Masks
-
అదానీ, మోదీ పాత్రధారులతో... రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు. ‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు. -
కేరళలో నిపా వైరస్ కలకలం..!
కేరళలో నిపా వైరస్ కలకలంతో ఒక్కసారిగా యావత్తు రాష్ట్రం ఉలిక్కిపడింది. వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా ఆరోగ్య కేంద్రాలను అలర్ట్ చేసింది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా బారిన పడ్డాడు. పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు. ప్రస్తుతం అతను ఒక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతన్ని అక్కడ నుంచి కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తారని అన్నారు. అతన్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హైరిస్క్ కాంటాక్ట్లు ఇప్పటికే వేరుచేసి నమునాలను పరీక్ష కోసం పంపినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్ల పేర్కొన్నారు వైద్యులు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సమీప ఆస్పత్రులన్నింటిలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు మాస్క్ ధరించాలని, రోగులు ఆస్పత్రులను సందర్శించే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. అంతకుమునుపు ఆస్ట్రేలియా నుంచి సేకరించి పూణే ఎన్ఐవీలో నిల్వ ఉంచిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు. ఆ బాధిత చిన్నారి పాండిక్కాడ్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు కేరళ అధికారులు. అంతేగాదు ఆయా సమీప ప్రాంతాల్లోని ప్రజలు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమీప మంజేరి వైద్య కళాశాలలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసింది. అంతేగాక నిపా వైరస్ సోకిన బాలుడితో పరిచయం ఉన్నవారందరినీ ఐసోలేషన్లో ఉంచారు. పైగా అంటువ్యాధి నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేసేలా ఆరోగ్య కేంద్రాలను కూడా ఆదేశించారు అధికారులు. నిపా వైరస్ లక్షణాలు..తీవ్రమైన తలనొప్పిఅలసటవాంతులుబలహీనత మూర్ఛ, చూపు మందగించడంతో పాటు జ్వరంఈ వ్యాధి శరీర ద్రవాల ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది.పాటించాల్సిన జాగ్రత్తలు..సాధ్యమైనంత వరకు చేతులను వీలైనన్ని సార్లు కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులను సందర్శించటం, అంటువ్యాధులు ప్రబలే ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. పక్షులు లేదా జంతువులు సగం తిన్న లేదా కరిచిన పండ్లను తినకూడదు. అలాగే పండ్లను సరిగ్గా కడిగితినాలి. బహిరంగ కంటైనర్లలో నిల్వ ఉంచిన కల్లు వంటి పానీయాలను తీసుకోకూడదు వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.డాక్టర్ ఎమ్.ఎల్. నీహారిక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ (చదవండి: వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?) -
Celebrities In Face Masks: కరోనా టైమ్లో మాస్క్లు ధరించిన నటీనటుల ఫోటోలు మళ్లీ వైరల్ (ఫొటోలు)
-
ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే..!
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశంలో ఇన్ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో మార్చి 9 వరకు హెచ్3ఎన్2 సహా మొత్తం 3,038 ఇన్ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇన్ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), హెచ్3ఎన్2, సీజనల్ ఇన్ఫ్లూయెంజా- బీ వైరస్ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 ఇన్ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు. లక్షణాలు ఇలా.. ఇన్ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..!
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు, పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు. భారత్లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్ -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇకపై అక్కడ మాస్క్ తప్పనిసరి!
బెంగళూరు: చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. పండగలు, కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా నాలుగో వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్లు, రెస్టారెంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీ మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని కోరారు. యూపీలో అలర్ట్.. ఉన్నావ్కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్గా తేలిన క్రమంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. అంతకు ముందే పరీక్షలు చేసుకోగా ప్రస్తుతం పాజిటివ్గా తేలింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. చైనా నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్గా తేలిన మరుసటి రోజునే ఈ విషయం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్లు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని కోరారు. ఇదీ చదవండి: చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు! -
మాస్కులు త్వరలో పోతాయి
వాషింగ్టన్: అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం లేని రోజులు త్వరలో వస్తాయని ఆ దేశ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి జోస్యం చెప్పారు. అది రెండు నెలల్లో, ఆర్నెల్లలో, లేదా ఓ ఏడాదిలో కావచ్చన్నారు. అలాగని వ్యక్తిగత జాగ్రత్తలను పక్కన పెట్టడం అంత మంచిది కూడా కాదని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అసోసియేటెడ్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కరోనా వంటి పెను మహమ్మారి రాత్రికి రాత్రే మాయమైపోదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పాత, లేదా కొత్త వేరియంట్లు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ దానికి భయపడకుండా మళ్లీ స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కరోనాపై పోరాడేందుకు ఏడాదిగా మనం తయారు చేసుకున్న నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లు, బూస్టర్లు అందరికీ సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉండాలి. అప్పుడు కరోనా మరణాలను దాదాపుగా తగ్గించుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. యువతపై ప్రభావం యువత మానసిక ఆరోగ్యంపై కరోనా చాలా ప్రభావం చూపుతోందని భారత సంతతికి చెందిన మూర్తి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయమిది. మానసిక ఆరోగ్య నిపుణుల సాయంతో వారికి దన్నుగా నిలవడం చాలా అవసరం’’ అన్నారు. కరోనా తెరపైకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికాలో నల్ల జాతీయులకు, లాటిన్, నేటివ్ అమెరికన్లకు వ్యాక్సిన్ల లభ్యత అంతగా ఉండేది కాదన్నారు. తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు. -
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
Jawahar Nagar Dumping Yard: వాడిన మాస్కులతో పొంచి ఉన్న ప్రమాదం
ముందు తరాలకు భద్రమైన, ఆరోగ్యకరమైన భూ గ్రహాన్ని ఇవ్వాల్సిన మనం... ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న çసంక్షోభాన్ని మీ దృష్టికి తేవాలను కుంటున్నాను. కోవిడ్–19 వ్యాప్తి సమయంలో మాస్క్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అందుకే మాస్కులను మనం తరచుగా కొంటున్నాం. అయితే ఇలా కొని వాడిపారేస్తున్న అసంఖ్యాక మాస్కులు మొత్తం ప్రపంచ మనుగడకే ప్రమాద కరంగా మారాయి. ఎక్కడ చూసినా వైరస్ వ్యాప్తిని పెంచడానికి ఆస్కారమున్న అసంఖ్యాక మాస్కులు కనిపిస్తున్నాయి. ఇవి నీటివనరులు, నేలలను కలు షితం చేస్తున్నాయి. ఫలితంగా అనేకమంది అనారోగ్యం పాలవు తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పని వారి పాలిట ఈ మాస్కులు ఉరితాళ్లలా తయారౌతున్నాయి. పిల్లల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ జవహర్ నగర్ను ఆను కొని ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డు ప్రాంతం ప్రపంచంలోని అణగారిన నిరుపేద పిల్లల జీవితా ల్లోని ఒక అధ్యాయానికి ప్రతిబింబంగా నిలిచింది. సింగిల్ యూజ్ వేరియెంట్లలో ఉండే పాలీ ప్రొపైలీన్లు నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నం అయ్యేవరకు మాస్కులు అలాగే ప్రకృతిలో ఉండిపోయి పర్యా వరణానికి తీవ్రమైన హానిని కలుగజేస్తాయి. ఇవి విచ్ఛిన్నమై భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఫలితంగా çపర్యావరణం తీవ్ర విషా దాన్ని చవిచూడవలసి ఉంటుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని చుట్టుపక్కల 95 మురికివాడలు ఉన్నాయి. ఇందులో 25 చోట్ల ప్రజలు ప్రత్యక్షంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గాలి, భూగర్భజలాలు రెండూ విషపూరితం అవుతు న్నాయి. పిల్లలు వైకల్యాలతో జన్మిస్తున్నారు, వృద్ధులు తీవ్రమైన అనారోగ్యం పాలవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ‘సంస్థాగత’ నిర్లక్ష్యమే. డంపింగ్ యార్డ్పై ఆధారపడి జీవించే అర్భ కులు చాలామంది ఇక్కడ జీవిస్తున్నారు. ఇందులో చాలామంది యార్డులో డంప్ చేసే (మెడికల్ సబంధ మైనవి కూడా) అనేక వ్యర్థాలను సేకరించి బతుకు తున్నారు. పారిశుద్ధ్య పని ఒక వృత్తిగా జీవించే సామాజికంగా వెనకబడిన వర్గాలవారికి.. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పారవేసే మాస్కులు పెద్ద ప్రమాదంగా పరిణమించాయి. మిగతా వ్యర్థాలతో పాటూ వాటినీ గ్లౌజులు వంటి ఎటువంటి రక్షణ కలి గించేవి ధరించకుండానే ఉత్త చేతులతో తొలగిం చవలసిన ఉద్యోగం వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రస్తుత మాస్క్ స్థానంలో బయో–డీగ్రేడబుల్ వేరియెంట్లతో తయారైన వాటిని ప్రవేశపెట్టగలిగితే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశం గరిష్ఠంగా వారానికి 4.64 బిలియన్ మాస్క్ వ్యర్థా లను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే... ఈ మాస్కుల ఉత్పత్తికి వారానికి 12.258 టన్నుల పాలీ ప్రొపైలీన్ని వాడుతూ ప్రపపంచంలోనే మొదటి ర్యాంకులో భారత్ నిలిచింది. శస్త్రచికిత్స సమయంలో వాడే మాస్కుల కంటే ఎన్–95 మాస్కుల్లో పాలీ ప్రొపైలీన్ రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఉపయోగించే పాలీప్రొపైలీన్ డీకంపోజ్ అవ్వడానికి 450 సంవత్సరాలు పడు తుంది. వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఎటువంటి రక్షణ లేని మనుషులకు బదులు యంత్రాలను ఉప యోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మను షులే పనిచేయవలసివస్తే వారికి తగిన రక్షణ సామగ్రిని అందించవలసి ఉంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్నవారిపట్ల మరికొంత దయాశీలంగా ఉండటం మన కర్తవ్యం. మనల్ని నిరంతరం భద్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు రేపటి తరానికి తల్లిదండ్రులే అన్న ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. – జాన్ రాబర్ట్స్ (‘మిలీనియం పోస్ట్’ సౌజన్యంతో) -
MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్ నడిరోడ్డుపై కారు ఆపి..
చెన్నై: కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన పంజా విసురుతోంది. భారత్లోనూ కరోనా కేసులు ఉదృతంగా నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్ ధరించకుండా బయకటు వచ్చిన వారికి పోలీసులు ఫైన్ కూడా విధిస్తున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ మంగళవారం చెన్నై వీధుల్లో మాస్కులు పంపిణీ చేస్తూ కనిపించారు. చదవండి: (28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..) రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం స్టాలిన్ మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్తుండగా, కొంతమంది బహిరంగంగా మాస్కులు ధరించకపోవడాన్ని గమనించారు. వెంటనే రోడ్ పైనే కారు ఆపిన సీఎం.. స్థానికంగా ఉన్న వారికి స్వయంగా మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అందరూ మాస్క్లు ధరించాలంటూ సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం స్టాలిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రే కొందరికి మాస్క్ పెడుతూ కనపడుతున్నారు. చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..) தலைமைச் செயலகத்திலிருந்து முகாம் அலுவலகம் திரும்புகையில், சிலர் பொது இடங்களில் முகக்கவசம் அணியாமல் இருப்பதை கவனித்தேன். அவர்களுக்கு முகக்கவசம் வழங்கினேன். அனைவரும் தயவுசெய்து முகக்கவசம் அணியுங்கள்! தடுப்பூசி- முகக்கவசம்- கிருமிநாசினி- தனிமனித இடைவெளி ஆகியவற்றை கடைப்பிடிப்பீர்! pic.twitter.com/Xex4Nk9jh5 — M.K.Stalin (@mkstalin) January 4, 2022 కాగా దేశంలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులోనూ కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అత్యంత కీలకం కావడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం పలు ఆంక్షలను కూడా విధించింది. -
భయం వద్దు.. భద్రత వీడొద్దు
సాక్షి, అమరావతి: ‘ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదు. విదేశాలతో పోలిస్తే భారత్లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మాత్రం ముఖ్యం. వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు భద్రత చర్యలు తీసుకోవాలి. అలసత్వం వద్దు’ అని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. భారత దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి: ఒమిక్రాన్ వ్యాప్తి ఏ విధంగా ఉంది? డాక్టర్ శ్రీనాథ్రెడ్డి: విదేశాలతో పోలిస్తే భారత్లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. విదేశాల్లో వాతావరణ పరిస్థితులు, రోగ నిరోధక శక్తి వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. భారత్తో పోలిస్తే విదేశాల్లో ప్రజల సగటు వయసు ఎక్కువ. మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో 6 శాతమే. అదే ఇటలీలో 27 శాతం, అమెరికాలో 16 శాతం. ఇలా చాలా దేశాల్లో మనకన్నా ఎక్కువగా ఉంది. దీనికి తోడు రక్తపోటు, మధుమేహం తరహా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రభావితులు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. అందువల్లే అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో వాతావరణం, రోగ నిరోధక శక్తి, ఇతరత్రా అంశాల కారణంగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండదు. సాక్షి: కరోనా నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పించినట్టు గతంలో వెల్లడైంది. ఒమిక్రాన్ నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పిస్తాయా? శ్రీనాథ్రెడ్డి: యాంటీబాడీలు తగ్గినప్పటికీ టీ లింఫోసైట్స్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబాడీలు మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గుతున్నాయి. కొందరిలో 9 నెలలు ఉంటున్నాయి. టీకాలు వేసుకున్న వారితో పోలిస్తే గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో టీ లింఫోసైట్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పోలీస్లా వ్యవహరిస్తాయి. వైరస్లు, బాక్టీరియాలు దాడి చేసినప్పుడు వాటిని నియంత్రిస్తాయి. సాక్షి: యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉందా? శ్రీనాథ్రెడ్డి: క్యాన్సర్, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు, పౌష్టికాహారం తీసుకోని వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయి. అందువల్లే ప్రభుత్వం 60 ఏళ్లు పైబడి, జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసు టీకా పంపిణీ చేపట్టబోతోంది. వారందరూ ఈ టీకా వేయించుకుంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం టీకా పంపిణీ చేయబోతోంది. అపోహలు వీడి అందరూ టీకా తీసుకోవాలి. సాక్షి: ఒమిక్రాన్తో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా? శ్రీనాథ్రెడ్డి: ఢిల్లీ, మహారాష్ట్ర, సహా పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడంలేదు. పెద్దగా ఆసుపత్రులపై ఒత్తిడి లేదు. విదేశాల్లో డెల్టా, ఒమిక్రాన్ కలిసిన కేసులు నమోదవుతుండటంతో అక్కడ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి: ఒమిక్రాన్ నేపథ్యంలో ఎటువంటి మాస్క్లు ధరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీనాథ్ రెడ్డి: ఆస్కారం ఉన్న వాళ్లు ఎన్ 95 మాస్క్లు వాడితే మంచిది. లేని పక్షంలో డబుల్ లేయర్ మాస్క్లు సురక్షితం. గుడ్డ, సర్జికల్ మాస్క్లు ఏవైనా సరే డబుల్ లేయర్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే సంక్రాంతి నాటికి కేసుల సంఖ్య పెరుగుతుంది. -
Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?. ప్రతీకాత్మక చిత్రం మధ్యవర్తులే కారణం.. హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మాదేం లేదు కరోనా మొదటి, రెండో వేవ్ల టైంలో తెలంగాణలో మాస్క్ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం స్టాక్ వివరాలు ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే 3 పొరల మాస్క్లు, కోటి 50 లక్షలకు పైనే పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే హోం ట్రీట్మెంట్ కిట్స్.. 8.71 లక్షలు కొసమెరుపు.. బల్క్గా త్రీ లేయర్స్ మాస్క్లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్పాత్లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు. మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్లకు వెళ్లినప్పుడు మాస్క్లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై ఫైనల్ వర్డ్ ఇదే: ఆర్బీఐ -
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ‘మహా’ టెన్షన్!!
ఇచ్చోడ: జిల్లా ప్రజలను ‘మహా’ టెన్షన్ వెంటాడుతోంది. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 50 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర నుంచి జిల్లాకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కొత్త వేరియంట్ ఎప్పుడైనా జిల్లాలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దులో కట్టడికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్, పుణె, ముంబయి లాంటి మహానగరల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు నాగ్పూర్ పట్టణం 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నాగ్పూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉండటం, విదేశాల నుంచి రాకపోకాలు సాగుతుండటం అక్కడి నుంచి జిల్లాకు నిత్యం వ్యాపార నిమిత్తం వేలాది మంది బస్సుల్లో ఇతర ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. డెల్టా వేరియంట్ కంటే పది రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడం, వార్తలు వస్తుడడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలను నియంత్రించకపోతే జిల్లాలోకి కొత్త వేరియంట్ అడుగు పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డెల్టా వేరియంట్ కూడా మహారాష్ట్ర నుంచి రాకపోకలతోనే జిల్లాలో విస్తరించిందని పేర్కొంటున్నారు. రైళ్లలో రద్దీ.. ఇటీవలే రైల్వే శాఖ పలు రైళ్లను పునరుద్ధరించింది. మహారాష్ట్ర రైళ్లు నిత్యం జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ముంబాయి, నాగ్పూర్కు ఆదిలాబాద్ మీదుగా రైళ్లు వెళ్తుంటాయి. బస్సు ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుండడం, చార్జీలు ఎక్కువగా ఉండడంతో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది. నిత్యం రైళ్లు రద్దీగానే వస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్, నాందేడ్, చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి, అకోల లాంటి పట్టణలకు, అక్కడి నుంచి ఆదిలాబాద్కు బస్సులు తిరుగుతుంటాయి. రైళ్లలో, బస్సుల్లో భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కూడా చాలామంది ధరించడం లేదు. జిల్లా చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు... జిల్లా చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నా యి. ఈ సరిహద్దుల మీదుగా జిల్లాకు నిత్యం వేల మంది వ్యాపారం, వివిధ పనులు నిమి త్తం జిల్లాకు వచ్చిపోతుంటారు. మహారాష్ట్రను ఆనుకుని జిల్లాలోని బోథ్, బజార్హత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, నార్నూర్, బేల, జైనాథ్ మండలాలు ఉన్నాయి. బోథ్ మండలం ఘన్పూర్కు మహారాష్ట్రలోని నాందేడ్ సరిహద్దు ఉంది. బేల మండలానికి చంద్రపూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. తలమడుగు మండలం లక్ష్మీపూర్కు మహుర్ సరిహద్దు ఉంది. మహుర్ నుంచి యావత్మాల్, పర్బనీ జిల్లాలకు రాకపోకాలు సాగుతాయి. మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లా నార్నూర్ మండలానికి పొరుగునే ఉంది. జిల్లాలో పలు మండలాలు మహారాష్ట్రను ఆనుకునే ఉండడంతో అక్కడి నుంచి వచ్చేవారిలో ఎవరికైనా ఒమిక్రాన్ సోకి ఉంటే వారి ద్వారా వైరస్ జిల్లా వాసులకు సోకుతుందని పలువురు పేర్కొంటున్నారు. అప్రమత్తం కాకుంటే ముప్పే.. ముందస్తుగా మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్తోపాటు రెండు డోసుల టీకా వేసుకున్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయాలని కోరుతున్నారు. రాక పోకలు సాగిస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి వివరాలు నమోదు చేయడం ద్వారా ముప్పును నియంత్రించవచ్చని అంటున్నారు. మరోవైపు వైద్యాధికారులు కూడా ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటున్నారు. బయటకు వెళ్లేవారు, ప్రయాణాలు చేసేవారు తరచుగా శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి ఒమిక్రాన్ వైరస్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలు ముందుస్తు జాగత్రలు పాటించాలి. మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే టీకాలు తీసుకోవాలి. మొదటి టీకాను తీసుకున్నావారు గడువులోగా రెండో డోస్ తీసుకోవాలి. స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్ -
దిగొచ్చిన మాస్కుల ధరలు
సాక్షి, అమరావతి: మాస్క్లు, పీపీఈ కిట్ల ధరలు దిగొచ్చాయి. కరోనా వచ్చిన తొలి రోజుల్లో వీటి కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఒక దశలో సర్జికల్ మాస్క్ను రూ.13 పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. ఇప్పుడది అక్షరాలా రూపాయి పావలా కంటే తక్కువకు దిగొచ్చిందంటే.. మాస్క్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏ స్థాయిలో వచ్చాయో అంచనా వేయొచ్చు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో మాస్క్లు, పీపీఈ కిట్లు తదితర వాటికి ఏపీఎంఎస్ఐడీసీ(రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ధరలు భారీగా దిగొచ్చాయి. ఎప్పటికప్పుడు రేట్లు తగ్గుతున్న కొద్దీ కొత్తగా టెండర్లు పిలవడం, తగ్గిన ధరలకు కొనడంతో ప్రభుత్వానికి వ్యయం భారీగా తగ్గుతోంది. పీపీఈ రూ.600 నుంచి రూ.222కు కరోనా మొదటి వేవ్లో ఒక్కో పీపీఈ కిట్ను రూ.600కు కూడా కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడది కేవలం రూ.222కే దొరుకుతోంది. దీనికంటే ముందు పిలిచిన టెండర్లో రూ.291గా ఉండేది. పీపీఈ కిట్ల టెండర్లో ఏడు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్–1(లోయెస్ట్–1) రూ.222 కాగా, ఎల్–7 రూ.261కి వేశారు. అలాగే ఎన్–95 మాస్క్లకు ఒకప్పుడు భలే గిరాకీ ఉండేది. ఒక్కో మాస్క్ రూ.140కి కూడా కొనాల్సి వచ్చింది. తాజా టెండర్కు ముందు వరకూ ఇదే ఎన్–95 మాస్క్ ధర రూ.19.37గా ఉంది. తాజాగా టెండర్లో మొత్తం 8 సంస్థలు పాల్గొనగా.. ఎల్–1 రూ.5.91కి వేసింది. కోవిడ్ వచ్చిన కొత్తలో మూడు పొరల సర్జికల్ మాస్క్ను రూ.13కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అప్పట్లో తయారీ కంపెనీలు లేకపోవడం, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాజా టెండర్లో 20 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో ఎల్–1 కేవలం రూ.1.22కే వేసింది. అలాగే రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో ఏడీ(ఆటో డిసబుల్) సిరంజిలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తాజాగా కోటి సిరంజిల కోసం టెండర్ పిలవగా ఒక్కో సిరంజి రూ.3.90కే వచ్చింది. -
మాస్కులతోనే మనుగడ!
