MOM
-
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
ట్రెండ్ సెటర్గా ఫస్ట్ ఏఐ మామ్ కావ్య మెహ్రా
ఒకరోజు... హాయ్ ఫ్రెండ్స్... నేను మీ కావ్య మెహ్రాని మాట్లాడుతున్నాను. ప్రెగ్నెన్సికి సంబంధించి నా గత జ్ఞాపకాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.మరో రోజు...మీ పిల్లవాడు బడికి వెళ్లనని మారాం చేస్తున్నాడా? హోంవర్క్ చేయడానికి భయపడుతున్నాడా? ఈ సమస్యలను ఒక తల్లిగా ఎలా పరిష్కారం కనుగొన్నానో ఈరోజు మీకు చెబుతాను.ఇంతకీ ఎవరీ కావ్య మెహ్రా?కాల్పనికత, వాస్తవికతకు మధ్య హద్దును చెరిపేస్తూ వర్చువల్ ఇన్ఫ్లూయెన్సర్లు ‘వావ్’ అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు తాజా సంచలనం... కావ్య మెహ్రా.మన దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత మామ్ ఇన్ఫ్లూయెన్సర్గా కావ్య మెహ్రా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా అవతరించింది. టెక్నాలజీ, మాతృత్వం కలగలిసిన ఈ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ను ‘కలెక్టివ్ ఆర్ట్స్ నెట్వర్క్’ కంపెనీ రూపొందించింది.మాతృత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఏఐ డిజైన్ మోడల్గా కావ్య మెహ్రాను తీర్చిదిద్దారు. ఇన్స్టాగ్రామ్లో కావ్య మెహ్రా బయోలో ‘భారతదేశపు మొట్ట మొదటి ఏఐ మామ్. పవర్డ్ బై రియల్ మామ్స్’ అనే పరిచయ వాక్యం ఉంటుంది.మన దేశంలోని వివిధ రంగాలకు చెందిన తల్లులు ఎదుర్కొనే దైనందిన జీవిత అనుభవాలు, భావోద్వేగాలకు కావ్య మాటలు అద్దం పడతాయి. వంట, కుటుంబ జీవితం, వ్యక్తిగత శ్రేయస్సు, మాతృత్వానికి సంబంధించిన అనేక అంశాలు కావ్య కంటెంట్లో ఉంటాయి. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)ఆధునిక కోణంలో మాతృత్వానికి సంబంధించిన తన ఆలోచనలను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. స్కిన్కేర్ రొటీన్స్ను ఫాలో అయ్యే కావ్య కుకింగ్ను, పెయింటింగ్ను ఎంజాయ్ చేస్తుంది.ఫేవరెట్ ఫుడ్ తయారు చేయడం నుంచి పండగ సంతోషం వరకు రకరకాల విషయాలను ఇన్స్టాలో పంచుకుంటుంది. ప్రెగ్నెన్సీ, చైల్డ్స్ డెవలప్మెంట్... మొదలైన ఫ్లాష్బ్యాక్ ఇమేజ్లను కూడా షేర్ చేస్తుంది. తాను ఎలాంటి తల్లి కావాలనుకుంటోందో ఒక పోస్ట్లో చర్చించింది కావ్య. ఎవరి ప్రేమ నీడలో అయితే పిల్లలు చల్లగా, భద్రంగా ఉండగలుగుతారో... అలాంటి తల్లి తాను కావాలని అనుకుంటుంది. ‘కావ్య కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు. సమాజానికి సంబంధించి నిజజీవిత అనుభవాల ప్రతిబింబం’ అంటున్నాడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్’ వ్యవస్థాపకుడు విజయ్ సుబ్రమణ్యం.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫస్ట్ ఏఐ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ కావ్య మెహ్రపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం మాతృత్వం గురించి డిజిటల్ అవతార్ చెప్పడం ఏమిటో అని పెదవి విరిచారు. కావ్య మెహ్రా ఏఐ పవర్డ్ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయినప్పటికీ... ఎంతోమంది నిజజీవిత తల్లుల అనుభవాల నుంచి ఈ డిజిటల్ అవతార్ను సృష్టించారు. -
ఏఐ సాంకేతికతో అలా స్వాంతన పొందడం మంచిదేనా..?
ఏఐ సామర్థ్యం ఊహకందని విధంగా పలు రంగాల్లో తన హవా చాటుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మనకెంతో ఇష్టమైన వారు ప్రమాదవశాత్తు దూరమయ్యితే ఆ బాధను దిగమింగడం అంత ఈజీ కాదు. అలాంటి వాటిలో చక్కటి ఉపశమనం కలిగిస్తోంది ఏఐ సాంకేతికత. అలాంటి వాటికి సంబంధించిన ఇటీవల్ల కొన్ని భావోద్వేగ కథలను విన్నాం. అయితే ఇలా సాంకేతికతో స్వాంతన, ఉపశమనం పొందడం ఎంతవరు సరైనది. ఎన్నటికీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గదా..!. దీని కారణంగా వాస్తవికతకు దూరమయ్యే పరిస్థితి ఎదురవ్వుతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..జస్టిన్ హారిసన్ అనే టెక్ వ్యవస్థాపకుడు తన తల్లి ఇంకొద్ది రోజుల్లో దూరమైపోతుందని తెలిసి తల్లిడిల్లిపోతాడు. దీంతో ఆమె గుర్తులు, జ్ఞాపకాలు తనను వీడిపోకుండా ఉండేలా ఏఐ సాంకేతికతో అమ్మ వాయిస్ని క్రియేట్ చేసుకున్నాడు. అతడు ఆమె బతికున్న రోజుల్లోనే ఈ పనికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే జస్టిన్ మాత్రం తన ఏఐ సామర్థ్యంతో రూపొందించిన తన తల్లి వాయిస్తో స్వాంతన పొందుతుంటాడు. తనతోనే తల్లి ఉందన్న భరోసాతో జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాపకం వచ్చినప్పుడల్లా ఆమె వాయిస్ రికార్డుతో కూడిన ఏఐ సాంకేతికతో తల్లితో మాట్లాడిన అనుభూతిని పొందుతుంటాడు. అంతేగాదు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. ఇది నిజంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఓ వరం అంటూ ఆ సాంకేతికతపై పొగడ్తల వర్షం కురిపించాడు. అయితే మానసిక నిపుణుడు రుచి రుహ్ మాత్రం ప్రారంభ దశలో ఈ సాంకేతికత ఉపశమనంగా అనిపించినా రాను రాను వాస్తవికతలో ఉండేందుకు మెదడు అంగీకరించకపోవచ్చు లేదా ఇష్టపడకపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి దుఃఖం మనిషిని బలవంతుడిగా మారిస్తే..ఈ సాంకేతికతో లభించిన భరోసా..వాస్తవికతకు దూరం చేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతిక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వాళ్లను మాములు మనుషులు చేసేందుకు వినియోగించి ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగ్గా ఉండేలా చెయ్యొచ్చు. కానీ దీనిమీదే ఆధారపడిపోయేలా మాత్రం తయారు కాకూడదని చెబుతున్నారు. చెప్పాలంటే.. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధ కొన్నాళ్లకి తగ్గి సాధారణ మనుషులుగా సహజసిద్దంగానే మారిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం.ఏనాటికైనా అందరూ చనిపోవాల్సిన వాళ్లే అనే సత్యాన్నికి కట్టుబడి ఉండేలా సహజసిద్ధంగా మనసు సిద్ధమవుతుంది. అందువల్లే పూర్వం వాళ్లు ముక్కుపచ్చలారని పసివాళ్లు దూరమైనా..బాధను దిగమింగి మరీ ధైర్యంగా బతుకును సాగించేవారు. సాంకేతికత పుణ్యమా అని ప్రాణాలు అల్పమైపోయాయి. చిన్న బాధను కూడా తట్టుకోలేని సున్నిత మనస్కులుగా, అల్పమైన జీవులుగా మారిపోతున్నాం. సెన్సిటివిటీ కంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండేలా మనిషి మారితేనా అన్ని విధాల శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
స్టార్ హోటల్ బాల్కనీలో ఎండకు బట్టలు : అయితే ఏంటట? వీడియో వైరల్
నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pallavi Venkatesh (@iam.pallavivenkatesh) అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్ను, లక్షకు పైగా లైక్స్ను దక్కించు కోవడం విశేషం. -
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్లు..ఒక్కో జీన్స్కి ఏకంగా..!) -
నిండు గర్భంతో అమలా పాల్, లెవల్ క్రాస్లో స్వయంగా ఓ పాట : వైరల్
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాలో బేబీ బంప్తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్ను కూడా పోస్ట్చేసింది. దీంతో ఇవి వైరల్గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Think Music Malayalam (@thinkmusicmalayalam) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
సూపర్ మామ్స్! రికార్డులు సృష్టించిన తల్లులు
తల్లిగా మారిన ప్రతి స్త్రీ పిల్లల పనిని ఇష్టంగానూ అదే సమయంలో కష్టంగానూ భావిస్తుంటుంది. తన బాగు గురించి తాను చూసుకోవడం మరచిపోతుంటుంది. తల్లిగా మారిన తర్వాత కూడా తమ జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలో క్రీడాస్ఫూర్తితో నిరూపిస్తున్నారు కొందరు తల్లులు. ఇటీవల అమెరికా వాసి కైట్లిన్ డోనర్ స్ట్రోలర్తో రన్నర్ మామ్ రికార్డ్ను బద్దలు కొట్టింది. ముంబై వాసి అయిన వినీత్ సింగ్ గర్భవతిగా ఉన్నప్పటి నుంచే రన్నింగ్తో తన ప్రపంచాన్ని ఎంత ఆరోగ్యంగా మార్చుకుందో రుజువు చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న ఇద్దరు పిల్లల తల్లి అయిన 34 ఏళ్ల కైట్లిన్ డోనర్ ఇటీవల చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. తన 20 నెలల కొడుకును స్ట్రోలర్ (లాగుడు బండి)లో కూర్చోబెట్టుకొని, ఆ స్ట్రోలర్ను నెడుతూ మైలు దూరాన్ని కేవలం ఐదు నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక గుర్తింపు పొదింది. తల్లుల్లో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవచ్చో తన సాధన ద్వారా నిరూపిస్తోంది.సాధనమున సమకూరు.. రెండవ గర్భధారణ సమయంలో ప్రసవానంతరం తన లక్ష్యాన్ని ప్రపంచానికి చాటాలనుకుంది. రన్నింగ్ గోల్ని ఏర్పరుచుకునే క్రమంలో ఆమెకు రన్నర్ స్నేహితులు ఉత్సాహం కలిగించారు. ఇది ఆమెను మరింత ముందుకు వెళ్లేలా చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ్రపాసెస్లో భాగంగా సెప్టెంబర్ 2022లో తన బిడ్డకు కేవలం నెల వయసు ఉన్నప్పుడే క్లైటిన్ దరఖాస్తు చేసింది. కానీ, అది తిరస్కరణకు గురైంది. కిందటేడాది మళ్లీ దరఖాస్తు చేసింది. ఒలింపిక్ మారథాన్ ట్రయల్స్లోనూ వెనకబాటుకు లోనైంది. అయినా నిరుత్సాహపడకుండా మరింతగా కఠినమైన శిక్షణా విధానాన్ని పాటించింది. లెగ్ టర్నోవర్ని పెంచడానికి కొన్ని స్పీడ్ వర్కవుట్లను నిర్వహించింది. సాధనలో 1600 మీటర్ల వర్కౌట్ను స్ట్రోలర్తో సాధన చేసింది. ఈ ఎక్స్పీరియెన్స్ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కిందటి నెలలో బాబ్ గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్తో ట్రాక్లోకి ప్రవేశించింది. దీనికి ఆమె కుటుంబం, సన్నిహితులు అందించిన మద్దతు తనకీ విజయం సాధించడానికి తోడ్పడింది అని తెలియజేస్తుంది. కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి.. ట్రాక్పై పరిగెత్తుతున్నప్పుడు ప్రతి అడుగుతోనూ ఆమె ఈ లక్ష్యాన్ని అధిగమించడంతో చుట్టూ ఉన్న వారి చప్పట్ల హోరు కన్నా తన లక్ష్యానికి ఆమె ఇచ్చి ప్రాముఖ్యానికి అందరూ కొనియాడారు. మైలు దూరాన్ని 5 నిమిషాల 11.13 సెకన్ల సమయంలో ముగించి, మునుపటి 5 నిమిషాల 13 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి విజేతగా నిలిచింది. ఆమె ట్రాక్పై పరిగెత్తుతున్నప్పుడు అందరి దృష్టి ఆమెపై అలాగే బాబ్గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్లోని బిడ్డపై కూడా ఉంది. ‘సులువైన వాటిని కాదు భయానకమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఎందుకు సాధించలేం? అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోండి. ఆశించిన ఫలితం వస్తుందో రాదో చెప్పలేం. కానీ, ప్రయత్నించినందుకు ఏ మాత్రం చింతించరు’ అని బోసినవ్వుల కొడుకును ఎత్తుకుంటూ చెబుతుంది డోనర్. మన వినీత్ సింగ్ ముంబై వాసి వినీత్ సింగ్కి తల్లిగానే కాదు విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్గా... ఫిట్నెస్ ఔత్సాహికురాలుగా కూడా ఎంతో పేరుంది. ఆరు నెలల గర్భవతిగా ఉండీ వైద్యుల అనుమతితో ఈ ఏడాది జనవరిలో జరిగిన 30 కి లోమీటర్ల మారథాన్లో పాల్గొంది. ‘నా ప్రపంచం ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ మార థాన్ నాకు పరిచయం చేసింది’ అని ఈ సందర్భంగా తెలియజేసింది. వినీత్ సింగ్ కుటుంబం క్రీడలు, ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టపడుతుంది.అప్పటికే వినీత్కి అల్ట్రా మారథాన్, హాఫ్ మారథాన్ వంటి వాటిల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 3.8 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42 కిలోమీటర్ల మారథాన్లలోనూ పాల్గొంది. మోస్ట్ పవర్ఫుల్ ఉమన్గా అవార్డులూ గెలుచుకుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవానంతరమూ తల్లులు తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపాలో, తమ ప్రపంచాన్ని ఎంత ఉత్సాహకరంగా మార్చుకోవాలో ఈ తల్లులు తమ జీవనశైలితో నిరూపిస్తున్నారు.(చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్గా తొలి భారతీయ యువతి!) -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్హుడ్ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Priyanka Singh: బటర్ఫ్లై మామ్
ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు. ప్రియాంక సింగ్ది ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది. బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి. అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి. ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
ఇంట్లోనే పది రోజులు ఒంటరిగా 16 నెలల చిన్నారి..పాపం! చివరికి..
కర్కశమో లేక కసాయితనమో గానీ కొందరూ తల్లుల చేసే కృత్యాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా కొందరూ తల్లల ప్రవర్తన అర్థంకాని రీతిలో ఉంటుంది. అది ఒక మానసిక రుగ్మత మరైదైన గానీ..వారి నైజానికి అభం శుభం తెలియని చిన్నారుల బలవుతున్నారు. అచ్చం అలానే యూఎస్లోని ఓ తల్లి క్షమించరాని ఘాతుకానికి పాల్పడింది. యూఎస్లోని 31 ఏళ్ల క్రిస్టెల్ కాండెలారియో 16 నెలల పసికందుని ఇంట్లోనే పది రోజులుగా 16 నెలల చిన్నారి జైలిన్ని ఒంటరిగా వదిలేసింది. అది కూడా సెలవులపై బయటకు వెళ్లడం కోసం.. ఆ చిన్నారి బాగోగులను గాలికి వదిలేసి.. డెట్రాయిట్లో గడిపొచ్చింది. చివరికి ఆ మహా తల్లి హాయిగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఆ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. డీ హైడ్రెషన్కి గురయ్యి ఉంది. ఆ తర్వాత తాపీగా సాయం కోసం హెల్ప్లైన్కి కాల్ చేసింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని నిశితంగా గమనించారు. ఆ చిన్నారి ఒంటిపై ఒక్క గాయం కూడా లేదని గుర్తించారు. ఐతే ఆ చిన్నారి ఉన్న పరుపు మూత్రం, మలంతో కలుషితమై ఉన్నట్లు గమనించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కాండెలారియో ఇలా చిన్నారిని ఒంటరిగా వదిలేయడం మొదటిసారి కాదని తేలింది. కాండెలారియో ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆమె ఇలా చాలాసార్లు చేసిందని, అలాగే ఇలా చేయొద్దని చెప్పామని వారు చెబుతున్నారు. చిన్నారి జైలిన్ చనిపోవడానికి తల్లి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!) -
నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతవారం తమిళ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఏడు రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ నటి పవిత్ర లక్ష్మి తన ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్గా బన్నీ) ఇన్స్టాలో పవిత్ర రాస్తూ.. 'నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా. నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్ పేరెంట్గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? స్పందించిన హీరోయిన్) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
పిల్లలను చంపేసి చనిపోవాలనుకుంది ఓ తల్లి..కానీ 16 ఏళ్ల తర్వాత..
ఓ తల్లి తన ఐదుగురు పిల్లలను చంపేసి తాను చనిపోవాలనుకుంది. కానీ అనుకోకుండా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆమె స్వంత అభ్యర్థన మేరకు 16 ఏళ్ల తర్వాత అనాయాస మరణం పొందింది. ఈ విషాద ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..బెల్జియంలో 2007లో దేశాన్ని కుదిపేసిన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 27, 2007న నివెల్లెస్ పట్టణంలోని జెనీవ్వ్ లెర్మిట్టే అనే మహిళ 14 సంవత్సరాల కుమారుడు, నలుగురు కూతుళ్లను గొంతుకోసి చంపేసింది. ఆ చిన్నారుల తండ్రి తన తల్లిదండ్రులను చూసేందుకు మొరాకోకి వెళ్లినప్పుడూ ఆ తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. అనుహ్యంగా ఆమె ప్రయత్నం విఫలమై ప్రాణాలతో బయటపడింది. ఐతే కోర్టు ఈ దారుణానికి ఒడిగట్టినందుకు 2008లో ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఐతే ఆమె విచారణలో చెప్పిన విషయాలు అధికారులనే కంటతడి పెట్టించాయి. "తాను ఈ దారుణానికి ఒడిగట్టినరోజు ఓ సూపర్ మార్కెట్ నుంచి రెండు కత్తులను దొంగలించినట్లు తెలిపింది. ఆ రోజు తన పిల్లలు భోజనం చేశాక తలుపులు లాక్ చేసి మరీ చంపేశానని చెప్పుకుచ్చింది. క్షణికమైన నిర్ణయం వల్లే నా పిల్లలందర్నీ పొగొట్టుకున్నాను. ఇది నాకు భరించలేని ఆవేదన. నా చివరి రోజుల వరకు దీన్ని అనుభవిస్తాను, ఇదే నాకు సరైన శిక్ష అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె తన భర్తకు విడాకులు సైతం ఇచ్చింది. ఈ విషాద ఘటన జరిగి నేటికి సుమారు 16 ఏళ్లు. అదీగాక బెల్జియం చట్టాల ప్రకారం భరించలేని నయం చేయలేని మానసిక బాధతో భాదపడుతున్నట్లు భావించినట్లయితే అనాయాస మరణానికి అనుమతిస్తుంది. ఆ తల్లి లెర్మిట్టే ఈ విషయాన్నే కోర్టుకి నివేదించింది. వాస్తవానికి 2019లో ఆమెను మానసిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు కూడా. అయినా ఆమె ఆ తీవ్ర మనోవేదనను మర్చిపోలేకపోతుందని, అది నయం కానిదని వైద్యులు సైతం ధృవీకరించడంతో కోర్టు ఆమెకు అనాయాస మరణానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మానసిక వైద్యుల మాట్లాడుతూ..ఆమె పిల్లను చంపేసి చనిపోవాలనుకుంది, అలా జరగకుండా ఆమె బతికి బయటపడటం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ఆ క్షణికమైన నిర్ణయం కారణంగానే పిల్లలను పోగొట్టుకున్నాని అంటూ కుంగిపోయింది. ఆమె చనిపోవాలనే బలంగా అనుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె అనాయాస మరణం పోందినట్లు బెల్జియం స్థానిక మీడియా పేర్కొంది. బుధవారమే ఆమె అంత్యక్రియలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు. (చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్) -
మా అమ్మను అరెస్టు చేయండి.. స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు
భోపాల్: మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్కు వెళ్లి పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లెయింట్గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. నాన్నను వెంటపెట్టుకుని మరీ ఈ చిన్నారి పోలీస్ స్టేషన్కు వెళ్లింది తన సొంతతల్లిపై ఫిర్యాదు చేయడానికే. వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. బుడ్డోడు ఎంతో క్యూట్గా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. మహిళా పోలీస్ కూడా అతడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది. చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లేట్లు తింటూ అటూ ఇటూ కదిలాడని, దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తన కూమరుడ్ని స్టేషన్కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పిల్లాడు స్టేషన్కు వెళ్లి సొంతతల్లిపైన ఫిర్యాదు చేసిన అతని అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బర్హాన్పూర్ జిల్లా డేడ్తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6 — Hindustan (@Live_Hindustan) October 17, 2022 చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా చేప..
కశ్మీర్: మనకు క్రికెట్లో చాలా రకాలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తెలుసు. మరి చేపను ఎక్కడైనా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఇవ్వడం చూశారా. ఒక క్రికెట్ మ్యాచ్లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పెట్టుకోవడం ఆసక్తిని కల్గిస్తోంది. ఇది కశ్మీర్లోని తెకిపూరా కుప్వారా క్రికెట్ లీగ్లో చోటు చేసుకుంది. మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్కు 2.5 కేజీల చేపను అందించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీన్ని జర్నలిస్టు ఫిర్దోస్ హసన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి ఫిదా అవుతున్న అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లీగ్ను ఫేమస్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారని ఫిర్దోస్ పేర్కొన్నాడు. అంతేకాకుండా పిచ్ పేలవంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపడానికి ఇలా చేసి ఉండవచ్చని కూడా ఫిర్దోస్ తెలిపాడు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి, ఆటగాళ్లు తమ జేబులోనుంచే డబ్బులు తీయాల్సిన పరిస్థితితో ఇలా చేపన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మనకు తెలిసినంత వరకు ఒక క్రికెట్ లీగ్లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఇవ్వడం తొలిసారే కావొచ్చు.(చదవండి:రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) Recently, in a cricket match at Tekipora Kupwara, a 2.5 Kg fish was given as Man of the Match award. #CricketDhamaka#ESPN #IPL2020 #kashmircricket pic.twitter.com/fQ7VAJ7Gvb — Firdous Hassan (@FirdousHassan) September 21, 2020 -
ఇస్రో ట్వీట్: ఇదేంటో తెలుసా!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇప్పటికీ విజయవంతం పనిచేస్తోంది. అంతరిక్షంలో అరుదైన చిత్రాన్ని తాజాగా ‘మామ్’ తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహం రహస్య చంద్రుడిగా వ్యవహరించే ‘ఫోబోస్’ అరుదైన ఫొటోను మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) సంగ్రహించింది. అంగారక గ్రహం నుంచి 7,200 కి.మీ. ఫోబోస్ నుంచి 4,200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు ఎంసీసీ ఈ ఫొటో తీసిందని ఇస్రో వెల్లడించింది. ‘ఈ ఫోటో ప్రాదేశిక రిజల్యూషన్ 210 ఎం. ఇది 6 ఎంసీసీ ఫ్రేమ్ల నుంచి ఉత్పత్తి చేయబడిన మిశ్రమ చిత్రం. రంగు సరిదిద్దబడింద’ని ఇస్రో తెలిపింది. అంగార గ్రహానికి అతి సన్నిహితంగా, పెద్దగా ఉన్న చంద్రుడిగా పిలవబడే ఫోబోస్.. కార్బోనేషియస్ కొండ్రైట్లతో నిండివుంటుందని వెల్లడించింది. 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. (టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు) -
చైనాలో బాలీవుడ్ హవా!
