Pan India
-
పాన్ ఇండియా మూవీలో...
పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్– అర్జున్ ఆర్ట్స్పై రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 24న హైదరాబాద్లోప్రారంభం కానుంది. ‘‘పాయల్ రాజ్పుత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించనున్న చిత్రమిది. ఆమె క్యారెక్టర్లో పలు భావోద్వేగాలు ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే!’
న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది. ఢిల్లీలో మళ్లీ GRAP-3ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్లైన్లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.చదవండి👉🏼: అమిత్ షాజీ.. రాజధాని ఎలా మారిందో చూడండి! -
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ టైటిల్ ఈవెంట్లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు. -
తాత ప్రధానమంత్రి.. హీరోయిన్గా పాన్ ఇండియా క్రేజ్.. అదితీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?
'ఈశ్వర్'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్ బాక్సాఫీస్కు 'ఛత్రపతి'లా 'ఏక్ నిరంజన్' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్ను ఏకంగా రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్కు పరిచయం చేశాడు. తను పుట్టిన గడ్డపై ప్రకృతి కన్నేర్ర చేస్తే తనవంతుగా 'పౌర్ణమి' లాంటి వెలుగును అందింస్తాడు. సిల్వర్ స్క్రీన్పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూనే అమ్మాయిల కలల రాకుమారుడిగా 'డార్లింగ్' అని పిలిపించుకుంటాడు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్లో 'సలార్' రూలింగ్ మాత్రమే జరుగుతుంది. ఇవాళ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విషయాలు మీ కోసం..ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ప్రభాస్ మంచి ఎత్తుతో పాటు చాలా గ్లామర్గా ఉండటంతో అందరూ ఆయన్ను 'హీరో... హీరో' అని పిలిచేవారట. కానీ సినిమాలంటే చాలా భయపడేవాడట. తనకు తెలిసిన మొదటి హీరో పెదనాన్న కృష్ణంరాజు. ఆయనకు ప్రభాస్ బిగ్ ఫ్యాన్ కూడా... ఓ రోజు భక్తకన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి ప్రభాస్ కూడా వెళ్లాడు.. అలా సినిమా సెట్లోని వాతావరణానికి అలవాటు పడ్డాడు. రోజూ పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలు చూస్తూ అలా తన కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.వరుసగా ప్లాపులొచ్చినా మళ్లీ.. మళ్లీ తిరిగొచ్చాడుకృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. ఈ రెండు చిత్రాలతో నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు ప్రభాస్కు దక్కాయి. కానీ, చిత్రపరిశ్రమలో తన మార్క్ వేయలేకపోయాడు. దీంతో మూడో చిత్రంతో మంచి విజయం అందుకోవాలని చాలా ఆశలు పెట్టుకుని 2004లో త్రిష కాంబినేషన్తో 'వర్షం' తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత పర్వాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. దీంతో ఈ చిత్రం కూడా పోయిందని ప్రభాస్ అనుకున్నాడు. అయితే, వారం తర్వాత వర్షంలా కలెక్షన్స్ పెరిగాయి. ఆపై సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాడు. అలా ప్రభాస్ కెరియర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ కావడంతో మళ్లీ వర్షం లాంటి సినిమాతో హిట్ కొట్టాలని ప్రభాస్ తపించాడు. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ (2005) బ్లాక్బస్టర్ కొట్టాడు. మళ్లీ రెండేళ్ల పాటు ఒక్క హిట్ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా వరుసుగా మళ్లీ పరాజయాలే.. ఇలా ఇండస్ట్రీలో పడిపోయిన ప్రతిసారి తిరిగి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'తో డిఫరెంట్ మ్యానరిజాన్ని టాలీవుడ్కు పరిచయం చేశాడు. 'బిల్లా'తో తనలోని స్టైలిష్ లుక్ను పరిచయం చేసిన ప్రభాస్ ఏక్ నిరంజన్తో మరో కోణాన్ని పరిచయం చేశాడు. అలా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో అదరగొట్టేశాడు. బాహుబలి కోసం ఒకేఒక్కడుబాహుబల సమయంలో ప్రతి హీరో ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం 'బాహుబలి' కోసం జక్కన్నకి ఐదేళ్లు పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేశంలో ఇదో సంచలనం. అన్ని రోజులపాటు మరో సినిమా ఒప్పుకోకుండా నిలబడిని ఏకైక హీరోగా ఆయన పేరుపొందాడు. ఆ సమయంలో అనుష్క,రానా,తమన్నా వంటి వారందరూ వేరే సినిమాలు చేశారు. ప్రభాస్ ఒక్కడే బాహుబలి మొత్తం అయ్యే వరకు ఒకే సినిమాకి పనిచేశాడు. ప్రభాస్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కోసం నార్త్ ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్,సలార్,కల్కి వంటి చిత్రాలు బాలీవుడ్లో దుమ్మురేపాయి. టాలీవుడ్కు ఏమాత్రం తగ్గకుండా అక్కడ కలెక్షన్లు రాబట్టాయి. ఎన్నో ఎళ్ల పాటు బాలీవుడ్ను శాసిస్తున్న ఖాన్ హీరోలను ప్రభాస్ వెనక్కు నెట్టేశాడు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ కిరీటాన్ని ప్రభాస్ ఎప్పుడో అందుకున్నాడు.ప్రభాస్కు స్నేహితులు.. ఆ రెండు సినిమాలు 20 సార్లు చూశాడుప్రభాస్కు అభిమాన హీరో కృష్ణంరాజు అయితే, షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష నటన అన్నా ఆయనకు చాలా ఇష్టం. తనకు దగ్గరైన దోస్తులు చాలామందే ఉన్నారు. వారిలో గోపిచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్లు ప్రభాస్కు మంచి స్నేహితులు. అయితే, కెరియర్ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్గా రాజమౌళి అంటే ప్రభాస్కి ఎనలేని అభిమానం. ఆయన తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ. ఆయన సినిమాలను ప్రభాస్ చాలా ఎక్కువగానే ఇష్టపడతాడు. ఆయన డైరెక్ట్ చేసిన త్రీ ఇడియట్స్, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ప్రభాస్లో ఇవన్నీ ప్రత్యేకం► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్గా ప్రభాస్ గుర్తింపు పొందారు.► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు.► ప్రభాస్కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.► స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.► ప్రభాస్ ఖాతాలో వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి2, కల్కి 2898AD ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు.► ప్రభాస్కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం' -
రూ.2 లక్షల బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్’ రికార్డులెన్నో!
చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే.మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా...వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.‘మాయాబజార్’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్’గా మిగిలింది. ‘మాయాబజార్’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.చిన్న కథ... బలమైన స్క్రీన్ప్లేనిజానికి ‘మాయాబజార్’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.ఎస్వీఆర్ మీదే ప్రమోషన్!66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్ మార్కస్ బార్ట్ లీ. గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్’ టైమ్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేశారట.రెండు లక్షల బడ్జెట్తో...‘మాయాబజార్’ను సుమారు రెండు లక్షల బడ్జెట్తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్’ని తొలి పాన్ ఇండియా మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్’ అనేది ఓ గోల్డ్ మెమరీ. – ఇంటూరు హరికృష్ణ -
ప్రభాస్ కు చెక్ పెడతామంటున్న తారక్, బన్నీ,చరణ్..
-
పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టేందుకు తారక్ మంత్రం
-
మల్టీస్టారర్ కు మొగ్గు చూపుతున్న బడా హీరోలు
-
నటుడు విజయ్ చెప్పినట్లు..!
ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకిగా మారిన నటి కీర్తీసురేశ్. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పింగల నటి ఈ బ్యూటీ. అపజయాలు విజయాలకు సోపానం అంటారు. అది కీర్తీసురేశ్కు చాలా బాగా వర్తిస్తుంది. ఈమె తల్లి మేనక అప్పట్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళియన్ అయిన ఈమె మలయాళ సినీ నిర్మాత సురేశ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన కీర్తీసురేశ్ బాల నటిగానే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈమె కథానాయకిగా నటించిన తొలి తమిళ చిత్రం ఇదు ఎన్న మాయం. ఈ చిత్రం నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన రజనీ మురుగన్, రెమో వంటి చిత్రాలు హిట్ కావడంతో కీర్తీసురేశ్కు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా అక్కడ నటించిన మహానటి చిత్రం ఆమెను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో కీర్తీసురేశ్ స్థాయి పెరగడంతో పాటు, వదంతులు అధికం అవుతున్నాయి. ఈ బ్యూటీ 20 ఏళ్ల వయసున్న ఓ నటుడి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తాజాగా వైరల్ అవుతున్న ప్రచారం. దీనిపై స్పందించిన కీర్తీసురేశ్ నటుడు విజయ్ చెప్పినట్లు వదంతులకు వివరణ ఇస్తే అది నిజం అవుతుందన్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం అన్నారు. ఇకపోతే నటన గురించి విమర్శలను తాను స్వాగతిస్తానని, ఒక నటిగా అవి తనను మెరుగుపరుస్తానికి ఉపయోగపడతాయని కీర్తీసురేశ్ సమాధానం ఇచ్చారు. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం రఘుతాత ఆగస్ట్ 15వ తేదీన తెరపైకి రానుంది. -
పాన్ ఇండియా మార్కెట్ పై..తమిళ హీరోల దండయాత్ర..
-
నా దృష్టిలో పాన్ ఇండియా అంటే అదే: టాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్
మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో దిగాంగన సూర్యవన్షి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై అశ్విన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అశ్విన్ బాబు మాట్లాడుతూ..'తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ అయ్యాయి. నేను మాత్రం ఎక్కువగా స్క్రిప్ట్ను నమ్ముతాను. కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అనుకుంటా. ఎందుకంటే హిడింబ చిత్రాన్ని మనకంటే హిందీలో ఎక్కువగా చూశారు. ఇది నేను ఊహించలేదు. శివం భజే పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సరే.. సినిమా రీచ్ అయితే చాలు' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్గా అశ్విన్ బాబు కనిపించనున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హైపరి ఆది, మురళి శర్మ, సాయిధీనా, బ్రహ్మజీ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. నాకు ప్యాన్ ఇండియా వద్దు.. సినిమా రీచ్ అయితే చాలు!Hero @imashwinbabu says, "I believe in only content!"💥💥#AshwinBabu #ShivamBhaje #TeluguFilmNagar pic.twitter.com/mFdt7s8Mfs— Telugu FilmNagar (@telugufilmnagar) July 23, 2024 -
సీక్వెల్ సినిమాలులో టాలీవుడ్ టాప్..
-
సై, సై అంటున్న కోలీవుడ్
-
మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ కరెక్టేనా?.. యంగ్ హీరో స్ట్రాంగ్ రియాక్షన్!
‘రాజావారు రాణిగారు’మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. 2019లో విడుదలైన ఈ రొమాంటిక్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో రహస్య గోరఖ్ హీరోయిన్గా నటించారు. గతేడాది మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలతో అలరించిన కిరణ్ ప్రస్తుతం క అనే మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సుజీత్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా క మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికర ప్రశ్న వేశాడు. తెలుగులో మీకు పెద్ద సక్సెస్ రాలేదు.. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా మూవీని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.దీనికి కిరణ్ స్పందిస్తూ.. 'నా దృష్టిలో పాన్ ఇండియా స్థాయి అంటే కేవలం కంటెంట్ మాత్రమే.. మొన్న వచ్చిన మలయాళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ను మనం పెద్ద హిట్ చేశాం. అందులో యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? అంతే కాదు కాంతార సినిమాకు ముందు రిషబ్ శెట్టి గురించి మనకు తెలుసా? ఇక్కడ ఫైనల్గా స్థాయి అంటే కంటెంట్ మాత్రమే సార్. నా స్థాయి పెద్దదా? చిన్నదా? అనేది నెక్ట్స్? మనం సినిమాలో కంటెంట్కు స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్. క అనే సినిమాలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నా. కంటెంట్ ఉంటే సినిమాను మీరందరూ ఎక్కడికో తీసుకెళ్తారు. అందుకే ఇతర భాషల్లోనూ తీసుకొస్తున్నాం' అని అన్నారు. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ అతనికి గట్టిగానే ఇచ్చిపడేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.#KiranAbbavaram About PAN INDIA Release✅ STRONG Counter From #KiranAbbavaram 🔥🔥🔥🔥#KA pic.twitter.com/GYyeyhFJQq— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
బాహుబలితో మొదలైంది.. ట్రెండ్ సెట్
-
పాన్ ఇండియా.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి
-
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్న స్పిరిట్ రూమర్!
-
పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరో
పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్గా నిలుస్తోంది టాలీవుడ్. ఇప్పటికే పలు యంగ్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ లిస్ట్లోకి తాజాగా యంగ్ హీరో ఈశ్వర్ ప్రసాద్ కూడా చేరాడు. 4లెటర్స్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఈశ్వర్ ప్రసాద్.. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సొంతూరు తిరుపతి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ.. ఈశ్వర్కు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. పలు కథలు విని.. చివరకు ఓ పాన్ ఇండియా స్టోరీని ఓకే చేశాడు. జులై 11న తన బర్త్డే సందర్భంగా లుగు లో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ లో ఓ పాన్ ఇండియా సినిమా ను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను జులై 11న వెల్లడిస్తామని ఈశ్వర్ చెప్పారు. -
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్న స్పిరిట్! ఇక ప్రభాస్ రేంజే వేరు.
-
పేరుకే పాన్ ఇండియా మూవీస్.. ఒక్కటి కూడా టైమ్ కి రిలీజ్ అవ్వవు
-
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!
‘‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్. ఎంజాయ్ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్ సార్ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్గారి ΄్యాషన్ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్ ఇంజినీర్స్ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్ అశ్విన్. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు. -
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బుల్లితెరపై యాంకర్గా ఫుల్ బిజీగా ఉంటూనే.. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ వెండితెరపై కూడా శ్రీముఖి మెరిపిస్తుంది. తాజాగా ఆమె మరో క్రేజీ ఆఫర్ పెట్టేసిందని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ ఇండియా రేంజ్లో ఒక సినిమా రాబోతుందని అది కూడా ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన వస్తుందని ఈ మధ్య జోరుగు ప్రచారం జరుగుతుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీకి చెల్లెలుగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జులాయిలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో కూడా శ్రీముఖి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే శ్రీముఖి రెగ్యులర్గా ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. అప్పుడప్పుడు ట్రెండీ డ్రెస్లతో ఫోజులు ఇస్తే కుర్రకారులో హీట్ పెంచుతుంది. కొద్దిరోజుల క్రితం యాంకర్ ప్రదీప్కు శ్రీముఖికి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని వార్తలు వస్తే.. అలాంటి వాటికి చెక్ పెడుతూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ని..పోల్చితే నచ్చదు: శ్రుతీహాసన్
‘‘నేను కెరీర్ ఆరంభించినప్పుడు (2009లో హిందీ చిత్రం ‘లక్’తో హీరోయిన్గా పరిచయం అయ్యారు) సోషల్ మీడియా లేదు.. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ లేవు. ఒకవేళ ఉండి ఉంటే నటిగా నేను చేసినవి ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులు చూసి ఉండేవారు. అయినప్పటికీ కెరీర్ విషయంలో, నా అప్పటి దశ పరంగా నేను హ్యాపీగా ఉన్నాను’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా ఫిల్మ్ప్ గురించిన ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘పదకొండేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా స్టార్ని. అప్పట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే పాన్ ఇండియా అనే పదాన్ని నేను అప్పుడే వాడాను. నాకు పాన్ ఇండియా ఫీవర్ లేదు. అయితే అన్ని రకాల భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు పాన్ ఇండియా అంటూ పోటీలో ఉన్న మేల్, ఫీమేల్ యాక్టర్లతో నన్ను నేను పోల్చుకోను. ఎందుకంటే కొన్నేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా సినిమాలు చేసేశాను. కెరీర్ పరంగా నా విధానాన్ని నేను ఫాలో అయ్యాను. నన్ను ఎవరితోనైనా పోల్చితే నచ్చదు’’ అన్నారు. ఇక ప్రస్తుతం శ్రుతీహాసన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... అడివి శేష్తో ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆమె నటించనున్న ఇంగ్లిష్ మూవీ ‘చెన్నై స్టోరీస్’ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. -
మెగా ప్రిన్స్ పాన్ ఇండియా డ్రీమ్స్
-
హారర్ థ్రిల్లర్ కథతో 'భ్రమయుగం'.. టీజర్తో మెప్పించిన స్టార్ హీరో
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం 'భ్రమయుగం'.. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి ఇటీవల నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'తో మెప్పించాడు. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. ఇలా విభన్నమైన అంశాలతో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొడుతున్న ఆయన త్వరలో 'భ్రమయుగం' చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. తాజాగా విడుదలైన భ్రమయుగం టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పోస్టర్తో పాటు అన్నీ అంశాలు చాలా ప్రత్యేకంగానే ఉన్నాయి. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ ప్రస్తుతం మాత్రం మలయాళ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. -
ఒకే కథతో రెండు సినిమాలు..!