మనం ఎలాంటి మాస్క్లు ధరిస్తున్నామన్నది లెక్కకాదు. దాన్ని సరిగా ధరిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్టే... అన్ని చోట్లా ఒకే పద్ధతి కూడా పనిచేయదు. ఎప్పుడూ మూసి ఉండి, గాలి, వెలుతురు అంతగా రాని ప్రదేశంలో మాస్క్ ధారణలో కొంత మార్పు అవసరం. అలాగే ఏసీ గదుల్లో ఇంకోలా ధరిస్తే మరింత ప్రయోజనం. కొంతమంది మాస్కు తీసి జేబుల్లో పెట్టుకుని, బయటకు వెళ్తున్నప్పుడూ లేదా నలుగురూ ఉన్న చోట ధరిస్తూ ఉంటారు. ఇలా జేబులో పెట్టుకోవచ్చా? మూడు పొరల మాస్కుతో ఎందుకు ఎక్కువ ప్రయోజనం, మూసిన గదిలో ఎన్ 95 అవసరమేమిటి, గుడ్డ మాస్కులను ఎందుకు రోజూ వేణ్ణీళ్లలో ఉతకాలి లాంటి సందేహాలకు సమాధానాలతో పాటు... అసలు మాస్కులూ, వాటి నుంచి గరిష్టప్రయోజనం పొందడమెలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మాస్కులూ, అవి ఎలా ధరించాలనే విషయంలో ఇప్పటికీ చాలామందికి అనేక రకాల అనుమానాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ఆధారంగా శాస్త్రీయంగా వాటిని ఎలా ఉపయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. మాట్లాడినా కరోనా సోకుతుందా... మాస్కుల ఉపయోగం ఏమిటో, అవి ఎందుకు వాడాలో తెలుసుకునే ముందర... కేవలం ఎదురూబొదురుగా ఉంటూ మాట్లాడినా కూడా కరోనా సోకుతుందా అనే విషయం తెలుసుకుందాం. దగ్గడం, తుమ్మడం వల్లనే కాదు... మనం మాట్లాడేటప్పుడు కూడా నోటి నుంచి తుంపర్లు వెలువడతాయి. వీటివల్లే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లను ఏరోసాల్స్గా పిలవవచ్చు. ఇవి రెండు రకాలు. ఒకటి 5 మైక్రో మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండేవి, రెండోది తక్కువ ఉండేవి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు అవి బరువుగా ఉంటాయి. దాంతో ఆ బరువుకు కింద పడిపోతాయి. అదే సన్నటివైతే చాలా దూరం వెళ్తాయి. పాటలు పాడినా (53%), మాట్లాడినా (41%) , శ్వాసలో (6%) ఇలా ప్రతిసారీ సన్నటి ఏరోసాల్స్ వెలువడతాయి. ఆరు అడుగుల దూరముండి... వారు తుమ్మినా, దగ్గినా మనకు కరోనా సోకే అవకాశం తక్కువ. సన్న తుంపర్లు ఎక్కువ దూరం పయనించకుండా నిలువరించడం కోసమే మాస్కు చాలా అవసరం. దాని వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. మూసి ఉండే ప్రదేశాల్లో... గదిలాంటి మూసి ఉండే (క్లోజ్డ్) ప్రదేశంలో గాలి బయటకు పోయే అవకాశం లేనప్పుడు / లిఫ్టు వంటి చోట్ల రోగి తుమ్మితే.. వెంటిలేషన్ లేనందువల్ల ఆ తుమ్ము నుంచి వచ్చే కణాలు అక్కడే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. ఇలా తుమ్మాక 1, 2 నిమిషాల తర్వాత లిఫ్టులో ఎవరైనా వెళ్తే, వారు అక్కడి గాలి పీల్చుకున్నప్పుడు వాళ్లకు వ్యాధి సోకవచ్చు. అదే బాగా గాలి, వెలుతురు సోకే గదిలో అయితే ఆ ఇబ్బంది ఉండదు. ఇలాంటి మూసి ఉడే ప్రదేశాల్లో మాస్క్ అవసరం మరింత ఎక్కువ. అందుబాటులో అనేక మాస్కులు ప్రస్తుతం మనకు ఎన్నో రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి.నీలిరంగు సర్జికల్ మాస్కులు, వైద్యులు ధరించే ఎన్–95 మాస్కులు, గుడ్డతో తయారై కుట్టించిన సాధారణ మాస్కులు. కంపెనీల బ్రాండెడ్ మాస్కులు ఇప్పుడు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. కరోనా తొలిదశలో ఒకేసారి అందరూ మాస్కులు వాడటం మొదలుపెట్టగానే... వైద్యరంగంలో ఉపయోగించే మాస్కుల కొరత ఒకింత తీవ్రమైంది. అయితే ఇప్పుడు అనేక రకాల మాస్కులతో పాటు... ఐదుపొరల మాస్కులంటూ టీవీ వంటి ప్రసార సాధనాల్లో ప్రచారం చేస్తున్న అనేక రకాల మాస్కులు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. రెండేసి మాస్కులు అవసరమా? ఎన్ 95 మాస్కు ధరిస్తే.. సాధారణంగా రెండోది అవసరం లేదు. కానీ సర్జికల్ మాస్కు అయితే రెండోది కూడా అవసరం. ఎందుకంటే, అది ధరించినప్పుడు పక్కల నుంచి కొంత గాలి లోపలికి వెళ్తుంది. ఆ గాలిని కూడా నిరోధించడానికి రెండో మాస్కు అవసరం. వస్త్రంతో చేసినదైనా అన్నివైపులా మూసి ఉంటే రెండోదీ అవసరం లేదు. కానీ, కొంత ఖాళీ ఉన్నా, అందులోంచి వైరస్ కణాలు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తపడాలి. ఏది మంచిది...? ఎలా వాడాలి...? సాధారణంగా యువత ఎక్కువగా బయటకు వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో తప్పక మాస్కులు ధరించాలి. వారు మూడు పొరల సర్జికల్ మాస్కు ధరించినా సరిపోతుంది. మొదట్లో ధర ఎక్కువగా ఉండటం, అవగాహన లేకపోవడంతో పేదవర్గాలకు చెందినవారు మాస్కులపై పెద్దగా దృష్టి పెట్టేవారు కారు. ఇలాంటి వారు వస్త్రంతో తయారై, కుట్టిన మాస్కులు ధరించినా పర్వాలేదు. ఇలా బయట తిరిగే యువతకూ, తరచూ బయటకు వెళ్లివచ్చే మధ్య వయసువారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. వాళ్లకు కరోనా సోకినా లక్షణాలు పెద్దగా వ్యక్తంకావు. కాబట్టి వెంటనే తెలియదు. కానీ, వారినుంచి ఇళ్లలో ఉండే పెద్దవారికి త్వరగా సోకుతుంది. అందువల్ల ఇంటి నుంచి కాలు బయటపెడితే నోరు, ముక్కును నాలుగువైపులా పూర్తిగా మూసి ఉంచేలా మాస్కు ధరించాలి. వాడకం ఎలా... వస్త్రాలతో చేసిన మాస్కులను రోజూ వేడినీళ్లలో ఉతికి, ఎండలో ఆరేయడం చాలా ముఖ్యం. వ్యాధి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, లేదా మాట్లాడినా.. వైరస్ కణాలు మాస్కు బయటివైపు ఉపరితలం మీద పడతాయి. అందువల్ల దాన్ని వేడినీళ్లలో ఉతికి, ఎండలో ఆరబెడితే చాలావరకు రక్షణ ఉంటుంది. ఎన్ 95 అంటే, 95% వరకు రక్షణ కల్పిస్తుంది. చాలామంది ఏదో మొక్కుబడిగా మాస్కు ధరించినప్పటికీ, దాన్ని ఏ గదమ కిందికో లేదా ముక్కు కిందికో ఉండేలా ధరిస్తుంటారు. పేరుకు ధరించినట్లుగా ఉండేలా అమర్చుకుని బయటకు వచ్చేస్తుంటారు. ఏ మాస్కు అయినా దాన్ని ముక్కు కిందకు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎన్ 95 మాస్కు ఎక్కువసేపు వాడితే ఊపిరి పీల్చడం కష్టం అనిపిస్తున్నా లేదా ఒకింత దుర్వాసన వస్తున్నా, దాంతో ఇబ్బందిగా ఉన్నా, ఆ మాస్కు జీవితకాలం అయిపోయిందని అర్థం. అలాంటి సందర్భాల్లో కొత్తది లేదా ఉతికిన మాస్కు ధరించాలి. జేబులో పెట్టుకోవచ్చా? మాస్కు ముందు భాగాన్ని ఎప్పుడూ చేత్తో ముట్టుకోకూడదు. వైరస్ కణాలు మాస్కు ముందుభాగంలోనే ఉంటాయి. కొందరు కొన్నిసార్లు మాస్కు తీసి జేబులో పెట్టుకుంటారు. అది తప్పు. అప్పుడు మాస్కు ముందుభాగాన్ని చేత్తో ముట్టుకోవాల్సి వస్తుంది. ఆ చేతులతో కళ్లు, ముక్కు, నోరు ముట్టుకుంటే కొవిడ్ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. ఏ మాస్కయినా చెవుల దగ్గర పట్టి తీసి, బయటపెట్టాలి. అలా ఎప్పుడూ చెవుల వద్దే పట్టుకోవాలి. ముందువైపు ముట్టుకున్నట్లు అనుమానం వస్తే వెంటనే చేతులు శానిటైజ్ చేసుకోవాలి. మన దేశంలో మాస్కు తప్పనిసరి ఎందుకంటే... మన దేశంలో అన్నివర్గాల ప్రజలకు, అందరికీ ఇంకా టీకాలు పూర్తిగా అందలేదు. ఇంకా చాలామంది టీకాలంటే కాస్త వెనకడుగు వేస్తున్నవారూ మన సమాజంలో కొంతమంది ఉన్నారు. పైగా మన దేశంలో జనసాంద్రత చాలా ఎక్కువ కావడంతోనూ, అందరూ ఇంకా టీకాలు వేయించుకోకపోడంతో మిగతా రక్షణ చర్యల కంటే మాస్కులు మాత్రమే కరోనా నుంచి మనల్ని రక్షించగలవు. అందుకే మహమ్మారి తీవ్రత తగ్గేవరకూ మనమందరమూ తప్పనిసరిగా విధిగా మాస్కులను ధరించి తీరాల్సిందే. డాక్టర్ సాయి సుధాకర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ -
ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతి రేఖ
సాక్షి, హైదరాబాద్: కరోనా విసిరిన సవాళ్లకు ఎదుర్కొనేందుకు పలు రూపాల్లోని ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు, సామగ్రి ఎంతో ఉపకరించాయి. ఫ్రంట్లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఎంతో భద్రత కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం భారీగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మెక్సికోకు చెందిన 21 ఏళ్ల యువ వ్యాపారవేత్త, విద్యార్థిని తమార ఛాయో రీ యూజబుల్ పీపీఈ కిట్లు తయారు చేశారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతిరేఖ విరిసినట్లు అయ్యింది. 3 రోజుల పాటు వైరస్ వాడి పారేసిన పీపీఈ కిట్ల ద్వారా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు వాటిపై మూడు రోజుల పాటు సజీవంగా ఉండే వైరస్తోనూ ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని తమార ఛాయో గతేడాది సహ స్థాపకురాలిగా ఓ సంస్థ ప్రారంభించి, పీపీఈ కిట్ల కొరత ఏర్పడినప్పుడు ఎంఈడీయూ ప్రొటెక్షన్ అభివృద్ధి చేశారు. వైరల్ రీసెర్చి ల్యాబ్స్లో ఉపయోగించే కోటింగ్ త రహాలో ఉన్న వస్త్రంతో ఆమె ఈ దుస్తులు తయారు చేశారు. ఈ కిట్ను 50 సార్ల వరకు ఉతికి ఉపయోగించొచ్చని, అయినా తన రక్షణ గుణాలు కోల్పోదని తమారా చెబుతోంది. ఈ దుస్తులకు క్యూఆర్ కోడ్ను కూడా అంతర్భాగంగా చేయడం ద్వారా దీన్ని ధరించే వారికి స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా దాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారన్న సమాచారం వస్తుంది. దానిని 50 సార్లు ఉపయోగించాక ప్యాకేజింగ్ ఉత్పత్తులకు సంచులుగా వాడుకోవచ్చు. ఆస్పత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు భారత్, బ్రిటన్ తదితర దేశాల్లోని వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ పీపీఈ కిట్లు, మాస్కులను ఎలా రీసైకిల్ చేయాలన్న దానిపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇంగ్లండ్లోని వేల్స్లో థర్మల్ కంపాక్షన్ గ్రూప్ (టీసీజీ) హాస్పిటల్ గౌన్లు, మాస్కులు, వార్డు కర్టెన్లు తదితరాలను ప్లాస్టిక్ ఇటుకలుగా తయారు చేసే మెషీన్లను రూపొందించింది. ఇలా ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ద్వారా పాఠశాలల కుర్చీలు, త్రీడీ ప్రింటర్ ఫిలమెంట్లు, దుస్తుల తయారీకి ఉపయోగించే దారంగా కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. టీసీజీ గ్రూపు కెనడా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాలకు తమ యంత్రాలను ఎగుమతి చేసేందుకు సన్నద్ధమౌతోంది. రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు, కన్స్ట్రక్షన్ ప్యానెళ్లు తయారు చేసి తక్కువ ఖర్చులో హౌసింగ్, స్కూళ్ల నిర్మాణానికి భారత్లో 27 ఏళ్ల బినిష్ దేశాయ్ అనే వ్యాపారవేత్త దోహదపడుతున్నాడు. యుక్తవయసు నుంచే వ్యర్థాల నుంచి ఇటుకల తయారీ నేర్చుకున్నాడు. డిస్ఇన్ఫెక్ట్ చేసిన, ముక్కలు చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను, కాగితం మిల్లు వ్యర్థాలు, బైండర్తో మిక్స్ చేసి కొత్త ఇటుకలు తయారు చేయడాన్ని కనుగొన్నాడు. దేశాయ్ను ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటున్నారు. -
ఏపీ: మాస్క్ లేకుంటే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్లు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని, అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్ను కేటాయించామని ఆయన వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కమిషనర్ హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. -
మెడల్ గెలిస్తే మరో బంపర్ ఆఫర్..
టోక్యో: ఒలింపిక్స్లో పతకం సాధించే అథ్లెట్లకు నిర్వహకులు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతకం గెలిచాక అథ్లెట్లు పోడియంపై నిల్చున్న సమయంలో ఫొటోలకు పోజులివ్వడానికి 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని అథ్లెట్లు దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అథ్లెట్లు బరిలో ఉన్నప్పుడు మినహా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని నిబంధనలు జారీ చేశారు. అయితే మాస్కుల విషయంలో తాజాగా లభించిన వెసులుబాటుకు అథ్లెట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
మాస్క్లకి పెళ్లి కళ
కరోనా మూలంగా మాస్క్లు రోజువారి జీవితాల్లో భాగమైపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్కులు వాడుతున్నారు. వీటిలో ఒకసారి వాడి పడేసేవే ఎక్కువ. దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని గ్రహించిన యూకే వెడ్డింగ్ ప్లానర్స్ వినూత్న ఆలోచనతో మాస్కులతో మంచి డ్రెస్ను డిజైన్ చేశారు. వాడి పడేసిన 1500 మాస్కులతో వెడ్డింగ్ గౌనును రూపొందించారు. రీ సైకిల్ చేసిన పీపీఈ కి ట్తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్ డ్రెస్ను తయారుచేశారు. వెడ్డింగ్ ప్లానర్ వెబ్సైట్ ‘హిట్చ్డ్’ (Hitched) ఈ గౌను రూపకల్పనకు పూనుకోగా, డిజైనర్ సిల్వర్వుడ్ గౌనును రూపొందించారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్లో కేసులు తగ్గి వివిధ కార్యక్రమాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో హిట్చ్డ్ మాస్కులతో సరికొత్త వెడ్డింగ్ గౌనును రూపొందించి మోడల్కు వేసి ఫోటోలు తీయడంతో ఈ గౌను వెలుగులోకి వచ్చింది. ‘‘ఏటా రూపొందించే వెడ్డింగ్ గౌన్లకు భిన్నంగా పర్యావరణ హితంగా సరికొత్త గౌన్లు తయారు చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే మాస్కులను ఈ విధంగా కూడా వాడవచ్చని మెస్సేజ్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే... వాడేసిన మాస్కులను శుభ్రపరిచి వెడ్డింగ్ గౌన్ను రూపొందించాం. మాస్కులతో వెడ్డింగ్ గౌన్ మరింత అందంగా వచ్చింది’’అని హిట్చ్డ్ ఎడిటర్ సారా అలార్డ్ చెప్పారు. -
ప్రభుత్వానికి కియా 10 లక్షల మాస్క్లు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కరోనా విపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్లను అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్ మాస్క్లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్ డాంగ్ లీ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మాస్క్లను అందించడం అభినందనీయమన్నారు. ఈ మాస్క్లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్ కార్పొరేట్ హెడ్ జూడ్ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్ సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
జులై 19 తర్వాత అక్కడ మాస్క్లు వాడక్కర్లేదు..?