ఇండియాలో చైనా వస్తువుల హవా కొనసాగుతుంటే.. చైనా మార్కెట్లో మాత్రం ఇండియన్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. చైనాలో రిలీజ్ అయిన పలు బాలీవుడ్ చిత్రాలు ఇండియాలో కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది చైనాలో విడుదలైన అంధాదున్, మామ్ చిత్రాలు అక్కడి బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అంధాదున్ 350కోట్లకు పైగా కలెక్ట్ చేయగా.. మామ్ సైతం వసూళ్లలో దూసుకుపోతోంది. గతవారం రిలీజ్ అయిన శ్రీదేవి ‘మామ్’ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మూవీ వందకోట్లను కలెక్ట్ చేసినట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఆమీర్ ఖాన్ పీకే చిత్రం బాలీవుడ్ మార్కెట్కు దారులు తెరవగా.. దంగల్ చిత్రంతో ఇండియన్ మూవీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయిజాన్, హిచ్కీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వెళ్లిన అంధాదున్, మామ్ చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. -
అమ్మానాన్నకు చెబితేనే పరిష్కారం దొరుకుతుంది
మీటూతో ప్రపంచం ప్రకంపిస్తోంది ఇప్పుడు. విద్యావంతులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సినిమా రంగంలో ప్రముఖులు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా మగవాళ్లందరినీ బిక్కుబిక్కుమని భయపెడుతున్న ఉద్యమం ఇది. అంత పెద్దవాళ్లే నిలువు గుడ్లేసుకుని ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన ఏ మాట ఎలా బాణంలా వచ్చి దిగుతుందో తెలియక సతమతమవుతుంటే పుణెలోని ఓ స్కూలు ప్యూన్ ఇవేవీ పట్టకుండా తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. ఉద్యోగం పోయి పోలీసుల ఎదుట దోషిలా నిలబడ్డాడు. రఘునాథ్ చౌదరికి 47 ఏళ్లు, పుణెలోని కొత్రుద్లో ఓ స్కూల్లో ప్యూను. అతడి కన్ను హైస్కూల్ అమ్మాయిల మీద పడింది. ముగ్గురమ్మాయిలతో అవసరానికి మించిన చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్లు దూరంగా ఉంటే వీడియోలు చూపిస్తానంటూ తన స్మార్ట్ ఫోన్లో పోర్నోగ్రఫీ (అశ్లీల చిత్రాలు) చూపించి మీరూ నేర్చుకోవాలని వాళ్లను ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్లంతా పదమూడు– పద్నాలుగేళ్ల వాళ్లే. ఈ బెడద నుంచి ఎలా బయటపడాలో తెలియక మూడు వారాలపాటు సతమతమయ్యారు. ఒకమ్మాయి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి దురాగతం బయటపడింది. టీచర్ల విచారణలో మిగిలిన ఇద్దరమ్మాయిలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసి, రఘునాథ్ చౌదరిని ఉద్యోగం నుంచి తొలగించింది. బాధితులంతా మైనర్లు కావడంలో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్, 2012) చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. – మంజీర -
మిసెస్ మామ్
-
తల్లి చీరలో జాన్వీ కపూర్
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్ ఖుషీ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు. -
వెక్కివెక్కి ఏడ్చిన బోనీ కపూర్
దుబాయ్ : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవీ మృతిపై యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. సినీలోకం శోకసంద్రంలో నిండిపోయింది. దుబాయ్ లో బోనీ కపూర్ మేనల్లుడు వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవీ, అక్కడే మృతి చెందినట్టు తెలిసింది. అయితే మొదట ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించినా... ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం ఆమె మరణానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె గుండెపోటుతో కాదని, ప్రమాదవశాత్తూ బాత్టబ్లో పడిపోవడం వల్ల చనిపోయినట్టు పేర్కొంది. అయితే అపస్మారక స్థితిలో బాత్టబ్లో పడిపోయి ఉన్న శ్రీదేవీని, భర్త బోనీ కపూర్తో పాటు, మరో ముగ్గురు సన్నిహితులు దగ్గరిలోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే శ్రీదేవీ చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పారు. శ్రీదేవీ మరణ వార్తని బోనీ కపూర్ అసలు తట్టుకోలేక పోయారని పాకిస్తాన్ నటుడు అద్నాన్ సిద్దికి తెలిపారు. ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్కి గురైన బోనీ కపూర్, వెక్కి వెక్చి ఏడ్చారని పేర్కొన్నారు. అప్పటికే దుబాయ్లో ఉన్న తాను బోనీ సాబ్ను కలిసినట్టు అద్నాన్ తెలిపారు. అద్నాన్ శ్రీదేవీ నటించిన 'మామ్' సినిమాలో ఆమెకు కో-స్టార్గా చేశారు. పాకిస్తాన్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీదేవీ అభిమానులంతా ఆమె లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. తనకు సంతాప సందేశాలు పంపుతున్నారన్నారు. చివరి సారిగా శ్రీదేవీతో ఆ వివాహ వేడుకల్లోనే మాట్లాడినట్టు అద్నాన్ చెప్పారు. ''వివాహ వేడుక రోజు, రాత్రి 12 గంటలకు నా విమానం అక్కడికి చేరుకుంది. అప్పటికే చాలా ఆలస్యమైందని అనుకున్నా. బోనీ సాబ్కి కాల్ చేశా. పెళ్లికి రావాలని ఆయన పట్టుబట్టారు. మామ్ సినిమా తర్వాత నేను శ్రీదేవీని మళ్లీ కలువలేదు. నాకోసం వేచిచూస్తున్నారు. చాలా ఆప్యాయంగా నన్ను పలకరించారు. అనంతరం నన్ను ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. మీరు చాలా ఆలస్యం అని నవ్వుతూ అన్నారు. ఆ మాటలు ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి. అవే ఆమె చివరగా నాకు చెప్పిన గుడ్బై ఏమో'' అని ఆవేదన వ్యక్తంచేశారు. -
నేను మరోసారి అమ్మను కోల్పోయాను..
ఇది పాకిస్థానీ నటి సజల్ అలీ వ్యక్తం చేసిన ఆవేదన. శ్రీదేవి మృతి పట్ల ఆమె తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘నేను మరోసారి అమ్మను కోల్పోయాను’ అంటూ నివాళులర్పించారు. శ్రీదేవి తాజాగా వెండితెరపై కనిపించిన సినిమా ‘మామ్’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురిగా సజల్ అలీ నటించారు. దురదృష్టవశాత్తు, సజల్ అలీ ‘మామ్’ చిత్రం షూటింగ్ సమయంలో తన తల్లిని కోల్పోయింది. ఆ సమయంలో సజల్ను దగ్గరకు తీసుకొని ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఆ విషాదసమయంలో తనను అక్కున చేర్చుకుంది. ‘సజల్ తన తల్లిని ఎంతగానో ప్రేమించేది. ఆమె దూరమవ్వడంతో ఆ అమ్మాయి గుండెపగిలింది. ఆ సమయంలో సజల్ను దగ్గరకు తీసుకొని.. ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఈ విషాదం తర్వాత ఓసారి సజల్ పాక్లోని తన స్వస్థలం నుంచి శ్రీదేవికి ఫోన్ చేసి మాట్లాడింది. తన విషాదాన్ని ఆమెతో పంచుకుంది. శ్రీదేవి ఎంతో ఓపికతో తనను ఓదార్చింది. మామూలుగా శ్రీదేవి సెట్స్లో ప్రొఫెషనల్గా ఉంటారు. సహ సిబ్బందితో అంతగా కలిసిపోరు. కానీ సజల్ విషయంలో మాత్రం శ్రీదేవి భిన్నంగా స్పందించారు’ అని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. సినిమా విడుదల సమయంలో శ్రీదేవి సజల్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సజల్ కూడా నా బిడ్డనే. తనను ఎంతో ప్రేమిస్తున్నా. తన గురించి ఎందుకింత భావోద్వేగానికి లోనవుతున్నానో నాకు తెలియదు. తనను మిస్ అవుతున్నాను. తను సినిమాలో అద్భుతంగా నటించింది. తను లేకుంటే ఈ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయేది. ఇది మాకు స్పెషల్ మూమొంట్’ అంటూ శ్రీదేవి పేర్కొన్నారు. మహిరా ఖాన్తోపాటు పలువురు పాకిస్థానీ నటులు శ్రీదేవి మృతిపట్ల ట్విట్టర్లో నివాళులు అర్పించారు. Lost my mom again... A post shared by Sajal Ali Firdous (@sajalaly) on Feb 24, 2018 at 11:51pm PST This was actually a surprise to me yesterday. I felt like she was there throughout. I couldn't hold back myself from crying. I am out of words. #iloveyoushrimama ❤💋 @sridevi.kapoor A post shared by Sajal Ali Firdous (@sajalaly) on Jul 7, 2017 at 12:23pm PDT -
పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..
గద్వాల అర్బన్ : పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన ఆ కుటుంబానికి అప్పట్లో విషాదం ఎదురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయిన కొన్నాళ్లకే కూతురు కూడా కనిపించకుండా పోయింది. అలా పదేళ్లుగా ఆ తల్లి కూతురి కోసం దుఖిస్తుండగా ఇప్పుడు బిడ్డ ఆచూకీ తెలిసిన వైనమిది. గద్వాలలోని వడ్డెగేరికి చెందిన పద్మ, రాముడు భార్యాభర్తలు. భర్త మరణం తర్వాత పొత్తిళ్లలో ఉన్న కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో అడ్డా కూలీగా మారింది. ఇదే క్రమంలో పద్మ తల్లి చనిపోయిందని సమాచారం రాగానే కాచిగూడ రైల్వేస్టేషన్కు ఆమె వచ్చింది. అక్కడ రద్దీ ఉండడంతో ఆరు నెలల కుమారుడిని కుమార్తె హైమావతి చేతిలో పెట్టి టికెట్ తెచ్చేందుకు వెళ్లి వచ్చే సరికి కుమారుడు మాత్రమే ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి కుమార్తె కోసం వెతుకుతున్నా ఫలితం కనిపించలేదు. కాగా, అప్పట్లో హైమావతిని చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది సికింద్రాబాద్లోని నవజీవన హోంకు, ఆతర్వాత నింబోలి అడ్డాలోని ప్రత్యేక చిల్డ్రన్ హోం(బాలికల), రాజేంద్రనగర్లోని కేజీబీవీ పాఠశాలకు తరలించారు. 6, 8వ తరగతి వరకు చదవిన హైమావతి తన తల్లి గద్వాలలో ఉన్నారని నిర్వాహకులకు చెప్పగా వారు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాములుకు మహబూబ్నగర్ అధికారులు ఫొటోతో పాటు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారంతో వడ్డేగేరి అంగన్వాడీ కార్యకర్త ఫొటోలో ఉన్న బాలికను గుర్తు పట్టి ఆమె తల్లి పద్మకు చూయించింది. తన కుమార్తెను ఆమె గుర్తించగా.. మహబూబ్నగర్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలిక హైమావతిని తల్లి పద్మకు గురువారం అప్పగించారు. -
బాలీవుడ్ రౌండప్ 2017
2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి. యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో. దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా. బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి. 2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్ఖాన్తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్లో వేసుకున్నట్టు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్ఎల్బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది. అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్తో ‘దిల్వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్తో పాత ఫార్ములాతో ‘గోల్మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్బాజ్’ చేస్తే రెండూ యావరేజ్గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి. 2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది. అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం. ఏమైనా బాలీవుడ్లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్ఖాన్తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. -
అమ్మా.. నీకెంత కష్టం!
♦ దుర్గి మండలం ఆత్మకూరులో ♦ కన్నతల్లిని బయటకు గెంటేసిన కుమారుడు ♦ వీధుల్లో యాచిస్తూ కడుపు నింపుకుంటున్న దైన్యం.. పున్నామ నరకాల నుంచి తప్పించేవారు పుత్రులంటారు పెద్దలు.. కాన్నీ బతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులకు నరకం చూపించే ప్రబుద్ధులూ కొందరుంటారు.. కాటికి కాలు చాపిన వయస్సులో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఆస్తులు తీసుకుని మరీ అమ్మను బయటకు గెంటేశాడో కొడుకు. దిక్కుమొక్కులేని ఆ అవ్వ కడుపు చేతిన పట్టుకుని వీధి వీధిన భిక్షమెత్తుకుని కడుపునింపుకుంటోంది. ముద్ద దొరికినప్పుడు తిని, దొరకనప్పుడు కన్నీళ్లు దిగ మింగి బతుకీడుస్తోంది. చలి వేస్తే వణికిపోతూ.. వానొస్తే తడుస్తూ అల్లాడిపోతోంది. ఈ దుస్థితి దుర్గి మండలానికి ఓ అవ్వకు నిత్యకృత్యమైంది. దుర్గి : మండలంలోని ఆత్మకూరుకు చెందిన మూటైన పార్వతమ్మకు ముగ్గురు కుమారులు. ఇప్పుడామె వృద్ధురాలు. ఆమె జీవితం భర్త జీవిం చి ఉన్నప్పుడు కూటికి గూటికి లోటు లేకపోయింది. భర్త మరణించిన తర్వాత ముగ్గురు కుమారులు ఆస్తిని పంచుకున్నారు. ఆమె సాధకబాధకాలు చూడటానికి 1.5 ఎకరాల భూమి, ఒక మట్టి మిద్దె ఇచ్చి చిన్నకుమారుడు పుల్లయ్యకు బాధ్యతలు అప్పగించారు. కుమారుడు దయాదాక్షిణ్యాలు మరచి భూమిని అనుభవిస్తూ తల్లిని వదిలేశాడు. పింఛను కూడా రాకపోవడంతో దిక్కులేని పక్షి అయింది. గత్యంతరం లేని వృద్ధురాలు ఆత్మకూరు అనాథ శరణాలయాన్ని ఆశ్రయించింది.అక్కడ కూడా ఉండనీయకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో దుర్గిలో భిక్షాటన మొదలుపెట్టింది. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ దుకాణాల ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో నిద్రిస్తోంది. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. స్పందించిన ఎస్సై.. దుర్గి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమె దైన్యాన్ని గమనించి ఆమె ఫొటోలు తీసి వాట్సప్లో పలు సందేశాలు పంపిం చారు. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై సుబ్బనాయుడు వెంటనే స్పం దంచి మంగళవారం ఉదయం ఆమె ను పోలీస్ స్టేషన్కు తరలించారు. కొడుకును పిలిపించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో అజ్మి రా దేవిక స్పందించి పింఛను ఇప్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతేనేం మలి దశలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉండగా కన్నపేగే ఇలా బయటకు వదిలేయడం చూసిన వారి హృదయాలను కలచివేసింది. -
‘నేను మహిళల చిత్రాలకు అనుకూలం’
న్యూఢిల్లీ: తాను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఎక్కువ అనుకూలంగా ఉంటానని బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు. ఆయన తాజా చిత్రం మామ్లో శ్రీదేవీతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి ఓ శక్తిమంతమైన పాత్రను పోషించారు. ‘నేను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సానుకూలంగా ఉంటాను. ఎందుకంటే ఈరోజుల్లో ప్రతి రంగంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అది విద్య కావొచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావొచ్చు, క్రీడలు కావొచ్చు. ఈ మార్పును ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సిందే’ అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మహిళలను సినిమాల్లో ఒక వస్తువులుగా చూపించారు.. కానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు వారి పైనే వస్తున్నాయి. మనం తప్పక స్వాగతించాలి’ అని ఆయన అన్నారు. గతంలో నవాజుద్దీన్ విద్యాబాలన్ నటించిన కహానీ చిత్రంలో పవర్ఫుల్ దర్యాప్తు అధికారిగా కనిపించిన విషయం తెలిసిందే. -
స్టార్ క్రికెటర్తో శ్రీదేవి స్టెప్స్
అతిలోకసుందరి శ్రీదేవి తన 300వ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్రీదేవి, త్వరలో రిలీజ్ అవుతున్న మామ్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. తన 300వ సినిమా కావటం, భర్త బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తుండటంతో మామ్ ను ఎలాగైన సక్సెస్ చేయాలని భావిస్తుంది. అందుకే బాలీవుడ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ లోభాగంగా మాజీ క్రికెటర్ గంగూలి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దాదాగిరి షోలో పాల్గొంది శ్రీదేవి. ఓ బెంగాల్ చానల్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు పాల్గొనటం ఇదే తొలిసారి. శ్రీదేవి లాంటి టాప్ స్టార్ తొలిసారిగా హాజరవుతుండటంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారట, అంతేకాదు కేవలం చిన్నారుల మధ్యే ఈ స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో కోసం శ్రీదేవి తో కలిసి గంగూలి డ్యాన్స్ కూడా చేశాడు. ఈ కార్యక్రమంలో శ్రీదేవితో పాటు ఆమె భర్త, నిర్మాత బోని కపూర్, దర్శకుడు రవి వడయార్ ను కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మామ్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. -
'శ్రీదేవితో సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలనుంది'
'ఇండియాలోని అన్ని జనరేషన్స్కి తెలిసిన ఒకే ఒక్క పేరు శ్రీదేవి. బాల నటి గా మొదలైన తన కెరీర్ 'మామ్' చిత్రం వరకూ సాగడమంటే మామూలు విషయం కాదు. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుణ్ణి నేనే. కోన వెంకట్ కథ అందించి, సురేశ్బాబు ఫైనాన్స్ చేసి శ్రీదేవి డేట్స్ ఇస్తే తనతో సిల్వర్ జూబ్లీ మూవీ చేస్తాను' అన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. శ్రీదేవి టైటిల్ రోల్లో రవి ఉద్యవార్ దర్శకత్వంలో తెరకెక్కిన మామ్ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ 'ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే వెళతాం. కానీ, శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే ఆలోచించకుండా వెళ్తాం. ఎందుకంటే తను గ్లామర్గా ఉంటుంది. యాక్టింగ్, డ్యాన్స్ బాగా చేస్తుంది కాబట్టి' అన్నారు. నిర్మాత డి.సురేశ్బాబు మాట్లాడుతూ 'శ్రీదేవిగారితో మా నాన్నగారు దేవత, ముందడుగు, తోఫా వంటి చిత్రాలు తీసారు. అప్పడు నేను పక్కన నిలబడి చూస్తుండేవాణ్ని. ఆమె సూపర్స్టార్. ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్. మామ్ రషెష్ చూశా. ఎక్సలెంట్గా నటించారు' అన్నారు. 'బోనీ కపూర్ సినిమాల మేకింగ్లో లాభనష్టాలు చూసుకోడు. శ్రీదేవి అప్పట్లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు అన్నారు' కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. 'దేవుడు అన్ని చోట్ల ఉండకుండా అమ్మను సృష్టిస్తాడనేది ఎంత నిజమో, మామ్ సినిమా చేయడానికి శ్రీదేవిగారిని క్రియేట్ చేశారనేది అంతే నిజం. జూలై 7న సినిమా విడుదల కానుంది' అని రచయిత కోన వెంకట్ అన్నారు. 'నా జీవితానికి భార్య ఎంత ప్రాణమో ఈ సినిమాకు అంతే ప్రాణం. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నింటిని మించే పాత్ర మామ్' అని నిర్మాత, శ్రీదేవి భర్త బోనీకపూర్ అన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ 'మామ్ ఎంత పెద్ద హిట్ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఓ నటిగా నాకు సంతృప్తినిచ్చింది. మా ఆయన ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్. -
కథ విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి: శ్రీదేవి
హైదరాబాద్ : అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘మమ్’ సినిమా తెలుగు ట్రైలర్ శుక్రవారం హైదరాబాద్లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, తాజాగా రెండో ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ..సినిమా కథ విన్నాక తన కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. ఈ చిత్రం కోసం సంవత్సరం పాటు పని చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ... శ్రీదేవి కోసం అయినా ఈ సినిమా చూడాలన్నారు. అలాగే నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ మమ్ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసించారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీదేవి చాందినీ సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అన్నారు. కాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించిన ఈ హిందీ చిత్రం తమిళం, తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల కానుంది. మామ్ సినిమాలో ఇద్దరు పాకిస్తానీ నటులు సాజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి ఉడయార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 7న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. -
శ్రీదేవి నెక్స్ట్ సినిమా.. భారీ ప్రాజెక్టు?
అలనాటి అందాల అతిలోక సుందరి శ్రీదేవికి ఇప్పటికీ తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఒకప్పుడు భారీ స్టార్డమ్తో, వరుస సినిమాలతో బాలీవుడ్ను ఏలిన ఈ సుందరిమణి.. ఇటీవల వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో తన హిందీచిత్రసీమలో తనకు తిరుగులేదని మరోసారి చాటుకుంది. ఇప్పటికే ఆమె నటించిన తాజా సినిమా ‘మామ్’ విడుదలకు ముందే పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. ఈ సినిమా శ్రీదేవి కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్తుండగా.. ఆమె తదుపరి చిత్రం కోసం భర్త బోనీ కపూర్ అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు. ఎంతోకాలంగా వెయిట్చేస్తున్న ప్రతిష్టాత్మక ‘మిస్టర్ ఇండియా 2’ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెస్తున్నాడు బోనీ కపూర్. ఈ సీక్వెల్లో శ్రీదేవి, అనిల్ కపూర్ తమ ఒరిజినల్ పాత్రలు పోషించనుండగా.. మరో యువజంట కీలకమైన పాత్రల్లో నటించనుందని సమాచారం. ‘మిస్టర్ ఇండియా 2’ కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన స్క్రిప్ట్ సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి, అనిల్ కపూర్ జోడీ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. వారు అదే మ్యాజిక్ను ఈ సీక్వెల్ను చూపించబోతున్నారట. అయితే, మిస్టర్ ఇండియా-2ను తెరకెక్కించేందుకు ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ నిరాకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడి కోసం వేట సాగుతోంది. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా, మామ్ దర్శకుడు రవి ఉద్యవర్ ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. -
బాహుబలి...నో కామెంట్!
‘బాహుబలి’ హిందీ వెర్షన్ లాభాల్లో వాటాతో పాటు భారీ పారితోషకం, స్టార్ హోటల్లో ఐదు సూట్ రూమ్స్ అడగడంతో శివగామి పాత్రకు శ్రీదేవిని వద్దనుకున్నామని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. అప్పుడు రాజమౌళిని అడిగిన ప్రశ్ననే కొంచెం మార్చి, ఇప్పుడు శ్రీదేవిని అడిగింది హిందీ మీడియా. శ్రీదేవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘మామ్’ ప్రమోషన్లో ‘బాహుబలిలో శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారు?’ అని ప్రశ్నించారొకరు. వెంటనే శ్రీదేవి ‘నో కామెంట్’ అన్నారట! శ్రీదేవి టైటిల్ రోల్లో నటించిన ‘మామ్’ వచ్చే నెల 7న రిలీజ్ కానుంది. ఆమె భర్త బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాకు శ్రీదేవి బాగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రశ్న ఆమెకు ఎన్నిసార్లు ఎదురవుతుందో? ఎదురైన ప్రతిసారీ ఆమె ‘నో కామెంట్’ అంటారా! అసలు సంగతి చెబుతారా!! -
సమయం వచ్చినపుడు చెప్తా : శ్రీదేవి
ప్రస్తుతం ఇండియన్ సినిమాకు బాహుబలి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. సౌత్ సినిమాగా తెరకెక్కిన బాహుబలి బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ సంచలనాలు నమోదు చేస్తోంది. స్ట్రయిట్ హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకున్న బాహుబలిపై పలువురు బాలీవుడ్ దిగ్గజాలు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమాపై స్పందించేందుకు ఇప్పటికీ మొహం చాటేస్తున్నారు. ప్రస్తుతం మామ్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీదేవి కూడా బాహుబలిపై ఇదే విదంగా స్పందించింది. మామ్ ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రీదేవికి శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారన్న ప్రశ్న ఎదురైంది. అయితే శ్రీ దేవి మాత్రం ఈ విషయం పై స్పందించేందుకు ఇష్టపడలేదు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెపుతాను ప్రస్తుతానికి నో కామెంట్ అంటూ సరిపెట్టేసింది. ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో శ్రీదేవి శివగామి పాత్రను వదులుకోవటమే హాట్ టాపిక్ గా ఉంది. దీంతో ముందు ముందు కూడా అతిలోక సుందరికి ఇవే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. -
కష్టాల్లో శ్రీదేవి 'మామ్'
రీ ఎంట్రీ సత్తా చాటలేకపోతున్న అతిలోక సుందరి శ్రీదేవి, త్వరలో తన 300వ సినిమా మామ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. బోనీకపూర్ స్వయంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా హిందీతో పాటు సౌత్ లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సౌత్లో రిలీజ్ అవుతున్న అన్ని భాషలకు శ్రీదేవి స్వయంగా డబ్బింగ్ చెపుతుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఇబ్బందుల్లో పడింది. ఇటీవల ఇండియన్ ఇండస్ట్రీ పాకిస్తానీ నటుల మీద నిషేదం విదించిన సంగతి తెలిసిందే. మామ్ సినిమాలో ఇద్దరు పాకిస్తానీ నటులు నటించారు. సాజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్పై అభ్యంతరాలు వ్యక్తమవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాని నటులను ప్రమోషన్లకు రానివ్వమని కొందరు హెచ్చరిస్తున్నారు. యూనిట్ సభ్యులు మాత్రం నిషేదానికి ముందే వారిని సెలెక్ట్ చేశామని, కాబట్టి తమ సినిమాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. -
అన్ని భాషల్లోనూ 'మామ్' ఓన్ డబ్బింగ్
రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న అతిలోకసుందరి శ్రీదేవి, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంగ్లీష్ వింగ్లీష్తో పరవాలేదనిపించిన ఈ బ్యూటి, తరువాత సౌత్ సినిమా పులితో నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మామ్ మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి వడయార్ దర్శకుడు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్లోనూ శ్రీదేవికి భారీ ఫాలోయింగ్ ఉండటంతో తెలుగు, తమిళ్తో పాటు మలయాళంలోనూ మామ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు తెలుగుతో పాటు నాలుగు భాషల్లోనూ శ్రీదేవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెపుతుండటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మొత్తం నాలుగు భాషల్లో ఒకేసారి జూలై 7న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
50 వసంతాల సాధనలో శ్రీదేవి
అతిలోక సుందరిగా ఎందరో అభిమానులు ఆరాధించే నటిగా ఎదిగిన నటి శ్రీదేవి. నటిగా 50 వసంతాల శిఖరాన్ని అధిగమించిన ఈ సుందరి ఆబాలగోపాల మనసుల్ని దోచుకున్నారు. శ్రీదేవి 1967 జూలై నెల 7వ తేదీన తుణైవన్ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగప్రవేశం చేశారు. అలా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీదేవి ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నాయకిగా నటించి అశేష ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా శ్రీదేవి నటించిన చిత్రం మామ్. ఈ చిత్రాన్ని తన భర్త, నిర్మాత బోనీకపూర్ జిడియోస్, ఏ మ్యాడ్ ఫలింస్ అండ్ థర్డ్ ఐ ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శ్రీదేవినే తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీదేవి 50 వసంతాల సాధనను పురస్కరించుకుని జూలై నెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు -
నాలుగు భాషల్లో శ్రీదేవి కొత్త సినిమా
రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న అతిలోకసుందరి శ్రీదేవి, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంగ్లీష్ వింగ్లీష్తో పరవాలేదనిపించిన ఈ బ్యూటి, తరువాత సౌత్ సినిమా పులితో నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మామ్ మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి వడయార్ దర్శకుడు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్లోనూ శ్రీదేవికి భారీ ఫాలోయింగ్ ఉండటంతో హిందీ, తెలుగు, తమిళ్తో పాటు మలయాళంలోనూ మామ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి మొత్తం నాలుగు ఒకేసారి జూలై 7న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శ్రీదేవి అడిగితే కాదనగలనా?
