mens singles
-
క్వార్టర్స్లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
విన్నర్ సినెర్...
ఒకరేమో ఇప్పటికే ఆడిన రెండు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో విజేతగా నిలువగా... మరొకరు ఆడిన రెండు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ఓడిపోయారు. గ్రాండ్స్లామ్ టైటిల్ ఎలా గెలవాలో ఇప్పటికే ఒకరికి అనుభవం ఉండగా... మరొకరికి ఆ అనుభవం లేదు. అయితేనేం ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా ‘గ్రాండ్’ విజయాన్ని అందుకోవాలని ఒకరు... వరుసగా మూడోసారీ ‘గ్రాండ్’ టైటిల్ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మరొకరు బరిలోకి దిగారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ కాగా... మరొకరు ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.... ఈ ఆసక్తికర నేపథ్యంలో ఆదివారం ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావించారు. కానీ రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత సినెర్ తన ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి పాయింట్ నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచి జ్వెరెవ్ జోరుకు అడ్డుకట్ట వేసిన సినెర్ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. మరోవైపు సినెర్ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక జ్వెరెవ్ వరుస సెట్లలో చేతులెత్తేసి కెరీర్లో మూడోసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో, 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో జ్వెరెవ్ పరాజయం పాలయ్యాడు.మెల్బోర్న్: ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో కొత్త చాంపియన్ అవతరించలేదు. గత ఏడాది విజేతగా నిలిచిన ఇటలీ ప్లేయర్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ ఈ సంవత్సరం కూడా టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 42 నిమిషాల్లో 6-3, 7-6 (7/4), 6ృ3తో రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన సినెర్కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 4 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్కు 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. గతంలో జ్వెరెవ్పై రెండుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సినెర్ గత రికార్డును పట్టించుకోకుండా ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఏస్తో మొదలుపెట్టిన సినెర్ తొలి గేమ్లో జ్వెరెవ్ చేసిన మూడు తప్పిదాలతో ఒకటిన్నర నిమిషంలోనే గేమ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎనిమిదో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సినెర్ తొమ్మిదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని 46 నిమిషాల్లో సెట్ గెలిచాడు. రెండో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్కు హోరాహోరీగా పోటీపడ్డారు. దాంతో ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో స్కోరు 6ృ6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో సినెర్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో రెండో సెట్నూ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని ఆరో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సినెర్, ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 5ృ2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఎనిమిదో గేమ్ను జ్వెరెవ్ కాపాడుకోగా, తొమ్మిదో గేమ్లో సినెర్ తన సర్వీస్ను కాపాడుకోవడంతోపాటు బ్యాక్హాండ్ విన్నర్ షాట్తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సినెర్ సర్వీస్లో జ్వెరెవ్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సాధించే అవకాశాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం. 4 గత 35 ఏళ్లలో గ్రాండ్స్లామ్ ఫైనల్లో బ్రేక్ పాయింట్ ఎదుర్కోని నాలుగో ప్లేయర్ సినెర్. గతంలో పీట్ సంప్రాస్ (బోరిస్ బెకర్తో 1995 వింబుల్డన్ ఫైనల్), రోజర్ ఫెడరర్ (ఫిలిప్పోసిస్తో 2003 వింబుల్డన్ ఫైనల్), రాఫెల్ నాదల్ (కెవిన్ అండర్సన్తో 2017 యూఎస్ ఓపెన్ ఫైనల్) ఈ ఘనత సాధించారు.5 హార్డ్ కోర్టులపై వరుసగా మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ సినెర్. గతంలో జాన్ మెకన్రో (1979, 1980, 1981 యూఎస్ ఓపెన్), ఇవాన్ లెండిల్ (1985, 1986, 1987 యూఎస్ ఓపెన్), రోజర్ ఫెడరర్ (2005, 2006, 2007 యూఎస్ ఓపెన్), నొవాక్ జొకోవిచ్ (2 సార్లు; 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, 2012 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్; 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు.1 అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఇటలీ ప్లేయర్గా సినెర్ గుర్తింపు పొందాడు. రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్తో నికోలా పిత్రాంజెలి (1959, 1960 ఫ్రెంచ్ ఓపెన్) పేరిట ఉన్న రికార్డును సినెర్ (2024, 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2024 యూఎస్ ఓపెన్) సవరించాడు. 1 జిమ్ కొరియర్ (అమెరికా; 22 ఏళ్ల 5 నెలల 14 రోజులు; 1992ృ1993) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కుడిగా సినెర్ (23 ఏళ్ల 5 నెలల 10 రోజులు) గుర్తింపు పొందాడు.8 కెరీర్లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లోనూ విజేతగా నిలిచిన ఎనిమిదో ప్లేయర్ సినెర్. కానర్స్ (అమెరికా), జాన్ బోర్గ్, ఎడ్బర్గ్ (స్వీడన్), కుయెర్టన్ (బ్రెజిల్), ఫెడరర్, వావ్రింకా (స్విట్జర్లాండ్), అల్కరాజ్ (స్పెయిన్) ఈ ఘనత సాధించారు. 2019 ఆరేళ్ల తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, రెండో ర్యాంకర్ తలపడ్డారు. ఈసారీ నంబర్వన్ ర్యాంకర్ వరుస సెట్లలో గెలిచాడు. 2019లో నంబర్వన్ జొకోవిచ్ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్పై వరుస సెట్లలో నెగ్గాడు. 6 కెరీర్లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ఓడిన ఆరో ప్లేయర్ జ్వెరెవ్. ఈ జాబితాలో అగస్సీ (అమెరికా), ఇవానిసెవిచ్ (క్రొయేషియా), ముర్రే (బ్రిటన్), థీమ్ (ఆ్రస్టియా), రూడ్ (నార్వే) ఉన్నారు. -
నిశేష్ జోరుకు మోన్ఫిల్స్ బ్రేక్
ఆక్లాండ్: ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి విజయ పరంపరకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ 6–7 (5/7), 4–6తో ప్రపంచ 52వ ర్యాంకర్, ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో ఓడిపోయాడు. మోన్ఫిల్స్తో 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 19 ఏళ్ల నిశేష్ మూడు ఏస్లు సంధించాడు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో మోన్ఫిల్స్ పైచేయి సాధించాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు తొమ్మిదో గేమ్లో నిశేష్ సర్వీస్ను మోన్ఫిల్స్ బ్రేక్ చేసి 5–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత పదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకున్న మోన్ఫిల్స్ విజయాన్ని ఖరారు చేసుకొని కెరీర్లో 35వసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్కు చేరుకున్నాడు.సెమీస్లో ఓడిన నిశేష్కు 35,480 డాలర్ల (రూ. 30 లక్షల 54 వేలు) ప్రైజ్మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్లో నిశేష్ 27 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 106వ ర్యాంక్కు చేరుకోనున్నాడు. ఈనెల 12న మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో పదిసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్తో నిశేష్ తలపడతాడు. -
డిఫెండింగ్ చాంపియన్పై నిశేష్ సంచలన విజయం
ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 6–4, 5–7, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిశేష్ తొమ్మిది ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గత నెలలో ప్రొఫెషనల్గా మారిన నిశేష్ ఈ టోర్నీ తొలి రౌండ్లో 6–2, 6–2తో 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై గెలిచాడు. మరోవైపు అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 11–13తో నాలుగో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
చాంపియన్స్ రితిన్ ప్రణవ్, వైదేహి
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో టాప్ సీడ్, గుజరాత్ క్రీడాకారిణి వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన వైదేహి 6–3, 6–3తో మాయా రేవతి (తమిళనాడు)పై విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన తుది పోరులో తొలి గేమ్ కోల్పోయిన వైదేహి ఆ తర్వాత వరుసగా మూడు గేమ్లు నెగ్గి ముందంజ వేసింది. అదే జోరులో తొలి సెట్ కైవసం చేసుకున్న వైదేహి.. రెండో సెట్ కూడా నెగ్గి రెండోసారి జాతీయ చాంపియన్గా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్సీడ్ ప్లేయర్ రెథిన్ ప్రణవ్ (తమిళనాడు) 6–4, 2–6, 6–2తో నితిన్ కుమార్ సిన్హా (రైల్వేస్)పై గెలిచి చాంపియన్గా అవతరించాడు. క్వాలిఫయర్గా బరిలోకి దిగిన 17 ఏళ్ల రెథిన్ ప్రణవ్ వరుస విజయాలతో సత్తా చాటి విజేతగా నిలిచాడు. -
సిలిచ్ కొత్త చరిత్ర... 777వ ర్యాంక్తో బరిలోకి దిగి ఏటీపీ సింగిల్స్ టైటిల్ సొంతం
హాంగ్జౌ (చైనా): క్రొయేషియా టెన్నిస్ ప్లేయర్ మారిన్ సిలిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ చరిత్రలో కొత్త ఘనతను నమోదు చేశాడు. ఏటీపీ టైటిల్ నెగ్గిన అతి తక్కువ ర్యాంకింగ్ ప్లేయర్గా అతను గుర్తింపు పొందాడు. మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో సిలిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–6 (7/5), 7–6 (7/5)తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్ను ఓడించి తన కెరీర్లో 21వ టైటిల్ గెలుచుకున్నాడు. హౌంగ్జౌ ఓపెన్లో బరిలోకి దిగే సమయానికి సిలిచ్ ఏటీపీ ర్యాంక్ 777 కావడం విశేషం. 35 ఏళ్ల సిలిచ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇక్కడ ఆడే అవకాశం లభించింది. ఒకప్పుడు పురుషుల సింగిల్స్లో మంచి విజయాలతో టాప్ ఆటగాళ్లలో ఒకడిగా సిలిచ్ కొనసాగాడు. 2014లో తన ఏకైక గ్రాండ్స్లామ్ (యూఎస్ ఓపెన్) నెగ్గిన అతను ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్లలో రన్నరప్గా నిలిచాడు. 2018లో అతను వరల్డ్ నంబర్వన్ ర్యాంకును కూడా అందుకున్నాడు. గత కొంత కాలంగా గాయాలతో అతను చాలా వరకు ఆటకు దూరమయ్యాడు. -
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్వన్ ర్యాంక్కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్లోనే ఫ్రిట్జ్ సరీ్వస్ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్లో సినెర్ సర్వీస్ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్ను బ్రేక్ చేసి తొలి సెట్ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్లో ఫ్రిట్జ్ సరీ్వస్ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్లు ఆడాడు. 55 మ్యాచ్ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్గా సిన్నర్..