లండన్: కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వల్ల కరోనా రక్కసి ప్రభావాన్ని తగ్గించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి ధాటికి విలవిలలాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రిటన్లో జులై 19 తరువాత ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా సండే టైమ్స్ తెలిపింది. అలాగే జిమ్, రెస్టారెంట్స్, మ్యూజియం తదితర వాటిల్లో స్కానింగ్ నిబంధనలను పక్కన పెట్టే అవకాశం ఉందని సండే టైమ్స్ కథనంలో పేర్కొంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో, మాస్క్ వాడాలా, వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంగా ఆంక్షలతో మగ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. -
పసి ముఖానికి ముసుగు తొడగాలా?.. వద్దా? తెలుసుకోండి
విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కరోనా కట్టడిలో భాగంగా చిన్నారులకు మాస్కులు తొడగాల్సిన పనిలేదంటున్నాయి నూతన అధ్యయనాలు. మాస్కు లేకపోయినా పిల్లలు కరోనా వ్యాప్తి కారకాలు కారంటున్నాయి. ఆ కథేంటో చూద్దాం.. కరోనా కట్టడిలో మాస్కులు, సామాజిక దూరం పాటించడం కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ తాజా అధ్యయనాలు ఈ రెండు అంశాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లండ్కు చెందిన నిపుణుల ప్రకారం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్, మాస్కులు ధరించడం తదితర కారణాలతో ప్రతిఏటా పిల్లలకు సోకే పలు సాధారణ వైరల్ వ్యాధులు దూరంగా ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది పిల్లల్లో ప్రతిఏటా ఒక సీజన్లో ఫ్లూ రావడం సాధారణం. కానీ మాస్క్ తదితర ఆంక్షల కారణంగా ఎక్కువమంది పిల్లల్లో గతేడాదిన్నరగా సీజనల్ జలుబు రాలేదు. దీనివల్ల శరీరంలో సాధారణంగా జరిగే ఇమ్యూనిటీ బిల్డింగ్ దూరమైందని నిపుణులు భావిస్తున్నారు. జలుబులాంటివి చేసినప్పుడు పిల్లల శరీరంలోని రక్షణ వ్యవస్థ సదరు వైరస్ను మెమరైజ్ చేసుకొని భవిష్యత్లో అడ్డుకుంటుంది. కానీ అసలు జలుబే సోకకపోవడంతో చిన్నారుల్లో కరోనా అనంతర దినాల్లో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు సోకే ఆర్ఎస్వీ(రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్)పై వైరాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్కు టీకా లేదు. కరోనా ముందు రోజుల్లో పలువురు చిన్నారులు వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరడం అనంతరం క్రమంగా ఈ వైరస్కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగేది. కానీ కరోనా కట్టడికి అవలంబించిన విధానాలతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అసలైన సమస్య కరోనా అనంతర దినాల్లో కనిపించవచ్చని, అప్పటికి ఈ ఆర్ఎస్వీ డేంజర్గా మారవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యాక మాస్కుల్లాంటి విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారని, ఆ సమయానికి పిల్లలు పలు వైరస్లకు ఇమ్యూనిటీ పెంచుకోకపోవడంతో వీటి విజృంభణ అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లపాటు పిల్లలు అతి రక్షణ వలయాల్లో ఉండి హఠాత్తుగా మామూలు వాతావరణంలోకి వస్తే వారిలో మెమరైజ్డ్ ఇమ్యూనిటీ లోపం వల్ల చిన్నపాటి జలుబు కూడా తీవ్ర ఇబ్బంది కల్గించే చాన్సుంది. అందుకే సడలించారా? పిల్లల్లో మాస్కుల వాడకం వల్ల జరిగే మేలు కన్నా జరగబోయే కీడు ఎక్కువని భావించే కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా నివారణార్థ్ధం మాస్కు వాడకం అవసరం లేదని ఇటీవలే డీజీహెచ్ఎస్ సూచించింది. అదేవిధంగా 6–11 ఏళ్లలోపు పిల్లలు మాస్కు ధరించవచ్చు కానీ డాక్టర్ కన్సల్టేషన్ అనంతరమే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అదేవిధంగా పిల్లల్లో కరోనా వస్తే రెమ్డెసివిర్ వాడవద్దని, సిటీస్కాన్ను కూడా పరిమితంగా వాడాలని తెలిపింది. చిన్నారుల్లో కరోనా ముప్పు చాలా తక్కువని, అందువల్ల వీరికి మాస్కు వాడకం అలవాటు చేయకపోవడం తప్పేమీ కాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల్లో మాస్కు వాడకం కారణంగా వారు సహజసిద్ధంగా పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పెరగకుండా పోతుందని నిపుణులు భావిస్తున్నారు. స్కూలుకు పోవచ్చా? చిన్నపిల్లలు స్కూలుకు పోవడం ద్వారా కరోనా ముప్పు అధికం కావచ్చని, వీరివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాల్లేవని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనం చెబుతోంది. అయితే టీనేజీ పిల్లలు మాత్రం తప్పక రక్షణ నియమాలు పాటించాలని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్లో జరిపిన రిసెర్చ్ ప్రకారం 9ఏళ్లలోపు పిల్లల వల్ల స్కూళ్లలో కరోనా వ్యాప్తి జరుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అయితే 10–19 సంవత్సరాల పిల్లల్లో మాత్రం రిస్కు పెరుగుతూ వస్తుంది. అలాగే బడులు తెరవడమనేది కరోనా వ్యాప్తి రేటుపై చూపిన ప్రభావం కూడా తక్కువేనని తేలింది. మూడు అడుగుల దూరం! టీనేజీలోకి రాని పిల్లల్లో మాస్కు వాడకం వల్ల ప్రయోజనం కన్నా భవిష్యత్లో ఇబ్బందులకే ఎక్కువ చాన్సులున్నాయన్నది నిపుణుల ఉమ్మడి మాట. చిన్నారుల్లో మాస్కు వాడకం కన్నా ఇతరులతో 3 అడుగుల సామాజిక దూరం పాటించేలా చూస్తే చాలంటున్నారు. అలాగే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చాక వాటిని అందివ్వడం మంచిదంటున్నారు. చిన్నపిల్లలు బడికి ఎక్కువకాలం దూరం కావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపవచ్చని అందువల్ల టీచర్లు, ఇతర స్టాఫ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను స్కూలుకు హాజరయ్యేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం రెండేళ్ల పైబడిన పిల్లలకు మాస్కు వాడడమే మంచిదని, భవిష్యత్లో ఇమ్యూనిటీ గురించి ఆందోళన పడడం కన్నా ప్రస్తుతం కరోనా బారినుంచి తప్పించుకోవడం కీలకమని వాదిస్తున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం పిల్లల్లో మాస్కు వాడకం వారి ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అవకాశాలున్నందున వీలయినంత వరకు వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గుడ్న్యూస్: ఇక మాస్క్లతో పని లేదు
సియోల్: మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇకపై మాస్క్లు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం అవసరం లేదు. మాస్క్లకు బై బై చెప్పేసి శానిటైజర్లను ఇక పక్కన పడేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం దక్షిణ కొరియా దేశంలో సంతరించుకుంటోంది. రెండు నెలల్లో బహిరంగ ప్రాంతాల్లో మాస్క్లు ధరించడం అనవసరమని ఆ దేశం ప్రకటించింది. ఎందుకంటే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ శరవేవగంగా సాగుతోంది. దక్షిణ కొరియాలో వయోధికులకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించారు. 52 మిలియన్ల మందికి అంటే దాదాపు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ పూర్తి చేశారు. జూన్లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని దక్షిణ కొరియా ప్రకటించింది. 60 నుంచి 74 ఏళ్లలోపు ప్రజల్లో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాన్ డియోక్ చెయొల్ తెలిపారు. దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 707 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 1,37,682. నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ఆ దేశంలో వేస్తున్నారు. -
క్రమశిక్షణతో కరోనాకు కళ్లెం
దుగ్గిరాలపాడు (జి.కొండూరు): చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠంలా.. 2017లో డెంగీ జ్వరాలతో అల్లాడిపోయిన దుగ్గిరాలపాడు గ్రామ ప్రజలు నేడు సమష్టి కృషితో స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తమ గ్రామ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎదుర్కోగలుగుతున్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండల కేంద్రానికి 15 కిలోమీటర్లు దూరంలో తెలంగాణ సరిహద్దులో దుగ్గిరాలపాడు గ్రామం ఉంది. గ్రామంలో 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో మరోసారి డెంగీ లాంటి చేదు అనుభవం తలెత్తకూడదని భావించిన గ్రామస్థులు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలియగానే అంతా ఏకతాటిపైకి వచ్చి స్వీయ నియంత్రణ పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్లలో ఒక్క కరోనా కేసు కూడా ఇక్కడ నమోదు కాలేదంటే ఆ గ్రామ ప్రజల క్రమశిక్షణ అర్థం చేసుకోవచ్చు. కఠిన నిబంధనలు కరోనా కట్టడికి గ్రామస్తులంతా కలిసి కఠిన నిర్ణయాలు తీసుకొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప గ్రామం దాటి ఎవ్వరూ బయటకు రావడం లేదు. బయటకు వస్తే మాస్క్లు తప్పక ధరిస్తున్నారు. గ్రామంలో శుభకార్యాలను సైతం రద్దు చేసుకున్నారు. నిత్యావసరాల కోసం షాపుల వద్దకు ఒక్కొక్కరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో నిబంధనలు పాటిస్తున్నారు. గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ గ్రామంలోనే ఉపాధి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు బయటి గ్రామాలలో పనులకు పోకుండా గ్రామ సర్పంచ్ రాంబాబు అధికారులతో కలిసి గ్రామంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విరివిగా పనులు కల్పించేలా చర్యలు చేపట్టారు. నిత్యం మాస్క్లు ధరించి గ్రామంలోనే పనులు చేసుకుంటుండటంతో తమకు కరోనా పట్ల ఎలాంటి ఆందోళన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. నిత్యం శానిటేషన్ గ్రామంలో నిత్యం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపడుతున్నాం. డ్రైనేజీల్లో పూడిక తీత, రహదారుల వెంబడి బ్లీచింగ్ చల్లించడం, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ, వాటర్ ట్యాంకుల క్లీనింగ్ వంటి పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పక్కా ప్రణాళికతో కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం. – జడ రాంబాబు, గ్రామ సర్పంచ్ నిత్యం పర్యవేక్షణ నిత్యం గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తున్నాం. పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టడంతో పాటు కరోనా నియంత్రణ, నిబంధనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. – రామకృష్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శి -
ఎమ్మెల్యే నిధులతో మాస్కులు
భువనేశ్వర్: కరోనా వ్యతిరేక పోరులో మాస్కు బలమైన ఆయుధం. సమాజంలో బలహీన వర్గాలకు అనుకూలమైన రీతిలో నాణ్యమైన మాసు్కలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టాలి. ఈ కార్యకలాపాల కోసం ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ శక్తి సిబ్బంది ఇస్తామన్న మాసు్కలను సేకరించి సేకరించి బీదలకు పంపిణీ చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితులను బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. హెల్ప్డెస్క్ సిబ్బంది స్పందించాలి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ రోగుల కుటుంబీకులు, బంధుమిత్రుల ఆవేదన పట్ల మానవీయ దృక్పథంతో మసలుకోవాలి. బాధితుల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్డెస్క్ సిబ్బంది బంధువులకు అందించి ఊరట కలిగించాలని హితవు పలికారు. కోవిడ్ ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న సేవలు, చికిత్స, సదుపాయాలు, రోగుల ఆరోగ్య స్థితిగతుల తాజా సమాచారం తెలియజేసేందుకు హెల్ప్డెస్క్లను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్త కుమార్ మహాపాత్రో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్, ముఖ్యమంత్రి 5టీ కార్యదర్శి వి. కె. పాండ్యన్, కోవిడ్ పర్యవేక్షకులు నికుంజొ బిహారి ధొలొ, సత్యవ్రత సాహు, విష్ణుపద శెట్టి, కెంజొహార్, మయూర్భంజ్ జిల్లాల కలెక్టర్లు, కటక్, భువనేశ్వర్ నగర పాలక సంస్థల కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబీకులకు సమాచారం కోవిడ్ ఆస్పత్రుల్లో చేరిన బాధితుల ఆరోగ్య సమాచారం వారి కుటుంబీకులకు ఎప్పటికప్పుడు చేరాలి. ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది, యంత్రాంగం మానవతా దృక్పథంతో మసలుకోవాలి. కోవిడ్ నిర్వహణ రంగంలో టీకాల ప్రదానం కీలకమైన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీకాల ప్రదాన కేంద్రానికి ప్రజలు సునాయాశంగా చేరి ఇబ్బంది పడకుండా టీకాలు వేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంగణాల్లో రద్దీ నివారించి కోవిడ్ – 19 నిబంధన భౌతిక దూరానికి ప్రాధాన్యం కల్పించాలి. టీకాలు వేసే చోటు, వేళల సమాచారం సంబంధిత వ్యక్తులకు ముందస్తుగా తెలియజేయడంతో ఇది సాధ్యమతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయ పడ్డారు. ఇంటింటి సర్వే అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. ఇంటింటా కరోనా రోగ లక్షణాలు కలిగిన బాధితుల సర్వే చేపడతారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు ప్రధానంగా ఆక్సిజన్ సంబంధిత వ్యవహారాలతో హెల్ప్ డెస్కు కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. -
వ్యాక్సినేషన్ పూర్తయితే మాస్కు అక్కర్లేదు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు ఇకపై మాస్కు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిరోధక సంస్థ ప్రకటించింది. వారు ఇకపై భౌతిక దూరం వంటి చర్యలను కూడా పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇంట్లో ఉన్నప్పటికీ, బయటకు వెళ్లినప్పటికీ మాస్కును వాడాల్సిన పని లేదని తేల్చి చెప్పింది. ఇదో గొప్ప మైలురాయి: బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా కలసి గురువారం శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిరువురూ మాస్కులు లేకుండానే కనిపించారు. అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్ చాలా వేగంగా చేశామని, అది గొప్ప మైలు రాయి అని బైడెన్అన్నారు. పూర్తి వ్యాక్సినేషన్ను పొందిన వారికి వైరస్ సోకే అవకాశం చాలా తక్కువని అన్నారు. అయితే వ్యాక్సినేషన్ చేసుకోని వారు, ఒక డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్నవారు మాత్రం అది పూర్తయ్యే వరకు మాస్కు ధరించాలని అన్నారు. కేవలం 114 రోజుల్లోనే 25 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని బైడెన్ పేర్కొన్నారు. అమెరికాలో రాష్ట్రాంతర ప్రయాణాలు చేసేవారికి ఇకపై నియమాలు ఉండబోవన్నారు. మొత్తం 50 రాష్ట్రాలకుగానూ 49 రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ఇప్పుడు అత్యంత తక్కువ మంది మాత్రమే ఆస్పత్రిపాలవుతున్నారని అన్నారు. మరణాల రేటు 80శాతం పడిపోయిందన్నారు. యువతకు కేవలం 4 నెలల్లో 5.5 శాతం నుంచి 60 శాతం మందికి కనీసం ఒక్క వ్యాక్సిన్ డోసు అయినా ఇచ్చామని పేర్కొన్నారు. -
మహేష్బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు లేటెస్ట్గా మహేష్బాబును వాడేశారు. డెనిమ్ జీన్స్, జాకెట్ వేసుకున్న మహేష్బాబు ఫోటోను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు..'డెనిమ్ మీద డెనిమ్ ఫ్యాషన్ ట్రెండ్, మాస్క్ మీద మాస్క్ సేఫ్టీ ట్రెండ్' అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. మహేష్ డెనిమ్ జాకెట్, డెనిమ్ జీన్స్ వేసుకొని ఉన్న మహేష్ ఫోటోతో ప్రజలకు కోవిడ్పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Safety First..#WearAMask #StaySafe #IndiaFightsCorona#Unite2FightCorona @urstrulyMahesh @MaheshBabu_FC @TelanganaCOPs pic.twitter.com/jNvP6XW0PS — Cyberabad Police (@cyberabadpolice) May 11, 2021 చదవండి : సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ ఎన్టీఆర్కు కరోనా.. హెల్త్ అప్డేట్స్ ఇచ్చిన చిరంజీవి -
డబుల్ మాస్క్పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం కచ్చితం. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉండడం కోసం డబుల్ మాస్క్లను ధరించాలని సూచనలు చేశారు. నిపుణుల ప్రకారం.. డబుల్ మాస్క్ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్ వ్యాప్తి జరిగే ప్రభావాన్ని తగ్గించవచ్చునని తేలింది. కాగా తాజాగా డబుల్ మాస్క్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకే రకమైన రెండు మాస్క్లను డబుల్ మాస్క్గా వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది. డబుల్ మాస్క్ను ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్ను వరుసగా రెండ్రొజులు పాటు వాడొద్దని కేంద్రం తెలిపింది. సాధారణ క్లాత్మాస్క్ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. #Unite2FightCorona The Dos and Dont's while #DoubleMasking...Take a look👇#PIBKochi @COVIDNewsByMIB @PIB_India @KirenRijiju @BSF_India @CRPF_sector @cpmgkerala @crpfindia @GMSRailway pic.twitter.com/hH8nY9Og38 — PIB in KERALA (@PIBTvpm) May 9, 2021 చదవండి: Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా? -
నగర వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కరోనా
సాక్షి, సిటీబ్యూరో: ఇది రామంతాపూర్లోని వివేకానగర్ కాలనీలో వెలసిన వారాంతపు సంత. జనం గుంపుల కొద్దీ పోగయ్యారు. తిరునాళ్లను తలపించారు. కూరగాయలు, ఇతర వస్తువుల కోసం గుంపులు గుంపులుగా కదులుతున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. కనీసం వందకుపైగా తోపుడు బండ్లు, తాత్కాలిక స్టాళ్లు వెలుస్తాయి. ఈ మార్కెట్ చుట్టూ అన్నీ కాలనీలు, బస్తీలే. ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా జనం ఇలా ఒకేచోట చేరడం వల్ల మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. కానీ.. కోవిడ్ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క రామంతాపూర్లోనే కాదు. నగరంలోని ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక చోట వారాంతపు మార్కెట్లు ఏర్పాటవుతున్నాయి. ఈ సంతలతో కరోనా ముప్పు భారీగా ఉంటుందని కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భౌతిక దూరమా.. అదెక్కడ..? సాధారణ రోజుల్లో అయితే ఇళ్ల ముందుకే మార్కెట్లు తరలిరావడం ఆహా్వనించదగిన పరిణామం. జనం తమకు కావాల్సిన వాటిని అక్కడికక్కడే కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల కోసం మహిళలకు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ కాలనీల్లో వారానికోసారి ఏర్పాటు చేసే మార్కెట్లో కొనుగోలు చేయడం ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ గత రెండు నెలలుగా ఈ మార్కెట్లు కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్లోని అనేక చోట్ల వారాంతపు మార్కెట్లు పని చేస్తున్నాయి. సనత్నగర్, జెక్ కాలనీ, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్పేట్, సీతాఫల్మండి, పద్మారావునగర్, పార్శీగుట్ట, రాంనగర్, అడిక్మెట్, హబ్సిగూడ, ఉప్పల్, ఈసీఐఎల్, సైనిక్పురి, మల్కాజిగిరి, మౌలాలి, కుషాయిగూడ, అంబర్పేట్, ఫలక్నుమా, తదితర ప్రాంతాల్లో ఆదివారం నుంచి శనివారం వరకు ఎక్కడో ఒక చోట వెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్క మార్కెట్లోనూ భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్లు ధరిస్తున్నప్పటికీ కొందరు వాటిని సరైన పద్ధతిలో ధరించకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ‘ఆదివారం వచ్చిందంటే మా కాలనీ ఒక జాతరలా మారుతుంది. అడుగు పెట్టేందుకు అవకాశం ఉండదు. భౌతిక దూరం ఊసే లేదు. పండ్లు, కూరగాయలతో పాటు అత్యవసరం కాని వస్తువులను కూడా విక్రయిస్తున్నారు’ అని తార్నాక గోకుల్నగర్కు చెందిన లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. కొరవడిన నియంత్రణ... ప్రతి సోమవారం ఉప్పల్ చిలుకానగర్ రోడ్డులో నిర్వహించే వారాంతపు మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు చికెన్, మాంసం అమ్మకాలు కూడా దర్శనమిస్తాయి. వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు విక్రయిస్తారు. దీంతో రద్దీ బాగా పెరుగుతోంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అవసరం లేని వస్తువుల విక్రయాలను నియంత్రించకపోవడం వల్ల రద్దీ రెట్టింపవుతోంది. ఒక్క తోపుడు బండి వద్ద ఒకే సమయంలో కనీ సం 15 నుంచి 25 మంది వచ్చి చేరుతున్నారు.మార్కెట్లు ముగిసిన తర్వాత కనీసం సోడియం హైపోక్లోరైట్ వంటి ద్రావణాలను కూడా స్ప్రే చేయడం లేదు. తాత్కాలికంగా నిలిపివేయాలి వీక్లీ మార్కెట్లు అవసరమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలికంగా వాటిని నిలిపివేయాలి. అది సాధ్యం కాకపోతే నియంత్రణ అవసరం. షాపుల మధ్య, మనుషుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. – రమ్య నాయుడు, మల్కాజిగిరి అనవసరమైనవి వద్దు.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల విక్రయాలను నిలిపివేయాలి. దీంతో చాలా వరకు రద్దీ తగ్గుతుంది. ఇప్పుడు వీక్లీ మార్కెట్కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆ మార్గంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నడవాల్సి వస్తోంది. – డాక్టర్ ఏఎస్ మాధురి -