‘‘శ్రీదేవికి నేను పెద్ద ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి ఆమెను అభిమానిస్తున్నా. ఆమె సినిమాకి పాటలు స్వరపరిచే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు’’ అన్నారు సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్. ‘మామ్’ సినిమా రూపంలో ఆయనకు ఆ గోల్డెన్ ఛాన్స్ రానే వచ్చింది. ‘‘శ్రీదేవిగారు ‘నువ్వీ సినిమాకి చేయాలని అడిగితే కాదనగలనా? వెంటనే ఒప్పేసుకున్నా. శ్రీదేవిగారు అద్భుతమైన నటి. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని రెహమాన్ అన్నారు. రవి ఉడయవర్ దర్శకత్వంలో శ్రీదేవి టైటిల్ రోల్లో ఆమె భర్త బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 7న విడుదల కానుంది. -
అమ్మకు అండగా నిలవండి..
-
అమ్మకు అండగా నిలవండి..
- కేటీఆర్ను కదిలించిన కమలమ్మ దీనగాథ - మంత్రి ట్విట్టర్లో ‘సాక్షి’ కథనం సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన సామల కమలమ్మ(85) దీన గాథపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కమలమ్మకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంఘటనపై ‘అమ్మను గెంటేశారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి కె. తారక రామారావు స్పందించారు. ‘సాక్షి’ కథనాన్ని తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆమెకు అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి ఆదేశించారు. డీఆర్వో జీవీ శ్యామ్ప్రసాద్లాల్ వెంటనే కమలమ్మతో మాట్లాడి ఆమెతో ఫిర్యాదు స్వీకరించారు. అమ్మను గెంటేశారు.. ఆమె కుమారులు ఐదుగురికీ సోమవారం నోటీసులు జారీ చేశారు. కమలమ్మతో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి మాట్లాడారు. మూడో కుమారుడు శ్రీనివాస్ వద్ద కమలమ్మ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్ఐ రాజేంద్రప్రసాద్ కమలమ్మ ఇంటికి వెళ్లి పండ్లు అందించారు. భీవండిలో ఉండే కుమారుడు రమేశ్తో రెవెన్యూ అధికారులు ఫోన్లో మాట్లాడా రు. బుధవారం సిరిసిల్లకు వచ్చేందుకు రమేశ్ అంగీకరించాడు. జిల్లా అధికారుల సమక్షంలో కమలమ్మ కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆమెకు నీడ కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో శ్యామ్ప్రసాద్లాల్ తెలిపారు. కన్నతల్లిని పోషించకుంటే కొడుకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, ఐదుగురు కొడుకులతోపాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఎవరూ సాదకున్నా సచ్చేంత వరకు తానే వండుకుని తింటానని కమలమ్మ తెలిపింది. -
అమ్మను గెంటేశారు..
సిరిసిల్ల: ‘నా వాటాలో ఏన్నాళ్లుంటావ్’ అంటూ ఓ కొడుకు కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసి.. తాళం వేసుకొని వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా చెట్టు కింద బతికిన 86 ఏళ్ల ఆ తల్లిని మరో కొడుకు చేర దీసినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. కుల పెద్దలను ఆశ్రయించినా.. ఆ కొడుకులు వినకపోవడంతో ప్రస్తుతం ఆరుబయట జీవనం సాగిస్తోందా తల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన సామల కమలమ్మ, సిద్ధిరాములు దంపతులు. వీరికి కుమారులు మీనయ్య, శ్రీనివాస్, రమేశ్, సురేశ్, లక్ష్మీనారాయణ, కూతుళ్లు వసంత, వశ్చల ఉన్నారు. నేత కార్మికుడైన సిద్ధిరాములు మంచి ఇల్లు కట్టుకుని.. పిల్లల పెళ్లిళ్లు చేశాడు. 12 ఏళ్ల కిందట ఆయన అనారోగ్యంతో మరణిం చాడు. అప్పట్నుంచి కమలమ్మ కొడుకులు, కూతుళ్లు ఉన్నా వాళ్ల వద్ద ఉండలేక ఒంటరిగా జీవిస్తుంది. చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఆసరా పింఛన్, రేషన్ బియ్యంతో బతుకు సాగిస్తోంది. కాగా, తల్లిదండ్రులు సంపాదించిన సుమారు రూ.30 లక్షల విలువైన ఇంటిని కొడుకులు పంచుకున్నారు. మూడో కుమారుడు రమేశ్ భివండిలో ఉంటున్నాడు. అతడి వాటాగా వచ్చిన ఇంట్లోనే కమలమ్మ ఉంటోంది. నాలుగు రోజుల క్రితం రమేశ్ వచ్చి కమలమ్మ సామగ్రి బయట పడేసి, ఇంటికి తాళం వేసి భివండి వెళ్లిపోయాడు. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మిగతా కొడుకుల వద్దకు వెళ్లి.. ‘నేను ఎక్కడ ఉండాలే.. నాకు ఇంత నీడ చూపుండ్రి’ అని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కుల పెద్దలు జోక్యం చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. తలదాచుకునేందుకు నీడలేక రోడ్డు పక్కన వంట చేసుకుంటూ కనిపించగా.. స్థానికులు జోక్యం చేసుకోవడంతో రెండో కుమారుడు శ్రీనివాస్ వచ్చి తల్లిని తీసుకెళ్లినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. దీంతో ఆరుబయటనే ఆమె ఉంటోంది. ‘నా కొడుకులు యాడుంటవని అంటున్నరు.. కాళ్లు కాలుతున్నయి.. గాలి వత్తలేదు.. నాలుగు రోజులు బతికే ముసలిదాన్ని.. ఎవరూ పట్టించుకుంటలేరు.. ఇప్పుడు వాళ్లకు తల్లి వద్దు.. పెళ్లాలే కావాలే.. ఆ దేవునింట్ల మన్నువొయ్య.. నన్ను తీసుకపోతలేడు.. సావన్నా వత్తలేదు.. ఒంటరిగా వంట చేసుకుంటూ బతుక బుద్ధిగావట్లేదు’అని కమలమ్మ రోదించడం కలచివేసింది. -
శ్రీదేవి క్వీన్ ఆఫ్ యాక్టింగ్: ఖేర్
ముంబయి: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్... అతిలోక సుందరి శ్రీదేవిపై ప్రశంసల జల్లు కురిపించారు. క్వీన్ ఆఫ్ యాక్టింగ్ మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉందని ఆయన ట్విట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి నటిస్తున్న 'మమ్' టీజర్ లింక్ను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. అనుపమ్ ఖేర్ పలు చిత్రాల్లో శ్రీదేవితో కలిసి నటించారు. వీరిద్దరూ 'కర్మా', చాల్బాజ్, లడ్లా, లమ్హే, రూప్కీ రాణీ చోరోంకా రాజా చిత్రాల్లో శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి 2012లో 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం పులిలో ఓ ముఖ్యపాత్ర పోషించారు. తాజాగా రవి ఉడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మమ్' చిత్రంలో శ్రీదేవి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోనీకపూర్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ రూపుదిద్దుకుంటోంది. జూన్ 14న మామ్ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో పాకిస్తానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సవతి కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ ధీరోదాత్తమైన తల్లిగా శ్రీదేవి కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి ఇప్పటివరకూ 299 చిత్రాల్లో నటించారు. ‘మామ్’తో ఆమె 300వ చిత్రం మైలురాయిని చేరుకున్నారు. The Queen of acting and my favourite actress is BACK. Watch & share this #MomTeaser of @SrideviBKapoor. Jai Ho. -
'మామ్'గా అతిలోక సుందరి
ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అతిలోక సుందరి శ్రీదేవి, ఇప్పటి వరకు ఫుల్ ఫాంలోకి రాలేదు. ఇంగ్లీష్ వింగ్లీష్ తరువాత నటించిన తమిళ సినిమా పులి తీవ్రంగా నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఇటీవల గ్లామరస్ డ్రస్సుల్లో అదరగొడుతున్న శ్రీదేవి త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీదేవి భర్త, బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో రవి ఉడయార్ దర్శకత్వంలో మామ్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది శ్రీదేవి. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 14న రిలీజ్కు రెడీ అవుతోంది. రీ ఎంట్రీలో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్న శ్రీదేవి ఈ సినిమాతో బ్లార్ బస్టర్ సాదిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. When a woman is challenged... Here's presenting the first look of MOM. #MOMFirstLook pic.twitter.com/taaJBeDH1d — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 14 March 2017 -
మొదటి నమస్కారం అమ్మకే!
ధర్మసోపానాలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ - ఇవి వేదం చెప్పిన నియమాలు. వేదాల చివర ఉండేవాటిని ఉపనిషత్తులు అంటారు. ఇవి జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. వీటిలో ప్రధానమైనవి పది. ఆ దశోపనిషత్తుల్లో ‘తైత్తిరీయోపనిషత్’ ఒకటి. తిత్తిరి మహర్షి అనుగ్రహంతో ప్రకాశించిన ఈ ఉపనిషత్తులో ప్రధానంగా ‘శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి’ అని మూడు భాగాలున్నాయి. శిక్షావల్లిలోని 11వ అనువాకంలోనిదే ‘మాతృదేవోభవ’ అనే మంత్రం. ఈ పాఠాన్నంతటినీ కలిపి మళ్ళీ ‘స్నాతక ప్రకరణ’మని వివాహంలో వరుడికి గురువుగారు ప్రబోధం చేస్తారు. అప్పుడు గురువుగారితో మొట్టమొదట ఇవ్వబడే ఆజ్ఞ- మాతృదేవోభవ. అమ్మ- పరమేశ్వరుని స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. మనం ‘ప్రార్థన’ అని ఒక మాట రోజూ వాడుతుంటాం. జీవుడు, కాలం, దురితం (గత జన్మలో చేసుకున్న పాపం) అన్న మూడు మాటల స్వరూపానికి అందని దుష్ఫలితాల నుండి తప్పించుకోవడానికీ, తనను తాను రక్షించుకోవడానికీ జీవుడు చేసే ప్రయత్నానికే ‘ప్రార్థన’ అని పేరు. కాలం ఒకరితో ఆపబడేదీ కాదు, ఒకరికొరకు ఎదురు చూసేదీ కాదు. ‘కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖదుఃఖయో, నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపాను యోగతః’. కాలం పరమ బలవత్తరమైన స్వరూపం. కాలం నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. వెనక్కి వచ్చే లక్షణం ఉండదు. కాలప్రవాహంలో జీవులందరూ పడిపోతూంటారు. నా చేతిలో లేని కాలానికీ, తెలియక గతంలో నేను చేసుకున్న పాపాలను ఇప్పుడు లెక్కపెట్టి దాని ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్న పరమేశ్వరుడికీ మధ్య నలిగిపోలేక, ఆయన శక్తిని గుర్తెరిగి, ‘ఈశ్వరా! నన్ను అనుగ్రహించి పాపాల దుష్ఫలితం తీవ్ర రూపంలో లేకుండా కాపాడు’ అని అడగడానికి రోజూ ప్రార్థన చేస్తాం. ‘పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. నా పాప పుణ్యాలు తెలిసున్నవాడు. కాలరూపంగా ఉన్నవాడు. ఫలితాలను ఇవ్వగలిగిన వాడు. ఆయనను ఎదిరించగలవారెవరూ లేరు. ఆయన ఇచ్చిన ఫలితాన్ని అనుభవించాల్సిందే’ అంటాడు శ్రీరామచంద్రుడు ‘శ్రీమద్రామాయణం’లోని అయోధ్యకాండలో! ‘ఈశ్వరా! నేనీ రోజున ఒక మంగళకరమైన కార్యం మీద బయల్దేరుతున్నాను. కచ్చితంగా నేను గత జన్మలో పాపాలు చేసి ఉంటాను. కానీ దాని ఫలితాలు నేను తలపెట్టిన కార్యానికి ప్రతిబంధకం కాకుండా, నా మనసు విచలితమైపోయేటట్లు కాకుండా, నేను తట్టుకోగల్గిన శక్తిని నాకిచ్చి, నేను చేపట్టిన శుభకార్యాలను నా చేత చేయించు’ అని ప్రార్థిస్తాం. ఇలా చేసేటప్పుడు ‘త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణమ్ త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ’ అంటాం. ‘తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువువు నీవే, ద్రవ్యమూ నీవే, నాకు సమస్తమూ నీవే’ అంటాం. అంటే మనం తల్లినీ, తండ్రినీ ఈశ్వరునిలోనే చూస్తాం. అందుకే ప్రార్థనలన్నీ ఇలానే ఉంటాయి. కానీ తల్లి, తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళలో ఈశ్వరుడిని చూస్తాం. అందుకే మాతృదేవోభవ. అన్నగారినో, తమ్ముడినో ఈశ్వరుడని అనం. కానీ తల్లి విషయంలో ఈశ్వరతత్త్వాన్ని చూస్తాం. అమ్మలో ఈశ్వరుని చూడడం కాదు. అమ్మే... పరబ్రహ్మం. మాంస నేత్రంతో చూడడానికి యోగ్యమై, పరబ్రహ్మ స్వరూపమై - ఈ లోకంలో తిరగగలిగిన వ్యక్తి - అమ్మ ఒక్కతే! అందుకే వేదం ప్రథమ నమస్కారం అమ్మకే చేయించింది. అమ్మ పర్రబహ్మం ఎలా అవుతుంది? అమ్మ కావాలంటే ప్రాథమికంగా ఒక స్త్రీ అయి ఉండాలి. తెలుగులో ఆడపిల్ల అనడంలోనే ఆమెలో లక్ష్మీతత్త్వముందని చెబుతారు. ఆమె ఈడపిల్ల కాదు, ఇక్కడుండిపోయే పిల్ల కాదు. ఇక్కడ ఉండాలని మనం కోరుకోం కూడా. పోతన గారు ‘వీరభద్ర విజయం’ రాస్తూ, పార్వతీ దేవిని చూసి, ‘నీకు తండ్రినైతి నాకింత చాలదే మహాద్భుతంబు ఇందువదనా’ అంటాడు. ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టిందని గుర్తు. ఆమె నారాయణుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు. అతనితో కలిసి ఉండడం తప్ప మరొకలా ఉండడం ఆమెకు సుఖప్రదమూ కాదు, సంతోషదాయకమూ కాదు. శ్రీమద్రామాయణంలోనే సీతమ్మ ఓ మాట అంటుంది... ‘నా తంత్రీ వాద్యతే వీణా, నా చక్రో వర్తతే రథః, నా పతిస్సుఖమే ధేత యాస్యాదాపి శతాత్మజా’ (అయోధ్య. 39-29). ‘అమ్మా ! నీ కాలు నేల మీద పడకూడదు. మా అరచేతుల్లో పాదాలుంచి నడువమ్మా’ అనే స్థాయిలో పరమ ప్రేమమూర్తులైన నూర్గురు కొడుకుల వల్ల కలిగిన సుఖం కన్నా, స్త్రీకి భర్త వల్ల కలిగే సుఖం లెక్కపెట్టడానికి శక్యం కానిది అంటుంది. నా భర్త ఇచ్చిన సుఖాన్ని ఇవ్వగలిగినవాడు లేడు. అందుకని నేను నీతోనే ఉంటానంటుంది సీతమ్మ. అటువంటి నారాయణుడిని వెతుక్కుంటూ పోయే ఆడపిల్ల - అక్కడి పిల్ల. ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది. ఆ గోత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్నే ఉద్ధరిస్తాడు. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్నీ, కట్టుకున్న వారి వంశాన్నీ కూడా ఆడపిల్ల ఉద్ధరించగలదు. ఆమె లక్ష్మీస్వరూపే. కానీ, తల్లి, తండ్రి బిడ్డకు నమస్కారం చేయరు. అక్క, చెల్లెలు, పినతల్లి, పెదతల్లి, కోడలు... ఇలా బంధుత్వరీత్యా ఆమె ఎన్నో స్థానాలలో నిలబడినప్పటికీ, ఒక స్త్రీ పరబ్రహ్మంగా నమస్కారం అందుకునేది తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే!అందుకే - మాతృదేవోభవ. ఆమే... పరమేశ్వర స్వరూపం. ఆమే... పరబ్రహ్మం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రయాణికురాలి కోసం కేంద్రమంత్రి త్యాగం
-
అమ్మను మరిపించిన సత్యసాయి
వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పుట్టపర్తి టౌన్: ఆదిపరాశక్తి అమ్మను మరిపిస్తూ లోకకల్యాణార్థం అవతరించిన సర్వాంతర్యామి సత్యసాయి అని వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానవాళి సర్వతోముఖాభివృద్ది కోసం సత్యసాయి తన లీలావైభవాన్ని కొనసాగించారన్నారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమను బోధిస్తూ పరిమిత రూపంలో జన్మించిన సత్యసాయి కాలంంతోపాటు అపరిమిత రూపంగా మానవాళిని సన్మార్గం వైపు నడిపే ఆదిపరాశక్గిగా విరాజిల్లారన్నారు. అనంతరం భక్తులు సత్యసాయి భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు. నేడు విజయదశమి వేడుకలు ప్రశాంతి నిలయంలో మంగళవారం విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రశాంతి నిలయంలో చేరుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా విశ్వశాంతి కోసం ఏడు రోజులుగా ప్రశాంతి నిలయంలో బ్రహ్మశ్రీ కొండావధాని నేతృత్యంలో పుర్ణచంద్ర ఆడిటోరియంలో జరుగుతున్న వేదపురుష సప్తాహ యజ్ఞం పూర్ణాహుతితో మంగళవారం ముగియనుంది. అనంతరం భక్తులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.అలాగే తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న సత్యసాయి గ్రామ సేవ కార్యక్రమం సైతం ముగియనుంది. మంగళవారం ప్రశాంతి నిలయంలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
అమ్మే నాకు వరం...
మా అమ్మ- కె. వరప్రసాద్రెడ్డి- పారిశ్రామికవేత్త నేను పుట్టడం తనకు వరం అనుకుంది మా అమ్మ. అందుకే వరప్రసాదం అని పేరు పెట్టుకుంది. నిజానికి ఆమె కడుపున పుట్టడం భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరం... ఈ మాటలన్నది శాంతాబయోటెక్స్ అధినేత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ వరప్రసాద్రెడ్డి. ‘‘అమ్మా! నీవే నేను- నేనే నీవు!! నేను నీలోని అంతర్భాగాన్ని... నువ్వు నాలో అంతర్వాహినివి...’’అంటూ తల్లిని కళ్ల ముందు ఆవిష్కరించుకున్నారాయన. ‘‘నవంబరు 17వ తేదీని నా జన్మదినం అని వేడుక చేస్తావు, కానీ అమ్మా! అది నువ్వు నాకు జన్మనిచ్చిన సుదినం. నువ్వు నాకు వేడుక చేయడం కాదమ్మా, నేను నీకు పండుగ చేయాల్సిన ఆనందకర సందర్భం. అందుకే ఈ రోజు మాతృవందనం చేసి నీ రుణం తీర్చుకుంటాను’’ అంటూ తల్లిని తలచుకుని గాద్గదికమయ్యేంతటి సున్నిత మనస్కులు. తల్లి కోడూరి శాంతమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ... ‘‘అమ్మకూ నాకూ మధ్య గురుబంధమే ఎక్కువ. మాది నెల్లూరు పట్టణానికి ఎనిమిది మైళ్ల దూరానున్న పాపిరెడ్డి పాళెం. నా ఐదవయేటనే చదువుకోసం నెల్లూరు పట్టణంలో ఉన్న మేనమామ సేతురామిరెడ్డి దగ్గరకు పంపించింది. బాగా ఊహ తెలిసిన తర్వాత కూడా నాకు అమ్మ మీద బెంగ ఉండేది. అమ్మను చూడకుండా ఓ వారం గడిస్తే యుగాలు గడిచినట్లు ఉండేది. రెండవ వారం ఇక ఆగలేక మా ఊరికెళ్లిపోయేవాడిని. అమ్మ దగ్గర ఉండేది ఒక్క పూట లేదా ఒక్క రోజు మాత్రమే. తిరిగి నెల్లూరుకి పంపించేసేది. ఇంట్లో ఆమె దగ్గర ఉన్నప్పుడు కూడా ‘‘ఏ పాఠాల నేర్చకున్నావు, ఆ పద్య కంఠతా వచ్చిందా లేదా’ అని గుర్తు చేసేది. శివాజీ వీరోచిత గాథలను, జిజియాబాయి పెంచిన తీరును ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. ఇప్పటికీ అవి గుర్తొస్తే ఒళ్లు రోమాంచితమవుతుంది. మార్కండేయ పురాణం, ధృవుడి కథలను చెప్పి లక్ష్యసాధనే ధ్యేయం అనే సందేశాన్ని నా రక్తంలో ఇంకింప చేసింది నా తల్లి. వాచకమే నాది వాక్కు ఆమెదే! ఎవరికైనా తొలి గురువు తల్లే. కానీ నాకు తొలి గురువు మాత్రమే కాదు నిన్నటి వరకు అంటే... ఆమె జీవించి ఉన్న చివరి రోజు వరకు నాకు దారి చూపించి నడిపించిన మార్గదర్శి ఆమె. ఆమె నేర్పించిన విలువలు, ఆమె అలవరిచిన క్రమశిక్షణ, ఆమె చూపించిన ధార్మిక పథమే నన్ను నడిపిస్తోంది. ఉదయం నాలుగున్నరకు నేను స్నానం చేసి కిందకు వచ్చేటప్పటికే అమ్మ స్నానం, పూజ ముగించుకుని నా కోసం ఎదురు చూస్తుండేది. అలా ఓ రోజు నేను వెళ్లి పక్కన కూర్చోగానే ‘‘నిన్న శృతి కీర్తన చదివాను, ఆ పుస్తకం నువ్వు చదివావా’’ అన్నది. నాకు అవన్నీ చదివే తీరిక ఎక్కడిదమ్మా అనగానే ఆ పుస్తకంలో ఆమెకు నచ్చిన విషయాలను చెప్పడం మొదలు పెట్టింది. అలా ప్రతిరోజూ ఆ ముందు రోజు చదివిన పుస్తకం గురించి కానీ, టీవీలో చూసిన ఆధ్యాత్మిక ప్రవచనం గురించి తన అభిప్రాయాలు నాతో పంచుకునేది. ఆమెకు భక్తి మెండు. అలాగని గుడ్డిగా దేనినీ అనుసరించదు, అనుకరించదు. ప్రతి విషయాన్నీ తార్మికంగా విశ్లేషించేది. ప్రతిరోజూ నా షెడ్యూల్ అడిగేది. ఆఫీసు కాగానే సాయంత్రం ఫలానా సాంస్కృతిక కార్యక్రమానికి, సాహిత్య సభకు వెళ్తున్నానని చెప్పగానే ‘రోజంతా బయటే గడిపేస్తావా, వ్యాపకాలు తగ్గించుకోకూడదూ’ అంటూనే నేను వెళ్లే సందర్భానికి తగినట్లు పౌరాణిక పద్యాలను ఊటంకిస్తూ చిరు ఉపన్యాసం ఇచ్చేది. నేను వాటిని పుక్కిటపెట్టుకుని ఆ సాయంత్రం ప్రసంగం చేసేవాడిని. రెండు వేల పద్యాలను కంఠతా నేర్చుకున్న ఆమె నన్ను రోజూ ప్రామ్టింగ్ చేసి పంపించేది. ఆనందంతో కన్నీళ్లు! హెపటైటిస్ను నివారించే వ్యాక్సిన్ విడుదల సందర్భంగా రేణుకాచౌదరి ‘ఈ వ్యాక్సిన్ను పేదవారికి కూడా అందుబాటులోకి తేవడం ద్వారా కోట్లమంది తల్లుల ఆశీర్వాదం అందుకుంటారు’ అని నన్ను ప్రశంసించారు. ఆ దృశ్యాన్ని టీవీలో చూసి నన్ను దగ్గరకు తీసుకుని ‘నా ఆశీస్సులే కాదు నాన్నా... నిన్ను కోట్ల మంది తల్లులు ఆశీర్వదిస్తార’ని కంటతడి పెట్టుకుంది అమ్మ. కోపాన్ని చేతల్లో చూపించాలి! శాంతాబయోటెక్ సంస్థ ప్రారంభించాలనేది పౌరుషం నుంచి పుట్టుకొచ్చింది. ఒక అంతర్జాతీయ సమావేశం తర్వాత జరిగిన సాధారణ చర్చలో కొత్త మందు కోసం రీసెర్చ్ చేయడం వంటివి భారతీయులకు అసాధ్యమనే ధోరణి వ్యక్తమైంది. అది నాకు చాలా కోపం తెప్పించింది. ఇండియాకు వచ్చి అమ్మానాన్నతో నా ఉద్దేశం చెప్పాను. ఇద్దరు ఆడపిల్లలు పెద్దవుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని నా భార్య వసంత భయపడింది. మా అమ్మ మాత్రం కోపం వచ్చినప్పుడు తిరిగి తిట్టడం కాదు, చేతల్లో సాధించి చూపించాలి అని... నాన్న పొలం అమ్మి డబ్బివ్వడానికి ప్రోత్సహించింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్నైన నేను నాకు సంబంధం లేని రంగంలోకి వస్తున్నానని తెలిసి కూడా ఏదైనా నేర్చుకోవాల్సిందే. అప్పుడు నేర్చుకోకపోతే ఇప్పుడు నేర్చుకుంటావు అన్నదామె. అలాగే మా కంపెనీలో ఇతర షేర్హోల్డర్లు సనోఫీ కంపెనీకి తమ వాటాలు అమ్మాలనుకున్నప్పుడు కూడా ‘కొత్త వాళ్లు వస్తే నువ్వు సంస్థను స్థాపించిన లక్ష్యంలోనే నడుస్తుందా’ అని అడిగింది. అప్పుడామెకు ‘మనం స్థాపించిన ధ్యేయానికి విఘాతం కలిగే పరిస్థితులు ఎదురైతే బయటకు వచ్చేస్తా’నని మాటిచ్చాను. ఈ ఏడాది మే 23 ఉదయం కొత్త యూనిట్ ప్రారంభం వాయిదా వేయవద్దని నా కర్తవ్యాన్ని నా చేత చేయించి మధ్యాహ్నం పరలోకానికి పయనమైంది. నన్ను తల్లిని అమితంగా ప్రేమించే పుత్రుడు అనుకుంటారు. కానీ తల్లిని మనసుతో చూడడం, తల్లి మనుసును చూడడం నేర్చుకున్న ఏ కొడుకైనా తల్లిని అంతగానే ప్రేమిస్తాడు. ఎందుకంటే... అమ్మలాంటిది ఎవరంటే ఒక్క అమ్మ మాత్రమే. అమ్మ రుణం తీర్చుకోగలిగేది... అమ్మకు అమ్మైపుడితేనే. అది సాధ్యం కానిది. అందుకే ప్రతి బిడ్డా అమ్మకు అమ్మ స్థానంలోకి వెళ్లి ఆమె సేవ చేయాలి. అప్పుడు కొంతైనా ఆమె రుణం తీరుతుంది. అమ్మకు జేజేలు. సంభాషణ: వాకా మంజులారెడ్డి -
సైలెంట్గా సినిమా పూర్తి చేశారు!
