manchester
-
తెలంగాణ అబ్బాయి.. మాంచెస్టర్ అమ్మాయి
(నల్గొండ జిల్లా) చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రామన్నపేట సమితి మాజీ ప్రెసిడెంట్ కందిమళ్ల జగ్గారెడ్డి మనుమడు రాజీవ్రెడ్డికి యూకేలోని మాంచెస్టర్కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. రాజీవ్రెడ్డి మాంచెస్టర్లో హోటల్ మేనేజమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో శనివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమ కుమార్తె తెలంగాణ ఇంటి కోడలు కావటం ఎంతో ఆనందంగా ఉందని వధువు తల్లిదండ్రులు కే.ఫిషర్ డేవ్ ఫిషర్ ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు మహేందర్రెడ్డి–ప్రేమలత ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు పెద్దకాపర్తి గ్రామ మాజీ సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్రెడ్డి–రేణుక, కందిమళ్ల జైపాల్రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ నాని
పోర్చుగీస్ స్టార్ ఫుట్బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఆటగాడు నాని రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల నాని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నాకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పే సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ ప్లేయర్గా నా కెరీర్ను ముగించాలని నిర్ణయించుకున్నాను.నా ఈ 20 ఏళ్ల అద్భుత ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు. నా కొత్త లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తాను. మళ్లీ మనం కలుద్దాం అని ఇన్స్టాగ్రామ్లో నాని రాసుకొచ్చాడు. కాగా నాని 2007 మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున తన కెరీర్ను ఆరంభించాడు. ఈ ప్రతిష్టాత్మక క్లబ్ తరపున 230 మ్యాచ్లు ఆడి 41 గోల్స్ చేశాడు. గోల్స్ సమయంలో మరో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కీలక సహచరుడిగా నానికి పేరుంది. నాని తన వాలెన్సియా, లాజియో, ఓర్లాండో సిటీ, వెనిజియా, మెల్బోర్న్ విక్టరీ అదానా డెమిర్స్పోర్ల వంటి మొత్తం 10 క్లబ్ల తరపున ఆడాడు.నాని తన జాతీయ జట్టు పోర్చుగల్ తరపున 112 మ్యాచ్లు ఆడి 24 గోల్స్ చేశాడు. అదే విధంగా 2016లో యూరోపియన్ ఛాంపియన్షిప్ విజేత నిలిచిన పోర్చుగల్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు.చదవండి: ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్కు భారీ షాక్ -
విమానం గాల్లో ఉండగా గందరగోళం.. 11 మంది ప్రయాణికులకు గాయాలు
కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్కు వెళుతున్న విమానం గాల్లో ఉండగా ఊహించని గందరగోళాన్ని ఎదుర్కొంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. బెర్ముడాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానాన్ని అత్యవసర మళ్లింపు చేయడంతో ప్రయాణికులు క్రిస్మస్ పండగ రోజును, బాక్సింగ్ డేనాడు బెర్ముడాలో గడపాల్సి వచ్చింది. డిసెంబర్ 24న మలెత్ ఏరో ఫ్లైట్ 225 మంది ప్రయాణికులతో బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇది ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయలుదేరిన రెండు గంటల తర్వాత ఎయిర్బస్ విమానం 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. -
ఇంగ్లండ్ బౌలర్ విధ్వంసం.. 30 బంతుల్లోనే..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా నార్త్రన్ సూపర్ ఛార్జర్స్తో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్, ఒరిజినల్స్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ (30 బంతుల్లో 83; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Manchester Originals have won the derby 👊 Which player impressed you the most?#TheHundred pic.twitter.com/RLudfitjnD — The Hundred (@thehundred) August 13, 2023 అతనికి లారీ ఈవాన్స్ (18 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ 90 బంతుల్లో (వర్షం అంతరాయం కారణంగా 90 బంతుల మ్యాచ్గా అంపైర్లు నిర్ణయించారు) 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్లో ఓవర్టన్, ఈవాన్స్తో పాటు పాల్ వాల్టర్ (22; 4 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు రీస్ టాప్లే 3, బ్రైడన్ కార్స్, పార్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. The highest men's total for a Manchester Original player 🙌#TheHundred pic.twitter.com/RpRsNNOt7j — The Hundred (@thehundred) August 13, 2023 అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 90 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఒరిజినల్స్ బౌలర్లు ఉసామా మిర్ (4/19), జాషువ లిటిల్ (2/33) సూపర్ ఛార్జర్స్ను దారుణంగా దెబ్బకొట్టారు. వీరికి జోష్ టంగ్ (1/25), టామ్ హార్ట్లీ (1/9), పాల్ వాల్డర్ (1/26) తోడవ్వడంతో సూపర్ఛార్జర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్లో మాథ్యూ షార్ట్ (37), సైఫ్ జైబ్ (21), హ్యారీ బ్రూక్ (20) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. Well, that was incredible... 👀#TheHundred pic.twitter.com/KBXmSj7nls — The Hundred (@thehundred) August 13, 2023 -
ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..
ఇంగ్లండ్లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మాంచెస్టర్లో ఇటీవల కొద్దిరోజులుగా నాణేల కలకలం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వీథుల్లోను, బస్టాపులు, పార్కుల్లోని బెంచీల మీద, పార్కింగ్ టికెట్ మెషిన్లు, వెండింగ్ మెషిన్లు, ఫుడ్ కోర్టులు సహా జన సమ్మర్దం గల ప్రదేశాల్లో కొద్దిరోజులుగా మిలమిలలాడే సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి చెల్లా చెదురుగా పడి ఉంటున్నాయి. జనాల్లో కొందరు వీటిని జేబులో వేసుకుని తీసుకుపోతుంటే, ఇంకొందరు మనకెందులే అన్నట్లుగా ఎక్కడివక్కడే వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. ఈ నాణేలు వీథుల్లో ఎక్కడపడితే అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయో, వాటిని ఎవరు పడేశారో, దీని వెనుక గల ఉద్దేశమేమిటో జనాలకు కొద్దిరోజుల వరకు అంతుచిక్కలేదు. అయితే, దీనివెనుక గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం చేపట్టిన ‘ది ఫైండ్’ అనే ఆర్ట్ ప్రాజెక్టులో భాగంగా మార్క్ గాండెర్ అనే కళాకారుడు ఈ నాణేలను రూపొందించాడు. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జూలై 16 నాటితో ముగుస్తోంది. ఫెస్టివల్ చివరి రోజు వరకు నగరంలోని వేర్వేరు చోట్ల ఇలా రెండు లక్షల నాణేలను ఉంచనున్నట్లు ఆర్ట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని కనుక్కోగలమనే దాన్ని ఈ నాణేలు గుర్తు చేస్తాయని, ఇవి నగరవాసులకు, సందర్శకులకు జ్ఞాపికలుగా మిగిలిపోతాయని మార్క్ గాండెర్ వెల్లడించారు. (చదవండి: భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక ఉండొచ్చట!) -
మాంచెస్టర్లో హైస్కూల్ టీచర్.. సంబల్పురీ చీరకట్టి సంబురంగా పరుగెట్టీ
మొన్నటికి మొన్న గ్వాలియర్లో... చీరె ధరించి ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్లో హైస్కూల్ టీచర్గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్లు, ఆల్ట్రా మారథాన్లలో పాల్గొంది. తాజాగా మాంచెస్టర్లో 42.5 కి.మీల మారథాన్లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్పురీ చీర కట్టి మారథాన్లో పాల్గొంది మధుస్మిత. ‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత. ‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత. -
నాకు ద్రోహం చేశారు.. కానీ జట్టుపై అవేమీ ప్రభావం చూపలేవు: రొనాల్డో
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్20)న దోహా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో అతిథ్య ఖతర్ జట్టును ఈక్వెడార్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(నవంబర్ 21) రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ఇరాన్తో ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో సెనెగల్, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక ఇది ఇలా ఉండగా.. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాంచెస్టర్ యునైటెడ్తో పాటు ఆ జట్టు కోచ్పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్తో పాటు ఆ జట్టు మేనేజర్ తనకు ద్రోహం చేశాడంటూ ఆరోపణలు చేశాడు. ఇదే విషయంపై మరోసారి రొనాల్డో స్పందించాడు. మాంచెస్టర్ యునైటెడ్తో తన గొడవ ప్రపంచకప్లో తమ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదని క్రిస్టియానో రొనాల్డో తెలిపాడు. విలేకరుల సమావేశంలో రొనాల్డో మాట్లాడూతూ.. "మాంచెస్టర్తో క్లబ్తో విభేదాలు ఆటగాడిగా నన్ను ప్రభావితం చేయవచ్చు. కానీ ఇటువంటి గొడవలు, వ్యక్తిగత విభేదాలు మా జట్టుపై ఏ మాత్రం ప్రభావం చూపవు" అని అతడు పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా పోర్చ్గల్ తమ తొలి మ్యాచ్లో నవంబర్ 24న ఘనాతో తలపడనుంది. చదవండి: FIFA World Cup 2022: అమెరికా కెప్టెన్గా 23 ఏళ్ల టైలర్ ఆడమ్స్ Cristiano Ronaldo: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' -
ఎలాన్ మస్క్ మరో సంచలనం! ఫుట్బాల్ టీమ్ను కొంటున్నా!
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకోవడంతో మస్క్పై ట్విట్టర్ చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ ఫుట్బాల్ క్లబ్ టీం మాంచెస్టర్ యూనైటెడ్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. To be clear, I support the left half of the Republican Party and the right half of the Democratic Party! — Elon Musk (@elonmusk) August 16, 2022 ట్విట్టర్లో యాక్టీవ్గా ఉండే ఎలాన్ మస్క్ తాజాగా అమెరికన్ పాలిటిక్స్పై ట్వీట్ చేశారు. నేను రిపబ్లికన్,డెమోక్రటిక్ ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నాని ట్వీట్లో పేర్కొన్నారు. Also, I’m buying Manchester United ur welcome — Elon Musk (@elonmusk) August 17, 2022 కొద్ది సేపటికే ఫుట్బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ప్రస్తుతం మస్క్ నిర్ణయం బిజినెస్ వరల్డ్లో మరింత ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ కొనుగోలుపై విచారణ జరుగుతుండగా ఈ బిజినెస్ టైకూన్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
'లవర్ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్బాలర్పై ఆరోపణలు
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఫుట్బాలర్.. వేల్స్ ఫుట్బాల్ మేనేజర్ రియాన్ గిగ్స్ చిక్కుల్లో పడ్డాడు. మాజీ గర్ల్ఫ్రెండ్ కేట్ గ్రీవెల్లిని నగ్నంగా హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేట్ కోర్టుమెట్లను ఆశ్రయించడంతో ప్రస్తుతం రియాన్ గిగ్స్ యునైటెడ్ కింగ్డమ్ కోర్టులో ట్రయల్లో ఉన్నాడు. విషయంలోకి వెళితే.. వేల్స్ ఫుట్బాల్ మేనేజర్.. రియాన్ గిగ్స్ కేట్ గ్రీవెల్లిని ఇష్టపడ్డాడు. మొదట్లో అతని ప్రవర్తన నచ్చి ఆమె అతన్ని ఇష్టపడింది. ఆ తర్వాత రియాన్ కేట్పై వేధింపులకు దిగేవాడు. దాదాపు మూడేళ్లుగా ఆమెను శారీరకంగా వేధించడమే గాక ఆమె ఫోన్కు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ప్రతీరోజు సెక్స్ చేయాలని.. లేకుంటే తనతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. గతంలో చాలాసార్లు కేట్తో గొడవపడి కొట్టిన సందర్బాలు ఉన్నాయి. దీంతో కేట్ గ్రీవెల్లి రియాన్ గిగ్స్తో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రియాన్ గిగ్స్.. కేట్కు ఫోన్ చేసి హోటల్కు ఆహ్వానించాడు. అయితే కేట్ తన సోదరి ఎమ్మాతో కలిసి హోటల్కు వచ్చింది. ఆమె వచ్చే సమయానికి గిగ్స్ మరొక మహిళతో రిలేషిన్షిప్లో ఉన్నాడు. ఇది చూసిన కేట్స్కు విపరీతంగా కోపమొచ్చింది. వెంటనే లోపలికి వెళ్లిన కేట్స్.. మాట్లాడుకుందామని పిలిచి ఏం చేస్తున్నావు ? అంటూ నిలదీసింది. అయినా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.. మనిద్దరం విడిపోవడమే బెటర్ అని తన వెంట తెచ్చుకున్న సూట్కేసు తీసుకొని బయలుదేరుతుండగా.. గిగ్స్ కోపంతో ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కేట్స్ తలను గట్టిగా నేలకేసి కొట్టాడు గిగ్స్. ఈ క్రమంలో ఆమె పెదవులు చిట్లి నోటి నుంచి రక్తం వచ్చింది. అనంతరం ఆమెను వివస్త్రను చేసి హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడు. అడ్డువచ్చిన కేట్స్ చెల్లి ఎమ్మాను కూడా కొట్టి బయటకు తోశాడు. కేట్ సోదరి ఎమ్మా సమాచారంతో గిగ్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఆదివారం(ఆగస్టు7న) కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా వాదనలు విన్న కోర్టు గిగ్స్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గిగ్స్ ట్రయల్పై రిమాండ్లో ఉన్నాడు. చదవండి: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్రౌండర్.. ఫొటోలు వైరల్ -
మాంచెస్టర్ వన్డేలో భారత్ ఘన విజయం
-
తప్పతాగి విమానంలో రచ్చ చేసిన యువకుడు.. గెంటేసిన పోలీసులు
ఇంగ్లండ్: విమానంలో తాగి రచ్చ రచ్చ చేశాడు ఓ వ్యక్తి. 11 ఏళ్ల తర్వాత స్నేహితుడితో కలిసి హాలిడే ట్రిప్కు వెళ్తున్నానే ఎగ్జైట్మెంట్లో అతిగా ప్రవర్తించాడు. అంతేకాదు విమానంలోని సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదరు వ్యక్తి కూర్చున్న సీటు దగ్గరకు పోలీసులు వెళ్లారు. అతడు తాగి ఉన్నాడని, వోడ్కా బాటిల్లో మూడో వంతు కాళీ చేశాడని సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో అతడ్ని విమానం నుంచి దిగిపోమని పోలీసులు సూచించారు. అతడు మాత్రం పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు. నా లగేజ్ను మీరు మోసుకొస్తారా? అని పోలీసులను ప్రశ్నించాడు. అంతేకాదు తనతో పోట్లాటకు రావాలని వాగాడు. చివరకు పోలీసులు అతడ్ని విమానం నుంచి దింపి వ్యానులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ విమానంలోకి వెళ్లి సదరు వ్యక్తి స్నేహితుడ్ని కూడా విమానం నుంచి దిగాలని ఆదేశించారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులంతా చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. తాగి రచ్చ చేసిన వ్యక్తి పేరు ఆశ్లే క్రచ్లీ(27). ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో నివాసముంటాడు. హాలిడే ట్రిప్కు పోర్చుగల్కు వెళ్లే సమయంలో ఇలా చేశాడు. 11 ఏళ్ల తర్వాత తనకు హాలిడే వచ్చిందనే ఉత్సాహంలోనే అతడు ఎగ్జైట్ అయి ఇలా చేశాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. క్రచ్లీ తన ప్రవర్తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. విమానంలో ఇబ్బందికర ప్రవర్తనకు క్రచ్లీ రూ.30వేలు జరిమాన కట్టాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులకు రూ.8వేలు, బాధిత సిబ్బందికి రూ.12వేలు చెల్లించాలని చెప్పింది. చదవండి: మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ! -
బిల్డింగ్లో బీచ్ ఉంటే ఎలా ఉంటుంది.. అదిరిపొద్దంతే కదా!
