nellor
-
విరాళాలతో అన్నా క్యాంటీన్ల నిర్వహణా?.. సిగ్గుచేటు: కాకాణి
సాక్షి, నెల్లూరు: ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన బాబు.. ఇప్పుడేమో ఆ హామీలు అమలు చేయడంపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు విధానాలు ఇలానే ఉంటాయని ప్రజలకు మరోసారి క్లియర్గా అర్థమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ హామీలపై బాబు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.ఈ మేరకు గురువారం నెల్లూరులో కాకాణి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించని సీఎం చంద్రబాబు, తానేమీ మారలేదని మరోసారి రుజువు చేశారని.. టెర్రరిజం గురించి, నియంత పాలన గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే, దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.రాజధాని అమరావతి విషయంలో ప్రజల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ ధనదాహంతో ఆలోచించారని కాకాణి తేల్చి చెప్పారు. రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లంటూ పదే పదే అబద్ధాలు చెప్పిన చంద్రబాబు, దమ్ముంటే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్నారన్న కాకాణి, ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను స్టాక్యార్డుల నుంచి మాయం చేశారని ఆరోపించారు. తల్లికి వందనం అంటూ ఈ ఏడాదికి ఎగనామం పెట్టిన పథకానికి స్వాతంత్య్ర దినోత్సవాన శకటం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఊసెత్తని చంద్రబాబు, రెడ్ బుక్ పాలనకే మొగ్గు చూపుతాం అన్న సంకేతాలివ్వడం దారుణమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఒక్క మంచి పని చేయని చంద్రబాబు, ఇప్పుడు కూడా 16 మంది సీనియర్ ఐపీఎస్లను వేధిస్తున్నారని, ఇది సీఎం అనైతిక పాలనకు పరాకాష్ట అని అభివర్ణించారు. ఇదే పంథాలో కొనసాగితే చంద్రబాబు నుంచి ప్రజలు స్వాతంత్య్రం తెచ్చుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందని కాకాణి హెచ్చరించారు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేసిన మాజీ మంత్రి, వాటన్నింటికీ పచ్చ రంగు ఎందుకు వేశారని నిలదీశారు. ఇంకా.. ఆ క్యాంటీన్లలో పెద్ద పెద్ద ఫొటోలు నీవి, విరాళాలు ప్రజలవా? అని చంద్రబాబును ప్రశ్నించారు. పథకాలు ఎత్తేసి, పేదవాడికి పప్పన్నం పెడుతున్నారని.. దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్న కాకాణి, అది కూడా ప్రభుత్వ సొత్తుతో కాకుండా విరాళాలతో చేయడం విడ్డూరమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా మరోసారి పవన్కళ్యాణ్ తన ఆజ్ఞానాన్ని చాటారని మాజీ మంత్రి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017లో జరిగిన సుగాలి ప్రీతి కేసును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ముచ్చుమర్రి బాలిక కేసును.. గత జగన్గారి ప్రభుత్వానికి ఆపాదించారని గుర్తు చేశారు. తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నానన్న విషయాన్ని పవన్ మర్చారని కాకాణి గోవర్థన్రెడ్డి చురకలంటించారు. -
Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు..
మాది నంద్యాల. అనగనగా రోజుల్లో కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారుట. 14వ శతాబ్దంలో నందన అనే మహారాజు గారు మా మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేరొచ్చిందని కాల క్రమేణా అదే నంద్యాలగా రూపాంతరం చెందిందని అంటారు. చుట్టూ నవనందులు ఉన్నా మాకు మహనంది మీదే మక్కువ ఎక్కువ. ఒక్క రోజు సెలవు దొరికితే చాలు "పొదామా అంటే, పోదామా" అనుకుంటూ మేము పిల్లలమంతా అద్దె సైకిల్లు తీసుకుని పొద్దున మహనందికి తయారు. పోయి పెద్ద కోనేరులో ఈతలు కొట్టి అలిసి పోయి, సేద తీరడానికి చిన్న కోనేరులో ఈతలు కొట్టి తేరుకుని సాయంత్రానికంతా తిరిగి ఇళ్ళు చేరుకునేవాళ్లం. ఈతల మధ్యలో సమయం దొరికితే మహనందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని దండం పెట్టుకునేవాళ్లం. మీరు ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దండం పెట్టుకునేవాళ్లం అన్నాను అంతే కానీ కొరికలు కోరుకునే వాళ్లం అనలేదు. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికని, కోరికలు తీర్చుకోడానికే దేవుడుకి దండం పెట్టుకోవాలని మేము నేర్చుకోలేదు. ఒకరోజు గుడిలోకి వెళ్ళి నేనూ, నా ఫ్రెండు శంకర్ దండం పెట్టుకున్నాక.. శంకర్ కిందికి వంగి దేవుడి పళ్ళెంలో ఉన్న నోట్లని గుప్పిట నిండుగా పట్టుకుని ఆక్కడి నుండి పారిపోయాడు. నాకు కూడా అక్కడ ఉన్న ఒక అయిదురూపాయల నోటు టెంప్ట్ చేసింది కానీ , తీసుకోలేకపోయాను. అందుకు నా మీద దేవుడికి కోపం వచ్చి చేతకాని నన్ను ఆర్టిస్ట్ కమ్మని శపించి, ధైర్యం, చాకచక్యం పుష్కలంగా ఉన్న శంకర్ను ప్రముఖ పొలిటీషియన్ కమ్మని వరమిచ్చాడు. గుడిలో పులిహోర మాత్రం ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. శివుడు మా ప్రాంతపు ఎక్కువ దేవుడు. మా నూనెపల్లె నడిబొడ్డున శివాలయం ఉంది. తెల్లవారిన దగ్గర నుంచి "బ్రహ్మమురారి సురార్చిత లింగం | నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం | తత్-ప్రణమామి సదాశివ లింగమ్ |" అని ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. అప్పుడు నేనూ, నావంటి నూనెపల్లె పిల్లలం కలిసి శివాలయం ముందు నుండి ఆటలాడుతూ పరిగెడుతూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని పాడుకుంటూ మంచి నీళ్ళ బాయి దగ్గర మలుపు తిరగగానే మసీదు నుంచి అజాన్ రాగానే అల్లాహు అక్బర్ | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్| అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్| హయ్యా అలస్-సలాహ్| హయ్యా అలల్-ఫలాహ్| అల్లాహు అక్బర్. అని ముగింపు పాడుకునేవాళ్లం. ఆ రోజుల్లో మీరెవరు అని అంటే మేము నూనెపల్లె వాళ్లం అని మాత్రమే మా ప్రవర. మాది నిజానికి ప్రకాశం జిల్లా. మా జేజి నాయన తన కుటుంబాన్ని తీసుకుని బ్రతుకు తెరువుకోసం నూనెపల్లె చేరినపుడు ఆయనని వెల్ కం టు నూనెపల్లె అని స్వాగతించింది మా ఊరి మహాదేవుడు శివుడు, తన గుడి అరుగు మీద స్థలం చూపి నువ్వు ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చబ్బా! అన్నాట్టా. మా పెద్దల బ్రతుకు గిర్రున తిరగడానికి కుట్టు మిషన్ చక్రం కదిలింది ఈ శివాలయం గుడి నీడ నుండే. మామూలుగా పండగలన్నీ ఉదయపు సంబరాలయితే ఒక్క మహా శివరాత్రి మాత్రం సాయంత్రం నుండి మొదలయ్యే ఉత్సాహం. ప్రతి పండగకు ముందు పిల్లలమంతా కూడి రాబోయే పండగ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పుకునే వాళ్లమో! లెక్కే లేదు. అప్పుడు మా చొక్కాకు ఒక జేబు, నిక్కరకు రెండు జేబులు ఉన్నా ఆ మూడు జేబుల నిండా కబురులు తరగని అక్షయ నిధుల్లా పోటెత్తేవి. అప్పుడు మా ఊరి రోడ్లు ఎప్పుడూ ఎద్దుల బళ్లతోనూ, గుర్రపు జట్కాలతోనూ , రిక్షాల మూడు చక్రాలతోనూ, సైకిల్ బెల్లులతోనూ, సైడ్, సైడ్ జరుగు జరుగు అని హెచ్చరిస్తూ కదిలేవి. ఒకటీ రెండు బస్సులు ఉన్నా, అవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ పోతూ ఆగుతూ కదులుతూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి పండగకు మా ఊరి శివాలయం ముందు పందిరి కట్టి హరికథలు నడుస్తూ ఉండేవి. మామూలు రోజుల్లో చీకటి పడగానే త్వరగా నిద్రపోయే ఊరి రహదారులు పండగ రోజుల్లో మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉంటాయి. కథలు చెప్పడానికి వచ్చిన హరిదాసు గారి కథా గమనాన్ని, మృదుమధురమైన గానాన్ని, కాలి అందియలు ఘల్లు మనడాన్ని, చేతిలోని చిడతలు ఝల్లు మనడాన్ని, ఆ పిట్టకథలను, ఆ వేదాంత చర్చను, మధ్య మధ్యలో పాపులర్ సినిమాల పాటల చమత్కారపు పేరడీలను ఊరు ఊరంతా, దారి దారంతా గడ్డం క్రింద చేయిపెట్టుకుని అలా కళ్ళప్పగించి చూస్తూ, వింటూ ఉండేది. ఈ హరి కథల కోసమని చీకటిపడే సమయానికంతా ఊరిని, దారిని బందు పెట్టేవారు. ఇక ఆ రాత్రి ఆ దారిన ఒక వాహనం నడవదు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్క సైకిలు చక్రమూ తిరగదు. ఊరి జనం అంతా చేతికందిన చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు పట్టుకుని రోడ్దుని ఆక్రమించుకునేవారు. అందరికన్నా ముందు అక్కడికి చేరుకునేది నావంటి పిల్లలు. వారి వారి అమ్మా నాయనల కోసమో, అవ్వా తాతల కోసం కాదు. స్కూలు, ట్యూషన్ క్లాస్మెంట్ కోసమని, ప్రాణ స్నేహితుల కోసమని తగు మాత్రం స్థలం రిజర్వు చేసి పెట్టేవారు. ఎన్నయినా చెప్పండి మళ్ళీ రావు ఆ బంగారు రోజులు. ఆకాశానికి నక్షత్రాలు పూచే ఆ సాయంకాలాలు, అరచేతుల్లో గాజు మొబైల్ అద్దాలకు బదులు దేవుడు రాసిన గీతలు కనపడే రోజులు మరిక లేవు. ఇవన్నీ మామూలు రోజుల్లోని పండగల సాయంకాలాల గుడి బయటి దృశ్యాలు. హరికథల పండగ రోజుల్లో బాగా నిద్ర అనిపిస్తే ఇంటికి రావచ్చు. శివరాత్రి సంగతి వేరు. శివరాత్రి రోజున శివాలయం బయట రోడ్డుకి అడ్డంగా పెద్ద తెల్లని తెర కట్టేవారు. తెరకి అటూ ఇటూ జనం కూర్చునేవారు. చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు మామూలే. పిల్లలు ముందు గానే వచ్చి స్థలం రిజర్వు చేసి పెట్టడమూ మామూలే. ఆ రాత్రి శివాలయం ముందు మూడు ఆటలు సినిమాలు వేసేవారు. పౌరాణిక సినిమాలే వేసేవారు. మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం దక్షయజ్ఞం ఖచ్చితంగా ఉండేది. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా తప్పకా ఉండేది. మేము ఆ సినిమాని ఉప్మా, చట్ని, గారె, సాంబారుల కథ అని పిలుచుకుని, గట్టిగా నవ్వి ఆపై కళ్ళు మూసి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకునేవాళ్లం ఆ శివరాత్రి రాత్రులలో, ముఖ్యంగా దక్షయజ్ఞం సినిమా చూస్తున్నప్పుడు మా ఊరి శివాలయంలో ఉండే ఆ చంద్రచూడుడు, చంద్రశేఖరుడు, విషకంఠుడు, పినాకపాణి , మహాశివుడు క్లైమాక్స్ లో గుడి లోపలినుండి ఆ ఫలాన తెరమీదకు వచ్చి నందమూరి రామారావు ఒంటి మీదికి పూని శివతాండవం చేయిస్తాడు చూడు! తీవ్ర దుఃఖంతో, మహా కోపంతో, తన జూట నుండి ఒక కేశాన్ని పెరికి నేలకేసి కొడితే ఆ వెంట్రుక నుండి ఆయన పెద్ద కొడుకు వీరభద్రుడు పుట్టుకొస్తాడు చూడు. అది మాకు శివరాత్రి అంటే. ఆ ఒక్క దృశ్యం చూడడం కోసమే కదా సంవత్సరమంతా వేచి వేచి శివరాత్రి జాగారం చేసేది. ఈ రోజుల్లో లాగా ఏ క్షణన కావాలిస్తే ఆ క్షణాన కళ్ళముందుకి నర్తనశాలలు, పాండవ వనవాసాలు, వినాయక విజయాలు వచ్చే కాలం కాదు కదా. ఆ రోజుల్లో ప్రతి అనుభవానికి ఒక గొప్ప విలువ ఉండేది. లిప్త పాటు అదృష్టాల్ని ఒడిసిపట్టుకుని బ్రతుకు పుస్తకంలో మెరుపుల నెమలీకలా దాచుకుని తీరాల్సిందే. పండగ పూట సినిమాలు చూస్తూ జాగారం చెయడమేమిటి కలికాలం అని పెద్ద తరం వాళ్ళు విసుక్కుంటున్నా సరే, దారి మీద మూడాటల తెర ఆడుతూనే ఉండేది. సినిమా టాకీసులలో రాత్రి మూడాటలు ఆడుతూనే ఉండేవి, గుళ్ళల్లో పూజలు, అవధూతల ఆశ్రమాల్లో భజనలు కొనసాగుతూనే ఉండేవి. ఏదో ఒక రకంగా, ఒక రూపంగా భక్తి అనేది కళ్ల మీదికి నిదుర మూత వాలకుండా కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి ముగిసేది. ఆ తరువాతి పగటిని రాత్రిలా జనం అంతా నిద్రపోయేవారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే జాగారపు యామిని ప్రస్తుతం మరణించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో జనం మెలకువగానే ఉంటున్నారు. పగళ్ళు నిద్రపోతూనే ఉంటున్నారు. శివుడికి ఒకరోజు, రాత్రికి ఒక కాలం, సినిమాకి ఒక వారం అంటూ ఏమీ ఉండటం లేదు. శివరాత్రికి చలికాలం శివ శివ అని పారిపోతుంది అనేవారు. చలికాలం రాకముందే చలి పారిపోయే కాలం వచ్చినట్లుంది. భస్మాసురుడికి భయపడి శివుడు పరుగులెత్తాడు అని అనుకునేవారు. అసురుడి దాకా ఎందుకు మామూలు మనిషికి భయపడే చూసే పరమశివుడు ఎప్పుడో పారిపోయినట్లుగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఆలయాలు ఉన్నాయి కానీ, దేవుడులు అక్కడ ఉండటం లేరేమో అని గట్టి నమ్మకమే ఉంది. పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కానీ, అనుభవాలు మిగలడం లేదు నిన్నటి రాత్రికి ఈ శివరాత్రికి తేడా కనపడ్డం లేదు. మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. మద్రాసులో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అనేవి ఉన్నాయని. ఇప్పుడు నేను రాసుకున్నదంతా చచ్చిపోయిన మా నూనెపల్లె కథ, ఒక వదలని దుఃఖపు గీతి రాత. -
పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ!
ఓర్నాయనో.. అబ్బయ్యా సిన్నీ! మీ అన్నకి సెంద్రబాబు సీటీ సించేసే సరికి నీకు మహా కుశాలగా ఉన్నట్టుండాదే అబ్బయ్యా! ఇన్నేళ్లు సెంద్రబాబుకి ఊడిగం జేసిన మీ అన్నయ్యని మెడ బట్టుకోని బయటకి గెంటేసిన తర్వాత.. రాజ్జెమంతా నీదే అయిపోతాదని మురిసిపోతా వున్నట్టుండావు గదా. అప్పుడే నీకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేసినట్టు.. నువ్వు సైకిలెక్కి లగెత్తుకోని డిల్లీలో పార్లమెంటుకు పోయినట్టు కళ్లముందు సెవెంటీ ఎమ్మెమ్ములో కనిపిస్తా వున్నట్టుండాది గదా! అంతేలే అబ్బయ్యా.. యీ మాదిర్తో అరసేతిలో సొర్గాన్ని జూపించకపోతే.. ఆ సెంద్రబాబు మాత్తరం పార్టీని ఎట్టా నడుపుకుంటాళ్లే? యీ కలలు కొంచిం కట్టిపెట్టి.. నా మాటలు కొంచిం జాగర్తగా ఆలకించుకో అబ్బయ్యా! మీ అన్నకైనా నెత్తిన పదేళ్లు కిరీటం నిలబడినాది. నీ కాడికి వొస్తే.. అసలు ఎలచ్చను గంట మోగడానికి ముందుగాలే.. నీ సీటీ సిరిగిపొతాదేమో అని అనుమానంగా వుండాదబ్బయ్యా.. ఎట్టాగంటవా? అదే జెప్పబోతన్నా.. రొవ్వంత జాగర్తగా యినుకో! సెంద్రబాబు మీ అన్న నాని మీద పగబట్టినట్టుగా గెంటేసినాక ఏదో జగనన్న పంచన జేరినాడనుకో. అదాటుగా నువు సీన్లోకి బలే ఎంట్రీ ఇచ్చినావబ్బయ్యా! మా అన్న రెండు సార్లు గెలిస్తే.. అసలు ఆ ఎలచ్చన్లలో పన్జేసి గెలిపించింది నేనే అంటావుంటివి. ఏమోనబ్బా.. మా నెల్లూరు మీ బెజవాడకి శానా దూరం గదా. అందుకేగావాల నీ పేరు యిదివరలో యినబడలా! సరే, ‘గెలుపు అనే బిడ్డకి శానా మంది నాయినలుంటారని’ ఇంగ్లీసులో ఓ సామెతుండాదిలే. ఆ మాదిరిగా మీ అన్నయ్య గెలిస్తే అంతా నీ పెతాపమే అని జెప్పుకుంటా వుండావు. ఓకే! అన్నయ్యని బయటకి పంపేయగానే.. సెంద్రబాబుకు వత్తాసు ఏసుకోని శానా దుడుకు మాటలు అంటావుండావు. మీ అన్న నానికి అంత సీన్లేదని అంటావుండావు. ఆయన లేడు గనక.. బెజవాడ సీటుని నీ సేతుల్లో యేలుకో తమ్ముడా అని సెంద్రబాబు అనబోతాడని నీకు ఆసె గదా. ఆయన గొప్పదనం గూడా యిట్టాంటి ఆసెలు పుట్టించడమే గదా? మరైతే సీక్రేటు జెప్తా యిను.. సుజనా సౌదరి అనే పెద్దమడిసి నీకు ఎరుకే గదా! మీ సెంద్రబాబు తోలితేనే గదా ఆయన పొయ్యి పువ్వు పార్టీలో గూసోని ఆణ్నించి రాజకీయం జేస్తన్నాడు. ఆయనకీ సెంద్రబాబుకీ ఉండే బందం పైకి కనపడకపొయినా సరే.. ఫెవికాల్తో అతికించినదానికంటె గట్టిదేననే సంగతి నీగ్గూడా తెలుసు గదా. మరి తాజా తాజా కబుర్లు నీ సెవిలో పడినాయో లేదో! ఆ సుజనా సౌదరి అనే పెద్దమడిసి బెజవాడ ఎంపీ సీటు మీద కన్నేసినాడంట. ఎటూ పువ్వు పార్టీలో ఉన్నాడు గాబట్టి.. పువ్వు టిక్కెట్టు మీదనే పోటీ జేస్తాడనుకో… నీకు యిప్పుటికిప్పుడు అడ్డం రాబోయేదేమీ లే. కాపోతే.. పువ్వుతో సైకిలుకి, గాజుగ్లాసుకి ముడిపడతాదేమో అని కూడా ఆయనే లీకులు వదలతండాడు అబ్బయ్యా సిన్నీ! యినుకున్నావా?? అదేగానీ జరిగిందనుకో.. ఎంపీల వరకు గెలిసే సీట్లే గావాలని పువ్వు పార్టీవోళ్లు ఫిటింగు బెట్టకుండా వుంటారా? ఆముడి పడినా బెజవాడ పువ్వుకే సమర్పయామి అయిపోతాది. అప్పుడిక నీ బతుకు మూడుజెండాలు బుజాన యేస్కోని మళ్లీ వూరంతా తిరగతా వుండడమే. నీకొక దారీ దిక్కూ యెప్పుటికి దక్కతాదో యెవురికెరుక అబ్బయ్యా! ఒకేళ- పువ్వుతో సైకిలుకు ముడిపడలేదే అనుకో.. నీ బతుకు యింకా కనాగస్టంగా అయిపోతా దబ్బయ్యా! సెంద్రబాబు ఒక సేత్తో నీకు టికెటిస్తాడనుకుందాం. రెండో సేత్తో- రెండో కంటికి తెలీకుండా నీ యెనకాల గొయ్యి కూడా తవ్విపెడతాడు! గోయిందా గోయింద! ‘సీసీ.. అట్టా యెందుకు జేస్తాడు’ అని గీర మాటలు మాటాడబోక నాయినా! అదే మరి సెంద్రబాబు మంత్రాగం. నీలాంటోడు ఆయన్ని నమ్ముకోని యెప్పుటికీ యీ పంచనే పడుంటాడు. కానీ.. పువ్వు పార్టీలోకి సెంద్రబాబు సొరబెట్టిన సుజనా సౌదరి లాంటి పెద్దమడిసి గెలిస్తే.. ఢిల్లీలో గూసోని బాబు గారి పన్లన్నీ గుట్టుసప్పుడు గాకుండా సక్కబెడతా వుంటాడు గదా! అదొక్కటే యేముండాదిలే. లోపల్లోపల ఆ సౌదరికీ- సెంద్రబాబుకీ యెన్నిన్ని లుకలుకల బందాలుండాయో నేను నీకు జెప్పాల్నా అబ్బయ్యా..! నెల్లూరోణ్ని- నాకంటే.. బెజవాడోడివి- నీకే యిట్టాంటి లోగుట్టు కతలు మాబాగా తెలస్తాయి. కాదంటావా? కాబట్టి నాయినా సిన్నీ! అన్నియ్య పొయినాడని.. యిక రాజ్జెమంతా నువ్వే యేలుకోవచ్చునని మురిసిపోబాక. మిడిసిపడబోక. ‘యెన్నాల్లో యేసిన వుదయం.. ఇయ్యాలే ఎదురవుతోంటే..’ అని సాంగులూ గట్రా యేసుకోని పండగజేసుకోబాక. సెంద్రనీతి రాజకీయాల్లో యింకా యెన్నెన్ని టర్నింగులుండాయో.. యెన్నెన్ని లోయలుండాయో.. నీ కలలబండి యేడ కూలిపోబోతాదో.. తెలవదు గదా! అందుకే రొవ్వంత జాగర్తగా పో అబ్బయ్యా! యింకా నాకు తిరుగు లేదని యిసురుకుంటా తిరిగినావనుకో.. అన్నకు జేసిన మాదిరిగానే సెంద్రబాబు నీ సీటీ గూడా అవలీలగా సించేయగల్డు! ✍️నెల్లూరు పెద్దారెడ్డి -
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
-
నెల్లూరు శివాలయంలో శివరాత్రి సంబరాలు
-
Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్హౌస్ ఎండీలైన్స్లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా మృతుల సంఖ్య అయిదుకి చేరింది. మిగతా వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు అసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ జోన్గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని భరోసానిచ్చారు. చదవండి: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ -
సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం
-
నెల్లూరు: బాలిక గొంతుకోసిన ఘటనలో కామాంధుడి అరెస్ట్
సాక్షి, నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో బాలిక గొంతుకోసి, యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. బాధితురాలికి దగ్గరి బంధువు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. చదవండి: విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి మంత్రి పరామర్శ చెముడుగుంటలో దుండగుడి చేతిలో గాయపడి నెల్లూరులోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్న మైనర్ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాలికకు సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే చెన్నైకు తరలిస్తామన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారుల పరామర్శ దుండగుడి చేతిలో గాయపడిన మైనర్ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎస్పీ సీహెచ్ విజయారావు, నెల్లూరు కమిషనర్ హరిత, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ హరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తదితరులు పరామర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్యం అందిం చేందుకు అపోలోకు తరలించామని గిరిధర్రెడ్డి తెలిపారు. -
Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు
ఆమెకు చూపు సరిగా లేదు. కాని అద్భుతంగా వండుతుంది. ఇలా వండమని యూ ట్యూబ్లో వంటలు చేస్తూ అందరినీ అభిమానులుగా మార్చుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు రెండున్నర లక్షల మంది సబ్స్క్రయిబర్లతో స్టార్గా వెలుగుతున్న తెలుగు చెఫ్ బొడ్డు నాగలక్ష్మి. ఈమె వీడియోలు చూశారా మీరు? ‘అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి, ఈమె కవిత. మేమిద్దరం వదిన మరదళ్ళం’ అని మొదలవుతుంది నాగలక్ష్మి చేసే వీడియో. నిజానికి ఆమె చేసేది జంట వీడియో. ప్రతి వీడియోలోనూ వదిన కవిత ఉంటుంది. ఇద్దరి పేరు మీద ‘కవిత నాగ వ్లోగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ఉంది. 2020 వ సంవత్సరం సెప్టెంబర్లో మొదలైన చానల్ రెండేళ్ల లోపే రెండున్నర లక్షల సబ్స్క్రయిబర్లను సాధించింది. నాగలక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది. ఇంతచేసి నాగలక్ష్మికి చూపు లేదు. కాని అది ఆమె విజయానికి అడ్డంకి కాలేదు. బతికిన పసిగుడ్డు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన రైతు కృష్ణారెడ్డి ఆఖరు కూతురు నాగలక్ష్మి. పుట్టుకతోనే చూపు లేదు. పురిట్లో చూసిన బంధువులు ‘ఎందుకు కృష్ణారెడ్డి అవస్థ పడతావు. వడ్లగింజ వేసెయ్’ అని సలహా ఇచ్చారు. కాని నాగలక్ష్మి తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ‘చూపులేకపోతే నా బిడ్డ కాకుండా పోతుందా’ అంది. వయసు పెరిగాక అర్థమైన విషయం ఏమిటంటే నాగలక్ష్మికి ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడికన్ను ఏదైనా వస్తువు దగ్గరగా పెట్టుకుంటే 5 శాతం కనిపిస్తుంది. అంటే ఆమె కుడికన్ను చాలా కొద్దిగా అతి దగ్గరి వస్తువులు (రెండు అంగుళాల దూరంలో) ఉంటే చూస్తుంది. అయినా సరే నాగలక్ష్మి బెదరలేదు. ఐదు వరకు బడికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండిపోయింది. నీళ్లు మోయడం మామూలు పనులు చేయడం చూపు లేకపోయినా అడుగుల అంచనాను బట్టి అలవాటు చేసుకుంది. కాని సమస్యలు ఆమెను వదల్లేదు. తల్లి వియోగం 18 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. అప్పటికి అక్కకు పెళ్లయి వెళ్లిపోవడంతో ఇంటిలో వంట పని నాగలక్ష్మి బాధ్యత అయ్యింది. తండ్రికి, అన్నయ్యకు ఆమే వండి పెట్టాల్సి వచ్చింది. కాని అన్నం వండటం తప్ప నాగలక్ష్మికి ఏమీ రాదు. అప్పుడు పక్కనే ఉండే ఒక అవ్వ ఆమెకు సాయం చేసింది. ‘నువ్వు వండుతూ ఉండు. నేను పక్కన ఉండి సలహా ఇస్తుంటాను’ అని పక్కన ఉండి వంట నేర్పించింది. ఆ అవ్వకు బాగా వండటం వచ్చు. అది నాగలక్ష్మికి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇంట్లో ఆడతోడు లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులకు తోడు కోసం నాగలక్ష్మి బాధలు పడింది. అయితే ఆమె అన్న ఆదిరెడ్డి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లాకు చెందిన బోండాల కవితను కోడలిగా తేవడంతో ఆమె జీవితానికి పెద్ద ఆసరా దొరికింది. యూట్యూబ్ ప్రయోగాలు 2018లో నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి యూట్యూబ్ చానల్ ప్రారంభించి ‘బిగ్బాస్’ షో మీద కామెంటరీ చెప్పేవాడు. ఆ వీడియోలు హిట్ అయ్యి అతనికి పేరు వచ్చింది. ఆ సందర్భంలో ఒకరోజు నాగలక్ష్మి చేత సరదాగా కామెంటరీ చెప్పిస్తే ఆ వీడియో అందరూ బాగుందన్నారు. అప్పటికి నాగలక్ష్మికి సీరియల్స్ పిచ్చి బాగా ఉండేది. టీవీలో సీరియల్స్ను చూసేది (వినేది). ఫోన్లో అయితే కంటికి దగ్గరగా పెట్టుకుంటే సీరియల్ బూజరగా కనిపిస్తుంది. అందువల్ల ఆదిరెడ్డి ఆమె చేత ‘సీరియల్ పిచ్చి’ అనే షో చేయించాడు. కాని దానికి పెద్ద స్పందన రాలేదు. కాని 2020లో లాక్డౌన్ సమయంలో నాగలక్ష్మి, కవిత కలిసి వంట వీడియోలు మొదలెట్టారు. ఇద్దరూ మంచి మాటకారులు కావడంతో రెండు రోజుల్లోనే 10 వేల మంది సబ్స్క్రయిబర్లు వచ్చారు. ‘కవిత నాగ వ్లోగ్స్’ అలా మొదలైంది. జామకాయ రోటి పచ్చడి నెల్లూరు పప్పుచారు తనకు చూపు లేదని ఈసురోమనడం నాగలక్ష్మి స్వభావంలో లేదు. ప్రతి వీడియోలో వదినతో కలిసి హుషారుగా కబుర్లు చేస్తుంది. చూపున్నట్టే వంటగదిలో కదలుతూ వంట చేస్తుంది. వదిన మరదలు కలిసి స్థానిక వంటలు రకరకాలుగా చేస్తూ భారీగా అభిమానులను కూడగట్టుకున్నారు. నాగలక్ష్మి చేసే పప్పుచారుకు పెద్ద గిరాకీ ఉంది. అలాగే చుక్కకూర పచ్చడి వీడియో పెద్ద హిట్ అయ్యింది. పచ్చి జామకాయ రోటి పచ్చడి కూడా ఈమె రుచి చూపించింది. చపాతీ లడ్డు మరో వెరైటీ. నెల్లూరు చేపల పులుసును అథెంటిక్గా చేసి చూపిస్తుంది. ‘నేను నూనె ఎక్కువ వేశానని ఒక్కరు కూడా అనరు. అంత సరిగ్గా వేస్తాను’ అంటుంది నాగలక్ష్మి. రకరకాల కామెంట్లు నాగలక్ష్మి వీడియోలకు 40 ఏళ్లు దాటిన అభిమానులు ఎక్కువ. అయితే ఈ వదిన మరదళ్ల మధ్య కూడా తంపులు పెట్టడానికి అన్నట్టు వీడియోల కింద కొందరు కామెంట్లు పెట్టారు. వీరు విడిపోయారని కూడా అన్నారు. కాని వదిన మరదళ్లు కలిసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాన్ని దాపరికం, శషభిషలు లేకుండా వ్యూయెర్స్తో పంచుకోవడమే వీరి వీడియోలలో విశేషం. ‘చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేవారి వార్తలు వింటుంటాను. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలనేదే నా సలహా’ అని నాగలక్ష్మి అంటుంది. తన సంపాదన నుంచి సోనూసూద్ ఫౌండేషన్కు, సిఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేసింది నాగలక్ష్మి. అపజయం ఆమె కంట పడలేదు. ఆమె తన ప్రతి అడుగులోనూ వినేది గెలుపు పిలుపునే. -
కాలనీలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నానాటికీ విస్తరిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. 20వ డివిజన్లోని ఇస్కాన్ సిటీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో రోడ్డు సమస్యను ఆయనకు స్థానికులు తెలియజేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణానికి మేయర్ స్రవంతితో కలిసి శంకుస్థాపనను చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. ఆయా కాలనీల అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ మహేష్, నేతలు శ్రీనివాసరావు, మల్లికార్జున్యాదవ్, ఖాదర్బాషా, రమణయ్య, రవి, వెంకటరమణయ్య, విఠల్, డేవిడ్రాజు, కవిత, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక -
భార్యను తీసుకొని ఆసుపత్రికి వెళితే.. కారుతో డ్రైవర్ ఉడాయింపు
సాక్షి, నెల్లూరు: కారుతో ఉడాయించిన డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరులో లైన్మెన్గా పనిచేస్తున్న అదే మండలం అప్పారావుపాళేనికి చెందిన పెంచలయ్యకు హ్యుండయ్ వెన్యూ కారు ఉంది. యాక్టింగ్ డ్రైవర్గా అప్పారావుపాళేనికి చెందిన బాలకృష్ణ పనిచేసేవారు. డయాలసిస్ నిమిత్తం పెంచలయ్య, ఆయన భార్యను ఆస్పత్రికి కారులో సోమవారం తీసుకొచ్చారు. వారు ఆస్పత్రి లోపలికి వెళ్లగా, అదునుగా భావించిన బాలకృష్ణ కారుతో ఉడాయించాడు. రాత్రి ఏడు గంటలకు బయటకొచ్చిన పెంచలయ్య ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బెంగళూరు సమీపంలోని టోల్ప్లాజాను కారు దాటినట్లు పెంచలయ్య ఫోన్కు మంగళవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్కే బీచ్లో వివాహిత అదృశ్యం.. భర్త కళ్లుగప్పి ప్రియుడితో..