-
2024 లో దూసుకొస్తున్న పాన్ ఇండియా హీరోలు
-
గుంటూరు కారం పాన్ ఇండియా రిలీజ్ పై మహేష్ బాబు క్లారిటీ
-
మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'భ్రమయుగం'. రాహుల్ సదాశివం దర్శకుడు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమూల్దా లైజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జవీర్ సంగీతమందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పాడు. అయితే పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందని స్వయంగా దర్శకుడు చెప్పాడు. ఈ క్రమంలోనే చిత్ర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా 'భ్రమయుగం' ఉంటుందని దర్శకుడు చెప్పాడు. వచ్చేది ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత) -
Kalki 2898 AD: కల్కిలో ఇలా..
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది ‘కల్కి 2898 ఏడీ’ టీమ్. బుధవారం (అక్టోబర్ 11) అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి..’లో ఆయన గెటప్ ఇలా ఉంటుందంటూ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘‘కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచిన లెజెండ్తో సినిమా చేయడం ఓ ఆశీర్వాదం. ఒక పెద్ద కల నెరవేరినట్లు అనిపిస్తోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ స్పందించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ‘‘మైథాలజీ స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్గా రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
పాన్ ఇండియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్లో తన ఫేట్ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: ఎయిర్పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. -
సలార్ VS డంకీ: రెఢీ
రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేరోజు థియేటర్లకు వస్తే.. ఏ సినిమా చూడాలి? అనేది ప్రేక్షకుల ముందుండే ప్రశ్న. ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి? అనేది ఎగ్జిబిటర్ల ముందుండే ప్రశ్న? ఏ సినిమాని ఏ ఏరియాకి ఎంత ఇచ్చి కొనాలి? అనేది డిస్ట్రిబ్యూటర్ల ముందుండే ప్రశ్న.. అసలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్టేనా? బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందేమో.. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు.. ఇలా అందరి ముందుండే ప్రశ్న. శుక్రవారం వచ్చిన ‘సలార్’ విడుదల తేదీ (డిసెంబర్ 22) ప్రకటన ఈ ప్రశ్నలకు కారణమైంది. అదే రోజు షారుక్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న ‘సలార్’, ‘డంకీ’... చిత్రాల్లో ఏది వసూళ్లను కొల్లగొడుతుంది? ఈ రెండింటి కారణంగా వేరే చిత్రాలు వాయిదా పడతాయా? ఓ లుక్కేద్దాం. ఇండియన్ సినిమా బడా సూపర్ స్టార్స్ ప్రభాస్, షారుక్ ఖాన్ బాక్సాఫీస్ ఫైట్కి రెఢీ అయ్యారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. నిజానికి 2022 ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుని, ఆ తర్వాత 2023 సెప్టెంబరు 28కి వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్ 22 అంటున్నారు. ఇంకోవైపు మరో పాన్ ఇండియన్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’. హిందీలో ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్’, ‘3 ఇడియట్స్, ‘పీకే’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్స్ తీసిన అగ్రశ్రేణి దర్శకుడు రాజ్కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. షారుక్, రాజ్కుమార్.. ఈ ఇద్దరికీ విడివిడిగా రికార్డులు ఉండటంతో తొలిసారి ఇద్దరూ కలిసి చేస్తున్న ‘డంకీ’ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. గౌరీ ఖాన్, రాజ్కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా 2022 ఏప్రిల్ 19న ‘డంకీ’ సినిమాను ప్రకటించిన రోజే విడుదల తేదీని (22 డిసెంబరు 2023) కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ అండ్ టీమ్ ఇదే రోజున ‘సలార్’ విడుదలను నిర్ణయించడం ఇటు తెలుగు అటు హిందీతో పాటు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి.. ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. ఎవరి రికార్డులు వారివి... ‘బాహుబలి: ది కన్క్లూజన్’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో (2019)’, ‘రాధేశ్యామ్ (2022)’, ‘ఆదిపురుష్ (2023)’ చిత్రాలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ప్రభాస్కు ‘సలార్’ హిట్ కీలకంగా మారింది. ఇటు ‘జీరో (2018)’ రిజల్ట్తో షారుక్ ఖాన్ డీలా పడ్డప్పటికీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ‘పఠాన్’, ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘జవాన్’ చిత్రం కలెక్షన్స్లో హిందీ హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిందని యూనిట్ పేర్కొంది. ఇవి షారుక్ ఖాన్ సూపర్ఫామ్ను స్పష్టం చేస్తున్నాయి. అలా అని ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమాలనూ తక్కువ చేయలేం. ఎందుకంటే ప్రభాస్ ‘బాహుబలి: ది కన్క్లూజన్’ మొత్తం వసూళ్లను షారుక్ ఏ సినిమా కూడా ఇంకా అధిగమించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే షారుక్ కెరీర్లో ఓ డిజాస్టర్గా నిలిచిన ‘జీరో’ రిలీజైన రోజున.. అంటే డిసెంబరు 21నే ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’ (యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూ΄÷ందింది) విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచి, కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ప్రశాంత్ నీల్, షారుక్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొనడానికి రెడీ కావడం ఆసక్తికరమైన విశేషం. ఎవరి రికార్డులు వారికి ఉన్న నేపథ్యంలో తాజా ΄ోటీలో రికార్డ్ ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కన్ఫ్యూజన్ నో కన్ఫ్యూజన్..‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న విడుదల చేస్తున్నాం అంటూ ‘సలార్’ టీమ్ ప్రకటించింది. అయితే ‘సలార్’కు కన్ఫ్యూజన్ అక్కర్లేక΄ోవచ్చు కానీ 2023 క్రిస్మస్కు ఆల్రెడీ రిలీజ్ను కన్ఫార్మ్ చేసుకున్న తెలుగు చిత్రాల విడుదల విషయం ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్. డిసెంబరు 21న నాని ‘హాయ్ నాన్న’, 22న వెంకటేశ్ ‘సైంధవ్’, సుధీర్బాబు ‘హరోం హర’, 23న నితిన్ ‘ఎక్స్ట్రా’ చిత్రాలు విడుదలకు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు ‘సలార్’ ఎఫెక్ట్తో ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడు వాయిదా వేసి, సంక్రాంతికి వద్దామనుకుంటే ఆల్రెడీ పండగ బరిలో నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్ (ప్రచారంలో ఉన్న టైటిల్), తేజా సజ్జా ‘హనుమాన్’ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు శివ కార్తికేయన్ ‘అయలాన్’, సుందర్. సి ‘అరణ్మణై 4’ ఉన్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలంటే థియేటర్ల సంఖ్య ప్రశ్నార్థకమవుతుంది... దాంతో పాటు వసూళ్లు కూడా షేర్ అయి΄ోతాయి కాబట్టి వీటిలో ఏదైనా వాయిదా పడే అవకాశమూ లేక΄ోలేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2098 ఏడి’ కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా వాయిదా పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. ‘సలార్’, ‘డంకీ’... ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 22నే వస్తాయా? ఇవి వస్తే ఏ చిత్రాలు వెనక్కి వెళతాయి? సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలేంటి? అనేది తెలియాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఆ తేదీకే ఎందుకు? ఓ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను సృష్టించాలంటే సరైన రిలీజ్ డేట్ కూడా ముఖ్యం. ఇప్పుడు ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలు డిసెంబరు 22ను ఎంచుకోవడం సరైనదే. ఎందుకంటే ఆ రోజు నుంచి వారాంతం ఆరంభమవుతుంది. సరిగ్గా క్రిస్మస్ సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్కు రావడం ఖాయం. ఒకవేళ ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే.. న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి వరకూ ప్రదర్శనకు స్కోప్ ఉంటుంది. సంక్రాంతి సెలవుల టార్గెట్గా కొత్త చిత్రాలు వస్తాయి. అప్పుడు ‘సలార్’, ‘డంకీ’కి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ పండగ టైమ్లో వచ్చే చిత్రాలకన్నా ఈ రెండూ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు సంక్రాంతి సెలవులను కూడా క్యాష్ చేసుకుంటాయి. ఈ చిత్రాల టాక్ ముందే తెలిసి΄ోతుంది కాబట్టి.. సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో ఏదైనా వాయిదా పడే అవకాశం కూడా లేక΄ోలేదు. -
పా.. పా వస్తోంది
కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దా... దా...’. గణేష్ కె. బాబు దర్శకత్వం వహించారు. ఎస్. అంబేత్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయింది. ఈ సినిమా ‘పా... పా...’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్పై ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘యూత్ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పా... పా...’. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నాం. కొత్త తరహా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ‘పా...పా...’ని కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంఎస్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: కె. ఎళిల్ అరసు, సంగీతం: జెన్ మార్టిన్, సహనిర్మాతలు: శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు. -
తంతిరం సినిమా విడుదల తేదీ ఫిక్స్
తంతిరం సినిమా అక్టోబర్ 6న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది... శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించగా శ్రీకాంత్ కంద్రగుల (SK ) నిర్మాతగా ఉన్నారు. ఈ మధ్య చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సూపర్ హిట్ స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. (ఇదీ చదవండి: Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్) ఈ సినిమా హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా, భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో నవతరం నటీనటులతో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన దీనిని తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ను అందుకుంది. ఆడియో రైట్స్ దక్కించుకున్న సరిగమ సంస్థ ఈరోజు జ్యూక్ బాక్స్ ద్వారా ఆడియో రిలీజ్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఇప్పటికే పోటీ పడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్కు నార్త్ ఇండియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రిలయన్స్ సంస్థ గ్రాండ్గా అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికి సిద్ధమయింది. -
కొత్త సినిమా ప్రకటించిన దర్శకధీరుడు.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మరో సినిమాను ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగుస్థాయిని ప్రపంచానికి చాటిచెప్పన దర్శకధీరుడు తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్ను సమర్పించనున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా రాజమౌళి నుంచి ఓ భారీ ప్రకటన చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే ఓ భారీ సినిమాను ప్రజెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ సినిమా చరిత్రను తెలియజేస్తూ మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు రాజమౌళి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజమౌళి ట్వీట్లో రాస్తూ.. 'నేను మొదట కథనం విన్నప్పుడు.. అది భావోద్వేగంగా నన్ను కదిలించింది. బయోపిక్ని రూపొందించడం చాలా కష్టం. కానీ భారతీయ సినిమా పితామహుడు గురించి ఆలోచించడం మరింత సవాలుతో కూడుకున్నది. మా అబ్బాయిలు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది.' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించనున్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే మనకు గుర్తొచ్చే పేరు దాదాసాహెబ్ ఫాల్కే. అతనిని భారత సినిమా పితామహుడు అని పిలుస్తారు. 1913లో విడుదలైన రాజా హరిశ్చంద్ర ఆయన నిర్మించిన తొలి ఇండియన్ సినిమా. ఆయన బయోపిక్ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ మహేశ్ బాబుతో చేయనున్నారు. యాక్షన్ అడ్వంచర్గా రూపొందించనున్నట్లు తెలిసిందే. కానీ అందరూ ఈ సినిమా గురించే ప్రకటన చేస్తారని అనుకున్నారు. When I first heard the narration, it moved me emotionally like nothing else. Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:) With immense pride, Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ — rajamouli ss (@ssrajamouli) September 19, 2023 -
‘స్వయంభూ’ కోసం వియత్నామ్ వెళ్లిన హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిద్ధార్థ వియత్నామ్లో వాలిపోయారు. ఏదో వెకేషన్కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్ వెళ్లారాయన. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్ సీక్వెన్స్ల కోసం నిఖిల్కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
సర్ప్రైజ్ న్యూస్.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్ విడుదల
అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క… జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంచైజ్తో ఆమెకు పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు దక్కింది. ఇలా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంది. కానీ సైజ్ జీరో సినిమా నుంచి చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఇదిలా ఉండగా అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయింది. మలయాళ చిత్ర సీమ నుంచి వస్తున్న ఫాంటసీ హారర్ డ్రామా 'కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ను తాజాగ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో జాతీయ అవార్డు అందుకున్న మలయాళ టాప్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. (ఇదీ చదవండి: నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. కానీ ఆమె మరో హీరోతో .. : విజయ్ సేతుపతి) ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం. వచ్చే ఏడాది (2024)లో పార్ట్-1 విడుదల కానుందని వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్ వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్ ఉన్నాయి. -
'మార్క్ ఆంటోని'.. గత సినిమాలతో పోలిస్తే డిఫరెంట్: విశాల్
‘‘ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు.. వారి ఆదరాభిమానాలతోనే నేనీ స్థాయికి వచ్చాను’’ అని హీరో విశాల్ అన్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా నేడు విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ‘మార్క్ ఆంటోని’ వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలు చేశా. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది’’ అన్నారు. -
టైగర్ ప్రియురాలు ఈమెనే..
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్ (నటి కృతీ సనన్ చెల్లెలు), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సారా పాత్రలో నటిస్తున్నారు నూపుర్. ‘టైగర్ లవ్ సారా’ అంటూ సోమవారం నూపుర్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘రవితేజ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మది, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. Nothing makes me feel more proud than to launch my sister’s first PAN INDIA film Poster!🥹🧿❤️ #TigerNageswaraRao Meet our TIGER'S LOVE ❤️ Introducing @NupurSanon as the lovely Sara from the GRAND WORLD of #TigerNageswaraRao 🥷 WORLDWIDE HUNT begins from October 20th 🐯🔥… pic.twitter.com/hlyGMVv9ly — Kriti Sanon (@kritisanon) August 28, 2023 -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ అక్టోబర్లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
దుమారం రేపిన నాని వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోతా' పాన్ ఇండియా రేంజ్లో ఆగష్టు 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో తాజాగ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. (ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి) ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో పాన్ ఇండియా గురించి నాని ఇలా చెప్పుకొచ్చాడు. 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్కు నిజమైన నిర్వచనం ఇదే' అని అన్నారు నాని. దీంతో టాలీవుడ్లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ అందరూ నానిపై ఫైర్ అవుతున్నారు. దుల్కర్ మంచి నటుడే... పాన్ ఇండియా రేంజ్ను అందుకునే అర్హత ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలుపుతూనే నాని వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్ నాని అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్కి ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే నానికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) సౌత్ ఇండియా ప్రస్తుత టాప్ హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? అంటూ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'అసలు నాని ఎవడు.. ? ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి.. సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి ఆటిట్యూడ్ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిది.' అని వారు సలహా ఇస్తున్నారు. -
ఆ పదం నాకు పెద్దగా నచ్చదు
‘‘మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంది. తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్ ఓ వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్గా ఉంది’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘ నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘కింగ్ ఆఫ్ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభాస్ అంటే పడి చస్తున్న హీరోయిన్లు.. ‘స్పెషల్’ కారణం ఇదేనా?
