోయాలా? అని ఆమె ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి వచ్చింది. అదేం దేశభక్తో కాస్త కూడా నాకు అర్థం కాలేదు. బయటకు వెళ్దామంటే కుండపోత వర్షం. ఆ కారణంగా బలవంతంగా థియేటర్లోనే ఉండిపోయా’ అని వెటకారంగా ఆమె నా పేరు సూర్య సినిమాకు రివ్యూ ఇచ్చారు. అక్కడి నుంచి బన్నీ ఫ్యాన్స్ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఆమెకు మద్ధతుగా పలు మీడియా ఛానెళ్లు నిలవటం విశేషం. -
కాలేజీ రోజులే ఆనందానికి కేరాఫ్
కాలేజ్ రోజులు, కాలేజ్ క్యాంపస్లో సరదాగా గడిపే క్షణాలే ఆనందానికి కేరాఫ్ అడ్రస్. ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగు రోజుల ఇండస్ట్రియల్ టూర్లో మూడు ప్రేమ జంటల మధ్య జరిగే కథతో వచ్చిన మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆనందం’. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో ఈ నెల 23న విడుదల చేస్తున్నారు సుఖీభవ మూవీస్ ఎత్తురి గురురాజ్. ఆయన మాట్లాడుతూ – ‘‘డబ్బింగ్ వర్క్ దాదాపు పూర్తి అయింది. ఈ నెల 17న గ్రాండ్గా ఆడియో రిలీజ్ చేస్తాం. సచిన్ వారియర్ స్వరపరిచిన మ్యూజిక్కు వనమాలి చక్కటి సాహిత్యం అందించారు. ‘హ్యాపీడేస్’ తరహాలోనే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. చాలా మంది నిర్మాతలు రీమేక్ చేస్తాం అన్నా కూడా కథ మీద నమ్మకంతో అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సహనిర్మాతలు: వీరా వెంకటేశ్వరరావు, వీఆర్బీ రాజు, రవి వర్మ చిలువూరి, దర్శకత్వం: గణేశ్ రాజ్. -
‘హ్యాపీడేస్’ను మరిపించేలా...
ఆనందమే.. 4 కోట్లతో తీసిన సినిమా దాదాపు 20 కోట్లు రాబడితే ఏ చిత్రబృందానికైనా ఆనందమే. మలయాళ చిత్రం ‘ఆనందం’ అలాంటి రికార్డునే సొంతం చేసుకుంది. అరుణ్ కురియస్, థామస్ మాథ్యూ, రోషస్ మాథ్యూ, విశాక్ నాయర్ ముఖ్య తారలుగా కాలేజీ బ్యాక్డ్రాప్లో గణేశ్ రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను ఆర్. సీతరామరాజు సమర్పణలో సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో అనువదిస్తున్నారు. వీర వెంకటేశ్వరరావు, వీఆర్బీ రాజు, రవి వర్మ చిలుకూరి ఈ చిత్రానికి సహనిర్మాతలు. ‘‘తెలుగు రైట్స్ కోసం చాలామంది పోటీ పడినా, మేము హక్కులు దక్కించుకున్నాం. రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. కానీ సినిమాలో తెలుగు నేటివిటీ ఎక్కువగా ఉండటంతో అనువదించి, రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నాలుగు రోజుల ఇండస్ట్రియల్ టూర్కి వెళ్లిన స్టూడెంట్స్ ఏం చేశారు? అనేది ఆసక్తికరం. సచిన్ వారియర్ మంచి సంగీతం ఇచ్చారు. మార్చి ఫస్ట్ వీక్లో సాంగ్స్ను, సినిమాను 16న విడుదల చేయాలనుకుంటున్నాం. ‘హ్యాపీడేస్’ను మరిపించే సినిమా అవుతుంది’’ అన్నారు గురురాజ్. -
ఆనందం ఎంతో ఆనందం
...అంటున్నారు అమలా పాల్. మలయాళ చిత్రం ‘ఆడు జీవితం’లో హీరోయిన్గా ఎంపిక అవ్వడం పట్ల ఈ మాలీవుడ్ బ్యూటీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘డైరెక్టర్ బ్లెసీ ‘ఆడు జీవితం’ లో సైనూ పాత్రలో కనిపించనున్నాను. ఈ విజువల్ వండర్లో ఫృథ్వీరాజ్, లెజెండ్ ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టీ వంటి మాస్టర్స్తో కలిసి పని చేస్తున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్. కచ్చితంగా ప్రపంచ సినిమా పై ఓ మార్క్ చూపిస్తుంది’’ అని పేర్కొన్నారు అమలా పాల్. ఆమె ఇంతలా ఎగై్జట్ అవ్వడానికి కారణం ఏంటీ అంటే ఈ సినిమాలోని విశేషాలే. ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి మిస్ అయిన నజీబ్ మొహమద్ అనే వ్యక్తి లైఫ్ ఇన్సిడెంట్స్తో బైన్యామిన్ రాసిన ఫేమస్ మలయాళీ నవల ‘ఆడు జీవితం’ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బ్లెస్సీ. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మాలీవుడ్ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు. 1992లో వచ్చిన మోహన్లాల్ ‘యోధ’నే ఏఆర్ రెహమాన్ ఫస్ట్ అండ్ లాస్ట్ మలయాళ సినిమా. ‘ఆడు జీవితంలో’ హీరోగా, నజీబ్ మొహమద్ పాత్రలో నటిస్తున్న ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ డేట్స్ ఇచ్చేశారట. ఈ మెగా బడ్జెట్ సినిమాను 3డీలో రూపొందిస్తున్నారు. -