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్ వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక న్యూయార్క్లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్పై 6-3, 6-4 , 7-5 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు.దాదాపు రెండు గంటల పాటు సాగిన తుది పోరులో ప్రత్యర్ధిని సిన్నర్ చిత్తు చేశాడు. మూడు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ ఇటాలియన్ స్టార్.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల సిన్నర్కు ఈ ఏడాదిలో ఇది రెండవ గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ను కూడా సిన్నర్ సొంతం చేసుకున్నాడు.తొలి ఇటాలియాన్గా..అదే విధంగా యూఎస్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇటాలియన్గా సిన్నర్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ ఇటలీ టెన్నిస్ క్రీడాకారుడు కూడా యూఎస్ ఓపెన్ టైటిల్ను గెలవలేదు. ఇక ఈ ట్రోఫీని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ చేతుల మీదుగా సిన్నర్ అందుకున్నాడు.చదవండి: ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు -
ఎట్టకేలకు గ్రాండ్స్లామ్ ఫైనల్లో అ‘మెరిక’న్
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ప్లేయర్ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్ టోరీ్నలో ఆండీ రాడిక్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ గ్రాండ్స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు. తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్లోనూ ఫైనల్కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్కే చెందిన సుకాంత్ కదమ్ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
5 గంటల 35 నిమిషాలు
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో బుధవారం అద్భుతం చోటు చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ నమోదైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 184వ ర్యాంకర్ డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్) 5 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 7–6 (7/2), 7–6 (7/4), 4–6, 6–4తో ప్రపంచ 22వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. తొలి సెట్ 68 నిమిషాలు, రెండో సెట్ 67 నిమిషాలు, మూడో సెట్ 72 నిమిషాలు, నాలుగో సెట్ 67 నిమిషాలు, ఐదో సెటస్ 61 నిమిషాలు జరిగాయి. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్లో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్గా ఇవాన్స్, ఖచనోవ్ మ్యాచ్ గుర్తింపు పొందింది. 1992లో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), మైకేల్ చాంగ్ (అమెరికా) మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ 5 గంటల 26 నిమిషాలు సాగింది. ఆనాటి మ్యాచ్లో చాంగ్పై గెలిచిన ఎడ్బర్గ్ ఫైనల్లో పీట్ సంప్రాస్ (అమెరికా)ను కూడా ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఖచనోవ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణాయక ఐదో సెట్లో ఇవాన్స్ ఒకదశలో 0–4తో వెనుకబడి ఓటమికి చేరువయ్యాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన ఇవాన్స్ అనూహ్యంగా వరుసగా ఆరు గేమ్లు గెలిచి సెట్తోపాటు విజయాన్ని కూడా అందుకున్నాడు. సిట్సిపాస్కు షాక్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) శ్రమించి గెలుపొందగా... 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.సినెర్ 2–6, 6–2, 6–1, 6–2తో మెకంజీ మెక్డొనాల్డ్ (అమెరికా)పై, అల్కరాజ్ 6–2, 4–6, 6–3, 6–1తో లీ టు (ఆ్రస్టేలియా)పై, మెద్వెదెవ్ 6–3, 3–6, 6–3, 6–1తో దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)పై నెగ్గారు. సిట్సిపాస్ 6–7 (5/7), 6–4, 3–6, 5–7తో కొకినాకిస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. రాడుకానూ ఓటమి మహిళల సింగిల్స్లో 2021 చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్), రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)... 2019 విజేత బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. సోఫియా (అమెరికా) 6–1, 3–6, 6–4తో రాడుకానూపై, పొటపోవా (రష్యా) 2–6, 6–4, 7–5తో లేలా ఫెర్నాండెజ్పై, ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–7 (5/7), 6–2, 6–4తో బియాంకాపై గెలుపొందారు. రెండో రౌండ్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 5–7తో రూస్ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)... శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) జోడీలు రెండో రౌండ్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–4తో రియాన్ సెగర్మన్–ప్యాట్రిక్ ట్రహక్ (అమెరికా) జంటపై... బాలాజీ–ఆండ్రెజి జోడీ 5–7, 6–1, 7–6 (12/10)తో డానిల్ (న్యూజిలాండ్)–వరేలా (మెక్సికో) జంటపై గెలుపొందాయి. -
US Open 2024: జ్వెరెవ్ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 21 ఏస్లు సంధించాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో కిన్వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో సాకరి తొలి సెట్ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్ నుంచి తప్పుకుంది. -
క్వాలిఫయర్తో జొకోవిచ్ తొలి పోరు
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్పై గురి పెట్టిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్కు యూఎస్ ఓపెన్లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోరీ్నలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్తో జొకోవిచ్ తలపడతాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్ తొలి రౌండ్ను దాటితే రెండో రౌండ్లో అతనికి జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్ జోరు కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఉండే అవకాశముంది.సెమీఫైనల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)లతో జొకోవిచ్ ఆడే చాన్స్ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్డొనాల్డ్తో ఆడతాడు. -
అల్కరాజ్ అనూహ్య పరాజయం
సిన్సినాటి: నాలుగు గ్రాండ్స్లామ్ టైటిళ్లతో స్పెయిన్ సంచలనంగా మారిన కార్లొస్ అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్లో ఓడిపోవడాన్ని ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయాడు. దీంతో కోర్టులోనే ఈ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ తన రాకెట్ను విరగ్గొట్టేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ అల్కరాజ్ 6–4, 6–7 (5/7), 4–6తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం అర్ధరాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. తొలి సెట్ గెలుపొందగా, రెండో సెట్ టైబ్రేక్కు దారితీసింది. ఈ దశలో మ్యాచ్ ఆగిపోగా మరుసటి రోజు టైబ్రేక్లో పుంజుకొని మ్యాచ్ను వరుస సెట్లలోనే ముగించవచ్చని అల్కరాజ్ భావించాడు. కానీ 37 ఏళ్ల వెటరన్ మోన్ఫిల్స్ పట్టుదలగా ఆడటంతో రెండో సెట్ అతని వశమైంది. అదే జోరుతో ఆఖరి సెట్నూ నెగ్గిన మోన్ఫిల్స్ మ్యాచ్ గెలుపొందాడు. దీంతో తన ప్రదర్శన, మ్యాచ్ ఫలితంతో నిరాశచెందిన స్పెయిన్ స్టార్ రాకెట్ బద్దలుకొట్టాడు. తన కెరీర్లోనే ఇదో చెత్తమ్యాచ్ అని, దీన్ని త్వరగా మర్చిపోయి యూఎస్ ఓపెన్పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పాడు. న్యూయార్క్లో ఈ నెల 26 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ జరుగుతుంది. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
జెనరాలి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీనలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. ఆ్రస్టియాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 5–7, 5–7తో ప్రపంచ 45వ ర్యాంకర్ పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ తన సర్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 24 వేలు) ప్రైజ్మనీతోపాటు 25 పాయింట్లు లభించాయి. -
సినెర్... కొత్త నంబర్వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్ల్లో గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్డామ్ ఓపెన్లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
India Open 2024: ప్రణయ్, ప్రియాన్షు శుభారంభం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది. -
Australian Open: శ్రమించిన జొకోవిచ్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 11 ఏస్లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. సబలెంకా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్కు చేరుకున్నారు. -
శ్రీకాంత్ మరో పరాజయం
లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు. ఇతర మ్యాచ్ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది. భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: గత పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు. మూడు ఏస్లు సంధించిన అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్లు కూడా చేశాడు. నెట్వద్దకు 35 సార్లు దూసుకొచ్చిన అతను 28 సార్లు పాయింట్లు గెలిచాడు. నాలుగుసార్లు జ్వెరెవ్ సర్విస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. 2020లో ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన జ్వెరెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. 2021లో చాంపియన్గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు. వొండ్రుసోవాకు కీస్ షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు. -
జొకోవిచ్ శుభారంభం
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అలవోకగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. ఈ గెలుపుతో 36 ఏళ్ల జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ముగిశాక తుది ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంటాడు. ముల్లర్తో గంటా 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ ఆరు ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు నాలుగో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన రూనె 3–6, 6–4, 3–6, 2–6తో కార్బెలాస్ బేనా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ టియాఫో (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కష్టపడి రెండో రౌండ్కు చేరగా... రెండుసార్లు మాజీ రన్నరప్ వొజి్నయాకి (డెన్మార్క్) సులువుగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. కోకో గాఫ్ 2 గంటల 51 నిమిషాల్లో 3–6, 6–2, 6–4తో సిగెముండ్ (జర్మనీ)పై, వొజి్నయాకి 6–3, 6–2తో ప్రొజోరోవా (రష్యా)పై గెలిచారు. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్పై ప్రణయ్కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది. -
Wimbledon 2023: అల్కరాజ్ అలవోకగా...
