Sriram sagar project
-
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్తో 14 మంది చిన్నారులకు గాయాలు -
SRSP: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. 26 గేట్లు ఎత్తివేత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరుపోటెత్తుతోంది. ప్రాజెక్టులో సుమారు 2,22,216 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరాంప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు( 1091 అడుగులు నీటిమట్టం) కాగా.. ప్రస్తుతం 75 వేల టీఎంసీల ( 1087.7 అడుగుల నీటిమట్టం) నీరు ఉంది. ప్రాజెక్టులోకి వరద పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. గేట్లను ఎత్తివేయడంతో ముందస్తుగా దిగువన పరీవాహక ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసులు ఇందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలెవ్వరూ కూడా పరీవాహక ప్రాంతాలకు రావద్దని, మత్స్యకార్మికులు, పశువుల కాపరులు, రైతులు గోదావరిని దాటే ప్రయత్నం చేయవద్దని అప్రమత్తం చేశారు. -
గోదావరిలో మొసళ్లు!.. బెంబేలెత్తుతున్న భక్తులు..
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో మొసళ్ల సంచారం పెరిగింది. శుక్రవారం పుష్కర ఘాట్ వద్ద పెద్ద మొసలి కనిపించడంతో పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు ఒక్క సారిగా బెంబేలెత్తిపోయారు. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో మొసళ్లు కొట్టుకు వచ్చి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మొసళ్ల ఉనికితో నదికి వచ్చే భక్తులతో పాటు జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలు గ్రామాల్లోని చెరువుల్లో మొసళ్లు కనిపించాయి. దీంతో కొన్ని చెరువుల్లో ఇప్పటికీ మత్స్యకారులు చేపలు పట్టడం లేదు. ముప్కాల్ మండల నల్లూర్ ఊర చెరువులో రెండు పెద్ద మొసళ్లు గత ఏడాది నుంచి సంచరిస్తున్నాయి. మెండోరా మండలం బుస్సాపూర్ ఊర చెరువులో రెండు మొసళ్లు ఉండ గా ఒక మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. రెండో మొసలి గురించి ఇప్పటికీ పత్తాలేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ వద్ద కాకతీయ కాలువ పక్కన గల చిన్న చెరువులో మొసలి ఉండటంతో అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా మొసళ్లు అప్పుడప్పుడూ బయటపడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గోదావరిలోని స్నా నాల ఘాట్ వద్ద మొసలి కనిపించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మొసళ్లను గోదావరిలో వదిలి పెడుతున్నాం. గోదావరిలో నీటిలోనే మొసలి ఉంటుంది. సేద తీరడం కోసం ఒడ్డుకు వస్తుంటుంది. అలా వచ్చిన మొసలిని పట్టుకుని మళ్లీ నీరు అధికంగా ఉన్న ప్రాంతంలో వదిలేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – గణేశ్, సెక్షన్ ఆఫీసర్, మెండోరా చెరువుల్లో పట్టి నదిలో వదిలి.. చెరువుల్లో పట్టుకున్న మొసళ్లను ఫారెస్టు అధి కారులు ఎస్సారెస్పీ దిగువన గోదావరిలో వదులు తున్నారు. మెండోరా మండలం బు స్సాపూర్ చెరువులో మే నెలలో జాలరుల వలకు చిక్కిన మొసలిని దూదిగాం శివారు లోని గోదావరిలో వదిలి వేశారు. ఆ సమయంలో నదిలో నీరు కూడా లేదు. అలా వది లేస్తే గోదావరికి పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తుల పరిస్థితి ఏంటని పలువురు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం దూదిగాం శివారులో జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చి నానా హంగామా చేసింది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడో చెరువుల్లో దొరికిన మొసళ్లను పట్టుకు వచ్చి గోదావరిలో వదిలి వేస్తున్నారని, తిరిగి అవే మొసళ్లు చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయని గ్రామీ ణులు ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్ర సోమవారాల్లో గోదావరిలోకి స్నానానికి భక్తులు, నిత్యం బట్టలు ఉతుక్కోవడానికి గ్రామస్తు లు వెళ్తుంటారు. మొసళ్ల వలన ప్రమాదాల భారిన పడితే ఎవరు దిక్కు అని ప్రశి్నస్తున్నారు. పట్టుకున్న మొసళ్లను జంతు ప్రదర్శన శాలకో, జంతువుల పెంపకం ప్రదేశాలకో పంపించాలని కోరుతున్నారు. -
తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!
సోన్: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) -
TSRTC: సుందర జలపాతాలు చూసొద్దాం రండి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ప్లాట్ఫామ్ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్స్టేషన్ (ప్లాట్ఫామ్ 20) నుంచి బయల్దేరుతాయి. పర్యటనలో భాగంగా పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్: ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు) ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్ కోసం ఫోన్ : 7382842582 నంబర్ను సంప్రదించవచ్చు. (క్లిక్: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్సీల్లో చికిత్స) -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం/కాళేశ్వరం/బాల్కొండ/దోమలపెంట(అచ్చంపేట): గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ఉప నదులై న మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగుతున్నాయి. దీంతో గోదావరిలో వరద ఉదృతి పెరుగుతోంది. గోదావరిపై జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం, ఈ వరదకు మంజీర తోడవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తోంది. అలా దిగువకు వస్తు న్న వరద కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డకు.. అక్కడి నుంచి తుపాకులగూడెం బ్యారేజీలలోకి.. అక్కడి నుంచి సీతమ్మసాగర్లోకి వస్తోంది. అక్కడి నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరికి 10,36,818 క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి మట్టం 45.6 అడుగులకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూస్కుపల్లి గ్రామంలో నీట మునిగిన పత్తిచేను అప్రమత్తంగా ఉండాలి... గోదావరి ఉధృతితో ప్రభుత్వం పరీవాహక జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు సహా ఇతర అధికారులను సన్నద్ధంగా ఉంచాలని సీఎస్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణమే సెక్రటేరియట్లో కంట్రో ల్ రూమ్ను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. భద్రాచలం నుంచి పోలవరానికి వచ్చిన వరదను వచ్చినట్టుగా వదిలేస్తుండటంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,08,251 క్యూ సెక్కులు చేరుతుండగా, 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు గోదావరికి వరద కొనసాగనుంది. కాగా, ముంపు ప్రాంత ప్రజలు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో అధికారులతో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదతో తీవ్ర ఇబ్బందులు పడిన భద్రాచలం ఏజెన్సీ ప్రజలు, రైతులు.. మరోమారు ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మహదేవపూర్ మండలం అన్నారం, చండుప్రల్లి, నాగేపల్లి, పూస్కుపల్లి, కాళేశ్వరం గ్రామాల్లోని గోదావరి పరీవాహక పంటభూములు నీటమునిగాయి. శ్రీశైలంలో తొమ్మిది గేట్లు ఎత్తివేత శ్రీశైలం ఆనకట్ట వద్ద సోమవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువన సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,69,207 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో 3,02,630 క్యూసెక్కుల నీటిని నాగర్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. -
జిల్లాల్లో విస్తారంగా వానలు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రిదాకా చాలా చోట్ల వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వాన పడింది. జగిత్యాల బీర్పూర్ మండలంలో మొక్కజొన్న, పత్తి చేన్లలో నీళ్లు చేరాయి. బుగ్గారంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. కోరుట్ల మండలంలో రహదారులపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయింది. ►పెద్దపల్లి జిల్లా రామగుండం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. గంజివాగు కల్వర్టుపై వరద పారుతుండటంతో వేములవాడ–బోయినపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కోనరావుపేట మండలం కొండాపూర్ వద్ద సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై కాజ్వే కొట్టుకుపోయింది. ►జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో శనివారం కుండపోత వాన పడింది. పోతుల్వాయి వద్ద బొర్రవాగు, చిద్నెపల్లిలో వాగోడ్డుపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడురు చెరువుకు గతంలో గండి పడగా.. అది మరింత పెరిగి వరద దిగువకు పోటెత్తింది. దిగువన పొలాల్లో ఉన్న సుమారు 100 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. గుండువాగు ఉప్పొంగి జోగిపేట–టేక్మాల్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. మంజీరా నది పోటెత్తడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. దీంతో ఏడు పాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది. గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి లక్షా పదివేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 22 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద చేరుతుండటంతో 8 గేట్లు ఎత్తి 80,800 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. మొత్తంగా గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. ఇక పరీవాహక ప్రాంతం నుంచి ప్రవాహాలు వస్తుండటంతో కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. దీనితో ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి దూకుతున్న కృష్ణమ్మ ఎగువ నుంచి భారీ ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. ఇరువైపులా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదులుతున్నారు. మొత్తంగా 4,38,185 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884.3 అడుగుల నీటిమట్టం వద్ద 211.4 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి
-
నలుపు రంగులోకి గోదావరి నీరు.. ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!
బాల్కొండ/నిజామాబాద్: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది. ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్లో పాప్లెట్ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్లో చేపలకు ఆక్సిజన్ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. పరీక్షలకు పంపుతాం.. ప్రాజెక్ట్లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
SRSP: ప్రమాదపు అంచుల్లో చారిత్రక కట్టడం
-
Weekend Tourist Spot: గోదావరి తీరం.. శ్రీరాముడి విహారం..
ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్సాగర్గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్సాగర్... చక్కటి వీకెండ్ హాలిడే స్పాట్. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్ పరిపూర్ణమవుతుంది. మహాగమనం మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పుష్కర సాగర్ పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు. భవిష్యత్తులో బోటు షికారు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో బోటింగ్ పాయింట్ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. త్యాగచరిత 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు జీవం పోసుకుంది. ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి! శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్కు 50 కిలోమీటర్లలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. – చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద
-
శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు పోటెత్తిన వరద
-
TS: ప్రాజెక్టులకు భారీ వరద
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో గోదావరి దాని ఉప నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దీనితో ప్రాజెక్టులన్నీ నిండటంతో.. గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కులకుపైన వరద వస్తోంది. దీనితో 33 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లికి ఏకంగా ఐదున్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 40గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఈ వరదతోపాటు ప్రాణహిత ప్రవాహం కూడా తోడు కావడంతో కాళేశ్వరం బ్యారేజీలకు ఏడు లక్షలకుపైగా వరద కొనసాగుతోంది. 11.50 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 22 గేట్లు ఎత్తి 54,835 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, పోచారం, ఏడుపాయల వనదుర్గ, ఘనపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. -
‘వరద’ అంచనా తప్పిందా!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీటి నిల్వ, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిచేరుతున్న వరద నీటిపై ప్రాజెక్ట్ అధికారుల అంచనా తప్పిందా..! అంటే అవుననే సమాధానం వస్తోంది. గత గురువారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 4.32 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని సమాచారం వచ్చినప్పుడు ప్రాజెక్ట్లో నీటి నిల్వ 82 టీఎంసీలు ఉంది. ఆ సమయంలో వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేయాల్సి ఉండగా అధికారులు వెనకా ముందు చేశారు. కాగా, ప్రాజెక్ట్లో నీటి నిల్వ 89 టీఎంసీలకు చేరిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరద గేట్లను ఎత్తారు. దీంతో అప్పటికే ఎగువ ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ నిలిచి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అదే విధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పడుతున్న సమయంలో నీరు నిల్వ ఉంచాల్సి ఉండగా గోదావరిలోకి నీటిని వదిలారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 86 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గిపోయింది. వాస్తవానికి 86 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా జలాలను కిందకు వదలాలి. అయితే అనాలోచితంగా నీటిని వదలడం, అదే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోవడంతో ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే ఎగువ ప్రాంతాల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్న సమయంలో 89 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం ఇదే తొలిసారి. అలాగే ప్రాజెక్ట్లో నీటి నిల్వ 80 టీఎంసీలకు పడిపోయినా కూడా వరద గేట్ల ద్వారా లక్షన్నర క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలడం కూడా ఇదే తొలిసారి. కాగా, నీటి నిల్వ, విడుదల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటిస్తున్నామని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి తెలిపారు. -
పుట్టు వెంట్రుకలు కార్యక్రమంలో పుట్టెడు విషాదం..