ఎప్పుడు ప్రారంభమైందో... ఎక్కడ షూటింగ్ చేశారో... ఉలుకూ లేదు, ఓ పలుకూ లేదు. చడీచప్పుడు లేకుండా చిత్రీకరణ పూర్తి చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రధారిగా ఆమె భర్త బోనీ కపూర్ ఓ చిత్రం నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘మామ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు బాలీవుడ్ టాక్. వాస్తవానికి శ్రీదేవి ‘మామ్’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చింది కానీ, ఎప్పుడు ప్రారంభమైందనే విషయం బయటకు రాలేదు. ఈలోపు చిత్రీకరణ పూర్తయిందనే వార్త వచ్చింది. పబ్లిసిటీకి దూరంగా ఈ సినిమా చేయాలని శ్రీదేవి భావించారట. సతీమణి కోరుకుంటే భర్త కాదంటారా? అందుకే ఈ చిత్రం గురించిన వార్తలు బయటకు రానివ్వకుండా షూటింగ్ పూర్తి చేసేశారు బోనీ కపూర్. విడుదలకు దగ్గరయ్యే సమయానికి పబ్లిసిటీ మొదలుపెడతారట. కమ్బ్యాక్ మూవీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో తల్లిగా, భార్యగా.. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మహిళగా అద్వితీయ నటన కనబరిచిన శ్రీదేవి, ‘మామ్’లో మరోసారి తల్లిగా కనిపించనున్నారట. ఇది కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ.. స్టోరీ, జోనర్ డిఫరెంట్గా ఉంటాయట. ఈ చిత్రంతో రవి ఉద్యావర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. -
‘అమ్మ’ భారమైంది!
నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మే వారికి భారమైంది. ఆమెను పోషించడం తమ వల్ల కాదని కర్కశంగా వారు చెప్పేచేశారు. మూడురోజులుగా ముద్ద ముట్టని ఆమెను కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. వివరాలు ఇవీ.. కొత్తపల్లె మండలం ఎదురుపాడుకు చెందిన బిజ్జమ్మకు కుమారుడు శంకర్ రెడ్డితో పాటు కుమార్తె ఉంది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం శంకర్రెడ్డి తన తల్లి బిజ్జమ్మ కాశిరెడ్డినాయన ఆశ్రమంలో వదిలేశారు. దీంతో ఆశ్రమవాసులు ఆమెకు అన్నం పెట్టేవారు. ఆశ్రమంలో ఒక మూలన కూర్చొని తనకు పట్టిన దుస్థితికి చింతిస్తూ ఆమె కాలం వెల్లదీస్తుండేది. అయితే తనకు మరణం ఎంతకీ రావడం లేదని అప్పుడపుడు అక్కడున్న వారికి చెబుతూ దుఃఖిస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి ముద్ద అన్నం కూడా ముట్టడం లేదు. ఎంత బతిమాలినా మౌనంగా వద్దని చెప్పేది. దీంతో పూర్తిగా నీరసించి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు కొత్తపల్లె మండలం ఎదురుపాడులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుమారుడికి ఫోన్చేసి పరిస్థితని వివరించారు. ఆమెను తీసుకెళ్లాలని కుటుంబీకులకు తెలిపారు. అయితే తల్లిని తీసుకెళ్లడానికి కుమారుడు అంగీకరించలేదు. మళ్లీ ఫోన్చేసినా స్పందన లేదు. దీంతో ఆశ్రమంలో ఉంటున్న కృష్ణయ్య..ఆదివారం ఆటోలో వృద్ధురాలిని తరలించడానికి ఓంకార క్షేత్రం నుంచి బండిఆత్మకూరుకు వచ్చాడు. ఆమె నీరసించి బస్టాండులోని కటిక నేలమీద ఉండడం చూసి స్థానికులు తరలించారు. మహిళలు, హోటల్ నిర్వాహకులు వచ్చి నీరసించిన అమ్మకు పండ్లు, పానియాలు ఇప్పించారు. ఆ తర్వాత తలా ఒక చేయివేసి ఆత్మకూరు బస్సుకు ఎక్కించి పంపించారు. కృష్ణయ్య బస్సులో ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా స్వగ్రామమైన ఎదురుపాడుకు తీసుకెళ్లారు. - బండి ఆత్మకూరు -
అమ్మను అడవిలో వదిలేసింది!
రంగారెడ్డి జిల్లాలో ఓ కూతురు నిర్వాకం ధారూరు: కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసిందో కూతురు. ఇంటికి రావొద్దని బెదిరించింది. దీంతో ఆ వృద్ధురాలు తిండిలేక.. కదలలేని స్థితిలో ధారూరు రైల్వేస్టేషన్లో పడి ఉంది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్పూర్కు చెందిన వడ్డె బిచ్చమ్మ(75)కు ఐదుగురు కూతుళ్లు. నలుగురికి పెళ్లిళ్లయ్యాయి. మరో కూతురుకి వివాహం కావాల్సి ఉంది. పెద్ద కూతురు బాలమ్మకు ఇల్లరికం పెళ్లి చేసి కూతురు, అల్లుడును తనవద్దే ఉంచుకుంది. బాలమ్మ తల్లి బిచ్చమ్మకు చెందిన ఇంట్లో ఉంటూ ఆమెకున్న ఐదెకరాల పొలాన్ని అనుభవించడమే కాకుండా నెలనెలా వచ్చే పింఛన్ను కూడా తీసుకునేది. నెల రోజుల క్రితం బాల మ్మ తన తల్లిని ఇంట్లో ఉండవద్దని చెప్పి ఆమెను తీసుకెళ్లి తాండూరు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లింది. బిచ్చమ్మ ఎలాగోలా తిరిగి ఇంటికి చేరింది. దీంతో బాలమ్మ, ఇద్దరు కుమారులు ఆదివారం ధారూరు రైల్వేస్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడి నుంచి ఆమె రైల్వేస్టేషన్కు చేరింది. అప్పటి నుంచి అన్నపానీయాలు లేకుండా అక్కడే పడి ఉంది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన రైల్వేస్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులు బాలమ్మ కుమారులకు ఫోన్చేసి విషయం చెబితే వారు ఆమెను తీసుకుపోవడానికి నిరాకరించారు. దీంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి రైల్వేస్టేషన్లోనే కూర్చొంది. -
మైనస్ ఏడు డిగ్రీల చలిలో షూటింగ్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది భామ శ్రీదేవి, రీ ఎంట్రీ లో కూడా అదే జోరు చూపిస్తోంది. హీరోయిన్ గా చేసిన సమయంలో ఏ స్థాయిలో కష్టపడిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో కష్టపడుతోంది. పెళ్లి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అతిలోక సుందరి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయినా శ్రీదేవి రీ ఎంట్రీ పై ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత దక్షిణాదిలో చేసిన పులి డిజాస్టర్ కావటంతో ఆలొచనలో పడ్డ శ్రీదేవి, ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా మామ్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని జార్జీయాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేస్తోంది. అంత చలిలో ఒక్కోసారి షూటింగ్ ఆలస్యం అయి రాత్రి 8.30 అయినా ఎలాంటి విసుగు లేకుండా శ్రీదేవి షూటింగ్ కు సహకరించటం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి ఉద్యావర్ దర్శకుడు. ప్రముఖ పాకిస్థాని నటుడు అద్నాన్ సిద్దికీ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కన్నా, అభిమన్యూ సింగ్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. -
కొడుకులను చంపి.. బాత్రూంలో దాక్కుంది!
అరిజోనా: అమెరికాలోని అరిజోనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఓ మహిళ మాదకద్రవ్యాల మత్తులో తన ముగ్గురు కొడుకులను దారుణంగా హతమార్చింది. అనంతరం తనకుతాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆక్టేవా రోజర్స్ అనే మహిళ తన ముగ్గురు కొడుకులు జైకరే రెహ్మాన్(8), జెరిమియా ఆడమ్స్(5), రాబిన్సన్(2 నెలలు)లను ఇటీవల దారుణంగా హత్య చేసింది. అతి ప్రమాదకరమైన మత్తుపదార్థాలు తీసుకున్న ఆక్టేవా.. ఆ మత్తులోనే కన్న కొడుకులను దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం వారి మృతదేహాలను అల్మారాలో దాచి.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. గొంతుకోసుకొని బాత్ రూంలో దాక్కున్న ఆక్టేవాను సోదరుడు గుర్తించి ఆసుపత్రికి తరలించాడు. ఆక్టేవా గతంలోనూ ప్రమాదకరమైన సింథటిక్ మారిజునా అనే మత్తుపదార్థాన్ని వాడినట్లు విచారణలో తేలింది. ఇది తీవ్ర మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని.. ఆ ప్రభావంతోనే ఆమె ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు. -
అమ్మ బదులు..పదిన్నర లక్షలు
మందుకొట్టి వెంటబడ్డాడు. ఛీకొట్టి వెళ్లిపోతుంటే కారుతో గుద్ది చంపేశాడు. మర్డర్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి... క్యాష్ బయటకు తీశాడు. అమ్మ బదులు... పదిన్నర లక్షలు... ఏమంటారు? ఇది జనం ప్రశ్న!! ‘తనను ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఫంక్షన్లకు వెళ్లినా, బంధువుల ఇళ్లకు వెళ్లినా నాతోనే తీసుకొచ్చేసేవాడిని. తొలిసారి ఆమెను వదిలి పిల్లలతో ఇంటికొచ్చాను. ఇలా జీవితాంతం ఆమెను వదులుకోవాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయాను’ అన్నాడతను. ఆ మాట అంటున్నప్పుడు అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాటిని అదిమి పెట్టుకుంటూ అన్నాడు- ‘ఆరోజు అనకాపల్లి నూకాంబికా ఆలయంలో గర్భగుడి దర్శనం చేసుకొని వస్తానని అంది. పిల్లలకు నిద్ర వస్తోంది కనుక వాళ్లను తీసుకుని నేను వచ్చేశాను. అప్పుడు కూడా మావాళ్లందరూ ఉన్నారు కదా అనే ధైర్యంతో వచ్చాను. ఇంటికి వచ్చిన గంటన్నర కాలంలో ఈ ఘోరం జరిగిపోయింది...’ ఇటీవల ఒక పోకిరి వెకిలి చేష్టల వల్ల ప్రాణాలు కోల్పోయిన మాటూరి లావణ్య భర్త అప్పలరాజు ఆవేదన ఇది. అసలేమైంది?... విశాఖ జిల్లా గాజువాక మండలం రాజీవ్నగర్కు చెందిన లావణ్య పదో తరగతి వరకు చదువుకుంది. ఒద్దికైన అమ్మాయి. వడ్లపూడికి చెందిన మాటూరి అప్పలరాజుతో వివాహమయ్యాక అత్తింటి వారితో బాగా కలిసిపోయింది. అత్తింటి వారు కూడా ఆమెను మహారాణిలా చూసుకొంటున్నారు. ఆమె తన భర్త, పిల్లలు, ఆడపడుచు, బంధువులతో మొన్నటి మే నెల 22వ తేదీన నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లింది. లక్షణమైన ఆమె కాపురం చూసి మృత్యువుకు కళ్లెర్రబడ్డాయో ఏమో ప్రమాదం ఓ కీచకుడి రూపంలో దాపురించింది. అమ్మాయిలను ఏడిపించి పైశాచికానందం పొందే దాడి హేమకుమార్ అనే యువకుడి కన్ను ఆ రోజు లావణ్య మీద పడింది. వెంటనే అతడు లావణ్య, ఆమె ఆడపడుచు దివ్యలను వెంబడిస్తూ ఏడిపించసాగాడు. దాంతో లావణ్య, దివ్య, బంధువుల అబ్బాయి మోహన్... వీరు ముగ్గురూ కలిసి త్వరగా దర్శనం ముగించుకుని మోటార్ బైక్ మీద తిరుగు ప్రయాణం అయ్యారు. కాని దాడి హేమకుమార్ వదల్లేదు. బొడ్డేడ హేమంత్, మరికొందరు స్నేహితులతో కలిసి కారులో బైక్ను వెంబడించాడు. హారన్ మోగిస్తూ, వెకిలిగా పైపైకి వస్తున్నాడు హేమకుమార్. అతడి నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. సాలాపువానిపాలెం వద్ద బైకును కారుతో గుద్దాడు. లావణ్య అక్కడికక్కడే మరణించింది. దివ్య, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. చట్టం ఎవరికి రక్షణ? ఇంత దారుణానికి ఒడిగట్టిన హేమకుమార్కు సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే రక్షణ కవచంగా నిలిచారని వడ్లపూడి గ్రామం కోడై కూస్తోంది. లావణ్య ప్రాణానికి వెల కట్టారని కూడా తెలుస్తోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా ఒకటే మాట. పదవిలో ఉన్న వాళ్లు చట్టాన్ని నిందితులకు, హంతకులకు అనుకూలంగా మార్చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ‘రేపట్నుంచి... జేబులో రూ.10 లక్షలున్న ప్రతి ఒక్కడూ కనబడ్డ అమ్మాయిని ఏమైనా చేయొచ్చు. మత్తెక్కువైతే చంపేయొచ్చు. సెటిల్మెంట్లు చేయడానికి అధికార పార్టీ ఉండనే ఉంది. ఇది అధికార పార్టీ రేట్ చార్టు అని బోర్డులు వేలాడదీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని ఆందోళన పడుతున్నారు. నాయకుల ప్రమేయం నిజమేనా? అనకాపల్లి, పెందుర్తి, గాజువాకకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీకి చెందిన కొంతమంది మాజీ కార్పొరేటర్లు స్వయంగా రంగంలోకి దిగారని ఊరంతా గుప్పుమంటోంది. మరి ఈ కేసులో వారి ప్రమేయం లేదనుకుంటే ఉన్నఫళంగా గాజువాకలోని మాజీ కార్పొరేటర్ ఇంట్లో వారి అనుచర నాయకులు సమావేశమై చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి అనేది స్థానికుల విశ్లేషణ. పైగా ఆ మాజీ కొర్పొరేటర్ గాజువాక ఎమ్మెల్యేకి బంధువు కూడా. సమావేశమై ఏం చర్చించినట్లు అనే సందేహానికి సమాధానంగా ‘పోయిన లావణ్య ఎలాగూ తిరిగి రాదు, పిల్లల భవిష్యత్తు కోసం పదిన్నర లక్షల రూపాయలిచ్చేటట్లు సెటిల్ చేశారు’ అంటూ స్థానిక అధికార పార్టీ ద్వితీయశ్రేణి నాయకులే లీకులిస్తున్నారు. ఈ లీకుల ద్వారా తమ నేతల చాతుర్యాన్ని, రూలింగ్ పార్టీ ప్రతాపాన్ని చాటుకునే ప్రయత్నమే కనిపిస్తోంది. బాధితులకు ఇప్పటికే ఐదు లక్షలు ఇచ్చినట్లు, కేసు మూసేసిన తర్వాత మిగిలిన డబ్బు ఇస్తారని వారి కథనం. కేసులో మలుపులు... కేసు విషయంలో అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అది హత్య కాదని, రోడ్డు ప్రమాదమేనని సంఘటన జరిగిన వారం రోజుల తరువాత స్వయంగా నగర పోలీస్ కమిషనర్ యోగానంద రంగంలోకి దిగిన 24 గంటల్లో తేల్చేశారు. హత్య జరిగినట్టు తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, యాక్సిడెంట్గానే కేసు నమోదైందని ట్రాఫిక్ పోలీసులంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి కేసు తమకు వస్తే తప్ప రోడ్డు ప్రమాదాన్ని హత్యగా భావించి దర్యాప్తు చేపట్టలేమని శాంతిభద్రతల పోలీసులు చెబుతున్నారు. చట్టంలో నిబంధనల్లో ఉన్న లొసుగులను అధ్యయనం చేసినంతగా ఒక ప్రాణం పోయిందనే వాస్తవాన్ని ఒంటబట్టించుకుంటున్నట్లు లేదు పోలీసులు. లావణ్య తిరిగి రాదనే నిజాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. లావణ్యకు జరిగినట్లు మరే అమ్మాయికీ జరగకూడని విధంగా నిందితులను కఠినంగా శిక్షించేలా ఉండాలి చట్టం. డబ్బు మదంతో చెలరేగిపోతున్న వాళ్లకు చట్టం మీద భక్తి లేకపోయినా తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయమైనా కలిగించాలని పాలకులు అనుకోవాలి. అలా అనుకోకపోతే ఈ రోజు లావణ్య, రేపు మరెవరో? మనం ఉన్నది ఆటవిక రాజ్యంలో కాదు, సామాజిక చైతన్యం ఉన్న ఆధునిక సమాజంలోనే. మరి మన చట్టాలు, పాలకులు ఎవరికి అండగా ఉండాలి? బాధితులకా, బలవంతులకా? - ప్రదీప్నాయుడు కె., గాజువాక, విశాఖపట్నం జిల్లా ఆ రోజు... ఇలా జరిగింది! వడ్లపూడిలో బయల్దేరింది: ఉదయం ఎనిమిది గంటలకు ఆలయానికి చేరుకున్నది: ఉదయం 8.45 గంటలకు భోజనం చేసిన సమయం: మధ్యాహ్నం 1.30 తరువాత పిల్లలతో కలిసి భర్త ఇంటికి బయల్దేరి సమయం: మధ్యాహ్నం సుమారు 2.30 తరువాత ప్రమాదం జరిగింది: సాయంత్రం 4.30 సమయంలో అగనంపూడి ఆస్పత్రికి బాధితులను చేర్చిన సమయం: సాయంత్రం 5.30 గంటలకు బాధితుల ఫిర్యాదు సమయం: రాత్రి 10.15 గంటలకు (లావణ్య చినమామ లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు) ఎఫ్ఐఆర్ నమోదు సమయం: పోలీసులు రకరకాలుగా చెబుతున్నారుమాకు ఒక్క పైసా అందలేదు... పిల్లలకు పదిన్నర లక్షల రూపాయలు ఇవ్వడానికి సెటిల్మెంట్ జరిగినట్టు పేపర్లలో వచ్చింది. ఎవరు ఇచ్చారో, ఎవరు పుచ్చుకున్నారో మేము ఓట్లేసి గెలిపించిన ఆ పెద్దోళ్లకే తెలియాలి. మనిషి పోయిన బాధలో మేముంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్లు కూడా డబ్బు గురించే అడుగుతున్నారు. బాధతో మనసు చితికిపోతోంది. - వసంత, లావణ్య బంధువు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కుదరదు... మాకు ఫిర్యాదు చేసిన వ్యక్తికే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాం. వేరే ఎవరు అడిగినా దాన్ని ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి 8.30 గంటలకు యాక్సిడెంట్ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. ఈ విషయంలో అపోహలకు తావులేదు. - కృష్ణ, ట్రాఫిక్ సీఐ అమ్మ లేదు..! లావణ్య పిల్లలు సుశాంత్కు నాలుగేళ్లు, కుషాల్కు 15 నెలలు. రోజూ గోరుముద్దలు తినిపించే అమ్మ కనిపించడంలేదు. తల్లి ఏమైందో తెలియడంలేదు. నాన్న, అమ్మమ్మ, తాతయ్య, అక్కలు, బావలు, అత్తలు... అందరూ కనిపిస్తున్నారు. అమ్మ వారి మధ్యనే ఎక్కడో దాగి ఉందేమోనని చిన్నారుల కళ్లు వెతుకుతూనే ఉన్నాయి. వారి చేత అమ్మను మరిపించడం ఎలాగో తెలియక అమ్మమ్మ, నానమ్మలు కుమిలిపోతున్నారు. అమ్మ... మదమెక్కిన మగాళ్ల కిరాతకానికి బలయిందనే నిజం ఆ చిన్నారులకు అర్థం కాదు. పసిబిడ్డలకు తెలియకపోవడంలో అర్థం ఉంది. కానీ పోలీసులకు కూడా తెలియడం లేదా? తెలిసీ కేసుని రకరకాల మలుపులతో పలచబరచడానికే ప్రయత్నిస్తున్నారా? విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండోదే నిజమని నమ్మాల్సి వస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వలేదు... ఈ ప్రమాదం జరిగినరోజు రాత్రి పరవాడ ట్రాఫిక్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఇంకా మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. మేం కూడా ఇతర పనుల్లో ఉండి వెళ్లి తీసుకోలేదు. అందులో ఏం రాశారో కూడా మాకు తెలియదు. ‘డబ్బుతో కేసు సెటిల్మెంట్ జరిగిందటగా’ అని మమ్మల్ని అడుగుతుంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆ పెద్దవాళ్లు నిజంగా పిల్లలకు డబ్బు ఇవ్వదలుచుకుంటే ఇవ్వమనండి. పోయిన తల్లిని ఎలాగూ తెచ్చివ్వలేం. కనీసం వారిని చదివించడానికి, ప్రయోజకులను చేయడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. - మాటూరి లక్ష్మణరావు లావణ్య చినమామ -
అమెరికాలో మొదటి 'జికా' మామ్!