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ పది ఏస్లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. చార్డీ సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ తన సరీ్వస్ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్కరాజ్ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రియాన్ పెనిస్టన్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు. వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్లకు అంతరాయం కలిగింది. పైకప్పు కలిగిన సెంటర్ కోర్టు, నంబర్వన్ కోర్టులోని మ్యాచ్లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్లో ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్ (పోలాండ్)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్లో ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఏడు ఏస్లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్గా గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
French Open: 5 గంటల 26 నిమిషాలు.. సంచలన ఫలితం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం సంచలన ఫలితం నమోదైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఎనిమిదో సీడ్ యానిక్ సినర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 5 గంటల 26 నిమిషాలపాటు పోరాడిన ప్రపంచ 79వ ర్యాంకర్ డానియల్ అల్ట్మైర్ (జర్మనీ) రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని సినర్ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ఈ మారథాన్ సమరంలో అల్ట్మైర్ 6–7 (0/7), 7–6 (9/7), 1–6, 7–6 (7/4), 7–5తో సినర్ను ఓడించాడు. ఈ గెలుపుతో గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో సినర్ చేతిలో ఎదురైన ఓటమికి అల్ట్మైర్ బదులు తీర్చుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నాలుగో సెట్లోనే సినర్ విజయం అంచుల్లో నిలిచాడు. నాలుగో సెట్లో 5–4తో ఆధిక్యంలో నిలిచి తన సర్వీస్లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కూడా సంపాదించాడు. అయితే అల్ట్మైర్ పట్టుదలతో పోరాడి రెండుసార్లూ మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. అదే జోరులో సినర్ సర్వీస్ను కూడా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో అల్ట్మైర్ పైచేయి సాధించి సెట్ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ ఏకంగా 93 నిమిషాలు జరగడం విశేషం. నిర్ణాయక ఐదో సెట్లోని 11వ గేమ్లో సినర్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్ట్మైర్ 12వ గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ఈ గేమ్లో సినర్కు నాలుగుసార్లు అల్ట్మైర్ సర్వీస్ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. రూడ్ ముందంజ పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ 7–6 (7/2), 6–0, 6–3తో ఫచ్సోవిచ్ (హంగేరి)పై, రూడ్ 6–3, 6–2, 4–6, 7–5తో జెపెరి (ఇటలీ)పై నెగ్గారు. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–0తో క్లెయిరి లియు (అమెరికా)ను ఓడించి మూడో రౌండ్కు చేరింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) కూడా మూడో రౌండ్కు చేరారు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్ నగాల్
ఏటీపీ చాలెంజర్ యూరోపియన్ క్లే సీజన్లో భారత ఆటగాడు సుమీత్ నగాల్ జోరు కొనసాగుతోంది. రోమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్లో ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్ జోరిస్ డి లూర్ (బెల్జియం)పై విజయం సాధించాడు. 2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)తో నగాల్ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్ క్లే పై ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్ ఇప్పటి వరకు కెరీర్లో 3 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు సాధించాడు. -
‘నంబర్వన్’ అల్కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. అల్కరాజ్కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్మనీ, రన్నరప్ మెద్వెదెవ్కు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్మనీ లభించాయి. మయామి ఓపెన్లోనూ టైటిల్ సాధిస్తేనే... ఇండియన్ వెల్స్ టోర్నీకి ముందు రెండో ర్యాంక్లో ఉన్న అల్కరాజ్ తాజా విజయంతో 7,420 పాయింట్లతో మరోసారి నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్ జొకోవిచ్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్ రెండో ర్యాంక్కు పడిపోయాడు. సోమవారం మొదలైన మయామి ఓపెన్ టోర్నీలోనూ అల్కరాజ్ విజేతగా నిలిస్తేనే నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్లో జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంక్ను దక్కించుకుంటాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ 18 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్లో చోటు కోల్పోయి 13వ ర్యాంక్లో నిలిచాడు. రిబాకినా తొలిసారి... ఇండియన్ వెల్స్ ఓపెన్ మహిళల టోరీ్నలో కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో రిబాకినా 7–6 (13/11), 6–4తో రెండో ర్యాంకర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సబలెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా ప్రదర్శనతో రిబాకినా ప్రపంచ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్కు చేరుకుంది. విజేత రిబాకినాకు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్మనీ, రన్నరప్ సబలెంకాకు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్మనీ లభించాయి. -
German Open 2023: లక్ష్య సేన్కు షాక్
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) 21–19, 21–16తో ఆరో సీడ్ లక్ష్య సేన్ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పొపోవ్పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ రెండోసారి ఓటమి చవిచూశాడు. -
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొమ్మిది ఏస్లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముర్రే 10 ఏస్లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 21 ఏస్లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
Australian Open 2023: శ్రమించి... శుభారంభం
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్కు తొలి రౌండ్లోనే గట్టిపోటీ ఎదురైంది. బ్రిటన్కు చెందిన ప్రపంచ 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాఫెల్ నాదల్ 7–5, 2–6, 6–4, 6–1తో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నాదల్ ఆరు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ఏకంగా 46 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 41 విన్నర్స్ కొట్టి పైచేయి సాధించాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడుతున్న డ్రేపర్ 13 ఏస్లతో అదరగొట్టాడు. అయితే 46 అనవసర తప్పిదాలు చేయడం... కీలకదశలో తడబడటంతో డ్రేపర్కు ఓటమి తప్పలేదు. నాదల్ సర్వీస్ను 11 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా డ్రేపర్ నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు నాదల్ ఆరుసార్లు డ్రేపర్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. మెద్వెదెవ్ అలవోకగా... పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా), పదో సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మెద్వెదెవ్ 6–0, 6–1, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై, సిట్సిపాస్ 6–3, 6–4, 7–6 (8/6)తో క్వెంటిన్ హేల్స్ (ఫ్రాన్స్)పై, అలియాసిమ్ 1–6, 7–6 (7/4), 7–6 (7/3), 6–3తో పోస్పిసిల్ (కెనడా)పై, హుర్కాజ్ 7–6 (7/1), 6–2, 6–2తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలిచారు. అయితే 2014 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/3), 3–6, 6–1, 6–7 (2/7), 4–6తో అలెక్స్ మొల్కాన్ (స్లొవేకియా) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా) 3–6, 3–6, 3–6తో జిరీ లెహెక్సా (చెక్ రిపబ్లిక్) చేతిలో... ప్రపంచ 19వ ర్యాంకర్ ముసెట్టి (ఇటలీ) 4–6, 1–6, 7–6 (7/0), 6–2, 6–7 (4/10)తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయారు. స్వియాటెక్ కష్టపడి... మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్ స్వియాటెక్ (పోలాండ్) గంటా 59 నిమిషాల్లో 6–4, 7–5తో జూల్ నెమియర్ (జర్మనీ)పై శ్రమించి గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ పెగూలా (అమెరికా) 6–0, 6–1తో జాక్వెలిన్ (రొమేనియా)పై, ఆరో సీడ్ సాకరి (గ్రీస్) 6–1, 6–4తో యు యువాన్ (చైనా)పై, ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్లో ఈ మాజీ నంబర్వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్లోని 12వ గేమ్లో 30–40తో మ్యాచ్ పాయింట్ను కాచుకున్నాడు. ఓవర్హెడ్ షాట్తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్లో కోర్డా సర్వీస్ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 94,560 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
టాటా ఓపెన్ విజేత గ్రీక్స్పూర్
పుణే: భారత్లో నిర్వహించే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్ర (ఏటీపీ 250) శనివారం ముగిసింది. సింగిల్స్లో నెదర్లాండ్స్ ఆటగాడు గ్రీక్స్పూర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గ్రీక్స్పూర్ 4–6, 7–5, 6–3 స్కోరుతో బెంజమిన్ బోన్జి (ఫ్రాన్స్)ను ఓడించాడు. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్ను కోల్పోయినా...పట్టుదలతో ఆడిన 26 ఏళ్ల గ్రీక్స్పూర్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. మరో వైపు డబుల్స్లో భారత జోడి శ్రీరామ్ బాలాజీ – జీవన్ నెడుంజెళియన్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో సాండర్ గిల్ – జొరాన్ వీగన్ (బెల్జియం) ద్వయం 6–4, 6–4తో శ్రీరామ్–జీవన్లపై విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్
ట్యురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్లో స్పెయిన్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్ కొత్త చరిత్ర లిఖించాడు. 1973లో అధికారికంగా ర్యాంకింగ్స్ మొదలయ్యాక నంబర్వన్ ర్యాంక్తో ఏడాదిని ముగించనున్న పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా; 2001లో 20 ఏళ్ల 214 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును అల్కరాజ్ తిరగరాశాడు. గాయం కారణంగా అల్కరాజ్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్కు దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తే స్పెయిన్ దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ నంబర్వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు సీజన్ను టాప్ ర్యాంక్తో ముగించేవాడు. కానీ నాదల్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం నంబర్వన్గా ఉన్న అల్కరాజ్ (6,820 పాయింట్లు) డిసెంబర్ 5న ముగిసే టెన్నిస్ సీజన్ను టాప్ ర్యాంక్తో ముగించడం ఖరారైంది. ఈ ఏడాదిని 32వ ర్యాంక్తో ప్రారంభించిన అతను సెప్టెంబర్ 12న నంబర్వన్ ర్యాంకర్గా ఎదిగాడు. పిన్న వయస్కులో టాప్ ర్యాంక్ అందుకున్న టెన్నిస్ ప్లేయర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సంవత్సరం అల్కరాజ్ ఐదు సింగిల్స్ టైటిల్స్ (రియోఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ మాస్టర్స్, యూఎస్ ఓపెన్) సాధించాడు. మొత్తం 57 మ్యాచ్ల్లో గెలిచి, 13 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 76 లక్షల 27 వేల 613 డాలర్ల (రూ. 62 కోట్లు) ప్రైజ్మనీ సంపాదించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో సీజన్ను నంబర్వన్ ర్యాంక్తో ముగించనున్న 18వ ప్లేయర్ అల్కరాజ్. 2003 తర్వాత బిగ్–4 ప్లేయర్లు (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) కాకుండా మరో ప్లేయర్ టాప్ ర్యాంక్తో ముగించడం ఇదే ప్రథమం. నాదల్ తర్వాత స్పెయిన్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. -
జొకోవిచ్ శుభారంభం.. సిట్సిపాస్పై వరుసగా తొమ్మిదో విజయం
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో సెర్బియా స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ‘రెడ్ గ్రూప్’ మ్యాచ్లో జొకోవిచ్ 6–4, 7–6 (7/4)తో మూడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. సిట్సిపాస్పై జొకోవిచ్కిది వరుసగా తొమ్మిదో విజయం. ‘గ్రీన్ గ్రూప్’ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 3–6, 4–6తో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. ఇదే గ్రూప్లో టేలర్ ఫ్రిట్జ్ తదుపరి మ్యాచ్లో గెలిస్తే నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో లక్ష్య సేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఉత్తరాఖండ్కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఐదో ర్యాంక్లో ఉంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్కు చేరుకోగా... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్లో నిలిచింది. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
మరో హోరాహోరీ పోరు.. ఫైనల్స్కు దూసుకొచ్చిన అల్కారాజ్
Carlos Alcaraz: స్పెయిన్ యువ కెరటం, మూడో సీడ్ కార్లోస్ అల్కారాజ్ యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్స్కు దూసుకొచ్చాడు. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్లో అల్కారాజ్.. అమెరికా ఆశాకిరణం, 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించి, ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు క్యాస్పర్ రూడ్తో ఢీకి రెడీ అయ్యాడు. అల్కారాజ్.. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో పోరాడి గెలుపొందిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన క్లార్టర్స్లో 19 ఏళ్ల అల్కారాజ్.. 11వ సీడ్, ఇటలీ ఆటగాడు సిన్నర్పై 6-7, (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో గెలుపొందాడు. 315 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో అల్కారాజ్, సిన్నర్లు ఇద్దరు కొదమ సింహాల్లా పోరాడారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఈ మ్యాచ్ రెండో సుదీర్ఘ సమరంగా రికార్డుల్లోకెక్కడం విశేషం. Never give up! 💪🏻 See you on Sunday, NYC! 🗽😍 @usopen 📸 Getty Images pic.twitter.com/u5ftKBn0Pp — Carlos Alcaraz (@carlosalcaraz) September 10, 2022 కాగా, ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అల్కారాజ్ అదిరిపోయే రీతిలో విజృంభిస్తున్నాడు. క్వార్టర్స్, సెమీస్లో సుదీర్ఘ పోరాటాలు చేసి ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరాడు. అల్కారాజ్..రఫెల్ నదాల్ తర్వాత (2019 నుంచి) యూఎస్ ఓపెన్ ఫైనల్కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడు కావడం మరో విశేషం. -
తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్కు చేరిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్
మహిళల సింగిల్స్ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ ఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్.. అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 6-3, 7-6 (7/4) తేడాతో విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు చేరింది. ఈ గేమ్ తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వియాటెక్.. రెండో గేమ్లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో సెట్లో జెస్సికాను నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్వియాటెక్ పోరాడాల్సి వచ్చింది. చివరకు స్వియాటెక్.. జెస్సికాపై పైచేయి సాధించి గెలుపొందింది. సెమీస్లో స్వియాటెక్.. అరిన సబలెంకతో పోటీ పడనుంది. మరో సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా).. ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)- ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో తొలి సెమీస్లో తలపడనున్నాడు. మరో సెమీస్ సమరంలో నంబర్ 3 ర్యాంకర్ కార్లోస్ అల్కరజ్.. ఫ్రాన్సిస్ టియోఫోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. చదవండి: US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ -
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్కు 4,125 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Wimbledon 2022: జకోవిచ్ అద్భుత పోరాటం.. 11వ సారి సెమీస్కు అర్హత
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ (సెర్బియా) 3 గంటల 35 నిమిషాల్లో 5–7, 2–6, 6–3, 6–2, 6–2తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రాండ్స్లామ్ టోర్నీల మ్యాచ్ల్లో జకోవిచ్ తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4, 6–2, 7–6 (8/6)తో జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్, 34 ఏళ్ల తాత్యానా మరియా (జర్మనీ) 4–6, 6–2, 7–5తో తన దేశానికే చెందిన జూల్ నిమియెర్పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకుంది. -
ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్లో 13వసారి..!