UK's First Indoor Beach: బీచ్ అనగానే విశాలమైన సముద్రం, నేలపై పరుచుకున్న ఇసుక తిన్నెలు, అప్పుడప్పుడు వచ్చిపోయే అలలు కళ్లముందు కనిపిస్తుంటాయి. మరి ఇలాంటివన్నీ బయట కాకుండా ఓ బిల్డింగ్ లాంటి ప్రదేశం లోపల ఇమిడిపోతే. అంటే ఇండోర్లోకి వచ్చేస్తే! బ్రిటన్లో అచ్చం ఇలాగే ఇండోర్ బీచ్ ఒకటి సిద్ధమవుతోంది. ఒక్క బీచ్ మాత్రమే కాదు.. మినరల్ బాత్లు, స్టీమ్ రూమ్లు, వేడి నీటి బుగ్గలు.. అబ్బో చూడముచ్చటైన చాలా అందాలు జతకూడనున్నాయి. ఈ బీచ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందామా. బ్రిటన్లోని మాంచెస్టర్లో.. బ్రిటన్లోని మాంచెస్టర్లో ఏర్పాటు చేస్తున్న ఈ బీచ్కు ‘థర్మ్ మాంచెస్టర్’ అని పేరు పెట్టారు. దీన్ని దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. 2023 నాటి కల్లా సిద్ధమవ్వాల్సి ఉన్నా మరిన్ని ప్రత్యేక వసతులను జత చేసి 2025 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నా రు. ఏటా 20 లక్షల మంది ఈ బీచ్ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. 28 ఎకరాల వైశాల్యంలో.. బీచ్ను 28 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అంటే 19 ఫుట్ బాల్ పిచ్ల వైశాల్యమంత ఉంటుంది. ఇందులో ఇండోర్, ఔట్డోర్ పూల్స్, 35 వాటర్ స్లైడ్స్, స్టీమ్ రూమ్స్, విశ్రాంతి తీసుకోవడానికి తాటి చెట్లు ఏర్పాటు చేయనున్నారు. రోజా పువ్వు ఆకారంలో వెల్ బీయింగ్ గార్డెన్ను రెండెకరాల్లో రెడీ చేయనున్నారు. వందలాది చెట్లు, మొక్కలను పెంచనున్నారు. పెద్దల కోసం వేడి నీటి బుగ్గలు (వార్మ్ వాటర్ లగూన్స్), మినరల్ బాత్, స్టీమ్ రూమ్స్ సిద్ధం చేయనున్నారు. పైగా.. బార్లు, కేఫ్లు, స్నాక్స్ అందించే రెస్టారెంట్లు కూడా ఉంటాయి. విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోజువారి నీటి సంబంధమైన ఫిట్నెస్ క్లాసులు, యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. -
ఫిబ్రవరి 6, 1958.. ఫుట్బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం
చరిత్రలో కొన్ని ఘటనలు విషాదాలుగా మిగిలిపోయాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించుకోవడం తప్ప వాటిని మార్చలేం. అలాంటి కోవకు చెందినది 1958 మునిచ్ ఎయిర్ డిజాస్టర్. మాంచెస్టర్ యునైటెడ్కు చెందిన ఫుట్బాల్ టీమ్తో వెళ్తున్న ఎయిర్క్రాప్ట్ క్రాష్ అవడంతో అందులో ఉన్న 23 మంది ఆనవాళ్లు లేకుండా పోయారు. ఫుట్బాల్ చరిత్రలోనే అతి పెద్ద విషాదంగా మిగిలిపోయిన ఆ ఘోర దుర్ఘటనకు నేటితో(ఫిబ్రవరి 6) 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరోజు ఏం జరిగింది.. 1958 ఫిబ్రవరి 6.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మంచి ఉత్సాహంతో ఉంది. ఏ మ్యాచ్లో పాల్గొన్న విజయం వారిదే అవుతుంది. ఎందుకంటే జట్టు మొత్తం యువ ఆటగాళ్ల రక్తంతో నిండిపోయింది. ఉరకలేసే ఉత్సాహానికి తోడు మంచి మేనేజర్ కలిగి ఉన్నాడు. అందుకే ఆ జట్టుకు బస్బే బేబ్స్ అని నిక్నేమ్ వచ్చింది. జర్మనీలోని మ్యునిచ్లో మ్యాచ్ ఆడడానికి ఫుట్బాల్ ప్లేయర్లు సహా ఇతర సిబ్బంది ఎయిర్బేస్లో బయలుదేరారు. విజయంతో తిరిగి రావాలని మాంచెస్టర్ ప్రజలు దీవించి పంపారు. కానీ వారి దీవెనలు పనిచేయలేదు. ఆకాశంలో ఎగిరిన కాసేపటికే ఎయిర్బేస్కు ట్రాఫిక్ సంబంధాలు తెగిపోయాయి. 𝑭𝒐𝒓𝒆𝒗𝒆𝒓 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓, 𝒘𝒆'𝒍𝒍 𝒇𝒐𝒍𝒍𝒐𝒘 𝒕𝒉𝒆 𝒃𝒐𝒚𝒔. In 2018, our participants joined @ManUtd players to record this moving poem to mark the 60th anniversary of the Munich Air Disaster. Today, we share it again, as we remember the #FlowersOfManchester 🔴❤️ pic.twitter.com/rOk3tsdIDQ — Manchester United Foundation (@MU_Foundation) February 6, 2022 దీంతో ఎయిర్బేస్ కుప్పకూలిందేమోనన్న అనుమానం కలిగింది. వారి అనుమానమే నిజమయింది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన ఎయిర్ బేస్లో ఉన్న 8 మంది ఫుట్బాల్ ప్లేయర్స్ సహా, మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది, జర్నలిస్టులు, ఎయిర్బేస్ సిబ్బంది సహా మరో ఇద్దరి ప్రయాణికులు మొత్తం 23 మందిలో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు. మ్యునిచ్ ఎయిర్బేస్ విమాన శకలాలు ఇప్పటికి అక్కడే ఉన్నాయి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి విమాన శకలాలను భద్రపరిచారు. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్ళు జియోఫ్ బెంట్ రోజర్ బైర్న్ ఎడ్డీ కోల్మన్ డంకన్ ఎడ్వర్డ్స్ మార్క్ జోన్స్ డేవిడ్ పెగ్ టామీ టేలర్ లియామ్ "బిల్లీ" వీలన్ మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది వాల్టర్ క్రిక్మెర్ - క్లబ్ కార్యదర్శి టామ్ కర్రీ - శిక్షకుడు బెర్ట్ వాలీ - చీఫ్ కోచ్ ఎయిర్బేస్ సిబ్బంది కెప్టెన్ కెన్నెత్ రేమెంట్ టామ్ కేబుల్ జర్నలిస్టులు ఆల్ఫ్ క్లార్క్ డానీ డేవిస్ జార్జ్ అనుసరిస్తాడు టామ్ జాక్సన్ ఆర్చీ లెడ్బ్రూక్ హెన్రీ రోజ్ ఫ్రాంక్ స్విఫ్ట్ ఎరిక్ థాంప్సన్ -
ఫుట్బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు..
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్బాలర్ మాసన్ గ్రీన్వుడ్ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది.సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాసన్ గ్రీన్వుడ్ను గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ గర్ల్ఫ్రెండ్పై బలవంతగా లైంగిక వేధింపులకు దిగినట్లు వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది. అయితే మాంచెస్టర్ యునైటెడ్ మొదట మాసన్ గ్రీన్వుడ్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. చదవండి: ఫుట్బాల్ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ తాజాగా అతనిపై వచ్చిన సెక్స్ ఆరోపణలు నిజమేనని తెలియడంతో ఫుట్బాల్ క్లబ్ కూడా గ్రీన్వుడ్పై కఠిన చర్యలు తీసుకుంది. తక్షణమే గ్రీన్వుడ్ను క్లబ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తన తప్పు లేదని నిరూపించుకునేవరకు గ్రీన్వుడ్ ఏ క్లబ్ తరపున ఫుట్బాల్ ఆడకుండా ఫుట్బాల్ సమాఖ్యకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనికి తోడూ అన్ని ఎండార్స్మెంట్ల నుంచి గ్రీన్వుడ్ను తొలగిస్తున్నామంటూ తమ అధికారిక వెబ్సైట్లో అతని పేరు తొలగించిన పేజ్ను విడుదల చేసింది. ఇక గ్రీన్వుడ్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న నైక్ కంపెనీ తమ స్పాన్సర్సిప్ను రద్దు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ''మాసన్ గ్రీన్వుడ్పై వస్తున్న ఆరోపణలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. అందుకే తాత్కాలింకగా అతనితో స్పాన్సర్షిప్ను రద్దు చేసుకుంటున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం.'' అంటూ తెలిపింది. ఇక హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్వుడ్కు మాజీ గర్ల్ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ గత ఆదివారం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్వుడ్కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. -
రొనాల్డో కొత్త చరిత్ర.. ఎవరికి అందనంత ఎత్తులో
Cristiano Ronaldo Histroy 801 Goal.. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్.. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో రొనాల్డో 800వ గోల్ నమోదు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్, ఆర్సినల్ మధ్య జరిగిన మ్యాచ్లో రొనాల్డో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్గా మ్యాచ్లో రెండు గోల్స్ నమోదు చేసిన రొనాల్డో 801 గోల్స్తో ఎవరికి అందనంత ఎత్తులో నిలవడం విశేషం. ఇప్పటివరకు అన్ని మ్యాచ్లు కలిపి 1138 వరకు ఆడిన రొనాల్డో.. క్లబ్ లీగ్స్ తరపున 485 గోల్స్, పోర్చుగల్ తరపున 115, కాంటినెంటల్లో 150, వివిధ మేజర్ కప్ టోర్నీల్లో 51 గోల్స్ సాధించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో బాడీగార్డ్స్గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా! ఇక ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మాంచెస్టర్ యునైటెడ్ 3-2 తేడాతో ఆర్సినల్పై ఘన విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ తరపున బ్రూనో ఫెర్నాండ్స్ ఆట 44వ నిమిషంలో, క్రిస్టియానో రొనాల్డో(ఆట 52వ నిమిషం, 70వ నిమిషంలో) గోల్స్ సాధించగా.. ఆర్సినల్ తరపున స్మిత్ రోవ్ ఆట 13వ నిమిషంలో.. ఓడీగార్డ్ ఆట 54వ నిమిషంలో గోల్ సాధించారు. 💯💯💯💯💯💯💯💯@Cristiano is out of this world 🌍#MUFC pic.twitter.com/UaQjnCUNH0 — Manchester United (@ManUtd) December 2, 2021 -
మాంచెస్టర్లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే?
ప్రపంచం ప్రస్తుతం ఒక గ్రామంగా మారిపోయింది. ఏం అమ్మాలన్నా, కొనాలన్నా అంతర్జాతీయ మార్కెట్లతో చిటికలో పని జరిగిపోతుంది. ఒకచోట తయారైన వస్తువులు మరోచోట విక్రయం జరగుతుంది. గ్రామాల్లోని వస్తువులు దేశం దాటి ప్రపంచమంతా ప్రయాణిస్తుంటాయి. తాజాగా ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి యూకేలోని మాంచెస్టర్కు వెళ్లింది. ఖండాలు దాటిన జర్నీ ఆ కుర్చీ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అసలు ఇది 7000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి ఎలా వెళ్లిందో దీని వెనక కథ ఎంటో తెలుసుకుందాం. జర్నలిస్ట్ సునందన్ లేలే ఇటీవల ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ సిటీని సందర్శించాడు. అక్కడ ఓ రెస్టారెంట్లోని ఓపెన్ సీటింగ్ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది. ఇనుముతో ఉన్న కుర్చీ వెనక మరాఠీలో ‘బాలు లోఖండే సవ్లాజ్’ అని రాసి ఉంది. దీనిని చూసిన అతను ఆశ్యర్యపోయాడు. ‘ఇది వింత కాదా’ అంటూ తన ట్విటర్లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కుర్చీ ప్రయాణాన్ని చూస్తుంటే భారతీయ మార్కెట్ విస్తరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, చాలామంది మరాఠీలుగా గర్వపడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా? కాగా కుర్చీ మహారాష్ట్రలోని సాల్వాజ్ గ్రామానికి చెందిన టెంట్హౌజ్ బాలు లోఖండేకు చెందినది. ఇటీవల ప్లాస్టిక్ కుర్చీలకు డిమాండ్ పెరగంతో టెంట్హౌజ్ యజమాని ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుండటంతో లోఖాండే తన పాత ఇనుప కుర్చీలను 15 ఏళ్ల క్రితం పాత ఇనుప సామానులకు అమ్ముకోవాల్సి వచ్చింది. .అది కాస్తా మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్కు చేరింది. చదవండి: వైరల్: సింగిల్ మీల్కు లక్షా ఎనభై వేలు!! View this post on Instagram A post shared by Sunandan Lele (@lelesunandan) -
మాంచెస్టర్లో కొత్త చరిత్ర.. రెండు పెద్ద తలలు ఇక్కడే
మాంచెస్టర్: ఇంగ్లండ్లోని మాంచెస్టర్ సిటీకి కొత్త కళ వచ్చింది. క్రీడల్లో వేర్వేరు ఆటలకు సంబంధించిన రెండు పెద్ద తలలు ఇక్కడ అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. విషయంలోకి వెళితే ఒకరు క్రికెట్లో మెషిన్గన్ అయితే.. మరొకరు ఫుట్బాల్లో కింగ్గా పేరుపొందారు. వారే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరొకరు పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో నేటి నుంచి జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ను ఆరంభించింది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో చేరిన క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫర్డ్లోనే న్యూకాసిల్ యునైటెడ్తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా లంకాషైర్ క్రికెట్ వినూత్న రీతిలో ట్వీట్ చేసింది. కోహ్లి, రొనాల్డోలు ఒక దగ్గరే ఉన్నారు. వారిద్దిర జాయింట్ ప్రాక్టీస్ సెషన్ను మీకు చూడాలని ఉందా అంటూ రాసుకొచ్చింది. దీనిపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ స్పందింస్తూ.. వన్ సిటీ.. టూ గోట్స్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇక టీమిండియా ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా ఈ మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతం అవుతుంది. అయితే ఇంగ్లండ్ మాత్రం చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. చదవండి: Messi VS Pele: 'నాకు అతనితో పోలికేంటి'.. దెబ్బకు దెబ్బ తీశాడు One city, two GOATs 😉 — Manchester United (@ManUtd) September 9, 2021 -
వైరల్: 22 వేల మంది ముందు.. ‘యెస్’ చెప్పేసింది!
మాంచెస్టర్: ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. అనూహ్య పరిణామానికి అవాక్కైన ఆమె.. ఆశ్చర్యం నుంచి తేరుకుని అతడి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రియుడు ఇచ్చిన ఉంగరం స్వీకరించి కన్నీటి పర్యంతమైంది. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో వీరి ప్రేమను హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ఘటన గురించి కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘హేయ్... ఇక్కడ ఏం జరుగుతోంది? జిల్, ఫిల్.. అంతేకదా జిల్.. ఫిల్. 22 వేల మంది ముందు ప్రపోజ్ చేశాడు. డెసిషన్ పెండింగ్లో ఉంది.. ఓహో.. ఆమె యెస్ చెప్పేసింది’’ అంటూ ప్రేమజంట పేర్లను వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తమ అధికారికి ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కాగా మ్యాచ్ 9వ ఓవర్ చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక చివరిదైన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. జాసన్ రాయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. స్కోర్లు: పాకిస్తాన్- 154/6 (20) ఇంగ్లండ్- 155/7 (19.4) Decision Pending... ⏳ She said YES! 💍 Congrats Phil and Jill! ❤️ pic.twitter.com/SHj0iy45Pw — England Cricket (@englandcricket) July 21, 2021 -
ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?
మనం కొన్ని సార్లు వార్తలలో ఒక్క రోజులో కోటీశ్వరడు అయినట్లు వచ్చిన వార్తలను ఇప్పటి వరకు చదివి ఉంటాం. కానీ, జార్జియా జరిగిన ఈ సంఘటన గురుంచి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. సాదరణంగానే మన లాగే క్రిస్ విలియమ్స్ ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాడు. అలా ఒక రోజు ఉదయం 9 గంటలకు లేవగానే విలియమ్స్ తన ఫోను చూసి షాక్కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని తన కళ్లు నులిమి చూసుకున్నాడు. క్రిప్టోకరెన్సీ రాకెట్ బన్నీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన క్రిస్ రాత్రికి రాత్రే ట్రిలియనీర్ అయిపోయాడు. జార్జియాలోని మాంచెస్టర్లో చదువుకుంటున్న నర్సింగ్ పాఠశాల విద్యార్థి క్రిస్ విలియమ్స్ గత ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గత వారం రాకెట్ బన్నీ అనే క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ విలువ ఆ మరుసటిరోజుకు 1.4 ట్రిలియన్లకు పెరిగింది. మన కరెన్సీలోకి మార్చుకుంటే దీని విలువ సరిగ్గా రూ.10,37,49,10,00,00,000. అక్షరాల దీని విలువ రూ.కోటి కోట్లకు పైమాటే. కాసేపటికి తేరుకున్న విలియమ్స్ ఆ మొత్తాన్ని వేరే వాలెట్లోకి మార్చుకునేందుకు ప్రయత్నించాడు. అది అదే ధరను ఇతర వాలెట్లో చూపించడం లేదని తాను ఇన్వెస్ట్ చేసిన కాయిన్బేస్ వాలెట్ను సంప్రదించాడు. తాము ఈ సమస్య పరిష్కారానికి రాకెట్ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది. చాలా రోజులు గడిచిన ఎటువంటి సమాధానం రాకపోవడంతో సలహా కోసం ఈ విషయాన్ని విలియమ్స్ ట్విటర్లో నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. క్రిప్టోకరెన్సీలపై ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేసే స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్నూ ట్యాగ్ చేసి, సలహా ఇవ్వాలని కోరాడు. తాను పెట్టుబడి పెట్టిన క్రిప్టోకరెన్సీ స్కామ్ కాకపోవచ్చని విలియమ్స్ భావిస్తున్నాడు. అతడు ఇంత మొత్తంలో వచ్చిన డబ్బును ఎన్నడూ ఖర్చు చేయలేనని కాబట్టి నేను దానిని మంచి పనుల కోసం వినియోగిస్తాను అని విలియమ్సన్ చెప్పాడు. ఆ డబ్బుతో కుటు౦బాన్ని మంచిగా చూసుకోవడం, సహోదరీలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు ఉచిత వైద్య క్లినిక్లను ప్రారంభిస్తానని క్రిస్ చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు కాయిన్ బేస్ యాప్ విలియమ్సన్ ఖాతాను స్తంభింపచేసింది. దీంతో అంత మొత్తంలో వచ్చిన ఆ నగదును కాయిన్ బేస్ నుంచి ఉపసంహరించుకోలేడు, ఎటువంటి వర్తకం చేయలేడు. ఒక వార్త కథనం ప్రకారం కాయిన్ బేస్ ఈ సంఘటన గురుంచి వివరించింది. అదే రోజు జార్జియాలోని జాస్పర్ లో నివసిస్తున్న అతని స్నేహితుడు అదే నాణెం కొన్నాడు. కానీ అతడికి అంత మొత్తం నగదు జమ కాలేదు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. సాంకేతిక లోపం వల్ల విలియమ్సన్ ఖాతాలో అంతా మొత్తం సంపద జమ అయినట్లు పేర్కొంది. -
ఆసీస్కు అంతుచిక్కని బ్యాట్స్మన్
మాంచెస్టర్: గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో తన ఫామ్ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్కు సిద్ధమయ్యాడు. ఈ రోజు నుంచి మాంచెస్టర్ వేదికగా ఆరంభంగా కానున్న వన్డే సిరీస్లో మోర్గాన్ మరోసారి బ్యాట్ ఝుళిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మోర్గాన్ నేతృత్వంలోని మోర్గాన్ సేన టీ20 సిరీస్ను గెలుచుకోగా, ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది. అదే సమయంలో ఆసీస్కు ఈ లెఫ్ట్ హ్యాండర్ బెంగ పట్టుకుంది. ఇందుకు ఆసీస్పై వన్డేల్లో మోర్గాన్కు తిరుగులేని రికార్డు ఉండటమే. మరొకవైపు వన్డేల్లో ఇంగ్లండ్ ఆల్టైమ్ లీడింగ్ రన్ స్కోరర్గా మోర్గాన్ కొనసాగుతుండటంతో అతనిపైనే ఆసీస్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రస్తుతం మోర్గాన్ వన్డేల్లో 6,766 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్లో ఉన్నాడు. ఇక వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడింది కూడా మోర్గానే కావడం విశేషం. తన 11 ఏళ్ల కెరీర్లో మోర్గాన్ 216 మ్యాచ్లు ఆడాడు.ఇక తన సారథ్యంలో ఇంగ్లండ్ గతేడాది వన్డే వరల్డ్కప్ను గెలుచుకని చరిత్ర సృష్టించింది. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్) వన్డే ఫార్మాట్లో ఆసీస్కు అంతుచిక్కని బ్యాట్స్మన్ మోర్గాన్. ఆసీస్పై అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి వాటం ఆటగాడు మోర్గాన్. ఇప్పటివరకూ ఆసీస్పై 54 వన్డేలు ఆడిన మోర్గాన్.. 1,864 పరుగులు నమోదు చేశాడు. ఇది ఆసీస్పై ఏ దేశం తరఫున చూసిన ఒక లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ సాధించిన అత్యధిక పరుగుల రకార్డుగా ఉంది. ఆసీస్పై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి ఆటగాళ్ల జాబితాలో మోర్గాన్ తొలి స్థానంలో ఉండగా, బ్రియాన్ లారా(వెస్టిండీస్) తర్వాత స్థానంలో ఉన్నాడు. ఆసీస్పై లారా సాధించిన పరుగులు 1,858. ఆపై వరుస స్థానాల్లో కుమార సంగక్కరా(1,813 శ్రీలంక), స్టీఫెన్ ఫ్లెమింగ్( 1,241 న్యూజిలాండ్), గ్యారీ కిరెస్టన్(1,167 దక్షిణాఫ్రికా)లు ఉన్నారు. ఆసీస్పై మోర్గాన్ 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. (చదవండి: స్వీడన్ జట్టు కోచ్గా జాంటీ రోడ్స్) -
ఇంగ్లండ్ పైచేయి...
