Revant Reddy
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (GIIS) స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ఇండస్ట్రీస్ & కామర్స్/లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు/బాన్సువాడ ఎం ఎల్ ఏ/ మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారందర్ని అతిధి మర్యాదలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, అధ్యక్షులు గడప రమేష్ బాబు తదితరులు సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో ఘనంగా ఆహ్వానించారు. సింగపూర్ తెలుగు ప్రజల మరిచిపోలేని మధుర క్షణాలను మదిలోనింపుకొన్నరోజు ఇదే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శనలు, స్వాగత గీతంతో ఆహ్వానించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు గడప రమేష్ స్వాగత ప్రసంగంతో.. తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆధ్యాత్మిక తత్వాలను భావితరాలకు అందించే కృషిలో సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.తెలంగాణ మీద ఉన్నప్రేమను చూపించడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోహిణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ కల్చరల్ సొసైటీకి వెన్నంటి ముందుండి నడిపించి తమ సహాయ సహకారాలను ఎల్లవేళల అందించే వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, NRI Cell మంద భీం రెడ్డి కి, GTA గ్లోబల్ ఛైర్మెన్ కల్వల విశ్వేశర్ రెడ్డి, GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన బసిక శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాలికను, ప్రపంచదేశాలు తెలంగాణను తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది. అందుకు విదేశాలలో నివసిస్తున్న మన తెలంగాణ తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరారు. అదేవిధంగా ఐటీ(IT) మినిస్టర్ శ్రీధర్ బాబు, డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు .తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రివర్గ సభ్యులను, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటి, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్ ఘనంగా సత్కరించారు.ఈ వేడుకల్లో మాతృశ్రీసాయి ఇన్స్టిట్యూట్, సర్వ ఫైన్ ఆర్ట్స్, దుర్గ శర్మ గ్రూప్, దీపారెడ్డి అండ్ గ్రూప్ మరియు స్వర్ణకళామందిర్ నుండి చిన్నారుల నృత్యప్రదర్శనలు, మధురమైన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాస రావు, మిర్యాల సునిత రెడ్డి ముఖ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి అందరిని అలరించారు.కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల చేతుల మీదుగా 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం)ను విడుదల చేసి, అందరికీ వాటిని పంపిణీ చేశారు.తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇతర ముఖ్య అతిథులకు ధన్యావాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సొసైటీ సభ్యులు ఆలెక్స్ తాళ్ళపల్లి, మల్లారెడ్డి కళ్లెం, లక్ష్మణ్ రాజు కల్వ, రాకేష్ రెడ్డి రజిది, సురేందర్ రెడ్డి గింజల, సింగపూర్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేసారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, అలాగే 'మీట్ అండ్ గ్రీట్' కు హాజరైన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన, చల్ల లత మొదలగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్కి నాట్స్ విరాళం) -
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ వేడుకలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Desapati Srinivas) తప్పుబట్టారు. ఇలాంటి వేదికలపై తెలంగాణ కల్చర్ను తప్పుగా చూపుతూ చులకనగా మాట్లాడటమేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమా వ్యాపారాన్ని మానుకోవాలని ఆయన కోరారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణయాన్ని తప్పపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయిందని రసమయి అన్నారు.ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ఈ రెండు సినిమాలలో జనవరి 14న విడుదలకానున్న కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. 'మా నిజమాబాద్లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత వైబ్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని వెంకటేశ్తో దిల్ రాజు అన్నారు. ఇప్పుడు అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి: ఎమ్మెల్సీ'తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు ఎప్పుడూ కలిసిరాలేదు. ఒక్కరోజు కూడా ఇక్కడి ప్రజల కోసం ఆయన అండగా నిలబడలేదు. తన సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణను తక్కువ చేస్తూ తాజాగా దిల్ రాజు మాట్లాడారు. తెలంగాణలో సినిమాలకు వైబ్ లేదంటూ ఇక్కడి కల్చర్ను చులకన చేశారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమాలు చేయడం మానుకోని.. కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి. ఇక్కడ మీ సినిమాలకు టికెట్ల ధరల పెంపు కోసం సీఎం రేవంత్ను అడిగి ప్రత్యేకంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి కూడా మరోసారి బయట పడింది. సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల గురించి గతంలో వారు చెప్పిన మాట మీద నిలబడలేదు. ఈ విషయంలో మంత్రి కోమటి రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాట మీద నిలబడని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి. దిల్ రాజు కోసం సినిమా టికెట్స్ ధరలు పెంచారు. దిల్ రాజు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి.' అని కామెంట్ చేశారు.దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు: రసమయిసీఎం రేవంత్రెడ్డి, దిల్ రాజులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ,బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనక మతలబు ఏమిటి అనేది ప్రజలకు చెప్పిండి. సీఎం రేవంత్ దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు..? ఆరు గ్యారంటీలపై మాట తప్పినట్టే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై సీఎం మాట తప్పారు. దిల్ రాజు తెలంగాణ ప్రజలను తన మాటలతో అవమాన పరిచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి బెనిఫిట్ షోలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం తెలుసు కానీ, సీఎం రేవంత్కు పాలన చేత కావడం లేదు. ప్రతి అంశంపై సీఎం యూ టర్న్ తీసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.' అని ఆయన అన్నారు. -
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
తెలంగాణకు కాలిఫోర్నియా పెట్టుబడులు: సీఎం రేవంత్రెడ్డిపై ప్రశంసలు
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ & కాలిఫోర్నియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సీఎం రేవంత్రెడ్డి పాత్ర గొప్పదని మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డి ప్రశంసించారు. కాలిఫోర్నియా, ఫ్రీమాంట్లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ రిసెప్షన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రొక్లమేషన్ కూడా అందించారు.ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి , మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు కమిషనర్ రఘు రెడ్డి హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన రఘురెడ్డి శాంటా క్లారా కౌంటీ కమీషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన రఘురెడ్డి అక్కడ మొదటి తెలుగు కమిషనర్ కావడం విశేషం. ఈయన వచ్చే ఏడాది సిటీ మేయర్ పదవిని చేపట్టాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సేవల రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘చార్లెస్ స్క్వాబ్’ హైదరాబాద్లో నూతన సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చార్లెస్ స్క్వాబ్ భారత్ లో ఏర్పాటు చేసే తొలి డెవలప్మెంట్ సెంటర్ ఇదే కావడం గమనార్హం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రతి నిధి బృందంతో చార్లెస్ స్క్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హోవార్డ్, రామ బొక్కా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో చర్చల సందర్భంగా హైదరాబాద్లో టెక్నాలజీ డెవల ప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. చార్లెస్ స్క్వాబ్కు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన తుది అను మతుల కోసం చార్లెస్ స్క్వాబ్ వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పా టు ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్ప నకు వీలవుతుందని, ఈ రంగంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.‘కామ్కాస్ట్’ ప్రతినిధులతో శ్రీధర్బాబుఅంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ కంపెనీ ‘కామ్కాస్ట్’కు చెందిన సీనియర్ ప్రతినిధి బృందం.. మంత్రి శ్రీధర్బాబు తో భేటీ అయింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపా ధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో వ్యూహాత్మక, భాగస్వా మ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు శ్రీధర్బాబు చెప్పారు. ఈ భేటీలో కామ్కాస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెల్ పెన్నా, సీటీఓ రిక్ రియోబొలి, సీఐఓ మైక్ క్రిసాఫుల్లి పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే..సీఎం బృందం అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలపై విమ ర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతినిధి బృందంలోని అధికారు లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశలోనే వివిధ సంస్థలతో చర్చలు ఒప్పందాలు జరుగుతు న్నట్లు వెల్లడించారు. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రోడ్ షోలు, వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతు న్నాయి. సీఎం కూడా అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు సమావేశా ల్లోనూ రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం..’ అని ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం జరిపిన భేటీ ఆసక్తికరంగా, ఫలప్రదంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపించింది. పట్టణీకరణ, కాలుష్య రహిత నగరాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఆసక్తి చూపింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే మురుగునీరు, తాగునీటి సమస్యల పరిష్కా రానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది..’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు.కాలిఫోర్నియా చేరుకున్న సీఎం బృందం రేవంత్రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియాకు చేరుకుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డాలస్, టెక్సా స్లో పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. కాలిఫోర్నియాలో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఈ బృందం భేటీ అవుతుంది. -
13 నిమిషాలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల ఆ పాట సాహిత్యం, ప్రతి చరణం అలాగే కొనసాగించాలని స్పష్టం చేశారు. ’జయజయహే తెలంగాణ గేయానికి బాణీలు, సంగీతకూర్పుపై ఆదివారం ఓ స్టూడియోలో గేయ రచయిత అందెశ్రీ, సంగీత ద ర్శకుడు కీరవాణి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో అందెశ్రీ, కీరవాణిలకు ఆయ న పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మార్పుల అనంతరం మరోమారు సమావేశమై గేయానికి తుది రూపం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 13 నిమిషాలు గేయం ఆలపించడం అతిథులకు ఇబ్బంది కలిగిస్తుందేమో ననే అభిప్రాయంతో షార్ట్ వర్షన్ రూపొందించాలనే అభిప్రాయం చర్చకు వచి్చందని, ఈ షార్ట్ వర్షన్ బాధ్యత అందెశ్రీకి అప్పగించారని తెలుస్తోంది. -
ముఖ్యమంత్రా.. చెడ్డీగ్యాంగ్ లీడరా?
పటాన్చెరుటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటతీరు చూస్తుంటే ముఖ్యమంత్రా..? లేక చడ్డీగ్యాంగ్ లీడరా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేశ్గడ్డ దేవస్థానం వద్ద ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తే.. సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరితే.. ‘చడ్డీ విప్పుతా.. డ్రాయర్ విప్పుతా’ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఇదేం భాషో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ భాషను ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కానీ, ఆ ఆటలు సాగవని..మెదక్ గడ్డ బీఆర్ఎస్కు అడ్డా అని చెప్పారు. -
7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్ఆర్సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ -
హైదరాబాద్ మెట్రో విస్తరణ: ఏయే రూట్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్మ్యాప్ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్మ్యాప్ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ... హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్మ్యాప్లో ప్రతిపాదించారు. కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది. కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.) కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ.) కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) -
సెట్స్పై స్పష్టత దిశ గా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీ క్షల (సెట్స్)పై త్వరలోనే స్పష్ట త రానుంది. ఇప్పటికే విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు స మీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్కు కన్వీనర్లను నియమించే అంశాన్ని, ఏ పరీక్ష ఏ యూనివర్శిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికే ఉమ్మడి ప్రవేశ పరీ క్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మ న్ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్తవారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాల యాల అధికారులు సెట్స్పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎంసెట్పై ప్రత్యేక దృష్టి: ఉన్నత విద్య పరిధిలో ఎంసెట్ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇలా అనేక ప్రవేశ పరీక్షలుంటాయి. ఎంసెట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్ను ఖరారు చేసిన తర్వాత యూనివర్శిటీలు కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడం వల్ల కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తోంది. జేఈఈ కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ మే మొదటి వారంలోనూ ఎంసెట్ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నారు. ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే... ఉన్నత విద్యా మండలి చైర్మన్, సభ్యుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఇతర సెట్స్పై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. పరీక్షల నాటికి నియామకాలు జరుగుతాయనీ, అప్పటి వరకూ నిర్ణయాలన్నీ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. కాగా, త్వరలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు శాఖాపరమైన పూర్తి సమాచారంతో సిద్ధమయ్యారు. సీఎం సమీక్షా సమావేశంలో సెట్స్పై స్పష్టత వస్తుందనీ, వచ్చే వారంలో సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.' ఆశావహుల్లో టెన్షన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది. వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం.. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ..! ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు. -
TS Election 2023: బీఆర్ఎస్లో వన్ మేన్ షో ! మరో పార్టీ నో..!
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త బుయ్యని మనోహర్రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరడం వెనుక మర్మమేమిటనేది రాజకీయ వర్గాల్లో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బీఆర్ఎస్లో మంత్రి పట్నం మహేందర్రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉండటంతోపాటు మంత్రి కేటీఆర్తో సాన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి నేత పార్టీ వీడేందుకు సిద్ధమైతే బీఆర్ఎస్లో ఏ ఒక్క నేత ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే బుయ్యని మనోహర్రెడ్డి కాంగ్రెస్లో చేరితే ఢిల్లీలో లేదా గాంధీభవన్లో పార్టీ కండువా వేసుకోవాలి. కాని చిన్నపాటి కార్యకర్తలా తాండూరులో చేరడం వెనుక కాంగ్రెస్లో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోనే వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచిన బుయ్యని మనోహర్రెడ్డి నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్లో చేరారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ హోదాలో కొనసాగుతున్నారు. మనోహర్రెడ్డి పరిగిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మరోవైపు తన సొంత నియోజవకర్గంలో పర్యటించాలని అధికార పార్టీ నేతలు ఆంక్షలు విధించారంటూ ఆందోళనకు గురయ్యారు. బీఆర్ఎస్లో వన్మెన్ షో కొనసాగుతుందంటూ ఇక పార్టీలో కొనసాగడం కష్టమంటూ ప్రకటించారు. కాంగ్రెస్లో చేరిన మనోహర్రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన పరిగిలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి టికెట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో రామ్మోహన్రెడ్డి చొరవతో తాండూరు అసెంబ్లీ స్థానాన్ని మనోహర్రెడ్డికి కేటాయిస్తే ఇటు పరిగి నియోజకవర్గంలోని మనోహర్రెడ్డి అనుచరగణమంతా కాంగ్రెస్కి మద్దతు పలకడంతో పార్టీ గెలుపు అవకాశాలు అధికమయ్యాయంటూ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా బుయ్యని సోదరులు రైస్ మిల్లుతో పాటు ఆర్బీఎల్ పరిశ్రమ ద్వారా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం సర్వే.. కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తవుతుంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి.. తాండూరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థిగా వస్తారంటు ఇప్పటికే నియోజవకర్గంలోని మారుమూల గ్రామ ప్రజల వరకు వెళ్లింది. నెల రోజుల క్రితమే నియోజవకర్గంలో వాల్పోస్టర్లను అంటించారు. కేఎల్ఆర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ సభ్యులు, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి రమేశ్ మహరాజ్ సైతం మద్దతు పలికారు. అయితే మనోహర్రెడ్డి తాండూరు పట్టణంలో పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాండూరు అసెంబ్లీకి చేతి గుర్తు ఎవరిని వరిస్తోందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ఢిల్లీ స్థాయిలో లాభియింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై భారం వేశారు. దీంతో మనోహర్రెడ్డికి టికెట్ ఇప్పించే బాధ్యత రేవంత్రెడ్డి భుజస్కంధాలపై వేసుకొన్నారు. తన నియోజకవర్గం ఆనుకొని ఉన్న తాండూరు సీటు విషయంలో రేవంత్రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. -
రేవంత్రెడ్డిని విమర్శించే స్థాయి లేదు
జయశంకర్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని విమర్శించే స్థాయి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్కు లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏనాడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారంలోకి వచ్చాక రైతులకు రుణ మాఫీ చేస్తానన్న సీఎం కేసీఆర్, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, జిల్లా నాయకులు అంబాల శ్రీనివాస్, కాగితోజు రమణాచారి, గజవెల్లి అర్జున్, వెంకీ యా దవ్, మాచర్ల సంతోష్, ఫాజిల్, నారాయణ, పుల్ల మహేష్, తోట రంజిత్, నగునూరి రజినీకాంత్ గౌ డ్, చుంచుల మహేష్, బేతి పృథ్వి పాల్గొన్నారు. -కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ -
రేవంత్రెడ్డి చంద్రబాబు శిష్యుడే !
వికారాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నారా చంద్రబాబునాయుడి శిష్యుడేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బీమా, రైతు బంధు పథకాలను ఎత్తేయడం ఖాయమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చన్గోముల్లో చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రథాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్య రథ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ఉచిత విద్యుత్తు ప్రస్తావన లేదన్నారు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.... మూడు పంటల బీఆర్ఎస్ కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రైతుల అవసరాల మేరకే విద్యుత్తు కొంటున్నామని అన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించే వ్యక్తి ఎంపీ రంజిత్రెడ్డి అని అన్నారు. సొంత డబ్బులతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ మేఘమాల, మార్కెట్కమిటీ చైర్మన్ అజారుద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు రహీస్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం!
ఆదిలాబాద్రూరల్: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మా వల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా ట్రాక్టర్లతో చేపట్టిన భారీలో పాల్గొన్నారు. అనంత రం ఆయన మాట్లాడారు. రైతు బాగుపడితే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో రైతు ల సమస్యలు పరిష్కరించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమయిందన్నారు. మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ అన్నదాతపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, జెడ్పీటీసీ వనిత రాజేశ్వర్, సర్పంచ్ ప్రమీల రాజేశ్వర్, ఎంపీపీ సంగీత, నాయకులు ప్రహ్లాద్, నారాయణ పాల్గొన్నారు. రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడం సిగ్గుచేటు జైనథ్: సాగుకు కేవలం మూడు గంటల విద్యుత్ మా త్రమే చాలంటూ రైతాంగాన్ని కించపర్చిన రేవంత్ రెడ్డి ఇంకా రైతులకు క్షమాపణలు చెప్పకపోవడం సి గ్గుచేటని ఎమ్మెల్యే రామన్న అన్నారు. మండలంలోని సిర్సన్న గ్రామంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, నాయకులు వెంకట్రెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ అసహనం
-
‘బీజేపీవి వేషాలు.. టీఆర్ఎస్ది అతి తెలివి’
సాక్షి, హైదరాబాద్: నిజాం సంస్థానం భారత యూనియన్లో కలిసిన రోజును విలీనమని టీఆర్ఎస్, విమోచనమని బీజేపీలు మాట్లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు అసలు తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజున మనుగడలోనే లేవని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. ముస్లింలపై హిందువులు గెలిచినట్టు బీజేపీ వేషాలు వేస్తుంటే.. హిందూ, ముస్లింలను మచ్చిక చేసుకోవాలనే ఆలోచనతో టీఆర్ఎస్ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉన్న పేటెంట్ హక్కును దొంగిలించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు మల్లురవి, అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్లతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిన రోజున తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని, అది జరిగి 75 ఏళ్లవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతిభవన్లో సోదాలు జరపాలి.. లిక్కర్ స్కాంలో సోదాలంటూ బీజేపీ చేస్తున్న డ్రామాలను నమ్మేందుకు రాష్ట్రంలో వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె కవిత లేదా ఇతరుల పాత్ర ఉంటే ప్రగతిభవన్లో సోదాలు జరిపి, సీఎం కేసీఆర్ను విచారిస్తే ఆధారాలు లభిస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలి.. వేరే పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరినందుకు వారికి ముట్టిన డబ్బులు, లభించిన కాంట్రాక్టులు, జరిగిన భూముల రెగ్యులరైజేషన్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానన్న నమ్మకం సీఎం కేసీఆర్కు లేదని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ 25 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై స్పందిస్తూ.. కేసీఆర్ అరాచక చక్రవర్తి అన్నారు. అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో జరగనున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలన్నా రు. అంతకుముందు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ రూపొందించిన భారత్ జోడో యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బైబై! సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమయ్యింది. ఆయనతో వేదిక పంచుకోలేకనే.. సమావేశానికి హాజరుకాలేదు. అనుచరులతో రేవంత్ అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. మాకు ప్రాధాన్యత లేదు.. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లను. మాణిక్కం ఠాగూర్ను తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్నాథ్ లాంటి వాళ్లకు ఇన్ఛార్జ్గా ఇవ్వాలి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి. ఇదీ చదవండి: పొలిటికల్ హీట్..హాట్ సీట్గా ఖమ్మం.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్? -
హస్తినలో తేలని ‘కోమటిరెడ్డి’ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీ మారకుండా ఆయన్ను బుజ్జగించేందుకు జరిపిన చర్చలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించాకే అంతిమంగా ఒక నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. చర్చల సారాంశంపై సోనియాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివేదిక సమర్పించాక ఆమె నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ అమలుకానుందన్నారు. మరోవైపు సోమవారం రాత్రి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం మరోసారి జరిగింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఇందులో మునుగోడు వ్యవహారంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం రేవంత్, వెంకట్రెడ్డి, జానా, ఉత్తమ్లతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. మునుగోడులో రాజకీయ పరిణామాలు సహా పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించామని, 2–3 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను మీడియాకు వివరిస్తామన్నారు. చదవండి: ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు -
Hyderabad: గులాబీకి కూర్పు, కాంగ్రెస్కు మార్పు.. బీజేపీ కట్టడిలో రెండూ విఫలం
సాక్షి, సిటీబ్యూరో: గులాబీకి సారథి ఉన్నా.. కార్యవర్గ కూర్పు జరగలేదు. ఇక కాంగ్రెస్ సేనాని అస్త్రసన్యాసం చేసి ఏడాదిన్నరైనా కొత్త బాస్ను ఎంపిక చేయలేదు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నా.. అధికార, విపక్ష పార్టీలు మాత్రం నగరంలోని పార్టీలను గాడిలో పెట్టేదిశగా అడుగులు వేయడం లేదు. నాలుగేళ్ల క్రితం జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేసిన టీఆర్ఎస్ దళపతి.. ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యకలాపాలు సాగించారు. పార్టీని సమన్వయపరచడంలో ఇబ్బందులు తలెత్తడంతో మరోసారి పాత పద్ధతిలో కమిటీలను పునరుద్ధరించారు. ఆ మేరకు జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్ బాస్.. హైదరాబాద్ జిల్లా పగ్గాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు అప్పగించారు. బాధ్యతలు అప్పగించి ఆరు నెలలైనా.. ఇప్పటివరకు కార్యవర్గాన్ని ప్రకటించలేదు. అనుబంధ కమిటీల ఊసేలేదు. కేవలం అధ్యక్ష పదవితోనే సరిపెట్టారు. దీంతో జిల్లా అధ్యక్షులు కేవలం ఉత్సాహ విగ్రహాలుగానే మారారు. పార్టీ పదవులు ఆశించిన ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆశలు వదులుకున్నారు. బీజేపీ కట్టడిలో రెండు పార్టీలూ విఫలం గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించిన భారతీయ జనతాపార్టీ... హైదరాబాద్పై పట్టు బిగించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణతో మరింత దూకుడు పెంచింది. జూబ్లీహిల్స్లో గ్యాంగ్ రేప్, డ్రగ్స్ తదితర అంశాలపై ఉద్యమాలు సాగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలపడే విధంగా పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో గులాబీ నగర నాయకత్వం చేతులెత్తేసింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మినహా స్వతహాగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. కనీసం అసెంబ్లీ స్థాయిలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలను కూడా నిర్వహించలేకపోతోంది. ప్లీనరీ వేళ మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకొంది. ఎమ్మెల్యేగా, అధ్యక్షుడిగా జోడు పదవులు ఉండడంతో పార్టీకి సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలున్నాయి. హస్తవాసి మారేనా? పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని భావించిన పీసీసీ నాయకత్వం.. హైదరాబాద్ను మూడు జిల్లాలుగా విభజించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సంస్థాగతంగా మంచిదే అయినా.. రెండేళ్లుగా జిల్లా కాంగ్రెస్ కమిటీని నియమించలేదని అధిష్టానం.. ఈ మూడింటికి సారథులను ఎక్కడి నుంచి తెస్తుందనే అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 15 అసెంబ్లీ సెగ్మెంట్లను అయిదేసీ నియోజకవర్గాల చొప్పున హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జిల్లాలుగా కాంగ్రెస్ కమిటీలు వేయాలని పీసీసీ ప్రతిపాదించింది. దీనికి ఏఐసీసీ కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ డీసీసీ పరిధిలో సికింద్రాబాద్, సనత్నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, కంటోన్మెంట్.. హైదరాబాద్ డీసీసీ పరిధిలో చార్మినార్, బహుదూర్పుర, మలక్పేట్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట.. ఖైరతాబాద్ డీసీసీ పరిధిలో ఖైరతాబాద్, అంబర్పేట్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలు ఉండనున్నాయి. హైదరాబాద్పై కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి అంతగా దృష్టి సారించలేదు. రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాజధానిపై నాయకత్వానికి కనీస వ్యూహం కూడా లేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా నగరాన్ని మూడు డీసీసీలుగా విభజించిందనే ప్రచారం జరుగుతోంది. అంజన్ నిష్క్రమణతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ మాజీ ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఏఐసీసీ కట్టబెట్టింది. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్ నగర కాంగ్రెస్కు సారథి లేకుండా పోయారు. సరైన సారథ్యం, మార్గనిర్దేశం లేకపోవడంతో నగరంలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడింది. ఆఖరికి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలోనూ చతికిలపడింది. సభ్యత్వ నమోదుపై కనీసం సమీక్షించేవారు లేకపోవడంతో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నగర ప్రజల సమస్యలపై పోరాటంలోనూ ఆ పార్టీ వెనుకబడింది. బీజేపీ ఒకవైపు దూకుడుగా ముందుకెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం సారథి, కార్యవర్గం లేకపోవడమే. తాజాగా మూడు డీసీసీలను నియమించాలని పీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో కొత్త కెప్టెన్లయినా పార్టీని గాడిలో పెడతారో లేదో వేచిచూడాల్సిందే! చదవండి: దమ్ముంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చెయ్ -
పీసీసీ: కలకలం రేపిన రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ’పట్టు‘విడుపులు లేని నాయకుల పంతాలతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్రెడ్డిలలో ఎవరో ఒకరిని ఈ పదవి వరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరూ కాకుండా మధ్యేమార్గంగా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు టి.జీవన్రెడ్డి, కె.జానారెడ్డి, డి.శ్రీధర్బాబు, మర్రి శశిధర్రెడ్డిల పేర్లు ముందు వరుసలోకి వచ్చాయి. ఒకదశలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం కూడా జరి గింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చంటూ మంగళవారమంతా హడావుడి జరిగింది. కానీ, సాయంత్రానికి అలాంటిదేమీ లేదని అధిష్టానం తేల్చడంతో కాంగ్రెస్ శ్రేణులు నిట్టూర్చాయి. సామాజిక సమీకరణలు, పంతాలు, పట్టింపులు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే ఎన్నికలు లాంటి అంశాల నేపథ్యంలో అసలు టీపీసీసీకి ఎవరిని ఎంపిక చేయాలన్నది పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికల్లా వ్యవహారాన్ని తేల్చాలా... నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు వేచి ఉండాలా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో...! వాస్తవానికి సోమవారం వరకు టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే ధీమాతో ఉన్న రేవంత్ ఉన్నట్టుండి తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో అసలు పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే జీవన్రెడ్డి అధ్యక్షుడిగా, రేవంత్ ప్రచార కమిటీ చైర్మన్గా మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. అసలేం జరిగింది? టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఫర్వాలేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు పలురకాలుగా విశ్లేషించాయి. పీసీసీ అధ్యక్ష పదవే కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అధిష్టానానికి ఆయన వెసులుబాటు కల్పించారని, ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరిగింది. మరోవైపు అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే రేవంత్ అలా మాట్లాడారని, ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం సాగింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుని ఎంపికపై గురువారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనున్న నేపథ్యంలో... ఈలోపే తెలంగాణ పీసీసీని తేల్చేస్తుందనే అంచనాతో ఈ ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్బాబు, మధుయాష్కీ గౌడ్లకు ఫలానా పదవులంటూ రాష్ట్రంలో చర్చ జరిగిందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. సామాజిక సమీకరణాల మాటేమిటి? ఒకవేళ టీపీసీసీ అధ్యక్షునిగా జీవన్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్గా రేవంత్రెడ్డిని అధిష్టానం ఖరారు చేసిన పక్షంలో రెండు కీలక పదవులూ ఒకే సామాజిక వర్గానికి దక్కుతాయని, అది చాలా నష్టానికి కారణమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల ప్రకారం పీసీసీ అధ్యక్షుడు లేదా ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి తప్పకుండా కేటాయించాలని, అయితే రెండో పదవిని మాత్రం బీసీ లేదా ఎస్సీలకు కేటాయించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. నిన్నటి వరకు టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు సీడబ్ల్యూసీలో ఆహ్వానితుడిగా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉన్నా... ఉత్తమ్కుమార్ రెడ్డిని కాదని ఆయనకు కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఇతర సామాజిక వర్గ నేతలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నది అధిష్టానానికి రిస్క్ ఫ్యాక్టర్గా మారిందని టీపీసీసీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో బీజేపీ దూసుకువస్తోంది. ఆ పార్టీకి బీసీ అధ్యక్షుడు ఉన్నారు. టీఆర్ఎస్ కూడా బీసీలకు అనేక సమయాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. మేం బీసీ, ఎస్సీలను విస్మరిస్తే నష్టమే జరుగుతుంది. తేడా వస్తే పునాదులే కదులుతాయి.. ఆచితూచి అడుగేయాలి’అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సాగర్ ‘గుబులు’ మరోవైపు టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని తేల్చకపోవడానికి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కారణమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అసంతృప్తులు, అలకలతో పార్టీ నేతలు సహకరించకపోతే... పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరుగనున్న సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోతే రాష్ట్రంలో ఇక ఆ పార్టీ పరిస్థితి అంతేననే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎన్నిక పూర్తయ్యేవరకు టీపీసీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానాన్ని అడిగినట్టు గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా తన జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఈ ఎన్నికల్లో తనకు అవసరమని, ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని జానా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఉపఎన్నిక జరుగుతుందన్న అంచనా మేరకు అప్పటివరకు ఈ తలనొప్పి వ్యవహారాన్ని వాయిదా వేద్దామా..? లేక ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి లోపు తేల్చేద్దామా? అనే తర్జనభర్జనలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవన్రెడ్డికి అభినందనల వెల్లువ కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా జీవన్రెడ్డి పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం ఆయన పుట్టినరోజు కూడా కావడంతో జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి అభిమానులు బారులు తీరారు. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి విషయంలో ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారంలో ఇంకా ఏమీ తేలలేదని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. మహానాడు వేదికగా కుట్ర... టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్లో ఇదే అంశంపై రేవంత్రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్కాల్స్, వాయిస్ కాల్స్లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రేవంత్ అనుచరుడు ఉదయ్సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్మెంట్కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్మెంట్కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్సన్కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్రెడ్డి ఉదయ్సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు. -
దుబ్బాక నిధులు సిద్దిపేటకు తరలించారు
సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దగుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చింతమడకలో చదువుకున్న అని చెప్పుకునే కెసిఆర్..చింతమడక తరహా పది లక్షలు పెద్దగుండవెళ్లిలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దుబ్బాకకు సిద్దిపేట నుంచి 40 సంవత్సరాల నుండి దాయాదుల పోరు ఉందని, దుబ్బాకకు వచ్చిన అనేక నిధులు సిద్దిపేటకు తరలించారని ఆరోపణలు గుప్పించారు. మూడు నియోజకవర్గాల మద్య ఉన్న దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే రామలింగారెడ్డి మీ చేతిలో చిప్ప పెట్టిండు. హరీష్ రావు సిద్దిపేట నుండి వచ్చి ఏ మోహం పెట్టుకొని ఓట్లడుగుతుండు. నాలుగు సార్లు గెలిపిస్తే చేయని అభివృద్ధిని మళ్లీ చేస్తాడంటే నమ్ముతమా. దుబ్బాక అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ ను 100 అడుగుల లోతుకు పాతిపెట్టాలి అంటూ రేవంత్ విమర్శనస్ర్తాలు సంధించారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే) కల్వకుంట్ల మాటలు నమ్మి మోసపోయారు నవంబర్3న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కోరారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు కల్వకుంట్ల మాటలు నమ్మి అనేకసార్లు మోసపోయారని, మరోసారి అలా జరగకూడదన్నారు. ముత్యంరెడ్డి , రామలింగారెడ్డి ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో పోల్చి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వయానా రామలింగారెడ్డి అసెంబ్లీలో నేనేమి చేయలేకపోతున్న అన్నారని, మరి ఆయన సతీమణితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలిస్తే టిఆర్ఎస్లోకి పోతాడని, రఘునందన్, హరీష్ రావు బంధువులని పేర్కొన్నారు. బిజెపికి ఓటేస్తే వృధా అవుతుందని, దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలన్నారు. -
పీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్ హత్యాచార ఘటనకు నిరసనగా ట్యాంక్బండ్పై కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డగించారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ ప్రదర్శనలతో గాంధీభవన్, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : నిరంతరం ప్రజల్లో ఉండాలి -
ఉత్తమ్కు మంత్రి జగదీష్ సవాల్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు తోడు దొంగలుని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ పద్మావతికి హుజూర్నగర్ టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్ను ప్రచారానికి దింపి, ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయాలతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే.. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయని గుర్తు చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్నగర్ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్కు సవాల్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఉత్తమ్కు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. సమయం, స్థలం తాను చెప్పినా లేదా.. తనని చెప్పమన్నా సరే సిద్ధమన్నారు. అది హుజూర్నగర్ సెంటరా.. సూర్యాపేట సెంటరా అన్నది తేల్చుకోవాల్సింది ఉత్తమ్కుమార్ రెడ్డినే అని వ్యాఖ్యానించారు. శాసన సభ్యుడిగా తన ఐదేళ్ల కాలంలో సూర్యపేటలో జరిగిన అభివృద్ధి గురించి ఉత్తమ్ తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి 20 ఏళ్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా అధికారంలో ఉండి చేసిందేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం ఎలానో తెలియదనే.. కోదాడ ప్రజలు ఇంటికి పంపారని ఘాటుగా విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని, ఉత్తమ్, రేవంత్రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మరచిపోరన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
తుదిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి
పంజగుట్ట:తెలంగాణలోని సమస్త ప్రజానీకం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొంతమంది చేతుల్లోకి వెళ్లిందని, వారి నుండి విముక్తి కల్పించేందుకు తుదిదశ ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. జాగో తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన ఇక్కడ జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రమాణస్వీకారం చేసినరోజే ఇది ప్రజల తెలంగాణ కాదని భావించామన్నారు. టీఆర్ఎస్కు ఒక్క రోజు కూడా పాలించే అర్హతలేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం తెచ్చి ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుండాలని అన్నారు. అమరవీరుల స్మృతి వనాన్ని హైదరాబాద్లో తక్షణమే నిర్మించాలని, అమరుల కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, గౌతు కనకయ్య, గాదె ఇన్నారెడ్డి, బెల్లయ్యనాయక్, రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో కాంగ్రెస్కు పూర్వ వైభవం: రేవంత్రెడ్డి
సాక్షి, మహేశ్వరం: త్వరలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతోందని, కార్యకర్తలెవ్వరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్రెడ్డిని కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వన్నాడ మనోహర్గౌడ్ రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. 2023లో కేంద్రం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికి టీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని వాపును చూసి బలుపు అనుకునే అనేవిధంగా హైప్ చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు, కార్యకర్తలు త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయమన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తామని, నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చాకలి యాదయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల రఘుపతి, పార్టీ నాయకులు ప్రసాద్, ఈశ్వర్,శ్రీరాములు , అనిల్కుమార్, భాస్కర్, రాజు, చంద్రమోహన్, రమేష్, ఆనంద్, ,బాలు పలువురు పాల్గొన్నారు. -
‘తుమ్మిడిహెట్టి’ కోసం కదిలిన కాంగ్రెస్
సాక్షి, కాగజ్నగర్: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో దాదాపుగా 16.5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.38వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ సైతం చేశారు. కెనాల్ పనులు సైతం జరిగాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రీడిజైన్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని మొదటి నుంచి ప్రతిపక్షం వాదిస్తూనే ఉంది. రంగంలోకి రాష్ట్ర నాయకత్వం ఈ నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు పోన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, షేబ్బీర్అలీ, జానరెడ్డి, సురేష్ సెట్కార్, కొండ విశ్వేశ్వర్, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఉదయం 11గంటలకు కాగజ్నగర్ చేరుకోగా వారికి కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో కుమురంభీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ పాల్వాయి హరీష్బాబు మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11గంటలకు తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో కాగజ్నగర్ చేరుకుని ఇక్కడి నుంచి కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని పరిశీలించడానికి వెళ్లారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత గురించి తెలుసుకుని పరిశీలించారు. -
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియాగాంధీని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నారు. సోనియా పేరును మన్మోహన్సింగ్ ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మెరుగైన పనితీరు కనబరుస్తా: ఉత్తమ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తాను ఈసారి లోక్సభకు ఎన్నికవ్వడం సంతృప్తికరంగా ఉందని, పార్లమెంటు సమావేశాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఒక్కరిదే బాధ్యత కాదని, అది అందరి సమష్టి బాధ్యత అన్నారు. పార్టీ బలోపేతానికి రాహుల్ ఎంతో కృషి చేశారని, పార్టీకి ఆయన సేవలు అవసరమని, దేశానికి కాంగ్రెస్ అవసరం కాబట్టి రాహుల్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని తనతోపాటు కార్యకర్తలందరూ కోరుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి అదృష్టవశాత్తు నాలుగు సీట్లు వచ్చాయి తప్ప రానున్న రోజుల్లో ఆ పార్టీ బలపడే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్కు గ్రామ పంచాయతీల వారీగా ఉన్న బలమైన కేడర్ బీజేపీకి లేదన్నారు. ఇక రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ, ఓయూ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కుంతియా, ఉత్తమ్, కోమటిరెడ్డి శిబిరాన్ని సందర్శించి దీక్షలు విరమించాలని కోరా రు. వారి విజ్ఞప్తులను రాహుల్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని టీపీసీసీ నేతలు మానవతారాయ్, నాయిని యాదగిరి, సాజిద్ బేగ్లు తెలిపారు. -
రేవంత్ ఒక రాజకీయ టెర్రరిస్టు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కొడంగల్లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలే దని వ్యాఖ్యానించారు. బట్టకాల్చి మీద వేయ డం, బురద చల్లడం రేవంత్రెడ్డికి అలవాటు అని, ఆయన నోరు తెరిస్తే వేల కోట్ల రూపాయల కుంభకోణం అని మాట్లాడతారని మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో సుమన్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఇంటర్ ఫలితాల్లో కొంత సాంకేతిక సమస్య వచ్చింది నిజమే. అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్కు విద్యా శాఖకు లింక్ ఎలా పెడతారు? 2017 సెప్టెంబరు 27న గ్లోబరీనాకు రూ.4.30 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇది విద్యాశాఖ పరిధిలోని అంశం. గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏంటి? ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదు. ప్రజలకోసం కాకుండా వాళ్లకోసం ఆందోళన చేస్తున్నా రు. గ్లోబరీనా, మాగ్నేటిక్ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషించింది. ఇంటర్ బోర్డులో కొంత మంది అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగా గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది’అని సుమన్ అన్నారు. -