లండన్: వరుసగా నాలుగోసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 4–6, 6–1, 6–2తో టిమ్ వాన్ రితోవెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఆరుసార్లు వింబుల్డన్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఏడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ నిక్ కిరియోస్ 4–6, 6–4, 7–6 (7/2), 3–6, 6–2తో నకషిమా (అమెరికా)పై నెగ్గి 2014 తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–1, 6–4తో కుబ్లెర్ (ఆస్ట్రేలియా)పై, క్రిస్టియన్ గారిన్ (చిలీ) 2–6, 5–7, 7–6 (7/3), 6–4, 7–6 (10–6)తో డిమినార్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తొలిసారి తమ కెరీర్లో ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు అర్హత పొందారు. మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిసియా), రిబాకినా (కజకిస్తాన్), అని సిమోవా (అమెరికా), తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలి యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
Wimbledon 2022: జొకోవిచ్పైనే దృష్టి
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్ నేడు ప్రారంభంకానుంది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సోమవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో కొరియా ప్లేయర్ సూన్వూ క్వాన్తో ఆడనున్నాడు. ఈ సీజన్లో తొలి రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన స్పెయిన్ స్టార్ నాదల్ వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టాడు. అయితే నాదల్కు ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ నుంచి అసలు సవాలు ఎదురుకానుంది ‘డ్రా’ ప్రకారం వీరిద్దరు ఫైనల్లో తలపడే అవకాశముంది. మహిళల సింగిల్స్లో ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత ఈ టోర్నీతో పునరాగమనం చేయనుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే వైదొలిగింది. అనంతరం ఆమె సింగిల్స్ విభాగంలో ఏ టోర్నీలోనూ ఆడలేదు. -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్లో నాదల్ రిటర్న్ షాట్ను అందుకోనే క్రమంలో బేస్లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్ను 7–6 (10/8)తో టైబ్రేక్లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్లో జ్వెరెవ్ తన సర్వీస్ను కాపాడుకోగా... 12వ గేమ్లో నాదల్ సర్వీస్లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 13 సార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) తమ జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గగా... ఐదో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–4తో వాన్ డె జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. బెడెన్తో గంటా 44 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. జాండ్షుల్ప్తో జరిగిన పోరులో నాదల్ ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేశాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్లో 15వ సీడ్ ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా) 6–3, 6–1, 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్లో 14వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్), ప్రపంచ మాజీ నంబర్వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), అజరెంకా (బెలారస్) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో బెన్చిచ్ 5–7, 6–3, 5–7తో 17వ సీడ్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా) చేతిలో, కెర్బర్ 4–6, సాస్నోవిచ్ (బెలారస్) చేతిలో, అజరెంకా 6–4, 5–7, 6–7 (5/10)తో జిల్ టెక్మన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయారు. -
సుమిత్ నగాల్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పారిస్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో సుమిత్ 2–6, 2–6తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయాడు. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
లక్ష్యం చేరలేదు..!
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలని ఆశించిన భారత యువతార లక్ష్య సేన్కు నిరాశే ఎదురైంది. టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్ బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) 21–10, 21–15 స్కోరుతో లక్ష్య సేన్పై విజయం సాధించి రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2020లోనూ అక్సెల్సన్ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో కొన్నిసార్లు లక్ష్య సేన్ దీటుగా పోరాడినా తుది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్గా సంతృప్తి చెందిన అక్సెల్సన్ ఈసారి తన స్థాయికి తగ్గ ఆటతో చాంపియన్ అయ్యాడు. విజేత అక్సెల్సన్కు 70 వేల డాలర్లు (రూ. 53 లక్షల 17 వేలు), రన్నరప్ లక్ష్య సేన్కు 34 వేల డాలర్లు (రూ. 25 లక్షల 83 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. సుదీర్ఘ ర్యాలీలతో... ఫైనల్ పోరుకు ముందు అక్సెల్సన్తో ముఖాముఖి సమరాల్లో లక్ష్య 1–4తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఆ ఒక్క విజయం ఎనిమిది రోజుల ముందే జర్మన్ ఓపెన్లో సెమీఫైనల్లో వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న సేన్పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విక్టర్ ఆరంభంలోనే సేన్ను దెబ్బ కొట్టాడు. వరుస పాయింట్లతో దూసుకుపోయిన అతను 6–0తో ముందంజలో నిలిచిన తర్వాత గానీ లక్ష్య తొలి పాయింట్ సాధించలేకపోయాడు. తొలి గేమ్ మొత్తం దాదాపు ఇదే తరహాలో సాగింది. అక్సెల్సన్ ఆధిపత్యం ముందు సేన్ జవాబివ్వలేకపోయాడు. 2–8 వద్ద 61 షాట్ల ర్యాలీ కూడా రావడంతో సేన్ బాగా అలసిపోయాడు. చక్కటి డిఫెన్స్ ప్రదర్శిస్తూ 11–2తో ముందంజ వేసిన డానిష్ ఆటగాడు దానిని కొనసాగిస్తూ అలవోకగా తొలి గేమ్ను గెలుచుకున్నాడు. రెండో గేమ్లో సేన్ కొంత పోటీనిచ్చాడు. ముఖ్యంగా అతని స్మాష్లు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే 4–4తో సమంగా ఉన్న స్థితి నుంచి అక్సెల్సన్ 11–5 వరకు తీసుకుపోగా, విరామం తర్వాత కోలుకొని వరుసగా మూడు పాయింట్లు సాధించి సేన్ 9–12తో అంతరాన్ని తగ్గించాడు. ఈ దశలో విక్టర్ మళ్లీ చెలరేగి 10–17తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో ఇద్దరు హోరాహోరీగా తలపడుతూ 70 షాట్ల ర్యాలీ ఆడగా, సేన్కు పాయింట్ దక్కి స్కోరు 11–17కు చేరింది. అయితే చివర్లో లక్ష్య మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా... అప్పటికే ఆలస్యమైపోయింది. అనుభవలేమి, ఒత్తిడిలో ఓటమి పాలైనా... వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో రన్నరప్గా నిలవడం 20 ఏళ్ల లక్ష్య సేన్ కెరీర్కు కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ప్రణయ్పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్
జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువస్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–16తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 10–21, 21–23తో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్–హావో డాంగ్ జౌ (చైనా) జంట చేతిలో ఓడింది. -
యూకీ బాంబ్రీ శుభారంభం
టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. పుణేలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 6–7 (10/12), 6–2, 7–5తో కొవాలిక్ (స్లొవేకియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–7 (5/7), 2–6తో అల్ట్మైర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
వరల్డ్ చాంపియన్షిప్స్లో రజతం గెలిచిన తొలి భారత ఆటగాడు..