Telangana Police: వర్రీలో వారియర్స్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఆస్పత్రి, వాక్సినేషన్ సెంటర్, కరోనా మృతుల మార్చురీ, కర్ఫ్యూ చెక్పోస్టు, మాస్కుల ధారణపై చెకింగ్స్.. ఇలా ఎక్కడ చూసినా కనిపించే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు. అయితే వీరికి అవసరమైన ‘భద్రత’ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫస్ట్ వేవ్లో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది అశువులు బాశారు. సెకండ్ వేవ్లోనూ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో ఈ వారియర్స్తో పాటు వారి కుటుంబాల నుంచీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీసు విభాగంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా.. దాదాపు 15 మంది వరకు ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. ► మాస్క్లు ధరించడం, శానిటైజర్లు వాడండి అంటూ గడిచిన కొన్ని రోజులుగా వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్మీడియాల వేదికగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. తమ సిబ్బంది విషయంలో మాత్రం ఆ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ► సెకండ్ వేవ్ పంజా విసరడం మొదలెట్టి నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ పోలీసుస్టేషన్లలోని అధికారుల మాట అటుంచితే బందోబస్తు, రిసెప్షన్ సిబ్బందికి మాస్్కలు, శానిటైజర్ల సరఫరా జరగలేదు. ఇక పీపీఈ కిట్స్ అనే ఆలోచనే వాస్తవదూరంగా అయిపోయింది. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ సంస్థలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి అమలు చేస్తున్నాయి.పోలీసు విభాగానికి మాత్రం ఇలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ► పోలీసు అధికారులు నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి పనిచేయాల్సి ఉంటోంది. ఉన్నతాధికారులైన డీసీపీలు, ఏసీపీలకు తక్కువైనా ఇన్స్పెక్టర్, ఎస్సైలు, రిసెప్షన్స్లో సిబ్బందికి తాకిడి ఎక్కువ. ► కోవిడ్ బారినపడిన పోలీసుల కోసం పేట్ల బురుజులో రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటైన కరోనా పరీక్ష కేంద్రం, ఆపై హెచ్సీక్యూ మందుల పంపిణీ మాదిరిగా వీటి పని తీరు ఉండకూడదని సిబ్బంది కోరుతున్నారు. ( చదవండి: వాట్సప్ చేస్తే ఉచిత భోజనం.. వారికి మాత్రమే! ) -
Andhra Pradesh Villages: నో మాస్క్.. నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: మాస్క్ లేకపోతే రానివ్వబోమంటూ దాదాపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలూ తీర్మానం చేశాయి. ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నాయి. అలాగే కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలుండగా శనివారం రాత్రి 12,193 చోట్ల ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు స్వచ్ఛందంగా తగిన జాగ్రత్తలు పాటిస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై గ్రామసభల్లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి.. జరిమానా విధించాలని స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకున్నారు. గ్రామాల్లోని హోటళ్లు, టీస్టాళ్ల వద్దకు వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా యజమానులే చూడాలని.. లేకపోతే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆయా హోటళ్లు, టీస్టాళ్ల నుంచి జరిమానా వసూలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. సర్పంచ్ అధ్యక్షతన కమిటీలు.. కరోనా కట్టడి కోసం చేపట్టే పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు అధ్యక్షులుగా సర్పంచ్లు వ్యవహరిస్తారు. వార్డు సభ్యులు, గ్రామ సచివాలయంలో పనిచేసే మహిళా పోలీస్తో పాటు ఏఎన్ఎంలు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. కాగా, జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ శాఖ కమిషన్ కార్యాలయంలో ఓఎస్డీ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది. -
‘మాస్కు’ల నిర్వీర్యానికి ఏపీలో 8 వేల ఇన్సినెరేటర్ యంత్రాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు దాదాపు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఒకసారి వాడి పారేసిన మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా వాటిని ఎక్కడికక్కడే శాస్త్రీయ విధానంలో తగలబెట్టడానికి ప్రతి గ్రామానికి ఒక అధునాతన యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యంత్రాల ద్వారా 500–700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడిపారేసిన మాస్క్లను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి పొగ కూడా రాదు. వీటిని ఇన్సినెరేటర్లుగా పిలుస్తారు. మాస్కులతోపాటు సాధారణ రోజుల్లో మహిళలు, ఆడపిల్లలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ను ఈ యంత్రాల ద్వారా సురక్షిత మార్గాలలో తగలబెట్టే వీలుంటుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అన్ని రకాల బయో వ్యర్థాలను సైతం ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేయొచ్చని అధికారులు వెల్లడించారు. ► పట్టణాలలో ఈ తరహా వ్యర్థాల కోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల నుంచి బయో వేస్ట్ మెటీరియల్ను ఎప్పటికప్పుడు సేకరించి, వాటిని నిర్వీర్యం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుంది. ► గ్రామాల్లోనూ ఇలాంటి వ్యవస్థ ఉండాలని పారిశుధ్య కార్యక్రమాల అమలుపై పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► మన రాష్ట్రంలో మహిళలకు ఏటా 8 కోట్ల నాప్కిన్స్ ప్యాడ్స్ సరఫరా జరుగుతున్నట్టు అంచనా. అలాగే ఇప్పుడు మాస్కుల వినియోగం పెరిగింది. గ్రామాల్లోని ఆస్పత్రుల్లోనూ బయోవ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని సురక్షిత పద్ధతిలో నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ► ఇప్పటికే 8 వేల ఇన్సినెరేటర్లను కొనుగోలు చేశారు. ఏపీలో 13,371 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచేందుకుగాను మరో 6 వేల దాకా కొనుగోలుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ► జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ ఇంటింటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించనుంది. ఇందులో వాడిపారేసిన మాస్క్లు, నాప్కిన్ ప్యాడ్స్ వంటి వాటిని వేరుగా వర్గీకరించి, వాటిని ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేస్తారు. -
రెండు టీకా డోసులు తీసుకుంటే మాస్కులు అక్కర్లేదు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి భారీ ఊరట లభించింది. టీకా తీసుకున్న వారందరూ బయటకి వచ్చినప్పుడు మాస్కులు ధరించనక్కర్లేదని ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మినహాయింపునిచ్చింది. అయితే సమూహాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు టీకా డోసులు తీసుకున్న వారంతా బయటకు వచ్చి నడుస్తున్నప్పుడు, పరుగులు పెట్టినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు, బైక్ మీద ఒంటరిగా వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోనక్కర్లేదని ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే పార్టీలు, ఫంక్షన్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో మాత్రం మాస్కు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి టీకాలు తీసుకొని మాస్కు లేని ప్రపంచంలో తిరగవచ్చునని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మాస్కులు అక్కర్లేదని ప్రకటించిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. చదవండి: (ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్డౌన్?) -
ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్పై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలకు పారదోలేందుకు, అప్రమత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇళ్లలోనే ఉండి, ఇంట్లోనూ మాస్క్ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను కోరింది. కేసుల తీవ్రత గురించి ఎలాంటి భయానికి గురి కావద్దని తెలిపింది అనవసర ఆందోళనతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో అవసరానికి సరిపోను ఆక్సిజన్ నిల్వలున్నాయని, రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ బాధితుల్లో అత్యధికులు ఇంట్లో ఉండే చికిత్స పొందవచ్చనీ, డాక్టర్లు సూచిస్తేనే ఆస్పత్రుల్లో చేరాలంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, హోం శాఖ అదనపు కార్యదర్శి పియూష్ గోయెల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పరిస్థితుల తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ప్రజల్లో తలెత్తుతున్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో రెమిడెసివిర్, తోసిలిజుమాబ్ వంటి ముఖ్యమైన ఔషధాల వినియోగానికి సరైన ప్రిస్క్రిప్షన్ అవసరమని ఆరోగ్య శాఖ తెలిపింది. రెమిడెసివిర్, తోసిలిజుమాబ్ మాదిరిగా ప్రభావం చూపే చౌకైన, తేలిగ్గా అందుబాటులో మందులు చాలానే ఉన్నాయి. వాటిని వాడటం మంచిది. మెడికల్∙ఆక్సిజన్ దేశంలో వైద్య వినియోగానికి తగినంత ఉన్నప్పటికీ, దానిని ఆసుపత్రులకు రవాణా చేయడం సవాలుగా మారిందని పేర్కొంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు, ఆక్సిజన్ డిమాండ్ ఉన్న ప్రాంతాలకు దూరం ఎక్కువగా ఉందని వివరించింది. న్యాయమైన పద్ధతిలో ఆక్సిజన్ వాడాలని, దాని వృథాను ఆపాలని కేంద్రం రాష్ట్రాలు, ఆసుపత్రుల యాజమాన్యాలను కోరింది.వైద్యేతర అవసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ను వాడరాదంటూ ఆదివారం కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధం నుంచి యాంపుల్స్, వయెల్స్, ఫార్మాస్యూటికల్, రక్షణ బలగాలు అనే మూడు రంగాలను మినహాయిస్తూ సోమవారం మరో ఉత్తర్వు వెలువరించింది. ఒక్కో వ్యక్తి నుంచి 406 మందికి.. గత ఏడాది మొదటి వేవ్తో పోలిస్తే ఈసారి వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది కంటే 2.25 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో, కర్ణాటకలో 3.3 రెట్లు, ఉత్తరప్రదేశ్లో 5 రెట్లు ఎక్కువగా కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దూరం పాటించకుంటే ఒక్కో బాధితుడి ద్వారా 30 రోజుల్లో 406 మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందని డాక్టర్ పాల్ తెలిపారు. భౌతికదూరం 50% పాటించినట్లయితే, ఒక్కో వ్యక్తి ద్వారా 15 మందికి మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు రుజువైంది. భౌతిక దూరాన్ని 75% పాటించిన బాధితుడి ద్వారా 30 రోజుల్లో 2.5 మందికే వైరస్ సోకుతుంది. వ్యాక్సినేషన్కు, మహిళల పీరియడ్స్కు సంబంధంలేదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్కు కొత్త విధానం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందంటూ ఎక్కువ మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో 90 శాతం మందికి జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటితో స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వీరికి జ్వరానికి ఇచ్చే మందులు, ఆవిరి పట్టడంతో వ్యాధిని తగ్గించవచ్చు. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత ఆక్సిజన్ సంతృప్తికర స్థాయిలో ఉండి, స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో జాయినవ్వాలని కోరుకుంటున్నారు. మధ్యస్త, తీవ్ర స్థాయి కేసుల్లో 5వ రోజు నుంచి 7వ రోజు తర్వాత మాత్రమే ఆక్సిజన్తో అవసరం ఉంటుంది. అంతకంటే ముందుగా ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మొదటి, రెండో రోజే చికిత్స సమయంలో ఆక్సిజన్ అందిస్తే సైడ్ ఎఫెక్ట్సు తలెత్తే ప్రమాదం ఉంది. కోవిడ్ బాధితులకు అందజేసే రెమిడెసివిర్, టొసిలిజుమాబ్ వంటి ఔషధాలను హేతుబద్ధంగా ఆస్పత్రులు వాడాలి. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లపై రెమిడెసివిర్ ప్రభావం ఇంకా నిర్థారణ కానందున, బదులుగా వేరే మందులను వాడుకోవచ్చు. ఆక్సిజన్ ట్యాంకులకు జీపీఎస్ దేశంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు చాలినన్ని ఉన్నాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే, ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల నుంచి తక్షణం అవసరం ఉన్న చోటికి ఆక్సిజన్ తరలింపు సమస్యగా మారింది. భారత వైమానిక దళ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించడం ద్వారా రవాణా సమయం తగ్గింది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో ఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ల కదలికలను జీపీఎస్ ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొరత తీరుస్తున్నాం. స్థానిక కంటెయిన్మెంట్ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు గుర్తించిన జిల్లాలు, ప్రాంతాల్లో స్థానిక ప్రాతిపదికన కంటెయిన్మెంట్ ప్రణాళికలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీనికి సంబంధించి ఈ నెల 25న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ వెలువరించిన మార్గదర్శకాలను పాటించాలంది. కంటెయిన్మెంట్ వ్యూహాలకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి స్వేచ్ఛ కల్పించి, పక్కాగా అమలయ్యేలా చూడాలి. ప్రస్తుత వేవ్ను ఒక స్థాయికి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం లకి‡్ష్యత కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం, గత వారం రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం, అంతకంటే ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలను, కోవిడ్ బాధితుల్లో 60 శాతం కంటే మించి ఆక్సిజన్ అవసరమయ్యే లేదా ఐసీయూలో చేరిన వారున్న ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కటి సరిపోలినా సంబంధిత జిల్లాలో కంటెయిన్మెంట్ చర్యలను తక్షణం తీసుకోవాలని తెలిపింది. ఆ ప్రాంతంలోని ప్రజలు 14 రోజులపాటు కలుసుకోకుండా చూడటం ద్వారా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చంది. కాగా, కోవిడ్ తీవ్రత కట్టడి వ్యూహాలను సమన్వయం చేసుకునేందుకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆధ్వర్యంలో ఎంపవర్డ్ గ్రూప్–3 సోమవారం లక్షమందికి పైగా పౌర సంస్థల సభ్యులతో సమావేశమైంది. ఇంట్లోనూ మాస్క్ ఎందుకు? ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని చెప్పాం. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని కోరుతున్నాం. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తి చెందదు. ఇంటికి అతిథులను ఆహ్వానించవద్దు. పాజిటివ్గా తేలిన వారు ఆస్పత్రుల్లోనే చేరాల్సిన అవసరం లేదు. వారిని వేరుగా గదిలో ఉంచవచ్చు. వారి ద్వారా ఇతర కుటుంబసభ్యులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వసతులు లేకుంటే ఐసోలేషన్ కేం ద్రాలకు వెళ్లవచ్చు. -
ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందే
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మరీ విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం అసన్నమైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై విలేకరుల సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె పాల్ మాట్లాడుతూ.. "కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ -19 పాజిటివ్ వస్తే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే వైరస్ ఇంట్లో ఇతరులకు వ్యాపిస్తుంది. అసలు నా అభిప్రాయం ప్రకారం అందరూ ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటే మంచిది అని" డాక్టర్ వి.కె పాల్ అన్నారు. ఇప్పటి వరకు మనం మాస్క్ బయట ధరించడం గురించి మాట్లాడుతున్నాం.. అయితే ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తునందున ప్రజలు ఇంట్లో కూడా ముసుగు ధరించాలని ఆయన అన్నారు. వ్యాధి సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలి అని డాక్టర్ పాల్ చెప్పారు. మీ ఇంటి దగ్గరకు ఎవరిని రానివ్వద్దు అని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు అని సూచించారు. ఏ మాత్రం లక్షణాలు ఉన్నా రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్లోకి వెళ్లిపోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పాజిటివ్గానే భావించి ఆర్టీ-పీసీఆర్ లో నెగటివ్ వచ్చే అంతవరకూ అందరికీ దూరంగా ఉంటే మంచిదని చెప్పారు.ఇక కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా మాస్కులు లేకపోవడం వల్ల ఉన్న ముప్పు గురించివివరించారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకపోతే ఇన్ఫెక్షన్ సోకే ముప్పు 90 శాతం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చదవండి: మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలా? -
కరోనా: ఎలాంటి మాస్క్ ధరించాలి? ఏది బెస్ట్?
వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనాకు మంచి మందు మాస్క్ వినియోగమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు వచ్చినప్పుడు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ ఏదైనా ధరించవచ్చు. డిస్పోజబుల్ మాస్కులు మంచివే అయినప్పటికీ వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల పొరలతో కూడిన క్లాత్ మాస్కులను క్రమం తప్పకుండా ఉతుకుతూ పలుమార్లు వినియోగించుకోవచ్చు. అయితే ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్/ క్లాత్/ సర్జికల్ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్ నుంచి 51.4 శాతం నుంచి గరిష్టంగా 56.1శాతం మాత్రమే రక్షణ లభిస్తోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. సర్జికల్ మాస్క్ లేదా క్లాత్ మాస్క్ రెండేసి ధరిస్తే వైరస్ నుంచి 95 శాతం తప్పించుకున్నట్లేనని పేర్కొంది. అయితే ఎన్–95 మాస్కును సింగిల్గానే వాడాలి. ఏదైనా క్రమ పద్ధతిలో ధరించాలి. నోరు, ముక్కు పూర్తిగా కవర్ చేస్తూ పెట్టుకోవాలి. డబుల్ మాస్కులు ఒకదానిపై ఒకటి పెట్టి ధరించాలి. శ్వాస కోసం ముక్కు దగ్గర, చెవుల వైపు వదులుగా ఉంటే, గాలి లీకేజీతో వైరస్ వ్యాప్తికి మార్గం ఏర్పడుతుంది. -పి.విజయ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, కడప -
Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా?