చాలామంది హీరోయిన్స్ ప్రభాస్ తో సినిమా అనగానే కనీసం కథ కూడా వినకుండా ఓకే చెప్పేస్తారు. ఇప్పుడంటే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కానీ.. గతంలో కేవలం తెలుగు సినిమాలు చేసినప్పుడు కూడా చాలా మంది హీరోయిన్లకి అతను స్పెషల్. అయితే ప్రభాస్ ఎందుకు స్పెషల్ అనే దానికి కూడా స్పెషల్ కారణం ఉంది. అదేంటంటే ప్రభాస్ బిహేవియర్. సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరి గురించి గాసిపింగ్ చెయ్యకుండా,అందరితో మర్యాదగా నడుచుకుంటాడు ప్రభాస్. అందుకే అతనికి డార్లింగ్ అనే పర్ఫెక్ట్ పెట్ నేమ్ కూడా సెట్ అయ్యింది. హీరోయిన్స్ కి కూడా ప్రభాస్ చాలా రెస్పెక్ట్ ఇస్తాడట. (చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్..‘సలార్’పై ప్రభాస్ కీలక నిర్ణయం) అంతే కాదు ప్రభాస్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే రకరకాల ఫుడ్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఫ్లైట్ లో కూడా తెప్పించుకుంటాడు. అయితే ప్రభాస్ ఆ ఫుడ్ ని తను తిని ఎంజాయ్ చెయ్యడమే కాదు, తనతో పాటు ఉండేవాళ్ళకి కూడా వడ్డిస్తాడు. ఆ లిస్ట్ లో కో యాక్టర్స్ తో పాటు హీరోయిన్స్ కూడా ఉంటారు. అంతే కాదు హైదరాబాద్ లో షూటింగ్ అయితే హీరోయిన్స్ కి కూడా ప్రభాస్ ఇంటి నుంచి కూడా అప్పుడప్పుడు స్పెషల్ క్యారేజ్ వస్తుంది. దానికి సంబంధించిన పిక్స్ ఆయా హీరోయిన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా పోస్ట్ చేసేవారు. (చదవండి: వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్) ప్రభాస్ గురించి చెప్పమంటే అతనితో నటించిన హీరోయిన్లు అంతా ముందుగా చెప్పేది అతను వడ్డించే భోజనం గురించే. ఆంధ్రాలో దొరికే అన్ని రకాల నాన్-వెజ్ వంటకాల్ని తన హీరోయిన్ల కోసం వండిస్తాడట ప్రభాస్. ఆ మధ్య స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ప్రభాస్ అంటే తనకు ప్రేమ, భోజనం రెండూ గుర్తొస్తాయని చెప్పింది. సలార్ షూటింగ్ సమయంలో శృతికి రకరకాల వంటకాల రుచి చూపించాడట. ఇంటి నుంచి ప్రత్యేకమైన భోజనం తెప్పించి స్వయంగా వడ్డించాడట. నేటితరం హీరోల్లో ఈ క్వాలిటీ చాలా తక్కువమందికి ఉంటుంది. మర్యాద ఇస్తూ,కడుపునిండా తినేంత వరకు వదిలిపెట్టని హీరోలు అరుదు. అలా ఒక యూనీక్ క్వాలిటీ తో స్పెషల్ గా ఉంటాడు ప్రభాస్. అందుకే చాలామంది హీరోయిన్స్ ప్రభాస్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ తో ఉంటారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే డార్లింగ్ అంటే పడి చస్తారు. -
నో ఛేంజ్.. దసరాకి టైగర్ వేట కన్ఫర్మ్
రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లు దసరాకి అక్టోబర్ 20నే విడుదల చేస్తామనీ చిత్రబృందం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబర్ 20న విడుదల కావడం లేదంటూ కొన్ని శక్తులు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి. ఆ వదంతులను నమ్మవద్దు. మీకు (ప్రేక్షకులు) అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్ మది. -
పాన్ ఇండియా సినిమాలకు షాక్ ఇస్తున్న చిన్న సినిమాలు
-
పాన్ ఇండియా స్టార్ వినడానికి బాగుంటుంది.. కానీ..!
-
రోషన్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు
‘నిర్మలా కాన్వెంట్’ (2016)లో లీడ్ రోల్ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్తో హీరోగా సినిమాలు సైన్ చేశారు. రోషన్ ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం. కన్నడ దర్శకుడు నందకిశోర్ దర్శకత్వంలో రోషన్–మోహన్లాల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. రోషన్ నటించనున్న మరో పాన్ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, యాడ్ ఫిల్మ్ మేకర్గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
కామిక్–కాన్ 2023లో ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వనీదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఇండియా గొప్ప కథలకు, సూపర్ హీరోలకు నిలయం. మా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా, కథ గురించి ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ సరైన వేదిక అని భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’లో లాంచ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించనుంది. ప్రపంచపటంలో భారతీయ సినిమాను చూడాలని కోరుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణం’’ అన్నారు అశ్వనీదత్. ఈ నెల 20న ప్రారంభమయ్యే ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’లో కమల్హాసన్, ప్రభాస్, దీపికా పదుకోన్, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొంటారు. -
Lily Movie Review: 'లిల్లీ' సినిమా రివ్యూ
టైటిల్: లిల్లీ నటీనటులు: బేబీ నేహా, బేబి ప్రణతిరెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థ: గోపురం స్టూడియోస్ నిర్మాతలు: కె. బాబురెడ్డి, సతీష్ కుమార్.జి సంగీతం: ఆంటో ఫ్రాన్సిస్ కథ-దర్శకత్వం: శివమ్ విడుదల తేదీ: జూలై 07 ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ చిన్న పిల్లల చిత్రం రెడీ అయిపోయింది. 'లిల్లీ' పేరుతో తీసిన ఈ మూవీ.. జూలై 07న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? లిల్లీ (బేబీ నేహా), దివ్య (ప్రణతి రెడ్డి), గూగుల్ (వేదాంత్ వర్మ) క్లాస్మేట్స్. ఓ రోజు వాళ్లంతా ఆడుకుంటున్నప్పుడు సడన్గా ముక్కు నుంచి రక్తం రావడంతో దివ్య కళ్లు తిరిగి కిందపడిపోతుంది. పిల్లలందరూ దివ్యకు ఏమైందో అని కంగారు పడుతూ దివ్యను పెంచిన మామయ్య దేవాకు(రాజ్వీర్) చెప్తారు. పాపను హాస్పిటల్కి తీసుకెళ్లిన దేవాకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అసలు దివ్యకు ఏమైంది? లిల్లీ , వేదాంత్లు దివ్య కోసం ఏం చేశారు? చిన్న చిన్న పనులు చేసుకుని రోజులు గడుపుకునే దేవా.. పాపకి వచ్చిన కష్టాన్ని ఎలా తొలగించాడు? అనేది స్టోరీ. ఎలా ఉందంటే? ఐదు భాషల్లో పాన్ ఇండియా పిల్లల సినిమాగా 'లిల్లీ' తీశారు. గోపురం స్టూడియోస్ పతాకంపై బాబురెడ్డి, సతీష్ కుమార్లు నిర్మించిన ఈ చిత్రంతో శివమ్ నూతన దర్శకునిగా పరిచయమయ్యాడు. కడపలాంటి రూరల్ ఏరియాలో ఈ సినిమా కథ మొత్తాన్ని తీశారు. పూర్తిగా చిన్నపిల్లలు నటించిన ఇలాంటి చిత్రం తెలుగులో గత కొన్నేళ్లలో రాలేదనే చెప్పాలి. సినిమాను చూస్తున్నంతసేపు దర్శకుడు శివమ్ తన మొదటి చిత్రాన్నే ఇంతటి ఎమోషనల్ పాయింట్ను ఎందుకు ఎంచుకున్నాడో అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లల కథలో అంత డెప్త్ ఉంది. అలాగే చిన్నపిల్లల స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో చూపించే ప్రయత్నంలో విజయం సాధించాడు. ఎవరెలా చేశారు? చిన్న పిల్లలే ప్రధాన పాత్రధారులుగా తీసిన ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించారు. అయితే వాళ్ల నుంచి ఎమోషన్ బాగానే రాబట్టినప్పటికీ.. ఫస్టాప్ నెమ్మదిగా ఉండటం సినిమాకు మైనస్ అయింది. 'లిల్లీ' మూవీ ఫొటోగ్రఫీ బాగుంది. సింగర్ వాగ్దేవి పాటిన రెండు పాటలు బాగున్నాయి. చూసిన వాళ్లకు ఇవి నచ్చేస్తాయి. అయితే సినిమా మొత్తం పిల్లలతోనే తీశారు కాబట్టి ఇది పెద్దవాళ్లకు కనెక్ట్ కావడం కొంచెం కష్టం. ఏదేమైనా సరే అందరూ కొత్తవాళ్లు, అదికూడా పిల్లలతో తీసిన ఈ చిత్రబృందం ఆలోచన ప్రశంసనీయం. -
ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!