బాల్కొండ: గోదావరి నదీ తీరం శోఖ సంద్రమైంది.. నదీమ తల్లికి పుట్టు వెంట్రుకలు సమర్పించుకునే శుభకార్యానికి హాజరైన కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాయి.. గోదావరి నదిలో మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వీఐపీ పుష్కరఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40) ఆయన ఇద్దరు కుమారులు బొబ్బిలి సిద్ధార్థ (16), బొబ్బిలి శ్రీకర్ (14), మాక్లూర్ మండలం డీకంపల్లికి చెందిన జీలకర్ర సురేశ్ (44), ఆయన కుమారుడు జీలకర్ర యోగేశ్ (14), గుత్పకు చెందిన దొడ్ల రాజు (24) గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన మృతులంతా దగ్గరి బంధువులే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల నుంచి స్వల్ప ఇన్ఫ్లో ఉండటంతో ఈ పుష్కర ఘాట్ వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఘాట్ మెట్లు దిగిన వెంటనే ఎక్కువ లోతు ఉంది. దీన్ని గమనించకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. ఉదయమే సందడిగా చేరుకుని.. మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సూర నరేశ్ కుమారుడి కేశఖండనం కోసం కుటుంబ సభ్యులు, సమీప బంధువులంతా కలసి శుక్రవారం ఉదయం వాహనాల్లో సందడిగా గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గోదావరిలోకి స్నానానికి వెళ్లారు. ముందుగా సిద్ధార్థ, శ్రీకర్, రవికాంత్, యోగేశ్లు నదిలోకి దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోసాగారు. ఇది గమనించి అక్కడే స్నానం చేస్తున్న సురేశ్, శ్రీనివాస్, రాజు వారిని కాపాడటం కోసం నీటిలోకి వెళ్లారు. రవికాంత్ నీట మునుగుతూ తేలడాన్ని గమనించిన స్థానికుడైన రాజు వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చాడు. కానీ మిగతా ఆరుగురు నీటిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని బంధువైన మానిక్ భండార్కు చెందిన పోశెట్టి గమనించి కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా గంటన్నర వ్యవధిలో ఆరుగురి మృతదేహాలు ఘాట్కు కొద్దిదూరంలో లభించాయి. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాబోయే భార్యతో వచ్చి.. ఇక మృతుల్లో ఒకరైన దొడ్ల రాజుకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. సూర నరేశ్ కుమారుడికి మేనమామ అయిన రాజు ఈ శుభకార్యానికి కాబోయే భార్యతో కలసి వచ్చాడు. కానీ మృత్యువు ఇలా కబళించుకుపోవడం ఆ కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది. గాలింపులో ముందుగా దొడ్ల రాజు మృతదేహం బయటపడగా కొనఊపిరి ఉందన్న ఆశతో 108 అంబులెన్స్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలపడంతో కుటుంబీకులు దుఖంతో వెనుదిరిగారు. ఇటు ఘటనా స్థలాన్ని అదనపు డీసీపీ రఘువీర్, ఆర్మూర్ ఏసీపీ రఘు, రూరల్ సీఐ విజయ్కుమార్ పరిశీలించారు. మిగతా వారిని కాపాడుదామనుకునేలోపే..: రాజు, ప్రత్యక్ష సాక్షి ‘మొదట నలుగురు స్నానానికి దిగారు.. నీటి ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోతుండగా.. మిగతా ముగ్గురు వారిని కాపాడేందుకు కాస్త ముందుకెళ్లడంతో మొత్తం ఏడుగురు నీటిలో కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. అందులో ఒకరు (రవికాంత్) నీటిలో మునుగుతూ..పైకి తేలుతూ.. కనిపించగా.. లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాను.. మిగతా వారిని కూడా తీసుకురావాలని ప్రయత్నించగా.. అప్పటికే వాళ్లు నీటి అడుగుకు చేరిపోయారు..’అని రవికాంత్ ప్రాణాలను కాపాడిన రాజు చెప్పాడు. రక్షణ చర్యలు శూన్యం.. పుష్కర్ఘాట్ వద్ద ప్రమాదాలు జరగకుండా నీటి పారుదల శాఖ రక్షణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కనీసం ప్రమాద హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ సంప్రదాయం ప్రకారం నదిలో తెప్పలు విడవడం కోసం అనేక మంది ఈ ఘాట్కు వస్తుంటారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండటంతో అప్పట్లో ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఈ వరద తాకిడికి ఈ ఘాట్ల వద్ద మట్టి కోతకు గురైంది. దీంతో ఘాట్ వద్ద మోకాళ్ల మట్టుకు నీరుంటే.. ఘాట్కు సమీపంలోనే ఎక్కువ లోతుంది. ఈ కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నానం చేసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత విచారం.. పుష్కర ఘాట్ వద్ద ఆరుగురి మరణం పట్ల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మృతుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఇటు దుర్ఘటన పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వీరు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. -
మెండోరో మండలం పోచంపాడులో విషాదం
-
గోదావరిలో ఏడుగురు గల్లంతు, ఆరుగురు మృతి
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు నీట మునిగారు. వీరిని గమనించిన స్థానికులు గోదావరిలోకి దూకి గాలింపు చేపట్టారు. ఏడుగురి ఒక వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ముమ్మర గాలింపు అనంతరం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా మాక్లూర్, డీకంపల్లి, గుత్స, నిజామాబాద్, ఎల్లమ్మగుట్టకు చెందిన జీలకర్ర సురేష్, యోగేష్, బొబ్బిలి శ్రీనివాస్, సిద్ధార్థ్, శ్రీకర్, దొడ్లే రాజుగా గుర్తించారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈరోజను ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నదిలోకి జారీపోయారు. వారిని కాపాడేందుకు మరో అయిదుగురు నదిలోకి దిగారు. వారిలో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. -
కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం
ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందుతుంది. ప్రధాన కాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రైతుల పొలాలకు చేరుతుంది. అయితే ముందుగా తమ క్షేత్రానికి నీరు అందాలనే ఆత్రంలో పిల్ల కాల్వలకు, గట్లకు గండికొట్టడం ద్వారా నీళ్లు మళ్లిస్తుంటారు. ఫలితంగా రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పైపెచ్చు కాల్వల ద్వారా సాగునీటిని అందించే క్రమంలో దాదాపు 30 శాతం వరకు నీరు వృథా అవుతుంది. అలాకాకుండా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందినట్లుగా... పైపుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందితే ఎలాగుంటుంది? అద్భుతం కదూ! నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు ఇలాగే పైపుల ద్వారా నీరందనుంది. పంటకు నీరు పెట్టాలనుకుంటే చేనుకు సమీపంలోని వాల్వ్ను స్వయంగా రైతులు తిప్పుకోవచ్చు. ఈ రెండు లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి సాగవుతోంది. పైపుల ద్వారా సాగునీరు అందడం వల్ల పంట మార్పిడికి అవకాశం ఏర్పడనుంది. రైతులు వరికి బదులు అరుతడి, వాణిజ్య పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాగునీటిని తీసుకొచ్చే పైపులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను అనుసంధానిస్తే సరిపోతుంది. పైపుల ద్వారా సరఫరా కాబట్టి నీటి వృథా గణనీయంగా తగ్గుతుంది. దీనికి డ్రిప్ తోడైతే... ప్రతి చుక్కా సద్వినియోగం కానుంది. చివరి ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన ఈ పైప్లైన్ వ్యవస్థ నిర్మాణాలు యుధ్ద ప్రాతిపదికన జరుగుతుండగా, ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫోర్షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టారు. ప్యాకేజీ–20లో బినోల సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.82 కిలోమీటర్ల టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో సారంగాపూర్ వద్ద పంప్హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.935 కోట్లతో చేపట్టిన ఈ పనులు 85 శాతం వరకు పూర్తయ్యాయి. సారంగాపూర్ పంప్హౌస్ నుంచి నిజాంసాగర్ కెనాల్కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు మార్గాల్లో పైప్లైన్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే 7 వేల నుంచి 8 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే పైప్లై¯Œ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్లైన్ ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. భూసేకరణ తప్పుతుంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30 శాతం వరకు ఉండగా... పైప్లై¯న్తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్లై¯న్తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చనే అంచనాతో ఈ పనులు చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అమలవుతున్న ఈ వ్యవస్థను మోడల్గా తీసుకొని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. పంప్హౌస్లో సిద్ధమైన మోటార్లు పైప్లైన్ నిర్మాణ పనులు ఇలా... ఎస్సారెస్పీ ఫోర్షోర్ నుంచి నిజాంసాగర్ కెనాల్లోకి చేరే నీటిని రెండు భాగాలుగా విభజించి నీటిని తరలించేలా పైప్లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒక పైప్లైన్ వ్యవస్థను మెట్పల్లి సెగ్మెంట్గా, మరో పైప్లైన్ వ్యవస్థను గడ్కోల్ సెగ్మెంట్గా విభజించి పనులు చేపట్టారు. ఫోర్షోర్ నుంచి నీటిని తరలించే క్రమంలో నిజాంసాగర్ కెనాల్ను 23.10 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులు, గడ్కోల్ సెగ్మెంట్కు నీటిని సరఫరా చేసే అప్రోచ్ చానల్, టన్నెల్, పంప్హౌస్ నిర్మాణ పనులను ప్యాకేజీ–21 కింద చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ.807 కోట్లతో చేపట్టగా, రూ.372 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ లభ్యత నీటిని తీసుకుంటూ మెట్పల్లి సెగ్మెంట్లో కొంత భాగానికి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి సెగ్మెంట్లో 1.15 లక్షల ఎకరాలు (11.7 టీఎంసీ), గడ్కోల్ సెగ్మెంట్లో 85 వేల ఎకరాలకు(8 టీఎంసీ) నీరందించేలా ప్యాకేజీ–21(ఎ) కింద పనులను రూ. 2,950.31 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటికే 1,430కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యతగా మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలోని ప్రధాన పైప్లైన్ వ్యవస్థను పూర్తి చేసి దీనికింద ఈ వానాకాలంలోనే 20 వేల ఎకరాలకు పైపుల ద్వారా నీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడ్కోల్ సెగ్మెంట్ పరిధిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికింద భూసేకరణ సమస్యలు ఉండటంతో దీని పనులను రెండో ప్రాధాన్యం కింద పెట్టుకున్నారు. నీటి తరలింపు ఇలా... తొలి ప్రాధాన్యంగా తీసుకున్న మెట్పల్లి సెగ్మెంట్ కింద 1.15 లక్షల ఎకరాల్లో 20 వేల ఎకరాలకు ఈ వానాకాలంలో నీటి తరలించేలా ప్రస్తుతం పైప్లైన్ వ్యవస్థ సిధ్దమైంది. నిజాంసాగర్ కాల్వల నుంచి వచ్చే 650 క్యూసెక్కుల నీటిని పైప్లైన్లోకి తోసేలా మెంట్రాజ్పల్లి (డిచ్పల్లి మండలం)లో పంప్హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 మోటార్ల ద్వారా నీటిని 92 మీటర్ల మేర లిఫ్టు చేసి నిర్ణీత నీటిని 3 మీటర్ల డయాతో ఉండే ఒకే ఒక్క పెద్ద ఎంఎస్ పైప్లోకి తరలించేలా పంప్హౌస్ను నిర్మిస్తున్నారు. ఈ పంప్హౌస్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దీనికి విద్యుత్ను అందించే సబ్స్టేషన్ నిర్మాణం పనులు వేగిరం చేశారు. ఈ పైప్లైన్లోకి నీటిని తరలించే క్రమంలో ఎలాంటి చెత్తాచెదారం రాకుండా మూడు దశల్లో నీటిని ఫిల్టర్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన పైప్లైన్ నుంచి నీటిని వివిధ జోన్ల కింది ఆయకట్టుకు తరలించేలా మరో చిన్న పైప్లైన్ వ్యవస్థ, ఈ వ్యవస్థ నుంచి జోన్ల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించేలా మరో పిల్ల పైప్లైన్ వ్యవస్థను మూడు రకాల పైపులతో సిధ్దం చేస్తున్నారు. పైప్లైన్ వ్యవస్థలో భాగంగా నిర్మిస్తున్న మెంట్రాజ్పల్లి పంప్హౌస్ ప్రధాన పైప్లైన్ 3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు ఉండే ఎంఎస్ పైపుల వ్యవస్థ కాగా, ఈ పైప్లైన్ నుంచి నీటిని 900 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు ఉండే డీఐ పైపులు, అటునుంచి 315–40 మిల్లీమీటర్లు ఉండే హెచ్డీపీఈ పైపుల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలో 88.17 కిలోమీటర్ల మేర ఎంఎస్ పైపుల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందులో 75.37 కిలోమీటర్ల వ్యవస్థ పూర్తయింది. 192 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్లైన్లో 114 కిలోమీటర్లు, 3,319 కిలోమీటర్ల హెచ్డీపీఈలో 1,052 కిలోమీటర్లు మేర పూర్తి చేశారు. పెద్ద పైపులైన్ నుంచి డీఐ, హెచ్డీపీఈ పైపులకు నీటిని తరలించే క్రమంలో ఓఎంఎస్ చాంబర్, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎంతమేర నీటిని తరలించాలి, ఏ ప్రాంతానికి నీటిని తరలించాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర నీటిని తరలించేలా పైప్లైన్ వ్యవస్థ 95 శాతం పూర్తవగా, మార్చి చివరికి 100 శాతం పనులు పూర్తి చేయనున్నారు. కొన్ని అడ్డంకులు... ఈ పైప్లైన్ పనులకు ప్రధానంగా భూసేకరణ లేకున్నా... రైతులు సాగు చేస్తున్న భూముల్లోంచే పైపులు వేయాల్సి ఉంది. భూమిని తవ్వి 1.20 మీటర్ల దిగువన పైపులు వేయాలి. ఆ లైన్లు వెళుతున్న మార్గాలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న భూములే కావడంతో పనులకు రైతులు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ పనులు సాగని రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మాత్రమే పైపులు వేయాల్సి వస్తోంది. దీంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులు వెళ్లే భూములకు నష్టపరిహారం చెల్లిస్తే యాసంగి సీజన్లో పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ సహా ప్రజాప్రతినిధులు కోరినా ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో రైతుల సమ్మతి దొరికిన చోటే పనులు కొనసాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓఎంఎస్ ఛాంబర్స్, డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్స్ నిర్మాణాలకు గుంట కన్నా తక్కువ భూమే అవసరమవుతున్నా, దాన్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక రెండు చోట్ల రైల్వే క్రాసింగ్, నేషనల్ హైవే క్రాసింగ్లు వెళుతున్నాయి. మరోవైపు నిజాంసాగర్ కాల్వల వెడల్పుకు దాని పరిధిలోని భూ ఆక్రమణలు, పంటల సాగు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. ఈ చాంబర్లు ఎలా పనిచేస్తాయంటే.. చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ఓఎంఎస్ (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్) చాంబర్ ఏర్పాటు చేస్తుండగా, ఈ ఛాంబర్లోకి వచ్చిన నీటిని 3 నుంచి 6 ఔట్లెట్ పైపుల ద్వారా బయటకు పంపించేలా ఏర్పాట్లుంటాయి. ఔట్లెట్ పైపుల ద్వారా నీటిని తరలించే వాల్వ్లను పూర్తిగా సాంకేతిక సహాయంతోనే ఆపరేట్ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎంతమేర నీటిని తరలిస్తున్నారన్నది తెలుసుకునేలా దీనిలో వాటర్ మీటర్, ప్రెషర్ మీటర్లు అమర్చారు. దీనికి అవసరమయ్యే విద్యుత్కై సోలార్ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన 20 వేల ఎకరాల పరిధిలోనే 1,892 ఓఎంఎస్ చాంబర్స్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి ఔట్లెట్ ద్వారా తరలించే ఒక్కో పైప్లైన్కు దిగువన ప్రతి 3 ఎకరాలకు నీటిని అందించేలా మళ్లీ 5–7 వరకు చిన్న పైపుల ద్వారా నీటిని తరలించేందుకు డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాంబర్స్లో ఉండే పైపులన్నింటికీ వాల్వ్లను బిగించారు. అవసరమైతేనే నీటిని వాడుకునేలా ఈ వాల్వ్లు ఉపయోగపడతాయి. వాటిని రైతులే ఆపరేట్ చేసుకుంటారు. -
వెయ్యి చెరువుల తోట.. హరిత సూర్యాపేట
నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలేమోగానీ పశువుల తాగునీటికి కటకటే. చెరువులు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయి కనిపించేవి. వర్షాధార పంటలతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఆ గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయ్. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో ఆకుపచ్చ తివాచీ పరచినట్లు కనిపిస్తోంది. సాక్షి: హైదరాబాద్: జలం ఉంటేనే జీవం. పచ్చని పంటలు. గొడ్డూ గోదా. ఊరంతా కోలాహలం. రైతు కళ్లలో వెలకట్టలేని ఆనందం. సొంతూరిని నమ్ముకొని సాఫీగా సాగే బతుకులు. కాలం కాకపాయె... కలలు చెదిరిపాయె! అవన్నీ పదిహేను, పదహారేళ్ల కిందటి వరకు నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలు పక్కనపెడితే కనీసంగా పశువులకు తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితులు లేక బోసిపోయి కనిపించేవి. చెరువుల్లో నీరు లేక బావులు అడుగంటగా, బోర్లలో నీరు పాతాళానికి చేరిపోయేది. అలాంటి పరిస్థితుల్లో వర్షాధార సాగుతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. అమ్ముకుందామన్నా భూములకు ధరలు లేక...ఊళ్లకు ఊళ్లే వలసలతో బోసిపోయేవి. అలాంటి గ్రామాలకు ఇప్పుడు కొత్త మురిపెం వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో పచ్చగా కనిపిస్తోంది. వేసవి సమయంలోనూ చెరువులు అలుగు దుంకుతుండటంతో పరీవాహక పల్లెలు పులకిస్తున్నాయి. నిండిన చెరువుల కింద సాగు పెరగడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతుల సంబురం అంబరాన్ని అంటుతోంది. సంబురం నింపిన గోదారి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. రూ.1,220 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కాకతీయ కాల్వల తవ్వకంతో పాటు 14 నీటి పంపిణీ కాల్వలు (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వకం చేశారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలో డీబీఎం–69, 70, 71 కింద 156 గ్రామాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 900ల వరకు చెరువులున్నాయి. వీటిని 2019 నవంబర్ నుంచి నింపుతూ వస్తున్నారు. గతేడాది ఖరీఫ్లో నీటి లభ్యత ఉండటంతో ఈ చెరువులకు నీటి విడుదల అవసరం పడలేదు. చదవండి: (‘ఎల్ఆర్ఎస్’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన) ప్రస్తుతం యాసంగి సాగు జరుగుతుండటంతో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. అందులో భాగంగానే చివరి చెరువు వరకు నీరు చేరుతోంది. చిట్టచివర ఉన్న చెరువులను మొదట నింపేలా టెయిల్–టు–హెడ్ విధానం ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులన్నీ 100% నిండుతున్నాయి. వాటి కిందే 55 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇంతవరకూ గోదావరి జలాలను ఎరుగని పరీవాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వల కారణంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ కాల్వలకు లైనింగ్ చేయకపోవడం కొంత ఇబ్బందిగా మారుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.300 కోట్లతో కాల్వల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినా అవి ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఈ కాల్వల లైనింగ్ పనులు పూర్తయితే పూర్తి సామర్థ్యంతో కాల్వలకు నీటిని పారించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఆనవాళ్లు కోల్పోయి... ఇప్పుడదే ఆదరువు ఈ చెరువు సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పెద్దచెరువు. కాకతీయుల కాలం నాటికి ఈ చెరువు ఫీడర్ చానళ్లు పూడుకుపోయి, పరీవాహకమంతా ధ్వంసమై పదిహేనేళ్లుగా వట్టిపోయి కనిపించేది. నీటి చుక్క కనిపించక దీని చుట్టూతా ఎడారిని తలపించేది. దీని పరిధిలోని 324 ఎకరాల ఆయకట్టులో ఎన్నడూ పదిహేను శాతం కూడా సాగైంది లేదు. అలాంటిది ఇప్పుడు 400 కిలోమీటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలతో పులకిస్తోంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఏకంగా అలుగు దుంకుతోంది. పెద్దపెద్ద చేపలు చెరువులో సందడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ముంబైకి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయానికి పనికిరాని గుట్టలను సైతం నీళ్లొచ్చాయన్న సంతోషంతో చదును చేసి పంట సాగు మొదలుపెట్టారు. ‘ఈ చెరువు నిండక ముందు మూడెకరాల్లోనే సాగు చేసే వాణ్ని. కానీ ఇప్పుడు ఏడెకరాల్లో వరి సాగు చేశా. మొత్తం పంటకు నీరందుతోంది. బోర్లు, బావుల వాడకం పూర్తిగా తగ్గించా’అని ఆ చెరువు పరిధిలోని ఆయకట్టు రైతు అనంతుల సత్తయ్య పేర్కొన్నారు. పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఇంజనీర్లు ‘సారు'ంటే.. గుండెలు పొంగేవి! ఈ చెరువు దివంగత సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్రావు స్వగ్రామం జాజిరెడ్డి గూడెంలోని తీగల చెరువు. పక్కనే మూసీ నది పారుతున్నా ఏనాడూ నిండింది లేదు. చిన్నపాటి లిఫ్టు ద్వారా ఈ చెరువు, దాని పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలని తలంచినా సాధ్యపడలేదు. అయితే విద్యాసాగర్రావు చొరవతో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులను పూర్తి చేయడంతో ఈ చెరువు ప్రస్తుతం నిండి దీని కింద ఆయకట్టు 800 ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ చెరువులోకి నీళ్లొచ్చాకే ఇక్కడ ఎకరం భూమి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరిగింది. ‘నిండని చెరువుతో అరకొరగా వ్యవసాయం చేసే వాళ్లంతా నీళ్లొచ్చాక రెండు పంటలు సాగు చేస్తున్నారు. కందులు, పెసలు, పత్తి సాగు చేసే వాళ్లు వరికి మళ్లారు. ఎకరాకి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గతంలో 8 బోర్లు వేసినా పడలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎస్సారెస్పీ కాల్వల లైనింగ్ జరిగితే మరింత మేలుంటుందని గ్రామానికి చెందిన రైతులు పున్న హరిప్రసాద్, చింత నర్సయ్యలు పేర్కొన్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నాగారం మండల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వలకు దగ్గరగా కొత్తగా సాగులోకి వస్తున్న భూమి. కాల్వల్లో నీరు పారకం ఇకపై ఆగదన్న భరోసాతో ఇప్పటికే కొంత పొలంలో నాట్లు వేయగా, మరింత బీడు భూమిని సాగులోకి తెచ్చేలా రైతులు దున్నటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంత బీడు భూమిని సాగులోకి తెచ్చే యత్నాల్లో ఉండగా, ఇకముందే మొత్తం భూమిని సాగు చేస్తానని రైతులు చెబుతున్నారు. రావి చెరువు పక్కన కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని మాచవరం గ్రామంలోని రావి చెరువు. 0.24 టీఎంసీ సామర్థ్యం గల ఈ చెరువు 16 ఏళ్లలో ఏనాడూ నిండింది లేదు. దీని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉండగా బోర్లు, బావుల కిందే ఆరుతడి పంటల సాగు జరిగేది. ఈ చెరువు కింద ఏనాడూ రెండో పంట వేసింది లేదు. వేసవి వస్తే బోర్లు పనిచేయక, తాగునీరు లేక ట్యాంకర్లు పెట్టి ఇంటింటికీ బిందెలను లెక్కగట్టి సరఫరా చేసేవారు. అలాంటి చెరువు ప్రస్తుత సమయంలోనూ నిండుకుండను తలపిస్తోంది. కాళేశ్వరం నుంచి 450 కి.మీ. దూరం దాటుకొని ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా వచ్చిన గోదారి జలాలతో కళకళలాడుతోంది. మూడుకిస్తామన్నా పోలే... ఇప్పుడు ఎకరా రూ. 30 లక్షలు నిర్ణీత ఆయకట్టుకు అదనంగా మరో 200 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నీళ్లు నిండుగా ఉండటంతో గతంలో 15–18 మీటర్ల దిగువన ఉండే భూగర్భ జలాలు ప్రస్తుతం 3 మీటర్లలోనే లభ్యతగా ఉన్నాయి. ‘16 ఏళ్లలో ఎప్పుడూ చెరువు నిండలేదు. ఎన్నోసార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి చెరువుల్లో చేపలు భారీగా చేరాయి. 8 నెలలు చేపలనే తింటున్నారు. ఒక్కోటి 6–8 కిలోలు ఉంటుంది’ అని గ్రామానికి చెందిన మురహరిరెడ్డి, బొబ్బయ్యలు తెలిపారు. తెలంగాణ వస్తే ఏ మొస్తుందన్న దానికి... ఈ ఊరికే చేరిన నీళ్లే తార్కాణమని ఎంపీపీ నిమ్మాది భిక్షం పేర్కొన్నారు. నీళ్ల రాకతో రూ. 3 లక్షలు కూడా రాని ఎకరా పొలం ఇప్పుడు రూ. 30 లక్షలు పలుకుతోందని చెప్పారు. తీగలచెరువు -
పక్షం రోజులు.. 127 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సారి భారీ వరద పోటెత్తింది. పక్షం రోజుల్లోనే ఏకంగా 127 టీఎంసీల మిగులు జలాలు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి 15 రోజులుగా రోజూ లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలు తరలివస్తున్నాయి. దీంతో ఎస్సీరెస్పీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి సుమారు 234 టీఎంసీల నీరు వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు నిండిపోగా, మిగిలిన జలాలను గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. అలాగే, కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 28 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఉంచుతారు. దీంతో అక్టోబర్లో కూడా ప్రాజెక్టుకు వరద జలాల రాక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి భారీగా సిల్ట్ చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. ఐదేళ్లలో ఇన్ఫ్లో ఇలా.. ఇదిలా ఉండగా గత ఐదేళ్లలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ప్రవాహాలను పరిశీలిస్తే.. 2014–15లో కేవలం 14.77 టీఎంసీలు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. 2015–16లో మరీ తక్కువగా 4.42 టీఎంసీల ఇన్ఫ్లో మాత్రమే వచ్చి చేరింది. ఇక 2016–17లో 254 టీఎంసీలు రాగా, 2017–18లో 85 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20లో 87 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. ఈసారి ఇప్పటికే 234 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. రబీ పంటలకు భరోసా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది. స్టేజ్ –1 పరిధిలో 9.68 లక్షల ఆయకట్టు ఉండగా, స్టేజ్–2లో మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీ పంటలకు కూడా సాగునీరందనుంది. దీంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. -
నిండుకుండలా వున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
-
దిగువమానేరు, శ్రీరాం సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, మీడ్ మానేర్ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్ మానేర్కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్కు వదులుతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు అవుట్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు వరద గేట్ల ద్వారా రెండు లక్షలు, కాలువల ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటి విడుదల పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు లోయర్ మానేరు డ్యామ్ 20 గేట్లు ఎత్తి, 57652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల. ఇన్ ఫ్లో 59961 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 59961 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 24.034 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 23.645 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి, 72509 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఇన్ ఫ్లో 72518 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 73157 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 19.397 టీఎంసీలు. -
తరలివచ్చిన జలతరంగిణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్ మరింత పెరిగింది. చరిత్రలో తొలిసారి.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్టేజ్–1 కింద 9.6 లక్షలు, స్టేజ్–2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గతేడాది వర్షాకాల సీజన్లో కురిసిన వర్షాలతో 159 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. ఇందులోంచి ఖరీఫ్లో నీటి వినియోగం పెద్దగా చేయలేదు. దీంతో యాసంగి మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 89 టీఎంసీల మేర లభ్యత ఉండటంతో స్టేజ్–1 కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకున్న 4.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి గతేడాది డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా నీటిని 4 తడుల ద్వారా విడుదల చేసి సాగునీరిచ్చారు. దీనికే ఇప్పటి వరకు 25 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు 58 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. లభ్యత నీటిలోంచి మరో 3 తడుల ద్వారా 20–25 టీఎంసీల మేర నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన స్టేజ్–1 కిందే ఉన్న మరో 5లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎల్ఎండీకి ఎత్తిపోసిన నీటితో సాగునీరిచ్చారు. స్టేజ్–1 కిందే మొత్తంగా 9.5 లక్షల వరకు ప్రస్తుతం సాగునీరందింది. ఇక స్టేజ్–2 కింద 3.97లక్షల ఎకరాలకు గానూ 2.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. దీంతోపాటే 592 చెరువులను నింపుతున్నారు. ఎల్ఎండీ దిగువన మొత్తం 44 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. టెయిల్ టు హెడ్ అనే పద్ధతిన నీరు పంపిణీ చేయడంతో ఆయకట్టు చివరి జిల్లా అయిన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి గోదావరి నీళ్లు చేరాయి. మొత్తంగా ఎస్సారెస్పీ కింద చరిత్రలో తొలిసారి 12 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 69 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గడిచిన పదేళ్లలో యాసంగిలో జరిగిన వినియోగాన్ని పరిశీలిస్తే గరిష్టంగా 2010–11 ఏడాదుల్లో 57.96 టీఎంసీలుగా మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 69 టీఎంసీల మేర వినియోగం పూర్తవ్వడం, మరింత నీటి వినియోగానికి సిద్ధంగా ఉండటంతో మార్చి చివరికి 100 టీఎంసీల మార్కును దాటే అవకాశాలున్నాయి. పునరుజ్జీవంతో మరింత మేలు.. ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు. గత పదేళ్లలో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీరు, వినియోగం.. (టీఎంసీల్లో) సంవత్సరం వచ్చిన వరద నీటి వినియోగం 2009–10 27.34 13.61 2010–11 308.82 57.96 2011–12 174.20 33.67 2012–13 54.73 27.38 2013–14 320 56.60 2014–15 14.77 4.11 2015–16 4.42 1.61 2016–17 356.26 43.47 2017–18 75.31 33.42 2018–19 77.17 17.10 2019–20 159 69 -
చేపలు పోతున్నాయి!
సాక్షి. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టిన, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చిన ప్రాజెక్ట్ నుంచి చేపలు వెళ్లిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరద కాలువ హెడ్రెగ్యులేటర్కు జాలి గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ హైలెవల్లో ఉండటంతో నీటి విడుదల సమయంలో చేపలు, చేప పిల్లలు కాలువలో వెళ్లిపోతున్నాయి. దీంతో జలాశయంలో చేపలు, చేపపిల్లలు ఖాళీ అవుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. వరద కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద జాలి గేట్లు కావాలని ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మత్స్య కారులు అంటున్నారు. జాలి గేట్లు ఏర్పాటు చేస్తే 90 శాతం చేపలు, చేపపిల్లలు బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉండదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు జాలి గేట్లు అమర్చుతామని పాలకులు వచ్చి సందర్శించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మోక్షం లభించలేదు. దీంతో వరద కాలువ ప్రవహించిన ప్రతిసారి మీనాలు కాలువలో పోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్పై చేపలు వేటాడుతు ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చేపల వేటకు వస్తుంటారు. కాకతీయ కాలువ, ఇతర కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పు డు చేపలు, చేపపిల్లలు చాలా తక్కువగా కాలు వల్లో కొట్టుకుపోతాయంటున్నారు. వీటికి జాలి గేట్లు ఉన్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వరద కాలువ హెడ్ రెగ్యులేటర్కు జాలి గేట్లను అమర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కాలువలో చేపల వేట ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల జరిగినప్పుడు అధికంగా చేపలు బయటకు వెళ్తాయి. దీంతో కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద కొందరు చేపలు పడుతున్నారు. మత్స్యకారులే కాకుండా ఇతరులు కూడా చేపలను పట్టుకుంటారు. దీంతో మత్స్య సంపద తరలి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాలి గేట్లు నిర్మించాలి వరద కాలువకు జాలీ గేట్లను నిర్మించాలి. లేదంటే నీటి విడుదల చేపట్టినా రోజులు వరద కాలువలో చేపలు అధికంగా బయటకు పోతాయి. దీంతో తీవ్రంగా నష్టపోతాం. – కిషన్, మత్స్యకారుడు లాభం ఉండటం లేదు ప్రభుత్వం ప్రతి ఏటా ప్రాజెక్ట్లో చేపపిల్లలను వదులుతుంది. కానీ వరద కాలువ ప్రవహిస్తే కాలువలోనే అనేక చేప పిల్లలు కొట్టుకు పోతున్నాయి. దీంతో లాభం ఉండటం లేదు. జాలి గేట్లు ఉంటే ఇంత నష్టం జరగదు. – గణేశ్, మత్స్యకారుడు మంత్రికి విన్నవించాం వరద కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద జాలి గేట్ల కోసం మంత్రి ప్రశాంత్రెడ్డికి విన్నవించాం. ఆయన సానూకూలంగా స్పందించారు. జాలీ గేట్లు పెడితే మత్స్యసంపద తరలిపోదు. – గంగాధర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, బాల్కొండ -
తుది నుంచే మొదలయ్యేలా..