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తోందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా పరిశోధనలో తేలింది. రెండు టైట్ ఫిట్ మాస్కులు సార్స్–కోవ్–2 సైజ్ వైరస్ను సమర్థంగా ఫిల్టర్ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది. డబుల్ మాస్కుల వాడకం మంచిదే.. ►మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్ ప్రవేశించే ఆస్కారం ఉండదు. కనుక వైరస్ కణాలను ఇది సాధ్యమైనంత వరకు అడ్డుకుంటుంది. ►మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదు. కనుక డబుల్ మాస్కును ధరించడం వలన ముఖ భాగాన్ని వీలైనంత కవర్ చేస్తుంది. ఇందులో బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు. ►సాధారణ క్లాత్మాస్క్ 56.1 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 51.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. క్లాత్ లేదా సర్జికల్ మాస్కు వలన 77 శాతం రక్షణను ఇస్తుంది. ప్రయోజనాలు.. ►డబుల్ మాస్కులు వాడకం వలన మీకు శ్వాస పీల్చుకోవడంలో ఏ రకంగాను ఇబ్బందులు ఉండవు. ► డబుల్ మాస్కులు ధరించి సులభంగా మాట్లాడుకోవచ్చు. చేయకూడనవి.. ►వాడేసిన మాస్కులు రెండింటినీ గానీ, సర్జికల్ మాస్కులు రెంటిని కలిపి డబుల్ మాస్కులా వాడకూడదు ►మార్కెట్లో దొరుకుతున్న ఎన్95 మాస్క్ను ఏ ఇతర మాస్కు తో ఉపయోగించరాదు. ►రసాయన పదార్థాలను మాస్కు కు కలిపి ఉపయోగించరాదు. ►పాడైన, రంధ్రాలు పడినమాస్కులను వాడరాదు డబుల్ మాస్కును సరైన రీతిలో వాడుతున్నామనడానికి ఉదాహరణ ►మనం గాలి పీలుస్తున్నప్పుడు, మన మాస్కు లోపల వైపుకు వెళ్తున్నట్లు ఉండాలి ►అద్దాలు వాడే వారు గాలి వదిలినప్పుడు పొగతో వారి అద్దాలు కమ్ముకోవడం. ►అద్దం ముందు నిల్చుని మనం గాలిని బలంగా వదిలినప్పుడు మన కళ్లకు ఆ గాలి తగలడం. (చదవండి: ‘ఊపిరి’కి ఎందుకీ కష్టం?) -
మాస్క్ లేకుండా తిరిగితే రూ.100 జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. అయినా సరే చాలామంది ఇప్పటికీ మాస్కు లేకుండా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కు లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారికి రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డుపైకి ఎవరైనా మాస్కు లేకుండా వస్తే జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు. షాపులు లేదా వ్యాపార సంస్థలు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో 5 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు వంటి చోట సీటు మార్చి సీటు అంటే మధ్యలో సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి షాపులో, ఇతర చోట్లా శానిటైజర్ వేసుకున్న తర్వాతే వినియోగదారులను లోపలికి పంపించాలని ఆదేశించారు. థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను విధిగా వాడాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్స్ అన్నీ వెంటనే మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పైన నిబంధనలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు. -
కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం
దేశంలో కొద్దీ రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోవడం వల్లనే అని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబందనలు పాటించాలని పేర్కొంది. వలస కార్మికులు దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో.. మళ్లీ లాక్డౌన్ విధిస్తారని భయంతో కార్మికులంతా మళ్లీ ఇళ్లకు పయనమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారివారి రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా కట్టడికి ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తమ స్వంత రాష్ట్రాలకు వస్తున్న కార్మికులకు ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. చదవండి: రెండోసారి మాస్క్ లేకపోతే రూ.10 వేల జరిమానా -
మానవత్వం చాటిన మగువ..
కరోనా మహామ్మారి రోజురోజుకూ ఉధృతమవుతున్న తరుణంలో అందరికీ మాస్క్ అందించేందుకు కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఇండియన్ యూత్ సెక్యూర్డ్ సంస్థ ఈ మాస్క్ వాల్ ఏర్పాటు చేసింది. మాస్కులు కావాల్సినవారు వాటిని తీసుకోవచ్చు. ఈ క్రమంలో 2 చేతులు కోల్పోయి భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధుడు అక్కడకు వచ్చాడు. అతడికి మాస్కు లేదు.. పెట్టుకుందామంటే చేతులు లేవు. ఏం చేయాలా అని అలా నిలబడి చూస్తున్న సమయంలో ముగ్గు రు యువతులు బస్టాండులోకి వెళ్తూ అతడిని చూశారు. వారిలో ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గర కు వెళ్లి మాస్క్ వాల్ నుంచి ఒక మాస్కు తీసి అతడికి తొడిగి మానవత్వాన్ని చాటుకుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
యువతపై కరోనా పంజా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది యువత వైరస్ బారిన పడుతున్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31వతేదీ వరకూ 20,647 కేసులు నమోదు కాగా 19 నుంచి 40 ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నారు. 19 నుంచి 30 ఏళ్ల లోపు వారు 21 శాతం మంది ఉండటం గమనార్హం. బయట ఎక్కువగా తిరుగుతున్న వారిలో వీరే అధికం. సెకండ్ వేవ్లో వృద్ధులు జాగ్రత్తలు వహిస్తున్నట్లు తేలింది. ఈ దఫా పెద్ద వయసు వారిలో తక్కువ మందికి కరోనా సోకినట్లు తేలింది. రోజువారీ కేసులను బట్టి వృద్ధుల్లో 1.5 శాతం మంది కూడా లేరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లో తక్కువ.. గత మూడు నెలల్లో నమోదైన కోవిడ్ కేసుల్లో పురుషులే అత్యధికంగా 12 వేల మందికిపైగా ఉన్నారు. 19 నుంచి 30 ఏళ్ల వయసు మహిళల్లో 1,710 మంది బాధితులున్నారు. బాల బాలికల్లో పదేళ్ల లోపు వారు 647 మంది ఉన్నారు. చిన్నారుల్లో ఎక్కువగా సెకండరీ కాంటాక్ట్ ద్వారా అంటే తల్లిదండ్రులు, బంధువుల నుంచి సోకినట్లు వెల్లడైంది. మాస్కులు.. దూరం.. సబ్బు విధిలేని పరిస్థితుల్లోనే బయటకు రావాలని, ఒకవేళ వచ్చినా మాస్కు లేకుండా సంచరిస్తే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది జన సమర్థ ప్రాంతాలకు యథేచ్ఛగా వస్తున్నారు. వీరిలో చాలామంది మాస్కులు ధరించడం లేదు. దీనివల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం.. ఈ మూడు మార్గాలే కరోనా నియంత్రణకు కీలకమని స్పష్టం చేస్తున్నారు. జీవనశైలి జబ్బులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు దాటిన వారు వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండాలని, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
‘అందరూ ఇలా చేస్తే సెకండ్ వేవ్ను అడ్డుకోవచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణ కట్టడి సాధ్యమే అని ఐసీఎంఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కానీ గతంలో మాదిరిగా భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్–19 కోసం ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ఫోర్స్లోని ఆపరేషనల్ రీసెర్చ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఏమాత్రంలేదని పేర్కొన్నారు. అంతేగాక సంక్రమణను అడ్డుకొనేందుకు వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో, సూక్ష్మ స్థాయిలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, మాస్క్ ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దుమ్ము నుంచి కాపాడుకొనేందుకు కండువాలు మొహానికి అడ్డంగా పెట్టుకోవడం, మహిళలు చున్నీల వంటి వస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలా కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు కరోనా విషయంలో ప్రజల్లో చాలా భయం ఉండేది. పండ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తరువాత కనీసం ఐదారు గంటలు పక్కన పెట్టేవారు. అయితే నెమ్మదిగా ప్రజల్లో కరోనా భయం పోయిందని, కరోనాను నివారించడానికి ప్రజల్లో కనీసం ఉండాల్సిన భయం తప్పనిసరి అని డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు కచ్చితంగా ఉపయోగించడం కొనసాగిస్తే, కరోనా సెకండ్ వేవ్ మూడు, నాలుగు వారాల్లో ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాల్లో ఉద్యోగులు ఆఫీసుల్లో ఒకచోట కలిసి కూర్చొనే పరిస్థితుల్లో, మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం తప్పనిసరిగా మాస్క్లు ధరించాలనిన్నారు. కేవలం ఎన్–95 మాస్క్లు మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న క్లాత్ మాస్క్లను అయినా వాడుకోవచ్చన్నారు. మాస్క్లను ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం దైనందిన జీవితంలో భాగం కావాలని తెలిపారు. -
మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. ప్రయాణికులు కోవిడ్ ప్రొటోకాల్ను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరింది. మాస్క్ సరిగా ధరించని వారిని, భౌతిక దూరం పాటించని వారిని గుర్తించి అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు మార్చి 13వ తేదీన డీజీసీఏ అన్ని విమానాశ్రయాలకు, విమానయాన సంస్థలకు ఈ మేరకు సూచనలు చేసింది. అయితే, కొన్ని విమానాశ్రయాల్లో కోవిడ్–19 ప్రొటోకాల్స్ ఉల్లంఘనలు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ మంగళవారం తాజాగా మరో సర్క్యులర్ జారీ చేసింది. ‘ప్రయాణికులు ముక్కు, నోరు కవరయ్యేలా ముఖానికి మాస్క్ను సరిగ్గా ధరించడం మొదలుకొని విమానాశ్రయ పరిసరాల్లో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా విమానాశ్రయాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు నిఘాను మరింత పెంచాలి’అని అందులో కోరింది. ‘నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో స్థానిక పోలీసు అధికారుల సహకారం తీసుకోవాలి’అని సూచించింది. పదేపదే హెచ్చరించినా కోవిడ్–19 ప్రొటోకాల్ను పాటించని ప్రయాణికులను విమా నాశ్రయాల అధికారులు వెంటనే భద్రతా సిబ్బం దికి అప్పగించాలని మార్చి 13వ తేదీ నాటి సర్క్యులర్లో తెలిపింది. దీంతోపాటు, పలుమార్లు హెచ్చరించినా నిబంధనలను పాటించడానికి నిరాకరించే ప్రయాణికులను విమానం నుంచి దించివేయాలని, అటువంటి వారిని నిబంధనలు పాటించని ప్రయాణికులుగా గుర్తించాలని కూడా సూచించింది. ఇలా గుర్తించిన ప్రయాణికులపై విమానయాన సంస్థలు మూడు నుంచి 24 నెలల వ రకు ప్రయాణ నిషేధం విధించవచ్చని డీజీసీఏ నిబంధనలు చెబుతున్నాయి. మార్చి 15 నుంచి 23వ తేదీ వరకు దేశీయ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించిన 15 మంది ప్రయా ణికు లు కోవిడ్–19 నిబంధనలను పాటించలేదన్న విష యాన్ని అధికారులు గుర్తించారు. వీరిపై 3 నెలల ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని డీజీ సీఏ ఉన్నతాధికారులు తెలిపారు. విమానం లోపల ఉన్న సమయంలో మాస్క్ ధరించేందుకు కొందరు నిరాకరిస్తుండగా, మధ్యసీట్లలో కూర్చునే వారు తప్పనిసరిగా పీపీఈ కిట్ ధరించాలనే నిబంధనను మరికొందరు పట్టించుకోవడం లేదని తెలిపారు. -
సెకండ్వేవ్ అలర్ట్: తెలంగాణలో మళ్లీ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. షబ్–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థన స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణ: ‘సెకండ్ వేవ్’.. ఆందోళనొద్దు!) ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్కులు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. దేశంలో మళ్లీ కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. చదవండి: (అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు?) -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్: తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధిస్తున్న శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హోలీ, శ్రీరామ నవమి వేడుకల్లో గుమిగూడవద్దని తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ రెండు జీవోలు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. కాగా, తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 1,685 మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 2,99,878 మంది డిశ్చార్జ్ అయ్యారు. -
మాస్కులతో మంచీ చెడులు తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ‘మబ్బులో ఏముందీ.. నా మనసులో ఏముందీ..’అంటూ ప్రియురాలి మనస్సును ఆవిష్కరిస్తాడు సినీ కవి. మనసులోని భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబించేది ముఖమే. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ముఖంలో కనిపించే హావభావాలే వారి ఆలోచనలను బయటపెడతాయి. కోపం, బాధ, సంతోషం వంటి మానసిక స్థితి తెలిసిపోతుంది. కానీ కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా అలవాటైన మాస్కులు ఈ భావోద్వేగాలకు ముసుగేసేశాయి. ఎవరు ఎవరితో మాట్లాడినా వారి భావోద్వేగాలేమిటో తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. కొందరైతే మాస్కు మాటున తమ మనసులోని భావాలను దాచేస్తున్నారని, మాస్కు లేకుండా మాట్లాడలేని స్థితికి చేరుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేసిన నిబంధనలు జీవనశైలిలో అనూహ్య మార్పులు తెచ్చాయని అంటున్నారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 50 శాతానికి పైగా జనంలో మాస్కు వల్ల కొత్త మార్పులు కనిపిస్తున్నాయి’’అని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. మనసుకు ముసుగు ► ముఖం, కళ్లు మనిషి మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయి. కానీ ఏడాదిన్నరగా మాస్కులు పెట్టుకొనే ఉంటుండటంతో ఎదుటివారి భావాన్ని తెలుసుకోలేని పరిస్థితి ఉంది. మాటల్లోని పదాల కంటే ముఖంలో కనబడే భావాలే.. ఆ మాటల అసలు ఉద్దేశాన్ని తెలుపుతాయి. కానీ మాస్కుల వల్ల ఏ భావంతో ఏ మాట్లాడుతున్నారో ఎదుటివాళ్లు పసిగట్టలేకపోతున్నారు. మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ‘మాట వినిపిస్తుంది. కానీ మనసు కనిపించదు.. ఇది చాలా పెద్ద సమస్య’’అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత తెలిపారు. ► సిగ్గు, బిడియం, ఆత్మన్యూనతా భావం వంటి సమస్యలున్న వారు మాత్రం మాస్కులో స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారని.. అలాంటి వారు మాస్కు లేకుండా మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారని సంహిత తెలిపారు. మొదట వైరస్ రక్షణ కోసమని మొదలుపెట్టిన మాస్కు ఇప్పుడు జీవితంలో భాగమైందని.. 60 శాతానికిపైగా జనం మాస్కు మాటున మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకున్నారని చెప్పారు. ► నలుగురు కలిసి పనిచేసే చోట మాస్కులు ధరించడం తప్పనిసరైంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో సిబ్బంది మధ్య మాసు్కలు దూరాన్ని పెంచుతున్నాయని డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి చెప్పారు. ఆ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ► స్కూళ్లు, విద్యా సంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. పిల్లలు, టీచర్లు మాసు్కలు ధరించి హాజరవుతున్నారు. ఈ క్రమంలో తాము చెప్పే పాఠాలను పిల్లలు ఏ మేరకు గ్రహించగలుగుతున్నారు. వారి మానసిక స్థితి ఎలా ఉందన్నది తెలుసుకోవడం టీచర్లకు కష్టంగా మారింది. అదే సమయంలో టీచర్ల హావభావాలను పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. (చదవండి: వృథా అయిన డోసులు 23 లక్షలు, ఇలా అయితే బెటర్!) ఆరోగ్యానికి మాస్కు మంచిదే.. మాస్కులు పెట్టుకునే అలవాటు వల్ల ఆరోగ్యం విషయంగా చాలా మంచి మార్పులు వచ్చాయి. ఒక్క కరోనా అనే కాకుండా చాలా రకాల వైరస్ల నుంచీ జనానికి రక్షణ సమకూరుతోంది. అయితే ఎక్కువ సమయం మాస్కులో గడపడం వల్ల ఊపిరి తీసు కోవడంలో ఇబ్బందులు, నోటి దుర్వాసన వంటి పలు ఇతర సమస్యలు తలెత్తుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కానీ మాస్కుల వల్ల గాలి కాలుష్యం నుంచి, దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి పోకుండా రక్షణ పొందుతున్నారు. అంటువ్యాధుల బారిన పడకుం డా రక్షణ కలుగుతోంది. ఆస్తమా కేసులుకూడా తగ్గు ముఖం పట్టినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్కు తీయలేకపోతున్నారు ‘‘మాస్కు తీసి మాట్లాడాలంటే కొందరు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది మాటలను, భావాలను విశ్లేషించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల బంధాలు పలుచనవుతున్నట్లు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైన మరింత విస్తృతంగా అధ్యయనం జరగాల్సి ఉంది’’ –డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు -
మాస్క్ సరిగా లేకుంటే దింపేయండి
ముంబై: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? మాస్కు ధరించారా? అది ముక్కు కిందికో, గడ్డానికో ధరిస్తే సరిపోదు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి. అలా లేకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్–19 ప్రోటోకాల్స్ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏను, విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాల్లో తరచుగా తనిఖీలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఏముందంటే... ► మాస్కులు లేనివారిని ఎయిర్పోర్టుల్లోకి అనుమతించరాదు. ► విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సరిగ్గా ధరించేలా, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ► విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రయాణం ముగిశాక విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేదాకా మాస్కు ఉండాల్సిందే. ► కోవిడ్–19 ప్రోటోకాల్స్ను ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలి. ► విమానం బయలుదేరే ముందు పదేపదే సూచించినా మాస్కు సరిగ్గా ధరించకపోతే సదరు ప్రయాణికుడిని వెంటనే దింపేయాలి. ► విమానం ప్రయాణిస్తుండగా మాస్కులు సరిగ్గా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారిని నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికులుగా పరిగణించాలి. ► కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా మిగిలిన సమయంలో మాస్కును ముక్కు నుంచి కిందకు జార్చరాదు. ► కోవిడ్–19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డీజీసీఏ గైడ్లైన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. -
ఒక్క రోజులో రూ.48 లక్షలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న మార్పు కనిపించడం లేదు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై దాడులు ముమ్మరం చేశారు. దీంతో గత గురువారం ఒక్కరోజే జరిమానా రూపంలో రూ.48 లక్షలు వసూలయ్యాయి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన తనఖీల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 24,226 మంది నుంచి రూ.48.45 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం బీఎంసీ కమిషనర్ ఇక్బాల్సింగ్ చహల్ గత వారం నగర పోలీసులకు ఇచ్చారు. దీంతో గురువారం పట్టుబడిన వారిలో 8,674 మందిపై నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. కరోనా కేసులు పెరిగిపోవడాన్ని బీఎంసీ, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో ఇటు పోలీసులకు, అటు బీఎంసీ సిబ్బందికి ప్రతీరోజు 20 వేల మందిని పట్టుకోవాలని టార్గెట్ విధించింది. దీంతో నగర పోలీసులు శాంతి, భద్రతలను పరిరక్షిస్తూనే మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై దృష్టి సారిస్తున్నారు. మరోపక్క బీఎంసీ అధికారులు, సిబ్బందితోపాటు క్లీన్ అప్ మార్షల్స్ కూడా బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాలు పట్టుబడుతున్నారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) 343 రోజులు.. రూ.37.27 కోట్లు.. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి నుంచే కరోనా వేగంగా వ్యాపిస్తుందని గుర్తించిన బీఎంసీ ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు మొత్తం 343 రోజుల్లో 18,45,777 మందిపై చర్యలు తీసుకుంది. వీరి నుంచి రూ.37,27,45,600 జరిమానా వసూ లు చేసినట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా బీఎంసీ సిబ్బంది, క్లీన్ అప్ మార్షల్స్, నగర పోలీసులతో పాటు ముంబై లోకల్ రైల్వే పోలీసులు కూడా చురుగ్గా విధులు నిర్వహిస్తున్నారు. లోకల్ రైళ్లలో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,636 మందిని పట్టుకుని వారి నుంచి రూ.17.27 లక్షలు జరిమానా వసూలు చేశారు. నగర పోలీసులు 1,12,226 పట్టుకుని వారి నుంచి రూ.2,12,5,200 వసూలు చేశారు. వర్లీ, పరేల్, దాదర్, మాటుంగా, ధారావీ తదితర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న 3,03,025 మంది నుంచి రూ.6,63,34,400 జరిమానా వసూలు చేశారు. చదవండి: (వారం రోజులు లాక్డౌన్.. తెరచి ఉంచేవివే..) -
వేస్ట్ మాస్కులతో బెస్ట్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం మొత్తమ్మీద ఒక్కరోజులో వాడే మాస్కుల సంఖ్య ఎంతో మీకు తెలుసా? అక్షరాలా 680 కోట్లు.. వీటిల్లో కొన్నింటిని మళ్లీ వాడుకునే అవకాశముంది.. కానీ మిగిలిన కోటానుకోట్ల మాస్కులు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. మరి.. ఈ వ్యర్థానికీ ఒక కొత్త అర్థం కలి్పస్తే ఎలా ఉంటుంది..? ఆ ప్రయత్నమే చేసి విజయం సాధించారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు.. భవనాల వ్యర్థాలకు మాస్కు ముక్కలను జోడిస్తే మరింత దృఢమైన రహదారిని నిర్మించేందుకు సరికొత్త పదార్థం సిద్ధమవుతుందని వీరు గుర్తించారు. 99 పాళ్ల రీసైకిల్డ్ కాంక్రీట్ అగ్రిగేట్ క్లుప్తంగా ఆర్సీఏ అని పిలిచే భవన వ్యర్థానికి ఒక పాలు మాస్కు ముక్కలు జోడించి వీరు ఈ పదార్థాన్ని తయారు చేశారు. రహదారి నిర్మాణంలోని తొలి మూడు పొరలకు ఈ పదార్థాన్ని వాడవచ్చునని పరీక్షల్లో స్పష్టమైంది. కిలోమీటరు రహదారి నిర్మాణంలో దాదాపు 30 లక్షల మాస్కు వ్యర్థాలను వాడుకోవచ్చునని, తద్వారా 93 టన్నుల వ్యర్థాలు చెత్తకుప్పల్లోకి చేరకుండా నివారించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్ సాబేరియన్ తెలిపారు. అయితే ఈ మాస్కులను సేకరించి నిర్మాణ స్థలానికి తీసుకురావడం సవాలుగా ఉన్నప్పటికీ కోవిడ్ మో సుకొచి్చన సమస్య పరిష్కారానికి ఇదో కొత్త మార్గం చూపుతుందని వివరించారు. మాసు్కలతోపాటు పీపీఈ కిట్లను కూడా ఇదే పద్ధతిలో సది్వనియోగం చేసుకునేందుకు తాము పరిశోధనలు చేపట్టామని ఆయన చెప్పారు. -
పాడొద్దు... అరవొద్దు... మాస్కులు తీయొద్దు!