‘స్వర్ణ ప్రపంచాన్ని’ అందుకోవాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చివరకు రజత సంబరం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్కు చేరిన తొలి భారతీయ ప్లేయర్గా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ విశ్వవిజేతగా అవతరించలేకపోయాడు. సింగపూర్కు చెందిన 24 ఏళ్ల లో కీన్ యుతో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ ఓటమి రుచి చూసి రన్నరప్గా నిలిచాడు. శ్రీకాంత్ ఆటలో అడపాదడపా మెరుపులు కనిపించినా కీలకదశలో అనవసర తప్పిదాలు అతడిని పసిడి పతకానికి దూరం చేశాయి. హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ తుది మెట్టుపై తడబడ్డాడు. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్), ఆంటోన్సెన్ (డెన్మార్క్)లకు కాంస్య పతకాలు లభించాయి. ఆధిక్యంలోకి వెళ్లి... 2018 కామన్వెల్త్ గేమ్స్లో లో కీన్ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్ ఈసారి కూడా గెలుపు రుచి చూస్తాడనిపించింది. ఆరంభంలో జంపింగ్ స్మాష్లు, నెట్ ఫ్లిక్ షాట్లతో అలరించిన శ్రీకాంత్ 9–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడ్డ లో కీన్ యు ఈసారి శ్రీకాంత్ ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. 3–9తో వెనుకబడ్డా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా నిగ్రహంతో ఆడిన లో కీన్ యు నెమ్మదిగా గాడిలో పడ్డాడు. శ్రీకాంత్ సంధించిన స్మాష్లను లో కీన్ యు అద్భుతంగా డిఫెండ్ చేశాడు. శ్రీకాంత్ కూడా అనవసర తప్పిదాలు చేయడం సింగపూర్ షట్లర్కి కలిసి వచ్చింది. నిలకడగా పాయింట్లు స్కోరు చేసిన లో కీన్ యు ఎట్టకేలకు 11–11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లో కీన్ యు జోరు పెంచగా శ్రీకాంత్ ఒత్తిడికి లోనై చాలా షాట్లు నెట్పైకి, బయటకు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. దాంతో లో కీన్ యు తొలి గేమ్ను 16 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. తప్పిదాలతో మూల్యం... రెండో గేమ్లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ దశలో శ్రీకాంత్ 9–6తో ముందంజ వేసినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు శ్రీకాంత్ ఆధిక్యంలోకి రావడం... అంతలోనే చేసిన అనవసర తప్పిదాలతో లో కీన్ యు మళ్లీ పుంజుకోవడం జరిగింది. ఈ క్రమంలో లో కీన్ యు 20–18తో ముందంజ వేశాడు. శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేశాడు. అయితే వెంటనే లో కీన్ యు రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకొని ప్రపంచ చాంపియన్ అయ్యాడు. సూపర్ ఫినిష్... మలేసియాలోని పెనాంగ్ నగరంలో పుట్టిన లో కీన్ యు తన 13వ యేట కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్కు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్లో సింగపూర్ బృందానికి పతాకధారిగా వ్యవహరించిన లో కీన్ యు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్గా నిలిచిన తొలి సింగపూర్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. రెండోసారి ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొన్న లో కీన్ యు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో అద్భుత విజయాలు అందుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించిన లో కీన్ యు సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై, ఫైనల్లో మాజీ వరల్డ్ నంబర్వన్ శ్రీకాంత్పై గెలిచి తన విజయం గాలివాటం కాదని నిరూపించాడు. టైటిల్ గెలిచే క్రమంలో లో కీన్ యు తన ప్రత్యర్థులకు కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. ఈ వారం అద్భుతంగా గడిచింది. ఫైనల్లో రెండు గేముల్లోనూ నేను మంచి స్థితిలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఈ ఓటమితో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తాను. పాజిటివ్గా ఆడాలనే ఆలోచనతో బరిలోకి దిగాను. అనవసర తప్పిదాలతో చికాకు కలిగింది. అయితే మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. నాలుగేళ్ల క్రితం చివరిసారి లో కీన్ యుతో తలపడ్డాను. అప్పటికి ఇప్పటికి అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. వాస్తవానికి నేను ప్రపంచ చాంపియన్షిప్లో ఆడతానో లేదోననే అనుమానం కలిగింది. ఈనెల 12న టోర్నీ మొదలవ్వగా 6వ తేదీ వరకు నాకు వీసా లభించలేదు. ఈ ఏడాది ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ ఉన్నాయి. ఈ అనుభవంతో వచ్చే ఏడాది మంచి ఫలితాలు సాధిస్తానని విశ్వాసంతో ఉన్నాను. –కిడాంబి శ్రీకాంత్ -
శభాష్ శ్రీకాంత్...
ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన యువతార లక్ష్య సేన్తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్ పదుకొనే (1983), సాయిప్రణీత్ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. హుఎల్వా (స్పెయిన్): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 21–14, 21–17తో భారత్కే చెందిన యువతార లక్ష్య సేన్పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఘనత వహించాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యె (సింగపూర్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్ ఫైనల్ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్ను స్టార్ స్పోర్ట్స్–3, హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హోరాహోరీగా... అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడగా... ప్రతీ పాయింట్కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్ కళ్లు చెదిరే రీతిలో స్మాష్లు సంధించాడు. అయితే శ్రీకాంత్ సంధించిన స్మాష్లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు. రెండో గేమ్లో ఒకదశలో శ్రీకాంత్ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్ షాట్లు, క్రాస్కోర్టు షాట్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ రెండో గేమ్ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్లో రెండుసార్లు శ్రీకాంత్ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్ రిటర్న్ షాట్ను లక్ష్య సేన్ నెట్కు కొట్టడంతో గేమ్తోపాటు మ్యాచ్ శ్రీకాంత్ వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్కు చేరిన మూడో భారతీయ ప్లేయర్ శ్రీకాంత్. గతంలో మహిళల సింగిల్స్లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్; 2019–విన్నర్), సైనా నెహ్వాల్ ఒకసారి (2015–రన్నరప్) ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్లో మాత్రం భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్లో ఒకేసారి భారత్కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణాయక మూడో గేమ్లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు. -
లక్ష్యసేన్కు నిరాశ
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన లక్ష్యసేన్, పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్లో లక్ష్యసేన్ 21–23, 15–21తో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో లక్ష్యసేన్ తొలి గేమ్ను చేజేతులా కోల్పోయాడు. ఇరు ఆటగాళ్ల మధ్య ఆధిక్యం పలుమార్లు మారిన తొలి గేమ్లో లక్ష్యసేన్ ఒక దశలో 18–14తో ఆధిక్యంలో ఉన్నాడు. కీలక సమయంలో మొమోటా చాంపియన్ ఆటతో వరుసగా ఆరు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. వెంటనే తేరుకున్న లక్ష్యసేన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21–20తో గేమ్ పాయింట్కు వెళ్లాడు. మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించిన మొమోటా వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్లో మరింత దూకుడు కనబర్చిన జపాన్ షట్లర్ మ్యాచ్ను ముగించేశాడు. మరో పోరులో కశ్యప్ 11–21, 14–21తో లోహ్ కీన్ య్యూ (సింగపూర్) చేతిలో వరుస సెట్లలో ఓడాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–అర్జున్ ద్వయం 20–22, 13–21తో చోయ్ సొల్జ్యూ– కిమ్ వోన్హూ (కొరియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్లో ప్రసాద్–జుహి దేవాంగన్ జోడీ 12–21, 4–21తో జన్సెన్– లిండా ఎఫ్లర్ (జర్మనీ) జంట చేతిలో ఓడాయి. -
రికార్డుల దిశగా జొకోవిచ్ అడుగులు
ఎదురు లేకుండా సాగుతున్న జొకోవిచ్ అడుగులు రికార్డుల దిశగా పడుతున్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్లో నంబర్వన్ సెర్బియన్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక రెండంటే రెండే మ్యాచ్లు (సెమీస్, ఫైనల్స్) గెలిస్తే జొకో క్యాలెండర్ స్లామ్తో పాటు 21వ గ్రాండ్స్లామ్ టైటిల్తో ఆల్టైమ్ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్)లను అధిగమిస్తాడు. న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్లను గెలిచిన సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తాజాగా యూఎస్ ఓపెన్ గెలిచే పనిలో పడ్డాడు. పురుషుల సింగిల్స్లో ఈ టాప్ సీడ్ ప్లేయర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ 5–7, 6–2, 6–2, 6–3తో ఆరో సీడ్ మటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్ల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–0, 4–6, 7–5తో నెదర్లాండ్స్కు చెందిన బొటిక్ వాన్ డె జండ్ష్చల్ప్పై గెలుపొందగా, నాలు గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (8/6), 6–3, 6–4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు. మహిళల క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)కు 4–6, 4–6తో మరియా సకారి (గ్రీస్) చేతిలో చుక్కెదురైంది. తొలి సెట్ కోల్పోగానే... జొకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్ల దాకా ఇద్దరు సరీ్వస్ను నిలబెట్టుకోవడంతో 5–5తో సమంగా నిలిచారు. సెర్బియన్ సర్వీస్ చేసిన 11వ గేమ్ను బ్రేక్ చేయడం ద్వారా బెరెటిని 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. తదుపరి గేమ్లో తన సరీ్వస్ను నిలబెట్టుకోవడంతో తొలిసెట్ను చేజిక్కించుకున్నాడు. ఈ సెట్ కోల్పోగానే జొకో జాగ్రత్త పడ్డాడు. తర్వాత వరుసగా మూడు సెట్లను అవలీలగానే చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో 12 ఏస్లు సంధించిన సెర్బియన్ స్టార్ 4 డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్ద 19 పాయింట్లు సాధించిన జొకోవిచ్ 44 విన్నర్లు కొట్టాడు. 28 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 5 బ్రేక్ పాయింట్లు సాధించి ప్రత్యరి్థపై పైచేయి సాధించాడు. మరోవైపు ఇటలీ స్టార్ బెరెటిని... జొకో కంటే అత్యధికంగా 17 ఏస్లు సంధించినప్పటికీ ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. 42 విన్నర్లు కొట్టాడు. ఇప్పటివరకు మూడు సార్లు (2011, 2015, 2018) యూఎస్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ ఇక్కడ సెమీస్ చేరుకోవడం ఇది 12వ సారి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సెర్బియన్ స్టార్... జర్మనీకి చెందిన నాలుగో సీడ్ జ్వెరెవ్తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ సీజన్ వింబుల్డన్ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా 4–6, 4–6తో వరుస సెట్లలో సకారి ధాటికి చేతులెత్తేసింది. 2016లో యూఎస్ ఓపెన్ రన్నరప్గా నిలిచిన చెక్ రిపబ్లిక్ స్టార్ను కేవలం గంటా 22 నిమిషాల్లోనే సకారి ఇంటిదారి పట్టించింది. 2015 నుంచి యూఎస్ ఓపెన్ ఆడుతున్న గ్రీస్ ప్లేయర్ సకారి తన కెరీర్లో తొలిసారి సెమీస్ చేరింది. సెమీస్లో ఎవరితో ఎవరు జొకోవిచ్ (1) గీ జ్వెరెవ్ (4) మెద్వెదెవ్ (2) గీ ఫెలిక్స్ అగర్ (12) -
మూడో రౌండ్లో జొకోవిచ్
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 6–3, 6–2తో టలాన్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్లో 12వ సీడ్ హలెప్ (రొమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్లో హలెప్ 7–6 (13/11), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండవే (అమెరికా) జంట 6–4, 4–6, 3–6తో రలుకా (రొమేనియా)–కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడింది. -
ఇటు జొకోవిచ్... అటు బార్టీ
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) దూసుకుపోతున్నాడు. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్లో 12వసారి జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 6–4, 6–2తో గారిన్ (చిలీ)పై గెలిచాడు. ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొమ్మిది ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 4–6, 4–6, 6–0, 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–1, 6–3, 7–5తో ఎనిమిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–3, 6–1తో ఇవాష్క (బెలా రస్)పై, 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–4, 6–3, 5–7, 10–8తో ‘బర్త్డే బాయ్’ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై; ఫీలిక్స్ ఉజర్ అలియాసిమ్ (కెనడా) 6–4, 7–6 (8/6), 3–6, 3–6, 6–4తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై... ఆన్స్ జెబర్ (ట్యూనిషియా) 5–7, 6–1, 6–1తో స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచారు. సబలెంకా 6–3, 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై, కెర్బర్ 6–4, 6–4తో కోకో గాఫ్ (అమెరికా)పై, ముకోవా 7–6 (8/6), 6–4తో బదోసా (స్పెయిన్)పై, గోలూబిచ్ 7–6 (7/3), 6–3తో కీస్ (అమెరికా)పై, ప్లిస్కోవా 6–2, 6–3 తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇందులో ముకోవా, కెర్బర్ మినహా మిగతా వారంతా ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్ చేరారు. -
జొకోవిచ్ జోరు