ఇవి పీఎంను నిర్ణయించే ఎన్నికలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈ ఎన్నికలు ముఖ్య మంత్రి కుర్చీ కోసం కాదని, ప్రధానమంత్రిని నిర్ణయించేందుకు జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయటానికి ముందు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లా డారు. తాను పోటీలో ఉన్నానంటే సీఎం కేసీ ఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నా రు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని, ఉప ప్రాంతీయ పార్టీల మధ్య కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఏఐసీసీ అధినేత రాహుగాంధీ ప్రధాని అవుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారిని గాలికి వదిలేసి, నమ్ముకున్నవారిని నట్టేట ముంచి ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు చేసేవారికే కేసీఆర్ టికెట్లు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, సుఖేందర్రెడ్డి, సీతారాంనాయక్, వివేక్లకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని, వారిప్పుడు బావిలో దూకాలా.. అని అన్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ టికెట్ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి వేలంపాటలో కేటాయించారని, ఇలాంటి వాళ్లు ప్రజాసమస్యలపై ఎలా మాట్లాడగలరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని, తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ బలహీనపరుస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షం ఉండొ ద్దని చంద్రబాబు అనుకుంటే వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉండేవారా... రాజశేఖర్రెడ్డి వద్దనుకుంటే.. చంద్రశేఖర్రావు ఉండేవారా... ఇందిరాగాంధీ అనుకుంటే.. వాజ్పేయి, అద్వానీ లాం టి వారు ఉండేవారా.. అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, నేతలు తోటకూరి జంగయ్యయాదవ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్ కలెక్టరేట్ వరకు రేవంత్ పార్టీ శ్రేణులతో భారీర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవీరెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నా గెలుపుకు సహకరించండి: రేవంత్ సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. తన గెలుపుకు సహకరించాలని ప్రజాగాయకుడు గద్దర్ను కోరారు. ఆయన విజ్ఞప్తికి గద్దర్ కూడా సానుకూలంగా స్పందించారు. రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం గద్దర్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దరన్న ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ప్రశ్నించే గొంతు లేకపోతే పేదలకు న్యాయం జరగదని, రాష్ట్రంలో అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. సీపీఐ, టీజేఎస్, గద్దర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
మంత్రివర్గ విస్తరణ ఎలా?: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం రాష్ట్ర శాసనసభ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్కు సైతం ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని రేవంత్రెడ్డికి తెలిపామని రజత్కుమార్ పేర్కొన్నారు. -
ఆ డబ్బు ఎవరిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు – కోట్లు’కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డబ్బు ఎక్కడ నుంచి వచ్చిం దన్న విషయంపై టీడీపీ నేత వేం నరేందర్రెడ్డి ఆయన కుమారులను ఈడీ విచారించిన సం గతి తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ విచారణకు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందే తయారు చేసిన ప్రశ్నల జాబితా(బ్యాంకు స్టేట్మెంట్లు, ఏసీబీ ఇచ్చిన అధారాలు)ను ఆయన ముందుంచి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసిం ది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచంగా ఇవ్వజూపిన రూ.50 లక్షలను మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి చేరవేసారని ఉదయసింహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ వీడియోలో త్వరలోనే మరో రూ.4.5 కోట్లు ఇస్తామని రేవంత్ చెప్పారు. మిగతా నగదు ఎవరు ఇచ్చేవారని ప్రశ్నించి నట్లు సమాచారం. దీనిపై తొలుత పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ఉదయ సింహ నుంచి తరువాత విచారణలో పలు కీలక అంశాలు ఈడీ డైరెక్టర్ రాజశేఖర్ బృందం రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 9 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ.. 2015 మేలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రూ.50 లక్షలు లంచంగా ఎరవేశారు. ముందస్తు సమాచారంతో మాటువేసిన ఏసీబీ అధికారులు రేవంత్రెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,సెబాస్టియన్, ఉదయసింహా, మత్తయ్యలపై ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదా జరిపిన సంగతి తెలిసిందే. తరువాత ఈకేసును ఏసీబీ అధికారులు ఈడీకి బదిలీ చేశారు . ఈ కేసులో మత్తయ్య, సెబాస్టియన్, ఉదయసింహా, రేవంత్రెడ్డితోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్రెడ్డి అతని కుమారులను కూడా ఈడీ విచారించింది. నేడు ఈడీ ముందుకు రేవంత్రెడ్డి ఈ కేసులో ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. 19న విచారణకు రావాలంటూ రేవంత్రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన ప్రశ్నావళిని ఈడీ అధికారులు ముందే సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా ఉదయసింహా, వేం నరేందర్రెడ్డి, ఆయన కుమారులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తొలి నుంచి రేవంత్రెడ్డి అన్నీ తానై నడిపించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, స్టీఫెన్సన్లనూ విచారణకు రావాలని ఈడీ పిలిచే అవకాశముంది. -
55 దాటతాయి.. పందెం ఎంత?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జోరు కొనసాగుతుందని అన్ని జాతీయ చానళ్ల ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేసినా, కూటమి గెలుస్తుందన్న లగడపాటి జోస్యంతో వందల కోట్ల మేర బెట్టింగులు సాగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. గజ్వేల్లో సీఎం కె.చంద్రశేఖర్రావు మెజారిటీ ఎంత? కొడంగల్లో రేవంత్రెడ్డి గెలుస్తారా? మధిరలో భట్టి విక్రమార్క బయటపడతారా? వీటి మీదే ఇప్పుడు బెట్టింగ్లు పెడుతున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగుల్లో పాలు పంచుకుంటున్న ఓ వ్యక్తి, ముంబై కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ సంస్థ నుంచి అందిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముంబై కేంద్రంగా బెట్టింగులు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏపీలో భీమవరం, తిరుపతి, తెలంగాణలోని వరంగల్ను ఉపకేంద్రాలుగా చేసుకొని వందల కోట్ల రూపాయల మేర బెట్టింగ్ వ్యాపారం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదాని కంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే బెట్టింగ్లు సాగాయి. కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఒక రకమైన బెట్టింగ్లు సాగితే, గెలుస్తారనుకున్న అభ్యర్థికి ఎంత మెజారిటీ రావచ్చన్న దానిపైనా బెట్టింగ్లు పెట్టారు. ఉదాహరణకు గద్వాలలో డీకే అరుణ గెలుస్తారని బెట్టింగ్కు ఎవరైనా ముందుకు వస్తే దానికి అనుబంధంగా ఎంతమెజారిటీ వస్తుందన్న దానిపైన బోలెడు మంది బెట్టింగ్లు పెట్టారు. రూపాయికి రెండు రూపాయిలు జాతీయ చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయడానికి ముందు రోజు దాకా టీఆర్ఎస్కు 55 సీట్లు వస్తాయని ఎవరైనా రూపాయి పందెం కాస్తే తిరిగి రూపాయి ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు ఎక్కువగా కనిపించారు. ఎగ్జిట్ పోల్స్ తరువాత టీఆర్ఎస్కు 56 సీట్లు వస్తాయని రూపాయి బెట్టింగ్ కాస్తే అర్ధ రూపాయి మాత్రమే ఇవ్వడానికి ముందుకు వచ్చారు. టీఆర్ఎస్కు 60 సీట్లు వస్తాయని రూపాయి పెడితే అవతల వైపు నుంచి 75 పైసలు ఇస్తామంటున్నారు. టీఆర్ఎస్కు 65 సీట్లు వస్తాయని పందెం కట్టిన వారికి రూపాయికి రూపాయి నడుస్తోంది. ఆ పార్టీకి 66 దాటుతాయని ఎవరైనా రూపాయి పెడితే 2 రూపాయలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు. అదేవిధంగా మహాకూటమికి 40 సీట్లు మించి రావని రూపాయి పెడితే 75 పైసలు, 50 సీట్లు వస్తాయని పెడితే 2 రూపాయలు ఇవ్వడమన్నదాని మీద పందేలు నడుస్తున్నాయి. కూటమికి 55 దాటుతాయని రూపాయి పెడితే 3 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే వెలువరించిన రోజు అర్ధరాత్రి దాకా కూటమికి 55 సీట్లు దాటుతాయంటే రూపాయి పెడితే రూపాయి ఇవ్వడానికి చాలామంది పోటీపడ్డారు. అయితే, లగడపాటి ఎగ్జిట్ పోల్ చేయలేదని, ఒక అంచనాతో సర్వే వివరాలు వెల్లడించారని వార్తలు రావడంతో శనివారం తెల్లవారేసరికి పందాల్లో మార్పు వచ్చింది. టీఆర్ఎస్కు 55 దాటుతాయని పందెం పెట్టినవాళ్లే అధికంగా ఉన్నారు. రేవంత్ గెలుస్తారా? కేసీఆర్ మెజారిటీ ఎంత? టీఆర్ఎస్, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నదాని తరువాత బెట్టింగుల్లో రెండు అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి గెలుస్తారని రూపాయి పెడితే 75 పైసలు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడుతున్నవారు ఉన్నారు. రేవంత్ ఓడిపోతారని రూపాయి పందెం కాస్తే రూపాయి, టీఆర్ఎస్ అభ్యర్థికి 5 వేల మెజారిటీ వస్తుందని బెట్టింగ్ పెడితే రూపాయికి 2 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. గద్వాలలోనూ అంతే. డీకే అరుణ గెలుస్తుందని పందెం కాసే వారికి రూపాయికి రూపాయి నడుస్తోంది. గజ్వేల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు 25 వేల మెజారిటీ రాదని ఎవరైనా రూపాయి పెడితే రూపాయి తిరిగి ఇచ్చేందుకు బెట్టింగులు నడుస్తున్నాయి. కేసీఆర్ మెజారిటీ 50 వేలు వస్తుందని రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తామనే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న బెట్టింగ్లు ఆదివారం ఉదయం నుంచి మొదలయ్యాయి. కూటమిప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవరైనా రూపాయి పెడితే 2 రూపాయలు ఇవ్వడానికి బెట్టింగ్ వీరులు ఆసక్తి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూపాయి పెడుతున్న వారికి అర్ధ రూపాయి మాత్రమే ఇస్తామంటున్నారు. బీజేపీ, ఇండిపెండెంట్లు లేదా మజ్లిస్ సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రూపాయి పెట్టిన వారికి రూపాయి ఇస్తామంటున్నారు. -
కేసీఆర్కు రెండు ఓట్లు ఎలా ఉంటాయ్: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటి పేరును ముందు వెనుకాల మార్చి రెండు చోట్ల ఓట్లు పొందారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్ ఆఫ్ రాఘవరావు అనే పేరు మీద ఒక ఓటు హక్కును నమోదు చేసుకొన్నారని, గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో చంద్రశేఖర రావు సన్ ఆఫ్ రాఘవ రావు అనే పేరు మీద మరో ఓటు హక్కును నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు పేర్ల మీద ఓటు హక్కును నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఎన్నికల సంఘం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ రెండు ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయాన్ని స్వయంగా ఎన్నికల అధికారే ఒప్పుకొని క్షమాపణ కోరారని తెలిపారు. అర్హులకు ఓటు హక్కు కల్పించకపోవడం వలన తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది అర్హుల ఓట్లను తొలిగించారన్నారు. కొడంగల్లో తాను ఓడిపోతానని కేసీఆర్, కేటీఆర్లు ప్రచారం చేస్తున్నారని, ఓడకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందా? అని రేవంత్ సవాల్ విసిరారు. మహాకూటమిలో కాంగ్రెస్ తొలి స్థానంలో, టీడీపీ రెండవ స్థానంలో, టీజేఎస్, సీపీఐలు తర్వాతి స్థానంలో ఉంటాయని జోస్యం చెప్పారు. -
కొడంగల్పై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు : రేవంత్
సాక్షి, కొడంగల్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలీసుల నిర్భంధాలు.. అరాచాకాలు.. అక్రమాలు, రూ. 150 కోట్ల లావాదేవీలతో కొడంగల్ నియోజకవర్గంపై యుద్ధం ప్రకటించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రజాశీర్వాద సభ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ 2009లో మహబూబ్నగర్ ఎంపీగా ఎన్నికయ్యారని, 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. ఈ 9 ఏళ్లు కేసీఆర్ ఏనాడు కొడంగల్ ప్రజలను కన్నెత్తి చూడలేదని, కనీసం వారి జీవన విధానం ఎలా ఉందో కూడా కనుక్కునే ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. కానీ చైతన్యవంతులైన కొడంగల్ ప్రజలు.. వారు నాటిన మొక్క తన గళాన్ని ఢిల్లీ వరకు వినిపించడంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కొడంగల్ ప్రజల అభిమానాన్ని కొనుక్కోవాలని గత ఏడాది నుంచి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనికోసం రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అయినా కేసీఆర్ కోరిక నెరవేరకపోవడంతో.. అక్రమాలకు పాల్పడుతూ.. నియమ నిబంధనలు ఉల్లంఘించి కొడంగల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రలను కొడంగల్ ప్రజలు తిప్పికొట్టడంతో.. పోలీసులు, ఎన్నికల నిర్వాహణ అధికారులను మచ్చిక చేసుకుని తన అనచరులు, కుటుంబ సభ్యులపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, కొడంగల్లో 144 సెక్షన్ విధించినప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాగ్రెస్ కార్యకర్తలకే 144 సెక్షన్ వర్తిస్తుందా? అని నిలదీశారు. హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలోనే తనను పోలీసులు విడుదల చేసారని, రాబోయే 48 గంటల్లో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు జరపవచ్చని అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చాక చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్ కుమార్ -
అరెస్ట్లతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్ : అరెస్ట్లతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి అరెస్ట్పై ఆయన ట్విటర్లో స్పందించారు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్ రెడ్డి అరెస్ట్ అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఓటమి భయం వల్లే రేవంత్ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ దృష్య్టా రేవంత్ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా.. పోలీసులు ముందుస్తుగా తెల్లవారుజామున ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్పై నిరసనలు తలెత్తడంతో ఆయనను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ డీజీపీని ఆదేశించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయనను జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కొడంగల్కు తరలించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్రెడ్డి అరెస్ట్. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఓటమి భయం వల్లే అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు. pic.twitter.com/hViI6urOZe — Rahul Gandhi (@RahulGandhi) December 4, 2018 చదవండి: రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్ కుమార్ -
రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అదుపులో ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ దృష్య్టా రేవంత్ నిరసనలకు పిలుపునిచ్చినారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా.. పోలీసులు ముందుస్తుగా మంగళవారం తెల్లవారుజామున ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ అరెస్ట్పై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపడం.. ఆయన అభిమానులు కొంత మంది ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో దిగివచ్చిన అధికారులు వెంటనే విడుదల చేయాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. రేవంత్ అరెస్ట్పై హైకోర్ట్ సీరియస్.. రేవంత్ రెడ్డి అరెస్ట్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆచూకీ కోసం దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. ఎక్కడ ఉన్నారో వివరాలు ఇవ్వాలంటూ వికారాబాద్ ఎస్పీని ఆదేశించింది. ఏ ఆధారాలతో రేవంత్ను అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. దీనికి అల్లర్లు జరగవచ్చనే ఇంటలిజెన్స్ నివేదికతోనే రేవంత్ను అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానమిచ్చారు. దీంతో నివేదిక కాపీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు న్యూఢిల్లీ : రేవంత్ రెడ్డి అరెస్టుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్నేత కపిల్ సిబల్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ను అక్రమంగా తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేశారని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేదన్నారు. ఎన్నికల వేళ భయాందోళనకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చేసిన ప్రసంగంపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగానికి నోటీసులు ఇవ్వాలని, ఎన్నికలు ఉన్న చోట బీజేపీ అధికార దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
నన్ను చంపేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినా భద్రత కల్పించకుండా కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తీరా కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్, నర్సంపేట ఎన్నికల సభల్లో పాల్గొని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రేవంత్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి నివసిస్తున్న ఇంట్లో ఐటీ అధికారులు రూ.17.51 కోట్లు స్వాధీనం చేసుకుంటే ఎన్నికల కమిషన్ కేవలం రూ.51 లక్షలు మాత్రమే పట్టుబడినట్టు చెప్పడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఆ లెక్కలన్నీ ఉన్నా..: కొడంగల్లో రూ.100 కోట్లు ఖర్చయినా గెలవాలని భావించిన పట్నం బ్రదర్స్ నిజ స్వరూపం బయటపడిందని రేవంత్ అన్నారు. ఐటీ అధికారుల సోదాలో పోలీసులకు, పార్టీలు మారిన నేతలకు ఎంతెంత వెచ్చించారో రాసుకున్న లెక్కలన్నీ ఉన్నాయని, అది బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ఎన్నికల కమిషన్, ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు టీఆర్ఎస్ మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. తమిళనాడులోని ఆర్కేనగర్ తరహాలో కొడంగల్లో కూడా ఎన్నిక వాయిదా వేయించడానికి టీఆర్ఎస్ నేతలు కుట్రలకు తెరలేపారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్రావుతో పాటు మరికొంత మంది పోలీస్ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సంబంధిత అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ నిన్ను వాళ్ల చెప్పులతో కొడతా : రేవంత్
సాక్షి, రాజన్న సిరిసిల్ల : ‘నీ బిడ్డ బతుకమ్మ ఆడితే రూ.10 కోట్లు ఇచ్చినావు.. కవితమ్మ బతుకమ్మ ఆడక పోతే అర్ధ రూపాయి కూడా ఇవ్వవా’ అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండి పడ్డారు. సోమవారం చందుర్తి ప్రజాచైతన్య సభకు హాజరైన రేవంత్ రెడ్డి.. వేముల వాడ కూటమి అభ్యర్ధి ఆది శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించాలంటూ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2006లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1730 కోట్ల రూపాయలతో గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్ళు కడగాలన్న కోరికను ఆలస్యం చేసింది ఈ చెన్నమనేని కుటుంబం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో, కేటీఆర్ అమెరికాకు, చెన్నమనేని రమేష్ బాబు జర్మనీకి పోతారంటూ ఎద్దెవా చేశారు. కేసీఆర్ నిన్ను నా చెప్పుతో కాదు అమర వీరుల అమ్మల చెప్పులతో కొడతానంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ కోసం చనిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఏనాడైనా ఓదార్చావా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. అమరుల రక్తం తడి ఆరకముందే తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చిండు కేసీఆర్.. ఇంతటి దారిద్య్రం ఎక్కడైనా ఉంటదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కవితమ్మ బతుకమ్మ ఆడుడు, బోనాలు ఎత్తుకునుడు తప్ప ఇంకేమైనా చేసిందా అంటూ ప్రశ్నించారు. నీ బిడ్డ బతుకమ్మ ఆడితే 10 కోట్లు ఇచ్చినావు, కవితమ్మ బతుకమ్మ ఆడక పోతే అర్ధ రూపాయి కూడా ఇవ్వవా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు, కేటీఆర్లకు దమ్ముంటే అమరవీరుల స్తూపం దగ్గర తనతో చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రైతులు ఎవరు కూడా రుణం కట్టోద్దని కోరారు. డిసెంబర్ 11న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అధికారంలోకి రాగానే రైతులకు రెండులక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 30 కిలోల సన్నబియ్యం, 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం,10 లక్షల రివాల్వు ఫండ్ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. -
ఎట్టకేలకు... తొలి జాబితా
సాక్షి ప్రతినిధి, రంగారెడ్డి : ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం రాత్రి గెలుపు గుర్రాలను ప్రకటించింది. దాదాపు ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఏఐసీసీ వెల్లడించింది. ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టింది. వికారాబాద్ జిల్లాలో నాలుగు సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి (కొడంగల్), తాజా మాజీ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి (పరిగి), మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ (వికారాబాద్), పైలెట్ రోహిత్రెడ్డి (తాండూరు)కి టికెట్లు ఖరారయ్యాయి. వికారాబాద్ సీటు కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒక దశలో చేవెళ్ల టికెట్ లభిస్తుందని ఆశించినా ఆయనకు నిరాశే మిగిలింది. ఇక్కడ పార్టీలో కొత్తగా చేరిన కేఎస్ రత్నం వైపు అధిష్టానం మొగ్గుచూపగా.. వికారాబాద్లో మాజీ మంత్రి ప్రసాద్ అభ్యర్థిత్వానికే ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. వికారాబాద్ నుంచి పోటీచేసే అంశంపై ఆయన నేడో రేపో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే.. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), కేఎస్ రత్నం (చేవెళ్ల), తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి (కల్వకుర్తి), కూన శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్)కు టికెట్లు ప్రకటించింది. టీడీపీ ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతో కొన్ని సీట్లను ప్రకటించలేదు. అందులో శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, టీజేఎస్ పట్టుబడుతుండడంతో ఈ నియోజకవర్గాలపై పీటముడి నెలకొంది. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి బ్రదర్స్, క్యామ మల్లేష్ మధ్య టికెట్ కోసం తీవ్రపోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. కాగా, షాద్నగర్ సీటును ఇంటిపార్టీ అడుగుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదు. కుటుంబానికి ఒకటే సీటు ఇవ్వాలనే విధానపర నిర్ణయం కార్తీక్రెడ్డి అభ్యర్థిత్వానికి ప్రతిబంధకంగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇదే సీటు కోసం టీడీపీ పట్టుబడుతుండడం పెండింగ్కు కారణంగా తెలుస్తోంది. -
కాంగ్రెస్ స్క్రీనింగ్ జాబితాపై రేవంత్ బ్లాక్మెయిలింగ్
-
టికెట్ల వ్యవహారం: అలిగిన రేవంత్!
సాక్షి, న్యూఢిల్లీ : సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులు హైకమాండ్తో బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్.. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్ టికెట్ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రేవంత్ కోరుతున్న సీట్లు: 1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి) 2. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి) 3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 5. దేవరకొండ (బిల్యా నాయక్) 6. ఇల్లందు (హరిప్రియ) 7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి) 8. చెన్నూరు (బోడ జనార్దన్) -
విమర్శలు విజ్ఞతకే వదిలేస్తున్నా
సాక్షి,చిలప్చెడ్(నర్సాపూర్): నర్సాపూర్ నియోజక వర్గంలో అభివృద్ధి లేదన్న రేవంత్కు రోడ్లు, బస్డిపో, వంద పడకల ఆసుపత్రి. మండలాల్లో చెరువులు, కుంటలు, భగీరధ నీళ్లు, చెక్డ్యాంలు, గిరిజన తండాల అభివృద్ధి, తదితర విషయాలు కనబడక పోవడం ఏంటాని, తనను ఫామ్ హౌస్ కాపల కుక్క అనడం ఎంతవరకు సమంజసమో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చిలప్చెడ్ మండలంలో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన అభివృద్ధి గురించి తెలిస్తే చాలని, ఓట్ల దొంగకు తెలియాల్సిన అవసరం లేదని మదన్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మండల టిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నర్సాపూర్ ఎఎంసీ చైర్మెన్ హంసీబాయి, రాజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, లక్ష్మణ్, విశ్వంబర, పరుశరాంరెడ్డి, కిష్టారెడ్డి, యాదగిరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు.. మంగళవారం ముందుగా చిలప్చెడ్ మండలంలోని జగ్గంపేటలో ప్రచారం ప్రారంభించిన మదన్రెడ్డి గ్రామంలోని నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన ఆయన అమ్మవారి ఆశీస్సులతో మండలంలో ప్రచారాన్ని కోనసాగించారు. అక్కడి నుంచి మండల పార్టీ నాయకులతో, కార్యకర్తలతో భారీగా బైక్ ర్యాలీతో బయలుదేరిన ఆయన మండలంలోని ఆయా గ్రామాలలో ప్రచారాన్ని కోనసాగించారు. జగ్గంపేట గ్రామంలో సుమారు 100 మంది యువకులు మదన్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. -
‘రాహుల్, చంద్రబాబు కలయిక శుభపరిణామం’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుల కలయిక శుభపరిణామమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డితోపాటు సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు గురువారం ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కలసి పనిచేయడానికి రాహుల్, బాబు ముందుకు వచ్చారని, ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలసి పనిచేయడం ద్వారా దేశానికి ఒక బలమైన నాయకత్వం అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. -
నువ్వు నన్నేం పీకలేవ్!
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై కాం గ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐటీ దాడుల నేపథ్యంలో తనపై సీఎం సహా అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వంటి ఉన్నతమైన పదవికి కేసీఆర్ అనర్హుడు, అధముడంటూ తీవ్ర స్థాయిలో ఆరో పణలు చేశారు. ‘ఓటుకు కోట్లు కేసులో నన్నేం పీక లేవ్. ఏం కావాలంటే అది చేసుకో. నాపై చర్యలు తీసుకుంటే నిన్నెవరు ఆపారు. ఈ కేసులో ముందు నన్ను తాకి తర్వాత చంద్రబాబుపై వరకు వెళ్లాలి కదా’ అని కేసీఆర్కు సవాల్ విసిరారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసిన సీఎం కుటుంబం కోసమే నాలుగున్నరేళ్లు పాటుపడ్డారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం 3,152 కేసులు నమోదు చేసిందని రేవంత్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ సర్కారు కేవలం 1,150 కేసులు మాత్రమే రద్దు చేసిందని.. మరి మిగిలిన 2 వేల కేసుల కేసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఉద్యమం చేశామని, కేసులున్నాయని పదేపదే చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై ఉన్న కేసులే ఎందుకు రద్దయ్యాయో తెలంగాణ సమాజానికి వివరించాలని రేవంత్ డిమాండ్ చేశారు. మిగిలిన ఉద్యమకారులు, విద్యార్థులపై ఉన్న కేసులు ఎందుకు అలాగే ఉన్నా యో చెప్పాలన్నారు. పొటీ పరీక్షల సెలక్షన్లో తుదిదశకు వచ్చిన ఎందరో అభ్యర్థులు.. ఈ కేసుల కారణంగానే ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నా రు. ఈ దుస్థితికి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులే కారణమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 260 రైల్వే కేసులు నమోదైతే.. కేవలం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావుపై ఉన్న 10 కేసులు మాత్రమే రద్దయ్యాయన్నారు. ఈ కేసుల మాఫీతోనే కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ చేసుకున్న తెరచాటు ఒప్పందం అర్థంచేసుకోవచ్చన్నారు. అప్పుడు ముద్దు.. ఇప్పుడు వద్దా? కల్లు తాగిన కోతి.. తేలుకుడితే ఎలా ఎగురుతుందో కేసీఆర్ అలాగే ప్రవర్తిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశా రు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా చిత్రీకరించేందుకు పాట్లు పడుతున్నారన్నా రు. తెలంగాణ రాకముందు.. 2009లో చంద్రబాబు ముద్దు అన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆయన్ను వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, కాంగ్రెస్ మధ్య ‘హెలికాప్టర్లు, రూ.500కోట్ల సహా యం’ ఒప్పందం జరిగిందని విమర్శిస్తున్న సీఎం.. 2009 సమయంలో బాబు నుంచి ఎన్ని కోట్లు తెచ్చుకున్నాడో ముందు లెక్కచెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముఖాముఖిగా ఉన్న పోరులో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నా రు. మరోసారి ఉద్యమం సెంటిమెంట్ రగిల్చి.. ఓట్లు దండుకునేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ‘చంద్రబాబుకు తెలంగాణతో ఏం సంబంధం, కనీ సం ఆయనకు హైదరాబాద్లో ఓటు హక్కు కూడా లేదనే సంగతి నీకు తెల్వదా? నీకు పోటీ కాంగ్రెస్తో అన్న సంగతి మరచిపోవద్దు’ అని మండిపడ్డారు. 24గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..! ఓటుకు కోట్లు కేసులో తన నివాసంపై ఐటీ సోదాల సందర్భంగా 2 చానళ్లు, ఒక పత్రిక పదే పదే తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని రేవంత్ మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారం చేసిన ఆ చానళ్లు, పత్రిక యాజమాన్యం 24 గంటల్లో ఆధారాలు చూపాలని.. లేదంటే క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ చానళ్లు, పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. యాదాద్రి, భద్రాద్రి అని మార్చిందెవరు? ‘ప్రతి దానికి ఆంధ్ర, ఆంధ్ర అంటున్నా వు. ఆంధ్ర వాళ్ల సలహాలు, సూచనలతో నడుచుకుంటున్నది నువ్వు కాదా? తెలంగాణ యాస లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలాన్ని ఆంధ్రా యాసలో యాదాద్రి, భద్రాద్రి అని మార్చింది నువ్వు కాదా? ఈ నాలుగున్నరేళ్లలో ఏమి చేయలేదని ప్రజలకు చెప్పేందుకు భయపడుతున్నా వ్. సెంటిమెంట్ పేరుతో మరోసారి ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నావ్. ఇదే నీ చేతకాని తనం’ అని రేవంత్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్కు అమరావతి వెళ్లినప్పుడు ఈ విషయం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. -
రేవంత్ గుట్టంతా ఆ హార్డ్డిస్క్లో ఉందా?