టోక్యో: విశ్వ క్రీడల నిర్వహణ విషయంలో ముందుకే వెళ్తున్న ఆతిథ్య జపాన్ దేశం అక్కడ తు.చ. తప్పకుండా పాటించాల్సిన నిబంధనల చిట్టాను విడుదల చేసింది. టోక్యోకు వెళ్లే విదేశీ అథ్లెట్లు తినేటపుడు, పడుకునేటపుడు తప్ప అన్ని వేళలా మాస్కులు ధరించాల్సిందే! అక్కడి ప్రజా రవాణా వాహనాల్ని అనుమతి లేనిదే వినియోగించరాదు. ఇలాంటి ఎన్నో కట్టుబాట్లతో టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ప్లేబుక్’ను బుధవారం విడుదల చేసింది. మీడియాతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అధికారులు... మెగా ఈవెంట్ను విజయవంతం చేసేందుకు అంతా బాధ్యతతో మెలగాలని సూచించారు. ఆటగాళ్లే కాదు... ప్రేక్షకులకు ఇందులో బంధనాలున్నాయి. తమ ఫేవరెట్ అథ్లెట్లకు మద్దతుగా ప్రేక్షకులు అరవడంగానీ పాడటంగానీ చేయడం నిషిద్ధం. కరోనా మహమ్మారి ప్రమాదం పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అథ్లెట్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బంది, ప్రేక్షకులు అందరూ తమ మార్గదర్శకాలను నిక్కచ్చిగా పాటించాల్సిందేనని కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్ను చూసేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు లేవు. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని కమిటీ పేర్కొంది. -
చేతికి బ్యాండ్లు, ముఖానికి మాస్కులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల హామీ మేరకు కరోనాపై యుద్ధం ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా కాకుండా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైట్హౌస్లో కరోనా నిబంధనల అమలు ప్రారంభించారు. చేతికి రిస్ట్ బ్యాండ్లు (ఈ బ్యాండ్లో ట్రాకర్ సాయంతో కోవిడ్ రోగుల్ని గుర్తించవచ్చు) ముఖానికి మాస్కులు తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా ఉద్యోగుల సీట్లను ఆరడగుల దూరంలో ఏర్పాటు చేశారు. కరోనాపై పోరాటమే తన ప్రథమ ప్రాధాన్యంగా బైడెన్ గురువారం పలు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘కరోనాతో మరణించే వారి సంఖ్య 4 లక్షలు దాటిపోయింది, రెండో ప్రపంచ యుద్ధ మృతులు కంటే ఇది ఎక్కువ. వచ్చే నెల మృతులు 5 లక్షలు దాటిపోతాయి. అందుకే ఈ వైరస్పై యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేయాలి’’ అని బైడెన్ చెప్పారు. అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు డాక్టర్ ఫాసీ, ఇతర వైద్య రంగ ప్రముఖుల సహకారంతో కరోనా కట్టడికి వ్యూహాన్ని రచించారు. కరోనా కట్టడికి వ్యూహం ► బహిరంగ ప్రదేశాల్లో 100 రోజుల పాటు అందరూ మాస్కులు ధరించాలి. ► ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్లోకి వచ్చినప్పుడు భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. ► శ్వేత సౌధానికి వచ్చే వారంతా చేతికి కరోనా ట్రాకర్ బ్యాండ్ ధరించాలి. ► అమెరికాకు వచ్చే ప్రతీ ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకున్నా కే విమానం ఎక్కాలి ► అమెరికాలో దిగాక విధిగా హోంక్వారంటైన్లో ఉండాలి. -
మరో 6 నెలలు మాస్కులు తప్పనిసరి
ముంబై : రాష్ట్రంలో మాస్కుల వినియోగంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు మరో ఆరు నెలల పాటు మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘ నివారణ కంటే ముందు జాగ్రత్త ఎంతో ఉత్తమం. పబ్లిక్ ప్రదేశాలలో మాస్కులను ధరించటం అలవాటుగా మారాలి. ప్రజలు తప్పని సరిగా మరో ఆరు నెలల పాటు మాస్కులు పెట్టుకోవాలి. నైట్ కర్ఫ్యూలు విధించాలని, వీలైతే మరో లాక్డౌన్ పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ( తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుక ) అయితే నాకది ఇష్టం లేదు. అంతా కాకపోయినా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి’’ అని అన్నారు. కాగా, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 3,940 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,92,707 చేరింది. గడిచిన 24 గంటల్లో 74 మంది కరోనాతో మృత్యువాతపడగా ఇప్పటి వరకు మొత్తం 48,648 మంది మరణించారు. -
కిలాడి లిల్లీ: ఆన్లైన్లో భారీ టోకరా
సాక్షి, హైదరాబాద్: నగర వాసికి ఆన్లైన్లో పరిచయమై పంపిణీ కోసం ఉచితంగా మాస్క్లు పంపిస్తున్నానంటూ ఎర వేసి రూ.24 లక్షలు స్వాహా చేసిన కేసులో లిల్లీ అనే యువతి కీలకంగా మారింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెతో పాటు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి బెంజిమెన్ను మంగళవారం బెంగళూరు జైలు నుంచి పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చి అరెస్టు చేశారు. ⇔ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా కెనడాలో నివసిస్తున్న వ్యక్తిగా చెప్పుకొన్న బెంజిమన్ పరిచయమయ్యాడు. నైజీరియాకు చెందిన ఇతగాడు వాస్తవానికి బెంగళూరులో స్థిరపడ్డాడు. నగరవాసి– కెనడా వాసిగా చెప్పుకొన్న నైజీరియన్ దాదాపు రెండు నెలల పాటు చాటింగ్ చేసుకున్నారు. ⇔ ఈ నేపథ్యంలో తాను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా అనేక పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలకు వీలైనంత సహాయం చేస్తుంటామని సదరు నైజీరియన్ నమ్మబలికాడు. ⇔ కరోనా ప్రభావం హైదరాబాద్లో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తాను సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎర వేశాడు. ఇందులో భాగంగా తమ సంస్థ తరఫున కొన్ని మాస్క్లు, శానిటైజర్లు, ఇతర వైద్య సామగ్రి, కొంత నగదు పంపిస్తున్నామని నగరవాసితో చెప్పాడు. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లకుపైగా ఉంటుందంటూ నమ్మించాడు. దీంతో నగరవాసి వాటిని పంపాలని, హైదరాబాద్లో ఉన్న అవసరార్ధులకు అందిస్తామని చాటింగ్లోనే చెప్పాడు. ⇔ ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ విభాగం అధికారిణి అంటూ బెంగళూరులో నివసిస్తున్న లిల్లీ నగరవాసికి ఫోన్ చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఈమె నైజీరియన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ⇔ ‘మీ పేరుతో కెనడా నుంచి పెద్ద పెద్ద పార్శిల్స్ వచ్చాయి’ అంటూ నగర వాసికి చెప్పింది. అయితే విదేశం నుంచి వచి్చన వాటిని పొందాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకోవాని స్పష్టం చేసింది. ఆ పార్శిల్స్లో మాస్క్లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లతో పాటు పెద్ద మొత్తంలో డాలర్లు కూడా ఉన్నట్లు గుర్తించామని నమ్మబలికింది. ⇔ ఇలా బాధితుడిని ముగ్గులోకి దింపిన బెంజిమన్, లిల్లీ సహా మరో నైజీరియన్ కస్టమ్స్ సహా వివిధ సుంకాల పేరు చెప్పి దఫదఫాలుగా రూ. 24 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఆపై అసలు విషయం తెలిసిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ⇔ దీన్ని ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బాధితుడు డబ్బు పంపిన బ్యాంకు ఖాతాలు బెంగళూరుకు చెందిన అశోక్ పేరుతో ఉన్నాయి. అతడిని పట్టుకున్న నేపథ్యంలోనే కమీషన్ తీసుకుని తన బ్యాంకు ఖాతాలను లిల్లీ అనే యువతికి అందించానని అంగీకరించాడు. ⇔ దీంతో అశోక్ను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారి బెంజిమన్తో పాటు లిల్లీ, మరో నిందితుడి కోసం గాలించారు. ఈ తరహా నేరాలను వీళ్లు బెంగళూరులోనూ చేయడంతో అక్కడ రెండు కేసులో నమోదయ్యాయి. ఇటీవల అక్కడి పోలీసులు బెంజిమెన్, లిల్లీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ⇔ ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడకు వెళ్లి పీటీ వారెంట్పై నిందితుల్ని తీసుకుని రావాలని భావించారు. ఈలోపే బెయిల్ పొందిన లిల్లీతో పాటు మరో నైజీరియన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బెంజిమెన్ మాత్రం జైల్లోనే ఉండటంతో మంగళవారం నగరానికి తీసుకువచ్చారు. ఇతడిని లోతుగా విచారించడం కోసం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాని నిర్ణయించారు. -
మాస్కులు ధరించకపోతే ఇతరుల హక్కుల్ని కాలరాసినట్టే
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే ఇతరుల ప్రాథమిక హక్కులైన జీవించేహక్కు, ఆరోగ్య హక్కులను కాలరాసినట్టేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా కట్టడికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలైన భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా అందరూ పాటించాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు చేయాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గుజరాత్ హైకోర్టు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కోవిడ్ సెంటర్లలో సామాన్యులు సేవలు చేస్తే మరిన్ని కరోనా కేసులు పెరిగిపోతాయన్నారు. ఇందుకు ఏకీభవించిన సుప్రీం గుజరాత్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. దోషులుగా తేలిన వారిపై జీవితకాల నిషేధం వద్దు దోషులుగా రుజువైన రాజకీయ నేతలు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవిత కాలంపాటు నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ను కేంద్రం తిరస్కరించింది. ఎన్నికైన ప్రతినిధులు కూడా చట్టానికి లోబడే ఉంటారని తెలిపింది. ‘పిటిషనర్ కోరినట్లుగా ప్రజాప్రతినిధ్య చట్ట సవరణ సహేతుకంగా లేదు. అంతేకాదు, రాజ్యాంగ విరుద్ధం, తన వాదనను సమర్థనగా ఎటువంటి వాస్తవ అంశాలను చూపలేదు’ అని పేర్కొంది. -
లగ్జరీ మాస్క్లతో కరోనాపై యుద్ధం
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్మాస్క్ ధరించడం అనివార్యంగా మారిపోయింది. కాస్త తగ్గినట్టే మళ్లీ కోవిడ్-19 పంజా విసురుతున్న తరుణంలో మాస్క్ ధరించడం తప్పని సరి చేస్తూ చాలా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. నిబంధనలు ఉల్లఘించిన వారి జరిమానా కూడా విధిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో కుదేలైన ఫ్యాషన్ రంగం మాస్క్ల తయారీలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ట్రెండ్కి తగ్గట్టుగా ముత్యాలు, వజ్రాలు పొదిగన ఆకర్షణీయమైన, విలువైన లగ్జరీ మాస్క్లను మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి. జపాన్ అత్యంత ఖరీదైన విలాసవంతమైన మాస్క్తో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది. ఖరీదైన, స్టయిలిష్ మాస్క్లతో కరోనాకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాక్స్ కో మాస్క్.కామ్ చెయిన్ ముత్యాలు పొదిగిన మాస్కులతో సందడి చేస్తోంది. గత వారం చేతితో తయారు చేసిన ముత్యాలు, వజ్రాలు పొదిగిన మాస్క్లను అమ్మడం ప్రారంభించిన సంస్థ ఏకంగా మిలియన్ డాలర్లు ఖరీదు చేసే మాస్క్లను ఆన్లైన్లో విక్రయిస్తోంది. ఒక్కో మాస్క్ ఖరీదు (9,600 డాలర్లు) ఒక మిలియన్ యాన్ ధర ఉంటుందని తయారీదారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా నైరాశ్యంలో మునిగిన వారు తమ మాస్క్ల ద్వారా కొత్త అనుభూతి చెందుతారని కంపెనీ అధినేత అజుసా కజితకా రాయిటర్స్తో చెప్పారు. కరోనాతో జపాన్లో చాలా పరిశ్రమలు సంక్షోభంలో పడిపోయాయి. ముఖ్యంగా ఆభరణాలు, ఫాబ్రిక్ పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అందుకే ఇక్కడి ఆర్థిక పునరుజ్జీవనంలో సహాయపడే ప్రాజెక్టులో భాగంగా దీన్ని చేపట్టామని ఆమె తెలిపారు. వజ్రాల మాస్క్లను 0.7 క్యారెట్ డైమండ్లతో, 300 స్వరోవస్కి క్రిస్టల్, 330 ప్రసిద్ధి చెందిన జపనీస్ అకోయ ముత్యాలతో ముత్యాల మాస్క్లను రూపొందించినట్టు చెప్పారు. జపాన్కు చెందిన మాస్క్లే ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. ఇజ్రాయెల్కు ఆభరణాల వ్యాపారి వైవెల్ రూపొందించిన 250 గ్రాముల 18 క్యారెట్ల బంగారంతో చేసిన 1.5 మిలియన్ల డాలర్లు కాస్ట్లీ ముసుగునుతయారుచేసిన సంగతి తెలిసిందే. ది.రిటైలింగ్ గ్రూప్ అయాన్ కోలో భాగమైన కాక్స్, సెప్టెంబర్ నుండి మాస్క్.కామ్ ఆన్లైన్లో, ఆరు ఫిజికల్ స్టోర్ల ద్వారా లగ్జరీ విక్రయాలను ప్రారంభించింది. వీటి ధరలు 500 యెన్ల నుండి ప్రారంభమయ్యే 200 కి పైగా మాస్క్లను విక్రయిస్తోంది. -
వైరస్కు హాట్బెడ్గా హాలండ్
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో! ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించుకోవడానికి ప్రపంచ ప్రజలంతా ముఖాన మాస్కులు ధరించి తిరుగుతుంటే నెదర్లాండ్స్ ప్రజల్లో ఎక్కువ మంది ఎలాంటి మాస్కులు ధరించకుండానే సాధారణ రోజుల్లాగే తిరిగారు. ఫలితంగా అతి తక్కువగా ఉన్న కరోనా కేసులు అతి ఎక్కువగా పెరిగిపోయాయి. వైరస్కు హాట్బెడ్గా మారిపోవడంతో హాలండ్ (నెదర్లాండ్స్) కరోనా బారిన పడి కొట్టుమిట్టాడుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా చేరింది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ అత్యవసర చట్టం తీసుకరావడం కోసం అక్కడి ప్రభుత్వం డచ్ పార్లమెంట్లో బుధవారం ఓ బిల్లును ప్రవేశపెట్టి చర్చ చేపట్టింది. ప్రతి లక్ష మందిలో 160 మందికి వైరస్ సోకుతోందని, ప్రతి రోజుకు ఐదువేల మంది వైరస్ బారిన పడుతున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని ప్రపంచ బ్యాంకు చేసిన సూచనలను పెడ చెవిన పెట్టిన హాలండ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే మాత్రం మొదటి నుంచి ఒకటే మాట చెబుతూ వస్తున్నారు. ప్రజలు బలవంతంగా మాస్కులు ధరించేలా చేయలేనంటూ వచ్చారు. ఇప్పుడేమో బిల్లు పాస్ కాగానే మాస్క్లను తప్పనసరి చేస్తూ చట్టం తీసుకొద్దామని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించడం లేదని, దేశంలో కరోనా ప్రభావం ఇంకా ఎక్కువే ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
‘ఇలా అయితే కరోనా గొలుసు తెంచలేం’
సాక్షి, న్యూఢిల్లీ: మాస్క్ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించకుండా ఉంటే కరోనా మహమ్మారి గొలుసును తెంచడం చాలా కష్టమని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అన్నారు. హెల్త్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన... ఇప్పటికీ చాలా మంది మాస్క్లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించలేదని అన్నారు. అలా అయితే కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదని అన్నారు. దేశంలో అన్లాక్ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు అన్ని సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు పునఃప్రారంభం అయ్యాయని, ఇలాంటి సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెల్త్ వర్క్ల కృషిని అభినందించారు. వారి సేవ ఎన్నటికి మరవలేనిదని అన్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చదవండి: గుడ్న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ -
94.75 శాతానికి తగ్గిన డెంగీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి ఏకంగా 94.75 శాతానికి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపించింది. ఆ వివరాలను కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సీజనల్ వ్యాధులపై తాజాగా జాతీయ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా ఇళ్లల్లో పరిశుభ్రత పెరగడం.. వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం.. ప్రజలు మాస్క్లు ధరించడంతో ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పరిస్థితి తగ్గిందని వెల్లడించింది. దీంతో సీజనల్ వ్యాధులు ఈసారి తగ్గిపోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఏడాది 699 డెంగీ కేసులు.. వరుసగా మూడేళ్లపాటు దేశంలో వర్షాకాల సీజన్లో డెంగీ కేసులు గణనీయంగా నమోద య్యాయి. 2017లో దేశంలో 1.88 లక్షల కేసులు నమోదు కాగా, 325 మంది చనిపో యారు. 2018లో 1.01 లక్షల కేసులు రికార్డు కాగా, 172 మంది మరణించారు. 2019లో 1.57 లక్షల కేసులు నమోదు కాగా, 166 మం ది చనిపోయారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో 13,587 డెంగీ కేసులు నమోదవ్వగా, 9 మంది చనిపోయారు. ఇక గతేడాది తెలంగాణలో డెంగీతో జనం విలవిలలాడిపోయారు. సరాసరి ప్రతీ ఇంట్లోనూ జ్వరం కేసులు నమోదయ్యాయి. 2017లో తెలంగాణలో 5,369 డెంగీ కేసులు నమోదైతే, 2018లో 4,592 కేసులు వచ్చాయి. 2019లో ఏకంగా 13,331 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో 699 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి 5.25 శాతమే రికార్డయ్యాయి. ఒకవేళ మున్ముందు కొద్దిపాటి కేసులు నమోదైనా సీజన్ ముగుస్తున్నందున తీవ్రత పెద్దగా ఉండదని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇక గతేడాది రాష్ట్రంలో మలేరియా కేసులు 1,711 రికార్డవ్వగా, ఈ ఏడాది జూలై వరకు 570 కేసులు నమోదయ్యాయి. అలాగే చికున్గున్యా కేసులు గతేడాది 5,352 నమోదవ్వగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 364 కేసులే వచ్చాయి. కరోనా, సీజనల్ వ్యాధులపై సర్కార్ చర్యలు ► ఇంటింటి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించారు. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే, మరోవైపు డెంగీ, మలేరియా, చికున్గున్యా తదితర వ్యాధులను నియంత్రించడంపై దృష్టి సారించారు. ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహించారు. ► కరోనా నిబంధనలను పాటించడంపై ప్ర జలను చైతన్యం చేయడంతో పాటు దోమ ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. ► కరోనా జాగ్రత్తలతో పాటు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జనాన్ని జాగృతం చేశారు. ► అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాలను చేపట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడిన మాస్క్లు కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యంపై సర్కారు పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీంతో దోమల నిర్మూలన జరిగింది. ప్రజలు కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ లు ధరించారు. భౌతిక దూరం పాటించారు. దీంతో జలుబు, జ్వరం వంటి ఫ్లూ వంటి లక్షణాలున్న వారి నుంచి ఇతరు లకు వ్యాప్తి తగ్గింది. దోమల నిర్మూలన కార్యక్రమాలతో డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఇటువంటి చర్యలు తీసుకోవడంతో సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు -
సరసమైన ధరలకే మాస్క్లు!