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్పై గురి పెట్టిన వరల్డ్ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్ 26 అనవసర తప్పిదాలు చేయగా... జొకోవిచ్ ఆరు మాత్రమే చేశాడు. మరోవైపు 11వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 12వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను... జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్ను ఓడించారు. సబలెంకా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) రెండో రౌండ్లో... ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్లో సబలెంకా 4–6, 6–3, 6–3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై గెలిచింది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్) 6–2, 6–1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్ (స్లొవేనియా) 6–3, 6–3తో బెన్చిచ్పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్లో మాడిసన్ బ్రెంగల్ (అమెరికా) 6–2, 6–4తో సోఫియా కెనిన్ను బోల్తా కొట్టించింది. -
Stefanos Tsitsipas: సిట్సి‘పాస్’ కాలేదు
లండన్: మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్ యువ టెన్నిస్ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మూడో సీడ్గా బరిలోకి దిగిన సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–3తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో టాప్–5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో టియాఫో తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 15 ఏస్లు సంధించిన సిట్సిపాస్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–2, 6–2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఏకంగా 25 ఏస్లు సంధించాడు. మరో మ్యాచ్లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–4, 6–1, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గాడు. స్లోన్ స్టీఫెన్స్ సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 6–4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–0, 6–1తో ఫియోనా (ఫ్రాన్స్) పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–4తో సు వె సెయి (చైనీస్ తైపీ)పై, 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో స్వాన్ (బ్రిటన్)పై గెలిచారు. -
వీరోచితం... ‘జొకో’ విజయం
‘క్లే కోర్టు కింగ్’ రాఫెల్ నాదల్నే ఓడించినోడికి సిట్సిపాస్ ఓ లెక్కా! వన్డే మ్యాచ్ కాస్తా టి20లా ఆడేయడా ఏంటి! అని జొకోవిచ్ విజయం గురించే మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ మొదలయ్యాకే తెలిసింది... ఇది ఫైనల్ అని! టైటిల్ అంత ఈజీ కాదని!! కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడుతున్న సిట్సిపాస్ వరల్డ్ నంబర్వన్కు ఏమాత్రం తీసిపోని ఆట ఆడాడు. అయితే తొలి రెండు సెట్లు ఓడిపోయినా జొకోవిచ్ ఏదశలోనూ పట్టుదల కోల్పోకుండా ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనతో తన కెరీర్లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలువడంతోపాటు 19వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను హస్తగతం చేసుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) నాలుగు వేర్వేరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. పారిస్: ‘గ్రాండ్స్లామ్ ఫైనల్స్’ గత అనుభవం అక్కరకొచ్చింది. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 19వ గ్రాండ్స్లామ్ టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ 4 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్ నెగ్గాడు. విజేత జొకోవిచ్కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. రెండు సెట్లు ‘పాస్’అయ్యాడు కానీ... ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి దీటుగా సిట్సిపాస్ పోరాటం మొదలుపెట్టాడు. దీంతో సెర్బియన్కు ఫైనల్ అంత ఈజీ కాదని తెలిసిపోయింది. టైబ్రేక్కు దారితీసిన తొలి సెట్లో సిట్సిపాస్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్ను గెల్చుకున్నాడు. తొలి సెట్ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ తొలి గేమ్లో సెర్బియన్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. తర్వాత టాప్ సీడ్ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్ తన సర్వీస్ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్ కూడా సిట్సిపాస్ వశమైంది. ఇక సమరమే... దెబ్బకు స్కోరు సమమే! టైటిల్ సాధించాలంటే వరుసగా మూడు సెట్లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్ తన గేరు మార్చాడు. జోరు పెంచాడు. ఒత్తిడిని పక్కన బెట్టాడు. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్ ప్రత్యర్థికి ప్రతీ గేమ్లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్ మూడో గేమ్లో బ్రేక్ పాయింట్ సాధించిన జొకోవిచ్ తన సర్వీస్లను కాపాడుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు ఇదేమాత్రం సరిపోలేదు. పురుషుల టెన్నిస్లో ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమో దు చేసిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా–1969), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా–1967) మాత్రమే ఈ ఘనత సాధించారు. జొకోవిచ్ నెగ్గిన గ్రాండ్స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్–9; ఫ్రెంచ్ ఓపెన్–2; వింబుల్డన్–5; యూఎస్ ఓపెన్–3). ఫెడరర్, రాఫెల్ నాదల్ (20 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచిన ఏడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో బెర్నార్డ్ (1946), రాడ్ లేవర్ (1962), బోర్గ్ (1974), లెండిల్ (1984), అగస్సీ (1999), గాడియో (2004) ఈ ఘనత సాధించారు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ సిట్సిపాస్ 5 ఏస్లు 14 3 డబుల్ ఫాల్ట్లు 4 19/30 నెట్ పాయింట్లు 19/31 5/16 బ్రేక్ పాయింట్లు 3/8 56 విన్నర్స్ 61 41 అనవసర తప్పిదాలు 44 164 మొత్తం పాయింట్లు 147 -
French Open: సూపర్ సిట్సిపాస్
పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన గ్రీస్ యువ టెన్నిస్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్లో 22 ఏళ్ల సిట్సిసాస్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 3 గంటల 37 నిమిషాల్లో 6–3, 6–3, 4–6, 4–6, 6–3తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. తద్వారా ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి గ్రీస్ ప్లేయర్గా సిట్సిపాస్ గుర్తింపు పొందాడు. గతంలో గ్రాండ్స్లామ్ టోర్నీలలో సిట్సిపాస్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్స్ (2019, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్; 2020 ఫ్రెంచ్ ఓపెన్) కావడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి సెమీఫైనల్ చేరిన 24 ఏళ్ల జ్వెరెవ్ ఆరంభంలోనే తడబడ్డాడు. సిట్సిపాస్ ఆటతీరు ముందు ఎదురునిలువలేక వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. అయితే మూడో సెట్ నుంచి జ్వెరెవ్ ఆటతీరు గాడిలో పడింది. అనూహ్యంగా సిట్సిపాస్ ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా రెండు సెట్లను ఈ గ్రీస్ ప్లేయర్ సమర్పించుకున్నాడు. దాంతో మ్యాచ్ నిర్ణాయక ఐదో సెట్కు దారి తీసింది. నాలుగో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకున్న సిట్సిపాస్ 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సిట్సిపాస్ తన రెండు సర్వీస్లను నిలబెట్టుకున్నాడు. తొమ్మిదో గేమ్లోని తన సర్వీస్లో ఏస్ సంధించి సిట్సిపాస్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సిట్సిపాస్ ఎనిమిది ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి జ్వెరెవ్ సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 11 ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. సిట్సిపాస్ 43 అనవసర తప్పిదాలు... జ్వెరెవ్ 47 అనవసర తప్పిదాలు చేశారు. నాదల్, జొకోవిచ్ హోరాహోరీ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. తొలి సెట్ను నాదల్ 6–3తో సొంతం చేసుకున్నాడు. అతను రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. అనంతరం జొకోవిచ్ తేరుకొని రెండో సెట్ను 6–3తో గెల్చుకున్నాడు. ఈ సెట్లో నాదల్ సర్వీస్ను అతను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
French Open: వైదొలిగిన ఫెడరర్
వింబుల్డన్ టోర్నమెంట్కు ముందు పూర్తి ఫిట్నెస్తో ఉండాలనే ఉద్దేశంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో ఫెడరర్ 3 గంటల 35 నిమిషాల్లో 7–6 (7/5), 6–7 (3/7), 7–6 (7/4), 7–5తో ప్రపంచ 59వ ర్యాంకర్ డొమినిక్ కోప్ఫెర్ (జర్మనీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.‘నా సహాయక సిబ్బందితో చర్చించాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునే క్రమం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్లో మూడు మ్యాచ్లు గెలిచి ఫిట్నెస్ పరంగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లునిపిస్తోంది’ అని 39 ఏళ్ల ఫెడరర్ అన్నాడు. గ్రాస్కోర్టు సీజన్లో భాగంగా ఈనెల 14న మొదలయ్యే హాలే ఓపెన్లో ఫెడరర్ ఆడతాడు. అనంతరం ఈనెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో తొమ్మిదో టైటిలే లక్ష్యంగా ఫెడరర్ బరిలోకి దిగుతాడు. -
French Open 2021: ఫెడరర్ ముందంజ
పారిస్: స్విస్ దిగ్గజం, 20 గ్రాండ్స్లామ్ల విజేత రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్లో మరో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో ఎనిమిదో సీడ్ ఫెడరర్ 6–2, 2–6, 7–6 (7/4), 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొంది మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. 2 గంటలా 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ను ఫెడరర్ ఘనంగా ఆరంభించాడు. పదునైన ఏస్లతో పాటు... బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి తొలి సెట్ను అలవోకగా నెగ్గాడు. అయితే రెండో సెట్లో పుంజుకున్న సిలిచ్ ఆ సెట్ను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్ ‘టై బ్రేక్’కు దారితీయగా... అక్కడ ఎటువంటి ఒత్తిడికి గురికాని ఫెడరర్ ‘టై బ్రేక్’ ద్వారా మూడో సెట్ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఫెడరర్ ప్రత్యర్థి సర్వీస్ను రెండు సార్లు బ్రేక్ చేసి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫెడరర్ 16 ఏస్లు సంధించి... ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేశాడు. సిలిచ్ 12 ఏస్లు కొట్టినా కీలక సమయాల్లో ఆరు డబుల్ ఫాల్ట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. జొకోవిచ్, స్వియాటెక్ కూడా... రెండో రౌండ్ పోరులో ప్రపంచ నంబర్వన్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్ 6–3, 6–2, 6–4తో పబ్లో క్వెవాజ్ (ఉరుగ్వే)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఎక్కడా తడబాటుకు గురికాకుండా మ్యాచ్ను ముగించేశాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3–6, 6–1, 6–4, 6–3తో టామీ పాల్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్కు చేరుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ అలవోకగా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–1, 6–1తో 61 నిమిషాల్లో రెబెకా పీటర్సన్ (స్వీడన్)ను అలవోకగా ఓడించింది. బార్టీని వెంటాడిన గాయం... ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మహిళల సింగిల్స్ టాప్ సీడ్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ తుంటి గాయంతో తప్పుకుంది. మగ్దా లినెట్టే (పొలాండ్)తో జరిగిన రెండో రౌండ్ పోరు మధ్యలోనే 2019 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్టీ గాయంతో వైదొలిగింది. మ్యాచ్లో బార్టీ 1–6, 2–2తో వెనుకబడి ఉన్న సమయంలో ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. మ్యాచ్ ఆడుతున్నంత సేపూ ఇబ్బంది పడ్డ బార్టీ తొలి సెట్ను 1–6తో కోల్పోయింది. అనంతరం ఆమె మెడికల్ టైమౌట్ను కూడా తీసుకుంది. ఆ తర్వాత కూడా కోర్టులో సౌకర్యంగా కదల్లేకపోయిన బార్టీ మ్యాచ్ నుంచి తప్పుకుంది. మరోవైపు తొమ్మిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 1–6తో అన్సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో ఓడింది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–0, 6–4తో అన్ లీ (అమెరికా)పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 7–5, 6–3తో హెలీ (అమెరికా)పై, అమెరికా టీనేజ్ సంచలనం కోకో గౌఫ్ 6–3, 7–6 (7/1)తో వాంగ్ క్వియాంగ్ (చైనా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్లో బోపన్న జోడీ... పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న (భారత్)– ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న–స్కుగోర్ జంట 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో– నికోలస్ మొన్రో (అమెరికా) జంటపై గెలిచింది. మరో వైపు పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాల్సిన ఒక జంటకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వారి పేర్లను మాత్రం నిర్వాహకులు బయటపెట్టలేదు. పాజిటివ్గా తేలిన జోడీ టోర్నీ నుంచి వైదొలిగిందని... వారి స్థానంలో వేరే జంటను బరిలోకి దింపినట్లు వెల్లడించారు. నేను ఆలస్యం చేస్తున్నానా..! ఈ మ్యాచ్లో ఫెడరర్ సహనాన్ని కోల్పోయాడు. రెండో సెట్ ఐదో గేమ్లో సిలిచ్ సర్వీస్ చేస్తుండగా... సర్వీస్ను రిసీవ్ చేసుకునే స్థానానికి ఫెడరర్ ఆలస్యంగా చేరుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నాడంటూ చైర్ అంపైర్ అతనికి ‘సమయ ఉల్లంఘన’ హెచ్చరికను జారీ చేశాడు. దీనిపై ఆగ్రహించిన ఫెడరర్ అంపైర్తో కొన్ని నిమిషాలపాటు వాగ్వివాదానికి దిగాడు. సిలిచ్ను చూస్తూ ‘నేను మరీ అంత నెమ్మదిగా ఉన్నానా...’ అంటూ ఫెడరర్ ప్రశ్నించగా... ‘అవునూ... నేను సర్వీస్కు సిద్ధంగా ఉన్నా... నువ్వు మాత్రం టవల్తో కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నావ్’ అంటూ సిలిచ్ బదులిచ్చాడు. -
వరుసగా 800 వారాలు...