తెలుగు స్టార్ హీరోలు 'పాన్ ఇండియా' జపం చేస్తున్నారు. ప్రభాస్ నుంచి నిఖిల్ వరకు ఈ ప్రయత్నాల్లో ఫుల్ బిజీ బిజీ. ఈ తరహా సినిమాలు చేస్తున్నారు గానీ హిట్స్ మాత్రం చాలా తక్కువ. మరోవైపు పాన్ ఇండియా సినిమాలు నెలకు ఒకటి రావడమే గగనమైపోయిన ఈ రోజుల్లో.. ఏకంగా ఓ నెలంతా అలాంటి చిత్రాలే వస్తే? బాక్సాఫీస్ కి బ్యాండ్, మూవీ లవర్స్ కి పండగ గ్యారంటీ. మీకు సినిమాలంటే బాగా పిచ్చి ఉండి, ఓ మంచి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం సెప్టెంబరు వరకు ఆగండి. ఎందుకంటే పాన్ ఇండియాతోపాటు సరైన మాస్ చిత్రాలన్నీ అదే నెలలో విడుదలకు సిద్ధమైపోతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా వారానికొకటి చొప్పున నాలుగుకి పైనే బరిలో ఉన్నాయి. వీటితోపాటు తెలుగు సినిమా ఒకటి, డబ్బింగ్ మూవీ మరొకటి లైన్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూసేద్దాం. (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) ప్రభాస్ ఊరమాస్! 'బాహుబలి' తర్వాత అలాంటి హిట్ ఎప్పుడు పడుతుందా? రచ్చ ఎప్పుడు చేద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిటింగ్. అయితే దీని తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు వందల కోట్లు సాధించాయి గానీ హిట్ కొట్టలేకపోయాయి. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తీస్తున్న ఊరమాస్ మూవీ 'సలార్'పైనే. సెప్టెంబరు 28న ఇది రిలీజ్ కానుంది. ఇది హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవడం, సరికొత్తవి నమోదు కావడం పక్కా. రౌడీ హీరో ఈసారైనా? విజయ్ దేవరకొండ పాన్ ఇండియా వైడ్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేది ఈ సెప్టెంబరులోనే. అదే నెల 1వ తేదీన 'ఖుషి' చిత్రం రిలీజ్ కానుంది. ఇది హిట్ కావడం విజయ్ కి చాలా ముఖ్యం. ఎందుకంటే 'లైగర్'తో ఇండస్ట్రీని దున్నేస్తా అదీఇదీ అని గతేడాది ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. కట్ చేస్తే ఆ మూవీ బొక్కాబోర్లా పడింది. ఇప్పుడు హిట్ కొడితే ఓకే లేదంటే మాత్రం విజయ్ కి కష్టాలు తప్పవు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) షారుక్ కొట్టాల్సిందే! 2018లో 'జీరో' ఫ్లాప్ కావడంతో షారుక్ పునరాలోచనలో పడిపోయాడు. దాదాపు ఐదేళ్లపాటు బిగ్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో 'పఠాన్'తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాద్ షాలో పస తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే మరో హిట్ కచ్చితంగా కావాలి. ఇప్పుడది 'జవాన్'తో వచ్చేలా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని దేశభక్తి ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తీశారు. సెప్టెంబరు 7న రానున్న ఈ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు సునామీ గ్యారంటీ. రామ్ ఈసారి మాత్రం! రామ్ పేరు చెప్పగానే అందరికీ 'ఇస్మార్ట్ శంకర్' గుర్తొస్తుంది. దీని తర్వాత రెడ్, ద వారియర్ చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయాయి. దీంతో ఒకేసారి హిట్ కొట్టడంతో పాటు పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాని ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తీస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకున్నారు గానీ ఇప్పుడు దాని విడుదల తేదీ మార్చారు. సెప్టెంబరు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలు కూడా! ఇలా పైన చెప్పినట్లు సెప్టెంబరులోని నాలుగు వారాల్లో నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు 'డీజే టిల్లు 2' మూవీ సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న 'చంద్రముఖి 2' కూడా ఇదే నెలలో వచ్చే అవకాశముందని అంటున్నారు. డేట్ ఫిక్స్ అయితే గానీ క్లారిటీ రాదు. సో అదనమాట విషయం. సెప్టెంబరు రావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. కాబట్టి దొరికిన ఈ టైంలో హైప్ పెంచుకోండి. ఎందుకైనా మంచిది ఏ మూవీకి వెళ్లి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడే ఓ ప్లాన్ రెడీ చేసి పెట్టుకోండి! (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!
'మీ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడేమో.. మా హీరో చాలా ఏళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ అయ్యాడురా'.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానుల మధ్య ఇలాంటి గొడవ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. పాన్ ఇండియా సినిమాల వల్ల టాలీవుడ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వందల కోట్ల కలెక్షన్స్ ని కళ్లప్పగించి చూస్తున్నారు. హీరోలని తోపు తురుము అని అంటూ ఫ్యాన్స్ భుజాలేగరేస్తున్నారు. కానీ 'పాన్ ఇండియా' అనే ట్యాగ్ వల్ల మన హీరోలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసా? 'పాన్ ఇండియా' అంటే ఏంటి? ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆయా రాష్ట్రాల కల్చర్ ప్రకారం సినిమాలు వస్తుంటాయి. కానీ దేశంలో ఉన్న అందరికీ నచ్చేలా తీసేవే పాన్ ఇండియా సినిమాలు. 20-30 ఏళ్ల క్రితం ఇలాంటి సినిమాలు వచ్చేవి కానీ అప్పట్లో 'పాన్ ఇండియా' అనే పేరు గట్రా ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఓ పదం ఉండాలి కాబట్టి 'పాన్ ఇండియా' అని పెట్టారేమో! (ఇదీ చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?) 'బాహుబలి'తో షురూ తెలుగు సినిమా చరిత్ర చాలా పెద్దది కానీ మన దగ్గర తప్పితే మన సినిమాలు బయట ప్రపంచానికి తెలిసినవి చాలా తక్కువ. ఎప్పుడైతే రాజమౌళి 'బాహుబలి' తీసి, వందల కోట్లు వసూళ్ల రుచి చూపించాడో టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత పలువురు దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' లాంటివి మాత్రం అదిరిపోయే రేంజు విజయాలు అందుకున్నాయి. 'పాన్ ఇండియా' వల్ల కష్టాలు పాన్ ఇండియా సినిమాలు.. టాలీవుడ్ క్రేజుని ఎక్కడికో తీసుకెళ్తున్నాయని మనం సంబరపడిపోతున్నాం. కానీ మంచితో పాటు చెడు ఉన్నట్లు.. క్రేజ్ తోపాటు ఇవి కొత్త కష్టాల్ని తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ వచ్చి చేరితో సదరు హీరోలు భూమ్మీద నిలబడరు. కాదు కాదు అభిమానులు ఆ అవకాశం ఇవ్వరు. అంచనాలు పెంచేసుకుంటారు. ఇలా ఒకటి రెండు కాదు చాలానే సమస్యలు.. మన పాన్ ఇండియా హీరోలకు ఎదురవుతున్నాయి. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) వెతుకులాట ఎక్కువవుతోంది! పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా సులభమేమోనని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా అంటే చాలా కష్టమైన విషయం. పాన్ ఇండియా సబ్జెక్ట్ ని డీల్ చేయగలిగే దర్శకుడు దొరకాలి. అందుకు తగ్గ స్టోరీ సెట్ కావాలి. ఆ కథ.. దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలి. మళ్లీ అలాంటి సినిమాకు చిన్న బడ్జెట్ లు సరిపోవు. కొన్నిసార్లు స్టోరీ సింపుల్ గా ఉన్నాసరే భారీతనం ఎక్కువుండాలనే ఆరాటంతో చాలా సినిమాలు బోల్తా కొట్టేస్తున్నాయి. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ హీరోగా ఓ ఇండస్ట్రీకే పరిమితమైతే ఎలాంటి సినిమాలు చేసినా ఇబ్బంది ఉండదు. ఫ్లాప్ అయినా పెద్దగా ఆలోచించకుండా మరో సినిమా చేసుకోవచ్చు. ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోతే మాత్రం కథల కోసం ఏళ్లకు ఏళ్లకు వెతుక్కోవాల్సి వచ్చింది. ఒకవేళ తొందరపడి సినిమాలు చేస్తే అవి ఫెయిలవుతుంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి గానీ హిట్ అనే మాట వినిపించట్లేదు. 'కేజీఎఫ్' యష్ ది మరో కథ. 'కేజీఎఫ్ 2' వచ్చి ఏడాదవుతున్నాసరే మరో సినిమా ఓకే చేయలేనంత కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. సక్సెస్-రెమ్యునరేషన్ తిప్పలు! పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రాగానే సదరు హీరోగారి రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోతుంది. దీంతో చిన్న నిర్మాతలు అతడికి దగ్గరికి వెళ్లరు. ఉదాహరణగా చెప్పుకుంటే ప్రభాస్.. బాహుబలికి ముందు రూ.10 కోట్లలోపే రెమ్యునరేషన్ తీసుకునేవాడు! ఇప్పుడు రూ.100 కోట్లకు పైనే తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా ట్యాగ్ రాగానే సరిపోదు. సక్సెస్ ని కొనసాగిస్తేనే మార్కెట్ లో నిలబడతారు. లేదంటే ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా దుకాణం సర్దేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే పాన్ ఇండియా హీరోలకు బోలెడన్నీ కష్టాలే కష్టాలు! (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) -
ఆ ప్రయత్నంలో విజయం సాధించాం
‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ ప్రెస్మీట్ని రామకోటి ఉత్సవం అని పిలిచాం. రామ నామాన్ని ప్రతి గడపకు చేర్చాలన్నదే యూనిట్ ఆలోచన. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతీసనన్ సీత పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ‘రామ జయం, రఘురామ జయం’ పేరుతో నిర్వహించిన సక్సెస్ మీట్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని నైజాంలో దాదాపు 500 స్క్రీ¯Œ ్సకి పైగా రిలీజ్ చేశాం. తొలి రోజు నైజాంలో 13.65 కోట్లు, రెండో రోజు దాదాపు 8 కోట్లు వసూళ్లు వచ్చాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడారు. -
పాన్ ఇండియా మార్కెట్ ని దడదడలాడిస్తున్న ప్రభాస్
-
భక్తి, దేవాలయాల చుట్టూ తిరిగే కేరాఫ్ టెంపుల్ సినిమాలివే!