సాక్షి, హైదరాబాద్: తాగునీరు దొరక్క..సాగునీరు లేక అల్లాడుతున్న కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలు ఊపిరిపోస్తున్నాయి. తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగు అవసరాలు తీర్చేందుకు పాతికేళ్ల కింద జీవం పోసుకున్న ఎస్సారెస్పీ–2 ప్రణాళికలు ఇప్పుడు పట్టాలెక్కి, పనులు పూర్తి చేసుకొని నీటి పరవళ్లను సంతరించుకుంటున్నాయి. ఎంత నీరు పారించినా చివరి ఆయకట్టుకు నీరే లేదన్న అపవాదును దాటేందుకు చిట్టచివరి ఆయకట్టుకే మొదట నీరిచ్చేలా కార్యాచరణ రూపొందించి దానిలో నీటిపారుదల శాఖ అధికారులు సఫలీకృతులయ్యారు. అనేక అవాంతరాలు దాటుతూ ఎస్పారెస్పీ–2 కింద నిర్ణయించిన చెరువులు నింపుతూ, పూర్తి ఆయకట్టుకు నీటి లభ్యత పెంచుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబా బాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిం చాలని నిర్ణయించారు. మొత్తంగా రూ. 1,043 కోట్లతో ఈ పనులు చేపట్టగా రూ. 1,220 కోట్లకు దీన్ని సవరించారు. నిజానికి ఈ కాల్వ పనులకు 1995–96 మధ్య కాలంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు జీవం పోశారు. అయితే వివిధ కారణాలతో పనులు మొదలవ్వలేదు. అనంతరం వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పనుల్లో వేగం పెంచారు. 2006 ఫిబ్రవరి 27న కాకతీయ కాల్వల విస్తరణకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆయన హయాంలోనే పనులు మొదలైనా, ఆయన మరణానంతరం పనులు మళ్లీ నెమ్మదించాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తూ పనులు పూర్తి చేస్తూ వచ్చింది. చివరి నుంచి మొదటికి.. సాధారణంగా ప్రాజెక్టుల నుంచి నీటిని ముందుగా ఉన్న చెరువులు, ఆయకట్టుకు నీరిస్తూ, చివరి ఆయకట్టు వరకు సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుత విధానంతో ఏ ప్రాజెక్టుల కిందా చివరి ఆయకట్టు లేక చెరువు వరకు నీటి సరఫరా అయిన సందర్భాలు లేవు. కాల్వల పూర్తిస్థాయి సామర్ధ్యంతో నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే చివరి భూములకు, చెరువులకు నీరు చేరుతుంది. తక్కువ సామర్ధ్యంతో నీటి సరఫరా చేస్తే చివరి ఆయకట్టుకు నీరు చేరడం గగనమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం గోదావరి నీటిని ఎస్సారెస్పీ దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యామ్నుంచి పూర్తి స్థాయి సామర్ధ్యం 3,500 క్యూసెక్కుల నీటితో నీటిని సరఫరా చేస్తూ సూర్యాపేట జిల్లాలో చిట్టచివర ఉన్న పెన్పహాడ్ మండలంలోని మాచారం రాయి చెరువు నుంచి నీటిని నింపుతూ వస్తున్నారు. చిట్టచివర ఉన్న ఈ చెరువు నుంచి మొదలుకు నీటిని నింపుతూ ఇప్పటివరకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో 262 చెరువులు నింపారు. ఈ చెరువుల కిందే 22,800 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. అనంతరం మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్ రూరల్ జిల్లాలోని చెరువులు కలిపి మొత్తంగా 592 చెరువులు నింపనున్నారు. టెయిల్ టూ హెడ్ అనే ఈ పద్ధతి ద్వారా చివరి ఆయకట్టు నుంచి తొలి ఆయకట్టు వరకు 3.97 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది. ఇంతవరకూ ఎన్నడూ గోదావరి జలాలను ఎరుగని పరివాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వలు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద ఐదు ఎకరాలేశా ఈ వాన కాలంల బోరుతో ఎకరా ముప్పై గుంటలు సాగు చేసిన. బోరు అడుగంటిపోయి పొలం ఎండిపోయింది. కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురవడంతో పాటు ఎస్సారెస్పీ నీటితో చెరువూ నిండింది. నాకు ఉన్న ఐదు ఎకరాలు సాగు చేసిన. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఎస్సారెస్పీ నీటితో చెరువును నింపడంతో వచ్చే యాసంగిలో కూడా ఐదు ఎకరాలు సాగు చేస్తా’. – గాయం నర్సిరెడ్డి, రైతు, ధర్మాపురం బోరు కింద వరిసాగు చేశా ఈ వాన కాలంల మంచి వర్షాలే కురవడంతో బోర్ల కింద నాకున్న 18 గుంటలు పంటలేశా. కానీ యాసంగిల మాత్రం నీళ్లు లేక పంటల సాగు చేసి ఏళ్లవుతోంది. ప్రతి యాసంగికి భూములు బీడే. ఈసారి గోదారి నీళ్లొచ్చినయ్. రాయి చెరువు నిండింది. తిండి గింజల మందం సాగు అవుతుంది’. –వీరబోయిన కృష్ణ, రైతు, మాచారం పత్తి పంటను సాగు చేశా రాయి చెరువు ఆయకట్టు కింద కౌలుకు తీసుకొని 20 ఎకరాలు పత్తి సాగు చేశాను. రాయి చెరువు నిండితే యాసంగి ఐదు ఎకరాలు వరి పంట సాగులోకి వస్తుంది. ఇప్పటికే రాయి చెరువులోకి ఎస్సార్ఎస్పీ నీరు వచ్చి కొత్త ఆశలు నింపింది. ఇక రబీకి నీటి గోస ఉండదనే అనుకుంటున్నాం’. – లాలు, రైతు, గూడెపుకుంట తండా రైతుల్లో నమ్మకం పెరిగింది ‘ఎస్సారెస్పీ–2 పరిధిలో చిట్టచివరి ఆయకట్టుకు ఎన్నడూ నీరు పారింది లేదు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, గోదావరి జలాల లభ్యత ఎక్కువగా ఉండటంతో టెయిల్ టూ హెడ్ విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానం ద్వారా చివరి ఆయకట్టు, చెరువు నుంచి నీళ్లిచ్చుకుంటూ మొదటికి వస్తాం. దీనివల్ల ప్రతి ఎకరాకి నీరందుతుంది. నీటి కోసం కాల్వలకు ఎక్కడా రైతులు గండ్లు కొట్టకుండా రైతులను సమన్వయ పరుస్తున్నాం. ఇంజనీర్లు, ఇతర శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్గిస్తున్నారు. రైతుకు నీళ్లొస్తాయనే నమ్మకం కలిగించాం. ఇంతటితో ఆగకుండా కాల్వల ఆధునికీకరణ జరిగితే రైతుకు మరింత మేలు జరుగుతుంది’. – నాగేంద్రరావు, ఈఎన్సీ, సీఈ, ఎస్సారెస్పీ–2 -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు నిండింది. మహారాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరుతుండటంతో మూడేళ్ల అనంతరం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి 83 వేల క్యూసెక్కుల భారీ వరద పోటెత్తడంతో సోమవారం ఉదయం 16 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా మరో ఐదు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు.. మొత్తం 83 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ప్రాజెక్టులోకి 83 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీ) అడుగులు. మూడేళ్ల తర్వాత..: మూడేళ్ల అనంతరం ఎస్సారెస్పీ గేట్లను ఎత్తారు. 2016 సెప్టెంబర్లో ఇలాగే భారీగా వరద జలాలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి అప్పట్లో లక్షలాది క్యూసెక్కులు నదిలోకి వదిలారు. 2013లోనూ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఇలా ప్రతి మూడేళ్లకు ఒకసారి గేట్లు ఎత్తే పరిస్థితి నెలకొంది. గత ఏడాది 2018 అక్టోబర్ 21న ప్రాజెక్టులో కేవలం 41 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. 2017లోనూ ప్రాజెక్టు పూర్తిగా నిండలేదు. 2015లో ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. కానీ ఈసారి అక్టోబర్లో ప్రాజెక్టు నిండటం అరుదని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పోటెత్తారు. -
ఎస్సారెస్పీలో జలకళ
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్లో ఆలస్యంగా అయినా చెప్పుకోదగ్గ నీటి ప్రవాహాలు రావడంతో పరీవాహక ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులోని నీటి నిల్వలతో ఖరీఫ్ పంటలకు చివరిదశలో అయినా 2, 3 తడులకు నీరందే అవకాశాలు మెరుగయ్యాయి. 90 టీఎంసీల నిల్వలకుగాను 54 టీఎంసీల మేర నిల్వ చేరడం, స్థిరంగా ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో .. వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో సిద్ధం చేసిన పంపులతో కాళేశ్వరం నీటిని తరలించే అవసరం లేకుండా పోయింది. ప్రతి ఏడాది గోదావరి నదీ బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. వీటితోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ప్రవాహాలుంటాయి. సెప్టెంబర్ వరకు సరైన వర్షాలు లేకపోవడం, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగకపోవడంతో ఎస్సారెస్పీకి నీటి రాక ఆలస్యమైంది. ఈ నెలాఖరు వరకు మంచి వర్షాలున్నాయనే అంచనాల నేపథ్యంలో మరో 10 టీఎంసీలైనా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తవద్దు
సాక్షి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను తాకిన కాళేశ్వరం జలాలను ప్రాజెక్టులోకి వదలాలనే నిర్ణయాన్ని నీటి పారుదలశాఖ ప్రస్తుతానికి కొద్ది రోజులు వాయిదా వేసుకుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనుల్లో భాగంగా మొదటి, రెండు పంప్హౌస్ల నిర్మాణం పూర్తికాగా, ఇటీవలే వెట్రన్ నిర్వహించిన విషయం విదితమే. దీంతో జలాలు ప్రాజెక్టు చెంతకు చేరగా, మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే వరదకాలువ గేట్లు మాత్రం ఎత్తలేదు. దీంతో కాలువలోనే నీళ్లు ఉండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద జలాల రాక కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మూడో పంప్హౌస్ పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి మంగళవారం పది వేల క్యూసెక్కులు వచ్చి చేరగా, బుధవారం రెండున్నర వేలు వచ్చింది. ఇలా ఏటా సెప్టెంబర్ నెలాఖరు వరకు వరద రాక కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 31.849 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం 1,071.40 అడుగులు ఉంది. వరద గేట్లు 1,070 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి మట్టంలో వరద గేట్లు ఎత్తితే ప్రాజెక్టులోని నీళ్లు వరద కాలువలోకి వచ్చి.. తిరిగి ప్రాజెక్టులోకి వెళతాయి. ఈ నేపథ్యంలో వరద గేట్లు ఎత్తాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మూడో పంప్హౌస్ జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్ర సమీపంలోని వరద కాలువ 0.1.కి.మీ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్హౌస్ నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పనులు పూర్తవడానికి మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశాలున్నాయి. పనులు పూర్తయితే వరద కాలువ గేట్లు మూసివేసి నీటిని ప్రాజెక్టులోకి పంప్ చేయవచ్చు. కానీ ఈ పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి నీటిని ప్రాజెక్టులోకి పంపు చేయడానికి వీలుపడటం లేదు. నిండుకుండలా వరద కాలువ.. ప్రస్తుతం వరద కాలువ నిండు కుండలా మారుతోంది. కాళేశ్వరం జలాలు కాలువలోకి రావడంతో కాలువకు ఇరువైపులా భూగర్భ జలాలు మరింత వృద్ది చెందనున్నాయి. చుట్టుపక్కల వట్టి పోయిన బోర్లు రీచార్జ్ అవుతాయి. -
‘కాళేశ్వరం’ వైపు ఎస్సారెస్పీ రైతాంగం చూపు
సాక్షి, నిర్మల్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆశించిన స్థాయిలో వరద నీటి చేరిక జరగడం లేదు. దీంతో ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరందించే కాకతీయ, సరస్వతీ, లక్ష్మీ కాలువల పరిధిలోని ఆయకట్టుకు రెండు పంటలకు నీరందించే పరిస్థితి కనబడడం లేదు. ఈ నెలలోనే ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరితేనే ప్రాజెక్ట్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. వారం క్రితం ప్రాజెక్ట్లోకి 50వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవాహం మూడు రోజుల పాటు కొనసాగింది. దీంతో ప్రాజెక్ట్లో 10 టీఎంసీల మేర పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి 4500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 1070 అడుగల నీటిమట్టం నమోదు కాగా 30టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. అయితే ఇప్పటి దాకా ప్రాజెక్ట్ నుంచి కాలువ ద్వారా ఈ సీజన్లో నీటి విడుదల జరగలేదు. కాలువ పరిధిలోని చెరువులు కొంతమేర ఖాళీగానే ఉన్నాయి. అయితే చెరువులను నింపడానికి వచ్చే నెలలో నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. కాళేశ్వరం పైనే ఆశలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి రోజుకి ఒక టీఎంసీ చొప్పున కాళేశ్వరం జలాలను తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి కాళేశ్వరం జలాలు రావాలంటే రాజేశ్వర్రావుపేట్ వద్ద ఏర్పాటు చేసిన పంపుల ద్వారా వరద కాలువలోకి నీటి పంపింగ్ చేపట్టాలి. ఈ మేరకు రాజేశ్వర్రావుపేట్ నుంచి వరద కాలువలోకి శనివారం నీటి పంపింగ్ ప్రయోగత్మకంగా చేపట్టారు. ఈ నీరు వరద కాలువలోకి రావడంతో అక్కడి ప్రాంత రైతులు ఆసక్తిగా తిలకించారు. వరద కాలువలోని నీరు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ కాలువ గేట్ల వద్ద శనివారం రాత్రికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వరదకాలువలో నుంచి ఎలాంటి పంపింగ్ లేకుండా నేరుగా ప్రాజెక్ట్లో 1077 అడుగల వరకు నీటిమట్టం చేరే వరకు వెళ్తుంది. అనంతరం ప్రాజెక్ట్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పంపుల ద్వారా ప్రాజెక్ట్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఆశించిన స్థాయిలో వరదనీరు రాని కారణంగా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం కాళేశ్వరం జలాలపైనే ఆశలు పెంచుకున్నారు. వారబందీకే సరిపోతుంది.. ప్రాజెక్ట్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సరస్వతీ, కాకతీయ కాలువలకు నీటిని వారబందీ పద్ధతి ద్వారా విడుదల చేసి చెరువులు నింపడానికే సరిపోతుంది. అయితే ప్రాజెక్ట్లో వరద నీరు రాకముందు 5 టీఎంసీల నీరు ఉండగా ఇప్పటి దాక ఈ సీజన్లో ప్రాజెక్ట్లోకి 25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల పరిధిలోని ఆయకట్టు మొత్తానికి రెండు పంటలకు నీరందించాలంటే కనీసం ప్రాజెక్ట్లో 75 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడడం లేదు. దీంతో ఇప్పట్లో కాలువల ద్వారా సైతం నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. -