మాంచెస్టర్: సాధారణంగా చప్పగా సాగిపోయే టెస్టు మ్యాచ్ ఇక్కడ రెండోరోజు మాత్రం వేగంగా మారిపోయింది. కష్టాలు సెషన్ల వారీగా జట్టు నుంచి జట్టుకు బదిలీ అయ్యాయి. అయితే ఓవరాల్గా నిర్ణాయక మూడో టెస్టులో రెండో రోజు ఆటను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శాసించింది. తొలి సెషన్లో తమ పేస్ పదునుతో దడదడలాడించిన వెస్టిండీస్ తర్వాత సెషన్ నుంచి కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. వెలుతురులేమితో ఆటను ముగించే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 47.1 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు విండీస్ మరో 232 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ టెయిలెండర్ స్టువర్ట్ బ్రాడ్ (45 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ఇంగ్లండ్ కష్టాలతో... ఓవర్నైట్ స్కోరు 258/4తో శనివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో పోప్ (150 బంతుల్లో 91; 11 ఫోర్లు), సెంచరీ చేస్తాడనుకుంటే ఒక్క పరుగైనా చేయకుండానే పాత స్కోరుకే ఔటయ్యాడు. బట్లర్ (142 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా క్రితంరోజు స్కోరుకు 11 మాత్రమే జత చేశాడు. ఇద్దరినీ గాబ్రియెల్ పెవిలియన్ పంపాడు. తర్వాత కీమర్ రోచ్... వోక్స్ (1), ఆర్చర్ (3)లను ఔట్ చేశాడు. వరుస నాలుగు ఓవర్లలోనూ 4 వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ 280/8 స్కోరుతో కష్టాల్లో పడింది. ఒకదశలో 300 పరుగుల్లోపే తొలి ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. కానీ బ్రాడ్ మెరిపించడంతో టెస్టు కాసేపు వన్డేలా మారింది. ఈ టెయిలెండర్ దూకుడు పెరగడంతో జట్టు స్కోరు కూడా పెరిగింది. బ్రాడ్ 33 బంతుల్లో అర్ధసెంచరీ (8 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో వేగవంతమై మూడో అర్ధసెంచరీగా నిలిచింది. డామ్ బెస్ (18 నాటౌట్; 1 ఫోర్)తో తొమ్మిదో వికెట్కు జతచేసిన 76 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను పటిష్టం చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 111.5 ఓవర్లలో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. రోచ్ 4, గాబ్రియెల్, చేజ్ చెరో 2 వికెట్లు తీశారు. వోక్స్ను ఔట్ చేయడంతో కీమర్ రోచ్ 200 వికెట్ల క్లబ్లోకి చేరాడు. విండీస్ విలవిల... తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ను బ్రాడ్ బంతితోనూ దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్లోనే క్రెయిగ్ బ్రాత్వైట్ (1)ను పడేశాడు. కాసేపయ్యాక మరో ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (32)ను ఆర్చర్ ఔట్ చేయగా... షై హోప్ (17) అండర్సన్ స్వింగ్కు కంగుతిన్నాడు. టీ విరామంలోపే ఈ మూడు వికెట్లు పడటం కరీబియన్ ఇన్నింగ్స్ను దారుణంగా దెబ్బతీసింది. అప్పుడు విండీస్ స్కోరు 58/3. ఆఖరి సెషన్లోనూ ఇంగ్లండ్ బౌలర్ల హవానే కొనసాగడంతో వెస్టిండీస్ విలవిలలాడింది. బ్రూక్స్ (4)ను అనుభవజ్ఞుడైన అండర్సన్ బుట్టలో పడేయగా... చేజ్ (9)ను బ్రాడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కాసేపు పోరాడిన బ్లాక్వుడ్ (26; 3 ఫోర్లు)... విండీస్ స్కోరు కష్టంగా 100 పరుగులు దాటాక వోక్స్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఆట నిలిచే సమయానికి కెప్టెన్ హోల్డర్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), డౌరిచ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు చేయాలి. టెస్టు క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో వెస్టిండీస్ బౌలర్గా కీమర్ రోచ్ గుర్తింపు పొందాడు. గతంలో విండీస్ తరఫున కొట్నీ వాల్‡్ష, ఆంబ్రోస్, మార్షల్, లాన్స్ గిబ్స్, గార్నర్, హోల్డింగ్, గ్యారీ సోబర్స్, ఆండీ రాబర్ట్స్ ఈ ఘనత సాధించారు. -
నం.1 ఆల్రౌండర్గా బెన్స్టోక్స్
మాంచెస్టర్: వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో వీర విహారం చేసిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న మొదటి ఇంగ్లండ్ క్రికెటర్గా నిలిచాడు. విండీస్ టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్(459)ను వెనక్కినెట్టి 497 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేగాక టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాట్స్మెన్ జాబితాలో మూడో స్థానం((827))లో నిలిచాడు. కాగా మాంచెస్టర్లో విండీస్లో జరిగిన రెండో టెస్టులో 113 పరుగులతో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు... సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. (బెన్స్టోక్స్ రికార్డు బ్యాటింగ్) ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 255 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన బెన్స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్లో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తాచాటాడు. తద్వారా టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్గా రికార్డు సాధించాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్లో 57 బంతుల్లో 78 స్కోర్ సాధించి నాటౌట్గా నిలిచాడు. అదే విధంగా ప్రత్యర్థి జట్లులో డ్రాపై ఆశలు రేపి హాఫ్ సెంచరీతో దూసుకుపోతున్న జర్మైన్ బ్లాక్వుడ్ వికెట్ తీసి మ్యాచ్ను కీలక మలుపు తిప్పాడు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ‘ది మ్యాచ్ అవార్డు’ అందుకున్న స్టోక్స్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఆల్రౌండర్గా నిలిచాడు. కాగా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1-1 సమం చేసిన జో రూట్ సేన తమ తదుపరి మ్యాచ్ను శుక్రవారం మాంచెస్టర్ ఓల్డ్ ట్రపోర్డ్ మైదానంలో ఆడనుంది. 🚨 RANKINGS UPDATE 🚨 Ben Stokes is the new No.1 all-rounder 🤩 He is the first England player since Flintoff to be at the top of the @MRFWorldwide ICC Men's Test Player Rankings for all-rounders. Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/viRzJzuGiC — ICC (@ICC) July 21, 2020 -
అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు
మాంచెస్టర్: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచ క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)అనేక కొత నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా బంతిని లాలాజలంతో(సలైవా) రుద్ద కూడదనే నిబంధనను కచ్చితత్వం చేసింది. కాగా, ఈ నిబంధనలను తొలిసారి ఇంగ్లండ్ క్రికెటర్ డామ్ సిబ్లీ అతిక్రమించాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ల రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు సిబ్లీ రూల్స్ బ్రేక్ చేశాడు. బంతిని అందుకున్న మరుక్షణమే అనుకోకుండా చేతితో లాలాజలాన్ని బంతిపై రుద్ది నిబంధనలను ఉల్లంఘించాడు. నాలుగో రోజు లంచ్కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే బంతి సిబ్లీ చేతికొచ్చింది. బంతిని అందుకున్న సిబ్లీ అనుకోకుండా చేతి వేళ్లను నోటి దగ్గరకు పోనిచ్చాడు. వెంటనే లాలాజలాన్ని బంతిపై రుద్ది నాలుక కరుచుకున్నాడు. ఈ విషయం అంపైర్లకు తెలియడంతో బంతిని తీసుకుని శానిటైజర్ టవల్తో శుభ్రం చేశారు. సలైవా నిబంధనను మొదటిసారి బ్రేక్ చేసిన సిబ్లీ చర్యకు అంపైర్లకు తిప్పలు తప్పలేదు. ఏం చేయాలో తెలియక బంతిని శానిటైజ్ చేశారు. (‘జస్ప్రీత్ బుమ్రాతో చాలా డేంజర్’) తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ రెండో టెస్టులో ఫలితాన్ని శాసించే స్థితిలో నిలిచింది. నాలుగోరోజు ఆదివారం ఓవర్నైట్ స్కోరు 32/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 99 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/66), వోక్స్ (3/42), స్యామ్ కరన్ (2/70) రాణించారు. విండీస్ జట్టులో బ్రాత్వైట్ (75; 8 ఫోర్లు), బ్రూక్స్ (68; 11 ఫోర్లు), చేజ్ (51; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 182 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. మరి ఇంగ్లండ్ లక్ష్యాన్ని నిర్దేశించి విజయం కోసం పోరాడుతుందో.. లేక డ్రాతోనే సరిపెట్టుకుంటుందో చూడాలి. (టి20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది నేడే) -
సమమా... సంచలనమా!
ఇంగ్లండ్ గడ్డపై వెస్టిండీస్ టెస్టు సిరీస్ గెలిచి 32 ఏళ్లయింది. జట్టులో దిగ్గజాలు ఉన్న కాలంలో 1988లో ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆ జట్టు ముందు బంగారు అవకాశం నిలిచింది. తొలి టెస్టు విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో గెలుపు అందుకుంటే ఈ సిరీస్ చిరస్మరణీయంగా మారిపోతుంది. అయితే అనూహ్యంగా గత మ్యాచ్లో ఓడిన ఇంగ్లండ్ సొంతగడ్డపై మళ్లీ కోలుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్కు ముందు వరుసగా నాలుగు సిరీస్లలో తొలి టెస్టులో ఓడి కూడా ముందంజ వేసిన ఇంగ్లండ్ దానినే పునరావృతం చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్: ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్కు ముందు అంతా కరోనాకు సంబంధించిన హంగామాయే. మ్యాచ్ ఫలితంకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలిచింది. అయితే ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రస్తావన లేకుండా క్రికెట్ గురించి చర్చ మొదలైంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానం వేదికగా రెండో టెస్టు జరగనుంది. సౌతాంప్టన్లో తొలి మ్యాచ్ గెలిచిన విండీస్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్లకు విశ్రాంతి సిరీస్ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ తుది జట్టును మ్యాచ్ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్కు దూరమైన కెప్టెన్ జో రూట్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు అండర్సన్, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్, ఒలీ రాబిన్సన్లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్ బ్రాడ్ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ వైఫల్యం గత మ్యాచ్లో ఓటమికి కారణమైంది. కాబట్టి బ్యాట్స్మెన్పై ఈసారి బాధ్యత మరింత పెరిగింది. రూట్ రాకతో లైనప్ పటిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్లలోనూ సొంతగడ్డపై ఇంగ్లండ్ స్థాయికి తగిన స్కోర్లు రాలేదు. కీపర్ బట్లర్ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీస్తోంది. టాప్ ఆల్రౌండర్ స్టోక్స్ కెప్టెన్సీ సత్తా చాటితే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. అదే విధంగా అండర్సన్ నుంచి కూడా జట్టు మరింత మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మార్పుల్లేకుండానే... తొలి టెస్టు విజయంలో విండీస్ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భంలో పట్టుదలగా ఆడి సమష్టితత్వంతో గెలిపించారు. కాబట్టి సహజంగానే అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఉదాసీనత ప్రదర్శించకుండా ఉంటే మరో గెలుపు సాధించేందుకు టీమ్కు అన్ని రకాలుగా అర్హత ఉంది. నలుగురు పేస్ బౌలర్ల మంత్రం గత మ్యాచ్లో ఫలించింది. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ ప్రత్యర్థిని బాగా దెబ్బ కొట్టారు. వీరికి తోడు రోచ్ కూడా చెలరేగాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ ఛేజ్ తన విలువేంటో మళ్లీ చూపించాడు. బ్యాటింగ్లో ఓపెనర్లు బ్రాత్వైట్, క్యాంప్బెల్ శుభారంభం అందిస్తే విండీస్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తనలో ప్రతిభను బ్లాక్వుడ్ ఒక్క ఇన్నింగ్స్తో బయటపెట్టాడు. విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్ కాకపోయినా జట్టుగా విండీస్ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు. ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య 15 టెస్టులు జరిగాయి. 6 మ్యాచ్ల్లో ఇంగ్లండ్, 5 మ్యాచ్ల్లో వెస్టిండీస్ గెలిచాయి. 4 మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికలో ఇంగ్లండ్పై విండీస్ చివరిసారి 1988లో టెస్టు గెలిచింది. ఇంగ్లండ్ మాత్రం విండీస్తో ఇక్కడ జరిగిన చివరి నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలిచి, మరో దానిని ‘డ్రా’ చేసుకుంది. -
ఎలుక పెయింటింగ్కు ఎంత డిమాండో..
లండన్ : పెయింటింగ్.. సహజంగా వివిధ రంగులతో ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి కళా రూపాన్ని కొన్ని లక్షలు పోసి కొంటారు. అయితే కళకు మనుషులు, జంతువులు అన్న భేదం లేదని నిరూపించింది ఓ ఎలుక. తన చిట్టి పొట్టి పాదాలతో ఓ కళాఖండాన్ని రూపొందించింది. ఈ చిట్టెలుక గీసిన బొమ్మను వేలు పెట్టి కొంటారని మీకు తెలుసా. అవునండి.. ఎలుక గీసిన చిత్రం ఏకంగా 1000 పౌండ్లు (అక్షరాల 92 వేలు) సంపాందించింది. (బుడ్డోడి వలకు చిక్కిన ఖజానా; కానీ) వివరాళ్లోకి వెళితే.. మాంచెస్టర్కు చెందిన జెస్ అనే మహిళ కొన్ని ఎలుకలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుస్ అనే ఎలుకతో ఓ పెయింటింగ్ వేసింది. డ్రాయింగ్ రూమ్లో ఎలుక పాదాలను పెయింట్లో ముంచి కొన్ని కాగితాలపై ఉంచారు. అది అటు ఇటు తిరుగుతుంటే పేపర్పై ఎలుక అడుగులు కలర్ఫుల్గా ఏర్పడ్డాయి. అలా కొన్ని పేపర్లపై వేసిన ఎలుక పాదాల పేయింటింగ్లన్నింటినీ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. అలా పెయింటింగ్లు అన్ని అమ్ముడుపోగా జెస్ మొత్తం 1000 పౌండ్లను రాబట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఎలుక చిత్రాలకు ఇంత మార్కెట్ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుస్ ప్రస్తుతం మినీ ‘హెన్రీ మాటిస్సే’ అయ్యిందని ఆమె అన్నారు. (నేను మాస్కు ధరించా.. మరి మీరు: మహేశ్) -
కరోనా నుంచి రక్షణకు సరికొత్త మాస్క్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల మాస్క్లు వాడుతున్నారు. అవి మామూలు ధరల నుంచి అసాధారణ ధరల వరకు ఉండడమే కాకుండా నాసిరకం నుంచి నాణ్యమైనవి వరకు ఉన్నాయి. ఎంత ఖరీదు పెట్టి కొన్న ఎంతటి నాణ్యమైనా మాస్క్ అయినా సరే దానిపై కరోనా వైరస్ వారం రోజుల పాటు బతికుండే అవకాశం ఉందంటూ లండన్ వైద్యులు తేల్చిన నేపథ్యంలో ప్రజలకు కొత్త భయాలు పట్టుకున్నాయి. పైగా మాస్క్లు ధరించడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి శ్వాస సరిగ్గా ఆడదు. కొందరికి దురద పెట్టినట్లు ఉంటుంది. ఏదేమైనా చీకాకుగా ఉంటుందనడంలో సందేహం లేదు.మాస్క్ అంటే ముఖాన కప్పుకునే ముకుమల గుడ్డలా మెత్తగా ఉండాలి. పైగా ఏరోజుకారోజు పారేసే దానిలా కాకుండా ఏ రోజుకారోజు ఉతుక్కుని మళ్లీ ధరించేలా ఉండాలి. వీలయితే కరోనా వైరస్ను ఆకర్షించి చంపేసే రసాయనంతో కూడినదై ఉండాలి.(ఈ టెక్నిక్తో కరోనా వైరస్కు చెక్!) ప్రొఫెసర్ సబీనా ష్లిష్ అచ్చం ఇలాగా ఆలోచించినట్లు ఉన్నారు. ఆమె చేసిన సూచనల మేరకు అచ్చం ఇలాగే ఉపయోగపడే మాస్క్లను ‘మాన్చెస్టర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ’ పరిశోధకులు తయారు చేశారు. వీటిని మామూలుగా మాస్క్లనకుండా ‘స్నూద్’అని పిలుస్తున్నారు. అవి మెడ కింది నుంచి ముఖంపైన కళ్లవరకు ముసుగు ధరించినట్లు ఉండడమే అందుకు కారణం. మనం ముక్కు నుంచి శ్వాసను పీల్చుకునే నాళం పైభాగాన ప్రొటీన్ల మిశ్రమం ఉన్నట్లే ఈ స్నూద్కు ప్రొటీన్ల మిశ్రమం పూత ఉంటుందని, అది వైరస్లను ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తుందని, అలాగే ప్రొటీన్ల పూతకు పై భాగాన వైరస్లను నిర్వీర్యం చేసే రసాయనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రొటీన్లు ఉన్నప్పుడే కెమికల్ రియాక్షన్ ఉంటుందని, లేకపోతే లేదని వారు చెప్పారు. ఈ స్నూద్లను ఏ రోజుకారోజు ఉతుక్కొని మళ్లీ ధరించవచ్చని కూడా చెప్పారు. అయితే ఎన్ని రోజుల వరకు దాన్ని ధరించవచ్చో, ఎన్ని రోజుల వరకు దానిపై ప్రొటీన్లు, రసాయనం పూత ఉంటుందో వారు చెప్పలేదు. తల పైభాగం నుంచి ధరించే ఈ స్నూద్లు ఆన్లైన్ మార్కెట్లో 20 పౌండ్లకు (దాదాపు 1800 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.(మనిషి నుంచి పులికి సోకిన కరోనా వైరస్) -
పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు
మాంచెస్టర్: ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’ ‘మీలో కీలి బుర్లింగమ్ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్ టేలర్ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్ ఆఫ్ చైల్డ్ సెక్స్ అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్ ఏ చైల్డ్ అండర్ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అలాగే, పీటర్ టేలర్ ఇక్కడ ప్రధాన నేరస్థుడు. కామవాంఛ తీసుకునేందుకు స్కూల్ డ్రెస్ వేసుకొని రావాల్సిందిగా భార్య బుర్లింగమ్ను కోరారు. అందుకు ఆమె అంగీకరించి అలాగే రావడంతో సమస్య మొదలయింది. స్కూల్ గర్ల్స్ మీదకు పీటర్ టేలర్ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. భార్యను స్కూల్ డ్రెస్లో చూడాలనుకున్న టేలర్కు, స్కూల్ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది. అన్ని విధాల అతనే ప్రధాన నేరస్థుడిగా నిర్ధారిస్తూ 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అయినా ఇద్దరు ఇక్కడ సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ (వీరి వల్ల భవిష్యత్తులో ముప్పుందనుకుంటే యావజ్జీవ కారాగారా శిక్ష విధించేందుకు ఈ రిజిస్టర్ తోడ్పడుతుంది)లో సంతకం చేయాలి’ అని మాంచెస్టర్లోని మిన్శుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు జడ్జీ మార్క్ సావిస్ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు. ఒకే వయస్సుగల బుర్లింగమ్, టేలర్లో గ్రేటర్ మాన్చెస్టర్లోని డుకిన్ఫీల్డ్కు చెందిన వారు. వారు 2016లో డేటింగ్ వెబ్సైట్ ద్వారా ప్రేమించుకున్నారు. భార్య ఓ కేఫ్లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్గా పనిచేశారు. పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది. అది కొద్ది కాలానికే పెడతోవలు పట్టింది. ముందుగా టేలర్ కామవాంఛ ఉద్దీపన కోసం ఇంటర్నెట్ నుంచి పిల్లల అసభ్య ఫొటోలను డౌన్లోడ్ చేసుకొని బుర్లింగమ్కు పంపించే నీచానికి దాగాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాక స్కూల్ డ్రెస్తో మొదలైన తతంగం పిల్లలతో కామవాంఛ తీర్చుకునే దారుణ స్థాయికి వెళ్లింది. పార్ట్టైమ్ బేబీ సిట్టర్గా పనిచేసిన బుర్లింగమ్ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్ఫోన్ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారట. పక్కింటి ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్ అరెస్ట్ అయ్యారు. ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా 2019, ఏప్రిల్ నెలలో టేలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్లలో నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు, షేర్ చేసుకున్న వీడియోలు, పంపుకున్న సందేశాలు దొరికాయి. వాటి ఆధారంగానే కేసు విచారణ ఇటీవలే ముగియడంతో శనివారం నాడు తీర్పు వెలువడింది. (ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై..) -
ఈ ‘స్లీపింగ్ బ్యూటీ’కి ఎంత ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : లండన్, మాన్చెస్టర్లోని స్టాక్పోర్ట్లో నివసిస్తున్న పాతికేళ్ల బెత్ గూడియర్ నిజంగా ‘స్లీపింగ్ బ్యూటీ’. ఆమెను మిత్రులంతా కూడా అలాగే పిలుస్తారు. వాస్తవానికి అది ఆనందించాల్సిన బిరుదు కాదు. ఎందుకంటే ఆమె ‘క్లైన్ లెవిన్ సిండ్రోమ్ (కేఎల్ఎస్)’ అనే అతి అరుదైన జబ్బుతో బాధ పడుతున్నారు. ఆ జబ్బు కారణంగా రోజుకు 24 గంటల్లో 22 గంటలు నిద్రపోతూనే ఉంటారు. ఎంత ఆపుకుందామన్న ఆగని నిద్ర ఆమెను వెన్నాడుతోనే ఉంటోంది. గత ఎనిమిదేళ్లుగా ఆమె ఈ జబ్బుతో బాధ పడుతూనే ఉంది. ఇంకో చిత్రం ఏమిటంటే గత ఎనిమిదేళ్లుగా తన జీవితంలో ఏం జరిగిందో ఒక్క విషయం కూడా గుర్తులేదట. స్కూల్ రోజుల్లో అన్ని ఆటల్లో చురుగ్గా ఉండే బెత్ కాలేజీకి వచ్చాక జిమ్లో చేరింది. ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చే కేఎల్ఎస్’ ఆమెకు 17వ ఏటనే వచ్చింది. అప్పటి నుంచి ఆమెను ఆమె తల్లే దగ్గరుండి కంటికి రెప్పలా! కాపాడుకుంటోంది. అయినప్పటికీ ఆమె ఇన్నేళ్లు సాధారణ యువతి లాగే జీవితం గడుపుతూ వచ్చింది. మేల్కొని ఉండే సమయంలోనే వెళ్లి తన జిమ్ మిత్రులను కలసి వచ్చేది. మిత్రులతో సరదాగా గడుపుతున్నప్పుడే ఆమెకు నిద్ర వస్తే మిత్రులు తీసుకొచ్చి ఇంట్లో దించిపోయేవారు. ఇటీవలనే అనుకోకుండా ఆమెపై మరో అరుదైన జబ్బు దాడి చేసింది. ‘హైపర్ మొబైల్ హెహ్లర్స్ డన్లోస్ సిండ్రోమ్ (ఈడీఎస్)’ అనే ఆ జబ్బు వల్ల వెన్ను పూస నుంచి మెడ పక్కకు వైదొలుగుతుందట. దాని వల్ల రక్కనాళాలు నొక్కుకు పోయి ప్రాణం పోతుందట. ఈ జబ్బు వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు ఆమె బీచ్కు వెళ్లి రావడం తప్ప, ఎక్కువగా పడకకే పరిమితం అయింది. కదలడం వల్ల, అటూ ఇటు తిరగడం వల్ల మెడ పక్కకు తొలిగే అవకాశం ఉండడంతో ఎక్కువగా ఆమె రిస్క్ తీసుకోవడం లేదు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆమె మెడకు ‘నెక్ కాలర్’ పెట్టుకొని పోతోంది. సర్జరీ ద్వారా దీన్ని సవరించవచ్చట. మెడ అనేక రక్తనాళాలతో కూడుకున్నదవడం వల్ల లండన్లో సర్జరీ చేయడానికి ఏ వైద్యుడు ముందుకు రావడం లేదట. పైగా సర్జరీకి అయ్యే దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వ పింఛను మీద బతికే బెత్ తల్లి వద్ద లేవట. బెత్ మంచానికే ఎక్కువ కాలంఅతుక్కు పోవడం వల్ల ఆమె కండరాలు కూడా బాగా బలహీన పడ్డాయి. మరికొంత కాలం ఉపేక్షిస్తే ఆమె మెడ పడిపోయి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని ఆమెను ప్రస్తుతం పరీక్షిస్తున్న వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ జబ్బుకు సర్జరీ చేసే వైద్యులు ఉన్నారని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు కనుగొన్నారు. అయితే అక్కడికి ఎలా వెళ్లాలి ? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ? అన్న ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. అయితే బెత్ మిత్రులే ‘క్రౌడ్ ఫండింగ్’ పేరిట విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెల్సింది. -