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ ఆర్కే బీచ్లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె ఆఖరి ఫోన్కాల్ను పోలీసులు కావలిలో ట్రేస్ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్ రోడ్లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్ సాయితో పరారైనట్లు బయటపడింది. చదవండి: బీచ్లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..? అసలేం జరిగిందంటే చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్తో కలిసి ఆర్కే బీచ్కు వెళ్లింది. శ్రీనివాస్ ఫోన్లో మెసెజ్లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పక్కా స్కెచ్ ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్ గార్డ్ షిప్లతో పాటు ఓ హెలికాప్టర్తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు. -
థాంక్యూ సీఎం సార్ అంటూ ర్యాలీ చేసిన నెల్లూరు సచివాలయ ఉద్యోగులు
-
రూ.3.14 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్తో తొక్కించి
సాక్షి, నెల్లూరు: మద్యం అక్రమరవాణా, అనధికార విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా సెబ్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వా«దీనం చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. వరుస దాడులతో అక్రమ రవాణా తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. జిల్లా పోలీçసు బాస్ల పర్యవేక్షణలో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసి దాడులు చేస్తున్నారు. కార్లు, బస్సులు, కంటైనర్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న పొరుగు మద్యంతోపాటు డ్యూటీ పెయిడ్ లిక్కర్ను స్వా«దీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి పంపుతున్నారు. పక్కాగా.. మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్డీపీఎల్, డీపీఎల్) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వా«దీనం చేసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేయడంతోపాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మాకివ్వండి సారూ.. పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ అధికారులు మంగళవారం కొత్తూరు టాస్్కఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను చేస్తున్నారన్న ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డురోలర్లతో తొక్కించే బదులుగా తమకివ్వండి సారూ.. కొందరు అక్కడ విధుల్లో ఉన్న సెబ్, పోలీసు సిబ్బందిని బతిమిలాడారు. వారు నిరాకరించడంతో వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
Andhra Pradesh: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6. నామినేషన్ల పరిశీలన జూన్7న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 9. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 28న ఉప ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు ►ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్, అజాంఘర్) ►పంజాబ్: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్) ►త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు (అగర్తల, టౌన్ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్నగర్) ► ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు) ►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్ నగర్) ►జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం (మాందార్) -
మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి
మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్రెడ్డికి పరిచయం చేయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్లు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
కన్నీరు పెట్టిన సంగం కాలనీ.. మీడియా అత్యుత్సాహం
సంగం దళితకాలనీ కన్నీరుమున్నీరైంది. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు కళ్లముందే ఉన్న ఆ చిన్నారులు అంతలోనే విగతజీవులు కావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ బిడ్డలను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలని తపన పడుతున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. సాక్షి, నెల్లూరు: ఇద్దరు చిన్నారులను కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ మింగేసింది. అప్పటి వరకు తమ కళ్లముందు తిరుగాడిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) చిన్నారులు విగతజీవులు కావడంతో దళితవాడ గొల్లుమంది. సంగం గ్రామం దళితవాడకు చెందిన దారా వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెల తర్వాత శ్రీరామ్ (8) జన్మించాడు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీరామ్ను ఉన్నతంగా చదివించాలని బెంగళూరులో కాపురం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. పని ఉండడంతో మంగళవారం వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీరామ్తో కలిసి స్వగ్రామం సంగం వచ్చారు. సంగం దళితవాడకు చెందిన గడ్డం ఆదినారాయణమ్మ ఒకగానొక్క కుమారుడు ఈశ్వర్. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీరామ్, ఈశ్వర్, మరో చిన్నారి యక్షిత బహిర్భూమికని సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని కాలువలోకి దిగిన శ్రీరామ్, ఈశ్వర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలు బయటకు తీయడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అప్పుడే అన్నంపెట్టి వచ్చా నా కుమారుడు ఈశ్వర్ బడికెళ్లి ఉంటే 11 గంటల సమయంలో వెళ్లి భోజనం పెట్టి వచ్చానని గంట వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒక్కగానొక్క మగబిడ్డను దేవుడు దూరం చేశాడంటూ కన్నీరుమున్నీరు అయింది. – ఆదినారాయణమ్మ, ఈశ్వర్ తల్లి తల్లికి ఏమని చెప్పను బెంగళూరు నుంచి నేను, నా కొడుకు మంగళవారం వచ్చాం. నా భార్య, కూతుర్లు బెంగళూరులోనే ఉన్నారు. ఈ వార్తను నా భార్యకు ఎలా చెప్పాలంటూ కన్నీరు పెట్టుకోవడంతో అందరిని కలిచివేసింది. – దారా వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తండ్రి మీడియా అత్యుత్సాహం.. ఇదిలా ఉండగా కనిగిరి రిజర్వాయర్ చిన్నారుల మృతి ఘటనపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మృతి చెందిన ఈశ్వర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లగా.. కొన ఊపిరితో ఉన్న శ్రీరాంను 108 లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ శ్రీరాం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరాం మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ను మాట్లాడగా.. ఆలస్యం కావటంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్పైనే ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మరో రుయా ఘటన అంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తప్పుగా ప్రచురించాయి. దీనిపై స్పందించిన పోలీసులు మరో రుయా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
ఇప్పటికే 2 నెలలు ఆలస్యం.. మామిడి ప్రియులకు చేదు వార్త
మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. వరుస సీజన్లో రైతులకు చేదు అనుభావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూసే ప్రమాదం ఏర్పడింది. సాక్షి, నెల్లూరు : జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు, కలిగిరి, సైదాపురం వంటి ప్రాంతాల్లో దాదాపు 12,800 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 7,500 హెక్టార్ల వరకు సాగు ఉంది. ఈ ప్రాంతంలో పండే బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, బెంగళూరు కాయలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దాదాపు రెండు, మూడు నెలలపాటు సీజన్ జోరుగా సాగుతుంది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సరైన ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతోందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగా కాయలు వచ్చిన మామిడిచెట్టు ప్రతికూల వాతావరణంతోనే.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూతరావడం దాదాపు నెల రోజుల ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తే ఒక ఎకరా తోటలో నాలుగు టన్నుల వరకు కాయలు వచ్చే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల కాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బాగా దిగుబడి వచ్చిందనుకుంటే రెండు టన్నులు మించి రాదని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ధరలు ఫర్వాలేదు... రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఈ మేరకు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.70 వేలు మార్కెట్లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అయితే డిమాండ్కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండు టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు రూ.1.40 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధిక వర్షాలతో పూత సరిగ్గా రాలేదు అధిక వర్షాల వల్ల ఈ ఏడాది మామిడిపూతపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగ్గా రాలేదు. వచ్చిన పూతలో కూడా కేవలం 30 శాతం మాత్రమే పిందె వచ్చింది. దీని వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక ఎకరా తోటలో ఒక టన్ను నుంచి టన్నునర కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రఖ్యాతిగాంచి ఉలవపాడు మామిడి రైతులకు ఇది నష్ట కలిగించే అంశమే. – బ్రహ్మసాయి, ఉద్యానవనశాఖ అధికారి ఎగుమతులపై ప్రభావం కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాల్లో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఉలవపాడు కేంద్రంగా మామిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఈ వ్యాపారానికి చాలా కీలకం. కాని ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్లోకి కాయలు రాని పరిస్థితి ఉంది. ఇది ఉలవపాడు నుంచి జరిగే మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది విదేశాలకు దాదాపుగా ఎగుమతులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉదే పరిస్థితి ఉంది. కరోనా ఆంక్షల వల్ల స్లాట్లు దొరక్క విదేశాలకు ఎగుమతులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం కాయలు లేకపోవడంతో దేశీయంగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది 40 నుంచి 50 వేల టన్నుల వరకు మామిడి దిగుబడి ప్రాంతం నుంచి వస్తే, వీటిలో 10 వేల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతులు ఉండేవని అధికారులు వెల్లడిస్తున్నారు. -
ఏం కష్టం వచ్చిందో ఏమో.. పుట్టింటికి వచ్చి మరీ వివాహిత..
సాక్షి, నెల్లూరు రూరల్: ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వివాహిత పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని పెద్దచెరుకూరులో గురువారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు స్థానికుడైన పులి దేవదానం కెనరా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతడి రెండో కుమార్తె సురేడ్డి కీర్తన(30)కు రాజా అనే వ్యక్తితో వివాహమైంది. రాజా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండేవాడు. వీరికి కుమారుడు శ్రీఫల్, కుమార్తె శ్రీషా ఉన్నారు. వీరు హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం కీర్తన హైదరాబాద్ నుంచి పెద్దచెరుకూరులోని తండ్రి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కీర్తన ఇంటి మిద్దెపైన ఉన్న బెడ్రూంకు వెళ్లింది. కుటుంబసభ్యులు గది వద్దకు వెళ్లి కీర్తనను పిలవగా ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కీర్తనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే కీర్తన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో.. రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే.. -
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు
-
మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత.. నెల్లూరు ఫంక్షన్లో చివరి ఫోటో
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చిరునవ్వుతో పూర్తిగా ఫిట్గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: మేకపాటి గౌతమ్రెడ్డి.. ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి కోసమే మంత్రి మేకపాటి గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న తరువాత ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రావడం వెంటనే నిన్న రాత్రి నెల్లూరులో ఒక నిశ్చితార్థం కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ బంధువులతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలో కూడా చాలా సరదాగా కనిపిస్తున్నారు. ఇదే గౌతమ్ రెడ్డి దిగిన చివరి ఫోటోగా భావిస్తున్నారు. ఫంక్షన్ తరువాత తిరిగి హైదరాబాద్లోని ఇంటికెళ్లిపోయారు. తెల్లవారేసరికి, గౌతమ్రెడ్డికి గుండెపోటు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. చదవండి: Mekapati Goutham Reddy: తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్కడు.. -
సముద్రం ఒడ్డున సైకత చిత్రం.. సీఎం జగన్ నుంచి బిపిన్, లతామంగేష్కర్, మోదీ వరకు
ముఖ్య ఘటనలు జరగడం, ప్రత్యేక దినోత్సవం వచ్చిందంటే చాలు సింహపురి గడ్డపై సముద్రం ఒడ్డున సైకత చిత్రం వెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో మొదలుపెట్టి మొన్న భారతదేశ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, నిన్న గానకోకిల లతామంగేష్కర్ మరణం వరకు ఎందరో ప్రముఖుల సైకత చిత్రాలు సముద్రం ఒడ్డున వెలిశాయి. గడచిన పన్నెండేళ్లుగా 284 చిత్రాలను రూపొందించి ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులను అందుకున్నాడు మంచాల సనత్కుమార్. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సనత్కుమార్ బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నప్పుడు ఇసుకలో బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్న సనత్ ఎదిగిన తర్వాత తన ఆలోచనలు సైకత చిత్రాల వైపు మళ్లాయి. జీవ వైవిధ్యం, సేవ్ ఓషన్, స్టాప్ టెర్ర రిజం, కాలుష్య నియంత్రణ, ఫ్లెమింగో పక్షుల సంరక్షణ...ఇలా అనేక సామాజిక స్పృహ కల్గించే సైకత చిత్రాలను రూపొందించాడు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైకతశిల్పాల రూపేణా వివరించాడు. ఎప్పటికైనా సైకత చిత్రాలు వేయడంలో అంతర్జాతీయ పోటీలలో పాల్గోని ప్రతిభ చూపెట్టాలనే లక్ష్యంతో పుష్కర కాలంగా సనత్కుమార్ పయనిస్తున్నాడు. విద్యార్థులకు సైకత చిత్రాలు వేయడంలో మెలకువలు నేర్పిస్తూ ఇప్పటి వరకు రెండు వేల మందికి ‘సాండ్ ఆర్ట్ ట్రైనింగ్’ ఇచ్చాడు. మైపాడు బీచ్లో 2017లో వంద మంది విద్యార్థులతో ఏకకాలంలో 1186 జాతీయ జెండా సైకత చిత్రాలను తయారు చేయించాడు. దాంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అండగా సైకత శిల్పాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై నూతనశకం ఆరంభమంటూ (న్యూ ఎరా బిగినింగ్ ఇన్ ఎడ్యుకేషన్) సైకత చిత్రం వేశాడు. బతుకులు మార్చే గుడి అమ్మ ఒడి, రక్షాబంధన్ రోజున దిశాయాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ సైకత చిత్రాలు తయారు చేశాడు. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి, నెల్లూరు -
టీడీపీ వర్గీయుల మరో వికృతక్రీడ.. ఒడిశా బాలికపై అత్యాచారం, హత్య?
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది.. బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీస్ కేసు కూడా లేదు.. బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
నెల్లూరు ఆనందయ్యకు నోటీసులు జారీ
-
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
-
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
-
ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదు: మంత్రి అనిల్ కుమార్
-
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది
-
టీడీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు
-
17 నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగాలని మంత్రులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అందరూ సమష్టిగా పని చేయడం ద్వారా జైత్రయాత్రను కొనసాగించాలని సూచించారు. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపించి అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం.. సంక్షేమ పథకాల ఫలాలను అందించడం.. అభివృద్ధిని చేతల్లో చూపడం ద్వారా ప్రజలకు చేరువయ్యామని చెప్పారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు తోడు నీడగా నిలిచామన్నారు. అందుకే మునిసిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో జనం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాలను అందించారని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మునిసిపాలిటీలకు నిర్వహించే ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు సాధించాలని మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో అజెండా ముగిశాక.. అధికారులు నిష్క్రమించిన అనంతరం రాష్ట్రంలో తాజా పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. ఎయిడెడ్ స్కూళ్లపై, గంజాయిపై టీడీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రులు ప్రస్తావించగా.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నవంబర్ 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
YSRCP :దెబ్బకి ఎన్నికలంటే బెంబేలెత్తిపోతున్న టీడీపీ
-
బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం
-
నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన
-
నెల్లూరు: మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం.. వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది.. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్ బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ.. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’! -
రియాల్టర్ హత్య: పరుష పదజాలమే ప్రాణం తీసిందా?
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: కేపీహెచ్పీ ప్రాంతానికి చెందిన రియల్టర్ విజయభాస్కర్రెడ్డి కిడ్నాప్, దారుణ హత్యకు సంబందించి గురూజీ విషయమై ఆయన వాడిన పరుష పదజాలమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్ కర్నూల్కు చెందిన మల్లేష్, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్బాబు, హైదరాబాద్ బోరబండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్నాథ్ అలియాస్ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ కస్టడీలో ఉన్న నిందితుల ద్వారా అతడి కదలికలకు సంబంధించిన వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వయంగా శుక్రవారం కేపీహెచ్బీ ఠాణాకు వచ్చి విచారణను పర్యవేక్షించారు. విజయభాస్కర్ హత్య కారణాలను అన్వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడని నిందితులు వెల్లడించారు. గురూజీకి రెండు రాష్ట్రాల్లోను భక్తులు ఉన్నారని, ఎక్కువ మంది ఆయన వద్దకు వైద్యం కోసం వచి్చన వారేనని చెప్పారు. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారని నిందితులు చెప్పినట్లు తెలిసింది. కొన్ని లావాదేవీల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. గొడవలు వద్దంటూ సర్ధిచెప్పేందుకు గత నెల 20న విజయభాస్కర్రెడ్డి ఉంటున్న హాస్టల్కు వెళ్లినట్లు తెలిపారు. అయితే విజయభాస్కర్రెడ్డి నిందితులతో పాటు వారి కుటుంబీకులను కించపరిచేలా మాట్లాడటంతోనే కిడ్నాప్, హత్యకు దారితీసినట్లు వెల్లడించారని తెలుస్తోంది. నిందితుల కస్టడీ ముగిసిన తర్వాతే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అప్పటివరకూ ఏమీ చెప్పలేమని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
రియల్టర్ భాస్కర్రెడ్డి హత్య కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్: నెల్లూరుకు చెందిన రియల్టర్ భాస్కర్రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్నాథ్ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం బెంగళూరు, చెన్నై, ఏపీలో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపీ డాక్టర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిఏ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాబా అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ డబ్బు, గుప్త నిధుల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. కాగా హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారి గత నెల కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్భాస్కర్ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. -
HYD: స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్, హత్య.. కుట్రలో ప్రముఖ గురూజీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్భాస్కర్ కొంత కాలంగా హైదరాబాద్లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. కేపీహెచ్బీ ఠాణా వెనకవైపు ఓ హాస్టల్లో ఉంటున్నాడు. గత నెల 20 నుంచి విజయ్భాస్కర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆయన అల్లుడు జయ సృజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్భాస్కర్ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు మరొకరు.. మొత్తం నలుగురు కలిసి భాస్కర్ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్ఫోన్లోఫోటో తీసి ఉంచుకున్నాడు. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ఈ గురూజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ ప్రముఖుడి స్థలంలో వెలికి తీసిన విలువైన లోహాన్ని విదేశీ కంపెనీకి విక్రయించడం కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. విజయ్రెడ్డితోపాటు ఆయనకు తెలిసిన వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బులిచనట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్ తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో విజయ్పై గురూజీ కోపం పెంచుకొని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్లో స్థిరాస్థి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. విజయ్భాస్కర్ హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు -
రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు..
నెల్లూరు: మనలో చాలా మందికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్ను ఇష్టంతో తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి స్నేహితులు.. ప్రేమికుల మధ్య ఏదైన చిరుకోపాలు వచ్చినప్పుడు చాక్లెట్లు ఇచ్చి వారి మనస్సును కూల్ చేసేస్తారు. అందుకే, ప్రేమికుల దినోత్సవానికి ముందు లవర్స్ చాక్లెట్డేను కూడా జరుపుకుంటారు. అయితే, ఇలాంటి చాక్లెట్లు రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పడికనిపించాయి. వివరాలు.. నెల్లూరులోని ఏసీ నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు.. రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. ఈ క్రమంలో వారు ఇంటికి వెళ్లి చూడగా.. ఆ చాక్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. అయితే, ఈ సంఘటనతో షాక్కు గురైన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పారిశుద్ధ్య అధికారులు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
నెల్లూరులో ఇసుక దుమారం: రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని సర్వేపల్లిలో టీడీపీ నేతల పర్యటనను రైతులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగిందో చూపించాలని టీడీపీ నేతలను రైతులు నిలదీశారు. తమ పొలాలకు సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తోలుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే, టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే ప్రశ్నించిన రైతులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన దళిత సర్పంచ్పై దౌర్జన్యానికి దిగారు. కాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దుమారం రేగింది. పెన్నా ఇసుక రీచ్ నుంచి అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీ చేశారని టీడీపీ ఆరోపించడంతో పెన్నా ఇసుక రీచ్లో అఖిలపక్షం పర్యటించింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేసి.. పేదల ఇండ్ల స్థలాల్లో తువ్వ ఇసుక నింపామని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని అఖిలపక్షాన్ని మంత్రి కోరారు. పెన్నా నదిలో ఇసుక తీసిన గుంటలను పరిశీలించిన అఖిలపక్షం నేతలు.. జీరో వాల్యూ ఇసుక మాత్రమే జగన్నన్న కాలనీల ఫిల్లింగ్ కి తరలించారని స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం అదే మొండి ఆరోపణలు వినిపిస్తోందని, ఒక దశలో టీడీపీ నేతల వైఖరి పట్ల మిగిలిన పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివాదం చేయడం కోసమే ఆరోపణలు చేయవద్దని టీడీపీ నేతలకు సూచించారు. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు -
ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై పరీక్షలు చేస్తున్నామంటూ జాప్యం చేయడం సరికాదంది. ఆనందయ్య ఔషధం తయారీ, దానికి అనుమతులు, పంపిణీ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కోవి డ్ మందు పంపిణీలో జోక్యం చేసుకోకుండా అధికా రుల ను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమ తులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లి కార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. ఆనందయ్య మందు నమూనాలను ఆయుష్ విభాగం ల్యాబ్కు పంపిందని, ఈ నెల 29న నివేదిక అందుతుందని చెప్పారు. ఈ మందు ప్రజా వినియోగానికి అనువైనదని తేలితే పంపిణీకి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తయారీదారు దరఖాస్తు చేసుకుంటే ఆ ఔషధాన్ని పరీక్షించి, ప్రజా వినియోగానికి యోగ్యమైనదిగా భావిస్తే పంపిణీకి అనుమతినిస్తామని చెప్పారు. ఆనందయ్య మందువల్ల దుష్ప్రభావాలు లేవని మీడియాలో ప్రచారమే తప్ప అధికారిక నివేదిక ఏదీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సాంకేతిక అంశాల జోలికి వెళ్లొదని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధానికి ఎవరు అనుమతులు ఇవ్వాలి? ఆ మందును ప్రజలకు ఇవ్వొచ్చా? లేదా? అన్న విషయాలను తదుపరి విచారణలో తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫార్ములా చెప్పాలని అధికారులు బెదిరిస్తున్నారు మరోవైపు.. తన ఔషధంలో ఉపయోగించే పదార్థాలు, ఫార్ములా చెప్పాలని నెల్లూరు జిల్లా అధికారులు బెదిరిస్తున్నారని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు భద్రత కూడా కల్పించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను కూడా ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది. -
దారుణం: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!