సాక్షి, అమరావతి: సర్జికల్ మాస్క్లు, పీపీఈ కిట్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అందరికీ అందుబాటు ధరలోకి వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ఒక్కో సర్జికల్ మాస్కు రూ.9 నుంచి రూ.13 వరకు ఉండేది. ఇక పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్ అయితే రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అమ్మేవారు. కెఎన్ 95, ఎన్ 95 మాస్కులైతే ఒక్కొక్కటి రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయించేవారు. ఇప్పుడు ఆ ధరలన్నీ దిగొస్తున్నాయి. అప్పట్లో తయారీ సంస్థలు లేకపోవడం, ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి అమ్మేవారు. ఇప్పుడు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాస్క్లు, పీపీఈ కిట్ల తయారీ సంస్థలు పెరగడం, అక్కడ్నుంచి భారీగా ఉత్పత్తి అయ్యి మార్కెట్లోకి వస్తుండటంతో ధరలు పడిపోయినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో 9 రూపాయలున్న మాస్కు ధర.. ఇప్పుడు రూ.2.36 మాత్రమే. 10 రోజుల కిందట మాస్క్లు, పీపీఈ కిట్లకు ప్రభుత్వం టెండర్లు పిలవగా.. ఓ సంస్థ మాస్కును రూ.2.36కు, పీపీఈ కిట్ను రూ.291కు కోట్ చేసింది. ప్రభుత్వాస్పత్రుల కోసం ముందు జాగ్రత్త చర్యగా.. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మాస్కులకు, 10 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చింది. -
నావల్ మాస్క్ తయా రు చేసిన శాస్త్రవేత్తలు.
వాషింగ్టన్: ప్రస్తుతం ఉన్న మాస్కు లు తరచుగా జారిపోవడం లేదా, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కళ్లజోడు ఉన్న వారికి తడిగాలి అద్దాల మీదకు రావడం వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కు ప్రొటోటైప్ను డిజైన్ చేశారు. రోజంతా ధరించేలా, సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తయారు చేసినట్లు టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్కు చెందిన జర్నల్ ప్రచురిం చింది. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు దీన్ని తయారు చేశారు. మాస్కు కు ఉన్న పాకెట్ ద్వారా అదనపు లేయర్ ధరించి అదనపు భద్రత పొందే అవకాశం కూడా అందులో ఉందన్నారు. దాదాపు 20 సార్లు ఉతికినప్పటికీ, అది సాగడం గానీ, నాణ్యత తగ్గడంగానీ లేదని చెప్పారు. గ్రామీణ భారతానికి ముప్పు దేశంలో కేసుల సంఖ్య 40 లక్షలు దాటుతున్న తరుణంలో కరోనా సమూహ వ్యాప్తిగా మారుతుండడంతో గ్రామీణ భారతంపై భయాందోళనలు నెలకొన్నాయి. ఆస్పత్రి సదుపాయాలు అంతగా లేని గ్రామాల్లో కరోనా ప్రబలితే పరిస్థితులు మరింతగా దిగజారతాయని నిపుణులు చెబుతున్నారు. హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ పరిశోధన ప్రకారం 714 జిల్లాల్లో కరోనా సోకింది. దీనివల్ల దాదాపు 94.76% మంది ప్రమాదంలో పడ్డారని చెప్పింది. -
మాస్కు తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ,మండలి సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమవుతాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు వచ్చే సభ్యులందరూ జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. కరోనాను ప్రభుత్వం కట్టడి చేయడం వల్లన మరణాల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా, పోలీసులు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకుని సభకు హాజరుకావాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కోవిడ్ టెస్టులు ప్రారంభించామని తెలిపారు. జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వైద్య సిబ్బంది వచ్చి టెస్టులు నిర్వహిస్తారని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు కూడా టెస్టులు చేయించుకోవాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. (చదవండి: ‘టిఫిన్’ తినేదెట్లా?) అసెంబ్లీ లాబీ హాల్లోకి ఎమ్మెల్యేల పీఏలకు అనుమతిలేదని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రతిఒక్కరికి మాస్కులు తప్పనిసరి అని, లేకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు కరోనా కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆక్సీమీటర్లో 90 కంటే తక్కువగా ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. లాబీ పాస్లు రద్దు చేశామని తెలిపారు. ఈ శాసనసభ సమావేశాలకు మీడియా పాయింట్ ఉండదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్ వైద్య బృందం, అసెంబ్లీ- మండలిలో ఒక్కో అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. సభా సమయం వృధా కాకుండా సమావేశాలు జరుపుకోవడానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. పార్లమెంట్ తరహాలో, కోవిడ్ నిబంధనలకు లోబడి సమావేశాలు జరుపుతామని స్పీకర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) -
హర్భజన్ విజ్ఞప్తి.. ‘మాస్కు పోడు’
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలు సూచనలు చేశాడు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బహిరంగ దేశాల్లో తిరగొద్దని చెన్నై అభిమానులను కోరాడు. అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశాడు. దీనికోసం అతను తమిళంలోనే మాట్లాడటం విశేషం. ఈమేరకు భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా, 2018లో చైన్నై జట్టులో చేరిన హర్భజన్ మెరుగైన ప్రదర్శనతో ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సీఎస్కే తరపును ఇప్పటివరకు 24 మ్యాచ్లు ఆడిన భజ్జీ 23 వికెట్లు తీశాడు. మొత్తంగా ఐపీఎల్లో 160 మ్యాచ్లాడిన ఈ వెటరన్ స్పిన్నర్ 7.05 సగటుతో 150 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలాఉండగా.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక యూఏఈ క్రికెట్ పిచ్లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చెన్నై జట్టులో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన హర్భజన్కు ఐపీఎల్ 2020 మరింతగా కలిసివచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిమానులు సంబరపడుతున్నారు. (చదవండి: ఐపీఎల్లో డోపింగ్ పరీక్షలు) Mask podu @ChennaiIPL 😷😷 @chennaipolice_ pic.twitter.com/qZBIRVt74g — Harbhajan Turbanator (@harbhajan_singh) August 26, 2020 -
60 ఏళ్లు దాటితే విధిగా సర్జికల్ మాస్క్
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా ఎవరు ఎలాంటి మాస్కులు వాడాలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇప్పటివరకూ ఏ వయసు వారు ఎలాంటి మాస్కులు వాడాలన్న ప్రత్యేక నిబంధనలేవీ లేవు. డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు ఇవీ.. ► 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ► 60 ఏళ్లు పైబడిన వారు విధిగా సర్జికల్ మాస్కు వాడాలి. ► ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ► 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో మాస్కులు ధరించవచ్చు. హైరిస్క్ ప్రాంతాలను బట్టి ఆ మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ► 12 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఫ్యాబ్రిక్ మాస్కు (3 పొరల వస్త్రంతో)ను వాడవచ్చు. -
మాస్కుల కోసం 33 లక్షల మీటర్ల క్లాత్ కొనుగోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంకా మాస్కులు అందని ప్రతి ఒక్కరికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 33 లక్షల మీటర్ల క్లాత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర జనాభా 4,87,54,176 మంది కాగా ఇప్పటికే 3,70,13,300 మందికి మూడేసి చొప్పున 11.10 కోట్ల మాస్కులను ప్రభుత్వం పంపిణీ చేసింది. మాస్కుల తయారీకి అవసరమైన క్లాత్ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో నుంచి అధికారులు కొనుగోలు చేశారు. అయితే.. 1.30 కోట్ల మీటర్ల క్లాత్ను సరఫరా చేశాక నిల్వలు తరిగిపోవడంతో ఆ సంస్థ సరఫరా నిలిపివేసింది. దీంతో మాస్కుల పంపిణీ పలుచోట్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి రాగానే ప్రైవేట్ వ్యాపారుల వద్ద నుంచి అయినా క్లాత్ కొనుగోలు చేసి.. మిగిలిపోయిన వారికి కూడా మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు క్లాత్ కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ► ఇంకా మాస్కులు అందని 1,17,40,876 మందికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు 33 లక్షల మీటర్ల క్లాత్ అవసరమని అధికారులు నిర్ధారించారు. ► టెండర్ ప్రక్రియలో ఆప్కోకు చెల్లించిన ధర కంటే దాదాపు 30–35 శాతం తక్కువ ధరకే క్లాత్ సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు. ► విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అందరికీ మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ పూర్తయిందని.. మిగిలిన జిల్లాల్లో మూడొంతులు పూర్తయిందని చెప్పారు. ► మాస్కులు కుట్టే పనిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఒక్కొక్క మాస్కు సింగిల్ లేయర్తో కుడితే రూ. 3 చొప్పున.. డబుల్ లేయర్తో కుడితే రూ.3.50 చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు. ► పొదుపు సంఘాల మహిళలు మాస్కులు తయారుచేశాక వాటిని సెర్ప్, మెప్మా సిబ్బంది సేకరించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తారు. -
తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం.. కరోనా సాయంలో భాగంగా తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 2.44 లక్షల ఎన్–95 మాస్కులు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు అందజేసినట్లు వివరించింది. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్మెంట్–డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు.. ఆ సంస్థ ద్వారా మాస్కులు, కిట్లు ఇతర సాయాలు తెలంగాణకు పంపినట్లు తెలిపింది.(కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి) కుటుంబసభ్యులకు కరోనా బాధితుల సమాచారం గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైద్య ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
మాస్కు పెట్టుకోనందుకు 35,308 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మార్కులు పెట్టుకోనందుకు 35,308 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ హైకోర్టుకు నివేదించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న వివరాలతో ఇటీవల ఆయన నివేదిక సమర్పించారు. సామాజిక దూరం పాటించనందుకు 1,211 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో సమావేశమైనందుకు 82 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వివాహానికి 50 మంది, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదని, జీవో 75 జారీ చేశామన్నారు. దీన్ని ఉల్లంఘించి వివాహాలకు పెద్ద సంఖ్యలో హాజరైనందుకు 24 కేసులు నమోదు చేయగా.. 101 మందిని, అలాగే అంత్యక్రియలకు ఎక్కువ సంఖ్యలో హాజరైనందుకు 6 కేసులు నమోదు చేసి 27 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. ‘దేశంలోనే మొదటగా రాష్ట్రంలోనే మార్చి 14 నుంచే పాఠశాలలు, బార్లు, క్లబ్బులను మూసేయాలని నిర్ణయించాం. మార్చి 23 నాటికి 33 కేసులు ఉండగా.. జూన్ 29 నాటికి 15,394 కేసులు నమోదయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కీలక సమాచారంతో మీడియా బులెటిన్ ఇస్తున్నాం. జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలతో కలెక్టర్లు కూడా మీడియాకు సమాచారం ఇస్తున్నారు. లక్షణాలున్న వారికి ర్యాపిడ్ యాం టిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జూన్ 29న 3,457 పరీక్షలు చేయగా.. జూలై 25 నాటికి వీటిసంఖ్యను 15,654కు పెంచి మొత్తం 2,64,852 మందికి పరీక్షలు చేశాం. పాజిటివ్ కేసులసంఖ్య 27.3 శా తం నుంచి 10.18 శాతానికి తగ్గింది. ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్వో) నిర్దేశించింది. అంతకంటే ఎక్కు వే ఇక్కడ పరీక్షలు చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు 57 ప్రభుత్వ, 54 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ కేటగిరీ బెడ్లు అందుబాటులో ఉన్నాయో మీడియా బులెటిన్లో స్పష్టంగా ఇస్తున్నాం. కంటైన్మెంట్ జోన్ల లో కేసులను గుర్తిస్తున్నాం. హైకోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తు న్నాం’ అని నివేదికలో వివరించారు. -
ఈ పులి ఫోటోతో పోలీసులు ఏం చెబుతున్నారంటే..
నాగ్పూర్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల సంక్షేమం కోసం పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్ గురించి ఎప్పటికప్పుడూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ఆకారాన్ని పోలిన హెల్మెట్లను ధరించి కొందరు పోలీసులు అవగాహన కల్పిస్తుంటే మరికొందరు సోషల్మీడియా వేదికగా పలు మీమ్స్ చేశారు. తాజాగా నాగ్పూర్ పోలీసులు తమ అధికారిక ట్విటర్ ఖాతా వేదికగా ఓ పులి ఫోటోతో మాస్కులు ధరించడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. (చదవండి: వైరల్: పెద్దపులినే బురిడి కొట్టించిన బాతు ) వరల్డ్ టైగర్ డే సందర్భంగా ఓ పులి తన కాలిని ముఖానికి అడ్డంగా పెట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ముక్కు కిందకు మాస్క్ ధరించిన వ్యక్తులను చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది’క్యాప్షన్ పెట్టారు. మరో ట్వీట్లో ‘మాస్క్ ధరించి పులిలా ఉండండి’అని చెప్పుకొచ్చారు. చాలా మంది మాస్కులు సరిగా ధరించకపోవడంతో అవగాహన కోసం పోలీసులు ఈ ట్వీట్ చేశారు. That moment when we see people wearing masks below their nose: pic.twitter.com/Hq7x9r3nIM — Nagpur City Police (@NagpurPolice) July 29, 2020 నాగ్పూర్ పోలీసులు పెట్టిన ఈ పోస్ట్.. ముసిముసి నవ్వులు నవ్వించడమే కాకుండా ముసుగు ఎలా ధరించాలో కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్వీట్ కామెడీగానే ఉన్నా.. మంచి విషయం చెప్పారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘పులి అడవికి రాజు అయితే.. నాగ్పూర్ పోలీసులు సోషల్ మీడియాకు రాజులు’,‘మాస్కులు ఎలా ధరించకూడదో చెప్పినందుకు ధన్యవాదాలు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Be a Tiger. Wear masks properly.#InternationalTigerDay#NagpurPolice — Nagpur City Police (@NagpurPolice) July 29, 2020 -
మాస్కు గొడవ ప్రాణాలమీదకు తెచ్చింది!
సాక్షి, కరీంనగర్: కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరైంది. అయితే, కరీంనగర్లో ఓ యువకుడికి మరో వ్యక్తి ఇదే విషయం చెప్పడం అతని ప్రాణాల మీదకు వచ్చింది. మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు హఫీజ్ అనే యువకుడు రాకేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రాకేష్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది. హెయిర్ కటింగ్ కోసం సెలూన్ షాప్ వద్దకు వచ్చిన అజీజ్ను అదే గ్రామానికి చెందిన రాకేష్ మాస్క్ పెట్టుకొమ్మని కోరాడు. అందుకు నిరాకరించిన అజీజ్ రాకేష్తో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా కత్తితో అతనిపై దాడికి తెగబడ్డాడు. పక్కటెముకల వద్ద, వీపులో రెండు కత్తిపోట్లు దించాడు. గాయపడ్డ రాకేష్ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, నిందితున్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అజీజ్ గంజాయి మత్తులో ఉండి దాడి చేసినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. (ఒంటరై ‘పోయాడు’) -
మాస్కు గొడవ ప్రాణాలమీదకు తెచ్చింది!
-
ఇంటింటా కరోనా బడ్జెట్..!