న్యూ జెర్సీః పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది. కాగా తాజాగా అమెరికాలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి జికా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్థారణ చేశారు. న్యూజెర్సీ లోని ఆసుపత్రిలో జికా వైరస్ తో ఉన్నతల్లి ప్రసవించిగా ఆమెకు చిన్న తలతో ఉన్న శిశువు జన్మించినట్లు వైద్యాధికారులు గుర్తించారు. స్పష్టంగా జికా వైరస్ లక్షణాలు కలిగిన ఇటువంటి కేసు అమెరికా ట్రై స్టేట్స్ లో ఇదే మొదటిసారి అని ఇడా సీగల్ నివేదించింది. దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి సోకి, కలకలం రేపుతున్న జికా వైరస్... మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది.అయితే ఈ వైరస్ వల్ల ఇతరుల్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా గర్భిణులకు సోకితే మాత్రం పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తుతాయంటూ వైరస్ ను నిలువరించేందుకు డబ్ల్యూహెచ్ వో భారీ కసరత్తు చేస్తోంది. ఈడిస్ ఈజిప్టె రకం దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నజికా వైరస్... సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా... గర్భిణిలపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలో జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద సవాలుగా మారింది. మైక్రో సెఫలి వ్యాధి బారినపడ్డ బిడ్డ.. అమెరికాలోని న్యూజెర్సీ ఆస్పత్రిలో జన్మించింది. ఇలా జికా వైరస్ సోకిన తల్లి ఆమెరికాలోని ఆస్పత్రిని సందర్శించడం ఇదే మొదటిసారి అని హాకెన్సాక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధికారులు అంటున్నారు. అయితే ఆ తల్లి.. పూర్తి వైద్య సంరక్షణ అందుకుందని చెప్పిన అధికారులు.. ఆమె గోప్యతను గౌరవిస్తూ... ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఆమె హోండురాస్ కు చెందిన 31 ఏళ్ళ వయసున్న మహిళ అని ఓ వార్తా పత్రిక వెల్లడింరగా... గర్భం ప్రారంభ దశలోనే ఆమె.. దోమకాటు వల్ల జికా బారిన పడిందని ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అల్ట్రా సౌండ్ టెస్ట్ లో లోపాలు కనిపించడంతో వైద్యులు 35 వారాల గర్భంతో ఉన్న ఆమెకు మంగళవారం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డ.. తక్కువ బరువుతోపాటు, మైక్రోసెఫలీ వ్యాధి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తల్లికి గర్భంతో ఉన్న సమయంలో శరీరంపై కొద్దిపాటి రాష్ తప్పించి.. మిగిలిన ఎటువంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు. -
తెలివైన అమ్మ ఏం చేసిందంటే..!
న్యూయార్క్: చిన్నపిల్లలను పెంచడం పెద్ద సవాలే. నిలకడలేని ఆలోచనలు.. వేగంగా పరుగెత్తే వారి మనసును అందుకోవడం మహా కష్టమే. మారం చేశారంటే చాలా తక్కువ మంది మాత్రమే వారిని కంట్రోల్ చేయగలుగుతారు. ఇలా కంట్రోల్ చేయగలిగే వారిలో ఎప్పుడూ అమ్మదే అగ్రస్థానం. దేశాలు వేరైనా నాన్న మాటలు నమ్మరేమోగానీ.. అమ్మ చెప్పిన మాటలు మాత్రం చిన్నపిల్లలకు ఎప్పటికీ వేదాలే. అమెరికాలో స్కూల్ కు వెళ్లనని మారం చేస్తున్న తన మూడేళ్ల బాలుడిని తన తల్లి కొట్టకుండా తిట్టకుండా కేవలం తన తెలివి తేటలతో తిరిగి పాఠశాలకు వెళ్లేలా చేసింది. అది కూడా గతంలో కంటే ఎక్కువ విశ్వాసంతో తరగతులకు హాజరయ్యేలా. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటానీ బినేష్ అనే మహిళకు ఆడేన్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. అతడు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్కూల్ కు వెళుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు కిందపడ్డాడు. దీంతో అతడి నుదుటిపై గీతగీసినట్లుగా ఓ గాయం ఏర్పడింది. అలా గాయపడిన మరుసటి రోజే తాను స్కూల్ కు వెళ్లనని.. తన ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మారం చేయడం మొదలుపెట్టాడు. అన్ని రకాలుగా బ్రతిమిలాడిన ఆ తల్లి చివరకు ఓ చక్కటి ఉపాయాన్ని ఆలోచించింది. గాయం అయ్యి గీతాలగా కనిపిస్తున్న దానిని ఓ రెడ్ మార్కర్ తో ఎస్ గా మార్చింది. అనంతరం ఆ బాలుడికి హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీ ధరించిన కళ్లద్దాల్లాంటివి పెట్టి అతడికి చూపించింది. హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీకి కూడా నుదుటిపై అచ్చం ఇలాంటి గుర్తే ఉండటంతో ఆ బాలుడు తాను కూడా ఓ హ్యారీ పోటర్నే అన్న సంతోషంలో గెంతుతూ స్కూల్ కు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా ఆ తల్లి తన కుమారుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అవి హల్ చల్ చేస్తున్నాయి. -
ఈ ఆలయం తల్లులందరికీ అంకితం
సృష్టికి అమ్మ దైవం అయితే జగతికి తల్లే దైవం.అందుకే అమ్మ ను వించిన దైవం ఉండదు అంటారు. ఇది జగమెరిగిన సత్యం. అయినా ఇప్పుడు అమ్మను ప్రేమించేవారు,గౌరవించేవారు ఎందరుంటారు? అయితే నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అమ్మను ప్రేమించడమే కాదు పూజిస్తున్నారు. తన మాతృమూర్తికి ఏకంగా ఒక గుడిని కట్టి ఆరాధించనున్నారు. తల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేయడం అన్నది తమిళనాడులోనే,ప్రపంచంలోనే తొలి ప్రయత్నం లారెన్స్దే అయ్యింటుంది.అమ్మను ఆరాధించేవారు ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించగలరు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధ్యుడైన లారె న్స్ ఆయనకు ఆల యాన్ని నిర్మించి నిత్యార్చనలు జరిపిస్తున్నారు. అమ్మను అమితంగా ప్రేమించే ఆయన ఇప్పుడు ఆ ఆలయం ఎదురుగా తల్లికి గుడి కట్టిస్తున్నారు. గుడి నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ప్రారంభోత్సవం జరగనుంది.ఆ గర్భగుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారు.తల్లి శిలారూపాన్ని రాజస్థాన్లో తయారు చేయిస్తున్నారు.ఆ శిలారూపం ఫొటోను మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం లారెన్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనదంటారు. ఆ గాయత్రీదేవి ప్రతిమను అమ్మకు కట్టిస్తున్న గుడి లో ప్రతిష్టించి ఆ ప్రతిమ కింద అమ్మ కణ్మణి శిలావిగ్రహాన్ని నెలకొల్పనున్నాను.తన గర్భంలో తొమ్మిది నెలలు మోసి,పెంచి పోషించిన కన్నతల్లికి గుడి కటించాలన్నదే లక్ష్యంగా భావించాను. తల్లి ఘనతను ఈ లోకానికి చాటాలన్నదే ఈ గుడి కట్టించడంలో పరమార్థం. మా కోసం ఎంతగానో శ్రమించిన అమ్మకు గుడి కట్టించడం సంతోషంగా ఉంది. ఉదయం వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్న అమ్మకు నేను తయారు చేయిస్తున్న తన శిలారూపం ఫొటోను చూపించగా అమ్మ ఎంతగానో పరవశించారు.తమ్ముడు ఎల్లిన్ తదితరులలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ మాతృదినోత్సవం సందర్భంగా మా అమ్మకు కట్టిస్తున్న గుడిని ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ అంకితం చేస్తున్నానన్నారు లారెన్స్. -
అమ్మకు బీమా బహుమతిగా ఇద్దాం!
అమ్మ అంటే... వెలకట్టలేని రెండక్ష రాలు. అమ్మకు బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడం నిజంగా ఓ ప్రత్యేకతే.. మార్కెట్లో బీమాలెన్నో.. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ అమ్మ అవసరాలను ప్రాధాన్యంలోకి తీసుకోవాలి. వాటికి అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి. అవేంటో చూద్దాం... వ్యక్తిగత ప్రమాద బీమా: ఎవరైనా ప్రమాదానికి గురికావొచ్చు. కాబట్టి ఈ బీమా తీసుకోవడం మంచిది. ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులపై, సన్నిహితులపై ఆర్థికంగా ఆధారపడటం కొంత తగ్గుతుంది. ఆరోగ్య బీమా: ఆమె బాగుంటేనే.. మనం బాగున్నట్లు. ఎందుకంటే మన అవసరాలను తను చూసుకుంటుంది కాబట్టి. ఆమెకు ఎదైనా హెల్త్ ఎమర్జెన్సీ సంభవిస్తే ఆ పరిస్థితుల నుంచి గ ట్టెక్కడానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. అత్యవసర బీమా: మహిళలకు మాత్రమే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వీటికి సంబంధించి అత్యవసర బీమా పాలసీని తీసుకోవాలి. వాహన బీమా: ఒకవేళ అమ్మ ఉద్యోగం చేస్తుంటే.. తనకు వాహనం ఉంటే.. వాహన బీమా తీసుకోవాలి. ఇంటి బీమా: మహిళలు రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండి, ఆర్థికపరమైన అంశాల్లో స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. వారికి ఇంటి బీమాను కానుకగా ఇవ్వండి. ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం మహిళలు ఉద్యోగం/వ్యాపారంలో భాగంగా దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. కొందరు ఉల్లాసం, కొత్తదనం కోసం టూర్లకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మ కూడా తరచూ విదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటే.. ఆమెకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అది వారికి కొత్త ప్రదేశాల్లో అనుకోని పరిస్థితులు సంభవిస్తే.. రక్షణ కల్పిస్తుంది. గృహిణైనా? ఉద్యోగిణైనా? బీమా తప్పనిసరి భారత్లో బీమా వ్యాప్తి తక్కువే. బీమా పరిశ్రమ నివేదికల ప్రకారం.. బీమా తీసుకున్న వారిలో మహిళల వాటా 20-30 శాతం మాత్రమే. గతంలో కుటుంబంలోని మహిళకు ఎలాంటి ఆర్థికపరమైన బాధ్యతలు ఉండవనే కారణంతో వారికి బీమా ఎందుకని అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు వారూ బాధ్యతలను మోస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ బీమా దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి మార్పు లేదు. ఇది మారాలి. వారికి కూడా బీమా తీసుకోవాలి. కనీసం ఇంట్లో అమ్మకైనా బీమా ఇప్పించాలి. ఆమె గృహిణా? ఉద్యోగిణా? అనేది ఇక్కడ అనవసరం. - పునీత్ సాహ్ని హెడ్- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ -
బాలికకు ‘పరీక్ష’
♦ ఇంట్లో అమ్మ మృతదేహం.. ♦ పరీక్ష రాసొచ్చాక అంత్యక్రియలు పాపన్నపేట: నవ మాసాలు మోసి.. పేగు తెంచి జన్మ నిచ్చిన.. అమ్మ అంతిమ యాత్ర ఓ వైపు, పదేళ్లు చదివి భవితకు బాటలు వేసే పదో తరగతి పరీక్ష మరోవైపు.. ఆ చిన్నారిని కలవరపరిచాయి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చివరకు ఆ చిట్టితల్లి శనివారం పరీక్షకు హాజరైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన రత్నయ్య, మరియమ్మ దంపతులకు అనురాధ అనే కూతురు, కుమారుడు ఉన్నారు. అనురాధ కుర్తివాడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతు పాపన్నపేటలో పరీక్షలు రాస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన మరియమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త రత్నయ్య ఉన్నంతలో స్థానిక వైద్యం చేయిస్తుండగా.. శుక్రవారం మరియమ్మ మృతిచెందింది. శనివారం అంత్యక్రియలు నిరృహించాలని నిర్ణయించారు. కన్నతల్లి మరణం ఓవైపు, పదో తరగతి ఆంగ్లం పరీక్ష మరోవైపు అనురాధను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. భవిష్యత్తును, పెద్దల సలహాను దృష్టిలో పెట్టుకొన్న ఆ చిన్నారి పరీక్ష రాసేందుకు నిర్ణయించుకుంది. శోక సంద్రమైన ఆ ఇంటిని, అచేతనంగా పడి ఉన్న అమ్మ శవాన్ని వదిలి పరీక్ష కేంద్రానికి పయనమైంది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ధైర్యాన్ని కూడదీసుకుంటూ ఇంగ్లిష్ పరీక్ష రాసి వచ్చాక కన్న తల్లి అంతిమయాత్రలో పాల్గొంది. -
‘మామ్’... శ్రీదేవి!
కొంతమంది తారలు ఏళ్ల తరబడి నటించినా బోర్ కొట్టరు. జీవితాంతం వాళ్లు నటించినా, చూడాలనుకునే ప్రేక్షకులు ఉంటారు. ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న తారల్లో శ్రీదేవి ఒకరు. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శ్రీదేవి దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ ఒప్పుకున్నప్పుడు ఆమె అభిమానులు సంబరపడిపోయారు. అన్నేళ్ల తర్వాత నటించినా శ్రీదేవి భేష్ అనిపించుకున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ చేస్తే మంచి సినిమానే చేయాలనుకున్న శ్రీదేవి ‘బాంబే టాకీస్’లో అతిథి పాత్ర చేశారు. గత ఏడాది తమిళ చిత్రం ‘పులి’లో మహారాణిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మామ్’ అనే హిందీ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవి ఉడయవర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ అతిథి పాత్ర చేయనున్నారు. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అనీ, శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తారనీ సమాచారం. సవతి తల్లి చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో కూతురి పాత్రకు కమల్హాసన్ రెండో కుమార్తె అక్షరా హాసన్ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
'ఆమె దేశంలోనే గొప్ప నటి'
విలక్షణ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. పాజిటివ్, నెగెటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న నవాజ్, ఇప్పుడో స్టార్ హీరోయిన్ తో కలిసి నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నవాజ్, ఆమె దేశంలోనే గొప్పనటి అంటూ కీర్తించాడు. 80, 90 దశకాలలో వెండితెరను శాసించిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి, తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని, నాలుగేళ్ల క్రితం ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది. 'మామ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నవాజ్, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'పది రోజుల క్రితం నేనో సినిమా అంగీకరించాను. థ్రిల్లింగ్ స్క్రిప్ట్తో రూపొందనున్న ఈ సినిమాలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తుంది. నేను అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కవ శాతం శ్రీదేవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను. నా దృష్టిలో దేశంలోనే ఆమె గొప్ప నటి' అంటూ కామెంట్ చేశాడు నవాజ్. -
భూగోళం చుట్టేసిన బుజ్జాయి!!
పది నెలల వయసుకే ప్రపంచ దేశాలు తిరిగిన పసివాళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా? లండన్ కు చెందిన ఓ చిన్నారి ఇప్పుడు అదే పనిలో ఉంది. పదినెలలకే ప్రారంభించిన ప్రయాణంతో పదహారు నెలలు వచ్చే సరికల్లా భూగోళం చుట్టేసి.. ఇప్పుడు ఆన్లైన్లో అందర్నీ ఆకట్టుకుటోంది. అతి చిన్న వయసులో ప్రపంచ పర్యాటకురాలిగా పేరు తెచ్చుకుంది. సాధారణంగా తల్లులంతా తమకు పుట్టిన పిల్లలతో మెటర్నిటీ లీవ్ ను ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటారు. వారి ఆలనా పాలనా చూసుకుంటూ.. వారి ముద్దు మురిపాలను ఆస్వాదిస్తుంటారు. కానీ ఎడ్వర్డ్స్ దంపతులు అందుకు భిన్నంగా తమ చిన్నారిని తీసుకొని ప్రయాణం ప్రారంభించారు. ఓ బ్యాక్ ప్యాక్ ను తగిలించుకొని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కాంబోడియా, ఇండోనేషియా, థాయిల్యాండ్ వంటి దేశాలన్నీ చుట్టేశారు. దీంతో అడుగులు కూడా వేయడంరాని వయసులో ఆ దంపతుల గారాలపట్టి ఎస్మె.. ఏకంగా 12 దేశాలు తిరిగేసింది. ఇప్పుడు అమ్మానాన్నలతో కలసి దిగిన ఫొటోలతో బ్లాగుల్లోనూ, ఇన్ స్టా గ్రామ్ లోనూ అందర్నీ ఆకట్టుకుంటోంది. లండన్ కు చెందిన 31 ఏళ్ళ కరేన్ ఎడ్వర్డ్స్.. మెటర్నిటీ లీవ్ ను అందరికీ భిన్నంగా వినియోగించుకుంది. తన కూతురు ఎస్మె కు పది నెలలు వచ్చాయోలేదో... ఆమెను భుజాన వేసుకొని భర్త షాన్ బేన్స్ తో కలిసి ప్రపంచ పర్యటన ప్రారంభించింది. చిన్నారికి పదహారు నెలలు వచ్చేసరికి పదిసార్లు విమాన ప్రయాణం చేసింది. తమ అద్భుత ప్రయాణ అనుభవాలను పొందుపరుస్తూ ఎడ్వర్డ్స్.. తన బ్లాగ్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లోనూ ఫోటోలు పోస్ట్ చేసింది. ఎడ్వర్డ్స్ దంపతులకు ట్రావెలింగ్ అంటే ఇష్టంతోపాటు.. ప్రపంచం మొత్తం పర్యటించాలన్న కోరికా బలంగా ఉంది. కల సాకారం చేసుకునేందుకు ఉన్న కారును అమ్మేశారు. ఇల్లు కూడా అమ్మకానికి పెట్టారు. బేన్స్ తన ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు తమ ప్రయాణాన్ని ఇప్పట్లో ఆపాలని కూడా వాళ్లు అనుకోవడం లేదు. ఇలా వాళ్లు చేపడుతున్న ప్రయాణాలతో వారి ముద్దుల పట్టి ఎస్మె అతి చిన్న వయసులోనే ప్రపంచ పర్యాటకుల్లో ఒకరిగా స్థానం సంపాదించేసింది. -
నా కళ్ల ముందే మా అమ్మ ఎదిగింది!
‘మా అమ్మ నా కళ్ల ముందు ఎదిగింది’ అని ఇలియానా అంటున్నారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎదగడమేంటి? అని ఆశ్చర్యపోవచ్చు. ఈ గోవా బ్యూటీ చెప్పినది శారీరక ఎదుగుదల గురించి కాదు.. వ్యక్తిగా తన తల్లి ఎదిగిన వైనాన్ని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాతే ఇలియానా తల్లి చదువుకున్నారట. ఆ విషయంతో పాటు తన తల్లి గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘మా అమ్మ ముస్లిమ్. నాన్నగారు క్రిస్టియన్. ప్రేమకు మతాలతో సంబంధం లేదని భావించి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మామూలుగా ముస్లిమ్ కుటుంబాల్లో ఆడపిల్లలకు కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాల్లో భాగంగా మా అమ్మ పెద్దగా చదువుకోవడానికి వీలు పడలేదు. బాగా చదువుకోవాలని, సొంత కారు ఉండాలని, జీన్స్ వేసుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గా తిరగాలని.. ఇలా ఆమెకు ఏవేవో కోరికలుండేవి. పెళ్లయ్యాక ఒక్కో కోరికను తీర్చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసింది. మేం అప్పుడు చిన్నపిల్లలం. నన్నూ, నా సిస్టర్ని తనతో పాటు కాలేజీకి తీసుకెళ్లేది. అమ్మ శ్రద్ధగా చదువుకోవడం చూశాను. అంతకుముందు నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడటానికి భయపడేది. ఇంగ్లిష్ కూడా రాదు. చదువుకోవడం మొదలుపెట్టాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గడాగడా ఇంగ్లిష్ మాట్లాడటం మొదలుపెట్టింది. నా కళ్ల ముందే మా అమ్మ ఒక్కో మెట్టూ ఎదిగింది. అందుకే జీవితంలో నీకు ఎవరు ఆదర్శం అని అడిగితే, ‘మా అమ్మ కాకుండా ఇంకా ఎవరుంటారు?’ అని చెబుతుంటాను’’ అని తన తల్లి గురించి ఇలియానా చాలా గొప్పగా, గర్వంగా, మురిపెంగా చెప్పారు. -
'తల్లికి పురుడు పోసిన 11ఏళ్ల బాలుడు'
వాషింగ్టన్: పదకొండేళ్ల బాలుడంటే ఆటలు, పాటలు, స్నేహితులతో కలిసి వీధుల్లో గెంతడాలు, స్కూలుకు వెళితే పాఠాలు వల్లేవేయడాలు వంటివే తెలుసు. కానీ, అలాంటి బాలుడే తన తల్లికి, ఆ తల్లి కడుపులో బిడ్డకు ప్రాణం పోస్తే.. జార్జియాలోనే మారియట్టాలో ఇదే జరిగింది. కెన్యార్డా అనే మహిళ నిండు చూలాలు. అంతకుముందే ఆమెకు జేమ్స్ డ్యూక్ అనే పదకొండేళ్ల బాలుడు ఉన్నాడు. కాగా, వైద్యులు ఇచ్చిన సమయానికంటే ముందుగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చి ఇంట్లో పడిపోయింది. ఆ సమయంలో జేమ్స్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. తల్లి ప్రసవ వేదన చూసి దగ్గరికి వచ్చిన అతడు తన తల్లి సుఖంగా ప్రసవించడంలో సహాయపడి, అటు తల్లి ప్రాణాన్ని, కొత్తగా లోకం చూసిన తన సోదరి ప్రాణాలను రక్షించుకుని ఒక్కసారిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సంఘటన అనంతరం తన కుమారుడు సూపర్ హీరో, సూపర్ డాక్టర్ అంటూ పలు రకాలు పొగడ్తల్లో ముంచెత్తుతూ మురిసిపోయింది. -
నలభై ఏళ్ల వయసులోనూ పిల్లల్ని కనొచ్చు!
పెళ్లయ్యేంతవరకూ పెళ్లెప్పుడు? అని అడుగుతుంటారు. పెళ్లయ్యాక.. పిల్లలు ఎప్పుడని అడుగుతుంటారు. ఈ ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సైఫ్ అలీఖాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా కరీనా కపూర్ సమాధానం చెప్పేశారు. ఇప్పుడు పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఆమెను వెంటాడుతోంది. ఇటీవల ఓ విలేకరి ఆమెను ఈ విషయం గురించి అడిగితే - ‘‘మరో రెండేళ్లల్లో అమ్మనవుతా’’ అన్నారు. మరి.. వయసు సంగతేంటి? అని ఆ జర్నలిస్ట్ అడిగితే - ‘‘మొదట్నుంచీ ఎప్పుడు ఏది చేయాలనే విషయం మీద నాకో ప్రణాళిక ఉంటుంది. అలాగే, నచ్చినప్పుడు చేయడం అలవాటు. స్టార్ హీరోయిన్ కావాలనుకున్నా. అయ్యాను. పెళ్లి చేసుకోవాలనుకున్నా.. చేసుకున్నాను. నాకెప్పుడు అనిపిస్తే అప్పుడు అమ్మ అవుతా. ఆ మాటకొస్తే మరో రెండేళ్ల వరకూ తల్లి కావాలని అనుకోవడంలేదు. నలభై ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కనొచ్చు కదా. కంగారెందుకు?’’ అని కొంచెం ఘాటుగానే స్పందించారు. ఇటు మీడియా అనే కాకుండా కరీనాకి కావల్సినవాళ్లు కూడా పిల్లల గురించి అడుగుతున్నారట. ఆ ప్రశ్నకు విసుగు చెందే కరీనా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
అమ్మ చేతిలో చెయ్యేసి...