స్పోర్ట్స్ కామెడీ
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద హిట్ సాధించిన మలయాళ చిత్రం ‘గోదా’. టవీనొ థామస్ , వామికా గబ్బి, ప్రముఖ రచయిత రెంజీ పనికర్ నటించిన ఈ చిత్రానికి బసిల్ జోసఫ్ దర్శకత్వం వహించారు. 2017 మేలో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలీవుడ్లో సైతం ఈ సినిమాను రీమేక్ చేసేందుకు భారీ నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తెలుగులో కొంకా ప్రొడక్షన్స్ సంస్థ ‘గోదా’ డబ్బింగ్ మరియు రీమేక్ రైట్స్ సొంతం చేసుకొంది. తెలుగు హక్కుల కోసం ఎంతోమంది పోటీ పడగా నిర్మాత సంతోష్ కొంకా ఫ్యాన్సీ ఆఫర్తో సొంతం చేసుకున్నట్లు కొంకా ప్రొడక్షన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ కె.రామ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ –‘‘ఇది స్పోర్ట్స్ కామెడీ మూవీ. ప్రస్తుతం తెలుగు రీమేక్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. మలయాళంలోలా తెలుగులోనూ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
సినిమాపై నమోదైన కేసు గురించి నాకు తెలిదు
-
సన్నీకి సవాల్.. సిన్మాల్లోకి మరో పాపులర్ పోర్న్స్టార్!
మరో పాపులర్ పోర్న్స్టార్ భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు పోర్న్స్టార్గా పేరొందిన సన్నీ లియోన్ ఇప్పటికే భారతీయ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసింది. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ సన్నీ లియోన్కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ భామకు షాక్ ఇచ్చేందుకు పాపులర్ పోర్న్స్టార్ మియా ఖలీఫా సిద్ధమవుతోంది. కొన్నాళ్లపాటు బూతుసినిమాల్లో నటించి.. ఆ ఫీల్డ్ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. మలయాళ అడల్ట్ కామెడీ సినిమా 'చుంక్జ్' సీక్వెల్లో నటించడానికి ఈ భామ అంగీకరించింది. ఈ సినిమాలో ఓ పాత్ర పోషించడంతోపాటు ఐటెం సాంగ్లో మియా ఖలీఫా నటించనుందని చిత్ర దర్శకుడు ఒమర్ లులు ధ్రువీకరించారు. సన్నీ లియోన్ తర్వాత భారతీయ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న రెండో పోర్న్స్టార్గా మియా ఖలీఫా నిలువబోతున్నది. బూతు సినిమాల నటిగా ఒక ఏడాది పాటు పనిచేసి..పాపులర్ అయిన ఈ భామ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ యూట్యూబ్ చానెల్ రిపోర్టర్గా పనిచేస్తోంది. -
నటిపై అత్యాచారం: ఇండస్ట్రిపై డైరెక్టర్ మండిపాటు
ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచార ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమ తీరుపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. సినీ పరిశ్రమ పితృస్వామ్య భావజాలాన్ని తలకెత్తుకొని హీరోయిజాన్ని హైలెట్ చేసినంతకాలం బాధితురాలైన నటికి నిజమైన మద్దతు దొరకబోదని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో బాధితురాలైన నటికి సంఘీభావం తెలుపుతూ మలయాళ చిత్రపరిశ్రమ ఆదివారం మూకుమ్మడిగా నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సనల్కుమార్ స్పందిస్తూ.. '99శాతం మన సినిమాలు హీరోయిజాన్ని గొప్పగా చూపిస్తాయి. మన ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, ఆఖరికీ కాలేజీ సినిమాలు కూడా పితృస్వామ్యాన్ని సమర్థిస్తూ చూపిస్తాయి. ఇందులో చాలావరకు మహిళ వ్యతిరేక భావజాలం ఉంటుంది. ఈ క్రమంలో బాధితురాలైన నటికి నిజమైన మద్దతు లభిస్తుందనుకోవడం మూర్ఖత్వమే' అని ఫేస్బుక్లో పేర్కొన్నారు. 'ఇప్పటికైనా ఈ హీరోలు తమ హీరోయిజం డాంబికాలను తగ్గించుకుంటారా' అని ఆయన ప్రశ్నించారు. కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత అయిన సనల్కుమార్.. 'ఒళివుడివసథె కాలి, సెక్సీ దుర్గ వంటి అసాధారమైన చిత్రాలను రూపొందించారు. తన సినిమాల్లో పితృస్వామ్య పోకడలను ప్రశ్నించారు. -
మనసిలాయో?