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లో భాగంగా పలువురికి నోటీసులిచ్చిన అధికారులు విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేవంత్ అనుచరుడు, ఓటుకు కోట్లు కేసు నిందితుడు ఉదయ్ సింహ బంధువు రణధీర్ రెడ్డి వద్ద దొరికిన హార్డ్డిస్క్ హాట్ టాపిక్ అయింది. రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమంటూ రణదీర్ రెడ్డిని తీసుకెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతన్ని రాత్రి 12 గంటలకు తన నివాసం వద్ద వదిలివెళ్లారు. రణధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉదయ సింహ ఇళ్లు ఖాళీ చేస్తున్న సమయంలో తనకు ఓ కవర్ ఇచ్చాడని, అందులో ఒక హార్డ్ డిస్క్, అతని తల్లి బ్యాంక్ కీ ఉందని చెప్పారు. ఇక తనను తీసుకెళ్లింది టాస్క్ఫోర్స్ పోలీసులని, ఏ కేసు విషయంలో తనని తీసుకెళ్లారో తెలియదన్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఆ విషయాలు పోలీసులే మీడియాకు తెలియజేస్తారన్నారు. ఉదయ్ సింహా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అతను ఇచ్చిన హార్డ్ డిస్క్లో ఏముందో తనకు తెలియదన్నారు. పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారని, ఆ నోటీసులు అక్కడే మర్చిపోయానన్నారు. ఇప్పుడు స్టేషన్కు వెళ్లి తీసుకుంటానని తెలిపారు. ఆ హార్డ్ డిస్క్లో ఏముంది? రేవంత్ ప్రధాన అనుచరుడైన ఉదయసింహా ఇచ్చిన ఆ హార్డ్డిస్క్లో ఏముంది? అని, మూడు నెలల ముందే ఆ హార్డ్డిస్క్ రణదీర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, రేవంత్ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా అందులో ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఈ హార్డ్డిస్క్ చుట్టే తిరుగుతోంది. -
ఉదయసింహా బంధువు ఇంట్లో ఫేక్ ఐటి సోదాలు
-
ఉదయసింహా బంధువు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : తన బంధువు రణధీర్ రెడ్డిని ఐటీ అధికారులమని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అనుచరుడు ఉదయసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యపురి లిమిట్స్, జైపురి కాలనీలో నివసించే తన బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఆదివారం కొంతమంది సోదాలు నిర్వహించారన్నారు. ఈ సోదాల పేరిట సెల్ ఫోన్లు, నగదు, బంగారంతో పాటు రణధీర్ రెడ్డిని కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకు రాగా.. తాము ఎలాంటి సోదాలు చేయలేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. నిన్నటి నుంచి రణధీర్ రెడ్డి ఆచూకీ లేదని, మరోవైపు ఐటీ అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘ఓటుకు కోట్లు కేసులో భాగంగానే ఐటీ దాడులు’
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని ఈ కేసులో నిందితుడైన సెబాస్టియన్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆయన సోమవారం ఐటీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ సూచన మేరకే ఐటీ దాడులు జరిగాయన్నారు. స్టీఫెన్సన్కు ఇవ్వ జూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారని, తర్వాత ఇస్తామన్న రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయని తనని ప్రశ్నించారని చెప్పారు. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, స్టీఫెన్సన్ ఇంట్లో నోట్ల కట్టలు చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ తర్వాతే తనను పిలిచి అరెస్ట్ చేశారని వారికి వివరించినట్లు సెబాస్టియన్ తెలిపారు. -
రాహుల్ టూర్: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటనలో గందరగోళం చోటుచేసుకుంది. హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్ నేతలతో సమావేశం రసాభసగా మారింది. ముఖ్యనేతల జాబితాలో సీనియర్ నేత జానారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన షబ్బీర్ అలీలు అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గూడూరు నారయణ రెడ్డి బుజ్జగించి లోపలికి పంపించారు. ఇక రేవంత్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సైతం చేదుఅనుభవం ఎదురైంది. సీనియర్ల మీటింగ్ లోపలికి వెళ్లడానికి రేవంత్ రెడ్డికి పాస్ నిరాకరించగా.. సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆమె కంట తడిపెట్టారు. ఉస్మానియా విద్యార్థుల భేటీలో సైతం గొడవ చోటుచేసుకుంది. కొందరికి అనుమతి లేదనడంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హోటల్లోనే కొట్టుకున్నారు. ఈ గొడవతో విద్యార్థులతో రాహుల్ భేటీ రద్దైంది. చదవండి: టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్ -
రేవంత్రెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం సుల్తాన్బజార్లోని సీబీఐ జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రేవంత్ 18 షెల్ కంపెనీలుపెట్టి రూ.200 నుంచి రూ.300 కోట్లు మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. తన బంధువుల పేర్ల మీద శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిం చారు. కోకాపేట్లోని ఓ పార్క్ భూమిని ప్రైవేట్ కంపెనీకి రూ.17 కోట్లకు అమ్మి ప్రభుత్వాదాయానికి గండికొట్టారన్నారు. తన బావమరిది సూదిని జయప్రకాశ్, మామ సూదిని పద్మారెడ్డిలను బినామీలుగా పెట్టి కంపెనీలు నడుపుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై పూర్తిగా విచారణ జరిపి రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు రామారావు తెలిపారు. -
సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్ వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని, చుట్టాలకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దీన్ని తెస్తున్నారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసైన్డ్ భూములను అస్మదీయులకు దోచిపెట్టాలని, తన సమీప బంధువైన మైహోం సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వర్రావుకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బాగోతానికి సీఎం తెరలేపారని దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వానికి సదుద్దేశమే ఉంటే ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించకుండా, హడావుడిగా శాసనసభ, మండలిని ప్రొరోగ్ చేసి మరీ ఆర్డినెన్స్ను ఎందుకు తేవాల్సి వస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను సీఎం కేసీఆర్పైనే ఆరోపణలు చేస్తున్నానని, కావాలంటే తనపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. సీఎం బినామీ అయిన రామేశ్వర్రావు, ఆయన బంధువులు శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి తదితర పది గ్రామాల్లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల భూములను సేకరించారని, ఇందులో 1,500 నుంచి 2,000 ఎకరాల అసైన్డ్ భూములున్నాయని రేవంత్ ఆరోపించారు. వేల ఎకరాలను రామేశ్వర్రావుకు బదిలీ చేయడానికి, సీఎం బంధువైన కలెక్టర్ ద్వారా కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని, హెచ్ఎండీఏ పరిధిలోని భూముల విషయంలో సహాయ నిరాకరణ చేసినందుకే ఐఏఎస్ అధికారి బి.ఆర్.మీనాను ఉన్నపళంగా బదిలీ చేశారని ఆరోపించారు. నయీమ్ ఎన్కౌంటర్ కుట్ర గురించి తెలియాలంటే ముచ్చింతల భూముల్లో ఏం జరిగిందో ఆ గ్రామస్తులను అడిగితే తెలుస్తుందని, నయీమ్ ఎన్కౌంటర్ వెనుక ఈ భూముల చీకటి కోణం ఉందన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి... ప్రస్తుతం ప్రభుత్వం తేవాలనుకుంటున్న ఆర్డినెన్స్ 2007లోనే శాసనసభ ఆమోదం పొందిందని, అయితే న్యాయవా ది బొజ్జా తారకం కోర్టుకు వెళ్లడంతో దీని అమలు ఆగిందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ నిజంగా పేదల మేలు కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లయితే శాసనసభలో దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం–1908 ప్రకారం అసైన్డ్ భూములను రిజిస్టర్ చేసినా చెల్లదని, అలాంటప్పుడు రామేశ్వర్రావు, ఆయన బంధువుల పేరిట చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి వెంటనే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తేలి న అసైన్డ్ భూముల వివరాలు, వాటి ఆక్రమణదారుల వివరాలను ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టాలని కోరారు. మహేశ్వరం, శంషాబాద్ మండలాల్లో మై హోం గ్రూప్ అధీనంలో ఉన్న పది గ్రామాల భూముల వివరాలను బయటపెడతామని, విచారణాధికారిని నియమిస్తే ఈ విషయాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ సవాల్ విసిరారు. తన ఆరోపణలకు ప్రభు త్వం సమాధానం చెప్పాలని, ఈ వ్యవహారంపై దీర్ఘకాలిక పోరాటం చేస్తానన్నారు. -
ఛీటింగ్లో నెంబర్ వన్ కేసీఆర్ ఫ్యామిలీ : రేవంత్
హైదరాబాద్ : మోదీ ప్రభుత్వం నుంచి తెలంగాణాకు రావల్సిన వాటిపై ప్రశ్నించకుండా ..టీఆర్ఎస్ ఎంపీలు మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లారని, కేసీఆర్ కుటుంబం చీటింగ్ చేయడంలో నంబర్ వన్ అని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పోరాడుతుంటే..టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం మౌనంగా ఉండి మోదీకి మద్దతు పలికారని, సీబీఐ కేసుల భయంతోనే సీఎం కేసీఆర్ తన పార్టీ నాయకులకు ఆవిధంగా ఆదేశాలిచ్చారని వ్యాఖ్యానించారు. మోదీని పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా టీఆర్ఎస్ నాయకులను అడిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లోఫర్ పార్టీనా? మోదీని ప్రసన్నం చేసుకునేందుకే కేటీఆర్.. కాంగ్రెస్ను తిడుతున్నారని, తెలంగాణకు మొదటి సీఎం దళితుడ్ని చేస్తానన్న కేసీఆర్ మాట ఎటుపోయిందని ప్రశ్నించారు. డిసెంబర్ 31, 2017 లోగా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామన్న కేసీఆర్ మాట ఎక్కడ? అని వ్యాఖ్యానించారు. ఓట్లు అడగనని అన్న కేసీఆర్ సవాల్ ఎక్కడ పోయింది ? ఈ విషయంపై కేటీఆర్ స్పందించాలన్నారు. రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని , లేకపోతే కేసీఆర్ ఓట్లు అడగన్నది నిజం కాదా ? అని సూటిగా అడిగారు. టీఆర్ఎస్ అంటేనే లత్కోర్ పార్టీ అని, దాన్ని నడుపుతున్నది ఛీటర్స్ ఫ్యామిలీ అని అన్నారు.తెలంగాణ అమరవీరుల ఆత్మ ఘోష కేసీఆర్ కుటుంబానికి తగులుతుందన్నారు. దోచుకున్న సొమ్మును విదేశాలలో దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ టూర్లకు వెళుతున్నారన్నారు. జైలు భయం కేటీఆర్కు పట్టుకుందని అన్నారు. విదేశీ పర్యటనల్లో చేసిన ఖర్చు ఎంత ..? పెట్టుబడులేంటో ?శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కేటీఆర్కు తన సవాల్ పై చిత్తశుద్ధి ఉంటే ..కేటీఆర్ పాస్ పోర్ట్ను డీజీపీ దగ్గర డిపాజిట్ చేయాలన్నారు. -
త్వరగా విచారణ జరపండి
సాక్షి, హైదరాబాద్: పలువురికి కేబినెట్ హోదానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. దీనిపై ఆయన అనుబంధ పిటిషన్ను దాఖలు చేశారు. అనుబంధ పిటిషన్ అంశాన్ని ఆయన తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్రెడ్డి ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. వీలును బట్టి వచ్చే వారమే విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారంటూ ఇటీవల 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ పలువురు కేబినెట్ హోదా అనుభవిస్తున్నారని, ఇది కూడా లాభదాయక పదవుల కిందకే వస్తుందని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. వారి జీతభత్యాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. మంత్రితో సమానంగా కేబినెట్ హోదా పొందడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసిన తరువాత వారి హోదా చెల్లదని తీర్పునిస్తే చెల్లించిన జీతభత్యాల వసూలు కష్టమవుతుందని వివరించారు. కాబట్టి తాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని కోరారు. ఈ.బాలకిషన్, ఆర్.విద్యాసాగర్రావు, ఎ.కె.గోయల్, ఆర్.రామలక్ష్మణ్, బీవీ.పాపారావు, కె.వి.రమణాచారి, జీఆర్రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్రావు, పేర్వారం రాములు, డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, రామచంద్రుడు తేజావత్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ రేవంత్రెడ్డి గత ఏడాది జనవరిలో హైకోర్టు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పవన్ కల్యాణ్.. కేసీఆర్ దోపిడి గురించి తెలుసుకో!
సాక్షి, హైదరాబాద్ : 24 గంటల విద్యుత్ అనేదే ఓ డ్రామా దానికి ఇంకా పొగడ్తాలా అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అవినీతి గురించి తెలుసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్తో పవన్ కళ్యాణ్ భేటి కావడంపై స్పందించారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ అభినందించడాన్ని రేవంత్ తప్పుబట్టారు. తెలంగాణ విద్యుత్ కేటాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రఘు రాసిన పుస్తకం చదివితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పవన్ కళ్యాణ్కు తనకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ పుస్తకాన్ని పంపిస్తానని రేవంత్ తెలిపారు. కేసీఆర్ మాయలో పడొద్దని ఆయన పవన్కు సూచించారు. కేసీఆర్ అవినీతికి పవన్ కళ్యాణ్ను బ్రాండ్ అంబాసిడర్గా చేసుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇది గుర్తించాలని పవన్ను రేవంత్ కోరారు. కేసీఆర్ కష్టం ఏమిలేదు.. 24 గంటలు ఇవ్వడంలో కేసీఆర్ కష్టం ఏమి లేదని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో 2040 మెగవాట్ల కరెంటు ఉత్పత్తయ్యే పనులను ప్రారంభించడం, కేంద్ర ప్రభుత్వం ఉదయ్ కింద రాష్ట్రానికి విద్యుత్ కేటాయింపులు జరుపడం, దేశవ్యాప్తంగా విద్యుత్ మిగులుండటంతోనే ఇది సాధ్యమైందన్నారు.రాష్ట్ర విభజనానంతరం జనాభా ప్రాతిపాదికంగా కాకుండా వినియోగం ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరగడం కేసీఆర్కు కలిసొచ్చిందన్నారు. 24 గంటల కరెంట్ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతుందన్నారు. 24 గంటల కరెంట్ వల్ల తెలంగాణ రైతంగానికి ఎలాంటి లాభం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల 54 వేల రైతులుండగా.. ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు 90 శాతం ఉన్నారని పేర్కొన్నారు. గతంలో రాత్రిపూట కరెంట్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన టీఆర్ఎస్ ఇప్పుడెందుకు అలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు 24 గంటల అవసరం లేదని, పగటిపూట 9 గంటలు ఇస్తే సరిపోతుందన్నారు. ప్రయివేట్ కంపెనీల నుంచి వేల కోట్ల ముడుపులు తీసుకోవడం కోసమే కేసీఆర్ ఈ నాటకానికి తెర లేపారని ఆరోపించారు. -
రేవంత్ను సస్పెండ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. కాంగ్రెస్కు నైతిక విలువలు ఉంటే రేవంత్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ బ్రోకర్ దందాలు చేసి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. మాదిగలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, వర్గీకరణపై త్వరలోనే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళతామన్నారు. ఎన్నికల సమయంలో వర్గీకరణ హామీ ఇచ్చి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీని రేవంత్ ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. స్పీకర్కు రేవంత్ రాజీనామా సమర్పిస్తే, సీఎం కేసీఆర్ బలం ఏంటో చూపిస్తామన్నారు. మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని, రేవంత్ మాటలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ నియంత్రణ లేకుండా మాట్లాడుతున్నారని, చివరకు సీఎం కేసీఆర్ను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ను గెలిపించిన ప్రజలు సైతం సిగ్గుపడేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. -
... గంధర్వుడే తీర్చాడు!