మరో సెంచరీ బాదేసిన స్మిత్
మాంచెస్టర్ : యాషెస్ సిరీస్లో స్టీవ్ స్మిత్ తన భీకరపామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఓల్డ్ట్రాఫర్డ్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆటలో స్మిత్(100, 163 బంతుల్లో) సెంచరీ సాధించి టెస్టు కెరీర్లో 26 వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండోరోజు లంచ్ సమయానికి ఆసీస్ 5 వికెట్లకు 245 పరుగులు చేసింది. మొదటిరోజు 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మార్నస్ లబుషేన్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 116 పరుగులు జోడించారు. లబూషేన్ ఔటయ్యాక ఇతర బ్యాట్సమెన్ల సహకారంతో రెండోరోజు ఆటను కొనసాగించిన స్మిత్ 163 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్మిత్కు ఈ సిరీస్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. కాగా, మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. -
18 పరుగుల తేడాతో భారత్ ఓటమి
-
టీమిండియా కథ ముగిసె..
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో టీమిండియా కథ ముగిసింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం, ఎంఎస్ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ మ్యాచ్ను విజయతీరాలకు చేర్చలేకపోయాయి. భారత జట్టు 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు. దాంతో టీమిండియా పోరాటం వరుసగా రెండో సారి కూడా సెమీస్లోనే ముగియగా, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్కు చేరింది. కీలక సెమీ ఫైనల్ మ్యాచ్లో కోహ్లి గ్యాంగ్ పెవిలియన్కు క్యూ కట్టింది. రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లి(1), కేఎల్ రాహుల్(1)లు తలో పరుగు చేసి పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆపై దినేశ్ కార్తీక్(6) కూడా విఫలం కావడంతో టీమిండియా 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రిషభ్ పంత్-హార్దిక్ పాండ్యాల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ ఐదో వికెట్కు 47 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత రిషభ్(32) అనవసరపు షాట్కు యత్నించి ఔటయ్యాడు. ఆపై కాసేపటికి పాండ్యా(32) కూడా అదే దారిలో నడవడంతో భారత్ 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల్లో పడింది. ఆ దశలో ధోని-జడేజాల జోడి ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్ గాడిలో పడింది. ఒకవైపు ధోని కుదురుగా పరుగులు చేయడానికి యత్నిస్తే, జడేజా మాత్రం దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో భారత్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కాగా, జడేజా ఒక భారీ షాట్ ఆడబోయే క్రమంలో ఏడో వికెట్గా ఔట్ కాగా, స్వల్ప వ్యవధిలో ధోని రనౌట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని సిక్స్ కొట్టాడు. అటు తర్వాత మరుసటి బంతికి పరుగులేమీ చేయకపోగా, మూడో బంతికి రెండు పరుగులు తీసే యత్నం చేశాడు. అయితే కీపర్స్ ఎండ్లో ఉన్న గప్టిల్ నేరుగా వికెట్లను కొట్టడంతో ధోని పెవిలియన్ చేరాడు. ఇక అటు తర్వాత భారత్ కథ షరా మామూలే. 49 ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ ఔట్ కాగా, 50 ఓవర్ మూడో బంతికి చహల్ ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, ట్రెంట్ బౌల్ట్,సాంత్నార్లు తలో రెండు వికెట్లు సాధించారు. ఫెర్గ్యుసన్, నీషమ్లకు చెరో వికెట్ లభించింది. అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. -
సెమీస్ అప్డేట్స్: టీమిండియా ఓటమి
మాంచెస్టర్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా ప్రయాణం సెమీస్తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్లోనూ భారత్ సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్ రెండో సారి ఫైనల్కు చేరింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తొలి సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రపంచకప్ కీలక సెమీస్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో.. టీమిండియాకు అవసరమైన దశలో జడేజా తన సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 38 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అర్ధ శతకం పూర్తి చేశాడు. జడేజా-ధోనిల సూపర్ ఇన్నింగ్స్తో టీమిండియా విజయంపై ఆశలు చిగురించాయి. వీరిద్దరూ ఏడో వికెట్కు ఇప్పటికే 78 పరుగుల విలువైన భాగాస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా గెలుపు భారమంతా ధోనిపైనే ఉంది. న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక సెమీస్లో కోహ్లి గ్యాంగ్ పెవిలియన్కు క్యూ కట్టింది. అయితే పంత్-పాండ్యాలు ఐదో వికెట్కు 47 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అయితే క్రీజులో ధోని ఉండటంలో గెలుపుపై ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ధోనితో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. పాండ్యా అనవసరంగా.. టీమిండియా ఆరో వికెట్ను కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా(32) అనవసరపు షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రసుత్తం క్రీజులో ధోని(10)తో పాటు జడేజా(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 148 పరుగుల చేయాలి. దీంతో గెలుపు భారమంతా ధోని పైనే ఉంది. ప్చ్.. పంత్ టీమిండియా రిషభ్ పంత్(32) వికెట్ను కూడా చేజార్చుకుంది. దీంతో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ చక్కబడిందనుకున్న తరుణంలో సాంట్నర్ బౌలింగ్లో పంత్ భారీ షాట్కు యత్నించి క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు. కీలక సమయంలో అనవసర షాట్కు యత్నించి ఔటవ్వడంపై డగౌట్లో ఉన్న కోహ్లితో సహా టీమ్ మేనేజ్మెంట్ అసహనం వ్యక్తం చేశారు. పంత్-పాండ్యాలు ఆచితూచి.. కష్టకాలంలో రిషభ్ పంత్-హార్దిక్ పాండ్యాలు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో విజయంపై అభిమానుల్లో ఆశలు మొదలయ్యాయి. వీర్దిదరూ ఆచితూచి ఆడుతూ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ప్రస్తుతం పంత్ 27 పరుగులతో, పాండ్యా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక వీరిద్దరూ వారి శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ టీమిండియాను కష్టాల్లోంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ ఔట్ టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్నీ బౌలింగ్లో నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్(6; 25బంతుల్లో) వెనుదిరిగాడు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో పంత్, పాండ్యాలు ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్నీ మూడు వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్ కీలక కోహ్లి వికెట్ పడగొట్టాడు. చివర్లో వదిలేశారు.. టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ఇక భారమంతా మిడిలార్డర్దే. ఐదు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకు టాపార్డర్ రాణింపుతోనే విజయాలను అందుకున్న టీమిండియా.. కీలక సెమీస్లో వారు చేతులెత్తేశారు. దీంతో మిడిలార్డర్ రాణిస్తుందా.. విజయాన్ని అందిస్తుందా లేదా చూడాలి. చేతులెత్తేసిన టాపార్డర్.. భారమంతా మిడిలార్డర్దే ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఐదు పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్(1), రాహుల్(1), కోహ్లి(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ను హెన్నీఔట్ చేయగా.. కోహ్లిని ట్రెంట్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బౌల్ట్ బౌలింగ్లో రాహుల్ చెత్త షాట్తో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో దినేశ్ కార్తీక్, పంత్లు ఉన్నారు. వర్షం కారణంగా పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అంతేకాకుండా అవుట్ఫీల్డ్ చాలా నెమ్మదిగా ఉంది. బరిలోకి దిగారు.. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బ్యాటింగ్కు దిగారు. ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్ తిరిగే అవకాశం ఉండటంతో ఆచితూచి ఆడటం బెటర్. తొలి పది ఓవర్లు వికెట్లు పడకుండా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టీమిండియా లక్ష్యం 240 ప్రపంచకప్ తొలి సెమీస్లో టీమిండియాకు 240 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది. నిన్నటి మ్యాచ్కు కొనసాగింపుగా ప్రారంభమైన మ్యాచ్లో రవీంద్ర జడేజా మెరుపు పీల్డింగ్తో కివీస్ పని పట్టాడు. న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. నేటి మ్యాచ్ ఆరంభంలోనే రాస్ టేలర్(74)ను రనౌట్ చేసి జడేజా టీమిండియాకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. అనంతరం లాథమ్(10) ఇచ్చిన క్యాచ్ను కళ్లు చెదిరే రీతిలో అందుకోని ఔరా అనిపించాడు. ఫలితం తేలేది రిజర్వ్డే రోజే! ఉహించిందే జరిగింది. ప్రపంచకప్ తొలి సెమీస్కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో మ్యాచ్ను రిజర్వ్డే (బుధవారం)కు వాయిదా వేశారు. ప్రస్తుతం 46.1 ఓవర్లకి న్యూజిలాండ్ 211/5తో ఉంది. క్రీజులో రాస్ టేలర్(67), లాథమ్(3)లు ఉన్నారు. రేపటి ఆట న్యూజిలాండ్ బ్యాటింగ్తో మొదలవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ను నిలివేశాక.. పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. రిజర్వ్డే అవసరమే లేకుండా మ్యాచ్ను ముగించాలనుకున్న అంపైర్లకు నిరాశే ఎదురైంది. మైదానాన్ని పరిశీలిస్తున్న అంపైర్లు.. ప్రపంచకప్ తొలి సెమీస్లో భాగంగా జరుగుతన్న టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ మరికాసేపట్లో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొద్ది గంటలుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షం ఆగడంతో మైదానాన్ని అంపైర్లు పరిశీలిస్తున్నారు. మైదానంలో నిలిచి ఉన్న నీటిని సిబ్బంది సూపర్లతో తొలగిస్తున్నారు. ఇక పిచ్, అవుట్ ఫీల్డ్ను పరిశీలించాక తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే డక్వర్త్లూయిస్ ప్రకారం టీమిండియాకు లక్ష్యాన్ని ఎంత నిర్దేశిస్తారనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ జరిగేది లేనిది భారత కాలమానం ప్రకారం రాత్రి 11.15 గంటలకు అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అప్పటికీ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్డే(బుధవారం)రోజు నిర్వహిస్తారు. ప్రపంచకప్ తొలి సెమీస్కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి మూడు ఓవర్ల ముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67 నాటౌట్), లాథమ్(3నాటౌట్)లు ఉన్నారు. గ్రాండ్హోమ్ ఔట్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోలిన్ డి గ్రాండ్హోమ్(16)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. భువీ వేసిన స్లో బౌన్సర్ను అప్పర్ కట్ ఆడబోయి గ్రాండ్ హోమ్ విఫలమయ్యాడు. దీంతో భువీకి ఈ మ్యాచ్లో తొలి వికెట్ లభించింది. మరోవైపు రాస్ టేలర్ తన దైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. టేలర్ హాఫ్ సెంచరీ న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ కీలక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించి సులువుగా పరుగులు రాబట్టాడు. తొలుత ఆచితూచి ఆడిన టేలర్ అనంతరం గేర్ మార్చి స్కోర్ బోర్డు పరిగెత్తించాడు. విలియమ్సన్ అవుటయ్యాక జట్టు బాధ్యతను భుజాలపై వేసుకున్న టేలర్ ఇన్నింగ్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. విలియమ్సన్ ఎట్టకేలకు ఔట్ భారత్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో కివీస్ స్కోరును చక్కదిద్దిన కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు ఔటయ్యాడు. భారత స్పిన్నర్ చహల్ వేసిన 36 ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. కవర్స్ మీదుగా షాట్ ఆడబోయిన విలియమ్సన్.. జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్ను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి శ్రమిస్తోంది. విలియమ్సన్ హాఫ్ సెంచరీ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. కివీస్ కష్టాల్లో పడ్డ తరుణంలో సమయోచితంగా బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ అర్థ శతకం నమోదు చేశాడు. 79 బంతుల్లో హాఫ సెంచరీ మార్కును చేరాడు. 32 ఓవర్లు ముగిసే సరికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. గప్టిల్(1) తొలి వికెట్గా, నికోసల్(28) రెండో వికెట్గా ఔటయ్యారు. నికోలస్కు దిమ్మతిరిగింది.. న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. లెప్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో నికోలస్(28) క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నికోలస్ నిష్క్రమణతో సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ క్రీజులోకి వచ్చాడు. ఈ జోడిని ఎంత త్వరగా విడదీస్తే టీమిండియాకు అంత లాభం. విలియమ్సన్ @ 500 ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 500 పరుగుల మైలురాయిని సాధించిన ఆరో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, షకీబుల్, ఫించ్, జో రూట్లు కూడా ఐదు వందల పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక ప్రపంచకప్లో ఐదు వందల పరుగుల సాధించిన రెండో కివీస్ బ్యాట్స్మెన్గా, తొలి సారథిగా రికార్డు సృష్టించాడు. గత ప్రపంచకప్లో మార్టిన్ గప్టిల్ ఈ మార్క్ను అందుకున్నాడు. కివీస్ చెత్త రికార్డు వన్డే వరల్డ్కప్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది. ఫలితంగా ఈ మెగా టోర్నీలో పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా కివీస్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్పై భారత్ చేసిన 28 పరుగులు పవర్ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉండగా, తాజాగా న్యూజిలాండ్ దాన్ని సవరిస్తూ చెత్త గణాంకాల అపప్రథను సొంతం చేసుకుంది. ఒకటికి ఒకటి.. న్యూజిలాండ్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన నాల్గో ఓవర్లో గప్టిల్ పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా ఔటయ్యాడు. 14 బంతులు ఆడిన గప్టిల్ పరుగు మాత్రమే చేశాడు. దాంతో పరుగు వద్దే కివీస్ వికెట్ను కోల్పోయింది. మొదటి రెండు ఓవర్లు మెయిడిన్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ కాగా, బుమ్రా వేసిన రెండో ఓవర్ సైతం మెయిడిన్ కావడం విశేషం. కాగా, మూడో ఓవర్లో కివీస్ ఖాతా తెరిచింది. భువనేశ్వర్, బుమ్రా ద్వయం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8వ ఓవర్ వరకు ఫోర్ కొట్టలేకపోయింది కివీస్ ఆదిలోనే భారత్కు షాక్ మ్యాచ్ ప్రారంభమైన వెంటనే టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్ను మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోలస్లు ఆరంభించారు. కాగా, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. తొలి ఓవర్ను భువనేశ్వర్ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ వికెట్ సాధించినంత పని చేశాడు. భువీ వేసిన తొలి ఓవర్ మొదట బంతిని గుడ్ లెంగ్త్లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్ బ్యాట్ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత్ అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దానిపై భారత్ చివరి క్షణాల్లో రివ్యూకు వెళ్లడంతో ఆ బంతి లెగ్ స్టంప్కు అతి సమీపం నుంచి బయటకు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. దాంతో భారత్కు ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో మొదటి బంతికే భారత్ రివ్యూ కోల్పోయింది. -
రోహిత్, కోహ్లి, రాహుల్.. ‘సింగిల్’
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల టార్గెన్ ఛేదించే క్రమంలో భారత్ ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(1) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన కోహ్లి(1) కూడా నిరాశ పరిచాడు. ఆపై వెంటనే కేఎల్ రాహుల్(1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. మ్యాట్ హెన్నీ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి కోహ్లి(1) ఎల్బీ అయ్యాడు. దీనిపై భారత్ రివ్యూకు వెళ్లానా ప్రతికూల ఫలితమే వచ్చింది. ఇక మ్యాట్ హెన్రీ నాల్గో ఓవర్ తొలి బంతికి కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి రాహుల్(1) ఔటయ్యాడు. ఈ ముగ్గురూ తలో పరుగు చేసి పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ 240 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద రిజర్వ్ డే(బుధవారం)నాడు తమ ఇన్నింగ్స్ను కొనసాగించిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి శ్రమించింది. ఆ క్రమంలోనే మూడు దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. -
ముగిసిన కివీస్ ఇన్నింగ్స్
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 240 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. 211/5 వద్ద రిజర్వ్ డే(బుధవారం)నాడు తమ ఇన్నింగ్స్ను కొనసాగించిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి శ్రమించింది. ఆ క్రమంలోనే మూడు వికెట్లను వరుసగా చేజార్చుకుంది. దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ రోజు కివీస్ బ్యాటింగ్లో భాగంగా రాస్ టేలర్(74) రనౌట్గా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ 225 పరుగుల వద్ద ఆరో వికెట్ను నష్టపోయింది. జడేజా అద్భుతమైన త్రో విసిరి టేలర్ను రనౌట్ చేశాడు. ఆపై వెంటనే టామ్ లాథమ్(10) కూడా ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 49 ఓవర్లో జడేజా చక్కటి క్యాచ్ అందుకోవడంతో లాథమ్ ఇన్నింగ్స్ ముగిసింది. భువీ వేసిన అదే ఓవర్ చివరి బంతికి మ్యాట్ హెన్రీ(1) కూడా ఔటయ్యాడు. ఇక బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కివీస్ ఏడు పరుగులే చేసింది. భారత బౌలర్లలో భువీ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దక్ పాండ్యా, రవీంద్ర జడేజా, చహల్లు తలో వికెట్ తీశారు. -
తొలి సెమీస్ ఫలితం తేలేది నేడే
మాంచెస్టర్: భారత్-న్యూజిలాండ్ జట్ల తొలి సెమీస్ ఫలితం నేడు తేలిపోనుంది. మంగళవారం భారత్-కివీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు వరుణుడు అడ్డు పడ్డాడు. ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులతో ఉన్నప్పుడు చిరు జల్లులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరు పెంచి నాలుగున్నర గంటలపాటు కొనసాగింది. రెండు సార్లు పిచ్ను పరీక్షించిన రిఫరీ, అంపైర్లు చివరకు ఆటను రిజర్వ్డే నాడు ఆడించేందుకు నిర్ణయించారు. మ్యాచ్ను సాధ్యమైనంత వరకూ నిన్ననే జరపాలని చూసిన అది సాధ్యం కాలేదు. దాంతో చివరి అవకాశంగా రిజర్వ్ డే నాడు మ్యాచ్ను కొనసాగించనున్నారు. దీంతో బుధవారం 46.2వ బంతి నుంచి మ్యాచ్ ప్రారంభమైంది. టేలర్ (67 బ్యాటింగ్; 85 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), లాథమ్( 3 బ్యాటింగ్)లు బ్యాటింగ్కు దిగారు. రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగించడం భారత్కే ఎక్కువ అనుకూలమనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది. మ్యాచ్ నిన్న జరిగిన పక్షంలో టీమిండియా 20 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి వచ్చేది. కాగా, వర్షం ఆగిన తర్వాత పిచ్లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది. -
మళ్లీ వర్షం పడితే టీమిండియా ఆప్షన్స్ ఇవే..