భక్తి రసాత్మక చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాగే కొన్ని కమర్షియల్ చిత్రాల్లో దేవుడి ప్రస్తావన ఉంటుంది. ప్రస్తుతం భక్తి నేపథ్యంలో, దేవాలయాలు ప్రధానాంశంగా కొన్ని చిత్రాలు రానున్నాయి. ‘కేరాఫ్ టెంపుల్’ అంటూ రానున్న ఆ చిత్రాల్లో కొన్ని ‘పాన్ ఇండియా’ స్థాయిలో విడుదల కానున్నాయి. మరి.. దేవుడు అంటేనే యూనివర్శల్. అన్ని భాషలవారికీ నప్పే కథాంశాలతో రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఇటు రామాయణం.. అటు విష్ణుతత్వం ప్రభాస్ అంటే రెబల్ స్టార్. మాస్ పాత్రల్లోనే దాదాపు చూశాం. అందుకు భిన్నంగా సౌమ్యుడిగా కనిపించనున్నారు ప్రభాస్. ‘ఆదిపురుష్’లో రాముడిగా వెండితెరపై కరుణ కూడా కురిపించబోతున్నారు. ఈ పాత్రను ప్రభాస్ ఎగ్జయిటింగ్గా చేశారు. ప్రభాస్ని రాముడిగా చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు అంతే ఎగ్జయిటింగ్గా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీతగా కృతీ సనన్ నటించారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక ‘ఆదిపురుష్’తో ఓవైపు శ్రీరాముడి గాథని ప్రేక్షకులకు చెబుతున్న ప్రభాస్.. మరోవైపు విష్ణు తత్వాన్ని కూడా బోధించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇదే మొదటి చిత్రం. సైన్స్ ఫిక్షన్గా రూపొందుతున్న ఈ చిత్రం విష్ణు తత్వం, విష్ణు ఆధునిక అవతారం నేపథ్యంలో సాగుతుందని నిర్మాత అశ్వినీదత్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భారీ బడ్జెట్తో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. గుడి కోసం రుద్రకాళేశ్వర్ రెడ్డి రుద్రకాళేశ్వర్ రెడ్డి ఓ గుడి కోసం పెద్ద మైనింగ్ మాఫి యాకి ఎదురు తిరుగుతాడు. ఒక సామాన్య కుర్రాడు మాఫియాని ఢీ కొనడం అంటే చిన్న విషయం కాదు. మరి గుడిని కాపాడటానికి రుద్రకాళేశ్వర్ ఏం చేశాడు? అనేది ‘ఆదికేశవ’లో చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. మైనింగ్ బ్యాక్డ్రాప్లో ఒక ఊర్లో శివుడి గుడి చుట్టూ ఈ చిత్రకథ సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఇంత తవ్వేశారు.. ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపం వస్తే ఊరికి మంచిది కాదు’ అంటూ ఆలయ పూజారి చెప్పే డైలాగ్ని బట్టి చూస్తే శివుడు, గుడి చుట్టూ ఈ కథ సాగుతుందని స్పష్టమవుతోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవకోనలో ఏం జరిగింది? సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లు. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్, అడ్వెంచరస్ మూవీగా ‘ఊరు పేరు భైరవకోన’ రూపొందింది. భైరవకోనలోని ఓ గుడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ‘శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో చెలా మణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన’ అనే డైలాగ్స్తో ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలైంది. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అంజనాద్రి కోసం.. ‘జాంబిరెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో తేజా సజ్జ– డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొందిన హీరో హనుమంతుని జన్మస్థలంగా పేర్కొంటున్న అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. ‘‘ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. అమృతా అయ్యర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా పురాణాలు, దేవాలయాలు, ఇతిహాసాల కథలతో రూపొందుతున్నాయి. -
Seerat Kapoor Pics : పాన్ ఇండియాలో కొత్త సంచలనం సీరత్ కపూర్ (ఫొటోలు)
-
4 పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్
-
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్నారు
-
పాన్ఇండియా ని షాక్ చేస్తున్న కాంబినేషన్..!