నెల్లూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగి దారిన పోయేవారిని తిట్టవద్దన్నందుకు ఓ వ్యక్తి పై మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ఉమ్మారెడ్డి గుంట లో మే1వ తేదీన జరిగిన దాడి లో తీవ్రగాయాల పాలైన అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఉండే జి.దిలీప్ తప్ప తాగి దారిన పోయే స్థానికులను దూషించేవాడు. స్థానికంగా ఉండే అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అలా తిట్టకూడదని వారించడంతో, అతనిపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దిలీప్, చక్రి, ప్రభు, యాలయ్య, ఆశా మురళి, కార్తీక్, ప్రకాష్ తో మరికొంత మంది కలిసి కొండాయపాలెం గేట్ పక్కనే ఉన్న అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లు పై కత్తులు, రాడ్లు, కర్రలతో ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇంట్లో మహిళలు,చిన్నపిల్లలు ఉన్నారనే విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లునీ కత్తులతో పొడిచి,రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అతణ్ణి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4గంటలకు మరణించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా సెక్రటరి మాదాల వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చదవండి:పనివాడే నిందితుడు -
భార్య ఫై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త
-
కరోనా సోకిందని కుటుంబాన్ని నిర్బంధించిన అపార్ట్ మెంట్ వాసులు
-
ఇచ్చినవే కావు ,ఇవ్వని హామీలను నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్
-
ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది:గురుమూర్తి
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ :నెల్లూరు జిల్లా
-
ప్రజల అండ ,ఆశీస్సులు నాపైన ఉండాలి :గురుమూర్తి
-
నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేయనున్న గురుమూర్తి
-
దట్టమైన సుడిగాలిలో క్రికెట్
సాక్షి, నెల్లూరు : ఒకప్పుడు సుడిగాలిని చూస్తే .. బెంబేలెత్తిపోతేవారు. సుడిగాలి రాగానే దెయ్యాలు భూతాలు అంటూ భ్రమ పడేవారు. కొంతమంది సుడిగాలి కనపడగానే దేవుళ్ళ పేర్లు తలుచుకొని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు. అయితే నెల్లూరు నగరంలో అలాంటి సుడిగాలిలో యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. స్థానిక వీఆర్సీ కాలేజి గ్రౌండ్లో బుధవారం భారీ సుడిగాలి ఒకటి చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడే క్రికెట్ ఆడుతున్న యువకులు దాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఓ యువకుడైతే దట్టమైన ఇసుకపొరతో సుడులు తిరుగుతున్న సుడిగాలి మధ్యన బ్యాట్ పట్టుకు నిలబడి ఎంజాయ్ చేశాడు. -
ఫిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు : దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజల హక్కులు.. దేశాభివృద్ధి కోసం మాట్లాడేవారని గుర్తుచేశారు. అటల్ తీసుకుని వచ్చిన సంస్కరణలతో దేశానికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ పార్లమెంట్ అనుభవం గడించిన ప్రధాని వాజ్పేయీదని, ఆయన చరిత్రను ప్రతి యువకుడు అధ్యయనం చేయాలని సూచించారు. అటల్, అద్వానీ లాంటి ఇద్దరు గొప్ప నేతల మధ్య తాను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. న్యూక్లియర్ పరీక్షల అనంతరం పార్లమెంట్లో ఒక్క ఓటు తేడాతో రాజీనామా చేశారని గుర్తుచేశారు. శనివారం నెల్లూరులో పర్యటించిన వెంకయ్య నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తే జాతీయవాదం కాదని, దేశహితమే జాతీయ వాదమని వ్యాఖ్యానించారు. ‘చర్చలు జరపడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుత నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ, వాటిని అమలు చేయడం మరుస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో నమ్మకం పోతుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు శారీరక దాడులకు పాల్పుడటం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిపాదించినా.. ప్రతిపక్షాలు వ్యతిరేఖించినా.. ఏం చేయాలన్నది చట్టసభకు వదిలేయాలి. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంను అపహాస్యం చేస్తున్నాయి. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్లోనే చెప్పాను. దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. అదిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఆ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తాత్కాలిక ఉపయోగం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం రాజకీయాలు చేయాలి.’ అని అన్నారు. -
నిప్పులు కక్కుతూ నింగిలోకి..
సాక్షి,అమరావతి/శ్రీహరికోట(సూళ్లూరుపేట ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 20.11 నిమిషాల వ్యవధిలో 1,410 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు అదుపులోకి తీసుకున్నారు. ఉపగ్రహానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా వెంటనే విచ్చుకున్నట్టు వారు చెప్పారు. 320 టన్నుల బరువుతో ప్రయాణం 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. కౌంట్డౌన్ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్ కంట్రోల్ రూమ్లో శాస్త్రవేత్తలు టెన్ నుంచి వన్ దాకా అంకెలు చెబుతూ జీరో రాగానే మంచు తెరలతో కూడిన మబ్బులను చీల్చుకుంటూ పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా నింగి వైపునకు దూసుకెళ్లింది. అది ఒక్కో దశను విజయవంతంగా దాటి వెళుతుంటే శాస్త్రవేత్తల వదనాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలోని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ సంతోషంగా లేచి సహచర శాస్త్రవేత్తలతో కరచాలనం చేశారు. విజయ పరంపర: ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్ నుంచి 77వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. గగన్యాన్–01 ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం 2021 ప్రారంభంలో పీఎస్ఎల్వీ సీ–51 ప్రయోగాన్ని ఫిక్సల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆనంద్ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, యూనిటిశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నట్టు చెప్పారు. స్పేస్ కిడ్స్ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను పంపిస్తామని చెప్పారు. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్–3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్–01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత గగన్యాన్–01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్ టీం, శాటిలైట్ టీంలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు. 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్ జీటీవో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్కు పంపిస్తామని శివన్ వివరించారు. ప్రయోగంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, పలు సెంటర్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు.. పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినదందనలు తెలిపారు. భారీ ప్రయోగాలే లక్ష్యం : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితుల దృష్ట్యా 8 నెలల పాటు ప్రయోగాలన్నింటికీ బ్రేక్ పడ్డాయని, ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించి రెండు ప్రయోగాలను విజయ వంతం చేయగలిగామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. 2021 సంవత్సరం స్పేస్ రీఫామ్ ఇయర్గా ఉంటుం దని తెలిపారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రసంగించారు. -
రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి
జైపూర్ : రాజస్తాన్లోని చిత్తోర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని 10 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికుల సహాయంతో అస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాహనాల అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు: నాయుడుపేట స్వర్ణముఖి వంతెనపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో చిన్నారి నదిలో పడి గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సైతం సహాయ చర్యల్లో పాల్లొంది. మృతులు విశాఖకు చెందిన సాయి, త్రినాథ్లుగా గుర్తించారు. మేనకూరు లోని గ్రీన్ టెక్ పరిశ్రమలో ఉద్యోగులుగా తెలుసింది. -
నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..
సాక్షి, చెన్నై : నివర్ తీవ్ర తుఫాను ప్రభావంతో తమిళానాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలో 26 విమానాలను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏటీఆర్ చిన్న విమానం, చెన్నై విమానాశ్రయంలోని టుటికోరిన్, ట్రిచీతోపాటు సేలంకు 12 విమానాలు ఇప్పటికే రద్దు చేశారు. మామల్లపురం చుట్టుపక్కల తీరప్రాంత ప్రజలు, ఫిషింగ్ ప్రాంత ప్రజల భద్రత కోసం అధికారులు ఎత్తైన మైదానాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఉపయోగించే పడవలు, ఫిషింగ్ నెట్స్ యంత్రాలను 30 మీటర్ల దూరంలో అధికారులు సురక్షితంగా ఉంచారు. తిరుపోరూర్లోని, తిరుక్కలుక్కున్ పరిసరాల్లోని ఉన్న 23 సరస్సులు, 23 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోయంబత్తూరులో సముద్రంలో అయిదు అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. నిండుకుండను తలపిస్తున్న స్వర్ణముఖి నెల్లూరు : నెల్లూరు జిల్లా వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వరద నీరు, తెలుగు గంగ నుంచి నీటిని విడుదల చేయడంతో స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. స్వర్ణముఖి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజి నీటితో స్వర్ణముఖి పరిధిలోని చెరువులు మొత్తం నిండాయని బ్యారేజ్ అధికారులు తెలిపారు. గతంలో బ్యారేజీ కుడికాలువకు గంగన్న పాలెం వద్ద తెగిపోవడంతో ఆ ప్రాంతం ముందస్తుగా కట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల భారీగా కురుస్తున్న వర్షాలతో సముద్రంలోకి వేటకి వచ్చిన 124 తమిళనాడు బోటులు పొర్టులో పార్కింగ్ చేశారు. (నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు) -
నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు
సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చదవండి: తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్ అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్ నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ప్రభావం కొనసాగుతుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కిలోమీటర్లు దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. చదవండి:నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం సాక్షి, వైఎస్సార్ కడప : నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు. (చదవండి: తిరుమలపై ‘నివర్’ ప్రభావం) సాక్షి, చిత్తూరు : నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నివర్ తుపాను ప్రభావం నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో 100 మంది నిరాశ్రయులైన గిరిజనులను ముందస్తుగా గుర్తించి పునరావాస కేంద్రంలకు తరలించినట్లు తెలిపారు. నివర్ తుపానుతో రేణిగుంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, ఆత్మకూరు: వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్యే కడతేర్చినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఆత్మకూరు మండలం దేపూరు ఎస్సీ కాలనీకి చెందిన కటారి వెంకటేశ్వర్లు(37), వెంకట సుబ్బమ్మ దంపతులు. జీవాలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకట సుబ్బమ్మ తన సమీప బంధువైన కొలకాని పెంచలయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా భర్త పలుమార్లు మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. చదవండి : ప్రేయసి మోసం, ప్రణయ్ ఆత్మహత్య ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వెంకటసుబ్బమ్మ, పెంచలయ్య గ్రామం విడిచి వెళ్లి ఆత్మకూరులో సహజీవనం సాగించారు. ఇటీవల విడిపోయి తిరిగి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. అయితే తిరిగి మళ్లీ వారిద్దరూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని వెంకటేశ్వర్లు గమనించి హెచ్చరించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కడతేర్చేందుకు ప్రణాళిక వేసింది. ఈ నెల 9న వెంకటేశ్వర్లు జీవాలకు మేత కోసం పొలాల్లోకి వెళుతుండగా గమనించి ప్రియుడితో కలిసి తోట దారి వద్ద తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత ఎలాంటి అనుమానం రాకుండా నిందితులు గ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 11న గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజాలు వెలుగు చూడడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్సైలు ఎం రవినాయక్, సీ సంతోష్కుమార్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..! ఆడుకునేందుకు వెళ్లి.. విద్యుదాఘాతానికి బాలుడి బలి కోట: స్థానిక అరుంధతీయ కాలనీలో దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం అందర్ని కలచి వేసింది. కోట ఇన్చార్జి ఎస్సై భోజ్యానాయక్ వివరాల మేరకు..అరుంధతీయ కాలనీకి చెందిన గోనిపాక కోటమ్మ కుమారుడు కిషోర్(11) తన స్నేహితులతో కలిసి కోటక్రాస్రోడ్డు వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ హరిహర రైస్మిల్లు సమీపంలో ఎత్తుగా ఉన్న వడ్ల పొట్టు వద్ద ఆడుకుంటున్న సమయంలో 11కేవీ విద్యుత్వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా, తల్లి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలుడి బంధువులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన హరిహర రైస్మిల్లు వద్ద ఆదివారం మృతదేహంతో ధర్నాకు దిగారు. రైస్మిల్లు యాజమాన్యం 11కేవీ విద్యుత్ వైర్లు తగిలేంత వరకు వడ్ల పొట్టును పోయడం..పొట్టులో విద్యుత్వైర్లు కూరుకుపోయి కనిపించకుండా ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. రైస్మిల్లు యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని పట్టుబట్టారు. దీంతో ఇన్చార్జి ఎస్సై భోజ్యానాయక్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. మోటార్ వేస్తుండగా.. నెల్లూరు(క్రైమ్): విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన సప్తగిరిలేఅవుట్లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..సప్తగిరి లేఅవుట్లో పీ బాలంకిరెడ్డి (48), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 14న ఉదయం సంపులోని వర్షపునీటిని తోడేందుకు బాలంకిరెడ్డి సెల్లార్లోని మోటార్ వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బాలంకిరెడ్డి విద్యుదాఘాతానికి గురవగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బొల్లినేని(కిమ్స్) ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వేదాయపాళెం ఎస్సై ఎం పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేçస్తున్నారు. సముద్రంలో మునిగి యువకుడి మృతి ఇందుకూరుపేట: సముద్రంలో మునిగి బెంగళూరుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మైపాడు బీచ్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రిషిశెట్టి తన కుటుంబ సభ్యులు ఆరుగురితో కలిసి కారులో తీర్థయాత్రలకు బయలుదేరారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలను దర్శించుకున్న వీరు సేదతీరేందుకు మైపాడు బీచ్కు ఆదివారం చేరుకున్నారు. అందరూ కలిసి సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో రిషిశెట్టి పెద్దకుమారుడు కిరణ్ ఆర్ శెట్టి(21)కు ఈత వచ్చి ఉండడంతో సముద్రంలో కొద్దిగా లోపలకు వెళ్లాడు. సముద్రం కసురు మీద ఉండడంతో అలల తాకిడికి నీటి మునిగి గల్లంతయ్యారు. కొద్దిసేపటి తరువాత విగతజీవిగా ఒడ్డుకు కొట్టుకురావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇందుకూరుపేట ఎస్సై నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించారు. -
మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ
సాక్షి, నెల్లూరు : చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామంలో శనివారం విషాదం అలుముకుంది. అత్తారింటి వేధింపులు భరించలేక సునీత అనే 28 సంవత్సరాల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తలూరు సమీపంలో చెక్ డ్యాంలో దూకి అర్థాంతరంగా తనువు చాలించింది. అయితే అత్తారింటి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సునీత తన డైరీలో అయిదు పేజీల లేఖ రాసింది. చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య -
‘రైతుల కోసమే సీఎం జగన్ నిర్ణయం’
సాక్షి, నెల్లూరు : రైతుల ప్రయోజనం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. నెల్లూరులో రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాయింట్ కలెక్టర్ను నోడల్ అధికారిగా నియమించి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. జిల్లాలోని గోదాములలోని బియ్యాన్ని ఇతర జిల్లాలకు పంపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు గడువును పెంచేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి చేశారని, కేంద్ర బృందం పర్యటన తర్వాత పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. (ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..) -
జాబ్ కోసం ఫేక్?
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా కొందరు ఫేక్ మార్కుల జాబితాలతో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎలా వచ్చాయి? మొదటిసారి ప్రకటించించిన జాబితాలో ఓ అభ్యర్థికి 1014 మార్కులున్నట్లుగా చూపారు. ఫైనల్ మెరిట్ జాబితాలో 811 మార్కులని ఉంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో 65, 73, 76, 93 ఇలా ఓ పదిమందికి సంబంధించిన ర్యాంకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నర్సింగ్ కోర్సులో తక్కువ మార్కులు వచ్చినా ప్రకటించిన ప్రొవిజనల్ జాబితాలో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అభ్యంతరాలు స్వీకరించినా సోమవారం ఫైనల్ మెరిట్ జాబితాను ప్రచురించామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆ జాబితాను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక్కసారిగా.. ఏమి జరిగిందో గానీ మార్కుల జాబితాలో పైన పేర్కొన్న పలువురి ర్యాంకులు తలకిందులయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా లిస్ట్ను మార్పు చేశారు. అప్పటివరకు ఎక్కువ మార్కులు పొంది, మెరిట్ లిస్ట్లో ముందు వరుసలో ఉన్న కొందరికి తక్కువ మార్కులు చూపిస్తూ రెండో జాబితాను వెబ్సైట్లో ప్రదర్శించారు. దీంతో ర్యాంకుల పరంగా ఒక్కసారిగా వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకరికి పొరపాటున మార్కులు ఎక్కువ పడ్డాయని వాటిని సరి చేశామన్నారు. మరో ఏడుగురి సర్టిఫికెట్లæపై సందేహాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు వైద్యవిధాన పరిషత్లోని (ఏపీవీపీ) పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీవీపీలోని పోస్టుల్లో కూడా తమ నర్సింగ్ కోర్సులో ఎక్కువ మార్కులు పొందినట్లుగా చూపారు. ఇదే అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం పరిశీలిస్తే డీఎంహెచ్ఓ పోస్టులకు సంబంధించి ప్రదర్శించిన జాబితాలో తక్కువ మార్కులు ఉండడం.. ఏపీవీపీ పోస్టుల్లో ఎక్కువ మార్కులుండడాన్ని చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయమై డీసీహెచ్ చెన్నయ్యను వివరణ కోరగా నర్స్ పోస్టు కోసం ఒకరు దరఖాస్తు చేసిన మార్కుల జాబితాపై ఫిర్యాదు అందిందన్నారు. దానిని పరిశీలించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరగా ఆమె ఈ రోజు వస్తానని చెప్పి రాలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఆమెది ఫేక్ మార్కుల జాబితా అయి ఉండవచ్చన్నారు. ఉద్యోగాల్లో చేర్చుకునేప్పుడు అన్ని మార్కుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసినట్లుగా తేలితే వారిపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం -
దేవినేని ఉమాకు మంత్రి అనిల్ సవాల్
సాక్షి, నెల్లూరు : కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడంలేదని నిలదీశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాలు విసిరారు. దేవినేని ఉమా నిత్యం అబద్దాలు చెబుతూనే ఉంటారని, అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. (అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని తొలుత పెంచింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు. కృష్ణా నది వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారిగా వైఎస్ జగన్నేతృత్వంలో సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామని తెలిపారు. టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కనీసం చేయలేదని, నిత్యం మాటలతోనే కాలయాపన చేశారని మండిపడ్డారు. -
చేయి తడిపితే చాలు.. ఏ భూమైనా..
జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి హద్దే లేకుండా పోయింది. చేయి తడిపితే చాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు సబ్రిజిస్ట్రార్లు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో రూ.10 కోట్ల విలువజేసే భూమిపై న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కోవూరు మేజర్ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 295లో 3.30 ఎకరాలు భూమి ఉంది. ఆ గ్రామంలో అగర్వాల్ నారాయణదాసుకు సంబంధించిన ఆస్తి ఉంది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వారసులుగా ఉన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ధర రూ.10 కోట్లుగా ఉంది. ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని కారుచౌకగా కొట్టేయాలని పథకం వేసిన టీడీపీ నేత అగర్వాల్ నారాయణ దాసుకు చెందిన ఓ కుమార్తె పద్మాబాయ్ ఆరుగురు పిల్లలను వారసులుగా చూపించి ఆ భూమిని 2010లో జీపీ (జనరల్ పవరాఫ్ పట్టా) కమ్ సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ భూమికి ఇంకా వారసులు చాలా మంది ఉన్పప్పటికీ ఒక కుమార్తె పిల్లల చేత అక్రమంగా జీపీ చేయించుకుని భూమిని సొంతం చేసుకునేలా పథకం వేశారు. ఆ భూమిని ఇతరులు కొనుగోలు చేయకుండా అప్పటి జిల్లా తెలుగు యువత నేతతో కుమ్మక్కై న స్థానిక టీడీపీ నేత మాస్టర్ప్లాన్ వేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఆ ఇద్దరు మధ్య వివాదం ఉన్నట్లు సృష్టించి జిల్లా జడ్జి కోర్టులో ఇంజక్షన్ అర్డర్ తెచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆర్.శేఖర్బాబు అలియాస్ యల్లారెడ్డి కూడా పద్మాబాయ్ అక్క సుందరాబాయ్ పిల్లల చేత ఆ భూమిలో సగభాగం 1.67 సెంట్లు భూమిని సేల్ డీడ్ను 2013లో చేయించుకున్నాడు. దీంతో వారి మధ్య భూ వివాదం తలెత్తింది. న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టారు. న్యాయస్థానం ఉత్తర్వులున్నా.. కోవూరుకు చెందిన 295 సర్వే నంబర్పై జిల్లా ఐదో జిల్లా జడ్జి కోర్టులో ఆ భూమిని ఎవరూ క్రయ, విక్రయాలు చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ 2012 డిసెంబర్ 26వ తేదీన అప్పటి కోవూరు సబ్రిజిస్ట్రార్ కె.శోభమ్మ 30 అంకణాలను డాక్యుమెంట్ నంబరు 2327–2012 రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటికే ఆ భూమిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లినా ఆ సర్వే నంబర్ను నిషేధిత జాబితాలో నమోదు చేయకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది. మరో ఏడాది పాటు 2013 డిసెంబర్ వరకు కోర్టు ఉత్తర్వులు ఉన్న ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చకుండా కావాలనే జాప్యం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. ఆపై అదే భూమిని నెల్లూరు స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నాగేశ్వరరావు సబ్రిజిస్ట్రార్ కూడా 4159–2013, 4409–2013, 4410–2013 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే జీïïపీఏ కమ్ సేల్ చేసిన వ్యక్తి అగర్వాల్ రామ్ ప్యారీ అనే వ్యక్తి మరణించాడు. జీపీఏ చేసిన వ్యక్తి చనిపోతే జీపీ కమ్ సేల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్గా రద్దు అయిపోయింది. కానీ ఇవేమీ పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశాడు. అలాగే అదే సర్వే నంబరును అల్లూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్రిజిస్ట్రార్ సింహాద్రినాయుడు డాక్యుమెంట్ నంబర్లు 823–2013, 824–2013, 825–2013, అలాగే నెల్లూరు స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్లు 822–2014, 823–2014, 1540–2014, 3306–2014, 3854–2014, 3855–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. 2013లో నెల్లూరు స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్గా ఉన్న నాగేశ్వరరావు 2015లో కోవూరు సబ్రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో కూడా డాక్యుమెంట్ నంబర్లు 361–2015, 362–2015, 458–2015,1661–2015, 1686–2015గా మరోసారి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 2014లో స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్గా ఉన్న నందకిశోర్ కూడా అదే సర్వే నంబర్ను డాక్యుమెంట్ నంబర్లు 4202–2014, 4203–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. టీడీపీ హయాంలో నివేదకలు తొక్కిపెట్టి.. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా లబ్ధిపొందిన ఆ ఐదుగురు సబ్రిజిస్ట్రార్లపై శేఖర్బాబు అలియాస్ ఎల్లారెడ్ది ఫిర్యాదు మేరకు టీడీపీ హయాంలో పలుమార్లు విచారణ చేపట్టి నివేదిక తొక్కిపెట్టారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ అండతో నివేదికలను తొక్కి పెట్టి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అవినీతి బాగోతం వెనుక గతంలో రిజిస్ట్రేషన్శాఖ జిల్లా డీఐజీగా పనిచేసిన అధికారితోపాటు అప్పటి నెల్లూరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గత ఐదేళ్ల పాటు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేశారు. న్యాయం కోసం లోకాయుక్తకు ఫిర్యాదు టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఎల్లారెడ్డి న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయించాడు. గతంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మునిశంకరయ్య అక్రమ రిజిస్ట్రేషన్లపై వాస్తవ నివేదిక ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని, గత ఐదేళ్లగా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ అవినీతికి ఉన్నతాధికారులు కొమ్ముకాస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లోకాయుక్త వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో మరోసారి విచారణ అవినీతి రహిత పాలనలో ముందుకెళ్తున్నా ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి అధికారులపై మరోసారి విచారణకు ఆదేశించారు. రెండు నెలలుగా విచారణ చేపట్టిన అధికారులు ఐదుగురు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది వాస్తవమే అన్నట్లు నిర్ధారించి నివేదిక తయారు చేశారు. -
ఉమాకు కొత్త బట్టలు పెడతా: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు : చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడి చేశారని, పోలవరం పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 35 శాతం కూడా పోలవరం పనులు చేయకుండా.. కాంక్రీటులో గిన్నిస్ రికార్డులు వచ్చాయని దుష్ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.. అదే విధంగా టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. దానికి దేవినేని ఉమాను కూడా ఆహ్వానిస్తామని.. కొత్త బట్టలు కూడా పెడతామని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్లో వెయ్యి కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదా చేశారని, తమ దోపిడి వ్యవహారం బయటకు వస్తుండటంతో తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర కుమారుడు అంటే ఎవరో అందరికీ తెలుసని, ఆడా.. మగా కానీ ఉమా.. తనపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ‘నేను ఏం చదువుకున్నానో అందరికీ తెలుసు.. నువ్వు ఎవరిని చంపి రాజకీయాల్లోకి వచ్చావో తెలుసుకో’ అంటూ ఉమాపై విరుచుకుపడ్డారు. -
‘ఆ భూములు రైతులకు ఇవ్వడమే సముచితం’
సాక్షి, నెల్లూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేలాది కటుంబాలు సంతోషిస్తున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఈ సారి శాసనసభ సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. సమావేశాల్లో 16 చట్టాలను ప్రభుత్వం తీసుకుని రావడమే కాకుండా వాటిపై పూర్తి స్థాయిలో చర్చ జరగడం హర్షనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను విభజించడం వల్ల వారికి మరింత ప్రయోజనం కలగనుందన్నారు. చంద్రబాబు రాజధానికి 40 వేల ఎకరాలు సేకరించి.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేవలం ఒక వర్గం ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నించారని మండిపడ్డారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని, టీడీపీ నేతలకు అప్పగించారని ఆరోపించారు. రైతులకు చెందిన అసైన్మెంట్ భూములను వారికే ఇవ్వడం సముచితమన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సంస్కారానికి నిదర్శనమని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడిండ్కు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని, ప్రజలు కూడా ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా భావించి గత ఎన్నికల్లో తొలగించారని దుయ్యబట్టారు. -
అర్హత లేకపోయినా కొలువులు
సాక్షి, నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాలన వ్యవహారాలు, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన ఉన్నతాధికారులే అక్రమ బాట పట్టారు. యూజీసీ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారు. అధ్యాపకుల కొరత ఉన్న చోట రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలనే ఆదేశాలను పక్కదోవ పట్టించారు. అర్హత లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమకు ఇష్టమున్న వారిని అవుట్సోర్సింగ్ కింద నియమించారు. ఈ తరుణంలో అక్రమ మార్గంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు పొందిన రిటైర్డ్ ఉద్యోగుల ఉద్వాసనకు నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత నెల 18న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగి నెల కావస్తున్నా వర్సిటీ ఉన్నతాధికారులు వారిని తొలగించేందుకు ఇష్టపడటం లేదు. వారి అస్మదీయులను కాపాడుకునేందుకే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలుగా నియామకాలు వర్సిటీలో నియామకాలు చేపట్టాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. వర్సిటీలో ఏయే పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంది. దీన్ని వర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చాలి. అర్హులను గుర్తించి వారిని విధుల్లోకి తీసుకోవాలి. అయితే విక్రమ సింహపురి వర్సిటీలో ఈ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమ అనుయాయులను నియమించుకున్నారు. వర్సిటీలో బోధనకు విశ్రాంత ఉద్యోగులను తీసుకోవాలని ఇచ్చిన జీఓను పక్కదారి పట్టించారు. సాధారణంగా వర్సిటీలో బోధనకు విశ్రాంత ప్రొఫెసర్లను తీసుకోవాల్సి ఉంది. అయితే అప్పటి ఉన్నతాధికారులు కేవలం డిగ్రీ అధ్యాపకులుగా పనిచేస్తూ రిటైరైన వారిని వర్సిటీలోకి తీసుకున్నారు. వీరిలో 70 ఏళ్లు పైబడిన వారూ ఉండటం గమనార్హం. దీంతో పాటు భార్య, భర్తలకు అర్హత లేకపోయినా అవుట్సోర్సింగ్ కింద అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు విధుల్లోకి తీసుకున్నారు. వర్సిటీలో ప్రస్తు తం 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విశ్రాంత ప్రొఫెసర్లు ఉన్నారని తెలిసింది. వీరితో పాటు నాన్ టీచింగ్ కింద నిబంధనలను పాటించకుండా నియమించారు. వీరు ప్రతి నెలా పింఛన్తో పాటు యూనివర్సిటీ నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నారు. ఉత్తర్వులను పెడచెవిన పెట్టారు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న విశ్రాంత టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగించాలని గత నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నేటికీ విక్రమ సింహపురి యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపులో తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే పాలన అవుట్సోర్సింగ్ కింద నియమితులైన విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలన, వ్యవహారాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా నాన్ టీచింగ్లో పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులు వర్సిటీ వీసీతో పాటు రిజి్రస్టార్లను శాసిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అడ్మిని్రస్టేషన్లో వీరి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. వీరు చెప్పిందే అక్కడ జరుగుతోంది. వీరికి గత ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో యూనివర్సిటీలో చక్రం తిప్పారు. వీరితో పాటు టీచింగ్ కేటగిరీల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు కూడా వర్సిటీ పాలన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. -
నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం
-
నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నబజారు ప్రాంతంలోని శ్రీ కనకదుర్గా మెటల్ ఎంటర్ ప్రైజెస్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ గల ప్లాస్టిక్ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని ఖాళీ చేయిస్తూ..రాత్రి నుంచి మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కలెక్టర్ శేషగిరి బాబు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా విద్యుత్శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. మొన్నటి వరకు హోంమంత్రి మేకతోటి సుచరిత జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆమె స్థానంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ను కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డిని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. -
కుప్పకూలిన భవనం
సాక్షి,కావలి(నెల్లూరు) : పట్టణంలో సుమారు 90 ఏళ్ల నాటి కాలం చెల్లిన శిథిల భవనం శనివారం రాత్రి కుప్పకూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిల భవనం కూలిన వేళ రాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. పగలు కూలిపోయి ఉంటే పరిస్థితి ఊహకే అందడం లేదు. దేశానికి స్వాతంత్రం రాక ముందే నిర్మించి ఈ భవనం శిథిలమైపోయింది. ఈ భవనంలో పండ్లు, పూలు అమ్మకాలు చేసే వ్యాపారులు ఉంటారు. నిత్యం ఈ భవనం వద్ద కొనుగోలుదారులు కిక్కిరిసి ఉంటారు. ట్రంక్రోడ్డులోని నిత్యం జనాలతో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలి ప్రాంతంలోనే ఈ శిధిల భవనం ఉండడం గమనార్హం. శిథిలమైన ఈ భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చని మునిసిపాలిటీ అధికారులు 2013లోనే గుర్తించారు. అయితే 2015లో మునిసిపాలిటీ అధికారులు ఈ కాలం చెల్లిన భవన యజమాని నల్లూరి రమేష్కు నోటీసులు జారీ చేసి, కూల్చేయాలని తెలియజేశారు. అయితే భవన యజమాని ఈ భవనాన్ని పండ్లు, కూరగాయలు అమ్మకాలు చేసే వారికి అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దెలకు కక్కుర్తి పడిన భవన యజమాని నల్లూరి రమేష్తో మునిసిపాలిటీ అధికారులు అమ్యామ్యాలతో చేతులు తడుపుకుని, ఇక ఈ భవనం వైపు కన్నెత్తి చూడడం మానుకొన్నారు. ఇలా ఆరేళ్లుగా మునిసిపాలిటీ ఈ కాలం చెల్లిన శిథిల భవనం సంగతిని పట్టించుకోకపోవడంతో, భవన యజమాని నల్లూరి రమేష్ అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలో భవనం కుప్ప కూలిపోయింది. శిథిలమైన భవనం కూలిపోగా, మిగిలిన భవనంతోనే పండ్లు అమ్మకాలు చేసే వారితో వ్యాపారాలు చేయిస్తూ అద్దె రాబడిని శిథిల భవన యజమాని కొనసాగిస్తున్నాడు. రద్దీగా ఉన్న వాణిజ్య ప్రదేశంలో శిథిలమైపోయిన కాలం చెల్లిన భవనం కూలిపోతే వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన మునిసిపాలిటీ, ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం భవన యజమాని విదిల్చే కాసులకు కక్కుర్తిపడి మునిసిపాలిటీ ప్రజల ప్రాణాలకు ముప్పుతో ముడిపడి ఉన్న కాలం చెల్లిన భవనాన్ని తొలిగించేందుకు చర్యలు తీసుకోవలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు
సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్యూ)లో సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. సభా వేదికను పరిశీలించిన తరువాత వీఎస్యూ సెమినార్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించనుండటంతో ఆ పథకం లబ్ధిదారులు, వలంటీర్లు సభకు తరలివచ్చేలా చూడాలని అధికారులకు సూచించామని కలెక్టర్ శేషగిరిబాబు చెప్పారు. సభావేదిక వద్ద ఏర్పాట్లను అధికార సిబ్బందితో త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఎక్కువగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం రైతులకు గర్వకారణమన్నారు. నవరత్నాలలో ప్రతిష్టాత్మకమైన రైతు భరోసాను నెల్లూరు నుంచే ప్రారంభించాలనుకోవడం జిల్లాపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానాన్ని చాటిచెప్పుతుందన్నారు. రైతులు, ప్రజలు అంతా కలిసి 50 వేలమందికి పైగా రైతు భరోసా కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా చిన్నపొరపాట్లు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. అధికారయంత్రాంగం, జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ సమష్టి కృషితో సీఎం జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. రబీ సీజన్కు ముందు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ శీనానాయక్, వీఎస్యూ రిజిస్ట్రార్ అందె ప్రసాద్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సీఎం జగన్కు ఘనస్వాగతం పలుకుదాం సభ్యుడు మందల వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
హోంగార్డులు ఇక ఖుషీ.. ఖుషీగా
సాక్షి, నెల్లూరు : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా హోంగార్డ్స్ దినసరి వేతనాలను పెంచుతూ జీఓ జారీ చేశారు. ఎన్నికల ప్రచార సభలో మీ సమస్యలను ‘నేను విన్నాను.. మీకు నేనున్నానంటూ’ వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు సిబ్బందికి భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీక్లి ఆఫ్ అమలు చేయడంతో పాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూన్లో వీక్లీ ఆఫ్ను అమల్లోకి తీసుకు వస్తూ జీఓ జారీ చేశారు. తాజాగా శనివారం హోంగార్డ్స్ దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేశారు. ముఖ్యమంత్రి చర్యలతో హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ముక్త కంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో 769 మంది హోంగార్డులు ఉన్నారు. వీరిలో 617 మంది పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తుండగా 157 మంది డిప్యుటేషన్పై ఆర్టీసీ, జైళ్లు, విజిలెన్స్, ట్రాన్స్కో, ఎఫ్సీఐ, ఏసీబీ, దూరదర్శన్, ఆర్టీఓ, అగ్నిమాపకశాఖ తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారు. అయితే వీరికిచ్చే జీతం అంతంత మాత్రంగానే ఉండేది. గత ప్రభుత్వాలు వీరికి నామ మాత్రంగా వేతనాలు పెంచడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. పెరిగిన జీతాలు సైతం కాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెరిగిన అవసరాలకు సరిపడా వేతనాలు పెంచాలని పలు దఫాలుగా గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండాపోయింది. హామీని నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారంలో హోంగార్డులు తమ సమస్యలను అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సాధక బాధలను విన్న ఆయన నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి శనివారం హోంగార్డుల దినసరి వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు నెలకు సగటున రూ.18,000 వేతనం హోంగార్డులకు వచ్చేది. తాజా పెంపుతో (30 రోజులకు) రూ. 21,300 రానుంది. వేతన పెంపుపై హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రుణపడి ఉంటాం మా సాధక బాధలు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైన వేతనాలు అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేసి మాటతప్పని మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేశారు. హోంగార్డులందరూ ఆయనకు రుణపడి ఉన్నారు. – పి. శరత్బాబు, హోంగార్డు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఓ విడుదల చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి చర్యలపై హోంగార్డులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జిల్లా హోంగార్డుల తరఫున కృతజ్ఞతలు – ఆర్ సునీల్కుమార్, హోంగార్డు -
15న నెల్లూరులో రైతు భరోసా ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతున్నది. నెల్లూరు నగర సమీపంలోని కాకుటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తొలుత ఆయన ఆరోజు ఉదయం 10.30గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆ తరువాత కౌలు రైతులకు కార్డుల పంపిణీ అనంతరం రైతులకు వైఎస్సార్ రైతుభరోసా చెక్కులను పంపిణీ చేసి అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు వైస్సార్సీపీ నేతలు,అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మంత్రి అనిల్కుమార్ యాదవ్ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. -
15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. -
నెల్లూరులో హర్యానా దొంగల ముఠా అరెస్టు
సాక్షి, నెల్లూరు : ఏటీఎమ్ సెంటర్లలో వృద్ధులను ఏమార్చి స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా క్లోనింగ్కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు సుమారు 14 రాష్ట్రాలలో వెయ్యికి పైగా నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సందీప్ కుమార్, మంజీత్, దయానంద్లు హర్యానా రాష్ట్రానికి చెందిన వారని, ఇప్పటికే వీరిపై 49పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఆంగీకరించారని, వారి నుంచి రూ. 7.5 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్ టాప్, నకిలీ ఏటీఎమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. -
ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారం
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు) : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంపసముద్రంలో సోమవారం ఆయన పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుందని, ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కూడా ఆత్మకూరులోని తమ కార్యాలయంలో ఎంజీఆర్ హెల్ప్లైన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంజీఆర్ హెల్ప్లైన్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని ఓఎస్డీ చెన్నయ్య చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎంజీఆర్ హెల్ప్లైన్కు చెప్పాలన్నారు. గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ కలసి మెలసి ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యాలయం సచివాలయంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఈశ్వర్రెడ్డి, సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చెన్ను శ్రీధర్రెడ్డి, యర్రమళ్ల చిన్నారెడ్డి, గోపవరం కాంతారెడ్డి, బాబునాయుడు, కొండ్రెడ్డి రమణారెడ్డి, హజరత్ రెడ్డి, చిన్నమాచనూరు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల అత్యుత్సాహం
సాక్షి, నెల్లూరు(కలిగిరి) : మండలంలోని భట్టువారిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన బలం లేకపోయినప్పటికీ ఎలాగైనా ఎన్నికను నిలిపివేయాలని అత్యుత్సహం చూపారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం 47 ఓట్లు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు ఎం.ప్రభాకరరావు, కానిస్టేబుల్ గోపీ సమక్షంలో ఓటర్లను పేరుపేరునా పిలిచారు. ఓ వర్గానికి అనుకూలంగా ఉన్న వారు 30 మంది ఎన్నికలు నిర్వహించే గదిలోకి వెళ్లారు. టీడీపీ నాయకుల వద్ద ఉన్న 17 మందిని పాఠశాల ఆవరణలోనే ఒక్క పక్కన ఉంచి లోపలికి పంపలేదు. సరిపడా కోరం ఉండడంతో హెచ్ఎం ఎన్నికను ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నాయకులు అక్కడి చేరుకొని ఎన్నికను అడ్డుకొని రసాభాస చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎస్సై పి.ఆదిలక్ష్మి అక్కడి చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకులను మందలించారు. పాఠశాల ఆవరణలో నుంచి ఇరువర్గాలను బయటకు పంపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంతో ఎస్సై ఆదిలక్ష్మి విధి నిర్వహణలో వేరే గ్రామానికి వెళ్లగా టీడీపీ నాయకులు మరలా ఎన్నికలను నిలిపివేయడానికి కుటిల యత్నాలు మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై మరలా పాఠశాల వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పాఠశాల ఎన్నికల్లో జ్యోకంగా చేసుకోవడం సరికాదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మందలించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించి ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. చైర్మన్గా ఆదినారాయణమ్మ గెలుపొందగా, వైస్ చైర్మన్గా పెసల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కొలువుల కల.. నెరవేరిన వేళ
నిరుద్యోగుల్లో ఉద్యోగాల ఆనంద కేళి. సర్కార్ కొలువుల కోసం ఏళ్లతరబడి నిరీక్షించిన నిరుద్యోగుల కల.. నెరవేరిన వేళ. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నవరత్నాల అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మకంగా గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టారు. సాక్షి, నెల్లూరు : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక తుది ఘట్టానికి చేరింది. నోటిఫికేషన్ ప్రక్రియ నుంచి నియామక పత్రాల వరకు అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత జాబితా వరకూ అంతా పక్కాగా సిద్ధం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు అధికారులు రోస్టర్, రిజర్వేషన్లను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. 19 శాఖలకు చెందిన అధికారులు తమ, తమ శాఖల పరిధిలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. తొలి రోజు నగరంలోని రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపించారు. మొత్తం 7,814 గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తొలి రోజు 1,400 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేయనున్నారు. 1.1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్లెటర్లు పంపించారు. జిల్లాలో 665 గ్రామ సచివాలయాలకు 7,814 పోస్టులకు గాను 1,17,138 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నియామక ప్రక్రియ అంతా జిల్లా పరిషత్ కార్యాలయం కేంద్రంగా జరుగుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులు (24, 25, 26 తేదీలు) పాటు ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు మేరకు జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి అన్ని శాఖల అధికారులతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రోస్టర్, రిజర్వేషన్ల ప్రక్రియను ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకుని ధ్రువపత్రాల తనిఖీ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. రోస్టర్తో మెరిట్ జాబితాను సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు జెడ్పీ కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బందిని నియమించారు. గ్రామాల నుంచి వచ్చే వారి సందేహాలను ఆ సిబ్బంది తీరుస్తూ ధ్రువపత్రాల పరిశీలినకు వెళ్లాల్సిన సెంటర్, అడ్రసు, తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లను వివరిస్తున్నారు. రెండు కేంద్రాల్లో తొలి రోజు మంగళవారం 6 రకాల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ్ర«ధువ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. రెండు పూటలా ఈ పరిశీలన జరుగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను , ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సర్వోదయ కళాశాలలో పరిశీల కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఆరు శాఖలకు.. తొలి రోజు విలేజ్ సెరికల్చరల్ అసిస్టెంట్, గ్రామ మత్స్య సహాయకులు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలిన జరుగుతుంది. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో పరిశీలన జరుగుతోంది. ఇదిలా ఉండగా సెరికల్చర్ శాఖలో కేవలం ఇద్దరికే పోస్టులు దక్కనున్నాయి. వీరి హాల్ టికెట్ నంబర్లు 190916000058, 190516000111. గ్రామ మత్స్య శాఖ సహాయకులకు సంబంధించి 68 మందిని, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగంలో 165 మందికి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి 82 మందికి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీరందరికీ దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అర్హతల పత్రాలు పరిశీలిస్తారు. సర్వోదయ కళాశాలలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుల్లో 147 మందికి, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల్లో 154 మందికి ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న సర్వోదయ కళాశాలలో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. ఉదయం 10 గంటల నుంచే ఈ ప్రక్రియ జరుగుతోంది. ⇒ శనివారం రాత్రి అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను ఆన్లైన్లో ఉంచారు. సోమవారం ఆన్లైన్లో ఉంచిన మెరిట్ లిస్ట్ను జెడ్పీ, హాజరు కావాల్సిన కేంద్రాల వద్ద నోటిస్బోర్డులో పెట్టారు. ఆదివారం నుంచే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని అభ్యర్థులకు సెల్ఫోన్ ద్వారా మెసేజ్ను పంపారు. ఈ మెయిల్ ఉన్న వారికి మెయిల్లో సైతం సమాచారం పంపారు. ⇒ ఈ పరిశీలనకు సకాలంలో ఎవరైనా హాజరు కాలేకపోతే ఇంకొక అవకాశం కల్పిస్తారు. ⇒ అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారుల నుంచి పొందడంలో ఆలస్యమైతే అలాంటి వారు ఈ రెండో చాన్స్ను ఉపయోగించుకోవచ్చు. ⇒ హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షామియానాలు తదితర కనీస వసతులు కేంద్రాల వద్ద కల్పించారు. 25వ తేదీన.. నెల్లూరు(పొగతోట): 25వ తేదీన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల (గ్రేడ్–2) ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న కాకుండా 25వ తేదీన జరుగుతుందని వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి 25న ఉదయం 9.00 గంటలకు పీఎన్ఎం హైస్కూల్ జెండావీధిలో పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు.అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లకు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హర్టికల్చర్ ఏడి కే ప్రదీప్కుమార్ తెలిపారు. 26న ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు నెల్లూరు(వేదాయపాళెం): సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ పరీక్షల్లో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సర్వోదయ కళాశాలలో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక శాఖ ఉప సంచాలకులు బి.జీవపుత్రకుమార్ తెలిపారు. కొండాయపాళెం గేటు సెంటర్లోని డీడీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి కె.రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి విద్యారాణి, సహాయ సంక్షేమాధికారులు నరసారెడ్డి, లక్ష్మీ ప్రసూన, తేజోవతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే.. నెల్లూరు(పొగతోట) : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు రోస్టర్తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నుంచి గురువారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుందని వివరించారు. ప్రస్తుతానికి మొదటి రోజు హాజరుకావాల్సిన వారి మెరిట్ జాబితాలను సిద్ధం చేశామని, అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారమిచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు 8 శాఖల మెరిట్ జాబితాలు సిద్ధమయ్యాయని వివరించారు. బుధవారం పరిశీలనకు హాజరుకావాల్సిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా రోస్టర్తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. జెడ్పీ కార్యాలయ కేంద్రంగా కసరత్తు జరుగుతోందన్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలో రోస్టర్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, అనంతరం ప్రింట్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు సకాలంలో అందజేసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను జెడ్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. -
దక్షిణ కొరియా బృందంతో మంత్రి గౌతంరెడ్డి భేటీ
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై దక్షిణ కొరియా ప్రతినిధుల బృందంతో వాణిజ్య,సమాచార శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చర్చలు జరిపారు. రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేయానుకుంటుందో బృందానికి వివరించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీని తీసుకురానున్నామని, త్వరలో రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీల ఏర్పాటుకు సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని అన్నారు. విశాఖలో ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక నదులపై అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా బృందం ఆసక్తిని చూపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
నెల్లూరులో కోలాహలంగా రొట్టెల పండుగ
-
షార్లో హై అలర్ట్..
సాక్షి, నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ మేర సీఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్ తీరంలో తిరిగే పడవలపై మరింత నిఘా పెట్టారు. తీర ప్రాంతంలో రోజూ కన్న మరింత ఎక్కువ బలగాలను మోహరించిన గస్తీని కట్టుదిట్టం చేశారు. మరోవైపు శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారి కదలికలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట సమీపంలోని అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపట్టారు. అలాగే రొట్టెల పండుగ సందర్భంగా వేనాడు దర్గాకు వచ్చే వాహనాల తనిఖీలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్
సాక్షి, నెల్లూరు(కావలి) : తెలంగాణలో బేల్దారులుగా పనులు చేస్తున్న ‘పసుపులేటి’ సోదరులు ఆంధ్రలో మాత్రం నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ప్రజలను బురిడీ కొట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కావలి డీఎస్పీ డి.ప్రసాద్ పర్యవేక్షణలో కావలి రూరల్ సీఐ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో బిట్రగుంట ఎస్సై బి.భరత్కుమార్, సిబ్బంది నకిలీ పోలీసుల వేషంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డి.ప్రసాద్ తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం అనంతబొట్లవారి కండ్రిగ గ్రామానికి చెందిన పసుపులేటి గోపి, జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన పసుపులేటి మహేష్, పసుపులేటి తిరుమల తెలంగాణలో బేల్దారి పనులు చేస్తున్నారు. వీరు వినాయక చవితి ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వచ్చారు. సోదరులైన వీరు ముగ్గురు తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారులో తిరుగుతూ రోడ్లుపై కనిపించిన వారిని తాము పోలీసులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బోగోలు మండలం సుందరగిరివారి కండ్రిగ వద్ద మోటారు సైకిల్పై వెళ్తున్న పాపన చెంచురామి రెడ్డి అనే వ్యక్తిని ఆపి పోలీసులమని బెదిరించి, బండి కాగితాలు చూపించమని, డబ్బులు ఇవ్వమని దబాయించారు. దీంతో బాధితుడు తన కుమారుడికి ఫోన్ చేసి సమాచారాన్ని తెలియజేశాడు. దీంతో అతని కుమారుడు గ్రామస్తులను వెంట పెట్టుకొని అక్కడికి చేరుకోగానే నకిలీ పోలీసుల అవతారంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులు తమ కారులో పరారీ అయ్యారు. ఈ ఘనటపై బాధితుడు బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకొన్న పోలీసులు విచారించి నకిలీ పోలీసులను గుర్తించి ఆదివారం బిట్రగుంటలోని రైల్వేగేటు సమీపంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకొన్నారు. -
దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు
సాక్షి, నెల్లూరు : చదువుకుంది ఇంటర్మీడియట్. కంప్యూటర్ పరిజ్ఞానం అతన్ని దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడుని చేసింది. పోలీసులకు చిక్కి జైలు పాలైనా వెరవక తిరిగి యథేచ్ఛగా తన కార్యకలాపాలను విస్తృతం చేసి పలు రాష్ట్రాలకు వాటిని విస్తరింప చేశాడు. నిందితుడిపై వైఎస్సార్ జిల్లాలోనూ కేసులు ఉన్నాయి. ఇది ఇటీవల పోలీసులకు చిక్కి జైలు పాలైన మురళీ ఉదంతం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రాజుపాళెంకు చెందిన పి. మురళీ అలియాస్ మురళీకృష్ణ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కంప్యూటర్లో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆటో క్యాడ్తో పాటు ఫొటోషాప్లో పూర్తిస్థాయి పట్టు సాధించాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచన అతన్ని దొంగనోట్ల ముద్రణకు ఉసిగొల్పాయి. దీంతో ఏలూరుకు మకాం మార్చారు. కంప్యూటర్పై పూర్తిస్థాయి పట్టు ఉండటంతో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నోట్లకు అచ్చు పోలిన విధంగా 2016లో దొంగనోట్లు ముద్రణ ప్రారంభించాడు. తొలుత తాను ముద్రించిన నోట్లను ఏలూరు జిల్లా శివారు గ్రామాల్లో వాటిని చలామణి చేశారు. దొంగనోట్లను ఎలా మార్చాలి? ఎవరికి విక్రయించాలి తదితరాలపై పూర్తి అవగాహన పెంపొందించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకపోవడంతో దొంగనోట్లను ముద్రించి విచ్చలవిడిగా చలామణి చేశాడు. మూడు నెలల కిందట గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర కిందట బెయిల్పై బయటకు వచ్చిన మొరళీకృష్ణ రూ.50, రూ.100, రూ. 200. రూ.500, రూ.2 వేల నోట్లను ముద్రించారు. వాటిని మార్కెట్లో చలామణి చేసేందుకు మోసాల్లో సిద్ధహస్తులైన ఎనిమిది మందితో ముఠాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరింప చేశాడు. అందుకు ముఠాలోని సభ్యులకు రూ.లక్ష నగదుకు రూ.25 వేలు కమీషన్ ఇచ్చేవాడు. దీంతో వారు దొంగనోట్లను యథేచ్ఛగా చలామణి చేయసాగారు. ముఠాలోని రాజస్థాన్కు చెందిన ప్రేమదాస్ సహకారంతో ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగనోట్ల చలామణికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సూరత్కు చెందిన ఓ వ్యాపారికి రూ.4 లక్షలు దొంగనోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 5వ తేదీ నోట్లు అందజేయాల్సి ఉండగా ఇందుకూరుపేటలో పోలీసులు ప్రధా న నిందితుడితో పాటు ముగ్గురిని, 6వ తేదీ మిగిలిన ఐదుగురును నెల్లూరు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వెలుగులోకి వస్తున్న కేసులు మురళీకృష్ణపై ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాలోనే పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోనూ దొంగనోట్లకు సంబంధించి పోలీసు కేసు ఉన్నట్లు, సదరు కేసులో వారెంట్ పెండింగ్లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు నెల్లూరు టాస్క్ఫోర్స్ పోలీ సులను సంప్రదించినట్లు సమాచారం. త్వరలో వారెంట్పై అక్కడి పోలీసులు నిందితుడు మురళీకృష్ణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీకృష్ణపై ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా? అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే వివరాల సేకరణలో టాస్క్ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. -
సింహపురికి ఇంటర్సిటీ
సాక్షి, నెల్లూరు : దక్షిణ మధ్య, దక్షిణ రైల్వే జోన్ల ఎండ్ పాయింట్గా ఉన్న గూడూరు జంక్షన్ నుంచి రాజధాని అమరావతి విజయవాడకు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు నేటి నుంచి పట్టాలెక్కనుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చినా.. కొత్త రాజధాని అమరావతి కేంద్రమైన విజయవాడకు నెల్లూరు జిల్లా నుంచి పగటి పూట ప్రత్యేక రైలు లేకుండా పోయింది. ఇప్పటి వరకు విజయవాడకు వెళ్లాంటే చెన్నై, తిరుపతి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లే దిక్కుగా ఉన్నాయి. ఇవీన్ని కూడా ఎక్కువగా రాత్రి వేళలో నడుస్తున్నాయి. గూడూరు నుంచి సికింద్రాబాద్కు సింహపురి సూపర్ఫాస్ట్ రైలు ఉన్నప్పటికీ ఇది కూడా రాత్రి వేళ ఉంది. గూడూరు– విజయవాడ మధ్య ఉదయం, మధ్యాహ్నం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో కానీ, ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్లో కానీ జిల్లా నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి రైల్వే ప్రాధాన్యతలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు, ఎంపీల డిమాండ్తో గూడూరు నుంచి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును అనూహ్యంగా ప్రకటించారు. ఎప్పటి నుంచో జిల్లా వాసులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి గూడూరు– విజయవాడ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం గూడూరులో ప్రారంభించనున్నారు. గత వారమే ఈ ట్రైన్ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. గూడూరు–విజయవాడ (రైలు నంబరు 12743) ఉదయం 6.10 గంటలకు గూడూరులో బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10.40 గంటలకు చేరుతుంది. విజయవాడ–గూడూరు (రైలు నంబరు12744) విజయవాడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గూడూరుకు రాత్రి 10.30 గంటలకు చేరుతుంది. ఈ రైలు రెండు ఏసీ చైర్కార్లు, పది సెకండ్ చైర్కార్లు కోచ్లు ఉన్నాయి. 8 చోట్ల స్టాపింగ్ జిల్లా నుంచి వివిధ వ్యాపారాల నిమిత్తం వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు గూడూరు, నెల్లూరు, కావలి నుంచి విజయవాడ వరకు నిత్యం 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి కొన్ని ట్రైన్స్ అనువుగా ఉన్నా, కొన్ని చోట్ల నిలుపుదల లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆ రైళ్లు సుదూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో జిల్లా వాసులు వాటిలో ప్రయాణాలు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో జిల్లా నుంచే ట్రైన్ విజయవాడకు మొదలు కానుండడంతో చాలా వరకు సౌకర్యం కలగనుంది. ప్రధానంగా గూడూరు నుంచి బయలుదేరే ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి రైల్వేస్టేషన్లల్లో నిలుపుదల, చివరగా విజయవాడలో ట్రైన్ ఆగుతుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా అవే స్టేషన్లలో ట్రైన్ నిలుపుదల చేయనున్నారు. రైలుకు పేరుపై కసరత్తు గూడూరు–విజయవాడ మధ్య నూతనంగా ప్రారంభింనున్న ట్రైన్కు ఏ పేరు పెడతారన్న దానిపై కసరత్తు జరుగుతోంది. చాలా చోట్ల రైళ్లకు ఆయా ప్రాంతాల పేర్లు, లేక ఆధ్యాత్మిక కేంద్రాలతో వచ్చే పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు వేదగిరి ఎక్స్ప్రెస్, లేదా తల్పగిరి ఎక్స్ప్రెస్, లేదా షార్ ఎక్స్ప్రెస్ పేర్లు ప్రతిపాదనలపై ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరేదైనా పేరు పెడతారా వేచి చూడాల్సి ఉంది. -
బిజీబిజీగా ఉపరాష్ట్రపతి..