మాంచెస్టర్: వాతావరణం అనుకూలించక మ్యాచ్కు అంతరాయం కలిగినప్పుడు ప్రత్యర్థి జట్టు టార్గెట్ స్కోర్ను నిర్ణయించడానికి అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరిస్తుంటారు. టీమిండియాతో జరుగుతున్న వరల్డ్కప్ సెమీస్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద ఉన్న తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే పదే పదే మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించడంతో మంగళవారం నాడు జరగాల్సిన మ్యాచ్.. రిజర్వ్ డే అయిన బుధవారానికి మారింది. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ్నుంచీ కొనసాగించనున్నారు. కాగా, ఈ మ్యాచ్ను నేడు కూడా వరుణుడు వెంటాడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే.. వర్షం ప్రభావంతో ఓవర్లను కుదించి మ్యాచ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జరిగితే లక్ష్య సాధనలో టీమిండియా చేయాల్సిన పరుగులివే. అయితే న్యూజిలాండ్ ఈరోజు బ్యాటింగ్ చేయని పక్షంలోనే ఈ విధానం వర్తిస్తుంది.(ఇక్కడ చదవండి: మళ్లీ వర్షం రావడమే మంచిదైంది) డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా చేయాల్సిన పరుగులు ► 46ఓవర్లకు మ్యాచ్ జరిగితే 237 పరుగులు ►40ఓవర్లకు మ్యాచ్ జరిగితే 223 పరుగులు ►35 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 209 పరుగులు ►30 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 192 పరుగులు ►25 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 172 పరుగులు ►20 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 148 పరుగులు ►అది సాధ్యం కాకపోతే లీగ్ దశలో టాప్లో ఉన్న భారత్ నేరుగా ఫైనల్కు చేరుతుంది -
టీమిండియా మ్యాచ్ గెలవాలంటే..!
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించింది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం గం 6.30 ని.లకు వర్షం కురవడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు, రిఫరీ సమీక్షలు జరుపుతున్నారు. ఒకవేళ వరుణుడు కరుణించి అవుట్ ఫీల్డ్ ఇబ్బంది ఏమీ లేకపోతే దాదాపు ఈ రోజు మ్యాచ్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. రిజర్వ్ డేను చివరి అవకాశంగా మాత్రమే ఉపయోగించుకోవాలని ఐసీసీ నిబంధనలు చెబుతున్న తరుణంలో మ్యాచ్ జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటకే దాదాపు రెండు గంటల ఆట సాధ్యం కాకపోవడంతో ఓవర్లను కుదించే అవకాశం ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించే అవకాశం లేదు. రాత్రి గం. 8.30 ని.ల నుంచి గం. 9.00 మధ్యలో మ్యాచ్ ప్రారంభమైతే మాత్రం ఓవర్లను కుదిస్తారు. మ్యాచ్లో ఈరోజే ఫలితం తేలాలంటే మాత్రం భారత్ కనీసం 20 ఓవర్లు ఆట ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ ఇప్పటికే 20 ఓవర్ల ఆట ఆడేసినందున భారత్ కూడా కనీసం 20 ఓవర్లు ఆడాలి. ఒకవేళ భారత జట్టు 20 ఓవర్లు మాత్రమే ఆట ఆడాల్సి వస్తే.. అప్పుడు 148 పరుగులు చేయాల్సి వస్తుంది. అంటే 120 బంతుల్లో 148 పరుగులు చేయాల్సి ఉంటుందని డక్వర్త్ లూయిస్ నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ భారత జట్టు ఈరోజు కనీసం 20 ఓవర్లు ఆడలేకపోతే మ్యాచ్ రేపు కొనసాగుతుంది. అంటే.. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగుతుంది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడి మ్యాచ్ ఫలితం రాకపోతే లీగ్లో టాప్లో నిలిచిన భారత్ ఫైనల్కు చేరుతుంది. -
రికార్డు సాధించి ఔటయ్యాడు!
మాంచెస్టర్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, కెప్టెన్గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో విలియమ్సన్ 95 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. దాంతో తాజా వరల్డ్కప్లో విలియమ్సన్ 548 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మార్టిన్ గప్టిల్(547 పరుగులు, 2015 వరల్డ్కప్)ఒక వరల్డ్కప్లో కివీస్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు బద్ధలైంది. అయితే ఈ రికార్డు సాధించిన వెంటనే విలియమ్సన్ ఔటయ్యాడు. భారత స్పిన్నర్ చహల్ వేసిన 36 ఓవర్ రెండో బంతికి జడేజాకు క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్ను కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. గప్టిల్(1) ఆదిలోనే పెవిలియన్ చేరగా, నికోలస్(28) రెండో వికెట్గా ఔటయ్యాడు. విలియమ్సన్తో కలిసి 68 పరుగులు జత చేసిన తర్వాత రెండో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆపై రాస్ టేలర్తో కలిసి 65 పరుగులు భాగస్వామ్యం సాధించిన తర్వాత విలియమ్సన్ ఔటయ్యాడు. -
కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత
మాంచెస్టర్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్కప్లో విలియమ్సన్ ఐదు వందల పరుగుల మార్కును చేరాడు. భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో ఐదు వందలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకూ రోహిత్ శర్మ(647), డేవిడ్ వార్నర్(638), షకీబుల్ హసన్(606), అరోన్ ఫించ్(507)లు ఉండగా, ఇప్పుడు విలియమ్సన్ సైతం వారి సరసన నిలిచాడు. అదే సమయంలో ఒక వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విలియమ్సన్ గుర్తింపు సాధించాడు. 2015 వరల్డ్కప్లో మార్టిన్ గప్టిల్ 547 పరుగులు సాధించి కివీస్ తరఫున తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానాన్ని విలియమ్సన్ ఆక్రమించాడు. కాగా, వరల్డ్కప్లో ఐదు వందల పరుగులు చేసిన తొలి కివీస్ కెప్టెన్గా విలియమ్సన్ ఘనత సాధించాడు. ఒక వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో గప్టిల్, విలియమ్సన్ తర్వాత స్థానాల్లో స్కాట్ స్టైరిస్(2007 వరల్డ్కప్-499 పరుగులు), మార్టిన్ క్రో(1992 వరల్డ్కప్, 456 పరుగులు), స్టీఫెన్ ఫ్లెమింగ్(2007 వరల్డ్కప్-353 పరుగులు)లు ఉన్నారు. -
ఆసీస్ను నిలువరించేనా?
మాంచెస్టర్: ప్రపంచ కప్లో లీగ్ దశ ఆఖరి ఘట్టానికి చేరింది. శనివారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచే లీగ్లో చివరిది. దాంతో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్టేదో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై ఆసీస్ గెలిస్తే టాప్ను కాపాడుకుంటుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్ల ముఖాముఖి రికార్డుల పరంగా చూస్తే 99 వన్డేల్లో తలపడగా ఆసీస్ 48 మ్యాచ్ల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా 47 మ్యాచ్ల్లో గెలుపొందింది. మూడు మ్యాచ్లు టైగా ముగియగా, ఒక మ్యాచ్ రద్దయ్యింది. ప్రస్తుత వరల్డ్కప్లో భారత్తో మ్యాచ్ మినహా ఆస్ట్రేలియాకు టోర్నీలో ఎక్కడా సమస్య ఎదురు కాలేదు. ఇంగ్లండ్ రావడానికి ముందు ఎవరూ ఫేవరెట్గా పరిగణించని డిఫెండింగ్ చాంపియన్ ఒక్కసారిగా పుంజుకొని చెలరేగిపోయింది. ఓపెనర్లు వార్నర్ (516 పరుగులు), ఫించ్ (504) ఒకరితో మరొకరు పోటీ పడి జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. మరొకవైపు బౌలింగ్ విభాగంలో కూడా ఆసీస్ తనదైన ముద్రతో దూసుకుపోతోంది. దాంతో కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించిన సఫారీలతో పోరులో ఆసీస్నే ఫేవరెట్గా బరిలోకి దిగింది. మరి ఆసీస్ను దక్షిణాఫ్రికా ఎంతవరకూ నిలువరిస్తుందో చూడాలి. -
'టీమిండియాను ఓడించిన వారిదే కప్'
మాంచెస్టర్ : ప్రపంచకప్లో భాగంగా గురువారం మాంచెస్టర్లో వెస్టిండీస్పై భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సందర్భంగా 'ఇది గుర్తుంచుకోండి..ఎవరైతే టీమిండియాను ఓడిస్తారో వారే ప్రపంచకప్ విజేత అవుతార'ని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో (ఒకటి రద్దు) దూకుడుగా ఆడుతోందని అభిప్రాయపడ్డాడు. కాగా, విండీస్పై 125 పరుగుల తేడాతో గెలిచిన భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. తర్వాతి మ్యాచ్లో భాగంగా కోహ్లిసేన ఆదివారం ఇంగ్లడ్తో తలపనుంది. ఈ సందర్భంగా వాన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. -
మరో విజయమే లక్ష్యంగా టీమిండియా..
మాంచెస్టర్: వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు వరల్డ్క్పలో మరో పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్లో అఫ్గానిస్తాన్పై ఆఖరి ఓవర్లో విజయం సాధించినా.. గురువారం అంతకంటే బలమైన వెస్టిండీస్ తో పోరుకు సమాయత్తమైంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో తిరుగులేకుండా ఉన్నా... కీలక సమయాల్లో సరైన భాగస్వామ్యాలు రాకపోవడం టీమిండియా మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. ముఖ్యమైన రెండో పవర్ ప్లేలో మిడిలార్డర్ రాణిస్తే భారత్కు తిరుగుండదు. ఇక పేస్ బౌలింగే ఆయుధంగా వరల్డ్కప్లో అడుగుపెట్టిన వెస్టిండీస్.. పాకిస్తాన్తో మ్యాచ్లో టోర్నీలో ఏకైక విజయం అందుకుంది. న్యూజిలాండ్తో గత మ్యాచ్లో బ్రాత్వైట్ అద్భుత పోరాట పటిమ చూపడంతో విండీస్ గెలుపు అంచుల దాకా వచ్చింది. కానీ కేవలం ఐదు పరుగులతో ఓటమి చవిచూడడంతో నిరాశలో కూరుకుపోయింది. ఓపెనర్లు శుభారంభాలు అందించకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. మిగిలిన బ్యాట్స్మెన్ కూడా నిలకడగా ఆడకపోవడంతో టోర్నీలో విండీస్ అనుకున్న ఫలితాలు సాధించ లేక పోతోంది. పించ్ హిట్టర్ రస్సెల్ గాయంతో దూరం కావడం మరో దెబ్బ. ఈనేప థ్యంలో భారత్ను ఏమాత్రం ప్రతిఘటిస్తుందో చూడాలి. భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్ల్లో భారత్... 62 మ్యాచ్ల్లో వెస్టిండీస్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. ప్రపంచకప్లో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్ల్లో భారత్, మూడు మ్యాచ్ల్లో విండీస్ గెలిచాయి. తాజా మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. తుది జట్లు భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా వెస్టిండీస్ జేసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మైయిర్, కార్లోస్ బ్రాత్వైట్, ఫబియన్ అలెన్, కీమర్ రోచ్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నీ థామస్ -
భువీ ఈజ్ బ్యాక్
మాంచెస్టర్ : పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగిన సంగతి తెలిసిందే. భూవీ బ్యాకప్ ప్లేయర్గా నవదీప్ సైనీ ఇంగ్లండ్కు వెళ్లడంతో అతడి గాయంపై అభిమానుల్లో ఆందోళనలు కలిగాయి. అయితే తాజాగా స్థానిక ఇండోర్ నెట్స్లో భువనేశ్వర్ బౌలింగ్ చేసిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోనూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. పాక్తో మ్యాచ్లో గాయపడిన భువనేశ్వర్ మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం భారత్కు ఊరటకలిగించే వార్తే. కాగా, అఫ్గానిస్తాన్ మ్యాచ్లో భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి భారత్ను గెలిపించిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో భువీ తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువే. భారత్ ఇప్పటికే 5మ్యాచ్ల్లో 9 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రపంచకప్లో జరిగిన అన్ని మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని జట్లుగా భారత్, న్యూజిలాండ్లు దూసుకుపోతున్నాయి. అయితే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకు పోయిన సంగతి తెలిసిందే. బుమ్రా, షమీ, భువనేశ్వర్లతో కూడిన భారత్ పేస్ బలగం మరింత పటిష్టంగా తయారయ్యింది. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్కు క్రికెటర్ల గాయాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే బొటనవేలి గాయంతో శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ గురువారం వెస్టిండీస్తో తలపడనుంది. Look who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn — BCCI (@BCCI) 25 June 2019 -
నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా!
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో(డక్వర్త్లూయిస్ ప్రకారం) విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్లో కుమ్మేసిన భారత్.. ఆపై పాకిస్తాన్కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా భారీ గెలుపును అందుకుంది. ఈ వరల్డ్కప్కే హైలైట్గా నిలిచిన మ్యాచ్లో రోహిత్ శర్మ(140) భారీ సెంచరీకి తోడు కేఎల్ రాహుల్(57)లు శుభారంభం అందించారు. అటు తర్వాత విరాట్ కోహ్లి((77) తన మార్కు ఆటను చూపిస్తూ పాక్ బౌలర్లకు చెమటలు పట్టేలా చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోగా, అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ఇక్కడ చదవండి: కోహ్లికి ఎందుకంత తొందర?) కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతనికి పాక్ స్పిన్నర్ ఇమాద్ వసీం దండం పెడుతూ కనిపించాడు. ‘నువ్వు కొట్టింది ఇక చాలు. ఇక ఆపరా నాయనా. నీ వికెట్ను ఇకనైనా ఇస్తే బాగుంటుంది’ అని అర్థం వచ్చేలా దండం పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మ్యాచ్లో కొన్ని విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన కోహ్లి ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. పాక్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కాగా, పాక్ ఇన్నింగ్స్ ఆరంభించి కష్టాల్లో పడ్డ సమయంలో వర్షం కురిసింది. దాంతో పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులకు కుదించారు. అయితే పాక్ టార్గెట్ ఛేదించడంలో విఫలమైంది. ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగుల మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. -
ఇంగ్లండ్ ఇరగదీసిన రికార్డులివే..