♦ అక్షర తూణీరం గ్రామాలకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి కంపోస్ట్ ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని లోకేశ్ అన్నందుకే రేవంత్ పార్టీ వీడాడా? ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉంటాడు. కొంచెం పొట్టిగా పొన్నకాయలా ఉంటాడు. సమస్యలొచ్చినా హాయిగా మీసాలతో నవ్వే రసికుడు. పార్టీ ఫిరాయిం పుతో ఇటీవల వార్తల్లోకెక్కిన రేవంత్ రెడ్డి మంచి మాట కారి. చమత్కారి. ఇలాంటి వారికి దీటైన శత్రువు ఉంటే తమ వాక్బాణాలకు పదును పెట్టుకుంటారు. తెలంగా ణలో తెదేపా ఎమ్మెల్యేగా హుషారైన పాత్రే పోషించినా, అది అడవిగాచిన వెన్నెలే. అందుకని కాంగ్రెస్లో చేరా డంటే పొరబాటు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒక సారి రేవంత్ ఒక చక్కని సామ్యం చెప్పారు. ‘‘కేసీఆర్తో వ్యవహారం శివలింగం మీద తేలు మాదిరి. చెప్పుతో కొట్టలేం, చేత్తో తియ్యలేం’’ అంటూ చక్కని సామె తతో విశ్లేషించారు. మంచి రాజకీయ పరిజ్ఞానం, వయసుకు తగ్గిన కుర్రతనం రేవంత్కి అదనపు క్వాలిఫికేషన్లు. ఆ మధ్య వెలమ, కమ్మ రాజకీయ వర్గాలను సంధి సూత్రంతో కలిపి ‘వెల్కమ్’ గ్రూప్స్గా మాటకట్టాడు. రాజకీయాల్లో పార్టీ పదవులకంటే, మంచి మాటల పొందికకు జనాకర్షణ ఎక్కువ. ఇలాంటి యువనేత పచ్చకండువా పక్కనపెట్టి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మీద చాలా వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇది వ్యూహాత్మకం, అమరావతి రిమోట్గా పనిచేసే డ్రోన్ అన్నాడొకాయన. రేవంత్ ఫిరాయింపుపై రకరకాల వ్యూహాగానాలు వినిపిస్తున్నాయ్. తెలంగా ణలో తెదేపా రోజు రోజుకీ శుష్కిస్తోంది. అటు చూస్తే కేసీఆర్ ఉన్న దానికి లేని దానికి నిప్పులు చెరిగే మనిషి. ఎంతవారినైనా దద్ద మ్మలు, సన్నాసులు అనడం ఆయనకు పరి పాటి. బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో అవశే షంగా ఉంది గానీ, విశేషంగా లేదు. ఇక తెరాసకి సభల్లో కనిపిస్తున్నది కాంగ్రెస్ తల కాయలే. ‘పునరేకీకరణ’ మంత్రాన్ని తిరిగి తెరమీదికి తెచ్చి, ఈ రేవంత్ డ్రోన్ని చేతిలో పెట్టారని కొందరి ఊహ. ఎందుకంటే అధినేత దేశంలో లేని తరుణంలో ఈ బాంబు పేలింది. పైగా మంత్రివర్గ ప్రముఖులమీద విస్ప ష్టంగా ఆరోపణలు వినిపించాయి. అసలీ విస్ఫోటనా నికి పరిటాల వారింటి పెళ్లి నాంది పలికినట్టని పిస్తుంది. తెదేపా ప్రముఖులు కేసీఆర్కి భృత్యులై చరిస్తున్నారనీ, వేల కోట్ల కాంట్రాక్టులు, పరిటాల బ్రాండ్ బీర్ ఫ్యాక్టరీ నిజం కాదా అంటూ రేవంత్ గళమెత్తాడు. ఈ మాటలన్నీ ఇక్కడికంటే లండన్లో ఉన్న బాబుకి ఐదు గంటలు ముందే వినిపించాయి. అయినా రేవంత్ని ఉత్తుత్తినే కూడా కేకలు వేయ లేదు. బాబు ఉదాసీనత ఆయా నాయకులని గొప్ప అసహ నానికి గురి చేసినా, ఉలుకూ పలుకూ లేక ఊరుకున్నారు. అధినేత ఈ మొత్తం ఘట్టాన్ని ఆనందించాడు. కాగల కార్యం గంధర్వుడు తీర్చాడు. ఈ మొత్తానికి స్క్రీన్ ప్లే, డైలాగులు, నేపథ్య సంగీతం సమస్తం కొత్త క్యాపిటల్లోనే తయా రైందిట. అందుకే పార్టీ వదిలి వెళ్లే వారికి పెట్టే శాపనార్థాలేవీ రేవంత్కి పెట్టలేదు. ఇంకా చిత్రం వారాలు గడిచినా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ ఏపీ స్పీకర్కి చేరకపోవడం. టెక్నాలజీ మాన్ చంద్రబాబు ఈ జాప్యాన్ని పట్టించు కోవాలి. ఓ పెద్దాయన ఇదేం కాదండీ, అసలు కారణం వినండని మొదలు పెట్టాడు. లోకేశ్ బాబు ఒకరోజు అయిదువేలు జనాభా దాటిన గ్రామాలకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి కంపోస్ట్ ద్వారా ఏటా వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని ఉద్ఘాటించాడట. ఆ దెబ్బకి రేవంత్ అఘా తానికి గురై పార్టీ వీడాడని వివరించాడు. ఇది కూడా నావరకూ నాకు నమ్మ తగ్గట్టుగానే ఉంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆ విషయం మోదీ, సోనియాకు తెలుసు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ...కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆరే ముఖ్యమంత్రి. నరేంద్ర మోదీ, సోనియాగాంధీకి కూడా ఆ విషయం తెలుసు. కుంభకోణాలతో నిండిన కాంగ్రెస్లో మరో దొండ చేరిండు. రాహుల్ గాంధీని కుటుంబ పాలన కాదా?. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యేలు కాదా?. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ తెలంగాణ పరువు తీసిండు. రాహుల్ గాంధీనే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. రేవంత్ ఎంత?. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఎక్కడైనా పాల్గొన్నాడా?. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈసారి కొడంగల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.’ అని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదు: ఎర్రబెల్లి
తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని, ఆ పార్టీని వీడాలనుకునే వారు ముందుగా టీఆర్ఎస్ తలుపుతడుతున్నారని, రేవంత్రెడ్డి వెంట కాంగ్రెస్లోకి వెళుతున్నారని ప్రచారంలో ఉన్న నేతలంతా తనను కలసిన వారేనని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ ఇప్పటికి నాలుగు పార్టీలు మారిండు. ఇప్పుడు రేవంత్ను కలసిన నేతలంతా ముందు నన్ను కలసిన వారే. వాళ్లందరినీ తీసుకొస్తే ఎలా అకామిడేట్ చేస్తాం?.. పదవులు ఎలా ఇస్తాం?.. ఎవరైనా ఇప్పుడు టీఆర్ఎస్లో చేరడానికే ప్రియారిటీ ఇస్తారు. టీడీపీకి ఫ్యూచర్ లేదు.. అందుకే కొందరు కాంగ్రెస్లోకి వెళుతున్నారు. నాకిప్పుడు ఏ పదవీ అక్కర్లేదు. ఉన్న ఏడాదిన్నర టైమ్కు పదవి ఎందుకు? పదవి కోసం పార్టీ మారిండని అనరా?. నాకున్న పేరుకు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడైనా గెలుస్తా. కానీ నియోజకవర్గం మారను. టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు అప్పటి పరిస్థితులను బట్టి ఉంటది’అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్కు శనిపట్టినట్లే.. ‘‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళితే ఆ పార్టీకి శనిపట్టినట్లే. రేవంత్ది ఐరన్ లెగ్. అందుకే టీడీపీ నాశనమైపోయింది. మేం 30 ఏళ్లు పార్టీని అభివృద్ధి చేస్తే రేవంత్ వచ్చిన ఆరేళ్ల లోభ్రష్టుపట్టించాడు. రేవంత్ తన భాష మార్చుకోవాలి.’’ - ఎమ్మెల్యే మాధవరం రేవంత్ పోవడంతో నష్టమేమీలేదు ‘‘కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతక్క మాతోనే ఉంటారు. వారు పార్టీ మారుతారని వస్తున్న వార్తలు అవాస్తవం. కొన్ని రోజులు ఇలాంటి పుకార్లు వస్తాయి. రేవంత్ రెడ్డి టీడీపీని వీడిపోవడంతో పార్టీకి నష్టం లేదు.’’ - ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య -
రేవంత్తో పాటు టీ.టీడీపీని వీడేదెవ్వరు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్... రాబోయే ఎన్నికల్లోగా టీ.టీడీపీని ఖాళీ చేయించేందుకు భారీ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ టీడీపీ ఓటు బ్యాంక్పై కన్నేసిన హస్తం పార్టీ...రేవంత్ రెడ్డి ద్వారా పలువురు నేతలను పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలను కాంగ్రెస్లోకి వచ్చేలా మంతనాలు సాగిస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా నేతలతో చర్చలు జరుపుతోంది. వీలైనంత ఎక్కువమంది టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచనగా కనిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సైకిల్ దిగి, హస్తానికి చేయందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న టీ. టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్న రేవంత్, ఇవాళ వేం నరేందర్ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా పటేల్ రమేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్, రాజారాం యాదవ్ కూడా రాజీనామాలు చేశారు. అదే బాటలో మరికొందరు టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 31న రేవంత్తో పాటుగా మరో 30మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఓటుకు కోట్లు కేసు అనంతరం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శ వినిపిస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో టీడీపీ దెబ్బతినడానికి చంద్రబాబు తీరే కారణమని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
గొత్తికోయల దాడి వెనుక సీఎం కుట్ర
హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం: రమణ, రేవంత్ సాక్షి, హైదరాబాద్: తాడ్వాయి అడవుల్లో గొత్తికోయలపై అటవీ అధికారుల దాడి వెనుక సీఎం కేసీఆర్ కుట్ర ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్తో పాటు, జాతీయ గిరిజన హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నామని వారు తెలిపారు. తాడ్వాయి మండలం జలగలంచ అటవీ ప్రాంతంలో అధికారుల దాడికి గురైన బాధిత గిరిజనులు బుధవారం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. వీరిని ఎల్.రమణ, రేవంత్రెడ్డి పరామర్శించారు. -
బీజేపీతో కలసి పనిచేయం: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో కలసి పనిచేయాల్సిన అవస రం తమకు లేదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో రేవంత్ సోమవారం భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ టీఆర్ఎస్, కేసీఆర్ పాలనను పొగుడుతున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన బీజేపీకి చెందిన బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్కుమార్ మోదీ కేసీఆర్ను పొగిడారని గుర్తుచేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతల స్పందన ఏంటని ప్రశ్నించారు. అలాంటి బీజేపీతో పనిచేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఫీజురీయింబర్స్మెంట్, విద్యార్థుల సమస్యలపై అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తానన్నారు. -
కొత్త సచివాలయం కట్టడం మూర్ఖత్వమే
రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం కట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం మూర్ఖత్వానికి పరా కాష్ట అని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఈ పని తలపెట్టారని పేర్కొన్నారు. ఇది మూఢనమ్మకమే అవుతుందని అన్నారు. ఇప్పటిదాకా 16 మంది సీఎంలుగా పనిచేసిన సచివాలయంలో వారి కుమారులు ఎవరూ సీఎం కాలేదనే కారణంతోనే కొత్త సచివా లయం కడతారా అని ఆయన గురువారం సీఎం కేసీఆర్కు రాసిన బహిరంగలేఖలో ప్రశ్నించారు. -
అసమర్థత కప్పిపుచ్చుకోవడానికే అవార్డుల వెంట పరుగు
కేసీఆర్ కుటుంబంపై రేవంత్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ కుటుంబం అవార్డుల వెంట పరుగులు పెడుతున్నదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్రెడ్డి, రాజారాం యాదవ్, మధుసూదన్రెడ్డితో కలసి సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, రైతుల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్కు వ్యవసాయ నాయకత్వ అవార్డు వచ్చిందన్నారు. కేసీఆర్ కూతురు, ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కార్ అవార్డు, కొడుకు కేటీఆర్కు ఐటీ అవార్డు వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప రాష్ట్ర మంత్రివర్గంలో మరెవరూ పనిచేయడంలేదా అని రేవంత్ ప్రశ్నించారు. సన్మానాలు చేయడానికి, అవార్డులు ఇవ్వడానికి, దండలు వేయడానికి, చప్పట్లు కొట్టడానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేటు వసూలు చేసే సంస్థలు ఇచ్చే అవార్డులకు విలువ ఏముంటుందన్నారు. టీఆర్ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని రేవంత్ అన్నారు. ఆర్మూరులో దళితునిపైకి టిప్పర్ ఎక్కించి, కానిస్టేబుల్ శిక్షణ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులను అత్యాచారం చేసి చంపించారన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి నడిబజారులో నడిపిం చారని, నేరెళ్లలో ఇసుకమాఫియాను ప్రశ్నించిన వారిని లారీలతో గుద్దించి చంపారని, పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. మానకొండూరులో ఇద్దరు దళిత యువకులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణమైన టీఆర్ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని, 10 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. -
ప్రశ్నించడమే తప్పా: రేవంత్
సాక్షి,హైదరాబాద్:పాలకుల అకృత్యాలను ప్రశ్నించే గొంతులను నులిమేసేలా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. దళితులు, గిరిజన, బలహీన వర్గాల పోరాటంతో వచ్చిన తెలంగాణలో ఆ వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆర్మూరు, సిరిసిల్ల, ఖమ్మంలో దళితులపై జరిగిన దాడి మరిచిపోకముందే ఏపూరి సోమన్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పాలకులను ప్రశ్నిస్తూ గొంతెత్తడమే ఏపూరి చేసిన నేరమా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన పోలీసులు, టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. -
నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరేది
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి శుక్రవారం రాసిన బహిరంగలేఖలో ప్రశ్నించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేయడానికి కావాల్సిన రూ.1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకోసం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన 1800 ఎకరాల భూకేటాయింపు సాధనకోసం ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని కోరారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో భారీగా అంచనాలను పెంచుకున్నారని, వాటిని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విజ్ఞప్తులను, పోరాటాలను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలుచేసే నిర్ణయాలను ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడ్తామని రేవంత్రెడ్డి హెచ్చరించారు. -
కేసుల భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామా
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్ పాత్రపై ఇప్పటికే ఆయనను సీబీఐ రెండుసార్లు విచారించిందని, ఆ కేసుల భయంతోనే కొత్త డ్రామాకు తెరతీశారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడారు. సీబీఐ కేసులకు భయపడి బీజేపీకి మోకరిల్లుతున్నారని విమర్శించారు. జీఎస్టీ వల్ల నష్టాలను అసెంబ్లీలో చర్చించకుండా బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారని, ఆమోదించిన వారే కేసులు వేస్తామంటే చెల్లుతుందా అని ప్రశ్నించారు. కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికే మొట్టికాయలు పడతాయని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను దూరంగా పెట్టడం అవమానకరమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు లేకుండాపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వ్యతిరేకి అని ఇప్పటిదాకా తిట్టిన వెంకయ్యనాయుడును మంత్రి కేటీఆర్, తెలంగాణ ద్రోహి అని తిట్టిన తుమ్మల నాగేశ్వర్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. -
కోవింద్కు భారీ మెజారిటీ ఖాయం
టీడీఎల్పీ, బీజేఎల్పీ సమావేశంలో రేవంత్, కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలుస్తారని టీడీఎల్పీ నేత రేవంత్రెడ్డి, బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి అన్నారు. టీడీఎల్పీ, బీజేఎల్పీ పక్షాలు ఆదివారం సం యుక్తంగా సమావేశమయ్యాయి. కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ముఖ్యనేతలు మోత్కుపల్లి నర్సింహులు, నామా వెంకటేశ్వర్రావు, రావుల చంద్రశేఖర్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, అమర్నాథ్బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని రేవంత్రెడ్డి చెప్పారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కోవింద్కు అండగా ఉండాలని కోరారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ, ఓడిపోతామని తేలిపోయిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో దిగజారుడు వ్యూహాన్ని అవలం బిస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు ఓట్లేస్తారంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రామ్నాథ్ అన్ని రంగాల్లో సమర్థుడని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
డల్లాస్, డెట్రాయిట్కు సర్వీసులు నడపండి
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డెట్రాయిట్, డల్లాస్లలో నివసిస్తు న్న తెలుగు ప్రజల సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఆయన ఒక లేఖ రాశారు. ఇటీవల నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కార్యక్రమాల్లో తాను పాల్గొన్న సందర్భంలో అక్కడ నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాలు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని తెలిపారు. -
సీబీఐ కేసులతోనే మోదీకి దాసోహం
కేసీఆర్పై రేవంత్రెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: సీబీఐ కేసుల భయంతోనే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ మోకరిల్లుతున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ తెలంగాణకు సీఎం అయ్యాక నాలుగు సార్లు కేసీఆర్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారన్నారు. కేసుల నుంచి రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లనే రాష్ట్రంలో నగదు కొరత ఏర్పడి, రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, జీఎస్టీ వల్ల రాష్ట్రంపై 20వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. -
బ్యాంకర్ల తీరుపై ప్రభుత్వం కళ్లు తెరవాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణాల విషయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావే శంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బ్యాంకర్ల తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడంతో నైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. బ్యాంకర్ల తీరుపై పలు ఆందోళనల సందర్భంగా ప్రభుత్వానికి నివేదించిన అంశా లనే ఆర్థికమంత్రి ఈటల అధికారికంగా మాట్లా డారని చెప్పారు. రైతు రుణమాఫీని పూర్తిచేయ డంతోపాటు బ్యాంకుల్లో ఉన్న రైతుల పాసుపుస్త కాలను తక్షణమే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కేవలం సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు నియోజకవర్గాల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడుతున్నారని, రాష్ట్రంలో మరెక్కడా ఇళ్లు పూర్తి కావడంలేదని ఈటల మాటలతోనే తేలిపోయిం దన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రాష్ట్రంలో ప్రచారం తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆర్థిక మంత్రి వ్యాఖ్యలతో ప్రజలు అర్థం చేసుకోవాలని రేవంత్రెడ్డి సూచించారు. రైతు రుణమాఫీ వల్ల బ్యాంకులు లాభపడ్డాయని, రైతులకు ఎలాంటి ప్రయోజనమూ కలగలేదని ఆయన విమర్శించారు. -
గోల్డ్ తెలంగాణను.. ‘గోల్డ్ స్టోన్’ కిచ్చారు
- భూ దోపిడీలో కేసీఆర్, ఆయన కుటుంబీకులే భాగస్వాములు - ఘాంసిమియాగూడ భూములు కొన్న కేకే, డీఎస్లపై చర్యలేవి? - కేకే కొన్న భూముల్ని రైతులతో దున్నించిన రేవంత్, ఎల్.రమణ శంషాబాద్ రూరల్: ‘కేసీఆర్ ఈ రోజు.. గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్కు అప్పగించావు... నీవు, నీ కుటుంబం, అనుచరులు భూ దోపిడీలో భాగస్వాములు. తెలంగాణ సమాజం ముందు కేసీఆర్ ముద్దాయిగా నిలబడాల్సిందే.. కేసీఆర్కు గజ్వేల్లో గజం భూమి పోలేదేమో గానీ.. ఇక్కడ పేదోళ్ల భూములు వందల ఎకరాలు అన్యాక్రాంత మయ్యాయి..’అని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాంసిమియాగూడలో గోల్డ్స్టోన్ ప్రసాద్ అక్రమంగా కాజేసిన ప్రభుత్వ భూములను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి చేత నాగలి పట్టి భూములను దున్నించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రాజధాని, శివారు ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్ రోజు కోమాట మాట్లాడుతున్నారని, ఒకరోజు పెద్దఎత్తున కుంభకోణం వెలికి తీశామంటారు.. మరోరోజు గజం భూమి పోలేదు.. రూపాయి నష్టం జరగలే దంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మియా పూర్లో దాదాపు 700 ఎకరాలను పరిశీలిస్తే ఇప్పటికీ ఆ భూములు గోల్డ్స్టోన్ ప్రసాద్ ఆధీనం లోనే ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేశవరావు, కుటుంబ సభ్యులు ఈ భూముల్లో భూమిపూజ చేసినట్లు వెల్లడైనా చర్యలు తీసుకోవడంలేదన్నారు. భూకుంభ కోణంలో నిం దితులైన ట్రినిటీ కంపెనీ డైరక్టర్ పార్థసారథి, శర్మను అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వం.. వారికి బెయిల్ రాకుండా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించలేదన్నారు. గోల్డ్ స్టోన్ప్రసాద్ మరద లు సీఎం కార్యాలయం అధికారిగా ఉంటూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను నిర్వహిస్తుండగా.. ఆమెపై చర్యలు తీసుకోకపోగా.. సబ్రిజిస్ట్రార్లను అరెస్టు చేసి జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నిం చారు. అవినీతికి పాల్పడ్డారంటూ దళితబిడ్డ డాక్టర్ రాజ య్యను మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్.. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్య మంత్రిపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు. ఎంపీ డి.శ్రీనివాస్ అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు పత్రికల్లో వార్తలు వస్తే ఆయన నుంచి కనీసం వివరణ కూడా అడగలేదన్నారు. మీ నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ల నుంచి మొదలుపెడితే.. సీఎం కార్యాలయ సిబ్బం ది, ఎంపీలు, ఎమ్మెల్యేలు భూ కుంభకోణంలో కూరుకుపోయారని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ నేరస్తుడు నయీం పోలీ సులకు దొరుకుతాడు కాని గోల్డ్స్టోన్ ప్రసాద్ దొర కడా? అతని కోసం దేశమంతా వెతుకుతున్నారు.. కానీ సీఎం ఫాంహౌస్లో దాక్కున్నా డేమో చూ శారా..? అంటూ ప్రశ్నించారు. మీ కుటుం బానికి ప్రసాద్కు ఉన్న అనుబంధం కనిపిస్తుందని రేవంత్ ఆరోపించారు. భూకుంభకోణాలను వెలికి తీసేం దుకు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని పటిష్టం చేయాలి: రమణ ప్రభుత్వ భూముల పరిరక్షణకు భూ ఆక్రమిత చట్టాన్ని పటిష్టం చేయాలని టీటీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. భూ కబ్జాలను అరికట్టే విషయంలో సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే క్యాంపు ఆఫీసు నుంచి బయటకు వచ్చి ఘాంసిమియాగూడ ఆడపడుచుల ఆక్రందనలను వినాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి అడుగు స్థలం విలువైనదేనని, ఈ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఆ పార్ట నేతలు అరవింద్కుమార్గౌడ్, రావుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దాచిపెట్టి ఎవరి కళ్లు మూస్తారు?
మియాపూర్ భూ స్కాంపై టీటీడీపీ నేత రేవంత్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన భారీ కుంభకోణంవల్ల ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటన చేయడం ద్వారా ఎవరి కళ్లు మూస్తారని టీటీడీపీ నేత రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మియాపూర్ కుంభకోణంపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు బుధవారం బహిరంగలేఖ రాశారు. భూముల కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా ఇప్పటిదాకా నోరు మెదపకుండా ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడికి తలొంచి చేసిన ప్రకటన వాస్తవాలను దాచిపెట్టేవిధంగా ఉందని రేవంత్ విమర్శించారు. మియాపూర్ భూముల కుంభకోణాన్ని ప్రభుత్వమే బయటపెట్టిందని గొప్పలు చెప్పుకుంటున్న వారే ఇప్పుడు కుంభకోణం ఏమీలేదని చెప్పడం ద్వారా అనుమానాలను మరింత పెంచారని ఆయన పేర్కొన్నారు. కుంభకోణం ఏమీ లేకుంటే అధికారులపై కేసులు ఎందుకు పెట్టారని, ఒకేసారి 72 మంది సబ్ రిజిష్ట్రార్లను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. పలువురు అధికారులపై ఏసీబీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో సీఎం సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్లపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి సీఎం కేసీఆర్కు ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అంతు తేలేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టంచేశారు. -
సీఎం నోరెందుకు విప్పడంలేదు?
మియాపూర్ భూ కుంభకోణంపై రేవంత్, రమణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మియాపూర్ ప్రభుత్వ భూముల కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించి సీఎం కేసీఆర్ తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలని టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ డిమాండ్ చేశారు. 700 ఎకరాల ప్రభుత్వ భూకుంభకోణం వెలుగు లోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే కేసు నీరుగార్చినట్లేనన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో మియాపూర్ భూ కుంభకోణం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ అండదండలతోనే గోల్డ్స్టోన్ ప్రసాద్ ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాల్లో సీఎం పేషీలోని ఆయన సమీప బంధువు కీలకంగా వ్యవహరించారన్నారు. ఎంసెట్ లీకేజీ, నయీమ్ కేసులను అట కెక్కించిన సీఎం.. తాజాగా మియాపూర్ భూముల వ్యవహారాన్ని కూడా బుట్టదాఖలు చేసే యత్నం చేస్తున్నారన్నారు. మియాపూర్ భూ కుంభకోణం రూ.15 వేల కోట్లని, ఇవే కాకుండా.. మణికొండలోని కాందీశీకుల భూములనూ కాజేశారన్నారు. -
సూత్రధారులకు ప్రభుత్వం అండ: రేవంత్
హైదరాబాద్: వేల కోట్ల మియాపూర్ భూ కుంభకోణంలో సూత్రధారులకు, పాత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. భూ కుంభకోణం వెలుగు చూసి వారం గడుస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సోమవారం టీటీడీపీ నేతలు హైదరాబాద్లోని మియాపూర్ భూముల్లో పర్యటించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థ యాజ మాని బంధువు ఒకరు సీఎం ఆఫీసులో పనిచేస్తున్నట్లు తెలిసిందని రేవంత్రెడ్డి చెప్పారు. వారందరినీ వెలికితీయడానికి సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘మియాపూర్’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది
టీటీడీపీ నేతలు రేవంత్, ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం మియాపూర్ భూ కుంభ కోణం సూత్రధారులకు రాష్ట్ర ప్రభు త్వం కొమ్ముకాస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. భూములు రిజిస్ట్రే షన్ చేసుకున్న సంస్థ యజమాని బంధువులు సీఎం కార్యాలయంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోందని, అదేవిధంగా కొందరు ప్రముఖ నేతలు సైతం దీని వెనుక ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపు కుంటోందన్నారు. ఈ మేరకు సచివాలయంలోని సీ బ్లాక్ ఎదుట టీటీడీపీ నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమార్కు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్లోనే తెలంగాణ ద్రోహులు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నా యని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను మూడేళ్లలో నిద్రలేని రాత్రులెన్నో గడి పానన్నారు. మంగళవారం మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులని సీఎం కేసీఆర్ ఎవరిని తిట్టారో ఇప్పుడు వారంతా ఆయన పక్కనే ఉన్నారని, తెలంగాణ ద్రోహులతోనే టీఆర్ఎస్ నిండిపోయిందని విమర్శించారు. అక్కినేని అమల కుక్కలు పెంచడానికి కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చిన కేసీఆర్, అమరుల కుటుం బాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చినా ఏమీ అనొద్దా అని అన్నారు.