మనసు చీటీ అమ్మకి ఆరోగ్యం బాగోక ఆరునెలలు అయింది. కొద్దిపాటి విరేచనాలతో మొదలైన అనారోగ్యం, అన్నిరకాల కాంప్లికేషన్స్నీ పోగేసుకుని - చివరకు స్ట్రోక్గా (పక్షవాతం) అవతరించి - అమ్మని వీల్ చెయిర్కి పరిమితం చేసేసింది. అంతకుముందు నాకూ, ఆమెకీ ఎప్పుడూ ఒకటే యుద్ధం. నా దగ్గరే ఉండిపొమ్మని నేనూ - ‘‘నాకిక్కడ తోచదు. గుంటూరులోనే ఉంటాను’’ అని ఆమె - బోల్డన్నిసార్లు మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. కానీ ఈరకంగా నా దగ్గర ఉండిపోతుందని అనుకోలేదు. రోజూ అమ్మతో కాసేపు గడుపుదామని ప్రయత్నిస్తుంటాను. అన్ని రోజులూ కుదరదు. ఉదయం హాస్పిటల్కి వెళ్లే టైమ్కి నిద్రలో ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి లేట్ అయితే మళ్లీ దొరకదు తనతో సాంగత్యం. దగ్గరకు వెళ్లగానే, నా గడ్డం పట్టుకుం టుంది. చేయి వదలదు. ‘‘ఆరోగ్యం చూసుకో నాన్నా’’ అని పదిసార్లు గుర్తు చేస్తుంది. అది కొద్దిసేపే - తర్వాత తన లోకంలోకి వెళ్లిపోతుంది. ‘రేపు గుంటూరు వెళ్లిపోతాను నాన్నా’’ అంటుంది ఒక్కోసారి. తనకి ఏమయిందో - ఎందుకు నడవలేకపోతోందో - ఎక్కడ ఉందో తనకు పూర్తిగా అవగాహన లేదు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల, కొంత భాగం పనిచేయక - ఈ రకమైన అనిశ్చిత పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ఓ రకంగా దేముడు ఆమెకి ఇచ్చిన వరమేమో ఇది. అనారోగ్యంతో చేయి, కాలు కదలక పోవడం, తనంతట తాను టాయ్లెట్కి వెళ్లలేకపోవడం ఎంత దుర్భరమో... ఆ అశక్తత మనసుకు తెలియకపోవడం అంతకంటే మించిన వరమే అనిపిస్తుంది. వరప్రసాదరెడ్డిగారు తన ప్రతి పుట్టినరోజుని, మాతృదినోత్సవంగా జరుపుతారు. ఆ రోజు కొందరు అమ్మలను గౌరవిస్తారు. పోయిన సంవత్సరం చిరంజీవిగారి అమ్మ, ఎస్పీబాలుగారి అమ్మ, తనికెళ్ల భరణిగారి అమ్మలతో పాటు, మా అమ్మకి కూడా ఆ గౌరవం దక్కింది. కానీ దురదృష్టం, ఆ రోజుకి వారం ముందే అమ్మకి పక్షవాతం వచ్చి హాస్పిటల్లో ఉండిపోయింది. అమ్మ తరఫున నాన్న ఆ సత్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో నేను మాట్లాడ ప్రయత్నించి విఫలమయ్యి, అందరి ముందూ ఏడ్చేశాను. గుండె లోతుల్లో కూరుకున్న, పేరుకున్న అను భూతులన్నీ పెల్లుబికి కన్నీళ్ల రూపంలో రావడం ఓ అనిర్వచనీయమైన ప్రక్రియ. ఈ రోజు నేను డాక్టర్నయ్యి ఇంత మందికి సాయం చేయగల్గుతున్నానంటే - అది అమ్మ చలవే. ఆమెకి నేను డాక్టర్ కావాలని ప్రగాఢమైన కోరిక. ఆమె ప్రోద్బలం లేకపోతే పట్టు వదలని విక్రమా ర్కుడిలాగా అన్నిసార్లు ప్రయత్నించగలిగి ఉండేవాడ్ని కాదేమో! కానీ దేవుడి లీల - పక్షవాతం పర్మినెంట్గా ఆమెని వీల్ చెయిర్కి పరిమితం చేయడం - మా డాక్టర్లందరం నిమిత్తమాత్రులుగా మిగిలి పోవడం దురదృష్టం కాక మరేమిటి! కాకపోతే - ఆమెకి ఈ రకంగానైనా కొంత సేవ చేయగలగడం అదృష్టం. అయిదేళ్ల క్రితం నేను తెచ్చిన ‘గురవాయణం’ పుస్తకంలో ‘మాతృ దేవోభవ’ అని అమ్మ గురించి రాశాను. దాంట్లో నామిని రాసిన ‘అమ్మకి జేజే’ పుస్తకం గురించి ప్రస్తావించాను. ఈసారి చీకోలు సుందరయ్యగారి సంపాదకత్వంలో వచ్చిన ‘అమ్మ’ కవితా సంకలనం గురించి చెప్పడం సముచితం. మూడేళ్ల క్రితం మృణాళిని దగ్గర ఈ పుస్తకం చూశాను. వాకబు చేస్తే అదే చివరి కాపీ అని తెల్సింది. ‘‘ఈ పుస్తకం నేను అచ్చేసిస్తాను అవకాశం వస్తే’’ అనుకున్నాను. ఆ అవకాశం ఇన్నాళ్టికి సుందరయ్యగారి ద్వారా వచ్చింది. వందమందికి పైగా కవులు అమ్మ గురించి వివిధ కోణాలని స్పృశిస్తూ పండించిన కవితల సంకలనం ఇది. సుందరయ్యగారన్నట్లు - మన పూర్వీకులు మాతృదేవోభవ అని తొలి నమస్కారం అమ్మకే కేటాయించారు. తొలిస్థానం ఆమెకే ఇచ్చారు. సినీకవులు సైతం ‘అమ్మంటే అంతులేని సొమ్మురా - అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా’ అని అందంగా చెప్పారు. విమలగారు ‘వంటిల్లు’ పేరున అమ్మ గురించి, అమ్మ వంటల గురించి ఆర్ద్రంగా రాశారు. ‘ఎంత అద్భుతమైందీ వంటగది రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ తెరచిన తినుబండారాల దుకాణంలా ఎంత నోరూరిస్తుందో తాలింపు ఘుమాయింపులతో పూజామందిరం అగరొత్తుల సువాసనల్తో మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది’ అని. ఈ కవిత చదువుతూనే చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి జారిపోయాను, పారిపోయాను. అమ్మ రవ్వలడ్లు, కొబ్బరి లౌజులు చేసేది. శనివారం ఎప్పుడు వస్తుందా అని చూసేవాణ్ని. ఎందుకంటే - ఆ రోజు దేవుడికి నాన్న కొట్టిన కొబ్బరికాయ - మాకు రవ్వలడ్డుగా అమ్మ చేతుల్లో ప్రత్యక్షం. అమ్మ చేసిన టొమాటో పప్పు అద్భుతహ. అలానే గుత్తి వంకాయకూర ఆమె చేతుల్లో అమృత ధార. మజ్జిగచారు గురించి చెప్పక్కర్లేదు. కానీ నా దురదృష్టం. ఇప్పుడు అమ్మ ఏ వంటా చేయలేని పరిస్థితి. మా వంటామె చేసిన వంటకాల్ని అమ్మకి తినిపిస్తూ, ‘‘అమ్మా! నువ్వు చేసిన పప్పు ఇంతకంటే ఎంత బాగుండేదో’’ అని అంటుంటే - ఆ అలసిపోయిన మొహంలో కొసమెరుపుగా మళ్లీ ఓ చిరునవ్వు మొలుస్తుంది. అదే చాలు నాకు. నేను మెడికల్ కాలేజీలో చేరేదాకా - అమ్మే తల దువ్వేది నాకు. దువ్వెన ఆమె చేతికిచ్చి తలవంచుకుని నిలబడితే... ప్రేమగా, గోముగా ఓ చేత్తో గడ్డం పట్టుకుని ఇంకో చేత్తో పాపిట తీసి తలదువ్వడం నా గుండెల్లో పదిలంగా దాచుకున్న అనుభూతి. ఆప్యాయత ఎక్కడ కనపడ్డా - ఎవరు పంచినా అమ్మే గుర్తొస్తుంది నాకు. నా ఆరోగ్యం గురించి, నా కెరీర్ గురించి, అనుక్షణం ఆలోచిస్తూ ఆరాటపడే స్నేహితురాలిలో కనపడుతుంది అమ్మ నాకు. సమస్యలలో సతమతమయ్యే సమయాన ధైర్యాన్నిచ్చి చేయూతనిచ్చే భార్యలో కనపడుతుంది అమ్మ నాకు. హాస్పిటల్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు, నా కోసం ఎదురుచూసి, భోజనం పెట్టే కూతురిలో కనపడు తుంది అమ్మ నాకు. చూడగలిగితే - ఎటు చూసినా అమ్మే. అమ్మ గుంటూరులో ఉన్నన్నాళ్లూ ఆమెతో గడపటానికి సమయం దొరికేది కాదు. జీవితంలో స్థిరపడ్డానికి బోల్డన్ని యుద్ధాలు, పరుగు పందేలు! ఇప్పుడు అమ్మతో గడిపే సమయం, సందర్భం వచ్చినా అమ్మ లేదు. శారీరకంగా నా ముందే ఉన్నా, నాకందని లోకాల్లోకి వెళ్లిపోయింది. కొడుకు చేతిలో చెయ్యేసి, మాట్లాడ ప్రయత్నిస్తూనే మనకెవరికీ అర్థం కాని శూన్యంలోకి జారిపోయింది. ‘అమ్మ బాగున్నప్పుడు ఇంకొంచెంసేపు గడిపి ఉంటే ఎంత బాగుండేదో కదా’’ అని ఎన్ని వందలసార్లు అనుకుని నాలో నేను ఏడ్చుకుంటున్నానో, నాలాగే కొన్ని కోట్లమంది కొడుకులు అమ్మలతో గడపక, గడపలేక కుమిలిపోతూ ఉండి ఉంటారు. వాళ్లందరికీ నా విన్నపం ఒకటే. అమ్మతో గడపటానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ రెండు చేతుల్తో అందుకోండి. అమ్మ మాటలు చాదస్తంగా, ఛాందసంగా అనిపించినా పట్టించుకోవద్దు. చిన్నప్పుడు మీకు రవ్వలడ్డు పెట్టిన అమ్మని, పెద్దయినాక తల దువ్విన అమ్మని గుర్తు తెచ్చుకోండి. మాటలు చేతకాకపోతే చేతిలో చెయ్యేసి అలానే కూచోండి. ఆ స్పర్శలో, ఆ నిశ్శబ్దంలో అవధి లేని అనురాగ గ్రంథాలు ఆవిష్కృతమవుతాయి. డా.గురవారెడ్డి -
మొగుళ్లకు అర్థం కాదా!?
అమ్మ పొత్తిళ్లు బిడ్డకు స్వర్గం అనిపిస్తాయి. మరి అమ్మకో? నలభైతొమ్మిది శాతం బాలింతలకు నరకంగానే అనిపిస్తుందట! ‘ఇంపాజిబుల్. ఇది సత్యం కాదు’ ‘తల్లికి బిడ్డను చూస్తే నరకమా’? ‘యూజ్లెస్ టాక్’!‘బుద్ధిలేనోళ్లు కావాలని ప్రచారం చేస్తున్న అసత్యమిది’. ఇవీ మొగుళ్ల కామెంట్స్. కొంతమంది అత్తలు కూడా ఇదే అంటారేమో!కానీ, పరిశోధన క్లియర్గా చెబుతున్న విషయం... ప్రతి ఇద్దరు బాలింతలలో ఒకరు తీవ్రమైన డిప్రెషన్కు గురవుతున్నారని! ఈ విషయం అర్థం చేసుకొని బాలింతలకు అండగా నిలవాలన్నదే మనందరి ప్రయత్నం కావాలి. దిస్ ఈజ్ నాట్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. దిస్ ఈజ్ ఎ పాయింట్ ఫర్ యాక్షన్.మొగుళ్లూ... తండ్రులమైపోయామని గొప్పలు చెప్పుకోవడం కాదు...పిల్లల ఆలనాపాలనలో కొంచెం పాలుపంచుకోండి.పెళ్లాలకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. పేరెంట్ అంటే మీరు కూడా సార్! డోన్ట్ ఫర్గెట్!! పోస్ట్పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు - ప్రతిదానికి త్వరగా ఏడ్చేయడం - విపరీతంగా చికాకుపడటం - బాధపడటం - చిన్న విషయానికీ విసుగు చెందడం - ఆహారం సహించక పోవడం - నిద్ర లేకపోవడం - కుంగి పోవడం - అనవసర విషయాలకు ఆందోళన చెందడం - లైంగిక వాంఛ తగ్గడం - తప్పు చేసినట్టు భయపడటం - జీవితం శూన్యంగా అనిపించడం బిడ్డ ఏడిస్తే తల్లి ఆనందపడే ఏకైక సందర్భం- జననం. నిజమే! పుట్టిన వెంటనే బిడ్డ ఏడిస్తే తల్లికి ఆనందం. ఆ ఏడుపుతోనే పురిటినొప్పుల యాతనను మర్చిపోవాలి. కాని ఆ ఆనందం స్థానంలో చాలామంది అమ్మలు గుర్తు తెలియని గుబులును మనసులో నింపేసుకుంటున్నారు. వైరాగ్యంలోకి వెళుతున్నారు. శిశు స్వభావాన్ని అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు. అప్పటిదాకా ఆదమరిచి నిద్రపోయిన శిశువు సరిగ్గా ఆమె స్నానానికి వెళ్లగానే గుక్కపట్టి ఏడుస్తుంది. అన్నం తినడానికి కూచుంటే కాలకృత్యాలకు పోతుంది. పగలంతా పడుకుని అమ్మ కనురెప్ప మూతపడే సమయానికి ఆరున్నొక్క రాగం తీస్తుంది. కొత్తలో అమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ అందరూ అండగా ఉంటారు. కాని వాళ్లంతా వెళ్లి తల్లీ బిడ్డా మిగిలాక బేబీ కేరింగ్ బాలింతకు వ్యాకులత కలిగిస్తుంది. బిడ్డ ఏడిస్తే భయం. ఆ బిడ్డను వదిలేసి పారిపోవాలనే కోరిక. నేనొక్కదాన్నే కన్నానా? నాకే ఎందుకు ఇంత పని? పిల్లాడి పనిలో భర్తకు భాగం లేదా? అని మనసులో ఆగ్రహం. తనకు లేని నిద్ర భర్తకు ఎందుకు అనే కసి. ఈ కోపం, బాధ, దిగులు, గుబులు చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే నిస్సహాయతకు దారి తీస్తాయి. దానినే ‘బాలింత వ్యాకులత’ (పోస్ట్పార్టమ్ డిప్రెషన్) అంటారు. ఇది ఓ మానసిక రుగ్మత. కాని ఆ సంగతి చాలామంది తల్లులకు తెలియనే తెలియదు. దీనికి వైద్యం ఉంటుందనీ తెలియదు. కొన్నిచోట్లయితే బిడ్డ పడుకుని ఉంటేనే బాగుంది అని నల్లమందు ఇచ్చే అమాయకపు అమ్మలూ ఉన్నారు. బాలింత వ్యాకులత లేదా పోస్ట్పార్టమ్ డిప్రెషన్కి వర్గవిభేదాల్లేవ్. షైనీ ఆంటోనీ అందుకు చక్కటి ఉదాహరణ. షైనీ ఆంటొనీ.. పేరున్న షార్ట్ స్టోరీ రైటర్. చేతన్ భగత్ నవలలను ఎడిట్ చేసిన సంపాదకురాలు. ఉరకలేసే ఉత్సాహానికి మారుపేరులా ఉండే షైనీ తన తొలి బిడ్డకు జన్మనిచ్చాక ఒక్కసారిగా దిగాలు పడిపోయింది. తన జీవితమే తారుమారైపోయిందనే బెంగపెట్టుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా అంటారు- ‘ఇరవై నాలుగు గంటలూ చంటిబిడ్డ బాధ్యతలతో గడపడం వల్ల నిద్ర ఉండేది కాదు. దేనిమీదా ఆసక్తి కలిగేది కాదు. ఆ నిరాసక్తత బిడ్డ మీద ప్రభావం చూపేది. శ్రద్ధ పెట్టలేక పోయేదాన్ని. తొలిసారి తల్లి అయిన అనుభూతిని అనుక్షణం ఆస్వాదించాల్సింది పోయి తల్లి హోదాకే చిరాకు పడే స్థితికి చేరుకున్నాను. విసుగు. తెలియని గుబులు. నిర్లిప్తత! ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండేది. పిల్ల ఏడుస్తున్నా... అది ‘ఊ.. ఆ’ అంటూ ముచ్చట పెట్టడానికి ప్రయత్నించినా ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండకపోయేది. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిననే ఫీలింగ్. ఉన్నట్టుండి ఏడుపొచ్చేది. మెటర్నిటీ లీవ్ అయిపోయి ఆఫీస్కి వెళ్లాక చాలా రిలీఫ్గా అనిపించింది. నిజానికి చాలా మంది తల్లులు ఇంట్లో నెలల పసికందును వదిలి ఆఫీస్కి వెళ్తుంటే గిల్ట్గా ఫీలవుతారు. నేను మాత్రం హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. ఎన్ని గంటలైనా ఉత్సాహంగా పనిచేసేదాన్ని. ఇంట్లో చంటిబిడ్డ ఉంది.. ఇంటికి వెళ్లాలి అనే పర్మిషన్ ఏనాడూ అడగలేదు. ఆ ఆఫీసే లేకుంటే ఆ టైమ్లోనే నేనేమైపోయేదాన్నో’... బేర్ఫుట్ అండ్ ప్రెగ్నెంట్ షైనీ అనుభవించిన బాధను సైకియాట్రిక్ సొసైటీ ‘పోస్ట్పార్టమ్’ డిప్రెషన్ అంటుంది! వినడానికి చిన్న సమస్యలా ఉండొచ్చు. కానీ అనుభవిస్తున్న వారికి అదో నరకం. ఒక్కోసారి ఒళ్లో బిడ్డను చంపేయాలనుకునే విపరీతానికీ ఒడిగట్టొచ్చు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో దీని మీదున్న మౌనం వీడింది. దీన్నో ఆరోగ్య సమస్యగా గుర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడా ఆ నిశ్శబ్దం బద్దలవ్వాలి. తల్లులకు ముఖ్యంగా కొత్త అమ్మలకు ఈ సమస్యకు సంబంధించిన సమాచారాన్నివ్వాలి. సెలైన్స్.. చాలా పరిష్కారాలను పొట్టన పెట్టుకుంటుంది! నోరు విప్పితేనే పరిష్కారం దొరుకుతుంది! అలా సెలైన్స్లో సెటిల్ అయిన పోస్ట్పార్టమ్ డిప్రెషన్ని బ్రేక్ చేయడానికి షైనీ ఆంటోనీ ప్రయత్నించింది. తన అనుభవాలను ‘బేర్ఫుట్ అండ్ ప్రెగ్నెంట్’ అనే పేరుతో పుస్తకం రాసింది. కారణాలు బేబీ బ్లూస్ లేదా పోస్ట్పార్టమ్ బ్లూస్గా పిలిచే ఈ మానసిక స్థితికి హార్మోన్లదే ప్రధాన పాత్ర అని తేలుస్తున్నాయి కొన్ని అధ్యయనాలు. తల్లిలోని థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులే పోస్ట్పార్టమ్ డిప్రెషన్కి ముఖ్య కారణమని చెప్తున్నాయి. దీనికి తోడు గర్భవతిగా ఉన్నప్పుడు మాయ (ప్లాసెంటా) విడుదల చేసే స్ట్రెస్ హార్మోన్ కూడా డెలివరీ తర్వాత తల్లిలో డిప్రెషన్ని పెంచుతోందిట. అంతేకాదు.. గర్భవతిలో హెచ్చుస్థాయిలో పెరిగిన ఫీమేల్ హార్మోన్స్ డెలివరీ తర్వాత అత్యంత వేగంగా పడిపోవడమూ పోస్ట్పార్టమ్ డిప్రెషన్కి మరోకారణం అని భావిస్తున్నారు మానసిక వైద్యులు. ఎప్పుడు.. ఏంటి.. ఎలా? బిడ్డ పుట్టిన నెల నుంచి యేడాది తర్వాత వరకు ఎప్పుడైనా తల్లులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ‘టీన్స్లో తల్లులైన వాళ్లు, కుటుంబంలో డిప్రెషన్ హిస్టరీ ఉన్న వాళ్లు, ఫ్యామిలీ సపోర్ట్ లేనివాళ్లు, భర్తతో కలహాల కాపురం చేస్తున్న వాళ్లకు రిస్క్ ఎక్కువ’ అని చెప్తున్నారు బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సైకియాట్రిస్ట్ అండ్ న్యూరోసైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర నరేన్రావు. తల్లి పోస్ట్పార్టమ్ డిప్రెషన్ వల్ల బిడ్డ మానసిక స్థితి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. చివరకు వైవాహిక బంధమూ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. మాత్రలు.. కౌన్సెలింగ్ ద్వారా కొంత ఫలితం ఉంటుంది. అలాగే యోగా, ధ్యానం వల్ల కూడా అని చెప్తున్నారు నిపుణులు. ఎలాంటి వైద్యసహాయం పొందకుండా పోస్ట్నాటల్ డిప్రెషన్తో బాధపడుతున్న స్త్రీలు.. 49 శాతం మంది ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాకులతతో ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్న వాళ్లు 38 శాతమట! - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అవగాహన కావాలి.. కాన్పు తర్వాత తల్లులు ఎదుర్కొనే మానసిక సమస్యలపై ఇతర దేశాల్లో కంటే మన దగ్గర అవగాహన తక్కువనే చెప్పాలి. కాన్పు కారణంగా తల్లుల మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. కోపం, వ్యాకులత, బాధ లాంటి భావాలు ఎక్కువ అవడంతో వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. వాటి బారిన పడకుండా మన ఆడబిడ్డల్ని కాపాడుకోవాలంటే ప్రేమ పూర్వక ఇంటి వాతావరణం ఎంతో దోహద పడుతుంది. అలాంటి కేసుల్లో రెండు వారాలకే తల్లులకు ఈ మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. భర్త, అమ్మానాన్నలు, అత్తామామల నుంచి వారు పొందే ప్రేమ, అభిమానంతోనూ ఆ వ్యాకులత తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో అంతా బాగున్నా సరే తల్లులు పోస్పార్టమ్ బ్లూస్ బారిన పడొచ్చు. అప్పుడు వెంటనే వారిని డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. మన దేశంలో ఇప్పటికీ 60 శాతం నుంచి 70 శాతం మంది తల్లులకు దీనిపై అవగాహన లేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పశ్చిమ దేశాల్లో లాగే మన దగ్గరా చికిత్స, కౌన్సెలింగ్ కేంద్రాలున్నాయి. కానీ ఇక్కడ డాక్టర్లకంటే పేషంట్లు ఎక్కువ. పైగా మన దగ్గర దురదృష్టకర పరిస్థితి ఏంటంటే తల్లుల్లో పోస్ట్పార్టమ్ బ్లూస్ లక్షణాలు తీవ్రమయ్యాకే వాళ్లను మా దగ్గరకు తీసుకొస్తారు. అలా కాకుండా ముందు నుంచీ దీని మీద ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తే ఇలాంటి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై, సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, హైదరాబాద్ -
నా ప్రతి అడుగులో అమ్మ ఉంది..