మాంచెస్టర్: ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్లో మూడొందలకుపైగా స్కోర్లను అవలీలగా సాధిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే ఇంగ్లండ్ ముందు వరుసలో ఉంటుంది. ఆ జట్టు ఒక్కసారి కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్లు నెలకొల్పుతూ మ్యాచ్లు ఎగరేసుకుపోతోంది. ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్కప్లో సైతం ఇంగ్లండ్ హవానే కొనసాగుతోంది. తాజాగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ పలు రికార్డులను నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫలితంగా తమ వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక స్కోరును ఇంగ్లండ్ సాధించింది. అదే సమయంలో ఒక వరల్డ్కప్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మొత్తం సాధించిన సిక్సర్లు 25. దాంతో 2015లో వెస్టిండీస్ సాధించిన 19 సిక్సర్ల రికార్డు తెరమరుగైంది. ఈ జాబితాలో ఇంగ్లండ్, వెస్టిండీస్ల తర్వాత దక్షిణాఫ్రికా(18 సిక్సర్లు-2007 వరల్డ్కప్లో), భారత్(18 సిక్సర్లు-2007 వరల్డ్కప్లో)లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక వన్డే ఫార్మాట్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.మరొకవైపు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 57 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా వరల్ద్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఒబ్రియన్(50 బంతుల్లో ఇంగ్లండ్పై), మ్యాక్స్వెల్(51 బంతుల్లో శ్రీలంకపై), ఏబీ డివిలియర్స్(52 బంతుల్లో వెస్టిండీస్పై)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో మోర్గాన్ 17 సిక్సర్లు కొట్టాడు. దాంతో ఒక వరల్డ్కప్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. అదే సమయంలో వన్డే ఫార్మాట్లో ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో కూడా మోర్గాన్ తొలి స్థానం ఆక్రమించాడు. ఇక్కడ రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్లు 16 సిక్సర్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మోర్గాన్ 148 పరుగుల అత్యధిక వ్యక్తిగ పరుగులు సాధించగా, జో రూట్తో కలిసి 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక వరల్డ్కప్ మ్యాచ్లో ఇంగ్లండ్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది. -
వరల్డ్కప్ చరిత్రలోనే చెత్త రికార్డు
మాంచెస్టర్: ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఒకడు. అయితే ఎవ్వరూ ఉహించని చెత్త రికార్డును రషీద్ ఖాన్ మూటగట్టుకున్నాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో రషీద్ ఖాన్ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. కనీసం వికెట్ కూడా తీయకుండా 9 ఓవర్లు వేసిన రషీద్ 110 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రషీద్ నిలిచాడు. మరొకవైపు వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అఫ్గాన్ బౌలర్ చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో అఫ్గాన్ తరఫున నైబ్ 101 పరుగులు ఇస్తే, దాన్ని రషీద్ బ్రేక్ చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఇంగ్లండ్ 11 సిక్సర్లు సాధించడం ఇక్కడ గమనార్హం.(ఇక్కడ చదవండి: మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్ భారీ స్కోర్) ప్రధానంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో శతకం బాదేశాడు. అయితే 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్ నాల్గో వికెట్గా ఔటయ్యాడు. బెయిర్ స్టో రెండో వికెట్గా ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన మోర్గాన్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్.. దాన్ని సెంచరీగా మలుచుకోవడానికి మరో 21 బంతుల్నే తీసుకున్నాడు.(ఇక్కడ చదవండి: మోర్గాన్ సిక్సర్ల రికార్డు) మోర్గాన్ సిక్స్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, సెంచరీనే కూడా సిక్స్తోనే సాధించడం ఇక్కడ విశేషం. ఇది నాల్గో ఫాస్టెస్ట్ వరల్డ్కప్ సెంచరీగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే ఒక వరల్డ్కప్ మ్యాచ్లోఅత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో వరల్డ్కప్లో గేల్ 16 సిక్సర్లు కొట్టగా, దాన్ని మోర్గాన్ బ్రేక్ చేశాడు. మోర్గాన్ భారీ సెంచరీకి జతగా బెయిర్ స్టో(90), జోరూట్(88)లు హాఫ్ సెంచరీలు జత చేశారు. చివర్లో మొయిన్ అలీ(31 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. -
అయ్యో బెయిర్ స్టో.. జస్ట్ మిస్!
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో తృటిలో సెంచరీ కోల్పోయాడు. 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసిన బెయిర్ స్టో రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆది నుంచి సమయోచితంగా ఆడిన బెయిర్ స్టో.. నైబ్ వేసిన 30 ఓవర్ ఐదో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో బెయిర్ స్టో భారంగా పెవిలియన్ వీడాడు. బెయిర్ స్టో కొద్దిలో సెంచరీ కోల్పోవడంపై ఇంగ్లండ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను జేమ్స్ విన్సే-బెయిర్ స్టోలు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టోతో జో రూట్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో ఔటయ్యాడు. ఆ తర్వాత జోరూట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 33 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్ను ఆపతరమా?
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే మూడు విజయాలను ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ఇంగ్లండ్..ఇంకా పాయింట్ల ఖాతా తెరకుండా చివరి స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్తో తలపడుతోంది. అయితే గాయాల బెడద ఇంగ్లండ్ను కలవర పెడుతుంది. ఇప్పటికే డాషింగ్ ఒపెనర్ జేసన్ రాయ్ తొడ కండరాల గాయంతో రెండు మ్యాచ్లకు దూరం కావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా రూట్ రెండు సెంచరీలు సాధించి జోరు మీదున్నాడు. రూట్కు తోడుగా బట్లర్, బెయిర్స్టో, స్టోక్స్ చెలరేగితే ఇంగ్లండ్ మరోసారి 300 మైలురాయిని దాటడం లాంఛనమే. బౌలింగ్లో వోక్స్, జోఫ్రా ఆర్చర్, వుడ్, ఆదిల్ రషీద్లతో పటిష్టంగా ఉంది.ఇక ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన అఫ్గానిస్తాన్ అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఇంగ్లండ్ను నిలువరించడం కష్టం. బ్యాటింగ్తోపాటు బౌలింగ్ విభాగంలోనూ వారు అంచనాలను అందుకోలేకపోవడం ఆ జట్టు వరుస ఓటముల్ని చవిచూసింది. ఈ తరుణంలో ఇంగ్లండ్ను అఫ్గానిస్తాన్ ఆపడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. తుది జట్లు ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెయిర్ స్టో, జో రూట్, జేమ్స్ విన్సే, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్ అఫ్గానిస్తాన్ గుల్బదిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్ షా, నూర్ అలీ జద్రాన్, నజిబుల్లా జద్రాన్, హస్మతుల్లా షాహిది, అస్గార్ అఫ్గాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దవ్లాత్ జద్రాన్ -
పాక్ కోచ్ అయినప్పుడు చెబుతా: రోహిత్
మాంచెస్టర్: ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కోహ్లి సేన సునాయస విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలెట్. క్రికెట్ గాడ్, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను గుర్తుచేస్తూ కొన్ని చూడముచ్చటైన షాట్లు ఆడాడు. బహుమతి ప్రధానోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ పాల్గొన్నాడు. ఈ పాక్ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానమిచ్చి నవ్వులజల్లులు కురిపించాడు. ‘ఓటమితో పాక్ బ్యాట్స్మెన్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మీ సహచర ఆటగాళ్లు, పాక్ బ్యాట్స్మెన్కు మీరిచ్చే సలహాలు ఏంటి’ అని జర్నలిస్టు ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా..‘నేను పాకిస్థాన్ కోచ్ గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తానో అప్పుడు మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను, ఎందుకంటే ఇది పాకిస్థాన్ కోచ్ జవాబు చెప్పాల్సిన ప్రశ్న, దీనికి నేనేం సమాధానం చెబుతాను?’ అంటూ చమత్కరించాడు. ఇక దేశం తరుపున చేసిన ప్రతీ పరుగు ఎంతో ముఖ్యమైందని, ప్రపంచకప్ లాంటి మ్యాచ్ల్లో సెంచరీ సాధిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదన్నాడు. సమైరా(రోహిత్ కూతురు) తన జీవితంలోకి వచ్చాక దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: ‘ఆ గెలుపు క్రెడిట్ అంతా ఐపీఎల్దే’ అంతా నా బిడ్డ వల్లే : రోహిత్ శర్మ -
సందడి చేసిన అంబానీ కుటుంబం
మాంచెస్టర్: క్రికెట్ వరల్డ్కప్ ఫీవర్ అందరినీ ఊపేస్తోంది. సినీ తారలే కాకుండా పారిశ్రామికవేత్తలు సైతం మ్యాచ్ను చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వరల్డ్ కప్ను వీక్షించేందుకు సెలబ్రిటీలు ఇంగ్లండ్కు క్యూ కడుతున్న క్రమంలో ఆదివారం మాంచెస్టర్లో జరిగిన భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ను ఆస్వాదించేందుకు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా వచ్చారు. వీరు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఓనర్గా ఉన్న విషయం తెలిసిందే. వేలాదిమంది వీక్షిస్తున్న ఈ మ్యాచ్లో అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం మ్యాచ్ను వీక్షిస్తున్న ముఖేష్ అంబానీ కుటుంబ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత్కు మద్దతుగా నీతా అంబానీ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూ జాతీయ జెండాను ప్రదర్శించారు. బ్లూ జెర్సీ ధరించిన ఈమె మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. క్రికెటర్ కృనాల్ పాండ్యా ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీతో కాసేపు ముచ్చటించాడు. నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఆట మొత్తాన్ని ఎంతో ఉత్కంఠగా చూస్తూ కెమెరాలో బంధించింది. ఇక ముఖేష్ అంబానీ ఎప్పటిలాగే ఎంతో హుందాగా సూట్లో దర్శనమిచ్చారు. -
ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ తదుపరి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడు. శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తొడ కండరాలు పట్టేయడంతో జేసన్ రాయ్ అర్థాంతరంగా మైదానాన్ని వీడాడు. విండీస్ ఇన్నింగ్స్లో భాగంగా ఎనిమిది ఓవర్లు మాత్రమే ఫీల్డ్లో ఉన్న రాయ్ను గాయం వేధించడంతో గ్యాలరీకి పరిమితమయ్యాడు. ఆపై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అఫ్గానిస్తాన్, శ్రీలంక మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. జూన్ 25వ తేదీన ఆస్ట్రేలియాతో జరుగనున్న మ్యాచ్కు రాయ్ జట్టుతో కలుస్తాడని ఇంగ్లండ్ యాజమాన్యం స్పష్టం చేసింది. మరొకవైపు విండీస్తో మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పి కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడాడు. రేపు అప్గానిస్తాన్తో జరుగనున్న మ్యాచ్కు సైతం మోర్గాన్ అందుబాటులో ఉండటం అనేది అనుమానమే. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకూ ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్లు ఆడి మూడింట విజయం సాధించింది. -
కోహ్లికి ఎందుకంత తొందర?
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంతి కనీసం బ్యాట్కు తగలకుండానే కోహ్లి పెవిలియన్ వీడటం సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోహ్లి స్వీయ తప్పిదం కారణంగా అతని వికెట్ను చేజార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వర్షం వెలిసిన తర్వాత విరాట్ కోహ్లి, విజయ్ శంకర్ తిరిగి క్రీజ్లోకి వచ్చారు. ఆ క్రమంలోనే 48 ఓవర్ను మహ్మద్ ఆమిర్ అందుకున్నాడు. తొలి బంతికి విజయ్ శంకర్ పరుగులేమీ తీయకపోగా, రెండో బంతికి సింగిల్ తీశాడు.(అదరగొట్టిన టీమిండియా: పాక్కు భారీ లక్ష్యం) దాంతో స్ట్రైకింగ్ ఎండ్లోకి వచ్చిన కోహ్లి మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక నాల్గో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆమిర్ బౌన్సర్ వేశాడు. దాన్ని కోహ్లి హుక్ షాట్ ఆడబోగా అది కాస్తా మిస్ అయ్యి కీపర్ సర్ఫరాజ్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై ఔట్కు సర్ఫరాజ్ బలంగా అప్పీల్ చేయకపోయినా, అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మాత్రం పెవిలియన్ బాట పట్టాడు. అటు తర్వాత ఇది ఔట్ కాదని టీవీ రిప్లేలో తేలడంతో కోహ్లికి తాను చేసిన పొరపాటు తెలిసొచ్చింది. కీలకమైన మ్యాచ్లో అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మైదానాన్ని వీడటం ఏమిటని క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఒక సాధారణ మ్యాచ్లోనే ప్రతీ వికెట్ చాలా విలువైనది. అందులోనూ వరల్డ్కప్లో, అది కూడా పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి ఔట్ కాకుండానే మైదానాన్ని వీడటం చర్చకు దారి తీసింది. అసలు కోహ్లికి అంత తొందర ఎందుకు అనేది సాధారణ ప్రేక్షకుడి ప్రశ్న. అయితే బ్యాట్ హ్యాండిల్ బలహీనంగా ఉన్న కారణంగానే కోహ్లి ఔట్గా భావించాడు. కోహ్లి గ్యాలరీలో కూర్చొన్న తర్వాత బ్యాట్ హ్యాండిల్ను చెక్ చేసుకోవడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి(77; 65 బంతుల్లో 7 ఫోర్లు) ఐదో వికెట్గా ఔటయ్యాడు. -
ఔట్ కాకుండానే మైదానాన్ని వీడిన కోహ్లి
-
అదరగొట్టిన టీమిండియా: పాక్కు భారీ లక్ష్యం
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాటింగ్లో అదరగొట్టింది. రోహిత్ శర్మ(140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీకి తోడు కేఎల్ రాహుల్(57; 78 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి(77; 65 బంతుల్లో 7 ఫోర్లు)లు హాఫ్ సెంచరీలతో మెరవడంతో పాకిస్తాన్కు 337 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దాంతో భారత ఇన్నింగ్స్ను రోహిత్-కేఎల్ రాహుల్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్(57) పెవిలియన్ చేరాడు. రియాజ్ బౌలింగ్లో బాబర్ అజామ్కు సునాయసమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. (ఇక్కడ చదవండి: అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్) ఆ తరుణంలో కోహ్లితో కలిసి మరో 98 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన రోహిత్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. హసన్ అలీ బౌలింగ్లో ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడబోయిన రోహిత్ ఔటయ్యాడు. ఆ సమయంలో కోహ్లితో కలిసి హార్దిక్ పాండ్యా జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి 51 పరుగులు జత చేసిన తర్వాత హార్దిక్(26; 19 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్) మూడో వికెట్గా ఔట్ కాగా, ధోని(1) సైతం విఫలయ్యాడు. ఆపై కోహ్లికి విజయ్ శంకర్ జత కలిశాడు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా, వర్షం వెంటనే ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికి కోహ్లి ఐదో వికెట్గా ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో విజయ్ శంకర్(15 నాటౌట్), కేదార్ జాదవ్( 9 నాటౌట్)లు తలో ఫోర్ కొట్టడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ మూడు వికెట్లు సాధించగా, హసన్ అలీ, వహాబ్ రియాజ్లు చెరో వికెట్ తీశారు.(ఇక్కడ చదవండి: కోహ్లి ఖాతాలో మరో రికార్డు) -
హమ్మయ్య.. వర్షం ఆగింది
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం ఆటంకం కల్గించడంతో కొద్దిసేపు నిలిచిపోయింది. అయితే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ పునః ప్రారంభమైంది. ఆటగాళ్లు, అంపైర్లు మైదానంలోకి చేరుకోవడంతో అభిమానులు మళ్లీ మ్యాచ్ను వీక్షించేందుకు సిద్ధమయ్యారు. మ్యాచ్ను మొత్తంగా వీక్షించాలనుకుంటున్న అభిమానులు ఇక వర్షం కురువకుండా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ స్కోరు 46.4 ఓవర్లలో 305/4 వద్ద ఉండగా వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా, వెంటనే తగ్గిపోవడంతో పిచ్ను సిద్ధం చేయడానికి గ్రౌండ్మెన్కు ఎంతో సమయం పట్టలేదు. -
భారత్-పాక్ మ్యాచ్కు వర్షం అడ్డంకి
-
భారత్-పాక్ మ్యాచ్కు వర్షం అడ్డంకి
మాంచెస్టర్: వరల్డ్కప్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న మ్యాచ్కు వరుణుడు ఆటంకం కల్గించాడు. భారత స్కోరు 46.4 ఓవర్లలో 305/4 వద్ద ఉండగా వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఆట నిలిచే సమయానికి కోహ్లి(71 బ్యాటింగ్), విజయ్ శంకర్(3 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. మ్యాచ్ తిరిగి ఆరంభం కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యమైన పక్షంలో ఓవర్లను కుదించే అవకాశాలు కనబడుతున్నాయి. -
సైమండ్స్ తర్వాతే మన రోహితే..