కొత్తవలస: కరోనా.. ఆరోగ్యంతో పాటు ఇంటి బడ్జెట్నూ భారంగా మార్చింది. శానిటైజర్లు, మాస్క్ల వినియోగం తప్పనిసరి చేసింది. చేతుల శుభ్రత ప్రాధాన్య అంశంగా మారింది. వీటి కి తోడు రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు సి– విటమిన్ అందించే పండ్లు, కూరగాయలతో పాటు అదనపు ఆహారంగా డ్రై్రçఫూట్స్, గుడ్లు తీసుకోవడంతో ప్రతి ఇంటా కరోనా బడ్జెట్ పెరిగింది. సంపన్నకుటుంబాలకు పెద్దగా ఆర్థిక భారం కాకపోయినా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఖర్చు భారంగా మారింది. నెలకు సుమారు రూ.1090 అదనపు ఖర్చు అవుతోంది. చేసేది లేక ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చుతో పాటూ కరోనా ఖర్చును మౌనంగా భరిస్తున్నారు. జిల్లా ప్రజలపై భారం... జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 23,44,474(23.4) జనాభా, 5,87,149 కుటుంబాలు ఉన్నాయి. కొత్త గణాంకాల ప్రకారం మరో 10 శాతం జనాభా ఉంటారని అంచనా. ఈ లెక్కన పెరిగిన నెలవారీ కరోనా బడ్జెట్ సుమారు రూ.60 నుంచి 70 కోట్లు ఉండొచ్చని అంచనా. పరిశుభ్రత ఖర్చు తప్పనిసరి కావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా మారిపోయింది. చాలీచాలని జీతాలు, కూలి డబ్బులతో గడిపే కుటుంబాలకు ఈ బడ్జెట్ భారంగా మారింది. శుభ్రత ఖర్చు పెరిగింది.. కరోనా వైరస్ వ్యాప్తి తో ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వడం అలవాటు చేసుకున్నాం. దీనికోసం శానిటైజర్లు, లైజాల్, ఫినాయిల్, హార్పిక్ వంటివి వినియోగం పెరిగింది. దీంతో ప్రతినెల ఖర్చులు పెరిగాయి. – బొడ్డు గోవిందరావు, కాంట్రాక్టు ఉద్యోగి, తుమ్మికాపల్లి శానిటైజర్ కొనుగోలు చేస్తున్న పట్టణవాసి అదనపు భారం మా ఇంట్లో ఆరుగురం ఉంటున్నాం. కరోనా బారిన పడకుండా అందరికీ మాస్క్లు కొనుగోలు చేస్తున్నాం. శానిటైజర్లు విధి గా వాడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుస్తులు తరచూ ఉతకాల్సి వస్తోంది. దీంతో నెలకు రూ.1500 అదనపు ఖర్చు పెరిగింది. – దాసరి శ్రీదేవి, ఉద్యోగిని, కంటకాపల్లి ఇబ్బంది అయినా తప్పదు ఇంటిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రస్తుత పరిస్థి తుల్లో జాగ్రత్తలు తప్పనిసరి. మాస్క్లు, శానిటైజర్లు, సబ్బులు వాడకం పెరగడంతో నెలవారీ ఖర్చు పెరిగింది. రూ.1000 నుంచి రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోంది. – ఎం.లక్ష్మి, కొత్తవలసటౌన్, మసీదు వీధి -
విజయవాడలో కరోనా డస్ట్బిన్ల ఏర్పాటు
-
స్వాతంత్య్ర వేడుకలు భారీగా వద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతూ ఉండడంతో ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను భారీగా నిర్వహించవద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిసరాల శానిటైజేషన్ వంటి నిబంధనల్ని పాటిస్తూ కార్యక్రమాల నిర్వహణకు టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సారి స్వాతంత్య్రదిన వేడుకలకు కోవిడ్–19పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల్ని ఆహ్వానించి, ఈ సంక్షోభ సమయంలో వారు చేస్తున్న సేవల్ని గుర్తించాలని పిలుపునిచ్చింది. వైరస్పై పోరాడి కోలుకున్న వారిని కూడా పిలవాలని చెప్పింది. ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలను టెలికాస్ట్ చేయాలని వివరించింది. కాగా, ఎర్రకోటలో కూడా చాలా సాధారణంగానే వేడుకలు జరగనున్నాయి. సాయుధ బలగాల గౌరవ వందనం అనంతరం ప్రధాని జెండా ఎగురవేస్తారు. ప్రధాని మోదీ ప్రసంగం, జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ రిసెప్షన్ నిర్వహిస్తారు. -
వాడిన మాస్క్లను ఎలా పడేయాలంటే..
న్యూఢిల్లీ: మాస్క్లను, చేతి తొడుగులను వాడిన తరువాత, వాటిని ముక్కలుగా కత్తిరించి కనీసం 72 గంటల పాటు పేపర్ బ్యాగ్లలో ఉంచి, ఆ తరువాత మాత్రమే పారవేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తాజాగా విడుదల చేసిన కోవిడ్–19 మార్గదర్శకాల్లో పేర్కొంది. వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, సంస్థల్లో సాధారణ జనం వాడిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ముక్కలుగా చేసి, ప్రత్యేక బిన్లో మూడు రోజుల పాటు ఉంచిన తరువాత, మామూలు డస్ట్బిన్లో వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో తెలిపారు. బయో మెడికల్ వేస్ట్ని పసుపురంగు బ్యాగుల్లో వేయాలని, ఈ పసుపు రంగు బ్యాగులను సాధారణ చెత్తను తీయడానికి వాడరాదని వెల్లడించారు. అయితే కోవిడ్ రోగులు వాడిన ఖాళీ వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహారాన్ని బయో మెడికల్ వేస్ట్తో కలపరాదని, సాధారణ చెత్తతో పాటే వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
మాస్కులు ధరించమని ఆదేశించలేను: ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తు నిరంతరం వార్తల్లో ఉంటారు. కరోనా వైరస్ను నివారించేందుకు ప్రపంచ దేశాధినేతలు ప్రజలకు మాస్క్లు ధరించాలని పిలుపునిస్తే, ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా మాస్క్లు ధరించమని ప్రజలను ఆదేశించలేనని, ప్రజల స్వేచ్ఛకు వదిలేయాలని తాను కోరుకుంటానని అన్నారు. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాత్రం భారీ జనసమూహాలలో మాస్క్లు ధరించాల్సిన అవసరాన్ని రాజకీయ నాయకలు ప్రజలకు తెలియజేయాలని ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ట్రంప్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ప్రజలందరు మాస్క్లు ధరించాలనే నిబంధనను తాను వ్యతిరేకిస్తానని, మాస్క్లు వేసుకున్నంత మాత్రాన పూర్తిగా వైరస్ను నియంత్రించలేమని అభిపప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు మాస్క్ ధరించని ట్రంప్, ఇటీవల ఒక సారి మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు. నిపుణులు చెబుతున్నట్లు అవసరమైనప్పుడు మాస్క్ ధరించడం పెద్ద ఇబ్బంది కాదని, కానీ సామాజిక దూరాన్ని పాటించడం కొంత ఇబ్బందేనని తెలిపారు. కాగా ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో, భారీ జనసమూహాలకు అవకాశం ఉందని, అందువల్ల అవసరమైన చోట మాస్క్లు ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు సూచించారు. (చదవండి: భారతీయులంటే ఇష్టం.. చైనీయులు కూడా: ట్రంప్) -
ఆ మాస్క్లకు భారీ డిమాండ్
చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు బయటకు అడుగుపెడితే మాస్క్లు తప్పనిసరి కావడంతో మార్కెట్లో వెరైటీ మాస్క్లు దర్శనమిస్తున్నాయి. బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలతో చేసిన మాస్క్లకు సైతం ఆదరణ పెరుగుతోంది. మాస్క్లను ఆభరణంగా వాడవచ్చని, ఆ తర్వాత దాన్ని కరిగించి ఇతర ఆభరణాలు చేయించుకోవచ్చని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ జ్యూవెలర్ షాప్ యజమాని రాధాకృష్ణన్ ఆచార్య చెబుతున్నారు. 18 క్యారెట్, 22 క్యారెట్ హాల్మార్క్ గోల్డ్తో తాము మాస్క్లు తయారుచేస్తామని నాణ్యతకు పూర్తి భరోసా ఇస్తామని అన్నారు. వెండి మాస్క్ను 15,000 రూపాయలకు, బంగారు మాస్క్లను 2,75,000 రూపాయల నుంచి ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ఈ మాస్క్లను పూర్తిగా చేతితోనే తయారు చేస్తామని, ఈ రంగంలో తనకు 35 ఏళ్ల అనుభవం ఉందని రాధాకృష్ణన్ వివరించారు. 0.66 ఎంఎం మందం కలిగిన బంగారు తీగలను చుట్టే ప్రక్రియ ఒక్కటే మెషీన్పై చేస్తామని తెలిపారు.చదవండి : కోవిడ్-19 : మరోసారి పాజిటివ్ వస్తే! బెంగళూర్, హైదరాబాద్తో పాటు ఉత్తరాది నుంచి తమకు ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకూ బంగారు, వెండి మాస్క్ల కోసం 9 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు. ప్రతిరోజూ వీటికోసం పెద్దసంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. గంటల తరబడి ఈ మాస్క్లను ధరించడంలో అసౌకర్యం గురించి ప్రస్తావించగా ఈ మాస్క్లు క్లాత్ వంటి అనుభూతిని ఇస్తాయని, మాస్క్ పైభాగంలో లోపల ఖరీదైన లోహం వాడతామని చెప్పారు. మాస్క్లో ఉండే పలు లేయర్లను క్లాత్తో చేయడంతో వీటిని ఉతికి తిరిగి వాడుకోవచ్చన్నారు. అయితే వీటిని గట్టిగా వంచడం వంటివి చేయరాదని అన్నారు. అవసరమైతే స్వర్ణకారుడిని సంప్రదించచి క్లాత్ మెటీరియల్ను మార్చుకోవచ్చన్నారు. ఈ మాస్క్లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొందని అన్నారు. -
ఏపీలో ఆంక్షలు మరింత కఠినం..
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి మరింత కఠినంగా ఆంక్షలు అమలు కానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశిలిచ్చింది. (పది లక్షలు దాటిన కేసులు) ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, మాస్కు ధరించటాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఫేస్ మాస్కు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ('కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్') -
మాస్క్తో రిస్క్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కొద్దీ మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారవర్గాలతోపాటు సాధారణ ప్రజలుమాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిల్లో మెడికల్ మాస్కులు అయిన ఎన్95 మాస్కులు, సర్జికల్ మాస్కులతోపాటు పలు రకాలున్నాయి. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు. ► దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి(ఎంసీఐ) అంచనా వేసింది. ► మన రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్ మాస్కులు వాడుతున్నారు. వందేళ్ల వరకు మట్టిలోనే.. ► మెడికల్ మాస్కులు సింథటిక్ రేసిన్తో తయారవుతాయి. వాటిలో పాలిస్టిరిన్, పాలికార్బనేట్, పాలిథిలియన్ వంటివి ఉంటాయి. ఆ మాస్కులు మట్టిలో కలసిపోకుండా వందేళ్ల వరకూ భూమిలోనే ఉంటాయి. పర్యావరణానికి తీవ్ర హానికరంగా మారతాయి. ► ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకునిదర్శనం. అదే జరిగితే సముద్ర జలాల్లోజెల్లీఫిష్ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ► 2030నాటికి సముద్ర జలాల్లోచేరతాయని అంచనా వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు పదేళ్లు ముందుగానే 2020లోనే పోగుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యర్థాల నిర్వహణ ఇలా.. ► మాస్కుల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీనిపై డబ్ల్యూహెచ్వో, కేంద్ర ప్రభుత్వ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు విధానాలు నిర్దేశించాయి. ► ఎన్95, సర్జికల్ మాస్కులను ఒకసారి మాత్రమే వాడాలి. ► వైద్యులు, వైద్య సిబ్బంది వాడిన మాస్కులను 850 డిగ్రీల సెల్సియస్ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక గ్యాస్ క్లీనింగ్ ఎక్విప్మెంట్తో కాల్చివేయాలి. ► సాధారణ ప్రజల వాడేసిన మాస్కులను ఇతర వ్యర్థ పదార్థాలతో కలపకూడదు. పారిశుధ్య సిబ్బంది వాటిని సేకరించి బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీతో కాల్చివేయాలి. లేదా పదడుగుల లోతున భూమిలో పాతిపెట్టాలి. కత్తిమీద సాము.. ► మాస్కుల వ్యర్థాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది. ఇంతగా మాస్కులు, మెడికల్ వ్యర్థాలు రోజూ పోగవుతాయని ఎవరూ ఊహించలేదు. వాడిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ పారేస్తుండటంతో పరిస్థితి దిగజారుతోంది. ► ఢిల్లీలో ఆసుపత్రుల నుంచి సేకరించిన మెడికల్ వ్యర్థాలలో 70శాతం మాత్రమే శాస్త్రీయంగా నిర్వహిస్తుండగా 30 శాతం రోడ్లపక్కన, నీటివనరుల్లో పడి ఉంటున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ► కరోనా వైరస్ జన్మస్థలం చైనాలోని వూహాన్లో 1.10 కోట్ల జనాభా ఉంది. ఆ నగరంలో సగటున రోజుకు 200టన్నుల మెడికల్ వ్యర్థాలు పోగయ్యాయి. అందులో నాలుగో వంతు వ్యర్థాల నిర్వహణకు మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్నాయి. చేపల్లో చేరి మళ్లీ మనుషుల్లోకి.. ► ఒక్కో మెడికల్ మాస్కులో దాదాపు 25 గ్రాముల వరకు పోలిపాలిథిన్ ఉంటుంది. దీనివల్ల చేపలతోపాటు 600 రకాల జీవజాతులకు ప్రమాదం పొంచి ఉంది. ఆ చేపలను తినడంతో మనుషులుకూడా అనారోగ్యసమస్యలకు గురవుతారు. ► జర్మనీలో నెలకు 1.70కోట్ల మాస్కులు వాడుతుండటంతో పర్యావరణంలోకి 850 టన్నుల కార్బన్ డయాక్సైడ్వదులుతున్నట్లేనని నిపుణులు అంచనా వేశారు. ఒక కారులో ప్రపంచం చుట్టూ 1,060సార్లు తిరిగితే విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది సమానమని తెలిపారు. రీసైక్లింగ్ సాధ్యమా? భారీ సంఖ్యలో వాడుతున్న మెడికల్ మాస్కులను రీసైక్లింగ్ చేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. వాడేసిన మాస్కులను సేకరించి వేరుచేసి రీసైకిల్ చేసి కొత్త మాస్కు తయారు చేయాలి. కానీ అందుకు అయ్యే ఖర్చు ఆ మాస్కు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. మాస్కుల రీసైక్లింగ్ అచరణ సాధ్యంకాదని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ► మెడికల్ మాస్కులతో పొంచి ఉన్న పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రత్యామ్నాయ మాస్కుల వాడకాన్ని ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది మినహా మిగిలిన వర్గాలు కాటన్ మాస్కులను వాడాలని సూచిస్తున్నారు. ► కాటన్మాస్కులు డిటర్జెంట్/ డెట్టాల్తో ఉతికి ఎండలో ఆరవేసి మళ్లీ వాడుకోవచ్చు. పలు కంపెనీలు, కుటీర పరిశ్రమలు కాటన్తో చేసిన మాస్కులను తయారీ చేసి విక్రయిస్తున్నాయి. ఇళ్లల్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ► ఫైబర్తో తయారైన రీయూజబుల్ మాస్కులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. -
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్కు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉభయసభల సెక్రెటరీ జనరల్స్ అధికారులను ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ ఈ సమావేశాల్లో ఎంపీలు స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంట్ ప్రాంగణంలోని ఆయా సభల్లోనే జరిగే వీలుందని వెల్లడించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. అయితే, ఈ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించాలో ఇంకా తేదీలు నిర్ణయించలేదు. వాస్తవానికి సెప్టెంబర్ 22వ తేదీలోగా ప్రారంభించాల్సి ఉంది. -
వరుడికి వజ్రాల మాస్కు.. ధర తెలిస్తే..
అహ్మదాబాద్: కరోనా కాలంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ వరుడికి వింత కోరిక పుట్టింది. లాక్డౌన్ నిబంధనల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి తనకు, కాబోయే భార్య కోసం ఓ షాపులో వజ్రాల మాస్కు తయారు చేయించుకున్నాడు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో చోటుచేసుకుంది. ఇక పెళ్లి కొడుకు కోరిక మేరకు తమ డిజైనర్లు రూపొందించిన మాస్కులకు మంచి డిమాండ్ ఏర్పడిందని.. దీంతో మరిన్ని వజ్రాల మాస్కులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు ఆభరణాల వ్యాపారి దీపక్ చోక్సీ తెలిపారు. లక్షన్నర నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు పెడితే బంగారు, వజ్రాల మేళవింపుతో కూడిన మాస్కులను అందిస్తామని చెబుతున్నారు. (బడా బాబుకి బంగారు మాస్క్, ధర ఎంతంటే) ఈ విషయం గురించి దీపక్ చోక్సీ మాట్లాడుతూ.. ‘‘లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత ఓ వ్యక్తి మా దుకాణానికి వచ్చారు. తన పెళ్లి జరుగబోతోందని.. తనకు, వధువు కోసం వెరైటీ మాస్కులు కావాలని అడిగారు. దీంతో మాకు ఓ ఐడియా వచ్చింది. యెల్లో గోల్డ్, అమెరికన్ వజ్రాలను ఉపయోగించి మాస్కులు తయారు చేశాం. దీని ధర ఇంచుమించు లక్షన్నర. ఇక వైట్ గోల్డ్, రియల్ డైమండ్స్తో మరో మాస్కు కూడా తయారు చేశాం. దీని కోసం 4 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరానికి అనుగుణంగా.. వేరే నగలు చేయించుకున్నపుడు వజ్రాలను మాస్కు నుంచి వేరు చేయవచ్చు. ఇక ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అన్ని విధాలా సురక్షితమైన వస్త్రాన్నే మాస్కు తయారీలో వాడుతున్నాం. చాలా ఆర్డర్లు వస్తున్నాయి. పెళ్లిలో దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు తయారు చేయాల్సిందిగా వధూవరులు కోరుతున్నారు’’అని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని పుణెకు చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి సుమారు 2 లక్షల 89 వేల ఖరీదైన గోల్డెన్ మాస్క్ను తయారు చేయించుకున్న సంగతి తెలిసిందే. -
ఇది వ్యాపారి ఐడియా
మహారాష్ట్ర, పూనా జిల్లా పింప్రి– చించ్వాడ్లో శంకర్ కురాడే గుర్తున్నాడా? బంగారు మాస్క్ చేయించుకున్న సంపన్నుడు. ఆ మాస్కు మన కళ్ల ముందు నుంచి చెరిగి పోయేలోపు అలాంటిదే మరో విచిత్రం వజ్రాల ఫేస్ మాస్క్. ధర లక్షా నలభై వేల రూపాయలు. కుశాల్భాయ్ సూరత్లో ఆభరణాల వ్యాపారి. అతడు వజ్రాలు పొదిగిన ఫేస్ మాస్కులను తయారు చేశాడు. ఒక్కో మాస్కు ధర డిజైన్ను బట్టి లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇంత ధర పెట్టి ఎవరు కొంటారని తయారు చేశారు? అని అడిగితే దుకాణం యజమాని మరీ విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఇప్పుడు మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. పెళ్లి వేడుకలో మంచి దుస్తులు, ఆభరణాలు ధరించిన తర్వాత ముఖానికి మామూలు సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు ధరిస్తే చూడడానికి ఏం బాగుంటుంది? ఇలాంటి వజ్రాల మాస్కు ధరిస్తే అందానికి అందం, దర్జాకు దర్జా అంటున్నాడు. ఇంకా... శంకర్కురాడే బంగారు మాస్క్కే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేశాడు. వజ్రాల మాస్కు లక్షకు కూడా వస్తుంది కదా! అని తార్కికంగా ప్రశ్నిస్తున్నాడు కూడా. పైగా నా డైమండ్ మాస్క్ను ఎన్నాళ్లయినా ధరించవచ్చు. కరోనా పోయిన తర్వాత నా దుకాణానికి వచ్చి మార్చి మరో ఆభరణం చేయించుకోవచ్చు కదా! అని చాలా కన్విన్సింగ్గా చెప్తున్నాడు. అతడి మాటలు ఎక్కువ సేపు వింటే ఎవరైనా సరే డైమండ్ మాస్క్ మాయలో పడేట్టుగానే ఉన్నాయి. కుశాల్ భాయ్ తన మాస్కుకు ‘డి కుశాల్ భాయ్’ ఇంగ్లిష్ అక్షరాల ఆకారంలో వజ్రాలను అమర్చుకున్నాడు. ఈ అక్షరాలకు కొద్దిగా పైన ‘డి.కె’ అని లోగో కూడా వజ్రాలతోనే ఉంది.