-
మనోడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
తెనాలి: తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అందివచ్చిన టెక్నాలజీతో దర్శక నిర్మాతలు వెండితెరపై అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. అదే బాటలో నవతరం సత్తాను చాటుతోంది. వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలతో కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు. అవార్డుల పోటీలోనూ ముందంజలో ఉంటున్నారు. ‘గతం’ సినిమా మేకర్స్ దీనికి నిదర్శనం. డార్క్ మిస్టరీ థ్రిల్లర్గా తీసిన ‘ఐడీ’తో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును గెలుచుకున్నారు. సినిమా నిర్మాతల్లో ఒకరైన హర్ష ప్రతాపనేని తెలుగు వాడు...తెనాలి వాడు కావడం విశేషం! విడుదల కాకముందే అవార్డు ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీ ‘గతం’ మేకర్స్ రూపొందించిన రెండో తెలుగు సినిమా ‘ఐడీ’. టాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేశారు. చిత్రోమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తీసిన సినిమాకు కిరణ్రెడ్డి కొండమడుగుల దర్శకత్వం వహించారు. హర్ష ప్రతాపనేని, సృజన్ యరబోలుతో కలసి సుభాష్ రావాడ, భార్గవ పోలుదాసు నిర్మాతలుగా వ్యవహరించారు. భార్గవ పోలుదాసు, రాకేట్ గలేటే ప్రధాన పాత్రల్లో నటించారు. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల ఫేం శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. హాలీవుడ్ డీపీ హోరాసియో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ అందించగా, కాటెరినా ఫిక్కార్డో ప్రొడక్షన్ డిజైన్ పనులను పర్యవేక్షించగా, ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. విడుదల కాకముందే ఈ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం ‘చార్లీ 777’ను వెనక్కునెట్టి, ‘బలగం’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలకు దీటుగా ‘ఐడీ’ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 37 అవార్డుల్ని అందుకుంది. 31 అఫీషియల్ సెలక్షన్స్ను సాధించి, 5 ఆనరబుల్ మెన్షన్స్ను అందుకుంది. నాలుగు నామినేషన్లను పొందింది. త్వరలో కెనడీయన్ స్క్రీన్ అవార్డు (ఆస్కార్ తరహాలో)లకు క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ అయిన ప్రముఖ ఓక్విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్లో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ‘బలగం’ సినిమా దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ సంగీతం’ అవార్డును అందుకోగా, ‘సీతారామం’ సినిమా ‘ఉత్తమ చిత్రం’గా అవార్డును అందుకుంది. ఐడీ చిత్రం ‘ఉత్తమ ఎడిటింగ్’అవార్డును గెలుచుకుంది. వినూత్న కథాంశం ‘మీరు ఒక రోజు నిద్రలేచాక, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోతే...’అనే విచిత్రమైన ఆలోచన ఐడీ సినిమా కథాంశం. సహ నిర్మాతగా వ్యవహరించిన హర్ష ప్రతాపనేని తండ్రి పి.వి. గణేష్ స్వస్థలం తెనాలి సమీపంలోని జంపని. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా ఖమ్మంలో చేస్తున్నారు. తల్లి మంజులాదేవి గృహిణి. తండ్రి ఉద్యోగం కారణంగా వివిధ ప్రదేశాల్లో చదివిన హర్ష, హైదరాబాద్లో బీటెక్ చేశాడు. ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి, అమెరికాలోని ప్రతిష్టాత్మక జేపీ మోర్గాన్స్ ఛేజ్ బ్యాంక్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేస్తున్నారు. చదివే రోజుల్లో క్లాస్మేట్ కిరణ్తో కలసి లఘుచిత్రాలు తీసిన హర్ష, ఉద్యోగంలో కొనసాగుతూనే కిరణ్తో కలిసి ‘గతం’ సినిమా తీశారు. సహ నిర్మాత, సహ దర్శకుడు, సహ రచయితగా వ్యవహరించాడు. గతం విజయంతో ఇప్పుడు ‘ఐడీ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
మరో డైరెక్టర్ ని పాన్ ఇండియా కి తీసుకు వెళ్లనున్న అల్లు అర్జున్
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
మరో డైరెక్టర్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు
-
రామ్ చరణ్ కొత్త బ్యానర్.. ఆ యంగ్ హీరోతోనే తొలి సినిమా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ రెడ్డి ఇటీవలే వి మెగా పిక్చర్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తవారికి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ప్రారంభించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ బ్యానర్లో తొలి చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా పాన్ ఇండియా మూవీని ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కార్తికేయ సిరీస్తో సూపర్ హట్స్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా.. 'ది ఇండియా హౌస్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.లండన్లో స్వాతంత్య్రం రాకముందు ఏం జరిగిందనే నేపథ్యంలో ది ఇండియా హౌస్ను తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: కేఎల్ రాహుల్పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!) On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSE headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna! Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV — Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 -
అల్లు అర్జున్ సెంటిమెంట్ ప్లాన్ అదుర్స్ ఇక పుష్ప2 కలెక్షన్ ఊచకోతే
-
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్కి సాయి ధరమ్ తేజ్
-
రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. సీక్రెట్స్ రివీల్ చేసిన విజయెంద్రప్రసాద్
-
పాన్ ఇండియాకు పూనకాలు తెప్పిస్తానంటున్న రామ్
-
అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!
ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ కనిపిస్తోంది. సినిమాలు దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతున్నాయి. దీంతో అన్ని భాషలవారికీ అనుగుణంగా ఉండే కథలను ఎంచుకుంటున్నారు. కథలు మాత్రమే కాదు.. టైటిల్ కూడా పాన్ ఇండియాకి సూట్ అయ్యేలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకే టైటిల్తో అన్ని భాషల్లో ఓ చిత్రం విడుదలైతే అది ఆడియన్స్కు మరింత చేరువ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొందరు టాప్ స్టార్స్ నటిస్తున్న చిత్రాల టైటిల్స్పై చర్చ జరుగుతోంది. ‘ఫలానా టైటిల్ అనుకుంటున్నారట’ అని వైరల్గా ఉన్న టైటిల్స్ ‘పాన్ ఇండియా టైటిల్’లా ఉన్నాయి. మరి.. ఫైనల్గా ఆ టైటిల్స్నే ఫైనలైజ్ చేస్తారో? లేదో చెప్పలేం కానీ.. చర్చల్లో ఉన్న ఆ టైటిల్స్ గురించి మాత్రం చెప్పుకుందాం. రాజా డీలక్స్? ప్రస్తుతం ‘సలార్’, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. కేవలం యాక్షన్ జానర్కే పరిమితం కాకుండా కాస్త కామెడీ తరహా పాత్రల్లో కూడా ప్రభాస్ నటించాలను కుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. హారర్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా కథ రాజా డీలక్స్ అనే థియేటర్లో జరుగుతుందని, అందుకే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటే.. అప్పుడు టైటిల్ మార్చే అవసరం లేకుండా పోతుంది. గుంటూరు కారమా? ఊరికి మొనగాడా? మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 13న విడుదల కానుంది. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’, ‘ఊరికి మొనగాడు’, ‘పల్నాటి పోటుగాడు’, ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఎక్కువగా ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ వినిపిస్తున్నాయి. సూపర్స్టార్ కృష్ణ నటించిన హిట్ చిత్రాల్లో ‘ఊరికి మొనగాడు’ ఒకటి అని తెలిసిందే. కాగా ఈ నెల 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటించే చాన్స్ ఉంది. మరి, ఇక్కడ పేర్కొన్న టైటిల్స్లో ఏదో ఒకటి ఉంటుందా? వేరే టైటిల్ని ఫిక్స్ చేస్తారా? అనేది చూడాలి. దేవర? ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఓ లీడ్ రోల్ను సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘వస్తున్నా!’, ‘దేవర’ టైటిల్స్ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను అధికారికంగా ప్రకటిస్తారట. కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. వీరే కాదు.. మరికొందరు స్టార్స్ చిత్రాల టైటిల్స్పైనా చర్చ జరుగుతోంది. ప్రేక్షకులను ఆకర్షించే విషయాల్లో ‘టైటిల్’ ఒకటి. ఆ విషయాన్ని, కథనీ దృష్టిలో పెట్టుకుని టైటిల్స్ పెడుతుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే టైటిల్ పవర్ఫుల్గా ఉంటే వారికి కిక్కే కిక్కు. -
1200 మంది ఫైటర్స్తో గేమ్ చేంజర్...
-
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ట్రైలర్
-
'ఆదిపురుష్' ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్
రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతీ సనన్ నటించిన చిత్రం ఆదిపురుష్. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్లో ప్రభాస్ పర్ఫెక్ట్గా సూటయ్యాడు. సీతను రావణుడు అపహరించుకుపోవడం, శబరి ఎంగిలి పళ్లు రాముడు తినడం, సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం, లంకను తోకతో అంటించడం, సముద్రంలో బండరాళ్లు వేసి లంకకు దారి ఏర్పరచడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ట్రైలర్లో చూపించారు. 'నా ప్రాణమే జానకిలో ఉంది', 'మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం', 'నాకోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అంటూ ప్రభాస్ నోటి వెంట వచ్చిన డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం. 'రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు, ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి' అని జానకి చెప్పే డైలాగులు బాగున్నాయి. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, క్రిషణ్ కుమార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్లు నిర్మించారు. జూన్ 16న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తుండగా కార్తీక్ పల్నానీ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే గతంలో రిలీజ్ చేసిన టీజర్లో గ్రాఫిక్స్, విజువల్స్ అస్సలు బాగోలేదని పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఇంత నాసిరకమైన గ్రాఫిక్స్ ఏంటని దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో మేకర్స్ మళ్లీ రీషూట్స్ చేసి గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్తో సరికొత్తగా ముందుకు వచ్చారు. మరి ఈ ట్రైలర్కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! చదవండి: లగ్జరీ డూప్లెక్స్ కొనుగోలు చేసిన సమంత -
ఆదిపురుష్ కు లైన్ క్లియర్... ప్రభాస్ ఫాన్స్ కు పండగే
-
విక్టరీ వెంకటేష్ దక్షిణ భారత స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ గా...
-
స్మగ్లర్లు హీరోలు కాదు..పుష్ప 2పై మాజీ ఐజి ఫైర్