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం నెల్లూరు నగరానికి చేరుకున్నారు. అనంతరం నగరంలోని ఆయన స్వగృహానికి వెళ్లారు. అక్కడి నుంచి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్తో కలి సి వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు ప్రత్యేక రైలులో నూతనంగా నిర్మించిన కృష్ణపట్నం– ఓబులవారిపల్లె రైల్వే సొరంగ మార్గాన్ని పరిశీలించారు. ఆదివారం గూడూరులో విజయవాడ ఇంటర్ సిటీ రైలును ప్రారంభించనున్నారు. సాక్షి, నెల్లూరు : ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో శనివారం మధ్యాహ్నం 1.35 గంటలకు నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానానికి చేరుకున్నారు. వీరికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్యాదవ్, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, గుంటూరు రేంజ్ ఐజీ వినీత్బ్రిజ్లాల్, కలెక్టర్ శేషగిరిరావు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి, రైల్వే శాఖ సహాయ మంత్రితో కలిసి రోడ్డు మార్గాన సర్దార్వల్లభ్భాయిపటేల్ నగర్లోని తన స్వగృహానికి వెళ్లారు. ఆందోళనకు గురిచేసిన వాతావరణం నగరంలో శనివారం ఉదయం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉపరాష్ట్రపతి పర్యటనకు అవాంతరాలు ఏర్పడతాయేమోనని అందరూ భావించారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రోడ్డు మార్గాన రేణిగుంట నుంచి నెల్లూరు తీసుకురావొచ్చని అధికారులు ఆలోచించారు. అందుకు అనుగుణంగా కాన్వాయ్ను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అయితే మధ్యాహ్నానికి వాతావరణం బాగుండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు
సాక్షి, నెల్లూరు : రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని 13వ డివిజన్ బాలాజీనగర్ గ్యాస్ గోడౌన్, బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ ప్రతి పక్షంలో తాము ఉన్నప్పుడు నగరంలో సిమెంట్ రోడ్ల నాణ్యత పాటించడం లేదని పలుమార్లు అభ్యంతరాలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ఇష్టాను సారంగా రోడ్లు వేసి రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో నాసిరకపు పనులు చేసి ప్రస్తుతం రూ.400 కోట్ల అప్పులు మిగిల్చి టీడీపీ నాయకులు వెళ్లారని తెలిపారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తామన్నారు. త్వరలో 20 నుంచి 25 శాతం వరకు రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. 40 నుంచి రూ.60 కోట్ల వరకు వెనక్కి వస్తే నగరంలో నాణ్యత లేకుండా చేసిన పనులు తిరిగి నాణ్యతా లోపం లేకుండా చేయించే అవకాశం ఉంటుందన్నారు. టీడీపీ నాయకులు కొందరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా గత ప్రభుత్వం నోరుమెదపకుండా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకున్న ఇళ్లను తొలగిస్తుంటే మాత్రం ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. నగర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులెవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాటిని సైతం కూల్చేస్తామని స్పష్టం చేశారు. ఒక వేళ పేదల ఇళ్లు తొలగించాల్సి వస్తే ప్రత్యామ్నాయం చూపిన తరువాతే ఇళ్లను తొలగిస్తామన్నారు. వారిని రోడ్డుపై పడేసే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేయబోదని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఊటుకూరు మాధవయ్య, శేషు, కర్తం ప్రతాప్రెడ్డి, కొండారెడ్డి, తేలిమేటి రాజు, శంకర్రెడ్డి, రమేష్, మనోజ్, షేక్ మాబు, సుబ్బారెడ్డి, దేశయ్య, షేక్ షంషాద్, లోకిరెడ్డి వెంకటే శ్వరరెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, గణేశం వెంకటేశ్వర్లు, వేనాటి శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
సాక్షి, నెల్లూరు : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. మూడురోజుల పాటు ఆయన జిల్లాలో ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు జిల్లాకు వస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ çఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలన్నింటినీ పోలీసులు శుక్రవారం నుంచే తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్స్క్వాడ్లతో పాటు సాయుధ పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా తీర, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఇలా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.35గంటలకు నెల్లూరు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన సర్ధార్వల్లబాయి పటేల్ నగర్లోని తన స్వగృహానికి చేరుకుని అక్కడ సేదతీరుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు రోడ్డుమార్గాన వెంకటాచలం రైల్వేస్టేషన్కు వెళుతారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వే టన్నల్ను పరిశీలి స్తారు. సాయంత్రం 5గంటలకు బయలుదేరి రాత్రి 7గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్కు చేరుకుంటా రు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో రాత్రి బసచేస్తారు. సెప్టంబర్ ఒకటోతేదీ ఉదయం 9.30గంటలకు గూడూరు రైల్వేస్టేషన్కు వెళతారు. అక్కడ గూడూరు–విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు అక్షర విద్యాలయానికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.20గంటలకు వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మిత్రులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమావేశమవుతారు. అక్కడ నుంచి స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. రెండోతేది వినాయకచవితి వేడుకలను ట్రస్టులోనే జరుపుకుంటారు. 3వ తేదీ ఉదయం 8.20 గంటలకు నెల్లూరు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్కు చేరుకుని హెలికాప్టర్లో రేణిగుంటకు వెళతారు. కేంద్ర సహాయ మంత్రుల పర్యటన రైల్వేశాఖ కేంద్ర సహాయమంత్రి సురేష్ అంగడి రేణిగుంట నుంచి ఉపరాష్ట్రపతితో కలిసి హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తారు. అనంతరం వెంకయ్యనాయుడుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సెప్టంబర్ ఒకటోతేదీన గూడూరులో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రోడ్డుమార్గాన తిరుపతికి వెళతారు. హోం శాఖ కేంద్ర సహాయ మంత్రి సెప్టంబర్ ఒకటోతేదీన తిరుపతి రోడ్డుమార్గం ద్వారా గూడూరుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకుంటారు. సింహపురి వైద్యశాల వద్ద నుంచి జరగనున్న ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ ర్యాలీ సభలో పాల్గొని తిరుపతికి వెళుతారు. 1,075మందితో బందోబస్తు పోలీసు యంత్రాంగం 1,075 మందితో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎస్పీతో పాటు, ఏఎ స్పీ, ఎనిమిది మంది డీఎస్పీలు, 19మంది సీఐలు, 58 మంది ఎస్ఐలు, 738 మంది సిబ్బంది, 120మంది ఏఆర్ సిబ్బంది, 130 మంది స్పెషల్ పార్టీ బందో బస్తులో పాల్గొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఉపరాష్ట్రపతి, కేంద్రసహాయ మంత్రుల పర్యటన సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు కవాతుమైదానంలో బందోబస్తులో పా ల్గొనే సిబ్బందికి సూచనలి చ్చా రు. అనంతరం ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. -
నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్ చరణ్
సాక్షి, సూళ్లూరుపేట(నెల్లూరు): సాహో, సైరా ట్రైలర్లు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలను భారీ స్క్రీన్లపై చూస్తే మరపురాని అనుభూతి కలుగుతుందని మెగా హీరో రామ్చరణ్ పేర్కొన్నారు. యూవీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేతలు నిర్మించిన వీ సెల్యులాయిడ్ గ్రూప్ మల్టీఫ్లెక్స్ థియేటర్లను గురువారం ప్రారంభించారు. దక్షిణాసియా, ఇండియాలో తొలిసారిగా భారీ స్క్రీన్ను ఈ థియేటర్లలో ఏర్పాటు చేశారు. ప్రారంభం సందర్భంగా సాహో, సైరా ట్రైలర్లను ప్రదర్శించారు. వెంకటగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రారంభించారు.అనంతరం రామ్చరణ్ రెండు సినిమాల ట్రైలర్లను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్లో విడుదల కానున్న సైరా సరసింహారెడ్డి సినిమాకు మెగాస్టార్ చిరంజీవిని ఇక్కడికి తీసుకొస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. వీ సెల్యులాయిడ్ గ్రూప్ థియేటర్లను సాంకేతిక విలువలతో నిర్మించడం విశేషమన్నారు. ఇలాంటి సాంకేతిక విలువలు కలిగిన స్క్రీన్ అన్నా, ఇలాంటి వాటిని ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే గుణం చిరంజీవిలో ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో తాను, ఎన్వీ ప్రసాద్ ఆయన్ను ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు. సాహో సినిమాను డైరెక్టర్ సుజిత్ ఎంతో సాంకేతిక విలువలతో తీశారని, ఈ సినిమాలో హీరో ప్రభాస్ను ఎంతో స్టయిలిష్గా చూపించారని తెలిపారు. బాహుబలి తర్వాత ప్రభాస్తో సాహో సినిమాను అత్యంత భారీ సాంకేతిక విలువలతో తీసి ఉంటారని ట్రైలర్ను చూస్తుంటే అర్థమవుతోందని పేర్కొన్నారు. అతి పెద్ద భారీస్క్రీన్ కలిగిన వీ సెల్యులాయిడ్ గ్రూప్ థియేటర్లను నిర్మించిన యూవీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేతలు వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి, వేమారెడ్డి విక్రమ్ శ్రీనివాస్రెడ్డిని అభినందించారు. -
ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1
తెలుగుదేశం పార్టీలో ఆయనో కీలక నేత. పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా ఆయన మంత్రి అయిపోయారు. జిల్లా పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు ట్రబుల్ షూటర్గా పనిచేస్తున్నట్టు హడావుడి చేస్తారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన నేత. ప్రతిపక్ష పార్టీపై అడ్డగోలుగా విరుచుకుపడడం ఆయన నైజం. ఆ బడా నేత ఎవరో కాదు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. ఆయన ఇప్పుడు ఫోర్జరీ కేసులో ఏ–1గా మారారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోడ్డు వెంబడి స్థలం కోసం రికార్డులు తారుమారు చేసి ఇతరుల భూమిని తన భూమిగా చూపించే యత్నంలో కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సాక్షి, నెల్లూరు : సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ సమయంలో జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. సర్వేపల్లిలోని వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో ఉన్న భూమిపై సోమిరెడ్డి కన్నుపడింది. ఇక్కడి నుంచే చిక్కులు మొదలయ్యాయి. తనది కాని భూమిని తన భూమిగా రికార్డులు మార్పులు చేయించి చెన్నైకు చెందిన వారికి విక్రయించారు. దీంతో ఆ భూమి వారసులు తెరపైకి వచ్చి భూమి తమదని రికార్డులతో సహా గతేడాది నుంచి చూపుతున్నారు. ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో మంత్రిగా అప్పట్లో సోమిరెడ్డి హవా కొనసాగింది. దీంతో బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో న్యాయస్థానం ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. సోమిరెడ్డి భూ అక్రమాలు వెంటాచలం మండలంలోని ఇడిమేపల్లి గ్రామంలో పామర్రు పిచ్చిరెడ్డికి సంబంధించి సర్వే నంబర్ 58లో 13.71 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పిచ్చిరెడ్డి వారసుల మధ్య ఎలాంటి పంపకాలు జరగలేదు. ఆ భూమిలో వాటర్ బోర్డు భూసేకరణ, రహదారి విస్తరణకు పోను ఇంకా 10.94 ఎకరాల భూమి పిచ్చిరెడ్డి వారసుల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆ భూమిపై దృష్టి సారించి భూమిలో కొంతభాగాన్ని తన వశం చేసుకోవడానికి పక్కాగా స్కెచ్ గీశారు. దీనికి అనుగుణంగా మీనమ్మ అనే మహిళ వద్ద 58/3 సబ్ డివిజన్లోని 2.36 ఎకరాల భూమిని ఆగమేఘాల మీద నేరుగా తన పేరుతో కొనుగోలు చేసినట్లు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత దానిని చెన్నై నగరానికి చెందిన వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించారు. భూమిని కొనుగోలు చేసిన క్రమంలో లేని రికార్డులను సృష్టించడం, సబ్ డివిజన్ కాని భూమిని సబ్డివిజన్ చేయడం, వారసుల అనుమతి లేకుండా కొనుగోలు చేయడంతోపాటు విభజన కాని భూమిలో కొంతభాగం రోడ్డు వెంబడి ఉండే భూమిని కొనుగోలు చేసి రూ.50 లక్షలకు విక్రయించారు. అయితే అధీకృత సర్వేయర్ ద్వారా సర్వే చేయించి దానిలో వారసులకు వచ్చిన వాటాను యథాతథంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఇక్కడ సోమిరెడ్డి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా మొత్తం భూమిలో తనకు కావాల్సిన, విక్రయానికి బాగా పనికి వచ్చే భూమిని మాత్రమే తీసుకున్నారు. విభజన కాని ఆస్తిలో ఒక భాగం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. చట్టరీత్యా కూడా చెల్లుబాటు ఉండదు. అలాగే అంతటితో ఆగకుండా రెవెన్యూ రికార్డుల్లో కేవలం 2.36 ఎకరాల భూమి కోసం కాని సబ్ డివిజన్ను కూడా చేయడం గమనార్హం. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయ అధికారులు దీనికి పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో సోమిరెడ్డి మంతనాలు కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు ఈ నెల 27న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఈ నెల 24వ తేదీన ఆదేశాలు ఇవ్వడంతో 212/2019 నంబర్తో 120బి, 471, 468, 447, 427, 379, 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో కేసులో బెయిల్ కోసం సోమిరెడ్డి న్యాయవాదులతో మంతనాలు మొదలుపెట్టారు. -
అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!
అధికారం కోల్పోయినా.. తెలుగు తమ్ముళ్ల ప్రవర్తన మారలేదు. ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయినా అధికారులపై పెత్తనం చెలాయించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. రెండున్నరేళ్లలోనే తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. పేదల ప్రభుత్వమంటూనే దశాబ్దాలుగా స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న పేదల ఇళ్లను అప్పటి ప్రభుత్వ పెద్దలు రెండేళ్ల క్రితం నిర్దయగా కూల్చేశారు. ఆ సమయంలో ఈ దేశం నేతలకు పేదలు గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో ప్రభుత్వ స్థలంలో ఓ టీడీపీ బడా నేత నిర్మించిన మూడంతస్తుల అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుంటే అన్యాయం, అక్రమం అంటూ రోడ్డెక్కి శోకాలు పెట్టారు. భవనం కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకుని తిరగబడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలు కట్టిన అక్రమ కట్టడాలు కూల్చేసిన తర్వాతే తమ నాయకుడి కట్టడాన్ని తొలగించాలంటూ డిమాండ్ చేయడంపై అధికారులే కాదు.. స్థానికులూ విస్మయం వ్యక్తం చేశారు. ఇదేం నీతంటూ తెలుగు తమ్ముళ్ల తీరుపై జనం మండిపడుతున్నారు. సాక్షి, నెల్లూరు : నగరంలోని వెంకటేశ్వరపురం జనార్దన్రెడ్డి కాలనీలో టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ రూ.కోట్ల విలువైన 60 అంకణాల ప్రభుత్వ సీజేఎఫ్ఎస్ స్థలాన్ని ఆక్రమించాడు. గుట్టు చప్పుడు కాకుండా దొంగ పత్రాలను సృష్టించి ఆ స్థలంలో మూడంతస్తుల్లో భవనాలను నిర్మిస్తున్నాడు. రెండు భవనాలను మాజీ కార్పొరేటర్ సొంత మనుషులకు విక్రయించగా, మరో భవనాన్ని బినామీ పేరు మీద నిర్మిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు అర్బన్ తహసీల్దార్ మధుసూదనశర్మ, తన సిబ్బందితో సంఘటనా స్థలికి వచ్చారు. కార్పొరేషన్ టౌన్ప్లానింగ్, పోలీసు అ«ధికారుల అండతో శనివారం అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అజీజ్ హుటాహుటినా అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. మీ ఇష్టమొచ్చినట్లు భవనాలకు కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమని అధికారులను బెదిరించడంతో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆర్ఐను పిలిచి నీ ఉద్యోగం ఉండాలంటే తొలగింపు ఆపివేయాలని హెచ్చరించారు. మరో రెండున్నర సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుందంటూ తమ మనోగతాన్ని బయటపెట్టుతూ తహసీల్దార్ మధుసూదనశర్మతో వాదనకు దాగారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తహసిల్దార్నుద్దేశించి నువ్వేమైనా మోనార్కువా ఆక్రమకట్టణం అని నిర్ధారించి తొలగించేందుకు ఎలా వస్తావని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పేదల ఇళ్లు కూలిస్తే కనిపించలేదా.. టీడీపీ అధికారంలో ఉండగా పేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు. 40 ఏళ్లకు పైబడి సాలుచింతల వద్ద నివాసం ఉంటున్న 80 పేద కుటుంబాలను ప్రభుత్వ స్థలాలంటూ రెండేళ్ల కిందట పోలీసుల బలగాలతో కూల్చివేశారు. అప్పటి మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు బలవంతంగా పేదలను రోడ్డుపై వేశారు. ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారుజామునే వచ్చి యంత్రాలు పెట్టి విధ్వంసాన్ని సృష్టించారు. ఊహించని పరిణామంతో ఎటువెళ్లాలో అర్థం కాక పేదలు గుండెలు అవిసేలా ఏడ్చారు. తట్ట, బుట్ట పట్టుకుని రోడ్డున పడాల్సి వచ్చింది. అన్యాయంగా పేదలను రోడ్డున పడేస్తే ఆ రోజు టీడీపీ నుంచి ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చి వారికి సాయం చేసిన పరిస్థితి లేదు. పేదలు కావడంతో పట్టించుకున్న పాపాన పోలేదు. అదే తమ వాడైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా, అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా అండగా నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నిలబడ్డంపై ప్రజలు అసహించుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు పాతర టీడీపీ పాలనలో పచ్చచొక్కా నాయకులు నిబంధనలకు పాతర వేసే విధంగా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. జనార్దన్రెడ్డి కాలనీలో సర్వే నంబరు 2209 నుంచి 2217లో ప్రభుత్వానికి చెందిన సీజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి. ఈ స్థలాలకు ఎటువంటిì æపొజిషన్ సర్టిఫికెట్లు లేకపోయినా, హౌసింగ్ లోన్లు పొందేందుకు వీలుగా అధికారులపై ఒత్తిడి తెచ్చి 9 అంకణాల స్థలానికి రెసిడెన్సీ సర్టిఫికెట్లు పొందారు. ఈ విధంగా ముగ్గురి పేర్లతో సర్టిఫికెట్లను పొందిన సదరు టీడీపీ నాయకుడు ముగ్గురి పేర్లతో మూడు భవనాలకు హౌసింగ్శాఖ ద్వారా రుణాలు పొంది మూడు భవనాలను నిర్మిస్తున్నాడు. అయితే నిబంధనల ప్రకారం హౌసింగ్ రుణాన్ని పొందిన లబ్ధిదారులు ఐదున్నర అంకణాల స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ సదరు టీడీపీ నేత అందుకు విరుద్ధంగా హౌసింగ్ రుణతో ఐదున్నర అంకణాలకు బదులుగా మూడంతస్తుల్లో అదనపు స్థలంలో టౌన్ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాడు. కబ్జాదారులుగా టీడీపీ నేతలు టీడీపీ నేతలు వెంకటేశ్వరపురంలోని రెవెన్యూ స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించారు. ఓ మాజీ టీడీపీ కార్పొరేటర్ గతంలో వెంకటేశ్వరపురం, జనార్దన్రెడ్డికాలనీలో దాదాపు ఐదు ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు సమాచారం. ఆ స్థలాల సర్వే నంబర్లు మార్చి టీడీపీ నేతలు బినామీ పేర్ల మీద తమ అనుచరుల పేర్లుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో వైపు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పత్రాలు సృష్టించి బ్యాంక్ల్లో రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వరపురంలో మాజీ కార్పొరేటర్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. -
తొలి పద్దు పొడిచింది
జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే అజెండాగా వ్యవసాయ, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. జిల్లాలో 60 శాతంపైగా ఉన్న వ్యవసాయాధారిత కుటుంబాలకు ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీగా నిధులు కేటాయించి వారి సంక్షేమానికి అండగా నిలిచారు. జిల్లాలో సుమారుగా 6.60 లక్షల రైతాంగ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 85 శాతానికి పైగా పేద వర్గాల పిల్లల చదువులు, విద్య వ్యవస్థలో మౌలిక రంగాల కల్పన, అభివృద్ధికి కూడా అదే తీరుగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. 4.60 లక్షల మంది తల్లులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. పొదుపు మహిళలు 5.60 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆక్వా రైతులు 39 వేల మందికి, మత్స్యకారుల 59 వేల మందికి ఆర్థిక చేయూత లభిస్తుంది. సాక్షి, నెల్లూరు : రాష్ట్ర బడ్జెట్ల్లో వ్యవ‘సాయానికి’ పెద్ద పీట వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో శుక్రవారం ప్రవేశ పెట్టి న బడ్జెట్లో రైతులకు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎ స్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. జిల్లాలో సుమా రు 11 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగువుతోంది. ఇందులో 4.50 లక్షల మంది యాజమాన్య రైతులు ఉంటే.. 1.96 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. పెట్టుబడి సాయంగా అందరి రైతులకు ఏటా రూ.12,500 లబ్ధి కలుగుతోంది. స్వల్పకాలిక రుణాల కింద రూ.12 వేల కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద రూ.1,500 కోట్లు కేటాయించడంతో రైతులకు ఆసరాగా ఉండనుంది. జిల్లాలో దాదాపు ఏటా లక్ష మంది వరకు రుణాలు తీసుకుంటారు. వీరిందరికి వడ్డీ లేని రుణా లు అందనున్నాయి. బడ్జెట్లో కేటా యింపులతో రుణాలు సులభతరం కా నున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి రూ.91 కోట్లు కేటాయించారు. జిల్లాలో సేంద్రియ వ్యవసా యం 4 వేల ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధుల ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. రైతులను ఆదునుకునే విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా, ఆసరాగా ఉంది. బడ్జెట్లో రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కేటాయింపులు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. – చిరసాని కోటిరెడ్డి, రైతు సం ఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సాగరపుత్రుల కన్నీళ్లు తుడుస్తూ.. వాకాడు: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ. 590 కోట్లు కేటాయించారు. జిల్లాలో 169 కిలో మీటర్ల సముద్ర తీరం వెంబడి 12 తీర ప్రాంత మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 59 వేల మంది వేటపై ఆధారపడిన మత్స్యకారులు ఉన్నారు. వీరికి సంబంధించి 5 వేలకు పైగా వేట చేసే లైసెన్స్ కలిగిన బోట్లు ఉన్నాయి. వీరికి గతంలో డీజిల్పై రూ.6.03 మాత్రమే రాయితీ ఉండేది. అది కూడా పూర్తిగా అందేది కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మొత్తాన్ని రూ.12.96లకు పెంచారు. ఇందు కోసం డీజల్ సబ్సిడీ కింద రూ. 100 కోట్లు కేటాయించారు. ఐదేళ్లుగా వేట విరామం సమయంలో చెల్లించే పరిహారం అందని ద్రాక్షలా మారింది. గత ప్రభుత్వం వేట విరామం పరిహారం కింద చెల్లిస్తున్న రూ.4 వేలను రూ. 10 వేలకు పెంచి ఏటా పరిహారం కోసం రూ. 100 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. జిల్లాలో 15,321 మంది మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. సముద్రంపై ప్రకృతి విపత్తుల కారణంగా వేట సక్రమంగా సాగక, మత్స్యసంపద దొరక్క నానా అగచాట్లు పడుతున్న మత్స్యకారులకు మత్స్య సందప వృద్ధి కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వేట చేసి 50 ఏళ్లకే వృద్ధాప్యం చెందిన మత్స్యకారులకు పింఛన్ కింద రూ.130 కోట్లు కేటాయించారు. మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో ఇస్తున్న రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం మత్స్యకారుల సంక్షేమానికి అనూహ్యంగా బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆదుకున్న సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. నాలుగేళ్లుగా వేట విరామం కింద అందజేయాల్సిన రూ. 4 వేలు డబ్బులు సక్రమంగా అందలేదు. దానిని రూ. 10 వేలకు పెంచి మత్స్యకారులను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. – పోలయ్య మత్స్యకారుడు, కొండూరుపాళెం ప్రభుత్వ విద్యకు పెద్ద పీట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్లో విద్యారంగానికి రూ.32,618 కోట్లు నిధులు కేటాయించారు. ఇందులో జగనన్న అమ్మఒడి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మొత్తం రూ.6,455 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న అమ్మఒడి పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 4,485 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,307, ఎయిడెడ్ 114, కార్పొరేట్, ప్రైవేట్ 1,057, కేంద్ర ప్రభుత్వ 7 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4,28,667 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు ఇంటర్ విద్యార్థుకు కూడా జగనన్న అమ్మఒడి పథకాన్ని విస్తరించనున్నట్లు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్కు సంబంధించి 215 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి 69, కార్పొరేట్, ప్రైవేటుకు సంబంధించి 146 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 32,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమ్మఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేలు విద్యార్థి తల్లి ఖాతాకు జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలో మొత్తం 4,60,687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,077 కోట్లు కేటాయించింది. జిల్లాలో మొత్తం 3,404 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. నెల్లూరు అర్బన్ పరిధిలో ఇస్కాన్ సంస్థ ద్వారా 111 పాఠశాలలు, అక్షయ పాత్ర ద్వారా గూడూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని 291 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. వీటితో పాటు మిగిలిన 3,202 పాఠశాలల్లో 3002 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో మొత్తం 2,16,320 మంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సరిగా నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు ఐదారు నెలలు పెండింగ్లో ఉంచేవారు. ఆయాలు, హెల్పర్లకు గౌరవ వేతనం సైతం నెలల తరబడి ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బడ్జెట్లో రూ.1,077 కోట్లు కేటాయించడం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతు సం‘క్షేమం’ దిశగా. ఆక్వా రైతుల కష్టాలు తీరనున్నాయి. ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణలో పెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీకి రూ.475 కోట్లు కేటాయించారు. జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి 13 మండలాలు ఉన్నాయి. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, మనుబోలు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, తడ మండలాల పరిధిలో సాధారంగా సుమారు 1.85 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కానీ కొన్నేళ్లుగా పెరిగిన పెట్టుబడి వ్యయాలు, ధరల ఆటుపోటలతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సుమారు 1.25 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. దాదాపు 39 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తుంటే.. 22,550 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీ విద్యుత్తో మేలు నిన్నటి వరకు ఆక్వా రైతులు విద్యుత్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బడ్జెట్లో విద్యుత్ చార్జీల తగ్గింపునకు నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని స్పష్టమైంది. – కనపర్తి నాగేంద్ర, ఆక్వా రైతు, ఊటుకూరు పొదుపు మహిళలకు వడ్డీలేని రుణాలు జిల్లాలోని పొదుపు మహిళలకు ఇక నుంచి వడ్డీలేని రుణాలు అందనున్నాయి. డీఆర్డీఏ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో, మెప్మా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మొత్తం కలిపి 53,350 గ్రూపుల్లో 5.60 లక్షల మంది పొదుపు సభ్యులు ఉన్నాయి. గతంలో పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. వడ్డీతో సహా సకాలంలో చెల్లించిన వారికి రాయితీ మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు జమ చేసే వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు అసలు మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీ మొతాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు నేరుగా జమ చేయనుంది. ఈ మేరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,140 కోట్లు కేటాయించింది. పొదుపు గ్రూపులకు 2019 ఏప్రిల్ నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నారు. పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు సుమారు నెలకు రూ.15 కోట్లకు పైగా వడ్డీ ప్రభుత్వం చెల్లించనుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనునట్లు సమాచారం. మహిళలు చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం చెల్లించి దానికి సంబం«ధించిన రసీదులను గ్రామ వలంటీర్ల ద్వారా అందజేయనున్నట్లు తెలిసింది. సీఎం తీసుకున్న నిర్ణయం వలన స్వయం సహాయక గ్రూపు మహిళలపై వడ్డీల భారం పడదు. వడ్డీలేని రుణాల పథకం 2012 నుంచి అమలులో ఉంది. పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. మహిళలు తీసుకున్న రుణాలను అసలు, వడ్డీతో కలిపి మహిళలే చెల్లించే వారు. ప్రతి నెల సక్రమంగా చెల్లించన గ్రూపులకు మాత్రమే వడ్డీ తిరిగి చెల్లించే వారు. టీడీపీ ప్రభుత్వం 2016 జూన్ నుంచి వడ్డీలేని రుణాలు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. పొదుపు మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను వడ్డీలతో సహా తిరిగి చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం మహిళను నమ్మించి మోసం చేసింది. నూతన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల స్వయం సహాయక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అయినా.. తీరు మారలేదు !