పారిస్: పురుషుల టెన్నిస్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో వరుసగా 800 వారాలపాటు టాప్–10లో నిలిచిన తొలి ప్లేయర్గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 9,850 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న నాదల్... 800 వారాల పాటు (15 ఏళ్లకు పైగా) టాప్–10లో నిలిచిన ఏకైక ప్లేయర్గా ఘనత వహించాడు. గతంలో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన రికార్డు జిమ్మీ కానర్స్ (789 వరుస వారాలు) పేరిట ఉండేది. 2005 ఏప్రిల్లో తొలిసారిగా టాప్–10లో ప్రవేశించిన 34 ఏళ్ల నాదల్... గతేడాది నవంబర్లోనే జిమ్మీ కానర్స్ను వెనక్కి నెట్టేశాడు. వరుస వారాల పరంగా కాకుండా ఓవరాల్గా చూస్తే... అత్యధికంగా 931 వారాల పాటు స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ టాప్–10లో నిలిచాడు. -
సీడెడ్ ఆటగాళ్లకు షాక్
గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించాలంటే అత్యంత నిలకడగా ఆడటమే ప్రధానం. ఆ నిలకడ లేకపోతే ఆశించిన ఫలితాలు రాలేవు. భవిష్యత్లో ‘బిగ్ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ స్థానాలను భర్తీచేయగల సామర్థ్యమున్న ఆటగాళ్లుగా పేరొందిన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్), కరెన్ ఖచనోవ్ (రష్యా) ఊహించని పరాజయాలు ఎదుర్కొన్నారు. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్లో టైటిల్ ఫేవరెట్స్ రేసులో ఉన్న ఈ ముగ్గురూ తొలి రౌండ్ అడ్డంకినే అధిగమించలేక ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2017 చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ప్రపంచ మాజీ నంబర్వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) కూడా తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనాల మోత మోగింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఒకేరోజు టాప్–10లోని నలుగురు ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), తొమ్మిదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా), పదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్లో 2017 చాంపియన్, 11వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా), మాజీ నంబర్వన్ ప్లేయర్లు అజరెంకా (బెలారస్), 24వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా తొలి రౌండ్ను దాటలేకపోయారు. వరుసగా రెండేళ్లు ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన థీమ్ 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో 4–6, 6–3, 3–6, 2–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోగా... అన్సీడెడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 3 గంటల 54 నిమిషాల పోరులో 6–4, 6–7 (5/7), 7–6 (7/5), 7–5తో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సిట్సిపాస్ను బోల్తా కొట్టించాడు. 216వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) 3 గంటల 51 నిమిషాల్లో 4–6, 7–5, 7–5, 4–6, 6–3తో ఖచనోవ్పై... కుకుష్కిన్ (కజకిస్తాన్) 3–6, 6–1, 6–3, 3–6, 6–3తో అగుట్పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర మ్యాచ్ల్లో షపోవలోవ్ (కెనడా) 6–1, 6–1, 6–4తో 18వ సీడ్ అగుల్ (కెనడా)పై, అందుజార్ (స్పెయిన్) 3–6, 7–6 (7/1), 7–5, 5–7, 6–2తో 30వ సీడ్ ఎడ్మండ్ (బ్రిటన్)పై, సాండ్గ్రెన్ (అమెరికా) 1–6, 6–7 (2/7), 6–4, 7–6 (7/5), 7–5తో మాజీ ఐదో ర్యాంకర్ సోంగా (ఫ్రాన్స్)లపై గెలిచారు. నాదల్ శుభారంభం నాలుగో టైటిల్పై గురి పెట్టిన రెండో సీడ్ రాఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ఈ స్పెయిన్ స్టార్ 6–3, 6–2, 6–2తో మిల్మన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 6–3, 3–6, 4–6, 6–2తో ఆల్బోట్ (మాల్డోవా)పై అతికష్టమ్మీద గెలిచాడు. 14వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో లోపెజ్ (స్పెయిన్)పై, 28వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6–3, 7–6 (7/1), 6–4తో జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. మూడో రౌండ్లో ప్లిస్కోవా మహిళల సింగిల్స్లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్లిస్కోవా 6–1, 6–4తో మరియం బోల్క్వాద్జె (జార్జియా)ను ఓడించింది. మరోవైపు నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ నంబర్వన్ వొజ్నియాకి (డెన్మార్క్) తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ను దాటారు. హలెప్ 6–3, 3–6, 6–2తో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న అమెరికా అమ్మాయి నికోల్ గిబ్స్పై గెలుపొందగా... వొజ్నియాకి 1–6, 7–5, 6–3తో యాఫన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. క్వాలిఫయర్ కలిన్స్కాయ (రష్యా) 6–3, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 6–3, 6–4తో అజరెంకాపై, రిస్కీ (అమెరికా) 2–6, 6–1, 6–3తో ముగురుజాపై, క్రిస్టీ ఆన్ (అమెరికా) 7–5, 6–2తో కుజ్నెత్సోవాపై సంచలన విజయాలు సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 15 ఏళ్ల కోరి గౌఫ్ 3–6, 6–2, 6–4తో పొటపోవా (రష్యా)ను ఓడించింది. -
సింధు, సాయి చరిత్ర
కల కాదు నిజమే. నమ్మశక్యంకానీ రీతిలో... కళ్లు చెదిరే ప్రదర్శనతో... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఒకేరోజు ఇద్దరు తెలుగు తేజాలు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ గర్జించారు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ను సింధు మట్టికరిపించగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించిన సాయిప్రణీత్ అందరి అంచనాలను తారుమారు చేసి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. సెమీఫైనల్ చేరడంతో సింధు, సాయిప్రణీత్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. దాంతో 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో తొలిసారి భారత్ ఖాతాలో మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్లో పతకాలు చేరనున్నాయి. 1983 ప్రపంచ చాంపియన్షిప్లో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించాక... పురుషుల సింగిల్స్లో భారత్కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): కొడితే కుంభస్థలం కొట్టాలి. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్ నిజం చేసి చూపించారు. ప్రపంచ చాంపియన్షిప్లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై అద్వితీయ విజయాలు సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శనను అందరూ మర్చిపోయేలా చేశారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ 51 నిమిషాల్లో 24–22, 21–14తో నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను మట్టికరిపించాడు. వెనుకంజలో ఉన్నా... ఈ మ్యాచ్కంటే ముందు తై జు యింగ్తో ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన సింధు... తొలి గేమ్ తర్వాత ఈసారి కూడా తన ఖాతాలో మరో ఓటమి వేసుకుంటుందనిపించింది. తొలి గేమ్ను సులువుగా సమర్పించుకున్న సింధు... రెండో గేమ్లో 5–8తో వెనుకంజ లో ఉంది. ఈ కీలక సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు వరుసగా ఐదు పా యింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకొచ్చింది. అయితే తై జు యింగ్ కూడా పట్టుదలతో ఆడటంతో ఐదుసార్లు స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 21–21 వద్ద సింధు చక్కటి రిటర్న్ షాట్, ఆ తర్వాత క్రాస్కోర్టు షాట్లతో వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ సింధు తడబడింది. 4–8తో వెనుకబడింది. అయితే ఈసారీ సింధు అద్భుతంగా పుంజుకుంది. స్కోరును 14–14 వద్ద సమం చేశాక ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు సింధు స్మాష్ షాట్తో ఒక పాయింట్ సాధించగా... ఆ తర్వాత తై జు యింగ్ కొట్టిన రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. సూపర్ సాయి... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్ జిన్టింగ్ (ఇండోనేసియా)ను ఓడించిన సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించాడు. కీలకదశలో స్మాష్ షాట్లతో చెలరేగాడు. తొలి గేమ్ నెగ్గిన తర్వాత రెండో గేమ్లో సాయిప్రణీత్ మరింత దూకుడు పెంచాడు. జొనాథన్ క్రిస్టీకి తేరుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్ జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉంది. తాజా ప్రదర్శనతో సింధు ఈ రికార్డును సమం చేసింది. 1: ప్రపంచ సీనియర్, జూనియర్ చాంపియన్షిప్లలో పతకాలు నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్ సాయిప్రణీత్. 2010 ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో సాయిప్రణీత్ కాంస్యం గెలిచాడు. 2: ఒకే ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు రెండు పతకాలు రావడం ఇది రెండోసారి. 2017లో సింధు, సైనా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్స్లో వరల్డ్ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్)తో సాయిప్రణీత్... ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడతారు. మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
క్వార్టర్స్లో సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో ఐదో సీడ్ శుభాంకర్ డే, ఏడో సీడ్ సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్స్కు చేరుకోగా... మహిళల సింగిల్స్ కేటగిరీలో ఆకర్షి కశ్యప్, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో శుభాంకర్ డే 21–16, 21–15తో చికో అరా వార్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–16, 21–11తో సన్ పెయ్ జియాంగ్ (చైనా)ను, అజయ్ జయరామ్ 21–18, 21–13తో జియా వీ తాన్ (మలేసియా)ను ఓడించారు. మరో మ్యాచ్లో నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ 21–17, 15–21, 19–21తో లోహ్ కియాన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సాయి ఉత్తేజిత రావు 10–21, 21–9, 8–21తో క్వాలిఫయర్ బెన్యప ఎమ్సార్డ్ (థాయ్లాండ్) చేతిలో, క్వాలిఫయర్ ఆకర్షి కశ్యప్ 18–21, 13–21తో రెండో సీడ్ అన్ సు యంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. -