ఊపందుకున్న నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, కామారెడ్డి జిల్లా భిక్నూరు, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటల్లో ఏకంగా 14 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అలాగే తాడ్వాయిలో 12, హన్మకొండ, రామాయంపేట, హసన్పర్తి, లింగంపేటలలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాళేశ్వరంలో 10, కామారెడ్డి, చెన్నూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో అల్పపీడనం... వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. దీంతో తెలంగాణలో రాగల రెండ్రోజులు అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన... వచ్చే రెండ్రోజులు తెలంగాణలో 75 శాతం ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు సెంటీమీ టర్లు మొదలుకొని ఆరు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు అంటే 7–11 సెంటీమీటర్లు మొదలు 12–20 సెంటీమీటర్ల వరకు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి పేర్కొన్నారు. ఎస్సారెస్పీకి వరద బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద మొదలైంది. మహారాష్ట్రలోని బాలేగావ్, అముదుర బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీకి ఎగువన గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి 5,490 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అది సోమవారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశముందని డ్యామ్ డిప్యూటీ ఈఈ జగదీశ్ తెలిపారు. -
శ్రీరామ సాగరానికి 56ఏళ్లు
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని, కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ నేటితో 56ఏళ్లు పూర్తి చేసుకుంది. అభివృద్ధిలో, ఆయకట్టుకు సాగు నీరు అందించడంలో కొచెం మోదం.. కొంచెం ఖేదం మిగిలిందని చెప్పవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరా కృషి చేస్తుంది. కాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పునాది రాయి పడి 56 వసంతాలు పూర్తవుతున్న, తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయాల ఉన్నప్పటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి నోచు కోవడం లేదు. ప్రాజెక్ట్లో నీటి కొరత ఉండకుండా పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం పునరుజ్జీవన పథకం ప్రవేశపెట్టింది. నిర్మాణం జరిగిందిలా.. ఎస్సారెస్పీని మూడు ప్రయోజనాలు ఆశించి నిర్మించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు. 36 మెగావాట్ల విద్యుతుత్పత్తి, చేపల పెంపకం అనే ఆశయాలతో 112 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మస్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్ 980 అడుగుల ఎత్తులో, జాతీయ రహదారి 44పై ఉన్న సోన్ వంతెన ఎగువ భాగం మూడు మైళ్ల దూరంలో ఆదిలాబాద్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలో నిర్మించారు. వరద నీరు తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండ రాయిని ఎంచుకుని 140 అడుగుల ఎత్తుతో 3,143 అడుగుల పొడువుతో రాతి కట్టడం, 125 అడుగుల ఎత్తుతో 44,750 అడుగుల మట్టి కట్టడంతో మొత్తం 47,893 అడుగుల డ్యాం నిర్మాణం చేపట్టారు. అలాగే 2,510 అడుగుల పొడువు జలదారితో 35,425 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియాతో 16లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్ డ్యాం డిజైన్ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను నిర్మించారు. ప్రాజెక్ట్ నుంచి పూడిక పోయోందుకు ఆరు రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు. ఇలా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్కు ప్రధాన సమస్యలు ఇప్పటికి పరిష్కరానికి నోచుకోవడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ భద్రత గాలిలో దీపంలా ఉంది. భద్రత కోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. అంతే కాకుండా ఎస్సారెస్పీలో పదవి విరమణలే తప్ప నూతనంగా అధికారుల నియామకం లేదు. దీంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కాలువల మరమ్మత్తులకు నిధులు మంజూరు అవుతున్న పనుల్లో మాత్రం నాణ్యత తూచ్ ఉండటంతో కాలువల మరమ్మతు ఎప్పటికి సమస్యగానే మిగిలిపోతుంది. అశలన్నీ కాళేశ్వరంపైనే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వార రివర్స్ పంపంగ్ చేసి 60 టీఎంసీల నీటిని నింపుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పై ఆధార పడకుండా సంవత్సరం పొడువున నిండుకుండలా ఏర్పడే అవకాశం ఏర్పడింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ప్రాజెక్ట్కు తరలిస్తారు. పునరుజ్జీవన పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరుతాయని పాలకులు ప్రకటిస్తున్నారు. -
గోదారి గుండె చెరువు
సాక్షి, హైదరాబాద్ : జూలై అంటే ఖరీఫ్కు మోఖ. మోఖలోనే వర్షాలు మొఖం చాటేశాయి. నాట్లు పడాల్సిన సీజన్లో రైతులు పాట్లు పడుతున్నారు. గలగలా గోదారి పారాల్సిన నెల ఇది. పంటల ‘ప్రాణహిత’ం కోరే రోజులివి. అట్లాంటిది గోదావరి వెలవెలపోతోంది. ‘ప్రాణహిత’లో జలజీవం లేదు. గతేడాది జూలై ఆరంభం నుంచి లక్ష క్యూసెక్కులకు తక్కువగా ఎన్నడూ ప్రవాహాల్లేవు. ఈ ఏడాది గరిష్టం గా 20 వేల క్యూసెక్కులు మించి ప్రవాహాలు రాలే దు. నీరురాక నారులేక మడులన్నీ బీడులయ్యాయి. 47 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు.. రాష్ట్రంలో గోదావరి బేసిన్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టు లు ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి. వీటికి ఎగువన కురిసే వర్షాల ఆధారంగా ప్రతి ఏటా జూలై నుంచి ప్రవాహాలు కొనసాగుతాయి. జూన్, జూలైలో ఈ ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలున్నా లేకున్నా, ఎగువన ఉన్న ప్రాణహిత నది నుంచి మాత్రం జూన్ రెండు, మూడో వారం నుంచే గోదావరిలో కలిసి గరిష్ట ప్రవాహాలు వస్తుంటాయి. ప్రాణహితపై ఉన్న టెక్రా గేజ్ స్టేషన్ వద్ద ప్రతి ఏడాది జూలైలో ప్రవాహాలు లక్ష క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 3 లక్షల వరకు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రాణహిత నదికి 5 లక్షల చదరపు కిలోమీటర్ల నదీ పరీవాహకం ఉన్నప్పటికీ గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో నీటి ప్రవాహాలే కరువయ్యాయి. గత ఏడాది జూలై 18 నాటికి గరిష్టంగా 2.78 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా ఈ ఏడాది గరిష్టంగా 20 వేల క్యూసెక్కులకు మించి వరద రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరద నీటిని మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసివేసి, కన్నెపల్లి పంపుల ద్వారా ఇప్పటి వరకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. గురువారం మేడిగడ్డ వద్ద 9,888 క్యూసెక్కుల కనిష్ట ప్రవాహం ఉండటంతో పంపులను నిలిపివేశారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు ఇంతవరకూ 3 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ఇందులోనే ఎల్లంపల్లికి 1.95 టీఎంసీలు, కడెంకు 0.80 టీఎంసీలు వచ్చింది. ఎస్సారెస్పీ, మిడ్మానేరు, ఎల్ఎండీలోకి మాత్రం చుక్కనీరు రాలేదు. -
ఎకో హేచరీలు వచ్చేశాయ్..
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎకో హెచరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇంతకు ముందు జాతీయ చేప పిల్లల కేంద్రంలో జార్ హెచనీ ఉండేది. జార్ హేచరీ శిథిలావస్థకు చేరడంతో ముందుగా ఆ హేచరీకి మరమ్మతులు చేపట్టడానికి అధికారులు ఆలోచన చేశారు. కానీ దానికి బదులుగా ఎకో హేచరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ చేప పిల్లల కేంద్రం పునరుద్ధరణ పనుల్లో భాగంగా రెండు యునిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ. 6 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్లో ఒక్క రోజులో 20 లక్షల స్పాన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జాతీయ చేప పిల్లల కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం నూతన హేచరీతో ఎక్కువగా చేప పిల్లల ఉత్పత్తి చేపట్టవచ్చని ఫిషరీస్ అధికారులు తెలిపారు. జిల్లాలోని చెరువులకు సరిపడా చేప పిల్లలను ఇక్కడనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం జాతీయ చేప పిల్లల కేంద్రం పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. ఎకో హేచరీ, జార్ హెచరీకి తేడాలివే.. ఎస్సారెస్పీ చేపపిల్లల కేంద్రంలో ఇది వరకు జార్ హేచరీ ఉంది. జార్ హేచరీకి భవన నిర్మాణం అవసరం ఉంటుంది. జార్ హేచరీ ఒక్క చోటనే ఎప్పటికి ఉండేలా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరమ్మతులు చేపట్టడం అంత సులువు కాదు. ఎకో హెచరీకి భవన నిర్మాణం అవసరం లేదు. అంతే కాకుండా ఒక్క చోటనే పర్మినెంట్గా నిర్మిచాల్సి న అవసరం లేదు. పెద్ద పెద్ద చెరువుల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కోసం కూడా ఎకో హేచరీని తరలించవచ్చు. ఎక్కువ సామర్థ్యంలో చేప పిల్ల ల ఉత్పత్తిని చేపట్టవచ్చు. రోజుకు 20 లక్షల స్పాన్ను ఉత్పత్తి చేయవచ్చు. హేచరీలో ఏం చేస్తారంటే.. తల్లి చేపలను తీసుకువచ్చి ముందుగా పొదుగా వేస్తారు. తల్లి చేపల నుంచి వచ్చిన గుడ్లను తీసి హెచరీలో బాయిల్డ్ చేసి స్పాన్ను ఉత్పత్తి చేస్తారు. అలా వచ్చిన స్పాన్ నుంచి చేప ప్లిలలు ఉత్పత్తి అవుతాయి. సగం స్పాన్ నుంచి చేప పిల్లల ఉత్పత్తి కాక ముందే స్పాన్ చనిపోతుంది. స్పాన్ నుంచి వచ్చిన చేప పిల్లలను నీటి కుండీల్లో వేసి దాణా వేస్తూ అంగులంసైజ్ వరకు పెంచుతారు. తరువాత మత్స్యసహకార సంఘాల ద్వారా చెరువుల్లో వదిలేందుకు నూరుశాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. -
తొలి ఫలం శ్రీరాముడికే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, దీని తొలిఫలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయకట్టుకు అందనుంది. జూలై చివరి నుంచి ప్రారంభం కానున్న గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నుంచి ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద నిర్ణయించిన 9 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే పంప్హౌజ్, బ్యారేజీ, కాల్వ ల పనులు శరవేగంగా కొనసాగుతుండగా, కొత్తగా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాల్వల ఆధునీకరణ, తూముల నిర్మాణం చేసి చెరువులను నింపే ప్రణాళిక శరవేగంగా అమలవుతోంది. 60 టీఎంసీలు.. 9 లక్షల ఎకరాలు.. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.68 లక్షలు, స్టేజ్–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ఉన్న కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వల ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఎగువ నుంచి ఎస్సారెస్పీకి వరద తగ్గడం, వచ్చినా ఆగస్టు తర్వాత వరద ఉంటుండటంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందట్లేదు. గరిష్టంగా 4.5 లక్షల ఎకరాలకు మించి నీరు చేరట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాళేశ్వరం ద్వారా ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంచేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను దాటుకొని ఎల్లంపల్లి మీదుగా వరద కాల్వ ద్వారా నీరు మిడ్మానేరు చేరుతుంది. మిడ్మానేరుకు చేరకముందే వరద కాల్వ మీద 3 పంప్హౌజ్లు నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని వరద ఉండే 60 నుంచి 120 రోజుల పాటు ఎస్సారెస్పీకి పంపిస్తారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్హౌజ్లకు రెండు పంప్హౌజ్లలో సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు పంప్హౌజ్లలో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు చొప్పున పంపులను జూన్ చివరికి పూర్తి చేసి, జూలై నుంచి ఖరీఫ్లో కనిష్టంగా 60 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలిస్తారు. ఈ నీటికి ఎస్సారెస్పీకి సహజ ప్రవాహాలతో వచ్చే మరో 30 నుంచి 40 టీఎంసీల నీరు తోడైతే పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది. లేదంటే 60 టీఎంసీల నీటినే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 9 లక్షల ఎకరాలకు సరఫరా చేయనున్నారు. ఆధునీకరణ చేపడుతూనే.. కాళేశ్వరం నీళ్లతో తొలి ప్రయోజనం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు గా నిల్వ, సరఫరా చేసందుకు వీలుగా ఓ పక్క చెరువులను నింపేలా తూముల నిర్మాణం, మరోపక్క కాల్వల ఆధునీకరణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎస్సారెస్పీ పరిధిలో మొత్తం 775 తూముల నిర్మా ణం చేసి 1,192 చెరువులకు నీరు మళ్లించాలని నిర్ణయించి తూముల పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణను రూ.వెయ్యి కోట్లతో చేపట్టగా వీటిలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వేగిరం చేయడంతో పాటు వారి పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలను మరో రూ.420 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించారు. దీనికి అదనంగా ఎస్సారెస్పీ స్టేజ్–2లో 220 కాల్వల లైనింగ్ పనులను చేపట్టాలని నిర్ణయించారు. వీటికి రూ.653 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి పరిపాలన అనుమతుల కోసం నివేదించారు. -
డెడ్ స్టోరేజ్కి చేరువలో..