సాక్షి, నెల్లూరు : ‘స్టేషన్కు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. వారి బాధలు విని న్యాయం చేయాలి’ అని చెప్పిన ఉన్నతాధికారుల ఆదేశాలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. సిబ్బంది స్టేషన్కు వచ్చే వరితో అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో మరిస్థితి మరోలా ఉంది. అడపాదడపా చోటుచేసుకుంటున్న ఘటనలు దీనిని రుజువు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో సంతపేట పోలీస్స్టేషన్లో పరిస్థితి అధ్వానంగా మారిందనే విమర్శలున్నాయి. స్టేషన్కు వెళ్లాలంటేనే బాధితులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది స్టేషన్కు వెళ్లేవారితో అమర్యాదగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత అధికారులను కలవాలంటే అనేక అవమానాలను దిగమింగాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషన్లోకి అడుగుపెడితే చాలు ‘ఎవరు రా? ఎందుకు వచ్చారు రా?’ అంటూ ప్రశ్నించడమే కాకుండా బయటకు పోండి రా? అధికారులు ఉన్నప్పుడు రండి? అంటూ ఫిర్యాదుదారులను, ఇతరులను బయటకు పంపివేస్తున్నారు. దీంతో వారు అధికారులు వచ్చేంతవరకూ స్టేషన్ బయట పడిగాపులు కాయాల్సివస్తోంది. రిసెప్షన్ వ్యవస్థలోని ఒకరు మరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ సిబ్బంది ప్రవర్తనపై అదే స్టేషన్లో పనిచేస్తున్న పలువురు సిబ్బంది సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజగా శుక్రవారం ఓ కుటుంబం తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వచ్చింది. దీంతో రిసెప్షన్లో ఉన్న ఓ సిబ్బంది వెంటనే వారివద్దకు వచ్చి ‘ఇంతమంది ఎందుకు వచ్చారు రా’ అంటూ వారిని నిలదీశారు. అంతేకాకుండా ‘అక్కడున్న పిల్లలను బయటకు వెళ్లిపోండిరా.. లేదంటే లోపలవేసి నాలుగు తగిలాస్తా’ అని పేర్కొన్నారు. దీంతో ఆ కుటుంబంలోని పిల్లలు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని ఇసుక ట్రాక్టర్లు, టైరుబండ్ల వ్యాపారులను పోలీస్స్టేషన్కు పిలిపించారు. వారితో సైతం సదరు రిసెప్షన్ సిబ్బంది అమర్యాదగా వ్యవహరించి స్టేషన్ బయటకు పంపివేశారు. దీంతో వారు స్టేషన్ బయట పడిగాపులు కాశారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఎందుకు అలా చేశారు?
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్లోని ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలు మేర పారదర్శకంగా జరగాల్సిన బదిలీలను ఆ శాఖ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లపాటు విధులు నిర్వహిస్తున్న వారిని తప్పక బదిలీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. ఆ శాఖలో దీర్ఘకాలంగా తిష్టవేసి, ఉన్నతాధికారి కనుసన్నల్లో మెలిగిన వారిని మాత్రం బయట ప్రాంతాలకు పంపించకుండా లోకల్గా బదిలీ చేసి నిబంధనలను తుంగలో తొక్కారు. బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ ఉద్యోగులు ఉన్నతా««ధికారిపై తిరుగుబాటు చేశారు. ఏం జరిగిందంటే.. తెలుగుగంగ ప్రాజెక్టు ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉద్యోగుల బదిలీల విషయమై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించి పారదర్శకత పాటించాలని ఆదేశాలు జారీచేసింది. ఒకేచోట ఐదేళ్లపాటు విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలి. మెడికల్ గ్రౌండ్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్లో జరిగిన బదిలీల్లో ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదని, ఎస్ఈ వెంకటేశ్వర్లు ఇష్టానుసారంగా చేపట్టారని స్థానిక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎస్ఈకు అనుకూలమైన వారికి లోకల్ పోస్టింగ్లు ఇచ్చారని చెబుతున్నారు. ఒకేచోట ఆరేళ్లపాటు పనిచేస్తున్నా వారిని బదిలీలు చేయలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాల నేపథ్యంలో ఉద్యోగులు ఉన్నతాధికారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలిలా.. ► నెల్లూరు సర్కిల్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు సుమారు 30 ఏళ్లుగా వి«ధులు నిర్వహిస్తున్న ఎంవీ రమణకుమార్ను బదిలీ చేయలేదు. అలాగే డివిజన్ 1, 3ల్లో పనిచేస్తున్న పి.శ్రీనివాసులురెడ్డి, పి.రామయ్యలను నిబంధలకు విరుద్ధంగా లోకల్గా బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. డివిజన్–4లో ఆరేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వైవీవీ సత్యనారాయణకు బదిలీ జరగలేదు. ► సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో నెల్లూరు సర్కిల్ పరిధిలో డివిజన్–2లో పనిచేస్తున్న కమలను నిబంధలకు విరుద్ధంగా గూడూరు డివిజన్కు బదిలీ చేశారు. కండలేరు సబ్డివిజన్లో పనిచేస్తున్న రత్నయ్యకు ఐదేళ్లు పూర్తయినా కూడా బదిలీ జరగలేదు. టెక్నికల్ ఆఫీసర్స్ విభాగంలో ఒకేచోట 20 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులను లోకల్గా బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. రిక్వెస్ట్, మెడికల్ గ్రౌండ్ పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈ ఇష్టానుసారంగా బదిలీలు చేశారన్న ఆరోపణలున్నాయి. అసిస్టెంట్ టెక్నికల్ విభాగంలో 11 ఏళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా స్థానిక బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. గూడూరు డివిజన్లో పనిచేస్తున్న మునిరెడ్డి రిక్వెస్ట్ బదిలీ పెట్టుకున్నా పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. ► సబార్డినేట్ విభాగంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నెల్లూరు సర్కిల్లో పనిచేస్తున్న టి.గంగిరెడ్డి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో మెడికల్ గ్రౌండ్లో బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నా గూడూరు డివిజన్కు బదిలీ చేశారు. అలాగే నెల్లూరు డివిజన్–2లో పనిచేస్తున్న బి.నాగమణి తల్లికి క్యాన్సర్ ఉంది. ఆమె బదిలీ వద్దని చెప్పినా డివిజన్–3 పరిధిలోని ఆదూరుపల్లికి బదిలీ చేశారు. బదిలీలు సక్రమంగానే జరిగాయి తెలుగుగంగ సర్కిల్ పరిధిలో బదిలీలు సక్రమంగా జరిగాయి. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేస్తాం. కొందరు ఉద్యోగులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. – ఎం.వెంకటేశ్వర్లు, తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ, నెల్లూరు సర్కిల్ -
పట్టించుకోని ప్రభుత్వ ఆదేశాలు
జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను ధిక్కరించారు. టీడీపీ హయాంలో ఇష్టారీతిన అంచనాలు వేసి, కమీషన్లు దండుకుని ఎక్సెస్ టెండర్ అనుమతించిన సదరు అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను సైతం డోంట్ కేర్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ల్లో ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్లను నిలిపివేసి టెండర్లను పునః పరిశీలనకు పంపి, అందులో అక్రమాలు జరిగి ఉంటే రివర్స్ టెండరింగ్ విధానంలో మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేశారు. 5 శాతం కూడా జరగని ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో టీడీపీ కీలక నేత, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఉన్నతాధికారులు రిజర్వాయర్ పనులు నిలిపి వేయకుండా తమ పర్యవేక్షణలో చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ∙సాక్షి, నెల్లూరు : వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం 2016లో ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సాయి గంగ కెనాల్ (ఎస్జీకే) నుంచి 34.100 కిలో మీటరు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఆల్తూరుపాడులో ఒక టీఎంసీ నీరు సామర్థ్యాన్ని నిల్వ చేసేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు అంచనా వేశారు. నిల్వ చేసిన నీటి ద్వారా దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించేలా ప్రతిపాదనలు చేశారు. దీంతో ఎస్జీకే కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.114 కోట్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.189.90 కోట్లు అంచనాలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్లకు తొలి విడతగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 2.05 కోట్లు, రిజర్వాయర్ నిర్మాణానికి రూ.26.18 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ పలు సాంకేతిక కారణాలు, టీడీపీ పెద్దల కమీషన్ల కక్కుర్తి కారణంగా టెండర్లకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మరో కీలక నేత కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాలు భారీగా పెంచారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ రూ.280 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.130 కోట్ల వరకు అంచనాలు పెంచి టెండర్లకు పిలిచారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపెనీ రిజరాయర్ బ్యాలెన్సింగ్ పనులు, లిఫ్ట్ పనులు మరో బడా కంపెనీకి 4.9 ఎక్సెస్ రేటుకు టీడీపీ పెద్దలు టెండర్ ఖరారు చేయించారు. ఆయా టెండర్లకు ఇతర కంపెనీలు పాల్గొనకుండా తీవ్ర ఒత్తిడి పెంచి ఎక్సెస్ రేటుకు ఖరారు చేయించారు. ఓటమి చెందితే కమీషన్ రాదని.. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు ఎన్నికల లోపు ప్రారంభించకుంటే కమీషన్లు రావనుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు రావడంతో హడావుడిగా ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేశారు. బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఆ ప్రాజెక్ట్ను ఈ ప్రాంత రైతులకు కూడా తెలియకుండా శంకుస్థాపన చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు పనులు ప్రారంభం కాకపోతే కమీషన్లు ఎగనామం పెడుతారన్న కారణంతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు అందని భూ పరిహారం ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం సాగు భూములు వదులుకున్న రైతులకు మాత్రం భూ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. రిజర్వాయర్ కోసం సేకరించిన భూములకు రైతు వారీ పట్టా భూమికి ఎకరాకు రూ.7.8 లక్షలు, ప్రభుత్వ డీ–ఫారం పట్టా భూమికి రూ.7.5 లక్షల వంతున పరిహారం నిర్ధారించి కొంత వరకు భూ పరిహారం అందించారు. ఇంకా 40 శాతం వరకు భూములకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్తూరుపాడు వెల్లంపల్లిలో సుమారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు సంబంధించి 150 కుటుంబాలు దాదాపు 200 ఎకరాల భూములను 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆయా భూముల్లో బోరు బావులు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అవి ప్రభుత్వ భూములు కావడంతో పరిహారం ఇచ్చేది లేదంటూ కాంట్రాక్టర్ బలవంతగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో గతంలో రైతులు పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే గ్రామ పొలిమేర్లలో దాదాపు రూ.15 లక్షల వ్యయంతో భూములు చుట్టూ రాళ్లు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటుంటే రాళ్లను తొలగించడంపై రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ టీడీపీ హయాంలో మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ల్లో 25 శాతం పూర్తి కాని వాటిని నిలిపివేసి పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ అంచనాల్లో అక్రమాలు ఉన్నా వెంటనే రద్దు చేసి రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు, టీడీపీ పెద్దలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 5 శాతం కూడా పూర్తి చేయని పనులను నిలిపి వేయకుండా నిర్మాణాలు చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానిక టీడీపీ పెద్దలు అస్మదీయులకు సబ్కాంట్రాక్టర్ ద్వారా ప్రాజెక్ట్ పనులు ఇచ్చి ఉండడంతో అంచనాల్లో భారీ తేడాలున్నా కనీస పరిశీలన చేయకుండా టీడీపీ పెద్దలతో ఉన్న లోపాయి కారి ఒప్పందంతో ఉన్నతాధికారి ఆయా పనులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆయా పనులను అడ్డుకోవడంతో నాలుగు రోజులుగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది. -
మృత్యువుతో పోరాడి...
సాక్షి, పొదలకూరు(నెల్లూరు) : రెక్కాడితే గానీ డొక్కాడని గీత కార్మిక కుటుంబం వారిది. కల్లు గీసుకొని ఉన్నంతలో సంతోషంగా జీవించే వారు. విధి వెక్కిరించి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి, గ్రామంలో అప్పులు చేసి, గ్రామస్తుల సాయం పొందినా ఇప్పటికీ ఆ కుటుంబం కోలుకోలేకపోతోంది. సీఎం సహాయనిధి నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది. కాటేసిన విద్యుత్ తీగలు మండలంలోని మర్రిపల్లికి చెందిన అయితా శివశంకర్ (30) కల్లుగీత కార్మికుడు. సీజన్లో కల్లుగీసి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఏడాది క్రితం వివాహం కూడా చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం తాటిచెట్టెక్కి కల్లు గీస్తున్న సమయంలో చెట్టుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో చెట్టుపై ఉన్న శివశంకర్ విద్యుదాఘాతానికి గురై చెట్టుకే అతుక్కుపోయారు. సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు గమనించి అతికష్టంపై తాళ్లు, కర్రలతో శివశంకర్ను కిందికి లాగారు. దీంతో చెట్టుపై నుంచి యువకుడు కిందపడిపోయారు. విద్యుదాఘాతంతో చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. విద్యుదాఘాతం తగిలిన ప్రతి చోటా మాడిపోయి నల్లగా మారింది. వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా, చెన్నై తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కుటుంబసభ్యులు చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చేర్పించి మూడు నెలల పాటు అక్కడే ఉంచారు. విద్యుదాఘాతంతో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో శివశంకర్కు మొత్తం ఆరు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. కుడిచేయి వేళ్లు పనిచేయకపోవడంతో వాటిని తొలగించారు. దీని కోసం రూ.10 లక్షల వరకు ఆ పేద కుటుంబం వెచ్చించింది. బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు, సోదరి అప్పులు చేశారు. చికిత్స పొందుతున్న సమయంలోనే శివశంకర్కు ఆడపిల్ల జన్మించింది. కుమార్తెను చూసేందుకు సైతం వీల్లేకుండా ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి రావడంతో ఆ యువకుడు కుమిలిపోయారు. సీఎం సహాయనిధి నుంచి సాయం అందేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాణి దృష్టికి తీసుకెళ్లాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు శివశంకర్ కష్టాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయ నిధి కోసం యత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా గౌడ సంఘం ద్వారా కొంత మొత్తాన్ని సాయంగా అందజేశాం. చిన్న వయస్సులో శివశంకర్ మంచానికే పరిమితం కావడం ఆవేదన కలిగిస్తోంది. – కోసూరు సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మర్రిపల్లి -
కారును ఢీకొన్న లారీ; ఇద్దరి మృతి
సాక్షి, నగరి(నెల్లూరు): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి మండలంలోని తడుకుపేట వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జునరావ్ వివరాల మేరకు.. తిరుత్తణికి చెందిన మోహన మురళి (40), డ్రైవర్గా పనిచేస్తున్నారు. సోమవారం నెల్లూరులో జరిగిన తన బంధువుల పెళ్లికి హాజరై నెల్లూరులోని తన స్నేహితుడి తల్లి సరీమా(60)ను వెంటబెట్టుకొని తిరుత్తణికి కారులో బయల్దేరారు. కొన్ని నిమిషాల్లో తిరుత్తణికి చేరుకోవాల్సి ఉండగా మృత్యువు లారీరూపంలో వారిని కబళించింది. మండలంలోని తడుకుపేట వద్ద నగరి వైపు వస్తున్న లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. ప్రమాదంలో కారులోని మోహనమురళి, సరీమా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మేనమామను కడతేర్చిన అల్లుడు
సాక్షి, ఓజిలి(నెల్లూరు) : పిల్లనిచ్చి వివాహం చేసిన మేనమామను అల్లుడే గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని అత్తివరం గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్న కారూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారూరుకు చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (80), అతని భార్య రత్నమ్మకు ఇద్దరు కుమార్తెలున్నారు. మొదటి కుమార్తెను సొంత ఊరులోని వ్యక్తికిచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె ఆదిలక్ష్మిని రత్నమ్మ అన్న మోడిబోయిన కిష్టయ్య కుమారుడైన మోడిబోయిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి రాపూరు మండలం వేపినాపి గ్రామంలో 20 సంవత్సరాలు క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై భార్యను నిత్యం చిత్రహింసలను గురిచేసేవాడు. దీంతో ఆమె ఐదు సంవత్సరాలు క్రితం పుట్టింటికి వచ్చేసింది. నిందితుడు అప్పుడప్పుడు అత్తివరం గ్రామానికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. తనతో పంపలేదని.. రెండునెలల క్రితం భార్య ఆదిలక్ష్మిని తనతో ఊరికి పంపాలని వెంకటేశ్వర్లు మేనమామతో ఘర్షణకు దిగాడు. అప్పటినుంచి భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తామామలను అడగ్గా వారు మద్యం మానేసి వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు అలిగి వేపినాపికి వెళ్లిపోయాడు. భార్యను కాపురానికి తీసుకెళ్లాలంటే మేనమామ శ్రీనివాసులు అడ్డుగా ఉన్నాడని భావించాడు. దీంతో ఆయన్ను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈక్రమంలో వెంకటేశ్వర్లు భార్య ఇంటికి వచ్చి మద్యం తాగడం మానేశాని చెప్పి అక్కడే ఉన్నాడు. పనినిమిత్తం అని చెప్పి నాయుడుపేటకు ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. దీంతో అల్లుడు మారిపోయాడని అత్తామామ, భార్య నమ్మారు. ఆరుబయట నిద్రిస్తుండగా.. సోమవారం అర్ధరాత్రి రత్నమ్మ, ఆదిలక్ష్మి, ఆమె పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు ఆరుబయట పడుకున్నారు. ఇదే అదనుగా భావించిన వెంకటేశ్వర్లు కట్టెలు కొట్టే గొడ్డలితో మేనమామ మెడ, ఎడమకాలుపై నరికి పరారైయ్యాడు. తీవ్ర రక్తస్రావమై శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదిలక్ష్మి కుమారుడు శ్రీధర్ మరుగుదొడ్డికి వెళ్లేందుకు తలుపు తీశాడు. ఈక్రమంలో నెత్తుటిమడుగులో ఉన్న తాతను చూసి కేకలు వేశాడు. బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వాకాడు సీఐ నరసింహారావు, ఎస్సై నరహరిలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం చేయించారు. హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
-
‘ఫేస్బుక్’ ఫొటో పట్టించింది
సాక్షి, నెల్లూరు : వృద్ధ దంపతులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టగా ఫేస్బుక్లో ఓ ఐడీలోని ఫొటో నిందితులను పట్టించింది. దీంతో కేసు మిస్టరీ వీడింది. సోమవారం సాయంత్రం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న మినీ కాన్ఫరెన్స్హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశ్రాంత ఎయిర్ఫోర్స్ ఉద్యోగి సుబ్రహ్మణ్యం, అతని భార్య నాగలక్ష్మి మూలాపేట బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఆమె విదేశాల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వారింట్లోకి చొరబడి కత్తులతో బెదిరించారు. 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు దోచుకెళ్లారు. దోపిడీ ఘటనపై బాధితుడు సుబ్రహ్మణ్యం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్నబజారు ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్బాషా జరిగిన విషయాన్ని నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. తన నేతృత్వంలో ఎస్సైలు బలరామయ్య, ప్రేమయ్య, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి కేసు దర్యాప్తు చేపట్టారు. బైక్ల వివరాలు సేకరించి.. దోపిడీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడడంతో కేసు మిస్టరీగా మారింది. దీంతో ఘటన ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను తొమ్మిది గంటలపాటు పోలీసులు పరిశీలించారు. కెమెరాల్లో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై దోపిడీ జరిగిన ప్రాంతంలో రెక్కీ నిర్వహించడాన్ని గుర్తించారు. రాత్రి కావడంతో వారి ముఖాలు సరిగ్గా కనిపించలేదు. దీంతో వారు వినియోగించిన బైక్కు సంబంధించిన వివరాలు సేకరించి అలాంటి బైక్లు వినియోగిస్తున్న వారిని విచారించి ఫోన్ నంబర్లు, ఫొటోలను సేకరించారు. అనంతరం తమ వద్దనున్న ఫోన్ నంబర్ల ఆధారంగా ఫేస్బుక్ ఐడీలను గుర్తించి అందులో ఓ యువకుడిని నిందితుడిగా భావించారు. ఆ ఫొటోను బాధితుడికి చూపించగా అతడే చోరీ చేసిందని వెల్లడించాడు. సదరు వ్యక్తిని సుందరయ్యకాలనీలోని ఏ బ్లాక్కు చెందిన టి. గిరీష్కుమార్గా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం గిరీష్కుమార్ మరో ముగ్గురు సర్వోదయ కళాశాల ప్రాంగణంలో ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గిరీష్తో పాటు కనుపర్తిపాడుకు చెందిన సీహెచ్ అజయ్, పడారుపల్లికి చెందిన పి.రమేష్తో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన ప్రకారమే.. వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలోనే పి.కుసుమాబాయి అనే మహిళ భర్త నుంచి విడిపోయి కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. తెలిసిన వారి సహకారంతో బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తూ చెడు వ్యసనాలకు బానిసైంది. ఆరునెలల క్రితం ఆమెకు తన స్నేహితుడి ద్వారా సుందరయ్యకాలనీకి చెందిన ఆటోడ్రైవర్ గిరీష్కుమార్తో పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. వ్యసనాలకు లోనై సులువుగా డబ్బు సంపాదించాల ని నిశ్చయించుకున్నారు. వారి ఇంటి సమీపంలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులపై ఆమె కన్నుపడింది. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉంటుందని తెలుసుకున్న ఆమె గిరీష్కుమార్కు తెలిపి దోపిడీకి పథక రచన చేసింది. దీంతో గిరీష్కుమార్ తన స్నేహితులైన అజయ్, రమేష్, మైనర్ బాలుడితో కలిసి ఈనెల 12వ తేది అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులు అంగీకరించడంతో పోలీసులు సూత్రధారి కుసుమబాయిని సైతం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.9 లక్షలు విలువ చేసే 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని, కమాండ్ కంట్రోల్ ఏఎస్సై వలీని ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ మంత్రి వల్ల టీడీపీ పది స్థానాలు ఓడిపోతుంది’
సాక్షి, నెల్లూరు: తొలిసారి తాను 1999లో టీడీపీ అభ్యర్థిగా అల్లూరు నుంచి గెలిచి మంత్రి అయినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నామీద కడుపు మంటని వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమిరెడ్డిని ఈ జిల్లాలో నాలుగు సార్లు వరసగా ప్రజలు ఓడించినా.. చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రిని చేశారని అన్నారు. తాను టీడీపీలో ఉండడం, పదవులు చేపట్టడం సోమిరెడ్డికి ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే జాబితాలో ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించినా.. ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. నెల్లూరు వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకత్వంలో ఉన్న రాజకీయ దిగజారుడు అంశాలను ఆయన వివరించారు. సోమిరెడ్డి నిత్యం చంద్రబాబు చెవిలో తనపై ఉన్నవి లేనివి చెప్పి అబద్ధాలు సృష్టించేవారిని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఇదే..! ‘‘టీడీపీలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, అవమానాలకు గురిచేసి నన్ను మోసం చేశారు. నేను పార్లమెంట్, లేకపోతే కోవూరు అసెంబ్లీ అడిగాను, కానీ కావాలని నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు. అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం పని చేస్తుంటే అడుగడుగనా అడ్డుకున్నారు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని వెళ్తే సోమిరెడ్డి అడ్డువేసి నన్ను గంట వెయిటింగ్ చేయించారు. నన్ను పార్టీ నుంచి బయటకి పంపించాలని సోమిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జిల్లాలో ముఖ్య నాయకులను పార్టీ నుంచి పంపించడంలో సోమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. నేను రూరల్లో టీడీపీ నుంచి గెలిచే పరిస్థితుల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించడం సహించలేకపోయా. నేను బిల్లులు తీసుకుని పార్టీ మారారని ప్రచారం చేస్తున్నారు. బిల్లులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, రుజువు చేయకపోతే నువ్వు తప్పుకుంటావా. సోమిరెడ్డి వల్ల జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోనుంది. నాకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్ల బిల్లులు రావాలి, అవసరం అయితే కోర్టుకు వెళ్తా. నేను వచ్చాక ఆత్మకూరు, నెల్లూరు రూరల్ లో పార్టీని బలోపేతం చేశా, అనవసర ఆరోపణలు చేయడం తగదు. నన్ను కేసీఆర్ బెదిరించాడని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యాలు‘‘ అని అన్నారు. -
ఫ్యాన్ వైపు టీడీపీ నేతల చూపు..