భారత స్టార్స్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ 18–21, 11–21తో హియో క్వాంగ్ హీ (కొరియా) చేతిలో... రెండో సీడ్ సాయిప్రణీత్ 17–21, 23–21, 15–21తో లియోనార్డో రుంబే (ఇండోనేసియా) చేతిలో... మూడో సీడ్ ప్రణయ్ 17–21, 10–21తో జియా వె తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో నాలుగో సీడ్ కశ్యప్ 23–21, 19–21, 21–17తో క్వాలిఫయర్ కిమ్ డాంగ్హున్ (కొరియా)పై, శుభాంకర్ 19–21, 21–13, 21–16తో సెంగ్ జో యో (మలేసియా)పై గెలిచారు. హైదరాబాద్ ఆటగాడు, క్వాలిఫయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లో 21–16, 21–23, 15–21తో మరో క్వాలిఫయర్ బాయ్ యు పెంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–14, 17–21, 21–10తో దిశా గుప్తా (అమెరికా)పై గెలుపొందగా... గుమ్మడి వృశాలి 16–21, 10–21తో ఫితాయపోర్న్ చైవన్ (థాయ్లాండ్) చేతిలో... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ 15–21, 10–21తో కి జుయ్ఫె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
జొకోవిచ్ X ఫెడరర్
లండన్: ఈ సీజన్లో తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 4–6, 6–3, 6–2తో 23వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో జొకోవిచ్ తలపడతాడు. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/3), 1–6, 6–3, 6–4తో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై గెలిచాడు. వరుసగా 21వ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్ 12వసారి ఫైనల్కు చేరాడు. 8 సార్లు టైటిల్ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్గా నిలిచాడు. ఈ ఏడాది బాటిస్టా అగుట్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన జొకోవిచ్ మూడోసారి మాత్రం విజయాన్ని రుచి చూశాడు. 27వ ప్రయత్నంలో కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన అగుట్ ఆ అడ్డంకిని మాత్రం దాటలేకపోయాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పోరులో జొకోవిచ్కు రెండో సెట్ మినహా అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్లు సంధించిన జొకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన అతను 42 సార్లు పాయింట్లు సాధించడం విశేషం.అగుట్ సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ రెండో సెట్లో ఒకసారి తన సర్వీస్ను కోల్పోయాడు. 42 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అగుట్ కేవలం ఐదు ఏస్లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. అగుట్పై విజయంతో జొకోవిచ్ తన కెరీర్లో 25వసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరాడు. 15 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతను 9సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. వింబుల్డన్ ట్రోఫీని నాలుగుసార్లు (2011, 2014, 2015, 2018) సొంతం చేసుకున్న జొకోవిచ్ ఒకసారి (2013లో) రన్నరప్గా నిలిచాడు. -
ప్రిక్వార్టర్స్లో ఫెడరర్, నాదల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఫెడరర్ 7–5, 6–2, 7–6 (7/4)తో లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–3, 6–2తో సోంగా (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–4తో జులియా జార్జెస్ (జర్మనీ)పై, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–1తో హరియెట్ డార్ట్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. -
అండర్సన్కు చుక్కెదురు
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్లో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. పదోసీడ్ ఖచనోవ్ (రష్యా) కూడా పరాజయం చవిచూడగా, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), రావ్నిచ్ (కెనడా) ప్రిక్వార్టర్స్ చేరాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు నాలుగో సీడ్ అండర్సన్ 4–6, 3–6, 6–7 (4/7)తో 26వ సీడ్ పెల్లా చేతిలో కంగుతిన్నాడు. మిగతా మూడో రౌండ్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7–5, 6–7 (5/7), 6–1, 6–4తో హుర్కాజ్ (పోలాండ్)పై, 15వ సీడ్ రావ్నిచ్ (కెనడా) 7–6 (7/1), 6–2, 6–1తో రెలీ ఒపెల్కా (అమెరికా)పై గెలుపొందారు. పదో సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–7 (3/7), 1–6 స్పెయిన్కు చెందిన 23వ సీడ్ అగుట్ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో అజరెంకా (బెలారస్)పై, మూడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 2–6, 6–4తో సు వే హై (చైనీస్ తైపీ)పై, 8వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–7 (1/7), 6–2తో సక్కారి (గ్రీస్)పై గెలిచారు. -
రామ్కుమార్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రామ్కుమార్ రామనాథన్ శుభారంభం చేయగా... సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్లో తొలి రౌండ్ మ్యాచ్లో రామ్కుమార్ 6–3, 6–2తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ 4–6, 6–4, 5–7తో గిలెర్మో లోపెజ్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. లాకోతో జరిగిన మ్యాచ్లో రామ్ తొమ్మిది ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 24 విన్నర్లు కొట్టిన ఈ చెన్నై ప్లేయర్ కేవలం పది అనవసర తప్పిదాలు చేశాడు. లోపెజ్తో జరిగిన మ్యాచ్లో సాకేత్ 15 ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 43 విన్నర్స్ కొట్టిన సాకేత్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
తొలి రౌండ్లో ప్రజ్నేశ్ పరాజయం
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 84వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–7 (3/7), 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ జౌమి మునార్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రజ్నేశ్ తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లోనే ఓడిన ప్రజ్నేశ్కు 16,425 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 11 లక్షల 35 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అంకిత, రామ్ శుభారంభం
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్ రెండో రౌండ్కు చేరాడు. మహిళల సింగిల్స్లో అంకిత రైనా శుభారంభం చేయగా... కర్మన్కౌర్ థండి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. సెర్గియో గిటెరెజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్లో రామ్కుమార్ 6–3, 6–2తో గెలుపొందాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రామ్కుమార్ ఐదు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. అంకిత 6–2, 6–2తో మిర్టెల్లి జార్జెస్ (ఫ్రాన్స్)ను ఓడించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అంకిత తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కర్మన్ కౌర్ 0–6, 5–7తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. కర్మన్ ఐదు డబుల్ ఫాల్ట్లు, 33 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. -
ప్రిక్వార్టర్స్లో సాయిప్రణీత్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. తొలి రౌండ్లో ప్రణీత్ 21–17, 21–14తో మిష జిల్బెర్మన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ 13–21, 21–17, 21–12తో అభినవ్ (న్యూజిలాండ్)పై నెగ్గారు. ఇతర మ్యాచ్ల్లో సౌరభ్ వర్మ 21–19, 17–21, 12–21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో... జయరామ్ 20–22, 22–20, 21–17తో టకెశిటా (జపాన్) చేతిలో... లక్ష్యసేన్ 20–22, 21–13, 19–21తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో... రాహుల్ యాదవ్ 11–21, 17–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19–21, 21–15, 21–15తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. సాయి ఉత్తేజిత 8–21, 19–21తో మినె (జపాన్) చేతిలో... శ్రీకృష్ణప్రియ 18–21, 20–22తో యూలియా (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
ముర్రే X రోనిచ్
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ 80 ఏళ్ల తర్వాత రెండోసారి వింబుల్డన్ టైటిల్ సాధించిన రెండో బ్రిటన్ ప్లేయర్గా గుర్తింపు పొందడానికి ఆండీ ముర్రే... కెనడా తరఫున తొలి గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించేందుకు మిలోస్ రోనిచ్... ఆదివారం జరిగే వింబుల్డన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. 2013లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ముర్రే తన స్థాయికి తగ్గట్టు ఆడితే రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను అందుకోవడం కష్టమేమీకాదు. బ్రిటన్ తరఫున ఫ్రెడ్ పెర్రీ (1934, 1935, 1936లలో) మాత్రమే మూడుసార్లు వింబుల్డన్ టైటిల్ సాధించాడు. మరోవైపు 2002 తర్వాత ఫెడరర్, జొకోవిచ్, రాఫెల్ నాదల్ లేకుండా తొలిసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ముఖాముఖి రికార్డులో ముర్రే 6-3తో రోనిచ్పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్స్లామ్ టోర్నీలలో ఈ ఇద్దరూ రెండుసార్లు (2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 యూఎస్ ఓపెన్) తలపడగా... రెండుసార్లూ విజయం ముర్రేనే వరించింది. సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
గురుసాయిదత్ శుభారంభం
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు గురుసాయిదత్, ప్రతుల్ జోషి, హర్షీల్ డాని శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ 21-7, 21-6తో రిడిగెర్ జెనెడ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. కేవలం 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో గురుసాయిదత్కు ఏ దశలోనూ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండో గేమ్ చివర్లో గురుసాయిదత్ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రతుల్ జోషి 21-13, 21-12తో బైరన్ హోల్సెక్ (కెనడా)పై, హర్షీల్ 21-11, 21-14తో అలిస్టర్ కేసీ (స్కాట్లాండ్)పై విజయం సాధించారు.