మాంచెస్టర్: వరల్డ్కప్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్పై వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ గుర్తింపు పొందాడు. ఆదివారం దాయాది పాక్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి రెండో వికెట్గా ఔటయ్యాడు. ఇది వరల్డ్కప్ చరిత్రలో పాక్పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. పాక్పై వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆండ్రూ సైమండ్స్(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. 2003 వరల్డ్కప్లో జోహెనెస్బర్గ్లో పాక్తో జరిగిన మ్యాచ్లో సైమండ్స్ అజేయంగా 143 పరుగులు సాధించాడు. ఇదే నేటికి పాక్పై వరల్డ్కప్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత స్థానాన్ని రోహిత్ ఆక్రమించాడు. రోహిత్ తర్వాత రాస్ టేలర్(న్యూజిలాండ్) ఉన్నాడు. 2011 వరల్డ్కప్లో పాక్పై రాస్ టేలర్ 131 పరుగులు చేశాడు. (ఇక్కడ చదవండి: పాక్పై టీమిండియా సరికొత్త రికార్డు) పాక్తో మ్యాచ్లో రోహిత్ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం నమోదు చేశాడు. ఇది రోహిత్కు వన్డే కెరీర్లో 24వ సెంచరీ కాగా, ఈ వరల్డ్కప్లో రెండో సెంచరీ. ఇది ఓవరాల్ వరల్డ్కప్లో రోహిత్కు మూడో సెంచరీ. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దాంతో భారత ఇన్నింగ్స్ను రోహిత్-కేఎల్ రాహుల్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్(57) పెవిలియన్ చేరాడు. రియాజ్ బౌలింగ్లో బాబర్ అజామ్కు సునాయసమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో కోహ్లితో కలిసి మరో 98 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన రోహిత్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. హసన్ అలీ బౌలింగ్లో ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడబోయిన రోహిత్ ఔటయ్యాడు. ఆపై కోహ్లి-హార్దిక్ పాండ్యాలు భారత్ ఇన్నింగ్స్ను నడిపిస్తున్నారు. 43 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.( ఇక్కడ చదవండి:అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్) -
అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం నమోదు చేశాడు. ఇది రోహిత్కు వన్డే కెరీర్లో 24వ సెంచరీ కాగా, ఈ వరల్డ్కప్లో రెండోది. ఆది నుంచి ఏమాత్రం తడబడకుండా సెంచరీ మార్కును చేరాడు. రోహిత్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత కాస్త నెమ్మదించాడు. అర్థ శతకం సాధించడానికి 34 బంతులు మాత్రమే ఆడిన రోహిత్.. దాన్ని సెంచరీ మలుచుకోవడానికి మరో 51 బంతులు తీసుకున్నాడు. ఇది రోహిత్కు ఓవరాల్ వరల్డ్కప్లో మూడో సెంచరీ. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్పై వరల్డ్కప్లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్పై విరాట్ కోహ్లి వరల్డ్కప్ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత నెలకొల్పగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్ చేరాడు. (ఇక్కడ చదవండి: పాక్పై టీమిండియా సరికొత్త రికార్డు) ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దాంతో భారత ఇన్నింగ్స్ను రోహిత్-కేఎల్ రాహుల్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్(57) పెవిలియన్ చేరాడు. రియాజ్ బౌలింగ్లో బాబర్ అజామ్కు సునాయసమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే రోహిత్-కోహ్లిల జోడి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది. వీరు సమయోచితంగా ఆడటంతో భారత్ జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. -
పాక్పై టీమిండియా సరికొత్త రికార్డు
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమ వరల్డ్కప్ చరిత్రలో పాకిస్తాన్పై అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్ సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. గతంలో పాక్పై వరల్డ్కప్లో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 90 కాగా, దాన్ని తాజాగా రోహిత్-రాహుల్లు బ్రేక్ చేశారు. 1996 వరల్డ్కప్లో సచిన్ టెండూల్కర్-నవజ్యోత్ సిద్ధూలు 90 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే ఇప్పటివరకూ పాక్పై వరల్డ్కప్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. దాన్ని 23 ఏళ్ల తర్వాత రోహిత్-కేఎల్ రాహుల్ సవరించారు. తాజా మ్యాచ్లో రోహిత్-రాహుల్లు కుదురుగా ఆడుతూ భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. (ఇక్కడ చదవండి: రోహిత్ శర్మ దూకుడు) ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతనికి రాహుల్ నుంచి చక్కటి సహకారం లభించడంతో వంద పరుగుల భాగస్వామ్యం సాధ్యమైంది. 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ జట్టు వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా భారత్ బ్యాటింగ్కు దిగింది. -
రోహిత్ శర్మ దూకుడు
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆది నుంచి తన సహజ సిద్ధమైన బ్యాటింగ్తో రోహిత్ ఆడుతుండగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం కుదురుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ, రాహుల్లు ఆరంభించారు. అయితే మహ్మద్ ఆమిర్ వేసిన తొలి ఓవర్ను ఆడిన రాహుల్ పరుగులేమీ చేయలేదు. దాంతో మొదటి ఓవరే మెయిడిన్ అయ్యింది. ఆ తర్వాత రెండో ఓవర్ మూడో బంతికి రోహిత్ ఫోర్ కొట్టాడు. అదే ఊపును కొనసాగిస్తూ రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో తాను ఆడిన గత ఐదు ఇన్నింగ్స్ల్లోనూ కనీసం హాఫ్ సెంచరీ మార్కును చేరడం మరో విశేషం. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
-
భారత్-పాక్ మ్యాచ్: టాస్ పడిందోచ్!
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్తాన్ల మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్పరాజ్.. భారత్ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. శిఖర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్కు దూరం కావడంతో అతని స్థానంలో విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చాడు. వరుణుడు కాస్త తెరిపి ఇవ్వడంతో టాస్ పడింది. ఇక మ్యాచ్ మొత్తం జరగాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇక్కడ చదవండి: పాక్పై భారత్ కొట్టిన సిక్సర్!) రెండేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్... అప్పటి భారత్ టీమ్ బలాన్ని చూస్తే పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అనూహ్యం. సరిగ్గా చెప్పాలంటే బలహీనంగా కనిపించిన పాక్ను తప్పుగా అంచనా వేసి కోహ్లి సేన బోల్తా కొట్టింది. ఇప్పుడు అదే ఇంగ్లండ్లో మరో ఐసీసీ ఈవెంట్లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్లలో ఓటమి లేకుండా విరాట్ బృందం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్తాన్ రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలు కావడంతో ఆ జట్టు ఒత్తిడిలో ఉంది. ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజమ్లే పాక్ బ్యాటింగ్ బలం. బౌలింగ్లో వారి ప్రధాన వనరు మహ్మద్ ఆమిర్. అదే సమయంలో భారత్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో టీమిండియా బలంగా ఉంది. మరొకవైపు బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ల ప్రదర్శనే కీలకం. తాజా మ్యాచ్లో కచ్చితంగా టీమిండియానే ఫేవరేట్. వన్డే ప్రపంచకప్లో పాక్తో తలపడిన ఆరు సందర్భాల్లో భారత్ గెలవడంతో అదే పునరావృతం చేయాలని విరాట్ గ్యాంగ్ భావిస్తోంది. ఏది ఏమైనా దాయాదుల సమరం కాబట్టి ప్రతీ క్షణం ఆస్వాదించదగిందే.(ఇక్కడ చదవండి: గూగుల్లో అంతా అదే వెతుకులాట!) తుది జట్లు భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా పాకిస్తాన్ సర్పరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జామాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, హసన్ అలీ, వహాబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్ -
గూగుల్లో అంతా అదే వెతుకులాట!
మాంచెస్టర్ : భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..! సగటు క్రికెట్ అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్కు జట్లు, బలాబలాల సంగతులు ఎలా ఉన్నా ఈ వరల్డ్కప్ ఫలితాలను వర్షం కూడా శాసిస్తోంది. వాన కారణంగా రద్దయిన నాలుగు మ్యాచ్లలో భారత్ మ్యాచ్ కూడా ఉంది. కివీస్తో మ్యాచ్ పోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్తో మ్యాచ్ మాత్రం కచ్చితంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు. అటు పాక్ అభిమానులు కూడా అంతే శ్రీలంకతో మ్యాచ్ రద్దైనా పట్టించుకోలేదు. అయితే మాంచెస్టర్లో పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఇంగ్లండ్లో వాతావరణం గురించి దాదాపు కచ్చితమైన సమాచారం అందించే ఏజెన్సీలు అన్నీ ఆదివారం వర్షం పడుతుందనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అభిమానులు గూగుల్లో వెతికేది ఒకటే.. మాంచేస్టర్ వెదర్ రిపోర్డు. ప్రతి అరగంటకు ఒకసారి సర్చ్ చేస్తూ అక్కడి వాతావరణ వివరాలను తెలసుకుంటున్నారు. దీంతో ఇరు దేశాల్లో అతిగా సెర్చ్ చేసిన పదంగా మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్ నిలిచింది. ఇక ట్విటర్లో #IndiaVsPakistan ఎక్కువగా ట్రెండ్ అవుతుండగా.. Manchester మూడో స్థానంలో ఉంది. Sitting in the subcontinent, worried about the 🌧️ in Manchester 😎 #INDvPAK #CWC19 pic.twitter.com/je3MsMDRUK — ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2019 -
టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. చావుకు దగ్గరైనట్టే
మాంచెస్టర్ : తీరిక సమయంలో చాలా మంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్ కావడానికి అయితే ఫరవాలేదు కాని అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం చావుకు దగ్గరవ్వటమే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం టీవీ తెరను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. స్కాట్లాండ్కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ గ్లస్గో’’ జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. గ్లస్గో విశ్వవిద్యాలయం దాదాపు 4 లక్షల మందితో అతిపెద్ద సర్వేని నిర్వహించింది. శారీరికంగా దృఢంగా లేని వాళ్లు, కండరాళ్ల సత్తువ లేని వాళ్లు మరింత ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఎక్కువ సేపు అలా టీవీ తెరను చూస్తూ ఉండటం వల్ల గుండె సంబంధ, ప్రేగు క్యాన్సర్, డయాబెటీస్, ఒబిసిటీ వంటి వ్యాధులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం టీవీ తెరకు మాత్రమే కాదు కంప్యూటర్ తెరకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్రభావం విషయానికి వస్తే అందరిపై ఒకే విధంగా ఉండదు. టీవీ, కంప్యూటర్ ను చూస్తున్నపుడు ఎంత విరామం తీసుకుంటున్నారు. శారీరకంగా వారు ఎంత బలంగా ఉన్నారు, ఆరోగ్యపు అలవాట్లు , శారీరక శ్రమ ఇలా అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. -
భర్త పాస్పోర్ట్తో భార్య ఏం చేసిందంటే.. !
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అందులో సరిదిద్దుకొనేవి కొన్ని, సరిదిద్దుకోలేనివి ఇంకొన్ని. కానీ భారత్కు చెందిన ఓమహిళ చేసిన పొరపాటు తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. అదేంటంటే భర్త పాస్పోర్ట్తో ఏకంగా దేశాలు దాటేసింది. గీతా మోధ అనే భారతీయ మహిళ మాంచెస్టర్లో అలంకార్ వస్త్ర దుకాణం నడుపుతోంది. గత ఏప్రిల్ 23న బిజినెస్ పనిమీద ఢిల్లీ రావాల్సి వచ్చింది. అయితే తొందరపాటులో తన పాస్పోర్ట్ బదులు భర్త దిలీప్ పాస్పోర్ట్ను తీసుకొని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో వయా దుబాయ్ మీదుగా ఢిల్లీ బయలుదేరింది. అయితే విదేశాల నుంచి వచ్చే భారతీయులు ఇమిగ్రేషన్ పూర్తి అయితేనే భారత్లోకి రావడానికి అనుమతి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు గీత ఇమిగ్రేషన్ తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఎయిర్పోర్టు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ విషయంపై ఎయిర్లైన్స్ వర్గాలను సంప్రదించగా ఈ సంఘటనపై విచారణం చేపట్టామని పేర్కొన్నారు. -
పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం.. విషాదం
మాంచెస్టర్(ఇంగ్లాండ్) : ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం కారణంగా రెండు కాళ్లు, తన కుడిచేతి ఐదు వేళ్లు, ముక్కు పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాంచెస్టర్కు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ జాకో నెల్ (50) తన పెంపుడు కుక్కతో రోజూ సరదాగా ఆడుకునే వాడు. ఒక రోజు ఆడుకుంటున్న సమయంలో కుక్క కారణంగా చేతిపై ఓ చిన్న గాయం ఏర్పడింది. మూమూలు గాయమేకదా అనుకున్న జాకోనెల్ దాన్ని సబ్బుతో కడిగి మిన్నకుండిపోయాడు. కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన జలుబు ఒళ్లు నొప్పుల కారణంగా మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఒంటి నిండా దురద మొదలైంది. కొద్ది సేపటికే శరీరంలోని భాగాలు నియత్రణ కోల్పోయి నడవటం, మాట్లాడటం, చేతులు సైతం పైకి ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతని భార్య జాకోనెల్ను ఆస్పత్రికి తరలించింది. జాకోనెల్ పరిస్థితి గమనించిన వైద్యులు అతన్ని ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి పెంపుడు కుక్క కాటు కారణంగా సెప్సిస్ అనే అంటువ్యాధి సోకిందని వైద్యులు తేల్చారు. అంటువ్యాధి కారణంగా జాకోనెల్ రెండు కాళ్లు మోకాలి భాగం వరకు తొలగించేశారు. కుడిచేతి వేళ్లు, ముక్కు భాగాన్ని సైతం తొలగించాల్సి వచ్చింది. జాకోనెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బయటకు వెళ్లడానికి కొంచెం బెరుగ్గా ఉందన్నారు. అయినా ఎవరీ మీద ఆధారపడకుండా బతకుతానని, తన రూపం మొత్తం తుడిచిపెట్టుకుపోవడమే కొద్దిగా బాధ కలిగిస్తోందన్నారు. -
కుక్క తెచ్చిన అంటురోగం.. రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు
-
మోహిత్ ధాటికి బ్లూస్ విలవిల
సాక్షి, హైదరాబాద్: మాంచెస్టర్ పేసర్ మోహిత్ కుమార్ (5/15) నిప్పులు చెరిగే బౌలింగ్తో ఆక్స్ఫర్డ్ బ్లూస్ బ్యాట్స్మెన్ను వణికించాడు. ఎ–డివిజన్ రెండు రోజుల లీగ్లో మాంచెస్టర్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి రోజు మాంచెస్టర్ జట్టు 263 పరుగుల వద్ద ఆలౌటైంది. మహేశ్వర్ (62) రాణించగా, అశ్వద్ రాజీవ్ 6 వికెట్లు తీశాడు. తర్వాత రెండో రోజు బుధవారం లక్ష్యఛేదనకు దిగిన అక్స్ఫర్డ్ బ్లూస్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. మోహిత్తో పాటు, విజేందర్ (4/13) ధాటికి ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు మెగా సిటీ: 120/8 (అర్జున్ 3/13), బాలాజీ సీసీ: 121/2 (సిద్ధార్థ్ నాయుడు 65, వంశీ రాఘవ్ 45). జిందా తిలిస్మాత్: 452/9 డిక్లేర్డ్ (అసదుద్దీన్ 132; మొయిజ్ ఇక్బాల్ 88 నాటౌట్, అజార్ అలీ 90, రాజ్ మిశ్రా 56; క్రౌన్ సీసీ: 158 (పియూష్ జోషి 36; విష్ణు చైతన్య 3/40). క్లాసిక్ సీసీ: 151, ఉస్మానియా: 120 (నవీన్ కుమార్ 37; శ్రీనికేత్ 3/33). -
పేలుడు పదార్థాలను ఒక్కడే సీక్రెట్గా కొని..!
మాంచెస్టర్/లండన్: పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్పై జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో మాంచెస్టర్ నగర పోలీసులు ఇప్పటికే 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుడి దాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సల్మాన్ అబేదిగా పోలీసులు ఇదివరకే గుర్తించారు. అయితే నిందితుడు బాంబు పేల్చడానికి కావలసిన సామాగ్రిని తానొక్కడే కొనుగోలు చేశాడని నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిస్టు విభాగం చీఫ్ రస్ జాక్సన్ మీడియాకు తెలిపారు. వారం రోజుల కిందట మాంచెస్టర్లో చోటుచేసుకున్న ఈ మారణకాండలో చిన్నారులు సహా 22 మంది మృతిచెందగా, 116 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడే నాలుగు రోజుల ముందే మాంచెస్టర్లో సల్మాన్ అబేది అడుగుపెట్టాడు. ఈ సమయంలో పేలుడు పదార్థాలను పలు ఏరియాలలో తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసి ప్లాన్ ప్రకారమే మారణహోమం సృష్టించాడని జాక్సన్ వెల్లడించారు. దాడికి ముందు అతడు ఎవరెవరికీ ఫోన్ చేశాడు.. ఏ విషయాలపై చర్చించాడన్న దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్లూ సూట్కేసులో బాంబుతో సహా మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతానికి వచ్చి పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్లోనే అతి పెద్దదని, భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించాలన్న లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిటన్కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్ నుంచి మాంచెస్టర్కు నాలుగు రోజుల ముందుగానే రైల్లో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రస్ జాక్సన్ పేర్కొన్నారు. దాడి చేసిన రోజే ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించగా.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
‘పిల్లలూ.. ఉగ్రవాదులకు ఓ లేఖ రాయండి’
లండన్: ‘ఉగ్రవాదులకు ఓ లేఖ రాయండి’ అంటూ బ్రిటన్లో ఇటీవల ముద్రించిన ఓ పుస్తకంలో విద్యార్థులకు ప్రశ్నగా చేర్చారు. ఉగ్రవాదులు ఎందుకు అలాంటి దాడులు చేస్తారో, అందుకుగల కారణాలు ఏమిటో విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశాల్లో ఈ విషయాన్ని చేర్చారు. ఈ పుస్తకం సరిగ్గా మాంచెస్టర్లో ఉగ్రవాద దాడి జరగడానికి వారం ముందే ప్రచురణ జరిగింది. ది నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ క్రుయెల్టీ’ అనే స్వచ్ఛంద సంస్థ తరుపున దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ వాన్లెస్ విషయాసారం అందించగా బ్రిలియంట్ పబ్లికేషన్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రించింది. ముఖ్యంగా 7 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ పుస్తకాన్ని బోధించాలని, ఒక్కో విద్యార్థిని పిలిచి ఉగ్రవాదికి ఓ లేఖ రాయండని కోరాలని, ఉగ్రవాదులను ఆరు ప్రశ్నలు అడగాల్సి వస్తే ఎలాంటి వాళ్లేం చేస్తారో వివరించాలని అందులో కోరాలని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ఈ పుస్తకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ పుస్తకం ఉగ్రవాదులపై సానుభూతి కలిగించేలా ఉందని, చిన్నారులను ప్రమాదకరంగా ఆలోచించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మాంచెస్టర్ కాలేజీలో బాంబు భయం!
నిన్న కాక మొన్నే ఒక సంగీత కార్యక్రమంలో బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ మాంచెస్టర్ నగరం మరోసారి భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నగర శివార్లలో గల ట్రాఫర్డ్ నగరంలో ఒక కాలేజీలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాంబు నిర్వీర్య దళం అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ప్యాకెట్ను గుర్తించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే అందరూ అనుమానించినట్లుగా అందులో బాంబు ఏమీ లేదని బ్రిటిష్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ నిపుణులు చెప్పారు. మాంచెస్టర్ ఎరెనాలో జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించడం, మరో 64 మంది గాయపడటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. దాంతో అనుమానాస్పద స్థితిలో ఏ వస్తువు కనిపించినా భయపడుతున్నారు. తాజాగా కాలేజి ఘటనలోనూ ఇలాగే జరిగింది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక ప్యాకెట్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆ దుర్మార్గుడి తండ్రి, సోదరుడు అరెస్టు!