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మెహన్రెడ్డికి ప్రజాధారణ పెరగడంతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీలోని అసంతృప్తి నేతలు కూడా ప్రతిపక్షపార్టీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల టీడీపీ నుంచి జిల్లావ్యాప్తంగా వలసలు జోరందుకున్నాయి. నెల్లూరు నగరంలో వాణిజ్య విభాగాల్లో కీలక నేతగా ఉన్న సన్నపరెడ్డి పెంచలరెడ్డి సారధ్యంలో పలు వాణిజ్య విభాగ నేతలు మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్తోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీకి బలం చేకూరనుంది. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద వైఎస్సార్సీపీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. ఆమె రాకతో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీకి కొలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీకి అదనపు బలం సమకూరింది. వీరితోపాటు నేదురుమల్లి రాంకుమార్రెడ్డి సమక్షంలో ఎన్ఆర్ఐల చేరికతో కూడా పార్టీకి మరింత పట్టు పెరిగింది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు సమీప బంధువు శ్రీనివాసులునాయుడు స్థానిక ఎమ్మెల్యే గౌతమ్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేమైంది. ఉదయగిరి, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అదే జోరు ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి వలసల జోరు కొనసాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కలిగిరి మండల నేత మెట్టుకూరు చిరంజీవిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరనుండడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, కొండాపురం మండలాల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగలనుంది. అలాగే కావలి నియోజకవర్గంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కండ్లగుంట మధుబాబునాయుడు, మరో సీనియర్ నేత శిరోçమణి, టీడీపీ క్రిస్టియన్ సెల్ అధికార ప్రతినిధి ఎంఏ రవికుమార్ కూడా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడంతో కావలి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మంత్రి సోమిరెడ్డి వ్యవహారశైలిపై విసుగుపుట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిరోజూ వైఎస్సార్సీపీకి చేరువవుతున్నారు. టీడీపీకి గుడ్బై చెప్పనున్న నేతలు టీడీపీ ఐదేళ్ల పాలనలో పదవుల హామీలతో మభ్యపెడుతూ చివరకు హ్యాండివ్వడంతో నెల్లూరు నగర, రూరల్ పరిధిలోని పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ సీనియర్ నేత, కార్పొరేటర్ నూనె మల్లికార్జునయాదవ్ ఆ పార్టీకి రాంరాం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న నూనె మల్లికార్జునయాదవ్కు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదు. ఆయన వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నూనెకు ప్రాధాన్యత ఇవ్వకపోగా పదవులు ఇప్పిస్తామంటూ జిల్లా టీడీపీ పెద్దలు మోసం చేయడంపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల నూనెను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఫలించలేదు. అలాగే సీనియర్ మహిళా నేత నువ్వుల మంజులకు కూడా పార్టీలో తీవ్ర అవమానం జరిగింది. టీడీపీని నమ్ముకున్న నువ్వుల మంజులను ఇటీవల నామినేటడ్ పదవుల పందేరంలో కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురై త్వరలోనే పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయినట్లు ప్రచారం ఉంది. టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న దేశాయిశెట్టి హనుమంతరావుకు కూడా తీవ్ర అవమానం జరగడంతో ఆయన కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది. టీడీపీ నుంచి రోజురోజుకూ వలసలు జోరందుకోవడంతో ఆ పార్టీ కేడర్లో నిరుత్సాహం నెలకొంటోంది. -
పేదల సొంతింటి కల పగటి కలే......!
పట్టణ ప్రాంతాల్లోని ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుస్తామని గొప్పలు చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లుగా లబ్ధిదారులకు గాలి మేడల సినిమా చూపించింది. ఎన్నికలకు ఏడాది సమయంలో అందరికీ ఇళ్ల సముదాయాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం నిర్మిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అరకొరగానే పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న, పునాదులకే నోచుకోని ఇళ్లకు సైతం లాటరీలు తీసి లబ్ధిదారులకు కేటాయించి మోసం చేసింది. బ్యాంక్ రుణంతో మెలిక పెట్టడంతో ఒక్కరంటే ఒక్కరికీ ఇల్లు స్వాధీన పరిచిన దాఖలాలు లేవు. సాక్షి, నెల్లూరు సిటీ: పట్ణణాల్లోని పేదల సొంతింటి కల పగటి కలగా మారిది. అందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లు ఇస్తామని ఆశలు రేపిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో హడావుడిగా అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐదేళుగా మోసం చేస్తూ వచ్చి అధికార అంతమున కట్టడాలే పూర్తికాని, పునాదులే వేయని ఇళ్లకు గ్రాఫిక్స్ సినిమా చూపించి ఆన్లైన్ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆఖరిలో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తలు పన్నిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలో 4,800, అల్లీపురంలో 12,288, అక్కచెరువుపాడులో 3,696, కల్లూరుపల్లిలో 3,168, కొండ్లపూడిలో 2,544, వెంకటేశ్వరపురం ఫేజ్–2లో 7,536 మొత్తం 34,032 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీటిలో కేవలం వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా ఆ ఇళ్లలో కుళాయిలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. మిగిలిన 29,232 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కల్లూరుపల్లి, కొండ్లపూడి, వెంకటేశ్వరపురం ఫేస్–2లో ఇళ్లు పునాదుల దశలో ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఇళ్లను ఆన్లైన్ పద్ధతిలో లాటరీలో లబ్ధిదారులకు కేటాయించారు. నాసిరకం ఇళ్లు మాకొద్దంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించిన లబ్ధిదారులు ఆ నాసిరకం ఇళ్లు తమకొద్దంటూ సుమారు 3 వేల మందికి పైగా నిరాసక్తత చూపిస్తున్నారు. ఇప్పటికే 700 మంది లబ్ధిదారులు కార్పొరేషన్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా వినతిపత్రాలు ఇచ్చారు. లబ్ధిదారులు రూ.12,500, రూ.25 వేలు వంతున నాలుగు విడతల్లో రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. అయితే కేవలం ఒక విడతలో మాత్రమే డబ్బులు చెల్లించారు. మరో మూడు విడతలు డబ్బులు చెల్లించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. తాము కట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. పూర్తికాని గృహాల్లో ప్రవేశాలు ఇళ్లను లాటరీ ద్వారా కేటాయించారు. కానీ లబ్ధిదారులకు నివాసానికి అనుకూలమైన పరిస్థితులు మాత్రం లేవు. నెల రోజుల క్రితం చంద్రబాబునాయుడు కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రచారం కోసం రెండు ఇళ్లలో మాత్రమే గృహ ప్రవేశం చేయించారు. వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లు గృహప్రవేశం జరిగినట్లు చెప్పారు. అయితే నెల రోజులు గడుస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి తాళం కూడా ఇవ్వలేదు. వెంకటేశ్వరపురంలో నిర్మాణాలు పూర్తయ్యాయిని చెబుతున్న ఇళ్లకు విద్యుత్, తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదు. వృద్ధులు, వికలాంగులకు మూడో ఫ్లోర్లో ఇళ్లు 70 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అయితే కంప్యూటర్ లాటరీ పద్ధతిలో వృద్ధులు, వికలాంగులకు కేటాయించిన ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించలేదు. రెండు, మూడు ఫ్లోర్లలో ఇళ్లు కేటాయిండంతో అంత ఎత్తున ఎలా ఎక్కేది అని ఆందోళనకు గురవుతున్నారు. కాళ్లు లేని వారికి సైతం మూడో ఫ్లోర్లో ఇల్లు కేటాయించడం గమనార్హం. కట్టారే కానీ.. అన్నీ ఖాళీ! గూడూరు: గూడూరు పట్టణంలో హౌస్ ఫర్ ఆల్ ఇళ్లు దిష్టిబొమ్మల్లా మారాయి. నిర్మాణాలైతే జరిగాయే కానీ, అరకొర పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అక్కడ తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ ఆరు నెలల క్రితం లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లు కేటాయించారే కానీ, వాటిని ఇప్పటి వరకూ ఎవరికీ స్వాధీనం చేసిన దాఖలా లేవు. ఆ హౌస్ ఫర్ ఆల్లో ఇంకా రోడ్డు నిర్మాణ పనులతో పాటు, వాటర్ ట్యాంకు నిర్మాణం కూడా జరుగుతోంది. పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో గాంధీనగర్ సమీపంలో హౌస్ఫర్ ఆల్ పథకం కింద అపార్ట్మెంట్ల తరహాలో సుమారు 7 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటి వరకూ 5,120 ఇళ్లు పూర్తి కాగా, మొదటి విడతలో 3,704 మందికి ఇళ్లు కేటాయించారు. రెండో విడతలో 812 మందికి ఇళ్లు కేటాయించారు. ఇప్పటి వరకు అధికారులు 4,516 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు చిన్నవిగా ఉండడం, నాసిరకంగా ఉండడంతో పాటు సుమారు 20 ఏళ్ల పాటు నెలకు సుమారు రూ.2,300 నుంచి రూ.3,200 వరకు చెల్లించాల్సి ఉండడంతో, తాము బ్యాంకుల్లో చెల్లించే మొత్తాలకు పట్టణంలోనే అద్దెకు ఇళ్లు దొరుకుతాయని, కొందరు ఆ ఇళ్లలో చేరే ఆలోచనలను కూడా మానుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదు అందరికీ ఇళ్లు పథకం కింద నాకు ఇల్లు కేటాయించి దాదాపు 4 నెలలు గడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు. అధికారులు మాత్రమే అనేక సార్లు కార్యాలయం, సమావేశాల పేరుతో తిప్పించుకుంటున్నారు. ఇదంతా ఎన్నికల మోసంగానే ఉంది. – సరస్వతి, చిన్నబజారు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు ఇల్లు కేటాయించారు. కానీ ఇళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. తాగునీరు, విద్యుత్ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆ ఇళ్లలో ఎలా ఉండాలని తాళం ఇచ్చారో అర్థం కావడం లేదు. – బాషా, జనార్దన్రెడ్డికాలనీ -
నెల్లూరులో టీడీపీకి షాక్
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది. అటు రాజకీయ, ఇటు వ్యాపార రంగంలో తన కంటూ ప్రత్యేకత సంపాదించుకున్న సన్నపురెడ్డి పెంచల్రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి, నాలుగేళ్ల క్రితం టీడీపీ చేరారు. అప్పటి నుంచి టీడీపీలో అనేక అవమానాలు భరించారు. టీడీపీ కార్యవర్గంలో స్థానం కల్పించక పోవడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రధానంగా సన్నపురెడ్డి పెంచల్రెడ్డితో పాటు పలు వాణిజ్య అసోసియేషన్ నాయకులు అప్పట్లో టీడీపీలో చేరారు. ఆ పార్టీలో అవమానాలు భరించ లేక ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరు నగర, రూరల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాణిజ్య అసోసియేషన్లు ఉన్నాయి. వీరు వైఎస్సార్సీపీలో చేరికతో జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. వైఎస్ జగన్ సమక్షంలో చేరిక మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పి.రూప్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని లోటస్పాండ్లో మంగళవారం సన్నపురెడ్డి పెంచలరెడ్డి, సుబ్బారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దాసా లక్ష్మీనారాయణ, డాల్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెసల నరసింహస్వామి, సింహపురి వాణిజ్యమండలి జనరల్ సెక్రటరీ సొల్లేటి వెలుగొండయ్య, కేన్వాసింగ్ ఏజెన్సీ అధ్యక్షుడు బీఎంఎస్ కృష్ణకిషోర్ వైఎస్సార్సీపీలో చేరారు. -
కావలి డీఎస్పీ నేతృత్వంలో నిఘా పటిష్టం
సాక్షి, కావలి: నియోజకవర్గంలో ఎన్నికలు నిబంధనలు మేరకు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ నేతృత్వంలో అధికారులు నిఘాను పటిష్టం చేశారు. కావలి వన్ టౌన్, టూ టౌన్, కావలి రూరల్, బిట్రగుంట, దగదర్తి, అల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సీఐలు, ఎస్ఐలను సమన్వయం చేసుకుని ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులతో పాటు అదనంగా ఇతర బలగాలను నియోజకవర్గంలో మోహరించారు. కావలిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కాగా నియోజకవర్గం ప్రధానంగా జిల్లా సరిహద్దు కావడం, చెన్నై –కలకత్తా జాతీయ రహదారి ఉండటంతో సున్నితమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన రుద్రకోట వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి కావలిలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడానికి కావలి పోలీసుల ఆధర్వంలో చెక్ పోస్టు నిత్యం పని చేస్తోంది. ప్రతి ఇవాహనాన్ని తనిఖీ చేయనిదే జిల్లాలోకి ప్రవేశించనీయడం లేదు. అలాగే కావలి నుంచి వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా గుడ్లూరు పోలీసులు తనిఖీలు చేసేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ రహదారిని పోలీసులు డేగ కళ్లతో సునిశిత పరిశీలన చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద ఉన్న టోల్గేట్ వద్ద చెక్ పోస్ట్, దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. ఈ మూడు చెక్ పోస్టులు కూడా జాతీయ రహదారిపై ఉంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గం నుంచి కావలి లోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడానికి కావలి–ఉదయగిరి రోడ్డు లో కావలి పట్టణ పడమటి పొలిమేరల్లో ఉన్న బుడంగుంట వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ల వద్ద సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలను కూడా అమర్చారు. అలాగే రెవెన్యూ అధికారి, పోలీసులతో కలిసి ఒక్కో స్టేషన్ పరిధిలో ఫైయింగ్ పోలింగ్ ను ఏర్పాటు చేశారు. వీరికి కూడా బాడీ కెమెరాలను అమర్చారు. నియోజకవర్గంలోని ఆరు పోలీస్ స్టేష న్లు పరిధిలో నిత్యం వీరు విస్తృతంగా పర్యటించి, సాయంత్రానికి డీఎస్పీకి నివేదిక అందజేస్తారు. ఆరు మంది ఎస్ఐలు, ముగ్గురు సీఐలు, పది మంది ఏఎస్ఐలు అధికారులు, ఇతర పోలీసు సిబ్బందిని కావలి డీఎస్పీ డి.ప్రసాద్ సమన్వయం చేసుకొంటూ ఎన్నికల బృందంగా ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు, నిబంధనలు ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. ప్రజల సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతం ప్రజల సహకారంతో కావలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా చేస్తాం. ప్రజలు ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న అంశాలను, నిబంధనలు ఉల్లంఘించిన సమాచారాన్ని తెలియజేయాలి. సమాచారాన్ని తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. చెక్ పోస్టుల వద్ద తనిఖీల సందర్భంలో, గ్రామాల్లో విధులు నిర్వహించే పోలీసులకు బాధ్యతగా సహకరించాలి. అసాంఘిక శక్తులు తోక జాడిస్తే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. – దేవరకొండ ప్రసాద్, డీఎస్పీ, కావలి -
చంద్రబాబుది నయవంచన పాలన
సాక్షి, వెంకటాచలం: చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురిచేసి పారిపాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. వెంకటాచలం మండలం కసుమూరులో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. తొలుత కసుమూరు మస్తాన్వలీ దర్గాలో వైఎస్సార్సీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆనం మాట్లాడుతూ గత ఎన్నికల ముందు 600పైగా వాగ్దానాలిచ్చిన చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ముందు రాష్ట్రంలో అప్పుల భారం రూ.86 వేల కోట్లుండగా ప్రస్తుతం మరో రూ.1.50 లక్షల కోట్ల అప్పులు భారాన్ని చంద్రబాబు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా పందికొక్కుల్లా పంచుకున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ వ్యవస్థకు అడ్డుకట్ట పడాల్సిన అవసరాన్ని ప్రజానీకం గుర్తించాలని పిలుపునిచ్చారు. మరో ఐదేళ్లు బాబు అధికారంలో ఉంటే భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందుల్లో పడతారని తెలిపారు. టీడీపీ పాలనలో దొడ్డిదారిన వచ్చేవారు ఎక్కువైపోయి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశమిస్తే ఏపీని అగ్రగామిగా మార్చుతారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మళ్లీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగ యువతకు, ఇలా ఏ వర్గానికీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, కరువు కవలపిల్లలు లాంటివారన్నారు. బాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి మాటున రూ.కోట్లలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీరు–చెట్టు పథకంలో అవసరం లేని కాలువలు తవ్వి ప్రజాధనాన్ని దోచుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి జరిగితే సంగం, కనుపూరు కెనాల్ ఆధునీకరణ ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. మంత్రి సోమిరెడ్డి ఓట్లు తొలగింపు వివాదంపై మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే తొలగిస్తున్నారని సోమిరెడ్డి చెప్పే మాటలు విని జనం నవ్వుకుంటున్నారని హేళన చేశారు. దొంగ ఓట్ల విషయంలో టీడీపీ నాయకుల చేసే కుట్రలను ప్రశ్నిస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక మండలంలోని చవటపాళెం గ్రామానికి చెందిన పీఏసీఏస్ ఉపాధ్యక్షుడు వళ్లూరు రమణయ్యనాయుడు, కసుమూరు గ్రామానికి చెందిన తూమాట మధునాయుడు, జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కుడితిపూడి మురళీనాయుడు, ఎం.సుధాకర్నాయడుతోపాటు 300 కుటుం బాలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ వేమారెడ్డి శ్యాంసుందర్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కె.కోదండరామిరెడ్డి, సంయుక్త కార్యదర్శి కె.విజయమోహన్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్ కె.చెంచుకృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్నాయుడు, జిల్లా, మండల కో–ఆప్షన్ సభ్యులు అక్బర్బాషా, హుస్సేన్ పాల్గొన్నారు. -
జగనన్నను సీఎం చేసుకుంటేనే రాష్ట్రం సుభిక్షం
సాక్షి, నాయుడుపేటటౌన్: ప్రజాసంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగ జిల్లా సభ్యుడు పిట్ల కస్తూరి పేర్కొన్నారు. సింగపూర్కు చెందిన ఎన్ఆర్ఐ విభాగ నాయకులు జగన్మోహన్రెడ్డి చేపట్టే నవరత్నాల పథకాలకు సంబంధించి డిజిటల్ దండోర సీడీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శుక్రవారం హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో జగనన్నను కలిసి ఆయన చేతుల మీదుగా సీడీని ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామగ్రామాన నవరత్నాల పథకాలకు సంబంధించిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టే అనేక కార్యక్రమాలను జగనన్న దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్న జిల్లా ప్రధాన సభ్యులైన నాయుడుపేట మండలం, గొట్టిప్రోలు గ్రామానికి చెందిన పిట్ల కస్తూరి ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ఆర్ఐ విభాగం తరపున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇందుకుగాను సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగ నాయకులు ఇప్పటికే కార్యచరణను రూపొందించి ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు తదితర నాయకుల సారథ్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని డిజిటల్ విధానంతో జగనన్న చేపట్టే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుంటామన్నారు. అలాగే ఎన్నికల సమయంలో విదేశాల్లోని ఎన్ఆర్ఐలు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా సింగపూర్తోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను సైతం చైతన్యపరచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకుంటే రాష్ట్రంలో చేపట్టే అనేక సంక్షేమ పథకాలను చిత్రాల రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడిండారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ బొమ్మిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దక్కత జయప్రకాష్, కోర్కమిటీ, సోషల్ మీడియా ఇన్చార్జి పిల్లి సంతోష్రెడ్డి, సురేష్, నర్సింగ్ గౌడ్, మురళి, లోకేష్ ఉన్నట్లు కస్తూరి తెలిపారు. -
నెల్లూరు జిల్లా- మీ ఓటు ఉందా? చెక్ చేసుకోండిలా....