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పడిపోతోంది. ప్రాజెక్ట్ నుంచి తాగు నీటి అవసరాల కోసమే నీటి విడుదల చేపడుతున్నారు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగులు తగ్గుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు రికార్డుల్లో పేర్కొంటున్నారు. ఈ లెక్కన పది రోజులకు ఒక అడుగు నీటి మట్టం తగ్గుతుంది. మరో రెండు నెలల్లో 6 అడుగుల నీటి మట్టం తగ్గుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. గత నాలుగు రోజుల క్రితం వరకు 130 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. నాలుగు రోజుల నుంచి పెరిగిన ఎండ తీవ్రత వలన 229 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు కూడ ఎక్కువగా ఆవిరవుతుంది. నీటి వినియోగం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం అతి తక్కువ నీటి వినియోగం జరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 142 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మిగత ఏ కాలువల ద్వారా కూడ నీరు వినియోగించడం లేదు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం శర వేగంగా తగ్గుతోంది. డెడ్ స్టోరేజీకి చేరువలో.. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 7.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. డెడ్ స్టోరేజీకి 2.3 టీఎంసీల దూరంలో ప్రాజెక్ట్ నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్లో 2015 సంవత్సరంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాక పోవడంతో డెడ్స్టోరేజీ దిగువకు ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయింది. ప్రస్తుత సంవత్సరం కూడ డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్ట్ 55 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు రెండు మార్లు మాత్రమే డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయినట్లు ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1052.40 (7.3 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
ఆయకట్టు గట్టెక్కేనా..?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు చివరి వరకు నీరందుతుందా..? యాసంగి పంటలు చేతికొస్తాయా? అంటే అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిమట్టాన్ని చూస్తే యాసంగి పంటలు చేతికి రావడం అనుమానమేనని రైతాంగం ఆందోళన చెందుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువుగా పేరు గాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వారబందీ ప్రకారం నాలుగు తడుల నీరు పంటలకు అందించేందుకు ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళిక రూపొందించి శివమ్ కమిటీకి పంపించారు. కమిటీ సూచన మేరకు ప్రభుత్వం యాసంగి పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి నీటి విడుదల ప్రారంభించడంతో నీటి మట్టం పడిపోతోంది. మరోవైపు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. యాసంగిలో ఎల్ఎండీ ఎగువ భాగం వరకు కాకతీయ కాలువ కింద 3.91 లక్షల ఎకరాలు, గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల కింద 21 వేల ఎకరాలు, లక్ష్మి కాలువ ద్వారా 16500 ఎకరాలు, సరస్వతి కాలువ ద్వారా 24 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతమున్న పంటలకు చివరి తడి వరకు నీరు అందడం గగనమేనని అటు రైతులు, ఇటు అధికారులు పేర్కొంటున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఒక తడి నీరు ఇవ్వడానికి 4.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఇప్పటివరకు ఒక తడి మాత్రమే నీరు ఇచ్చారు. ప్రస్తుతం రెండవ తడి కోసం నీటి విడుదల కొనసాగుతోంది. ఎండలు ఎక్కువ పెరగడంతో రెండవ తడిలో కనీసం 5 టీఎంసీల నీరు అవసరమవుతుందని ప్రాజెక్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు, నాలుగు తడుల సమయంలో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం మూడు తడులకు కలిపి కనీసం 15 టీఎంసీల నీరు అవసరని భావిస్తున్నారు. అయితే, ఎస్సారెస్పీలో ప్రస్తుతం 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ లెక్కన పంటల కోసం 15 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఎందుకంటే తాగు నీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2 టీఎంసీలు పోతుంది. ఇక, మిషన్ భగీరథకు 6.5 టీఎంసీల నీటిని కేటాయించారు. అవన్ని పోనూ మిగిలేది 5 టీఎంసీలు మాత్రమే. అంటే, ఈ లెక్కన చూస్తే ఆయకట్టుకు రానున్న రోజుల్లో నీటి విడుదల చేయడం కష్టంగానే కనిపిస్తోంది పడిపోయిన నిల్వ సామర్థ్యం వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంపై అనేక అనుమానాలున్నాయి. ప్రాజెక్టు మొదట్లో 120 టీఎంసీలుగా పేర్కొన్నారు. అయితే, 1994లో నిర్వహించిన సర్వే మేరకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు అని అధికారులు చెబుతున్నారు. 2015లో చేపట్టిన సర్వే ప్రకారం నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. పూడికను పరిగణనలోకి తీసుకుంటే అది మరింత తగ్గుతుంది. తాజా సర్వేను లెక్కల్లోకి తీసుకోకుండా అధికారులు పాత లెక్కలు చెబుతుండడం గమనార్హం. దీంతో నీటి లెక్కలన్నీ కాకి లెక్కలేనని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు. -
ఎస్సారెస్పీ ‘పునరుజ్జీవం’
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఊపిరిలూదేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని కాళేశ్వరంతో పాటే ఈ జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్ నుంచే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పూర్తి చేసి కనిష్టంగా 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తోంది. జూన్లో ఆయకట్టుకు నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం పనులను వేగిరం చేశారు. 2017 ఆగస్టు నెలలో ఆరంభించగా మూడు పంప్హౌస్ల పరిధిలో ఇప్పటికే 30.98 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో 29.60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. పంప్హౌస్ల్లో కాంక్రీట్ పనులు మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి. 5.10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిలో కేవలం 3.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే పూర్తయింది. మరో 2 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉంది. ఈ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత ఏజెన్సీపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవలే 200 మంది కార్మికులను అదనంగా నియమించి ఈ పనుల్లో వేగం పెంచారు. ఇక ఈ పథకానికి సంబంధించి మూడు పంప్హౌస్ల వద్ద ఎనిమిదేసి చొప్పున మొత్తంగా 24 మోటార్లు 1,450 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నవి అవసరం కానున్నాయి. మూడు పంప్హౌస్ల పరిధిలో 24 పంపులకు గానూ 15 పంపులు, 24 మోటార్లకు గానూ 10 మోటార్లు మాత్రమే కొనుగోలు చేశారు. రోజుకు ఒక టీఎంసీ.. వచ్చే మే నాటికి 2 పంప్హౌస్లలో పూర్తిగా ఎనిమిదేసి మోటార్లను అమర్చి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రచించారు. ప్రస్తుతం 10 మోటార్లే ఉండగా వచ్చే జనవరి చివరికి మరో 6 పంపులు విదేశాల నుంచి రానున్నాయి. ప్రాజెక్టుకు 60 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకునేలా రూపొందించగా, అందుకనుగుణంగా కనిష్టంగా 50 టీఎంసీల నీటినైనా ఎత్తిపోసే వ్యూహంతో పనులు చేస్తున్నారు. అనుకున్న మేర నీటిని ఎత్తిపోసినా ఐదు లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలలో పనులన్నీ పూర్తి చేసి జూన్ నుంచే ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి 50 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం లక్ష్యంగానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని ఈఎన్సీ అనిల్ కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నట్లు తెలిపారు. -
సాగునీరు విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ మొదటి దశలోని మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటను కాపాడటానికి ఆన్–ఆఫ్ విధానంలో నీరు సరఫరా చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జలాశయాలు, సాగునీటి లభ్యతపై శనివారం ఇంజనీర్లతో మంత్రి సమావేశమయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఇప్పటికే ఆన్–ఆఫ్ పద్ధతితో మూడు తడులకు నీరిచ్చామని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 65 టీఎంసీలు, లోయర్ మానేరులో 8 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. లోయర్ మానేరు ఎగువన ఉన్న 5 లక్షల ఎకరాల పంటను కాపాడటానికి ఇంకా 18 టీఎంసీలు అవసరమవుతాయని, మిషన్ భగీరథ అవసరాలకు మినహాయించుకొని లోయర్ మానేరు దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఖరీఫ్ పంటకు ఆన్–ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వగలమని ఆయన చెప్పారు. చెరువులు నింపండి... శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు పరిధిలో మొత్తం 244 చెరువులు ఉన్నాయని, వాటిని నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీరు రాలేదని, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ చెరువుల కింద ఆయకట్టును రక్షించుకోవడానికి, తాగునీటి కోసం లోయర్ మానేరు డ్యాం నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను కూడా నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్లు కాలువల వెంట తిరుగుతూ నీటి నిర్వహణ చేయాలని సూచించారు. కాలువలకు గండ్లు పడితే పూడ్చటానికి జేసీబీ, టిప్పర్లను, ఇసుక బస్తాలను తయారుగా ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఇంజనీర్లకు సహకరించాలని మంత్రి కోరారు. టెయిల్ టు హెడ్ విధానంలో నీటి నిర్వహణ చేయాలని సూచించారు. ఇది గత రబీ సీజన్లో మంచి ఫలితాలను ఇచ్చిందని, చిట్ట చివరి భూములకు కూడా నీరు అందించగాలిగామని గుర్తు చేశారు. పర్యావరణ ప్రభావ నివేదికలు పంపండి... అలాగే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన దరిమిలా దేవాదుల ప్రాజెక్టు ఇంజనీర్లతో ఈ అంశంపై మంత్రి సమీక్షించారు. పాలకుర్తి చెరువులను నింపిన అనంతరం నవాబ్పేట్ చెరువు ద్వారా యాదాద్రి జిల్లాలోని గుండాల మండలానికి నీరు సరఫరా చేయాలన్నారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మోడీకుంటవాగు, సీతారామ ప్రాజెక్టుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయినందున త్వరితగతిన పర్యావరణ ప్రభావ నివేదికలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. అలాగే సీతారామ ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతి పొందడానికి కృషి చేయాలని మంత్రి ఖమ్మం చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, శ్రీరాంసాగర్ రెండో దశ చీఫ్ ఇంజనీర్ నాగేందర్రావు, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ అనిల్కుమార్, శ్రీరాంసాగర్ మొదటి దశ చీఫ్ ఇంజనీర్ శంకర్, సంబంధిత ప్రాజెక్టుల ఎస్ ఈ, ఈఈలు, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్ పాండే పాల్గొన్నారు. -
ప్రాజెక్టు పనులకు గ్రహణం !
బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి దశాబ్ద కాలం తరువాత గతేడాది భారీగా నిధులు మంజూరయ్యాయి. నిధులున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం శంకు స్థాపన కోసం ప్రాజెక్ట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 26 కోట్లు, లక్ష్మి కాలువ ఆధు నికీకరణకు రూ. 20 కోట్లు మంజూరు చేశారు. నవంబర్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఇప్పటికీ 80 శాతం పనులు ప్రారంభం కాలేదు. అధికారులేమో పనులు ప్రారంభించాలని కాం ట్రాక్టర్లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. పనులు సకాలంలో ప్రారంభించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లక్ష్మి కాలువ అంతే.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మికాలువ ఆధునికీకరణ కోసం రూ. 20 కోట్లు గతేడాది మంజూరు కాగా పనులను మేలో ప్రారంభించారు. కాలువపై అక్కడక్కడా వంతెనల నిర్మాణం, లక్ష్మి లిఫ్టు వద్ద రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిపి వేశారు. ప్రాజెక్ట్ నుంచి నవంబర్ 15 వరకు నీటి విడుదల కొనసాగుతుంది. రబీలో నీటి సరఫరా చేసే అవకాశం ఉండటంతో వేసవి వరకు పనులు అటకెక్కినట్లే. ఆనకట్ట ప్రాటెక్షన్ వాల్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్టకు ఇరువైపులా ప్రాటెక్షన్ వాల్ నిర్మించడానికి రూ. 8 కోట్ల 31 లక్షల 70 వేలు మంజూరు అయ్యాయి. ఇది వరకే కుడి వైపు కిలోమీటర్, ఎడమ వైపు కిలో మీటర్ మేర సెఫ్టీ వాల్ ఉంది. దానిని పూర్తిగా నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయినా వరకు పనులు ప్రారంభించ లేదు. రివిట్ మెంట్.. ఎస్సారెస్పీ ఆనకట్ట రివిట్ మెంట్ మరమ్మతుల కోసం రూ. 5 కోట్ల 34 లక్షల 70 వేలు మంజూ రు అయ్యాయి. రివిట్ మెంట్ పనులను వేసవి కాలంలో ప్రారంభించి ఎట్టకేలకు చివరి దశకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఆనకట్టపై పెరిగిన చెట్లను తొలిగించే పనులు చేపడుతున్నారు. ప్రారంభం కాని బీటీ రోడ్డు.. ప్రాజెక్ట్ ఆనకట్ట కుడి, ఎడమలు కలిపి 13.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా గుంతల మయంగా మారింది. బీటీ తొలగిపోయి మొత్తం మట్టి రోడ్డు ఏర్పడింది. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల 64 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రాజెక్ట్ ప్రధాన రోడ్డు మరమ్మతులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 44 నుంచి ప్రాజెక్ట్ వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డు తారు కొట్టుకు పోయింది. ఆ రోడ్డు మరమ్మతులకు రూ. కోటి 94 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైన రెండు రోజులకే నిలిచిపోయాయి. నోటీసులు ఇచ్చాం : ప్రాజెక్ట్ వద్ద చేపట్ట వలిసిన పనులు ప్రారంభించక పోవడంపై కాంట్రాక్టర్కు పలు మార్లు నోటీసులు ఇచ్చాం. పనులు ప్రారంభించ కుంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళుతాం. – శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ -
శ్రీరాం సాగర్కు జలకళ
సాక్షి, నిజామాబాద్ : భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. తెలంగాణతో పాటు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1071.9 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.912 టీఎంసీలు ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి 14 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరద ఇన్ ఫ్లో 16,450 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంపై ఆయకట్టు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాం సాగర్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. -
మధ్యమానేరుకు జలసిరి
బోయినపల్లి/సిరిసిల్ల: భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. దిగువకు వెళ్తున్న ఈ నీటిని వివిధ ప్రాజెక్టుల్లోకి మళ్లించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మధ్యమానేరు జలాశయాన్ని గోదావరి నీటితో నింపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయానికి శ్రీరాంసాగర్ నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిరుడు 5 టీఎంసీల నీటిని మళ్లించిన అధికారులు.. ఈ ఏడాది 24 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల ధాటికి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నిండుగా పారుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 90 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుంచి వచ్చే వరదతో రోజుకు 5–8 టీఎంసీల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. శనివారం నాటికి 30–35 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిండితే వరద కాల్వ ద్వారా మధ్యమానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి నీరు చేరేందుకు 48 గంటల సమయం పడుతుందని లెక్కకట్టారు. అంటే.. 3 రోజుల్లో మధ్యమానేరులోకి గోదావరి జలాలు వచ్చి చేరనున్నాయి. దాదాపు 21 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. మధ్యమానేరు పూర్తిగా నిండుతుంది. ఈ ప్రాజెక్టు నిండితే.. అక్కడ నుంచి దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లోకి నీటిని వదిలిపెడతారు. మరోవైపు.. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరుకు నీరు అందించే వీలు కలుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జలాశయాలకు మధ్యమానేరు గుండెకాయలా మారుతుంది. ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి మధ్యమానేరులో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులు వెంటనే ఊర్లు ఖాళీ చేసి.. పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్ఠాణా, బోయినపల్లి మండలం కొదురుపాక, వర్దవెల్లి, నీలోజిపల్లి గ్రామస్తులు కొందరు ఊర్లు ఖాళీ చేసి పునరావాస కాలనీకు చేరారు. ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వారంతా పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. మూడు రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి జలకళ రాబోతుంది. ప్రాజెక్టు నిండితే.. సిరిసిల్ల ప్రాంతంలో కొంత మేరకు భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. మిడ్మానేరుకు వరద నీరు మహారాష్ట్రలోని నాందేడ్ ఎస్సీవీపీ, ఆందూర, బాలేగావ్, బాబ్జీ బ్యారేజీల నుంచి రోజూ 9 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 23 టీఎంసీల నీరు నిల్వఉంది. వరుసగా మూడురోజులపాటు నీరు ఇలానే వస్తే ఎస్సారెస్పీలో 30 టీఎంసీలకు పైగా చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఈ మేరకు నీరు చేరితే మధ్యమానేరులోకి వరద కాలువ ద్వారా నీరు వదిలే అవకాశం ఉంది. –శ్రీకాంత్రావు, ఎస్ఈ, మిడ్మానేరు ఎస్సారెస్పీకి భారీగా వరద ఇన్ఫ్లో 62,520 క్యూసెక్కులు జగిత్యాల అగ్రికల్చర్: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వస్తోంది. ప్రాజెక్టులో 1067.4 అడుగుల(24.277 టీఎంసీల) నీటి నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో 42,385 క్యూసెక్కుల వరదనీరు రాగా.. ఏడు గంటలకు 46,940 క్యూసెక్కులకు, 10 గంటలకు 49,240, 11 గంటలకు 58,330, 12 గంటలకు 68,650, మధ్యాహ్నం ఒంటిగంటకు 76,540, సాయంత్రం 4 గంటల వరకు 82,650 క్యూసెక్కు లకు చేరింది. తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు 62,520 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1054.90 (9.214 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: కొనసాగుతున్న పోలీసుల భద్రత
-
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతోన్న బందోబస్తు
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద వర్షంలోనూ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద పోలీసు బలగాలు గత రెండు వారాల నుంచి పహారా కాస్తున్నాయి. పోచంపాడు గ్రామం, అలాగే ప్రాజెక్టు వైపు వెళ్లే వారిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల రైతులు సాగునీటి కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. శ్రీరాంసాగర్కు వరద పెరగడంతో ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు ప్రాంత పరిధిలోని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో వెంటనే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆయా గ్రామాల ప్రజలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెల్సిందే. రైతులు బలవంతంగా గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద భద్రతను పెంచారు. అయితే వర్షాలు పడుతుండటంతో రైతులకు కాసింత ఉపశమనం లభించింది. -
శ్రీరాం సాగర్ ఆయకట్టు గ్రామాల్లో భారీ బందోబస్తు
-
అసలు నిల్వ ఎంత?