ట్రిపోలి: మాంచెస్టర్ మారణహోమంపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాంచెస్టర్లో జరిగిన సంగీత కచేరిపై విరుచుకుపడి.. 22మందిని పొట్టనబెట్టుకున్న సూసైడ్ బాంబర్ సల్మాన్ అబేది తండ్రిని, సోదరుడిని పోలీసులు లిబియాలో అరెస్టుచేశారు. ట్రిపోలిలోని అయిన్జరా ప్రాంతంలో బుధవారం సల్మాన్ తండ్రి రమదాన్ అబేదిని అతని ఇంటిబయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సల్మాన్ సోదరుడు హషీం అబేదిని కూడా అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందం ‘రదా’ వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. హషీం అబేదికి కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతడు సోదరుడు సల్మాన్తో పలుసార్లు సంప్రదింపులు జరిపాడని, లిబియా రాజధాని ట్రిపోలిలో ఉగ్రవాద దాడులు జరపాలని అతను పథకం రచించినట్టు తెలుస్తున్నదని చెప్పారు. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్లో సంగీత కచేరి నిర్వహిస్తుండగా ఉగ్రవాది సల్మాన్ అబేదీ అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్లోనే పుట్టి పెరిగారు. -
‘మాంచెస్టర్’లో నలుగురి అరెస్ట్
-
‘మాంచెస్టర్’లో నలుగురి అరెస్ట్
► మారణహోమం ఘటనలో 119కి పెరిగిన క్షతగాత్రులు ► మరిన్ని దాడులు జరగొచ్చని నిఘా వర్గాల అనుమానం లండన్: మాంచెస్టర్ మారణహోమం కేసులో మరో నలుగురిని బ్రిటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి మొత్తం సంఖ్య ఐదుకు చేరింది. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. బుధవారం దక్షిణ మాంచెస్టర్లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్లోనే పుట్టి పెరిగారు. ఇటీవల పలుసార్లు లిబియా, సిరియాలకు వెళ్లి వచ్చాక ఉగ్రవాదులుగా మారారని బ్రిటన్ అధికారులు తెలిపారు. దాడి అనంతరం సల్మాన్ సిరియాకు వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మాంచెస్టర్ పేలుళ్లతో పలువురు ఇతరులకు కూడా సంబంధం ఉందనీ, సల్మాన్ ఒక్కడే ఈ దాడి చేసి ఉండడని పోలీసులు, బ్రిటన్ హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బ్రిటన్లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సమాచారం రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. -
మాంచెస్టర్లో మారణహోమం
-
మారణహోమం
⇒ మాంచెస్టర్లోని మ్యూజిక్ కన్సర్ట్పై ఆత్మాహుతి దాడి ⇒ 22 మంది మృత్యువాత, 59 మందికి తీవ్ర గాయాలు ⇒ దుండగుడు సల్మాన్ అబేదీగా గుర్తింపు ⇒ మాదే బాధ్యత అని ప్రకటించుకున్న ఐసిస్ ⇒ మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిక ⇒ ఇది వికృతమైన ఉగ్ర దాడి: థెరిసామే ⇒ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు ⇒ మనవాళ్లు క్షేమం.. ‘హెల్ప్ లైన్లు’ ఏర్పాటు ⇒ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్ కన్సర్ట్.. యువతీయువకుల కేరింతలు, పాప్ స్టార్ అరియానా గ్రాండేతో కలసి చిన్నారుల స్టెప్పులు.. మ్యూజిక్ కన్సర్ట్ ముగుస్తుందనగా ఒక్కసారిగా భారీ పేలుడు.. రక్తపుమడుగులో మృతదేహాలు.. ప్రాణభయంతో జనం పరుగులు.. బ్రిటన్లోని మాంచెస్టర్లో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినప్పటి దృశ్యాలివీ. మ్యూజిక్ కన్సర్ట్పై ఆత్మాహుతి దాడి మాంచెస్టర్/లండన్: జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్ కన్సర్ట్.. యువతీయువకుల కేరింతలు, తుళ్లింతలతో హంగామా.. పాప్ స్టార్ అరియానా గ్రాండేతో కలసి చిందులేసిన చిన్నారులు.. మ్యూజిక్ కన్సర్ట్ మరికాసేపట్లో ముగుస్తుందనగా అలజడి.. ఒక్కసారిగా భారీ తీవ్రతతో పేలుడు.. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలు.. తీవ్ర గాయాలతో నెత్తురోడిన క్షతగాత్రులు.. ప్రాణ భయంతో జనం పరుగులు.. బ్రిటన్లోని మాంచెస్టర్లో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినప్పటి దృశ్యాలివీ. బ్రిటన్లోని పారిశ్రామిక నగరం మాంచెస్టర్ నెత్తురోడింది. యూరోప్లోనే అతిపెద్ద ఇండోర్ ఎరీనా అయిన మాంచెస్టర్ ఎరీనాలో పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా ఒక దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 22 మంది యువతీయువకులు, చిన్నారులు మృత్యువాత పడగా.. మరో 59 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకే దుండగుడు భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను తీసుకుని కన్సర్ట్ జరుగుతున్న మాంచెస్టర్ ఎరీనా వెలుపలకు వచ్చి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. 2005లో లండన్వరుస బాంబు దాడుల తర్వాత బ్రిటన్లో జరిగిన అతి ఘోరమైన ఉగ్ర దాడి ఇదే. మేమే దాడి చేశాం: ఐసిస్ ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ఇకపై ఇలాంటి మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ‘‘నిబద్ధత కలి గిన ఒక సైనికుడొకరు జన సమూహం ఉన్న చోట బాంబులు పెట్టాడు’’అంటూ తమ సోష ల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసింది. కాగా ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సల్మాన్ అబేదిగా గుర్తించారు. గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిట న్కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్ నుంచి మాంచెస్టర్కు రైల్లోకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వేగంగా కేసు దర్యాప్తు.. దాడికి సంబంధించి దర్యాప్తును వేగంగా నిర్వహిస్తున్నామని, ఉగ్రవాద కోణంలోనూ ముందుకువెళుతున్నామని, దాడికి ఒక్కరే పాల్పడ్డాడా లేక.. దీని వెనుక ఏదైనా నెట్వర్క్ ఉందా అనే దానిపై దృష్టిసారించామని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఘటనాస్థలంలోనే మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా, సౌత్ మాంచెస్టర్లోని కార్ల్టన్లో ఈ దాడితో సంబంధం ఉందని భావిస్తున్న 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాంచెస్టర్ ఎరీనా అంతా పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. సాధారణ ప్రజలను ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. బాంబ్ డిస్పోజల్ బృందాలను కూడా రంగంలోకి దించారు. పాశవికమైన ఉగ్రవాద చర్య: బ్రిటన్ ప్రధాని మాంచెస్టర్ ఉగ్ర దాడిని బ్రిటన్ ప్రధాని థెరిసామే తీవ్రంగా ఖండించారు. అత్యంత పాశవికమైన ఉగ్రవాద చర్యగా దీనిని అభివర్ణించారు. దాడి తర్వాత అత్యవసరంగా కోబ్రా(కేబినెట్ ఆఫీస్ బ్రీఫింగ్ రూమ్స్) సమావేశంలో ఆమె పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఒకే ఉగ్రవాది ఇంట్లో చేసిన అత్యంత శక్తివంతమైన బాంబుతో దాడికి పాల్పడినట్టు ఆమె వెల్లడించారు. కన్సర్ట్ ముగిసే సమయం కా>వడంతో జనం అప్పడే బయటకు వస్తున్నారని, ఆ సమయంలో దాడికి పాల్పడటంతో ఎక్కువ మంది గాయపడ్డారని వివరించారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ 2 ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాంచెస్టర్ దాడిని తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఉగ్ర దాడి నేపథ్యంలో బ్రిటన్ సాధారణ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. ప్రధాని థెరిసామే, లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బైన్ ఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. భారతీయులంతా క్షేమం: కేంద్రం మాంచెస్టర్ ఉగ్ర దాడిలో భారతీయులెవరూ మరణించలేదని, గాయపడలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ భారతీయులకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో వెల్లడించారు. ఉగ్రదాడిలో భారతీయులెవరైనా చిక్కుకుంటే వారి కోసం భారత హై కమిషన్ సహాయ విభాగంతో పాటు బాధితులు 020 76323035ను సంప్రదించవచ్చని అవసరం మేరకు మరిన్ని హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తామని భారత హైకమిషన్ తెలిపింది. మాంచెస్టర్ ఉగ్రదాడి బాధితులకు సాయమందించేందుకు సిక్కు గురుద్వారాలు ముందుకొచ్చాయి. బాధితుల కోసం ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు అందించాయి. పాప్ స్టార్ గ్రాండే సేఫ్.. పాప్ స్టార్ గ్రాండే తన షోను ముగించుకుని, స్టేజ్ దిగిన తర్వాత దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఈ దాడిలో అరియానా గ్రాండేకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె సురక్షితంగా ఉన్నారని గ్రాండే అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘మాంచెస్టర్ దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. నన్ను క్షమించండి’’అంటూ గ్రాండే ట్విట్టర్లో తన భావోద్వేగాన్ని వెల్లడించింది. మాంచెస్టర్ దాడి నేపథ్యంలో తన ప్రపంచ టూర్ను గ్రాండే రద్దు చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 7/7 దాడిని గుర్తు చేస్తూ.. రెండు నెలల క్రితం లండన్లో పార్లమెంటుకు సమీపంలో ఓ దుండగుడు వ్యాన్తో దూసుకువచ్చి నలుగురిని చంపడమే కాక.. కత్తితో దాడి చేసి ఓ పోలీసు అధికారిని హత్య చేసిన విషయం తెలిసిందే. 2005 జూలై 7న లండన్లో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 52 మంది మృత్యువాత పడగా.. 700 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. దుండగుడు సల్మాన్ అబేది ఇల్లు దాడికి కొన్ని గంటల ముందు మాంచెస్టర్ ఎరీనాలో ఉగ్ర దాడి జరగనుందంటూ ఓ ట్వీటర్ అకౌంట్లో చేసిన పోస్ట్ -
చాంపియన్స్ ట్రోఫీ భద్రతపై పునస్సమీక్ష
మాంచెస్టర్లో పేలుడు అనంతరం ఐసీసీ దుబాయ్: వచ్చే నెలలో ఇంగ్లండ్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ, మహిళల ప్రపంచకప్ భద్రతా ఏర్పాట్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోసారి సమీక్ష చేయనుంది. మాంచెస్టర్లో సోమవారం జరిగిన పేలుడులో 22 మంది మరణించారు. దీంతో ఐసీసీ కూడా అలర్ట్ అయ్యింది. అయితే మ్యాచ్లు జరిగే వేదికల్లో మాంచెస్టర్ లేకపోయినప్పటికీ ఎలాంటి పొరపాట్లకు తావీయకూడదని నిర్ణయించుకుంది. ‘మా టోర్నమెంట్ భద్రతా డైరెక్టరేట్ సలహా ప్రకారం ఈ రెండు టోర్నమెంట్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అధికారులతో కలిసి రక్షణ ఏర్పాట్లపై సమీక్షిస్తాం. మాంచెస్టర్ దాడుల్లో మృతి చెందిన వారికి సానుభూతి తెలుపుతున్నాం’ అని ఐసీసీ పేర్కొంది. జూన్ 1 నుంచి 18 వరకు చాంపియన్స్ ట్రోఫీ... జూన్ 24 నుంచి జూలై 23 వరకు మహిళల ప్రపంచకప్ ఇంగ్లండ్లోనే జరగనున్నాయి. -
మాంచెస్టర్పై పంజా
ఇటీవల కాస్త సద్దుమణిగినట్టు కనిపించిన ఉగ్రవాద సర్పం మళ్లీ కాటేసింది. అనేక భారీ పరిశ్రమలున్న బ్రిటన్లోని మాంచెస్టర్లో సోమవారం రాత్రి పాప్ స్టార్ అరియానా గ్రాండే నేతృత్వంలో నిర్వహించిన ఒక సంగీత విభావరి కార్యక్రమంపై ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 22మందిని బలి తీసుకున్నాడు. ఈ దాడిలో మరో 59మంది గాయాలపాలయ్యారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్లోనే అతి పెద్దది. ఈ కార్యక్రమానికొచ్చినవారిలో అత్యధికులు యువత, పిల్లలే. తాము దాడి చేయదల్చుకుంటే ఎవరూ ఆపలేరని... ప్రపంచంలో ఎక్క డైనా, ఎప్పుడైనా భారీయెత్తున ప్రాణనష్టం కలిగించగల సత్తా తమకున్నదని ఉగ్ర వాదులు నిరూపించారు. ఫ్రాన్స్లో రెండేళ్లక్రితం ఒక సాకర్ పోటీ సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడి 128మంది ప్రాణాలు తీశారు. ఆ ఏడాదే చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడిచేసి 15మందిని కాల్చిచంపారు. 2004లో స్పెయిన్ లోని మాడ్రిడ్లో రైళ్లలో బాంబులు పేల్చి 200మంది ఉసురుతీశారు. భద్రతలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా కోలుకోలేని స్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని తాజా ఉదంతం మరోసారి హెచ్చరిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని, అందుకు అవిశ్రాంతంగా పోరాడతామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణ మాత్రం సంతృప్తికరంగా లేదని మాంచెస్టర్ ఉదంతం నిరూపిస్తోంది. భారీ సంఖ్యలో జనం హాజరయ్యేచోట, కిక్కిరిసి ఉండే వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం, అందరిపైనా కన్నేసి ఉంచడం కష్టమే కావొచ్చుగానీ గరిష్టంగా భద్రతా ఏర్పాట్లు, పటిష్టమైన నిఘా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి. ఇది తమ ఘన కార్యమేనంటూ ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సాధారణ అర్ధంలో ఒక సంస్థ కాదు. దానికొక స్వరూపమంటూ లేదు. నాయకుడని ప్రకటిం చుకున్న వ్యక్తి ఉండొచ్చు. తమదొక రాజ్యమని చెప్పుకోవచ్చు. ఇరాక్–సిరియా సరిహద్దుల్లో అరాచకం రాజ్యమేలుతున్నచోట వారికంటూ కొంత ప్రాంతం కూడా ఉండొ ఉండొచ్చు. కానీ నేతలు, శ్రేణుల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమనే విధానమేదీ కనబడదు. అయినా అత్యంత సులభంగా యూరప్లో ఏదో ఒక దేశంలో ఎప్పుడో ఒకప్పుడు దాడి చేయగలుగుతున్నారంటే అది భద్రతా సంస్థల వైఫల్యం ఫలితమే. సాంకేతిక విజ్ఞానం పెరిగి సామాజిక మాధ్యమాలు విస్తరించినచోట ఏ భావ జాలమైనా వేగంగా చొచ్చుకుపోవడం వింతేమీ కాదు. ఆ మాధ్యమాలను ఆలంబన చేసుకునే ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ విధ్వంసక చర్యలు కొనసాగి స్తున్నాయి. యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, అనేక ఇతర మాధ్యమాల్లో జిహాదీల ప్రసంగాలకు కొదవలేదు. ఉగ్రవాదులు ఉన్మాదంతో రెచ్చిపోయి తోటి మనుషులపై అత్యంత క్రూరంగా దాడులు చేసిన వీడియోలు కూడా ప్రచారంలో ఉంటున్నాయి. ఇలాంటివన్నీ వ్యక్తులుగా చీలిపోయిన సమాజాల్లో సులభంగా విషబీజాలు నాటుతున్నాయి. స్వీయ సమస్యలతో సతమతమయ్యే యువతలో అర్ధంలేని ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. తమ అసంతృప్తి దేనికో, ఆగ్రహం ఎవరిపైనో తెలియకుండానే ప్రతీకార వాంఛను రగిలిస్తున్నాయి. ఒకే ఇంట్లో నివసిస్తున్నవారి మధ్య అంతులేని అగాధం ఉంటుంటే ఇక ఇరుగు పొరుగు సంబంధాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇలాంటిచోట ఒక సెల్ఫోను లేదా ల్యాప్టాప్ ఉగ్రవాదానికి వాహికలవుతున్నాయి. ఉగ్రవాదంపై పోరు పేరిట దారీ తెన్నూలేని చర్యల పరంపరకు తెరలేపిన అమెరికాను దీనంతటికీ తప్పుబట్టాలి. 2001 సెప్టెంబర్లో న్యూయార్క్లోని జంట హర్మ్యాలపై అల్కాయిదా ఉగ్ర వాదులు దాడి జరిపాక ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ బ్రిటన్తో కలిసి అప్ఘానిస్తాన్లో దాడులు ప్రారంభించారు. అంతేకాదు... దానితో ఏమాత్రం సంబంధం లేని ఇరాక్పై రసాయన ఆయుధాలున్నాయనే సాకుతో యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. మరిన్ని లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. సోమాలియా, లిబియా, యెమెన్ లాంటి దేశాల్లో మూలమూలనా ద్రోన్ దాడులు జరిపారు. జరుపుతూనే ఉన్నారు. వాటిల్లో ఉగ్ర వాదులు పదుల సంఖ్యలో మరణిస్తే, అమాయక పౌరులు వందలాదిమంది చనిపోయారు. మాంచెస్టర్ దాడి తర్వాత నగరవాసులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి మెచ్చ దగ్గది. ఈ ఘటన తర్వాత రైల్వే స్టేషన్ను మూసివేస్తున్నట్టు ప్రకటించడం, దుకా ణాలు సైతం మూతబడటంతో రాత్రి వేళ గమ్యస్థానాలకు ఎలా చేరాలో తెలియక వేలాదిమంది సతమతమయ్యారు. ఆ సమయంలో తమ నివాసాల్లో తలదాచు కోవచ్చునని కొందరు... తమ ఇంటికి వస్తే కాఫీ, టీ, ఇతర పానీయాలు, ఆహారం వగైరాలున్నాయంటూ మరికొందరు ట్వీట్లిచ్చారు. మీరున్న చోటునుంచి అయిదు నిమిషాల్లో రావొచ్చునని తోవ చూపారు. ఆఖరికి క్యాబ్ డ్రైవర్లు సైతం ఉచితంగా తమ వాహనాల్లో ఎవరి ఇళ్లకు వారిని చేరుస్తామని భరోసా ఇస్తూ టెలిఫోన్ నంబర్లు ఇచ్చారు. దీన్నంతటినీ గమనించాక ఒక హోటల్ యాజమాన్యం సైతం ఘటనలో తల్లిదండ్రులనుంచి తప్పిపోయిన పిల్లలకు ఆశ్రయం కల్పించింది. తమ చర్యల ద్వారా సమాజంలో పరస్పర అపనమ్మకాలనూ, విద్వేషాలనూ రగల్చడం ఉగ్రవా దుల ధ్యేయం. ప్రభుత్వాధినేతలు సైతం ఇలాంటి సందర్భాల్లో సంయమనం కోల్పోయి ప్రకటనలు చేయడం ద్వారా వారి ధ్యేయాన్ని నెరవేరుస్తున్నారు. కానీ సామాన్య పౌరులు ఎంతో పరిణతి ప్రదర్శించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని వమ్ము చేయడం ఉపశమనం కలిగిస్తుంది. మాంచెస్టర్ పౌరులు తెరిచి ఉంచింది తమ ఇళ్ల తలుపుల్ని కాదు... తమ విశాల హృదయాలనూ, మనసులనూ! ఇంతటి ఔదా ర్యంతో ప్రపంచ పౌరులకు మార్గ నిర్దేశం చేసి, సంక్షోభ సమయాల్లో ఎలా మెల గాలో, సౌహార్దాన్ని ఎలా పంచాలో తెలియజెప్పినందుకు మాంచెస్టర్ పౌరులను ప్రశంసించాలి. తాజా ఉగ్రవాద దాడి మన అలక్ష్యాన్ని అంతమొందిస్తుందని, మన అప్రమత్తతను మరింతగా పెంచుతుందని ఆశిద్దాం. -
మాంచెస్టర్లో ఉగ్రదాడి