‘శాంత బయోటెక్’ ఫౌండర్గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు.. ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి. ‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం. ‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ. ‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి. ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత. ‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత. ‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’ అమ్మా నీవే నేను నేనే నీవు నేను నీలో అంతర్భాగానిని నీవు నాలో అంతర్వాహినివి..! -
'అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు'
ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే... ‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అరగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ. విసుక్కునేది కాదు.. నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది. పూర్తి శాకాహారి.. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడు 84 ఏళ్లు.. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’. -
ప్రాణం నీవే పయనం నీవే
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం అమృతం కంటే కమ్మనైనది.. అనంతమైన ప్రేమ.. హద్దులు లేని వాత్సల్యం.. భూదేవికున్న ఓపిక ఎవరికుంటాయి..! ఒక్క అమ్మకు తప్ప. అందుకే దేవుడే ఆ ప్రేమ కోసం పరితపించాడు. బిడ్డ కడుపున పడ్డాక.. నెలలు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న బరువును ఓపికగా మోస్తుంది. చీకటి గర్భంలోని కదలికలను చేతితో తడుముకుంటూ రంగుల కలను కంటుంది. నేలపై పడ్డ బుజ్జి పాపాయికి లోకాన్ని పరిచయం చేస్తుంది. అందుకే అమ్మ దేవుడికన్నా మిన్న. -
మై మామ్.. మై లవ్
అమ్మ కోసం... నేను సైతం... అంటున్న యువత ఒక్క ‘థ్యాంక్స్’తో సంతోషాన్నివ్వచ్చంటున్న సర్వే ఇటీవల పి అండ్ జి సంస్థ ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో తల్లి ఆశిస్తోంది పిల్లల నుంచి చిన్న కృతజ్ఞతా పూర్వకమైన మాటేనని, తల్లి చేసే సేవలకి థ్యాంక్స్ చెప్తున్నవారి కంటే చెప్పనివారే ఎక్కువని తేలింది. జన్మ అనే గొప్ప వరాన్ని అందించిన మాతృమూర్తికి ఇష్టమైనవో, కోరుకున్నవో ఇచ్చి సంతోషపెడుతున్నవారు మరీ తక్కువగా 30 శాతానికి మించి లేరట. జన్మనివ్వడంతో పాటు ఫ్రెండ్ నుంచి గైడ్ దాకా మనకు అనువుగా తనను తాను మార్పు చేర్పులకు గురిచేసుకుంటూ, ప్రతి నిమిషం మనకోసమే ఒళ్లంతా కళ్లుచేసుకుని, మనల్ని కళ్లారా కాచుకుంటున్న అమ్మ కోసం ఏదైనా చేద్దాం. మదర్స్డే సందర్భంగా అమ్మ కళ్లల్లో ఆనందం కోసం నిరంతరం తపిస్తూ... ఆమె సంతోషమే తమకు సగం బలం అనీ, తమ విజయాలకు మూలం అని నమ్ముతున్న వ్యక్తుల గురించి ‘మదర్స్డే స్పెషల్’లో... -సాక్షి, లైఫ్స్టైల్ప్రతినిధి ‘శాంత బయోటెక్’ ఫౌండర్గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు.. ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి. ‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ. ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత. ‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత. ‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం. ‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి. ‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ. విసుక్కునేది కాదు.. నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది. పూర్తి శాకాహారి.. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడు 84 ఏళ్లు.. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’. ఎంత ఓపికో.. ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే... ‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ ‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్లో చేరారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది. వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’. - గోరుకంటి రవీందర్రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్ ‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’ అమ్మా నీవే నేను నేనే నీవు నేను నీలో అంతర్భాగానిని నీవు నాలో అంతర్వాహినివి..! - వరప్రసాద్ రెడ్డి నాన్న జ్ఞాపకాలతో కుంగిపోకుండా... మా అమ్మగారు మనోహరం(60). ఒకప్పుడు టీచర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మా నాన్నతో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అమ్మకి. సడెన్గా ఫాదర్ త్రీ ఇయర్స్ బ్యాక్ హార్ట్ ఎటాక్తో చనిపోయారు. ఫాదర్ చనిపోయిన షాక్తో ఉన్న అమ్మ కోసం 6 నెలల పాటు అన్ని పనులూ మానేశా. చెన్నై రీ రికార్డింగ్ వెళితే అక్కడికి తీసుకెళ్లేవాడ్ని. అయితే ఎన్ని చేసినా అమ్మ పూర్తిగా రికవర్ కావడం లేదనిపించి... మా ఇంటికి దగ్గర్లో ఉన్న చిన్నపిల్లల గార్మెంట్స్ షాప్ సేల్కి ఉంటే కొనేశాను. ఆ షాప్ బాధ్యతలు అమ్మకు అప్పజెప్పాను. నిజానికి నాకు బిజినెస్ అంటే ఏమిటో అసలు తెలీదు. అయితే నాకు తెలుసు అమ్మ ఏదైనా బాధ్యత అప్పజెపితే అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుందని, 100 శాతం ఎఫర్ట్ పెడుతుందని. నేననుకున్నట్టే, ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక...నాన్న జ్ఞాపకాల నుంచి అమ్మ బాగా తేరుకుందని అనిపించాక, ఆ షాప్ మా బంధువులకు ఇచ్చేసి అమ్మని ఆ బాధ్యతల నుంచి తప్పించాను. నా ఫస్ట్ ఫిలిమ్ జై నుంచి నా గురించి వచ్చిన అన్ని మీడియా ఇంటర్వ్యూలను, వార్తలను కలెక్ట్ చేసి 3 ఆల్బమ్స్గా చేసి నా బర్త్డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది అమ్మ. కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అమ్మకి ఏసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. ప్రేయర్ చేస్తుంటుంది. నేనే చర్చిలకు తీసుకెళుతుంటాను. . నేను క్రీస్తు ఆల్బమ్స్ చేసిన వెంటనే తొలిశ్రోత అమ్మే. కల్వరి ఆల్బమ్స్ చేసినప్పుడు మా ఇంట్లోనే కంపోజ్ చేసేవాడ్ని. మా అమ్మగారికి వినిపించేవాడిని. అయితే మనం ఎన్ని చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం అని నాకు తెలుసు. అమ్మ త్యాగానికి సాటి లేదు. అమ్మ చేసే సేవకు సాటిరాదు. - అనూప్రూబెన్స్, సంగీత దర్శకుడు ఫిట్నెస్ రొటీన్ అలవాటు చేశా... నేను సీనియర్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. మా మమ్మీ సుచిత్ర నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా లక్కీ. తను ఏదీ ఎప్పుడూ ఆర్డర్స్ వేయదు. గైడ్ చేస్తుంటుందంతే. ఒక స్నేహితురాలిలా నాతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. నాకోసం వెతికి వెతికి అన్నింటికన్నా బెస్ట్ నాకు ఇస్తుంటుంది. నా కోసం తను ఏం చేయదు? అని అడిగితే అసలు ఏం చెప్పాలో తెలీనంత చేస్తుంది. అంత చేసే అమ్మ కోసం నేను కూడా ఏదైనా చేయాలనిపిస్తుంటుంది. తను టీచర్గా పనిచేస్తుంది. స్కూల్లో అలసిపోయి వచ్చినట్టు అనిపిస్తే వెంటనే షాపింగ్కో, లాంగ్డ్రైవ్కో తీసుకెళతాను. తను రిలాక్స్ అయ్యేలా చేస్తాను. వంట పనిని నేను కూడా తరచుగా షేర్ చేసుకుంటాను. మిడల్ ఏజ్లో ఎక్సర్సైజ్ కంపల్సరీ కదా... అందుకే మమ్మీని జిమ్కి అలవాటు చేశాను. ఈవెనింగ్ 7 నుంచి 8 గంటల మద్యలో ఇద్దరం కలిసే జిమ్కి వెళతాం. నేను ఎక్కువగా ఎరోబిక్స్ చేస్తాను. మమ్మీ బాడీ కండిషనింగ్, పర్సనల్ ట్రైనింగ్తో వర్కవుట్స్ చేస్తుంది. అమ్మ నాతో అన్నీ చెబుతుంది. నేను కూడా తనతో అన్నీ దాచుకోకుండా చెప్తాను. ప్రతి రోజు ఆ రోజులో జరిగినవన్నీ షేర్ చేసుకుంటాం. బైక్ మీద రౌండ్స్ తీసుకెళుతుంటే చిన్నపిల్లలా సరదా పడుతుంది. - క్లారా ఇషిత... పాడమని ప్రోత్సహించా... నాకు జీవితంలో లభించినవన్నీ అమ్మ సప్నాదాస్ వల్లే. ఎలా మాట్లాడాలి? ఎలా తినాలి? ఎలా మసలుకోవాలి..అన్నీ నేర్పింది అమ్మే. లైఫ్ని లీడ్ చేయడానికి అన్ని రకాల కాన్ఫిడెన్స్ ఇచ్చింది అమ్మే. చాలా విషయాల్లో మా ఇద్దరికీ ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కాని చివరికి ఆమె చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పనీ నాకోసమే అని అర్ధమవుతుంటుంది. అన్నీ అందించిన అమ్మకి ఏవేవో ఇవ్వాలని అనిపిస్తుంది. అయితే తను గిఫ్ట్స్వద్దంటుంది. అందుకని ఖాళీ దొరికినప్పుడు, ఏ మాత్రం సమయం చిక్కినా తనతోనే స్పెండ్ చేస్తున్నా. అయినా అది సరిపోదు కదా... ఆమెకు ఆనందం కలిగించేవి ఏమిటా అని పరిశీలిస్తూ వచ్చా... ఆమెకు పాడడం అంటే బాగా ఇష్టం అని గ్రహించా. దాంతో పాడమంటూ ఎంకరేజ్ చేయడం ప్రారంభించా. అమ్మ చాలా బాగా పాడుతుంది. మీకు తెలుసా? ఇప్పుడు తను స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తోంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడంలో నేనూ పాలు పంచుకుంటున్నా. తనకున్న ఓ మంచి అభిరుచి తీర్చుకోవడానికి నేను ఒక కారణం కావడం నాకెంతో సంతోషాన్ని అందిస్తోంది. - శ్రద్ధాదాస్, సినీనటి డ్యాన్స్ అలవాటు చేశా... నేను లెవెన్త్ స్టాండర్డ్ చదువుతున్నా. మమ్మీ (కిరణ్ డెంబ్లా) పెద్ద ఫిట్నెస్ ప్రీక్ అని సిటీ మొత్తానికి తెలిసిందే. ఆమె ఎప్పుడూ వర్కవుట్స్, ట్రైనింగ్స్ అని స్ట్రెయిన్ అవుతుంటుంది కదా... నాకేమో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తనకు వండర్ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వాలంటే డ్యాన్స్లో ఉన్న కిక్ టేస్ట్ చేయించాల్సిందే అనిపించింది. అందుకే నాతో పాటు తనను మాదాపూర్లోని డ్యాన్స్ స్కూల్కి తీసుకెళుతున్నా. ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తాం. మమ్మీతో ఉంటే ఒక ఫ్రెండ్తో ఉన్నట్టే ఉంటుంది. తనతో నన్ను అన్ని పార్టీలకు, ఈవెంట్స్కి తీసుకెళుతుంటుంది. వయసులో చిన్న అనీ, నాకేమీ తెలియదనీ తీసిపారేయకుండా నా ఆలోచనలకి ఇష్టాఇష్టాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే తన కోసం, తన సంతోషం కోసం ఏదైనా చేయాలని నేనూ రోజూ ప్లాన్ చేస్తుంటా. కేవలం ఒక్క రోజే కాదు. ప్రతి రోజూ నాకు మదర్స్డేనే. - ప్రియాంక వండి వడ్డిస్తా... మా మమ్మీ (సుశీల బొకాడియా)కి సోషల్ యాక్టివిటీస్ ఎక్కువుంటాయి. అటు ఇంటిపని, ఇటు సోషల్ వర్క్తో చాలా టైర్డ్ అవుతుంటుంది. అందుకే తను ఇంటికి వచ్చి రెస్ట్లెస్గా ఫీలైనా... హ్యాపీ మూడ్లోకి తేవడానికి ట్రై చేస్తా. దీని కోసం తరచుగా నా పర్సనల్ వర్క్ కూడా పక్కన బెట్టేస్తా. డాడీ బిజినెస్లో బిజీగా ఉంటే నన్ను, తమ్ముడ్ని మమ్మీ ఎంత కేర్ఫుల్గా చూసుకుందో నాకు తెలుసు. తనను హ్యాపీగా ఉంచడం మా బాధ్యత. నాకు కుకింగ్ వచ్చు. తమ్ముడి హెల్ప్ తీసుకుని తరచుగా తనకు ఇష్టమైన వంటలు స్వయంగా వండి వడ్డిస్తా. అప్పుడు మమ్మీ ఫేస్లో చెప్పలేనంత ఆనందం. అది చూస్తే నాకెంత హ్యాపీ అనిపిస్తుందో... ఎప్పుడైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ తెచ్చిస్తే... ‘‘ఎందుకురా ఇవన్నీ’’ అంటూ చిన్నగా కోప్పడుతుంది. తమ్ముడు, నేను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవడం ఒక్కటే తనకు మేమిచ్చే అత్యుత్తమ బహుమతి అని నాకు తెలుసు. అది మేమెలాగూ ఇస్తాం కూడా. - రౌనత్ -
మా ( ...అమ్మ
ఉత్తర భారతంలో మాఁ అన్నా.. దక్షిణ భారతంలో అమ్మా అన్నా ఆ తల్లి పంచేది ప్రేమే.. అది రుచి చూసిన ఎవరికైనా ఆమె మాఁ.. అమ్మ! అలా జోధ్పుర్ కుర్రాడికి తమిళ అమ్మ మాఁ అయింది. తమిళబ్బాయికి జోధ్పుర్ మాఁ అమ్మయింది. ఈ అనుబంధానికి కనెక్షన్ మదర్ ఎక్స్ఛేంజ్ అయ్యింది. దేవుడు తానన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు. కాని అమ్మ లేని చోట ఇంకో అమ్మ ఆదరణను పొందవచ్చని చెబుతోంది ‘మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’. రాజస్థాన్.. జోధ్పుర్లోని మంజు భాటి వాళ్లింట్లో ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మంజుకి ‘హలో మంజూజీ?’ అన్న స్త్రీ గొంతు వినిపించింది. ‘జీ.. ఆప్?’ మంజు ప్రశ్న. ‘మై నేమ్ ఈజ్ ఐశ్వర్య.. కాలింగ్ ఫ్రమ్ చెన్నై’ అవతలి నుంచి సమాధానం. ‘మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ జోధ్..’ అని ఐశ్వర్య తన సంభాషణను కొనసాగించబోతుంటే ‘నో ఇంగ్లిష్.. ఓన్లీ హిందీ’.. మంజు రిక్వెస్ట్. ‘ఓకే... మై హిందీ తోడా కుఛ్ జాన్తీ హు..’ అంటూ ఐశ్వర్య వచ్చీరాని హిందీలో, తమిళయాసతో జోధ్పుర్ ఐఐటీలో చదువుతున్న తన కొడుకు సంతోష్ గురించి చెప్పింది. అలాగే చైన్నైలో చదువుతున్న తన కొడుకు వివేక్ భాటి గురించి మంజు చెప్పింది. అలా ఆ ఇద్దరి అమ్మల మధ్య స్నేహం కుదిరింది. (ఈ విడియోను యూట్యూబ్లో చూడొచ్చు ‘మా కా ప్యార్.. ఘర్ కా ఖానా’ పేరుతో). వాళ్ల అబ్బాయిలెలా ఉన్నారంటే.. బెంగతో చదువు భంగం.. సంతోష్, వివేక్ భాటీలిద్దరినీ హాస్టల్ తిండి ఇబ్బంది పెడుతోంది. చెన్నై సాంబార్, చావల్.. వివేక్ భాటీ కడుపు నింపలేక పోతోంది. అమ్మ చేసే పరాఠాలను మరిపించలేక పోతోంది. సంతోష్దీ అదే పరిస్థితి. అమ్మ చేసే సాంబార్ ఘుమఘుమల ముందు ఆలూకుర్మా చిన్నబోతోంది. అతని పరాఠాలను అన్నంలా ఆస్వాదించలేకపోతున్నాడు. చదువు మీదకన్నా అమ్మ మీదకే వెళ్తోంది మనసు. సంతోష్ వాళ్లమ్మ ఐశ్వర్య, వివేక్ భాటీ వాళ్లమ్మ మంజుది కూడా ఇదే బాధ... పిల్లలు సరిగ్గా తినడంలేదు, ఎలా ఉంటున్నారో ఏమో అని. దీనికో పరిష్కారం దొరికితే బాగుండని అనుకుంటున్న సమయంలోనే తెలిసింది వీళ్లకు ‘అడానీ విల్మర్’ ప్రారంభించిన మదర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ గురించి. మదర్ ఎక్స్ఛేంజ్ మదర్ఎక్స్ఛేంజ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈ ప్రోగ్రామ్లో తమ పేర్లను రిజిష్టర్ చేయించుకోవాలని తెలుసుకున్నారు. చేయించుకున్నారు. జోధ్పుర్లో ఉన్న ‘అమ్మ’ కోసం ఐశ్వర్య వెదికితే.. చెన్నైలో ఉన్న ‘మా’ కోసం మంజు వెదికింది. ఇద్దరికి ఇద్దరు తారస పడ్డారు. అలా ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. తన కొడుక్కి ఇష్టమైన వంటల గురించి ఐశ్వర్య చెపితే.. వాళ్లబ్బాయి నచ్చిన మెచ్చిన మెనూ గురించి మంజు చెప్పింది. రెసీపీలూ తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకున్నారిద్దరూ. ఓ మంచి మధ్యాహ్నం పరాఠా, కూర్మాలతో లంచ్బాక్స్ వెళ్లింది వివేక్ భాటీ క్యాంపస్కి. సాంబార్, అన్నంతో అటు సంతోష్కీ భోజనం అందింది. పిల్లల కళ్లలో ఆశ్చర్యం..అచ్చు అమ్మ చేతి రుచే.. మనసులో తడి.. తలతిప్పి చూస్తే వివేక్ భాటీ ముందు ఐశ్వర్య.. సంతోష్ ముందు మంజు.. ‘మా అమ్మలు’గా! మా కా ప్యార్.. ఘర్ కా ఖానా.. ఈ ప్రోగ్రామ్కి బాగానే రెస్పాన్స్ వస్తోంది. చదువు కోసం ఉన్న ఊరును వదిలి పరాయి సిటీలకు వెళ్లిన పిల్లలకు తల్లి చేతి వంటతోపాటు ఆమె ఆదరణనూ ఇంకో అమ్మతో పంచుతున్నారు. ఇందులో చేరాలనుకునే తల్లులు తమ పేరు, ఫోన్ నంబరు, ఊరు వంటి వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిష్టర్ అయిన మదర్స్ అందరూ ఆ జాబితా ప్రకారం తమ పిల్లలు ఉన్న ఊళ్లో వాళ్లకు నచ్చిన అమ్మకు ఫోన్చేస్తారు. పరిచయం అయ్యాక వివరాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అలా ఇద్దరి మధ్య ముందు స్నేహం కుదురుతుంది. తర్వాత పిల్లల ఇష్టాయిష్టాలు, అభిరుచులు పంచుకుంటారు. ఏఏ కూరలంటే ఇష్టమో.. ఎలా చేస్తే తింటారో తెలుసుకుంటారు. వాటిని ఎలా వండాలో నేర్చుకుంటారు.. ఇవన్నీ ఫోన్ ద్వారే! పిల్లలకు ఇష్టమైన వంటను క్యారియర్లో పెట్టుకొని వాళ్లున్న హాస్టల్కు వెళ్తారు. దగ్గరుండి వడ్డిస్తారు. సొంత తల్లిలా మంచిచెడులను విచారిస్తారు. సెలవల్లో తమ కుటుంబంతో గడపడానికి ఇంటికి ఆహ్వానిస్తారు. సొంతింటికి వెళ్లిన భావనను పిల్లలకు కలిగిస్తారు. ఇదీ మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ అందిస్తున్న ‘మా కా ప్యార్.. ఘర్ కా ఖానా’! - సరస్వతి రమ సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి హ్యాపీగా ఉంది.. మాది విజయవాడ. మూడేళ్ల కిందట హైదరాబాద్కి వచ్చాను. జావా డెవలపర్గా ఉద్యోగం. ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అమ్మ చెప్పిన ఒకే ఒక మాట... ‘వేళకు భోజనం చెయ్యి’ అని. ఊళ్లో ఉన్నప్పుడు ‘తిను తిను’అని అమ్మ వెంటపడ్తుంటే విసుగనిపించేది. ఇప్పుడు ఆ విసుగు కావాలనుకున్నా దొరకట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా తిన్నావా? అంటూ మొదలుపెడ్తుంది సంబాషణని. ఆ ప్రేమకు మొహం వాచినట్టే ఉంటోంది. ఊరెళ్లి వచ్చాకైతే కొన్ని రోజుల వరకు ఆ బెంగ తగ్గదు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వల్ల దొరుకుతోందంటే హ్యాపీగా ఉంది. - రావెళ్ల స్వాతి, హైదరాబాద్ నాలాంటి వాళ్ల కోసమే.. నా కొడుకు హర్ష రెండేళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. తింటున్నప్పుడల్లా కాల్ చేస్తాడు.. ‘ఏం వండావమ్మా.. ఈ హాస్టల్ తిండి తినలేకపోతున్నా’ అని. వాడు! అలా బాధపడుతూంటే నాకిక్కడ ముద్ద దిగదు. వాడికి ఇష్టమైన వంటకం చేసినప్పుడల్లా ఎంత గుర్తొస్తాడో! అక్కడ నా కొడుకుకి ఇష్టమైనవి వండిపెట్టి, ధైర్యం చెప్పే ఆత్మీయులుంటే ఎంతబాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో! మదర్స్ ఎక్స్ఛేంజ్ గురించి తెలిసింది. నాలాంటి వాళ్లకోసమే పెట్టారేమో అనిపిస్తోంది. - కె. శైలజ, ఉద్యోగిని, హైదరాబాద్ వీళ్లకు వరమే... పదిహేనేళ్ల నుంచి ఆడపిల్లల హాస్టల్ను రన్ చేస్తున్నాను. వయసు నిమిత్తం లేకుండా అందరికీ అమ్మ మీద బెంగే. మా వంట ఎంతబాగున్నా ‘మా అమ్మయితే ఇంకా బాగా చేస్తారనే’ కామెంటే. అన్నిటికీ వాళ్లమ్మల తారీఫ్లే. ఒక్కోసారి కోపం వస్తుంది.. కానీ చాలాసార్లు బాధేస్తుంటుంది పాపం పిల్లలు అని. మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వీళ్లకు వరమే కానీ మాలాంటి వాళ్ల బిజినెస్కి దెబ్బే (నవ్వుతూ). - ఎన్. ఉషారాణి, హైదరాబాద్ -
అన్నింటా అమ్మ ఉంటే.. !
ఈ లోకంలో అడుగుపెట్టిన ఏ బిడ్డకైనా అమ్మతోడిదే తొలి బంధం. అమ్మే తొలి నేస్తం. అమ్మే తొలి గురువు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలోంచి ఓ కొత్త కోణాన్ని వెలికి తీశారు కొందరు పరిశోధకులు. పిల్లలు, వారి ప్రవర్తన, వారిలోని నైపుణ్యాలపై ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో, తల్లి తమ పక్కనే ఉన్నప్పుడు పిల్లలు ఎంతో చురుకుగా ఉంటారని తేలింది. కొందరు పిల్లలకు పాఠ్యాంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఆపైన వారిని తమకు నచ్చిన పని చేయమని కూడా చెప్పడంతో బొమ్మలు గీయడం, ఏవో వస్తువులు తయారు చేయడం, ఇలా తమకు తోచిన పనులు చేశారు. అదే పిల్లల్ని తమ తల్లులతో కలిపి కూర్చోబెట్టి మళ్లీ అవన్నీ చేయమంటే... మొదటిసారి అంతంతమాత్రంగా ప్రతిభ చూపినవాళ్లు కూడా చక్కటి ప్రతిభను ప్రదర్శించారట. దాంతో తల్లి దగ్గరగా ఉంటే పిల్లలు అన్నింటిలో రాణిస్తారని నిర్థారిం చేశారు పరిశోధకులు. అర్థమైంది కదా! కేవలం వండి పెట్టడం, తయారుచేసి స్కూలుకు పంపడం చేస్తే సరి పోదు. వారు చేసే ప్రతి పనిలోనూ తల్లి బాధ్యత పంచు కోవాలి. అప్పుడు వాళ్లు అన్నింట్లో ముందుంటారు! -
విమెన్స్ రోజు వేడుకలు
సాక్షి ఫ్యామిలీ అందిస్తోంది మార్చి 8 మహిళ పురస్కారాలు మీ ఎంట్రీలు పంపడానికి గడువు తేదీ జనవరి 31 4 కేటగిరీలలో 8 అవార్డులు అమ్మ అమృతమూర్తి ప్రతి అమ్మ బెస్ట్ మదరే. అయితే మీకు తెలిసిన బెస్ట్ మదర్ ఎవరో మాకు రాసి పంపండి. మీ సొంత మదర్ అయినా పర్వాలేదు. కానీ ఎందుకు బెస్ట్ మదరో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి. అర్ధాంగి జీవన సహచరి మీ జీవిత భాగస్వామిని మీరు మీ బెస్ట్ బెటర్ హాఫ్ అనుకుంటున్నారా? అయితే ఆవిడ ఎందుకు అంత బెస్ట్ అయ్యారో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి. యువతి శక్తి స్వరూపిణి మీ కాలేజీలోనైనా, మీ చుట్టు పక్కలైనా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన యువతి ఉన్నారా? ఉంటే ఆ యువతి ఎవరో, ఆ సాహసం ఏమిటో మాకు రాసి పంపండి. మహిళారైతు భూదేవి మీ ప్రాంతంలో ఆదర్శప్రాయురాలైన మహిళా రైతు ఉన్నారా? ఆమె గురించి రాస్తూ, ఎందుకు ఆదర్శమయ్యారో రాసి పంపండి. సూచనలు: ఈ నాలుగు కేటగిరీలలో మీరు దేనిలోనైనా పాల్గొనవచ్చు. (2వ కేటగిరీలో భర్త మాత్రమే పాల్గొనాలి. రుజువుగా భార్యాభర్తలు కలిసి దిగిన ఫొటోను పంపించాలి. నిర్థారణ కోసం దంపతుల ఇద్దరి ఫోన్ నెంబర్లను ఇవ్వాలి.) గడువులోపు వచ్చిన ఎంట్రీలన్నిటినీ పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత పొందిన వాటిలో కేటగిరీకి 8 చొప్పున ఎంపిక చేసి, మొదట వాటిని ఫ్యామిలీలో ప్రచురిస్తాం. ఆ 8 మందిలో ఇద్దరిని ప్రత్యేక జ్యూరీ ద్వారా అవార్డుకు ఎంపిక చేస్తాం. అలా నాలుగు కేటగిరీలలో ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటిస్తాం. వారిని మార్చి 8న హైదరాబాదులో సాక్షి సన్మానిస్తుంది. అవార్డులను బహుకరిస్తుంది. ఎవరి గురించి రాస్తున్నారో వారి ఫొటో తప్పనిసరిగా పంపాలి. ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, ‘ఫ్యామిలీ’, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500 034. e-mail: march8family@gmail.com -
కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి
వికారాబాద్: అప్పుడే పుట్టిన ఆడ శిశువు గొంతును కన్నతల్లి నులిమి చంపేసింది. ఆ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని ఉందూరు తండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది కన్నతల్లి కవితని నిలదీశారు. ఇప్పటికే రెండు సార్లు ఆడపిల్లలు జన్మించారని... మరోసారి కూడా ఆడపిల్ల జన్మించిందని కవిత తెలిపింది. అదికాక కుటుంబంలో కూడా ఒత్తిడి అధికమైన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె ఆసుపత్రి సిబ్బంది వద్ద తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శనివారం సాయంత్రం ఆడ శిశువు జన్మించిందని ఆ సమయంలో తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే రాత్రి శిశువును పరీక్షించగా చనిపోయినట్లు గ్రహించామని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దాంతో కన్నతల్లి కవితను ఆసుపత్రి సిబ్బంది నిలదీశారు. -
అవతలివాళ్ళకు కష్టం వచ్చిందంటే... అమ్మే మొక్కుకొనేది!