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటి కోసం ఓవైపు రైతాంగం పోరాటం కొనసాగిస్తుంటే, చుక్కనీటిని వదిలేందుకు కూడా సర్కారు ససేమీరా అంటోంది.. అయితే, అసలు జల వివాదానికి మూలమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యమెంత..? పేరుకుపోయిన పూడిక ఎంత? అనే దానిపై అనుమానాలెన్నో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో పూడిక పేరుకుపోయింది. 1994లో నిర్వహించిన సర్వే ప్రకారం 22 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు తేలింది. అప్పటి నుంచి ఇప్పటికీ అవే లెక్క ల ప్రకారమే నీటి నిల్వల గురించి చెబుతున్న అధికారులు.. 2014–2015లో నిర్వహించిన సర్వే నివేదికను మాత్రం బయట పెట్టడం లేదు. దీనిపై సర్కారు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఎస్పారెస్పీ నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయిందని అప్పట్లో సర్వే నిర్వహించిన సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రాజెక్టు సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని స్పష్టం చేసింది. అయితే, ఈ నివేదికను ఇటు సర్కారు, అటు అధికారులు బయట పెట్టడం లేదు. పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టడం లేదు. ఎందుకంత గోప్యత? శ్రీరాంసాగర్ తాజా నీటి నిల్వ సామర్థ్యంపై ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారనేది అంతు చిక్కని రహస్యంగా మా రింది. వాస్తవానికి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ముందుకు రాని ప్రభుత్వం.. పూ డికను పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడో రెం డు దశాబ్దాల క్రితం నాటి లెక్కలు చెబుతుండడంౖ పె ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ప్రాజెక్ట్లో ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం ఎం త... ప్రస్తుతం ఎంత నీరు నిల్వ ఉందని ప్రశ్నిస్తున్నారు. 90 టీఎంసీల సామర్థ్యం లెక్కల్లో ప్రస్తు తం 15.93 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ లెక్కలు వాస్తమై తే ప్రాజెక్ట్లో తాగునీటి అవసరాలకు, డెడ్ స్టోరే జీకి పోను మిగిలిన నాలుగు టీఎంసీల్లో అర టీఎంసీ నీటిని వదిలి తమ పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం వేరు.. అయితే, 2014 డిసెంబర్, 2015 జనవరిలో నిర్వ హించిన పూడిక సర్వేలో ప్రాజెక్ట్ నీటి నిల్వ సామ ర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని తేలింది. ఆ నివేదిక ప్రకారమైతే, ప్రస్తుతం ప్రాజెక్ట్లో 15.93 టీఎంసీల నీరు నిల్వ ఉండదు. అందుకనే, సర్కారు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయ డం లేదని కాకతీయ కాలువ పరివాహ ప్రాంత రైతు లు చెబుతున్నారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీచార్జి ల్యాబోరేటరీ (ఏపీఈఆర్ఎల్) నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగానే ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ అధికారులు 90 టీఎంసీలుగా పేర్కొంటున్నారు. అయితే, గత 24 ఏళ్లలో ప్రాజెక్ట్కు భారీ వరదలు వచ్చాయి. వరదలతో పాటు పూడిక వచ్చి చేరింది. కానీ, అధికారులు రెం డు దశాబ్దాల క్రితం నాటి లెక్కలే చెబుతుండడం విశేషం. 1994లో సర్వే నిర్వహించిన అదే ఏపీఈఆర్ఎల్.. 2014లోనూ సర్వే నిర్వహించింది. భారీగా పూడిక చేరిందని, ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడి పోయిందని ఆ సంస్థ తన నివేదిక లో వెల్లడించింది. కానీ అధికారులు ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పటికీ 90 టీఎంసీల సామర్థ్యంలోనే లెక్కలు చూపుతున్నారు. పూడిక ఎంతుందో బయట పెట్టకుండా నీటి నిల్వలపై కాకి లెక్కలు చూపుతున్నారని యకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీలో అసలు నిల్వ ఎంత ఉందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ‘పూడిక’ లెక్కలు.. శ్రీరాంసాగర్కు పూడిక ముప్పు ముంచుకొస్తుంది. ఏటా ప్రాజెక్ట్లోకి భారీ వరదల వలన వచ్చే మట్టి తో ప్రాజెక్ట్లో భారీగా పూడిక పేరుకుపోతోంది. ఫలితంగా ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. మొద ట్లో 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపో యింది. 1994లో ఏపీఈఆర్ఎల్ సంస్థ సర్వే ప్రకా రం ప్రాజెక్ట్లో 21.71 టీఎంసీల పూడిక చేరింది. తరువాత అదే సంస్థ 2006లో చేపట్టిన సర్వే ప్రకా రం ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 79.96 టీఎంసీలకు పడిపోయింది. కానీ ఆ సర్వే నమ్మశక్యంగా లేదని అధికారులు కొట్టిపారేశారు. 2008లో రీసర్వే కోసం ప్ర తిపాదనలు పంపించగా, 2014 డిసెంబర్లో రీసర్వే చేపట్టారు. ఆ సర్వే ప్రకారం ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడి పోయిందని తేలింది. ప్రాజెక్ట్లో పూడిక తొలిగించి ఆయకట్టును కాపాడాలని వేడుకుంటున్నారు. ఎస్సారెస్పీలోకి స్పల్వ ఇన్ఫ్లో.. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. 550 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికి 1062.10(16.06 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. బురదలోకి రివర్స్ స్లూయిజ్ గేట్లు ఎస్సారెస్పీలో పేరుకు పోయిన పూడికను వరదల ద్వారా తొలిగించేందుకు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే ఆరు ఆరు రివర్స్ స్లూయిజ్ గేట్లను నిర్మించారు. కానీ, ప్రాజెక్ట్ నుంచి ఇన్నేళ్లు వందల టీఎంసీల నీరు గోదావరి పాలు చేసినా, ఏ రోజు కూడా ఈ గేట్లను ప్రాజెక్ట్ అధికారులు వినియోగించలేదు. రివర్స్ స్లూయిజ్ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. గేట్లను ఎత్తితే కిందకు దిగే పరిస్థితి లేకపోవడంతో అధికారులు అటు వైపు ఏనాడు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఎస్సారెస్పీలో పూడిక భారీగా పేరుకు పోయింది. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద హైఅలర్ట్
సాక్షి, నిజామాబాద్ : పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుతో పాటు ఆయకట్టు గ్రామాల్లో, వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వద్ద బారికేడ్లను సైతం సిద్ధం చేశారు. కాగా, శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరనీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. -
ఎస్సారెస్పీ వద్ద భారీగా బలగాలు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసే పరిస్థితులు లేవని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు హైదరాబాద్లో జరిగిన సమీక్ష సమావేశంలో తేల్చి చెప్పడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఐదారు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఉన్నతస్థాయి సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారని, శనివారం వరకు ఓపిక పట్టాలని అధికారులు రైతులను సముదాయిస్తూ వచ్చారు. దీంతో వారు తాత్కాలికంగా ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. అయితే, ప్రాజెక్టు నుంచి నీరు విడుదల సాధ్యం కాదని మంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో సమీక్ష సమావేశం ప్రారంభానికి ముందు నుంచే ఎస్సారెస్పీలో పోలీసులు బలగాలను పెంచారు. నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల కమిషనర్లు, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఎస్పీలు ఉదయమే ఎస్సారెస్పీకి చేరుకున్నారు. కాకతీయ కాలువ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు పోలీసు బలగాలను బృందాలుగా పంపించారు. సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. పోలీసుల మోహరింపుతో గ్రామాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా నిఘా పెంచారు. ఎస్సారెస్పీ డ్యాంపై కంచె ఏర్పాటు చేసి బందోబస్తును పెంచారు. నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాలు చేపడుతామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఆదివారం ప్రాజెక్టు కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే గ్రామాల్లోనే నిరసన తెలుపుతామని ప్రకటించారు. -
తాగునీరే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో తగినంత నీటి లభ్యత లేదని, ఉన్న నీటిలో తాగుకే ప్రాధాన్యం ఇస్తామని నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నేతలకు నీటి పారుదల మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఎగువన మరిన్ని వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరొచ్చే వరకు ప్రాజెక్టు కింది ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యం కాదన్నారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రీరాం సాగర్ నీటి లభ్యత, అవసరాలు, రైతుల డిమాండ్లపై సమీక్ష జరిగింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎక్కువ ప్రవాహాలు రాలేదని, ప్రస్తుతం 15 టీఎంసీల నీటి లభ్యతే ఉందని అధికారులు వివరించారు. ఇందులో మిషన్ భగీరథకు 6.5 టీఎంసీలు, మరో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలకు సరిపోతాయని.. మిగిలే 4 టీఎంసీలతో ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నందున మున్ముందు అవసరాల దృష్ట్యా ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలోని రైతుల అవసరాలను అంచనా వేస్తున్నామని, ఎగువన మంచి వర్షాలు కురిసి ప్రాజె క్టులోకి నీరొస్తే ఆయకట్టు అవసరాలకు నీరు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితిని జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో అంచనా వేస్తూ క్షేత్రస్థాయిలో నీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు. వచ్చే యాసంగికి పనులు పూర్తి.. శ్రీరాంసాగర్కు పూర్వవైభవం తీసుకురావడానికే రూ.1,100 కోట్లతో పునరుజ్జీవన పథకాన్ని ప్రభు త్వం చేపట్టిందని, పనులు శరవేగంగా జరుగుతున్నా యని మంత్రి వివరించారు. వచ్చే యాసంగికి పను లు పూర్తి చేసి ఏటా 2 పంటలకు పుష్కలంగా నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు తమ స్వార్థం కోసం అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని, వారి మాటలకు మోసపోవద్దని రైతులకు విన్నవించారు. రైతుల పట్ల సానుభూతితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రైతు క్షేమమే లక్ష్యమని, పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ, ఆర్మూర్, బోధన్, కోరుట్ల శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, షకీల్ హైమద్, విద్యాసాగర్రావు, జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి సంజయ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, శ్రీరాంసాగర్ సీఈ శంకర్ పాల్గొన్నారు. -
భారీ వర్షం : ప్రాజెక్టుల్లోకి పెరుగుతోన్న ఇన్ప్లో
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దవతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్గొండలోని మూసీ ప్రాజెక్టులోకి భారీ వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645అడుగులు కాగా, ప్రస్తుతం 637 అడుగులకు చేరింది. నిర్మల్లోని కడెం ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 698అడుగులకు చేరింది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తేసి 23వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సాధారణ నీటిమట్టం 1091అడుగులు కాగా ఇప్పటికే 1058.08అడుగుల నీరి వచ్చి చేరింది. ఇన్ప్లో 1200 క్యూసెక్కులుగా ఉంది. భారీ వరద నీరుతో భద్రాద్రిలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం దాని నీటిమట్టం 72.75క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తేసి 1897కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుమరంభీంలోని కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగుప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. గుండివాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. ఆసిఫాబాద్లోని డోర్లీ, ఖైరిగూడ ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. జైనూర్ మండలం పట్నాపూరలో భారీ వర్షం కారణంగా పట్నాపూర్ వాగులో ఆవుల కాపరి కొట్టుకు పోయాడు. వాగువద్ద ప్రజలు గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీలోనూ అదేపరిస్థితి ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జ్ వద్ద గోదావరి మట్టం 9.3అడుగులకు చేరింది. ఇన్ప్లో 3,04,845క్యూసెక్కులుగా ఉంది. 4వేల క్యూసెక్కుల నీటిని డెల్టాకు విడుదల చేశారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలో ముసురు పట్టి కురుస్తున్న వాన జల్లులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మైలవరం, రెడ్డిగూడెం, బాపులపాడు, వత్సవాయి, గన్నవరం, నందిగామ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో తూర్పు గోదావరిలోని ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య గోదావరిలో వేసిన మట్టబాట కొట్టుకుపోయింది. భారీవర్షాల కారణంగా గోవావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు
-
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
బాసర : మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం బాబ్లీ వద్ద గోదావరిలో నిల్వ ఉన్న 0.56 టీఎంసీల నీరు దిగువ గోదావరికి ప్రవహిస్తోంది. ఈ నీరు మధ్యాహ్నానికి తెలంగాణ సరిహద్దు కాండకుర్తి వద్దకు చేరుకుంటుంది. సాయంత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీరు నిల్వ రెండు టీఎంసీలకు పెరగనుంది. నేటి నుంచి 120 రోజులు పాటు (అంటే అక్టోబర్ 28 వరకూ) గేట్లు తెరచుకునే ఉంటాయి. -
ఎస్సారెస్సీలో పెరుగుతున్న వరద
సాక్షి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇన్ఫ్లో 9,342 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1055.00 అడుగులు (9.287 టీఎంసీలు) లుగా ఉంది. ఈ నెలలో 14 రోజుల్లో ప్రాజెక్టులోకి 2 టీఎంసీల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద
సాక్షి, నిజామాబాద్: మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. దీంతో నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1052 అడుగులుగా ఉంది. -
ఆగస్టు నాటికి ‘పునరుజ్జీవం’!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి బేసిన్లో ఎగువ నుంచి కరువైన ప్రవాహాలతో వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు జవసత్వాలు అందించేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని ఆగస్టు నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కాళేశ్వరం నీటిని తీసుకునే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పాక్షికంగా పూర్తి చేసి కనిష్టంగా 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం పనులు జరుగుతుండగా, జూన్ నాటికి చైనా నుంచి మోటార్లు రాష్ట్రానికి చేరుకునేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి ఎస్సారెస్పీ కింద స్టేజ్–1లో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా.. ఎన్నడూ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందిన దాఖలాలు లేవు. దీనికి తోడు ఎస్సారెస్పీలో పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా కట్టిన ప్రాజెక్టుల నేపథ్యంలో దిగువకు 54 టీఎంసీలకు మించి నీరు రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించి, గత ఏడాది జూన్లో రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మొత్తంగా మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేయగా, 15 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 28.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి ఈ పనులను గత ఏడాది ఆగస్టులో ఆరంభించగా ఇప్పటికే 30.37 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో 28.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. పంప్హౌస్ల్లో కాంక్రీట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికి రెండు పంప్హౌస్లను పాక్షికంగా పూర్తి చేసి 0.5 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేస్తున్నారు. ప్రాజెక్టుకు 60 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకునేలా రూపొందించినప్పటికీ ప్రస్తుతం పాక్షికంగానే పూర్తయిన నేపథ్యంలో 90 రోజుల్లో 45 టీఎంసీలు, అవసరమయితే 120 రోజుల్లో 0.5 టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళిక రచించారు. ఈ పథకానికి సంబంధించి మూడు పంప్హౌస్ల వద్ద ఎనిమిదేసి చొప్పున మొత్తంగా 24 మోటార్లు 1,450 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నవి అవసరం ఉండగా, ఈ నెలాఖరుకు మొదటి పంప్హౌస్కు చెందిన మూడు మోటార్లు రాష్ట్రానికి చేరనున్నాయి. రెండో పంప్హౌస్కు చెందిన మరో మూడు మోటార్లు జూన్ చివరికి రాష్ట్రానికి చేరనున్నాయి. మూడో పంప్హౌస్ పనులను మాత్రం డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. మూడో పంప్హౌస్ పూర్తి కాకున్నా కనిష్టంగా 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఐదు లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై చివరికల్లా మోటార్ల బిగింపును పూర్తిచేసి ఆగస్టులో ఎల్లంపల్లి నుంచి వరదకాల్వ ద్వారా ఎస్సారెస్పీకి గోదావరి జలాలను తరలించడం లక్ష్యంగానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. -
ప్రమాద ఘంటికలు
ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాగునీరూ దొరకని దుర్భర పరిస్థితులు తలెత్తనున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీటి నిల్వలు అడుగంటుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 22 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఆరో తడికి నీటి విడుదలను ప్రారంభించారు. దీనితో కలిపి మరో మూడు తడులకు, అలాగే తాగునీటికి నీటి విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాల్కొండ: ఎస్సారెస్పీలో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆదివారం నుంచి కాలువల ద్వారా ఆయకట్టు పంటలకు ఆరో తడికి నీటి విడుదలను ప్రారంభించారు. మరో రెండు తడులకు నీటిని అందించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రతి తడికి 5 టీఎంసీల చొప్పున విడుదల చేశారు. ఈ లెక్కన ఉన్న 22 టీఎంసీల్లో 15 టీఎంసీలను ఆయకట్టుకు విడుదల చేస్తే తాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలు పొట్ట దశలో ఉన్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నీటి వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్ట్లో నీటిమట్టం తక్కువగా ఉండడంతో చివరి తడి వరకు నీటి విడుదల ప్రశ్నార్థకంగానే మారింది. ఏం చేస్తారో ఏమో..? ఎస్సారెస్పీలో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. ఇక, 6.5 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ పథకం కోసం నిల్వ ఉంచాలి. మరో 3 టీఎంసీలు ఆవిరి రూపంలో పోతుందని ప్రాజెక్ట్ రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన ప్రాజెక్ట్లో సుమారు 15 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే తాగు నీటి అవసరాలు తీరతాయి. అలాగే, ఆయకట్టు పంటలకు ప్రస్తుత తడితో కలుపుకుని మూడు తడుల నీరు అందించాలి.. గత తడుల లెక్క ప్రకారం ప్రతి తడికి 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్లో తాగునీటి అవసరాలు, డెడ్స్టోరేజీ, ఆవిరి రూపంలో పోయే నీటి లెక్కలు పోను.. మిగిలేది 7.5 టీఎంసీలు మాత్రమే. దీంతో అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు ఏ విధంగా నీటిని విడుదల చేస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా పూడిక.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో పేరుకు పేయిన పూడిక నీటి నిల్వపై ప్రభావం చూపుతోంది. 1994లో చేపట్టిన సర్వే ప్రకారం ప్రాజెక్ట్లో 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని, ఆ లెక్క ప్రకారమే ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలుగా లెక్కిస్తున్నారు. 2014లో సర్వే చేపట్టిన ఏపీఈఆర్ఎల్ సంస్థ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు నివేదించింది. తాజాగా కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇదే ప్రకటించింది. అంటే అధికారుల లెక్కల ప్రకారమే 10 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. 1978లో హైడ్రోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా సంస్థ సర్వే నిర్వహించి, ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 112 టీఎంసీలుగా పేర్కొంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే చేపట్టి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్లో పూడిక భారీగా పేరుకు పోయింది. 2004లో సర్వ చేపట్టిన ఓ సంస్థ ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం 70 టీంసీలకు పడిపోయినట్లు ప్రకటించినా.. ఇరిగేషన్ అధికారులు దానిని కొట్టిపారేశారు. రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో రీసర్వే చేపట్టి ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితోనే ఏటా 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ఈ లెక్కన 54 ఏళ్ల కాలంలో ప్రాజెక్ట్లో ఏమేరకు పూడిక చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకరాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న ఎస్సారెస్పీ పూడికతీతపై దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పంటలకు నీరు అందిస్తాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నిర్దేశించిన ప్రకారం నీరు అందిస్తాం. తాగునీటి అవసరాలకు కేటాయించినంతగా నీరు నిల్వ ఉండక పోవచ్చు. కానీ సకాలంలో వర్షాలు వస్తే తాగునీటి అవసరాలకు కూడా నీరు సరిపోతుంది. – రామారావు, ఎస్సారెస్పీ ఈఈ -
ఎస్సారెస్పీ కింద ఒక్క ఎకరా ఎండనివ్వం
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టులో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టునూ రక్తపు బొట్టులా జాగ్రత్తగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఆయకట్టు హక్కుదారులందరికీ నీళ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ ఆయకట్టుపై సీఈ శంకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, కలెక్టర్ దేవసేన, జెడ్పీ చైర్మన్ తుల ఉమతో ఈటల సమీక్షించారు. నిరంతర విద్యుత్ వల్ల కాల్వ పరిధిలోని మోటార్లు నీటినంతా లాగేస్తున్నాయని, ఈ దృష్ట్యా కాల్వ పరీవాహక ప్రాంతాల్లో సరఫరాను 9 గంటలకు తగ్గించాలని కోరినట్లు చెప్పారు. ఎల్ఎండీ ఎగువన మరో 4 తడులు, దిగువన మరో 3 తడులు నీళ్లు ఇచ్చే అంశంపై చర్చించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 27, ఎల్ఎండీలో 10 టీఎంసీల నీరుందని సీఈ వివరించగా.. తాగునీటి అవసరాలు కాపాడుకుంటూనే సాగు నీరు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని మంత్రి సూచించారు. ఆయకట్టు పరిధిలో పంటలు కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ విపక్షాలు పంటలను ఎండబెట్టేలా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. -
నిరంతర విద్యుత్తో నీటి కష్టాలు!