సాక్షి, నెల్లూరు జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 0861 - 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
తళుకులు కోల్పోతున్న ‘తెల్లబంగారం’
తెల్లబంగారం ఉప్పు ఉత్పత్తిలో ఓ వెలుగు వెలిగిన గోపాలపురం ప్రస్తుతం గత వైభవానికి చిహ్నంగా మిగిలిపోయి కుమిలిపోతోంది. తెల్లదొరల కాలం నుంచి ఉప్పు ఉత్పత్తికి, రవాణా అనుమతులకు కేంద్ర కార్యాలయంగా భాసిల్లిన ఆ పల్లె ఇప్పుడు బతుకుతెరువు కోల్పోయి గోడుమంటోంది. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆ ఊరు ప్రస్తుతం అటు ఉపాధి లేక.. ఇటు భూములు పనికి రాక దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించక ముఖం చాటేసింది. కనీసం భూములు సేకరించి పరిహారం ఇస్తారనుకుంటే ఆ ప్రతిపాదనలు ముందుకు కదలించలేదు. ముత్తుకూరు: జిల్లాలోని ముత్తుకూరు మండలంలో తెల్లదొరల పాలనా వైభవానికి, సాధారణ ఉప్పు తయారీ ప్రాభవానికి కేంద్రంగా ఉన్న గోపాలపురంలో సాల్ట్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడింది. ఉప్పు ఉత్పత్తి, అమ్మకాలు, రవాణాతో కళకళలాడిన ఆ గ్రామం ప్రగతికి దూరమై బోసిపోయింది. ఉప్పు ఉత్పత్తి లేక లైసెన్సీదారులు చెట్టుకొకరుగా చెదిరిపోయారు. ఊరినే నమ్ముకొన్న లైసెన్సీ సాగుదారులు దారిద్య్ర భారంతో కొట్టుమిట్టాడుతున్నారు. భూములు తీసుకుని పరిహారం ఇస్తారని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. పరిహారం కళ్ల చూడకుండానే కొందరు కాలం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో సాధారణ ఉప్పు ఉత్పత్తికి గోపాలపురం పెట్టింది పేరు. 1870లోనే తెల్లదొరల పాలనలో ఇక్కడ ఉప్పు తెల్లబంగారంగా రైతులను ఆదుకుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 770 ఎకరాల్లో ఏటా 20 వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి జరిగింది. లీజు పద్ధతిలో 110 మంది లైసెన్సీదారులు తరతరాలుగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేసి, పడవలు, లారీలు, ఎద్దుల బండ్ల ద్వారా అమ్మకాలు, రవాణా జరిపారు. గోపాలపురం సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో ఉప్పు ఉత్పత్తి ద్వారా 2,000 మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు. కరిగిపోయిన ఉప్పు వైభవం సముద్రనీటితో నేరుగా ఉప్పు తయారు చేసి, శుద్ధి చేసే ఫ్యాక్టరీలు నిర్మితం కావడంతో సంప్రదాయ సేద్యం ద్వారా ఉత్పత్తి చేసే ఉప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం మొదలైంది. జిల్లాకే తలమానికంగా ఏర్పడిన కృష్ణపట్నంపోర్టులో ఐరన్ఓర్, బొగ్గు ఎగుమతి, దిగుమతులు ఉప్పు ఉత్పత్తికి శాపంగా మారాయి. పోర్టు నుంచి ఎగసిపడే దుమ్ము, ధూళి సాధారణ ఉప్పు ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీశాయి. కయ్యలను కలుషితం చేశాయి. క్రమంగా ఉత్పత్తి, ధరలు పడిపోయి, సాగు విస్తీర్ణం తరిగిపోయింది. 2009తో మొదలై 2012 నాటికి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పోర్టు విస్తరణకు ఉప్పు భూములు కృష్ణపట్నంపోర్టు విస్తరణకు ఉప్పు భూములు సేకరించే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. లైసెన్సీదారులకు పరిహారం ఇచ్చి, భూములు సేకరిస్తారన్న ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో లైసెన్సీలు రద్దయ్యాయి. కయ్యలు బీడు పడ్డాయి. ముళ్ల చెట్లతో సాల్ట్ భూములు అడవుల్లా మారాయి. నిల్వ చేసిన ఉప్పు కుప్పలు మట్టిపాలయ్యాయి. నలుగురు జిల్లా కలెక్టర్లు ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. గోపాలపురం సాల్ట్ కార్యాలయం శిథిలమై, కూలిపోయే దశకు చేరింది. ఒకే ఒక్కడు ఈ కార్యాలయాన్ని సంరక్షిస్తున్నాడు. రెండు సార్లు సీఎంను కలిశారు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కృష్ణపట్నంపోర్టు చుట్టూ భూముల పరిహారం ఫైళ్లు అనేక మార్లు ప్రయాణం చేశాయి. ఎకరాకు రూ.15 లక్షల పరిహారం నిర్ణయిస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 డిసెంబరు 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం మొత్తం జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ చేయాలని పోర్టును సూచించింది. లైసెన్సీదారుల కష్టాలు ఇక్కడ నుంచి మొదలయ్యాయి. పోర్టు నిర్వాహకులు, ఉన్నతాధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగిపోయేలా తిరిగారు. మంత్రి సోమిరెడ్డి ద్వారా సాల్ట్ లైసెన్సీలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిసి, తమ గోడు వెళ్లబోసుకొన్నారు. పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వకపోవడంతో లైసెన్సీలు నీరసించిపోయారు. సంపాదనకు దూరమై దారిద్య్రంలో మునిగిపోయారు. ఉప్పు వైభవం ముగిసిపోవడంతో గోపాలపురం కూడా అభివృద్ధికి దూరమై, కళావిహీనమైంది. 14 మంది లైసెన్సీదారులు కాలం చేశారు ఉప్పు ఉత్పత్తిలో పేరుపడిన 14 మంది లైసెన్సీలు తమ భూముల పరిహారం కళ్ల చూడకుండానే కాలం చేశారు. వీరిలో వాడా వేణుగోపాలరెడ్డి, వాడా వెంకటశేషమ్మ, ఈదూరు రామచంద్రారెడ్డి, కలిసెట్టి దామోదరం, బండి శ్రీనివాసులు, ఆలపాక వీరమ్మ, నరహరి సత్యనారాయణ, మోహనరావు, అనిసెట్టి శేషమ్మ, సిద్ధవరపు భాస్కర్రెడ్డి, కరణం రాధయ్య, గాలి దామోదరం, మారుబోయిన బాలకోటయ్య, రమణయ్య పరిహారం దక్కకుండానే గతించిపోయారు. తిరిగి తిరిగి అలిసిపోయాం – చేవూరు కృష్ణయ్య, లైసెన్స్దారుడు 4 ఎకరాల్లో ఉప్పు సాగు చేశాను. సాగు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితికి గురయ్యాము. పరిహారం కోసం కాళ్లు అరిగిపోయేలా తిరిగాము. అటు నాయకులు, ఇటు అధికారులు సాయం చేయకపోవడంతో దిక్కుతోచక నీరసించిపోయాము. ఉప్పు తప్ప మరో వ్యాపకం లేదు – కలిచేటి సుబ్బారావు, లైసెన్స్దారుడు 3 ఎకరాల్లో ఉప్పు సాగును మాత్రమే నమ్ముకొని జీవనం సాగించాము. సాగుకు దూరమై, పరిహారం దక్కని దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించనేలేదు. చాలా మంది లైసెన్సీలు దివంగతులయ్యారు. అయినప్పటికీ పరిహారం మాత్రం దక్కలేదు. దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నా – కలిచేటి చంద్రశేఖర్, లైసెన్స్దారుడు నేను గతంలో 10 ఎకరాలు ఉప్పు సాగు చేసే వాడిని. ప్రస్తుతం ఉప్పు సాగు జరగడం లేదు. భూముల పరిహారం పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అందలేదు. లైసెన్సీదారులు చాలా మంది దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. పరిహారం చెల్లించకపోగా ఉప్పు భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. -
స్త్రీ మూర్తికి ‘కళాత్మక’ అభినందన
సాక్షి, నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహపురికి చెందిన కళాకారులు తమ భావాలను కళారూపంలో వ్యక్తీకరించారు. సందేశాత్మకంగా మహిళలకు స్ఫూర్తినిస్తూ కళాభివందనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని మూలాపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్ కోకకోలా శీతలపానీయం డబ్బా పై పిడికిలి బిగించి, జై కొడుతున్న మహిళ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. మహిళలు ఏ రంగంలో తీసిపోరని, సమాజంలో మహిళాసాధికారత సాధించాలని కాంక్షిస్తూ రెండు గంటల సమయంలో స్త్రీ మూర్తి రూపాన్ని తీర్చిదిద్దానన్నారు. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్కు చెందిన కార్పెంటర్ శ్రీనివాసులు తన వృత్తి నైపుణ్యంతో 8 అంగుళాల ఎత్తు, రెండున్నర అంగుళాల వెడల్పు ఉన్న కొయ్య ముక్కపై స్త్రీ రూపాన్ని రెండు గంటల సమయంలో తీర్చిదిద్దారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని కాంక్షించారు. ముత్తుకూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని నారికేళపల్లి పంచాయతీ సుబ్బారెడ్డిపాళెం యూపీ స్కూల్ తెలుగు పండిట్ సోమా పద్మారత్నం గురువారం సీసాలో ‘జాగృతి మహిళ’ చిత్రాన్ని నిక్షిప్తం చేశారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి తన కళారూపం ద్వారా అభినందనలు తెలిపారు. నెల్లూరుకు చెందిన సూక్ష్మరూప చిత్ర కళాకారుడు వెంకటశేషగిరిరావు చిన్న రబ్బర్ ముక్క(ఎరేజర్)పై అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పుతో కలర్ పెయింటింగ్ను తీర్చిదిద్దారు. రెండు గంటల పాటు శ్రమించి చిత్రానికి రూపమిచ్చానని చెప్పారు. సుద్ద ముక్కపై మహిళకు సూక్ష్మరూపం అనుమసముద్రంపేట: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఎస్పేట మండలంలోని హసనాపురం ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు పార్థసారథి సుద్ద ముక్కపై కూర్చున్న మహిళ ఆకృతిని తయారు చేశారు. ఒక మహిళ దుఃఖిస్తూ, ప్రాధేయపడుతూ దేశంలో ఉన్న మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్న అర్థం తెలిపేలా ఈ సూక్ష్మరూపాన్ని చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా చాక్పీసులతో ఈ బొమ్మను తయారు చేశారు. -
జగన్ సీఎం అయ్యాక మహిళలకు భరోసా
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మహిళలకు భరోసా దొరికి వారి కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. వేదాయపాళెంలోని ఎమ్వీఎస్ కల్యాణమండపంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన మహిళలతో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ కొడితే 108 కంటే వేగంగా మద్యం వస్తోందని ఆరోపించారు. ఆదాయం పెంచుకునేందుకు మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యాన్ని విక్రయించకూడదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిస్తే, చంద్రబాబు మాత్రం విక్రయించుకోవచ్చని జీఓ ఇవ్వడం దుర్మార్గమన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేయనున్నారని చెప్పారు. జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశమివ్వాలని కోరారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ మహిళా విభాగ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కార్పొరేటర్ లక్ష్మీసునంద, తోట శోభారాణి, చేజర్ల కవిత, హురియా, తిప్పిరెడ్డి మమతారెడ్డి, జమునమ్మ, నీళ్ల పెంచలమ్మ, భారతి, సుజితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అనిల్ సేవలు ఆదర్శం
నెల్లూరు(సెంట్రల్): నగర ఎమ్మెల్యే అనిల్కుమార్ సేవలు ఆదర్శమని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కొనియాడారు. నగరంలోని 9వ డివిజన్ చిన్నబాలయ్యనగర్లోని పత్తివారి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్మించిన 1000 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యేతో కలిసి వేమిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాటర్ప్లాంటు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి కారణం నగర ఎమ్మెల్యే అనిల్కుమార్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉం టూ అనిల్ చేపడుతున్న సేవలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనిల్ను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ఎంపీ నిధులతో పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాటర్ప్లాంట్ను రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్కమిటీ సభ్యులకు సూచించారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అనిల్కుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎంపీ నిధుల నుంచి వాటర్ప్లాంటు మంజూరు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలకు తనకు చేతనైన సహాయసహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ రాజశేఖర్, వంగాల శ్రీనివాసులురెడ్డి, ఈదల ధనూజారెడ్డి, తంబి, బట్టా కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి, మల్యాద్రి, పొడమేకల సురేష్, నాగూర్ నాయుడు, వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘అంతు తేలుస్తా.. లోపలేయిస్తా’
పొదలకూరు: ‘మీకు ఎంత దమ్ము, ధైర్యం ఉంటే మా సీఎంకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారు. ఒక మంత్రి వస్తున్నాడన్న మర్యాద, భయం లేకుండా ప్రవర్తిస్తారా? మీ అంతు తేలుస్తా, ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి, లేదంటే లోపలేయిస్తా. మీ ఎమ్మెల్యే రౌడీషీటర్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు.’ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండల పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై శివాలెత్తి చేసిన వ్యాఖ్యలివి. అంతటితో ఆగకుండా బిరదవోలు పంచాయతీ కల్యాణపురంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ద్వారా గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎప్పుడో ఏర్పాటుచేసిన ‘నిన్ను నమ్మం బాబు’ ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్నికల నిబంధనలు త్వరలో అమలవుతున్న తరుణంలో మంత్రి మండలంలో బుధవారం సుడిగాలి పర్యటనలు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరుపూరు, చాటగొట్ల, పొదలకూరు, అంకుపల్లి, పార్లపల్లి, బిరదవోలు, కల్యాణపురం, విరువూరు, సూరాయపాళెం గ్రామాల్లో సిమెంట్రోడ్లు, మంచినీటి పథకాలను ప్రారంభించారు. అయితే మంత్రి పర్యటనలో గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారని నాయకులు తెలిపారు. కల్యాణపురంలో అనుచిత వ్యాఖ్యలు కల్యాణపురం వైఎస్సార్సీపీకి కంచుకోటగా తయారైంది. ఇక్కడ టీడీపీలో పాతికేళ్లపాటు ఉన్న అక్కెం బుజ్జిరెడ్డి గతేడాది వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్యే కాకాణితో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గ్రామానికి వెళ్లి పరోక్షంగా బుజ్జిరెడ్డిని ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులను దగ్గర పెట్టుకుని ఫ్లెక్సీలను తొలగించడంతోపాటు, ఎమ్మెల్యే రౌడీలను వెనకేసుకుని తిరుగుతున్నాడన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రసంగించి వెళ్లారని గ్రామస్తులు వెల్లడించారు. తమ గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయకున్నా ఎప్పుడో నీరు – చెట్టు పథకంలో చేసిన పనికి శిలాఫలం వేసుకుని వెళ్లారని తెలిపారు. సగం పూర్తయిన పనులకు శంకుస్థాపనలు పొదలకూరులో అన్న క్యాంటీన్ భవనం బేస్మట్టం పూర్తై పిల్లర్లు నిర్మాణంలో ఉండగా దానికి మంత్రి శంకుస్థాపన చేశారు. చాటగొట్లలో నాలుగేళ్ల క్రితం పూర్తయిన విద్యుత్ సబ్స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. గతంలో సీఈ సబ్స్టేషన్ను ప్రారంభించినప్పటికీ. మంత్రి మళ్లీ ప్రారంభించడాన్ని చూసి అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. అంకుపల్లి హరిజనవాడలో 60 శాతం పనులు పూర్తైన వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. బిరదవోలులో సీసీ రోడ్లకు శిలాఫలం నిర్మించకుండానే దిమ్మెకు ఆనించి ప్రారంభించడం విశేషం. ఎన్నికల కోడ్ వస్తుందని మంత్రి హైరానా పడుతూ శిలాఫలాలు వేసుకుంటూ వెళుతున్నారని ఆయా గ్రామాల్లో ప్రజలు చర్చించుకున్నారు. -
టీడీపీ చీప్ ట్రిక్స్
సాక్షి, నెల్లూరు: ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న టీడీపీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తొక్కని అడ్డదారి లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించి కుట్రలకు పాల్పడిన టీడీపీ తాజాగా తమ పార్టీకి ప్రచారం చేసేలా అంగన్వాడీ కార్యకర్తలను పురమాయిస్తూ కుయుక్తులకు తెరలేపింది. విజయమే పరమావధిగా అంగన్వాడీ కార్యకర్తలతో రీజినల్ ఆర్గనైజర్ హోదాలో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కావలిలో టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్ శ్రీదేవికి ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్గా ఇటీవల పదవి ఇప్పించిన బీద సోదరులు ఆమె ద్వారా అంగన్వాడీ కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం చేయించేలా ఒత్తిడి పెంచుతున్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె అంగన్వాడీ కార్యకర్తలను సమీక్షల పేరుతో పిలిపించి టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేయించేలా చూడటం వివాదాస్పదంగా మారుతోంది ఐసీడీఎస్ అధికారుల తీరుపై ఆగ్రహం అంగన్వాడీ కార్యకర్తల సమావేశాన్ని పార్టీ ప్రచార సభగా మార్చేయడంపై పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతుల పేరుతో పార్టీలకతీతంగా దాతలను ఆహ్వానించాల్సిందిపోయి పార్టీ అభ్యర్థులను పిలిపించి ప్రచారం నిర్వహించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఐసీడీఎస్ అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల ఆర్ఓ శ్రీదేవి ఆత్మకూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో రహస్యంగా అంగన్వాడీలతో సమావేశాలను నిర్వహించి ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సహకరించాలని ఆదేశించినట్లు తెలిసింది. అలక మానిపించేందుకు కావలిలో అధికార పార్టీ కౌన్సిలర్గా ఉన్న శ్రీదేవి బీద సోదరుల వ్యవహార శైలితో ఇటీవల అలకబూనారు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం రావడంతో బీద సోదరులు సీఎంతో చర్చించి హడావుడిగా ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ పోస్ట్ ఇప్పించేలా చేశారు. వాస్తవానికి ఈ పోస్టును ఒంగోలుకు చెందిన టీడీపీ మహిళా నేత మాధవికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనా, బీద సోదరులు చివరి క్షణంలో శ్రీదేవి పేరును తెరపైకి తెచ్చి ఆమెకు దక్కేలా వ్యవహారం నడిపించారు. దీంతో అలకవీడిన ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించాక బీద సోదరుల కనుసన్నల్లో నడుస్తూ చిరుద్యోగులను టార్గెట్ చేసి వారితో పార్టీకి పనిచేయించేలా ఒత్తడి పెంచడం వివాదాస్పదంగా మారుతోంది. పార్టీ ప్రచారం కోసం ప్రభుత్వం అమలుచేసే పలు సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేసేందుకు అంగన్వాడీ వర్కర్లు కీలకంగా ఉన్నారు. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు నెరిపే వర్కర్లను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు తద్వారా ఎన్నికల ప్రచారం చేయించుకునేందుకు పెద్ద ఎత్తుగడే వేశారు. దీంతో అంగన్వాడీ వర్కర్లకు పార్టీ రంగు పులిమి వారితో ఎన్నికల ప్రచారం చేయించుకునేందుకు ప్రయత్నాలు మమ్మురం చేయాలంటూ కొత్తగా రీజినల్ ఆర్గనైజర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ మహిళా నేత శ్రీదేవిని రంగంలోకి దింపారు. ఆమె ఐసీడీఎస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి నియోజకవర్గాల వారీగా అంగన్వాడీ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లోనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు దాతల సహకారం కోరుతున్నామని చెప్తూ టీడీపీకి చెందిన అభ్యర్థులు, నేతలను సమీక్షలకు ఆహ్వానిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడంతో పాటు అందరితో ఓట్లు వేయించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలపై నేతల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలను సమీక్షల పేరుతో ఆత్మకూరులోని ప్రైవేట్ కల్యాణ మండపానికి పిలిపించి టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య ద్వారా పార్టీ ప్రచారం చేయించిన విషయం వివాదాస్పదంగా మారింది. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేయిస్తే సంక్షేమ పథకాల అమలుతో పాటు జీతాలు పెంచుతామని ప్రలోభపెట్టేలా ప్రసంగం చేయడంపై పలువురు అంగన్వాడీలు అభ్యంతరం తెలిపారు. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలోనే ఈ వ్యవహారాన్ని నడిపించడంతో పెద్ద దుమారం రేగింది. -
పచ్చ కుట్ర
జిల్లాలో ప్రజాభిమానాన్ని కోల్పోయిన అధికార పార్టీ కుట్ర రాజకీయాలకు తెగబడుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ సానుభూతిపరుల ఓట్లు వారికి తెలియకుండానే తొలగించే యత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పార్టీ ఓట్లను సదరు పార్టీ పోలింగ్ బూత్ కన్వీనర్లే తొలగించమని కోరినట్లు ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తూ గందరగోళానికి తెర తీశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, బాధితులనే వేధించాలని మరో వైపు పోలీసుల ద్వారా ఒత్తిళ్లు పెంచారు. జిల్లాలో ఇప్పటి వరకు ఓట్లకు సంబంధించి 1.77 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో ఫారం–7 దరఖాస్తులే 31 వేల పైచిలుకు ఉండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, అభిమానులు, కార్యకర్తల ఓట్లు తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ కుతంత్రాలు చేస్తోంది. ఆ పార్టీ కార్యకర్తల పేర్లతో అధికార పార్టీ నాయకులు ఫారం–7 బోగస్ దరఖాస్తులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించే విధంగా దరఖాస్తులు చేస్తూ తిరిగి వారిపైనే కేసులు బనాయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేయగా అనేక చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను విచారణ పేరుతో పిలుస్తూ వారి నుంచి రకరకాల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్ అధికార పార్టీ నేతలు పోషిస్తే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న గందరగోళంపై ఓటర్లు అందోళన చెందుతున్నారు. 31,067 ఫారం–7 దరఖాస్తులు జిల్లాలో ఇప్పటి వరకు ఫారం–6, ఫారం–7 పేరిట 1,77,887 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో ఫారం–7 దరఖాస్తులు 31,067 వేలు ఉండడం గమనార్హం. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 90 వేలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ నెల 7వ తేదీలోపు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ ఏదో విధంగా వైఎస్సార్సీపీ దెబ్బ కొట్టాలని కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగా ఓట్ల తొలగింపు కుట్రలు చేస్తోంది. ‘మొగుడ్ని కొట్టి మొగసాలికెక్కినట్లు’ వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించి మా ఓట్లు తొలగించారంటూ టీడీపీ నేతలు కేసులు నమోదు చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నాయకులు చెప్పడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కేసులు నమోదు చేస్తున్నారు. కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఫారం–7 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించే సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫారం–7 దరఖాస్తులు వాస్తవమేనని నివేదికలు సమర్పిస్తే జిల్లా వ్యాప్తంగా 50 వేలకుపైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉంది. జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించి దరఖాస్తులు చేసుకోవడానికి సమయం పడుతుంది. ప్రజలు 1950కి ఫోన్ చేసి ఓటర్ గుర్తింపు కార్డుపై ఉండే నంబర్ చెబితే ఓటు ఉందో లేదో తెలియజేస్తారు. కావలి నియోజకవర్గంలో 4,862, ఆత్మకూరు 3,399, సర్వేపల్లి 2,378, గూడూరు 7,153, సూళ్లూరుపేట 3,937, వెంకటగిరి 2,642 ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 19 వేల ఫారం–7 దరఖాస్తులను పరిశీలించారు. 20 కేసుల నమోదు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫిర్యాదు ఇస్తే పరిశీలించి పక్కన పెట్టడం తీవ్ర ఒత్తిడి వస్తే మతిస్థిమితం లేని వ్యక్తిపై కేసు నమోదు చేయడం, అదే ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదులు, అధికారుల ఫిర్యాదులు ఇస్తే వైఎస్సార్సీపీ వారిని విచారణకు పిలిచి హడావుడి చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫాం–7 పేరుతో 20 కేసులు నమోదయ్యాయి. వ్యక్తికి సంబంధం లేకుండా వ్యక్తి పేరుతో ఓట్లు తొలగించాలంటే ఫారం–7 కింద దరఖాస్తు చేయాలి. జిల్లాలో ఇప్పటి వరకు అలాంటివి 31 వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి ఎన్నికల కమిషనర్కు నివేదిక ఇచ్చిన తదనంతరం వారి ఆదేశాల అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో కావలి సబ్డివిజన్లో 6, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో 3 గూడురు సబ్ డివిజన్లో 3, ఆత్మకూరు సబ్ డివిజన్లో 8 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గూడూరులో ఆరుగురు వైఎస్సార్సీపీ క్యాడర్ను విచారణకు స్టేషన్కు పిలిచారు. ఫారం–7 దరఖాస్తులపై డీఎస్పీ విచారణ పొదలకూరు: మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల పేర్లపై ఆన్లైన్లో సమర్పించిన ఫారం–7 ఓట్ల తొలగింపు దరఖాస్తులపై నమోదైన కేసులో ఆత్మకూరు డీఎస్పీ వెంకటాద్రి బుధవారం విచారణ చేపట్టారు. ఈ కేసులో ఉన్న 33 మందిని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయానికి పిలిపించుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం సంబంధిత వ్యక్తుల ద్వారా స్టేట్మెంట్ రికార్డులు చేశారు. ఈ సందర్భంగా ఫారం –7 దరఖాస్తులు తమ పేర్లపై దాఖలు అయినప్పటికీ తమకు ఎలాంటి సంబంధం లేదని, వీఆర్వో సమాచారం అందించేంత వరకు తమకు తెలియదని వైఎస్సార్సీపీ గ్రామస్థాయి నాయకులు డీఎస్పీకు అందజేసిన స్టేట్మెంట్లో వెల్లడించినట్టు సమాచారం. -
సెల్ఫీ పిచ్చి.. పాము కాటుకు మృతి
సాక్షి, నెల్లూరు : సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణలు కోల్పోయాడు. నాగుపాముతో సెల్ఫీ తీసుకునేందుకు జగదీష్ అనే యువకుడు ప్రయత్నం చేయగా.. పాము కాటేసింది. ఈ ఘటన మంగళవారం సుళ్లురుపేట మండలం మంగళపాడులో చోటుచేసుకుంది. ఇది గమనించిన సమీప వ్యక్తులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలిచండంతో చికిత్స పొందుతు మృతి చెందాడు. పాములో విష తీవ్రత ఎక్కువగా ఉండడంతో శరీరమంతా పాకి పరిస్థితి విషమించడంతో యువకుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
సెరా శానిటరీవేర్ నెల్లూరు ప్లాంటు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీవేర్ తయారీ కంపెనీ సెరా నెల్లూరు ప్లాంటును విస్తరించనుంది. గూడూరు వద్ద ఉన్న ఈ టైల్స్ తయారీ కేంద్రం రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 10,000 చదరపు మీటర్లు. దీనిని రూ.50 కోట్ల వ్యయంతో రెండింతల సామర్థ్యానికి చేర్చనున్నట్టు సెరా సానిటరీవేర్ సీఎండీ విక్రమ్ సొమానీ ఆదివారం తెలిపారు. జూబ్లీహిల్స్లో సెరా స్టైల్ స్టూడియోను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,180 కోట్ల టర్నోవర్ సాధించాం. 2018–19లో రూ.1,500 కోట్లు ఆశిస్తున్నాం. టైల్స్ తయారీకి జాయింట్ వెంచర్స్ కోసం చూస్తున్నాం. గుజరాత్లో రూ.25 కోట్లతో నెలకొల్పుతున్న పాలిమర్ ప్లాంటు లో ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి మొదలు కానుంది’ అని చెప్పారు. సెరా స్టైల్ స్టూడియోలో కంపెనీ ఉత్పత్తులను కేవలం ప్రదర్శిస్తామని సేల్స్ డీజీఎం జి.వి.చౌదరి తెలిపారు. 2017–18లో ఏపీ, తెలంగాణలో రూ.158 కోట్లు ఆర్జించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు లక్ష్యమని వివరించారు. -
చందాల మోహన్ రెడ్డిగా అవతారమెత్తాడు
నెల్లూరు : ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిల్లర్ల దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ చందాల మోహన్ రెడ్డిగా అవతారం ఎత్తి రైతాంగం సమస్యను విస్మరించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని కాకాణి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘ అన్నం పెట్టే రైతన్న తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక కన్నీరు పెడుతున్నామంత్రి సోమి రెడ్డికి కనికరం లేదు. సోమిరెడ్డి ప్రకటనలతో మిల్లర్లకు ఆదాయం తప్ప, రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు’ అని మండిపడ్డారు. -
పేదలకు అందని వైద్యం
► ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవీ రమణయ్య నెల్లూరు: మన రాష్ట్రంలో ప్రజారోగ్యం ఆందోళనలో ఉందని, పేదలకు సరైన వైద్యం అందడం లేదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవీ రమణయ్య పేర్కొన్నారు. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పతనం అంచున ప్రజారోగ్యం అనే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారి దేశాలైన ఇంగ్లాండ్, అమెరికాలో సైతం వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తోందన్నారు. ఎంత పెద్ద అధికారి అయినా, ప్రజాప్రతినిధులైనా అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు విరుద్ధంగా మన దేశంలో వైద్యరంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను తగ్గిస్తున్నాయని ఆరోపించారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా, అత్యవసర మందులను ఏర్పాటు చేయకుండా, నాణ్యత కలిగిన వైద్యపరికరాలు అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వమే నీరుగారుస్తోందని విమర్శించారు. కార్పొరేట్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ వారికి రా యితీలు ఇస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యశాలలు సరిగాలేవనే ప్రచారాన్ని ప్రభుత్వమే కల్పి స్తుందని విమర్శించారు. తద్వారా ప్రభుత్వ వైద్యశాలలను అపోలోలాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పటికైనా వైద్యం అనేది తమ హక్కు అని ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, 24గంటల ఆస్పత్రులను బలోపేతం చేసి వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 5 శాతం నిధులను వైద్యరంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్యం పరిరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, దోమల నిర్మూలన తదితర వాటి ద్వారా 90 శాతం జబ్బులను నిర్మూలించవచ్చన్నారు. సదస్సులో ఆ వేదిక జిల్లా కన్వీ నర్ శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా తదితర ప్రజాసంఘాలకు చెందిన నేతలు పాల్గొని వైద్యం ప్రభు త్వ ఆధీనంలోనే ఉండాలని, అప్పుడే పేదవారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. -
ఉప్పు దుకాణాలపై తనిఖీలు
నెల్లూరు(పొగతోట): ఇతర జిల్లాల్లో ఉప్పు కొరత ఉండడంతో జిల్లాలోని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఉప్పును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఉప్పు ధరలు, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో హోల్సేల్ వ్యాపారుల వద్ద ఉన్న ఉప్పు నిల్వలు, విక్రయాలు, ధరలు తదితర వివరాలు సేకరించాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. కలెక్టర్, జేసీ ఆదేశాలతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నగరంలోని ఉప్పు హోల్సేల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏఎస్ఓ చాల్లా లక్ష్మినారాయణరెడ్డి, సీఎస్డీటీలు రవి, యువరాజ్, శేఖర్బాబు పాల్గొన్నారు. -
ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా బీపీఎస్ దరఖాస్తులు మంజూరు
నెల్లూరు, సిటీ : బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద దరఖాస్తు చేసుకున్న వాటిని ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా మంజూరు చేయునున్నట్లు టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రంగరాజు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఎల్బీఎస్(లైసెన్స్ బిల్డింగ్ సర్వేయర్లు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. బీపీఎస్లో దరఖాస్తు చేసుకున్న వారి ఫైల్స్ను టౌన్ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా మంజూరు చేస్తామన్నారు. ఆన్లైన్ పద్ధతి ప్రకారం బీపీఎస్ కూడా సులభ పద్ధతిలో చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు బీపీఎస్లో దరఖాస్తు చేసుకున్న వారు వారి డాక్యుమెంట్లు అప్లోడ్చేయాలని సూచించారు. సమావేశంలో టౌన్ప్లానింగ్ ఆఫీసర్ సుధాకర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఎల్బీఎస్లు పాల్గొన్నారు. -
అర్ధరాత్రికి మరింత బలపడనున్న తుపాను
విశాఖపట్నం: హెలెన్ తుపాను ఈ అర్ధరాత్రికి మరింత బలపడనుంది. వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం దిశ మార్చుకున్న తుపాను విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి ఉదయానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్యలో ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో హెలెన్ తుపాన్ తీరం దాటుతుందనే హెచ్చరికలతో కలెక్టర్ విజయ్ కుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. 28 తీర ప్రాంత గ్రామాల్లోని సుమారు 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలి సముద్ర తీరంలో రెండున్నర మీటర్ల మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు పడవలను, వలలను సురక్షితప్రాంతానికి తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రపు అలల తాకిడికి ఫిషింగ్ బోట్ మునిగిపోయింది. అందులోని ఆరుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు 6 విపత్తు నివారణ బృందాలను పంపారు. రెవిన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. -
నెల్లూరులో నల్లపరెడ్డి మద్దతు దీక్ష