సూర్యకాంతం... సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. విచిత్రమైన మాటవిరుపు, విసురైన చేతి వాటంతో తెరపై గయ్యాళితనం వెలిగించిన నట సూర్యమణి ఆమె. సూర్యకాంతమనే పేరే గయ్యాళి తనానికి మారుపేరన్నంత పేరు తెచ్చిన ఆమె నిజజీవితంలో ఆ స్క్రీన్ ఇమేజ్కు పూర్తి భిన్నంగా శాంతమూర్తి. ఆపదలో ఉన్నవాళ్ళెవరైనా సరే వాళ్ళ కోసం దేవుడికి మొక్కే ప్రేమమూర్తి. అందరికీ వండి వడ్డించే మాతృమూర్తి. మరి, ‘పొన్నాడ’ వారి ఇంట పుట్టి, ‘పెద్దిభొట్ల’ వారింట మెట్టి, అక్క కొడుకునైన తననే సొంత కొడుకుగా పెంచుకున్న ‘అమ్మ’ గురించి ఆమె దత్తపుత్రుడు ఏమంటారు? ఇవాళ సూర్యకాంతం 90వ జయంతి సందర్భంగా, మునుపెన్నడూ పత్రికల్లోకి ఎక్కని మాజీ బ్యాంకు ఉద్యోగి, హోమియో డాక్టర్ దిట్టకవి అనంత పద్మనాభమూర్తి ‘అమ్మ’ గురించి ఆత్మీయంగా పంచుకున్న ముచ్చట్లు... మా అమ్మ సూర్యకాంతం నిజానికి నాకు స్వయానా పిన్ని. నన్ను దత్తత తీసుకొని, కన్నబిడ్డలా పెంచి, పిన్నే నాకు అమ్మ అయింది. అమ్మ పుట్టింది ఇప్పటికి సరిగ్గా 90 ఏళ్ళ క్రితం. కాకినాడకు 8 కిలోమీటర్ల దూరంలోని వెంకట కృష్ణరాయ పురంలో. తాతయ్య పొన్నాడ అనంతరామయ్య ఆ ఊరికి కరణం. మా అమ్మమ్మ (వెంకట రత్నం), తాతయ్యలకు అమ్మ సూర్యకాంతం 14వ సంతానం. ఆ 14 మందిలో మిగిలింది నలుగురే! మూడో బిడ్డ నాకు జన్మనిచ్చిన తల్లి సత్యవతి అయితే, కడగొట్టు బిడ్డ - అమ్మ సూర్యకాంతం. మా తాతయ్య జ్ఞాపకంగా నాకు అనంత పద్మనాభమూర్తి అని అమ్మ పేరు పెట్టింది. అందుకే పేరుతో కాకుండా, ‘నాన్నా’ అనే పిలిచేది. నా కన్నతల్లి వారింటి పేరు నిలపడం కోసం నాకు ‘దిట్టకవి’ అనే ఇంటిపేరే కొనసాగించింది. మద్రాసు బండిలో... అమ్మ, అమ్మమ్మ అమ్మ సినిమాల్లోకి రావడం గమ్మత్తుగా జరిగింది. అమ్మకు ఆరేడేళ్ళ వయసులోనే తాతయ్య చనిపోయారు. దాంతో, కొన్నాళ్ళు కాకినాడలో తన పెద్దక్క, బావల దగ్గర అమ్మ పెరిగింది. అయితే, చదువు ఒంటబట్టలేదు. చిన్నతనంలో అమ్మ కొద్దిగా పెంకి. పృథ్వీరాజ్ కపూర్ హిందీ చిత్రాలంటే తగని పిచ్చి. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి హిందీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పుడే సినిమాల మీద మక్కువ కలిగింది. చివరకు పెద్దక్క ఒప్పుకోకున్నా, అమ్మ, ఆమె వెంటే మా అమ్మమ్మ మద్రాస్కు బండెక్కే శారట. ‘నారద నారది’ (1946) అమ్మ తొలి సినిమా. గమ్మత్తేమిటంటే, అమ్మ మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకున్నా, సినీ రంగంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే క్యారెక్టర్ వేషాల వైపు మళ్ళారు. దానికి ఓ కారణం ఉంది. మద్రాసులో అమ్మ ఒకసారి రోడ్డు మీద వెళుతుంటే, ఓ యాక్సిడెంట్ జరిగింది. ముక్కు మీద మచ్చ పడింది. అది క్లోజప్లో తెలిసిపోతుందని గ్రహించి, నాయిక పాత్రలకు దూరంగా ఉన్నానని అమ్మే స్వయంగా చెప్పింది. అంతకు ముందు ఎన్నో పాత్రలతో పేరు తెచ్చుకున్నా ‘గుండమ్మ కథ’ (’62) నుంచి ‘సూర్యకాంతం శకం’ ఆరంభమైందని అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభ చివరి దాకా కొనసాగింది. భానుమతికి ‘సూర్యం’... అంజలీదేవికి ‘అమ్మ’ సినీ రంగంలోని తోటి నటీనటులందరికీ అమ్మంటే ప్రాణం. తొలి రోజుల నుంచి నటి భానుమతి గారికి అమ్మతో మహా దోస్తీ. ఆవిడ కష్టసుఖాలు ఈవిడకీ, ఈవిడ కష్టసుఖాలు ఆవిడకీ చెప్పుకొనేవారు. అంత ఆంతరంగికులు. భానుమతి గారు అమ్మను ‘సూర్యం’ అని పిలిచేవారు. అలాగే, అంజలీ దేవి అమ్మను సాక్షాత్తూ కన్నతల్లిగా భావించేవారు. తెర మీద ఇద్దరూ ప్రత్యర్థుల్లా కొట్టుకున్నట్లు కనిపించినా ఛాయాదేవి, అమ్మ మంచి స్నేహితులు. మా ఇంట్లో శుభ కార్యాలన్నిటికీ ఆమె వచ్చేవారు. ఇక, కాంచన, గీతాంజలి, రమాప్రభ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. రాధాకుమారి అయితే వారానికి ఒకసారి అమ్మను కలవాల్సిందే. పండుగ, పబ్బం ఏదొచ్చినా తోటి నటులకు అమ్మ ఉండాల్సిందే. నటి - మాజీ ముఖ్య మంత్రి జయలలిత తల్లి సంధ్యతో అమ్మకు సాన్నిహిత్యం. తెరపై గయ్యాళి భార్య... ఇంట్లో నాన్నకు అనుకూలవతి నాన్న గారు పెద్దిభొట్ల చలపతిరావు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. మద్రాసుకొచ్చి, హైకోర్ట్లో వకీలుగా స్థిర పడ్డారు. ప్రసిద్ధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీగల్ అడ్వైజర్. ఆయనకు నాటకాలన్నా, పద్యాలన్నా తగని ప్రేమ. పద్యాలు బాగా పాడేవారు. ఆ కళాభిరుచితోనే 1950లో అమ్మను ద్వితీయ కళత్రంగా చేసుకున్నారు. తెరపై గయ్యాళి భార్యగా కనిపించే అమ్మ, జీవితంలో భర్త మనసెరిగి ప్రవర్తించే అనుకూలవతైన ఇల్లాలు. నాన్న కూడా అమ్మ మీద ఎప్పుడూ ఎలాంటి షరతులూ పెట్టలేదు. సినిమా వాతావరణం, ఆ భేషజాలు ఇంట్లో ఎక్కడా ఉండేవి కాదు. సాదా మధ్యతరగతి జీవితాన్నే అమ్మ ప్రేమించింది. వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి, రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే నన్ను దత్తత తీసుకున్నారు. వారి బిడ్డగా పెరగడం అదృష్టం. కుటుంబ సభ్యుల మీద అమ్మకెంత ప్రేమంటే, రాత్రి నిద్ర మధ్యలో లేచినప్పుడు ఒక్కసారి అందరినీ చూసొచ్చి కానీ పడుకొనేది కాదు. ఆ అలవాటే నాకూ వచ్చింది. విపరీతమైన భక్తి... విచిత్రమైన మొక్కులు అమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలు చేస్తుండేది. రోజూ తెల్లవారుజామున 4.30 కల్లా లేచి, స్నానాదికాలు ముగించుకొని, లక్ష్మీదేవికీ, వెంకన్నకీ ఓ అరగంట పూజ చేసి, అన్నపూర్ణాదేవికి పాలు నైవేద్యం పెట్టిన తరువాత కానీ బయటకు వెళ్ళేది కాదు. ఉదయం 7.30 కల్లా వంట చేసేసి, షూటింగ్కు వెళ్ళేది. తిరుమలలో అమ్మ పేరు మీద కాటేజీ ఉంది. రెండు నెలలకోసారి తిరు మల వెళ్ళాల్సిందే! అలాగే, సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ గుడి అంటే అమ్మకు మహాభక్తి. నెలనెలా వెళ్ళాల్సిందే! అప్పట్లో ఆ గుడి ఇంత ప్రాచుర్యం పొందలేదు, పెద్దదీ కాలేదు. చిన్న గుడి, బయటకు ఓపెన్గా ఉండేది. వచ్చే పోయేవారి కోసం అక్కడ గుడి పక్కనే గది కట్టించి, వసతులు కల్పించింది. అలాగే, ఏడాదికి ఒకసారి బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాద్రి అప్పన్న - ఇలా అందరినీ దర్శించుకొని రావాల్సిందే! సినిమాల్లో గయ్యాళిగా చేసిందే కానీ, అమ్మ స్వభావం అందుకు పూర్తి వ్యతిరేకం. పైకి గంభీరంగా, నిబ్బరంగా కనిపించినా, సున్నిత మనస్కురాలు. ప్రేమ అయినా, బాధ అయినా ఆమె పైకి పెద్దగా వ్యక్తం చేసేది కాదు. తనలో తానే ఉండేది. అందరి మంచీ కోరుకొనేది. ఆమెకు నమ్మకాలు ఎక్కువ. తన, పర భేదం లేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ క్షేమం కోసం ‘దేవుడా! దేవుడా!’ అంటూ, మొక్కులు మొక్కడం అమ్మలోని ప్రత్యేక లక్షణం. ఆమె ఊతపదాన్ని ఆ మధ్య సినిమాల్లో కూడా పెట్టినటు ్లన్నారు. అలాగే, ‘‘ఏంటి తల్లీ! రోజూ పూజ చేస్తున్నా. డబ్బులివ్వవేంటీ?’’ అని మనం దరితో మాట్లాడుతున్నట్లే అమ్మవారితో అమ్మ మాట్లాడేది. నిర్మాత, దర్శకులను కన్న తల్లితండ్రుల్లా భావించేది. వాళ్ళ క్షేమం కోసమే తపించేది. పనివాళ్ళకు అనారోగ్యం వచ్చినా అంతే! ‘అదృష్టవంతులు’ చిత్ర సమయంలో ప్రమాదం జరిగి, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కారు మధ్యలో ఇరుక్కొన్నారు. వెంటనే అమ్మ ఇంట్లో మా అందరితో ‘మృత్యుంజయ మంత్రజపం’ చేయించడం నాకిప్పటికీ గుర్తు. ‘బందిపోటు దొంగలు’ అవుట్డోర్ షూటింగ్లో నటుడు జగ్గయ్య గుఱ్ఱం మీద నుంచి పడిపోతే, నిర్మాతెంతో నష్టపోతాడన్న భయంతో రకరకాల మొక్కులు మొక్కుకుంది. ఆమె మొక్కుకొనే మొక్కులు కనీవినీ ఎరగనివి. ఉదాహరణకు, ‘బాల బాలాజీ వ్రతం’ అనేది! ప్రతి శనివారం అయిదుగురు చిన్నపిల్లల్ని తీసుకురమ్మనేది. వాళ్ళను వెతికి పట్టుకురావడం నా పని. రకరకాల వంటలు వండి, మడిగా వడ్డించేది. స్కూళ్ళకు వెళ్ళే లోపల ఇవన్నీ చేసి వాళ్ళకు పెట్టి, స్కూల్లో తినడానికీ కట్టి పంపించేది. ఆ వ్రతం ఎక్కడా ఉండేది కాదు.. ఆమె అనుకొని చేసేసేది. అంతే! ఆరోగ్యం బాగుపడుతుందంటే, దర్గాకూ పంపేది. పుస్తకాల పురుగు... పది భాషల్లో ప్రవీణ! అమ్మకు దానగుణం కూడా ఎక్కువే. ఉన్న దాంట్లోనే దాన దర్మాలు చేసేది. చిన్న చిన్న పత్రికలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచేది. మా అమ్మ స్కూలు చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే కానీ, నవలలు, పత్రికలు, పురాణాలు - ఇలా ఏ పుస్తకమైనా తెగ చదివేది. పొద్దున్నే ‘ఆంధ్రపత్రిక’ డైలీ కాస్త ఆలస్యంగా వస్తే చాలు... పేపర్ కుర్రాడికి అమ్మ చేత అక్షింతలు పడేవి. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి నవలలంటే అమ్మకు ఇష్టం. ఇంట్లో ఉంటే అందరం ఎవరికి వాళ్ళం పుస్తకాలు చదువుకోవడమే. బాపు జోక్స్ అన్నా, ముళ్ళపూడి అన్నా అమ్మకు భలే ఇష్టం. అమ్మకు ఓ చిత్రమైన అలవాటుండేది. విమాన ప్రయాణంలో ఇచ్చే బోర్డింగ్ పాస్లు మందంగా ఉంటాయి కాబట్టి, పుస్తకాల్లో వాటిని బుక్మార్క్లుగా వాడేది. ఆమెకు కుక్కలు, చేపల పెంపకమంటే తగని పిచ్చి. చివరి దాకా వాటిని వదులుకోలేదు. చిన్నప్పుడు పెద్దగా చదువుకోకపోయినా, మద్రాసుకు వచ్చాక ఇంగ్లీషు నేర్చుకుంది. పుస్తకాలు చదివి చదివి తెలుగులో ప్రావీణ్యం సంపాదించింది. రకరకాల భాషలు నేర్చుకోవడం అమ్మకిష్టం. ఆమెకు 10 భాషలు వచ్చు. 50 ఏళ్ళ వయసులో ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచీ అమ్మది ఎడమచేతివాటం. సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. సహజనటి అయిన అమ్మ ఏకసంథాగ్రాహి. ఒక్కసారి డైలాగ్ వింటే, ఏళ్ళ తరబడి గుర్తుపెట్టుకొనేది. అయితే, బహిరంగ సభలకు రావడం, మాట్లాడడం తక్కువ. మైక్ ఇచ్చారంటే, మాట్లాడలేదు. నవ్వేసి కూర్చొనేది. ప్రసిద్ధ రచయిత కొవ్వలి తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను అమ్మకు అంకిత మిచ్చి, నాన్న గారి ద్వారా సభకు ఒప్పించారు. ఆ సభకు కృష్ణశాస్త్రి, కొడవటిగంటి లాంటివారంతా హాజరయ్యారు. తెర మరుగైన సూర్యకాంతి సహజ నటి అయిన అమ్మకు ‘పద్మశ్రీ’లు ప్రభుత్వాలు ఇవ్వలేదు కానీ, ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆమె గురించి గొప్పగా మాట్లాడతారు. ఊహించని రీతిలో చుట్టుపక్కలి మిత్రులే శత్రువులవడంతో నాకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు, అసహజ రోడ్డు ప్రమాదం అమ్మను కుంగదీశాయి. మనోవేదనతో 1994లో అమ్మ కన్నుమూసింది. నమ్మిన వాళ్ళ పన్నాగాలతో మాకు ఆస్తిపాస్తులు, చివరకు అమ్మ ఫోటోలు సైతం మిగలలేదు. పాత ఇల్లు పడేసి కట్టినచోట ఈ ఒక్క ఫ్లాట్ దక్కింది. అయితేనేం, ఇవాళ్టికీ సూర్యకాంతం గారి అబ్బాయినంటే దక్కే గౌరవం, ప్రేమ అంతా ఇంతా కాదు. అమ్మ నాకిచ్చివెళ్ళిన పెద్ద ఆస్తి అదే! ఆ తృప్తి చాలు. సంభాషణ: రెంటాల జయదేవ అమ్మది అమృతం లాంటి వంట... అన్నపూర్ణ లాంటి మనసు! అమ్మ చేతివంట అమృతం. అమ్మ చేసే ములక్కాడల పులుసు, ఉల్లి పాయల పులుసు, పులిహోర లాంటివి నాలుగు రోజుల పాటు పాడవకుండా ఉండేవి. షూటింగ్లకు కూడా రెండు బుట్టల్లో నాలుగు క్యారేజీల నిండా భోజనం, మిఠాయిలు, చిరు తిండ్లు పట్టుకు వెళ్ళేది. అమ్మ షూటింగ్లో ఉందంటే, సెట్లోని వాళ్ళకు పండగే! ఎన్టీఆర్ సైతం ‘అక్కయ్య గారూ.. ఏం తెచ్చారు’ అని అడిగి మరీ వడ్డించుకొనేవారు. తెల్లవారుజామునే లేచి పూజ చేసుకొని, వంట చేసి, మాకు క్యారేజీలు కట్టి, తను సిద్ధమై క్యారేజీలు తీసుకొని మరీ షూటింగ్కు వెళ్ళేది. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలు... అప్పటికప్పుడు వాళ్ళ కోసం ఫలహారమో, మిఠాయిలో, చిరుతిండ్లో స్వయంగా వండి పెట్టేది. ఇంటికి వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఏదైనా తిని వెళ్ళాలి. లేకపోతే, ఆమె మనసు ఊరుకోదు. చివరలో అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఇంటికి వస్తే, పెట్టడానికని జంతికలు, పాలకాయలు, సున్నుండల లాంటివి కొని డబ్బాల్లో ఉంచేది. కూల్డ్రింక్ సీసాలు క్యాన్లకు క్యాన్లు తెప్పించి ఉంచేది. ‘నాయనా! నేను లేవలేనురా! అక్కడ ఉన్న ఆ కూల్డ్రింక్ తీసుకొని, ఆ ఓపెనర్తో మూత తీసుకొని, తాగి వెళ్ళరా!’ అని చెప్పేది. చనిపోయేదాకా ఆవిడలోని ఆ అన్నపూర్ణేశ్వరి లక్షణం పోలేదు. -
వ్యోమగాములూ గాఢనిద్రలోకి..!
మన మంగళ్యాన్(మామ్) ఉపగ్రహం ఇటీవలే అంగారకుడిని చేరింది. అందుకు 300 రోజులు.. 66 కోట్ల కి.మీ. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరికొన్నేళ్లలోనే మనుషులనూ అక్కడికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున.. మానవ సహిత అంగారకయాత్రకూ దాదాపు 9 నెలలు పడుతుంది. అందుకే.. మనుషులను సులభంగా, తక్కువ ఖర్చుతో మార్స్పైకి పంపడం ఎలా? అని ఆలోచిస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు.. జంతువుల మాదిరిగా వ్యోమగాములనూ కొన్ని రోజుల పాటు గాఢనిద్రలోకి పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు! శీతాకాలంలో పలు జంతువులు గాఢనిద్రలోకి వెళ్లి స్తబ్దుగా ఉండిపోతాయి. దీంతో వాటి జీవక్రియలు మందగించి గాఢనిద్రలో ఉన్నన్ని రోజులూ బయటి నుంచి ఆహారం, నీరు తీసుకోవాల్సిన అవసరం తప్పిపోతుంది. అలాగే వ్యోమగాములనూ గాఢనిద్రలోకి పంపితే.. ఆహారం, నీటి అవసరాలు మూడు రెట్లు తగ్గడంతో పాటు యాత్రలో వారి ఇతర అవసరాలు, నిర్వహణ వ్యయం కూడా బాగా తగ్గిపోతాయని భావిస్తున్నారు. మెదడుకు గాయాలైన రోగులను వారం రోజుల పాటు గాఢనిద్రలోకి పంపే పద్ధతిని వైద్యరంగంలో ఇదివరకే మొదలుపెట్టేశారు. అన్నట్టూ.. అందరూ నిద్రలోకి జారుకుంటే.. వ్యోమనౌక నియంత్రణ, భూమిపై కంట్రోల్ రూంతో సంప్రదింపులు కష్టం కాబట్టి.. ఎల్లప్పుడూ ఒకరు మేలుకుని ఉండేలా షెడ్యూలు రూపొందిస్తారట. -
అంగారక దృశ్యం అదిరింది!
తొలిసారిగా మార్స్ ఫొటోలు పంపిన మామ్ ప్రధానికి బహూకరించిన ఇస్రో బృందం బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచం నివ్వెరపోయేలా.. అత్యంత చౌకగానే 66.6 కోట్ల కి.మీ. ప్రయాణించి బుధవారం అంగారకుడిని చేరుకుని అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టించిన భారత మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం తొలిసారిగా మార్స్ ఫొటోలను భూమికి పంపింది. మామ్ పంపిన కలర్ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం విడుదల చేసింది. వీటిలో ఓ ఫొటోను మామ్ ఫేస్బుక్ పేజీలో ఇస్రో గురువారం ఉంచింది. అరుణగ్రహానికి 7,300 కిలోమీటర్ల ఎత్తు నుంచి మామ్ తన మార్స్ కలర్ కెమెరాతో తీసిన ఈ తొలి ఫొటో 376 మీటర్ల రిజల్యూషన్తో ఉందని ఇస్రో పేర్కొంది. అలాగే మామ్ పంపిన మార్స్ ఫొటోను మార్స్ ఆర్బిటర్ మిషన్ ట్విట్టర్ ఖాతాలో కూడా ఇస్రో పోస్ట్ చేసింది. ‘అంగారకుడి తొలి ఫొటో ఇది. ఇక్కడ దృశ్యం చాలా బాగుంది’ అంటూ మామ్ ఫొటోలకు ట్వీట్లు జతచేసింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. ‘అవును. మార్స్ ఆర్బిటర్. నిజంగా ఈ దృశ్యం చాలా బాగుంది’ అంటూ బదులు ట్వీట్ చేశారు. మామ్ పంపిన మార్స్ ఫొటోలను ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్, శాస్త్రీయ సలహాదారు వి.కోటేశ్వరరావుల బృందం గురువారం ఢిల్లీలో మోదీకి బహూకరించింది. కీర్తిని ఇనుమడింపజేశాం: షార్ డెరైక్టర్ శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంగారక యాత్రను విజయవంతంగా నిర్వహించి అంతరిక్ష వినీలాకాశంలో ఇస్రో కీర్తిని మరింత ఇనుమడింపజేశామని, ఈ ఘనవిజయం వెనుక ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని షార్ డెరైక్టర్ పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. గురువారం సుప్రసిద్ధ భారత అంతరిక్ష శాస్త్రవేత్త ప్రొఫెసర్ సతీష్ ధవన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రసాద్ ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. ప్రయోగంలో అందరి కృషీ ఉన్నప్పటికీ.. రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడంలో ప్రధానంగా మూడు విభాగాలు కీలక పాత్ర పోషించాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 7- 9 తేదీల మధ్య పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని కూడా షార్ నుంచి నింగికి పంపనున్నట్లు ప్రసాద్ తెలిపారు. -
‘మామ్’ విజయంలో మన ఈసీఐఎల్
యాంటెనా తయారీలో పాలుపంచుకున్న ఈసీఐఎల్ సంబరాలు చేసుకున్న సంస్థ సిబ్బంది హైదరాబాద్: అగ్ర దేశాలు ఆశ్చర్యపడేలా చేసిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) విజయయాత్రలో హైదరాబాద్లోని ఈసీఐ ఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్) పాత్ర కూడా ఎంతో ఉంది. ‘మామ్’ పర్యటించిన దూరాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడిన యాంటెనాను రూపొందించడంలో ఈసీఐఎల్ కీలకపాత్ర పోషించింది. అందుకే గురువారం మంగళ్యాన్ యాత్ర విజయవంతం కావడంతో ఇక్కడ సిబ్బంది కూడా సంబరాలు జరుపుకున్నారు. ‘మంగళ్యాన్’ యాత్రలో తమ సంస్థ కృషి ఉందని ఈసీఐఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళ్యాన్లో సేవలందించిన ఈసీఐఎల్ తయారీ యాంటెనా వివరాలు.... యాంటెనా పేరు : ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) యాంటెనా ఏర్పాటు చేసిన ప్రాంతం : బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద బరువు : 300 టన్నులు వ్యాసం : 32 మీటర్లు ఎలివేషన్ : 0 నుంచి 90 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. తయారీ ఖర్చు : రూ.65 కోట్లు తయారీలో పాల్గొన్న సంస్థలు : ఈసీఐఎల్, బార్క్, ఇస్రో తయారీ సమయం : దాదాపు 14 నెలలు నియంత్రించే దూరం : భూమి నుంచి 65 కోట్ల కి.మీ.లు యాంటెనా పని ప్రారంభించిన తేదీ : 2013, నవంబర్ 5 మొదటి సిగ్నల్ పంపిన సమయం : ఉదయం 8.00 గంటలకు, 24 సెప్టెంబర్ 2014 (అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లో...) మొదటి సిగ్నల్ అందుకున్న సమయం : ఉదయం 11.45 గంటలకు, 24 సెప్టెంబర్ 2014న 2008లో ‘చంద్రయాన్’మిషన్లో కూడా ఈ యాంటెనా సేవలందించింది. -
'మంగళ్ యాన్' తొలి ఫోటో మోడీకి బహుకరణ!