ఈ హెడ్డింగ్ చూసి తమన్నా ఎవరి పైనో మనసు పడింది అనుకుంటున్నారా? అదేం లేదండీ. మలయాళంలో ‘మనసిలాయో’ అంటే ‘అర్థమైందా?’ అని అర్థం. ఇప్పుడు మలయాళం అర్థం చేసుకునే పనిలో ఉన్నారు తమన్నా. ఎందుకంటే.. ఓ మలయాళ సినిమా అంగీకరించారీమె. రితీష్ అంబట్ దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్న ‘కమ్మరసంభవం’తో మాలీవుడ్కి తమన్నా పరిచయం కానున్నారు. ఆమె పాత్రకు ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్తారు కాబట్టి, షూటింగ్లో డైలాగ్స్కి బదులు వన్.. టూ.. త్రీ నంబర్స్ చెప్పి మ్యానేజ్ చేయొచ్చు. పరభాషలో నటించేటప్పుడు చాలామంది కథానాయికలు చేసేది ఇదే. కానీ, నంబర్స్ చెప్పి మేనేజ్ చేసే రకం కాదు తమన్నా. ఈ ఉత్తరాది భామ ఎప్పుడో తెలుగు, తమిళం నేర్చుకున్నారు. తర్వాత వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పినా షూటింగ్ లొకేషన్లో మాత్రం ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష డైలాగ్స్ చెబుతారు. ఇప్పుడు మలయాళంకి కూడా అలానే చేయనున్నారు. అందుకే ఆ భాషపై పట్టు సాధించే పనిలో ఉన్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’లో సిద్ధార్ధ్, తమన్నా జంటగా నటించారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకి జోడీ కట్టారు. అన్నట్టు.. సిద్ధార్ధ్ కూడా ఈ సినిమాతోనే మాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. -
దానికి ఆండ్రియా కారణం కాదు...
టాలీవుడ్, కోలీవుడ్ పక్కన పెట్టేయడంతో మలయాళం, కన్నడ చిత్రాలవైపు దృష్టిని సారించారు శ్రీయ. ఇటీవలే ఓ మలయాళ చిత్రానికి ఆమె సైన్ చేశారు కూడా. ప్రకాశం పరత్తున్నా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్కి వెళ్లబోతోంది. అయితే... ఈ సినిమా నుంచి శ్రీయ ఉన్నట్టుండి తప్పుకున్నారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని శ్రీయ వదులుకోవడం మల్లూవుడ్లో చర్చనీయాంశమైంది. అయితే... ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా తమిళ నటి ఆండ్రియాను తీసుకోవడం వల్లే శ్రీయ ఈ సినిమాను వదులుకున్నట్లు కొత్త వార్త ప్రచారంలోకొచ్చింది. గతంలో ఓ తమిళ సినిమా విషయంలో శ్రీయ, ఆండ్రియాకు పెద్ద గొడవే జరిగిందట. అలాంటి ఆండ్రియాతో తెరను పంచుకోవడం ఇష్టం లేకే శ్రీయ ఈ సినిమాను వదులుకున్నారని మలయాళ పరిశ్రమలో అనుకుంటున్నారు. ఈ వార్తను శ్రీయ ఖండించారు. ఆ సినిమా వదులుకోవడానికి వ్యక్తిగత కారణాలే కారణమని, అంతేతప్ప ఆండ్రియా చేస్తున్న కారణంగా ఆ సినిమాను వదులుకున్నాననడం కరెక్ట్ కదని చెప్పారు శ్రీయ.