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తో కొత్త చిక్కు వచ్చి పడింది. శ్రీరాంసాగర్ నుంచి విడుదల చేస్తున్న నీరంతా ఆయకట్టు ఎగువనే వినియోగమవుతోంది. నిరంతర విద్యుత్ సరఫరాతో.. రైతులు మోటార్ల ద్వారా కాకతీయ కాలువ నుంచి నీటిని తోడేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటిని విడుదల చేసినప్పుడు విద్యుత్ సరఫరాను 9 గంటలకు తగ్గించాలని, మిగతా సమయాల్లో నిరంతరాయంగా సరఫరా చేయాలని యోచిస్తోంది. సాక్షి, హైదరాబాద్: నిరంతరాయ విద్యుత్ సరఫరా కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయ కట్టుకు నీటి గోస తలెత్తింది. కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటిని ఎగువ ప్రాంతాల్లోని రైతులు మోటార్లు పెట్టి లాగేస్తుండడంతో దిగువకు నీటి రాక తగ్గిపోయింది. దీనిపై చివరి ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. నీటి విడుదల సమయంలో ఎగువ ఆయకట్టు ప్రాంతాల్లో విద్యుత్ను తొమ్మిది గంటలకే పరిమితం చేయాలని యోచిస్తోంది. ఐదున్నర లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రణాళిక గతేడాది డిసెంబర్లో ఎస్సారెస్పీ, లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ)లలో నీటి నిల్వలకు అనుగుణంగా రబీకి నీరందించే ఆయకట్టును ఖరారు చేశారు. అప్పటికే ఎస్సారెస్పీలో లభ్యతగా ఉన్న 55.16 టీఎంసీలకు తోడు సింగూరు నుంచి మరో 5 టీఎంసీలు విడుదల చేసి.. మొత్తంగా 60.16 టీఎంసీలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో 15 టీఎంసీలను కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండీకి విడుదల చేశారు. మిగతా లభ్యత నీటిలో తాగునీటికి 6.5 టీఎంసీలు పక్కనపెట్టి.. 28.88 టీఎంసీలను ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఎల్ఎండీ నీటిలో మిషన్ భగీరథకు 6.16 టీఎంసీలు కేటాయించారు. మరో 9.53 టీఎంసీలను డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 1.6 లక్షల ఎకరాలకు ఇచ్చేలా ప్రణాళిక వేశారు. నీరంతా ఎగువనే ఖాళీ.. ఎస్సారెస్పీ నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల మేర నీటిని వదిలితే... కాకతీయ కాల్వ 68వ కిలోమీటర్ వద్ద ఉన్న తాళ్లపేట, మేడిపల్లి ప్రాంతానికి వచ్చేసరికే 2 వేల క్యూసెక్కులకు తగ్గిపోతోంది. అక్కడి నుంచి దిగువన 116వ కిలోమీటర్ వరకు వెయ్యి క్యూసెక్కుల నీరు కూడా రావడంలేదు. ఇదేమిటని అధికారులు పరిశీలించగా.. రైతులు మోటార్లు పెట్టి కాల్వ నుంచి నీటిని తోడుకుంటున్నట్లు గుర్తించారు. ఎస్సారెస్పీ నుంచి 68వ కిలోమీటర్ వరకు ఏకంగా 2,600 మోటార్లు ఉండగా.. దిగువన మరో 700 మోటార్లు ఉన్నట్లు తేల్చారు. 24 గంటల విద్యుత్ సరఫరా ఉండడంతో రైతులు భారీగా నీటిని తోడేస్తున్నారని, దీంతో దిగువకు నీటి రాక తగ్గిపోతోందని గుర్తించారు. రోజూ ఈ మోటార్ల ద్వారా సుమారు 800 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నట్లు అంచనా వేశారు. ఎల్ఎండీ దిగువన కూడా.. ఎల్ఎండీ దిగువన కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ 1.60 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం 2,200 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా... దిగువకు వచ్చే సరికి 500 క్యూసెక్కులు కూడా ఉండటం లేదు. కొన్ని చోట్ల చివరి ఆయకట్టు వరకు నీరే రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు కిలోమీటర్ల పొడవునా.. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్ల పరిధిలోని బాల్కొండ నియోజకవర్గం మొండోరా, తిమ్మాపూర్, ఉప్పలూర్లతోపాటు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉంది. కాల్వల వద్ద మోటార్లు పెట్టి.. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోని పొలాలకు కూడా పైప్లైన్లు వేసి నీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరి సాగు పెరగడంతో.. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 70:30 నిష్పత్తిన వరి, ఆరుతడి పంటలకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. కానీ ఎగువన రైతులంతా వరి సాగుకే మొగ్గు చూపడంతో.. ఈ నిష్పత్తి కాస్తా 85ః15గా మారింది. దీంతో ఎగువ నీటి వినియోగం మరింత పెరిగింది. క్రమబద్ధీకరణకే ప్రభుత్వం మొగ్గు ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతుల ఆందోళ న నేపథ్యంలో 24 గంటల విద్యుత్పై నీటి పారుదల శాఖ ఇటీవల సమీక్ష నిర్వహించి.. రైతుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ మేరకు 24 గంటల విద్యుత్ను క్రమబద్ధీకరిస్తే సాగు నీటి విషయంలో ఇబ్బందులు తప్పు తాయన్న యోచనకు వచ్చింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ నుంచి దిగువకు నీటిని విడుదల చేసే సమయంలో ఆయకట్టు ఎగువ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరాను 24 గంటల నుంచి 9 గంటలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఎగువన నీటి వినియోగం తగ్గి.. దిగువకు లభ్యత పెరుగుతుందని భావిస్తోంది. అదే నీటి విడుదలను నిలిపేసిన సమయంలో మాత్రం పూర్తిగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని యోచిస్తోంది. దీనిపై నాలుగు రోజుల కింద ప్రయోగాత్మకంగా ప్రధాన కాల్వల పరిధిలో 9 గంటల పాటు విద్యుత్ సరఫరాను తగ్గిస్తే దిగువకు ఏకంగా 400 క్యూసెక్కుల ప్రవాహం పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పెద్దల ఆమోదం తర్వాత దీనిని అమలు చేసే అవకాశముంది. దీనికితోడు వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలతో కాల్వలపై నిరంతర పర్యవేక్షణ జరిపించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. చివరి భూముల రైతుల్లో గుబులు ఎగువ నుంచి నీరు సరిగా రాక పోతుండటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి ప్రాంతం (టెయిల్ ఎండ్)లోని.. పెద్దపల్లి, రామగుండం పరిధిలోని డి–83, డి–86 కాల్వలకు, జగిత్యాలలోని కొన్ని ప్రాంతాలకు నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పొంచి ఉన్న సాగునీటి కష్టాలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగి పంటకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో చివరి తడులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: యాసంగికి నీటి విడుదల ప్రారంభమైన 2017 డిసెంబర్ 25 నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ యాసంగి సీజను (2016 డిసెంబర్ 25) నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత సీజనుతో పోల్చితే ఈ ఏడాది నీటి నిల్వ సగానికి తగ్గడంతో ఆయకట్టుకు సాగునీరం దడం ప్రశ్నార్థకమవుతోంది. చివరి తడులకు ఇబ్బందులు..? ఈ యాసంగి సీజనులో ప్రాజెక్టు కింద మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం డిసెంబర్లో నిర్ణయించింది. లక్ష్మి కాలువ కింద నిజామాబాద్ జిల్లా పరిధిలో 16 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ కింద ఉన్న మరో 16,300 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో సుమారు 3.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని భావిస్తున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని ఎల్ఎండీ ఎగువ భాగం వరకు ఆయకట్టుకు సాగునీటిని అందించేలా నీటి పారుదలశాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తం ఎనిమిది తడులు నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. కాకతీయ కాలువకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నారు. మొదట్లో రోజుకు ఐదు వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.అయితే చివరి ఆయకట్టుకు సాగునీరు చేరకపోవడంతో ఇప్పుడు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కో తడికి 4.8 టీఎంసీల చొప్పున నీరు జలాశయం నుంచి విడుదలవుతోంది. ఈ లెక్కన ఎనిమిది తడులకు సుమారు 38.4 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటుంది. కానీ నీటి విడుదల ప్రారంభించే నాటికి జలాశయంలో 47 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. డెడ్స్టోరేజీ, ఎవాబ్రేషన్ లాస్, తాగునీటి అవసరాలు పోగా కేవలం సుమారు 33 టీఎంసీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. కానీ ఎనిమిది తడులకు 38.4 టీఎంసీల నీటి అవసరం ఉన్న నేపథ్యంలో సుమారు ఐదు టీఎంసీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పంట కీలక దశ చివరి తడికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ «అధికారులు సూచిస్తున్నారు. గత యాసంగి సీజనులో 80 టీఎంసీలు.. గతేడాది ఈ యాసంగి సీజను ప్రారంభమయ్యే నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఈసారి 47 టీఎంసీలే ఉండటంతో సాగునీటి ఇబ్బందులు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా గతేడాది యాసంగి సీజను మాదిరిగానే ఈసారి కూడా ఆయకట్టు రైతులు వరి వైపే మొగ్గుచూపడంతో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టులో నీటి లభ్యత దృష్ట్యా ఇందుకు రైతులు సహకరించాలి.’’ అని ఎస్సారెస్పీ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
రెండు తడులకే 10 టీఎంసీలు ఖాళీ
బాల్కొండ: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఈ ఏడాది యాసంగిలో పంటలకు 33 టీఎంసీల నీటిని 8 తడులకు అందించే లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ రెండు తడులకే 10 టీఎంసీల నీరు వినియోగమైంది. దీంతో ఎస్సారెస్పీలో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. డిసెంబర్ 25 నుంచి వారబందీ ప్రకారం కాలువల ద్వారా పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల నాటికి ప్రాజెక్ట్లో 47టీఎంసీల నీటి నిల్వ ఉంది. బుధవారం నాటికి రెండు తడులు పూర్తి కాగా, ప్రాజెక్ట్లో 37 టీఎంసీలకు నీటిమట్టం తగ్గిపోయింది. రెండు తడులకే ప్రాజెక్ట్లో 10 టీఎంసీల నీరు తగ్గుముఖం పట్టగా, మరో 6 తడులకు నీరు అవసరం ఉంటుంది. అంటే ఈ లెక్కన మరో 30 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ అధికారులు ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు 33 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించి, మిగితా నీటిని తాగునీటి అవసరాల కోసం, డెడ్స్టోరేజీ, నీటి ఆవిరికి లెక్కలు వేశారు. భానుడు ప్రతాపం చూపితే.. ప్రస్తుతం ఎండలు అంతగా లేకపోవడంతో రెండుతడులకు 10 టీఎంసీల నీటి వినియోగమే జరిగింది. కానీ రానున్న రోజుల్లో భానుడు ప్రతాపం చూపితే నీటి అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో 6 తడుల కోసం నీటి అవసరం ఎంతగా ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క టీఎంసీతో 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేపట్టవచ్చని ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు 40 టీఎంసీల నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్ణయించి, 33 టీఎంసీల నీటి వినియోగం చేపట్టాలని ఎలా ప్రణాళిక చేశారో అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా వారబందీలో పలు మార్పులు చేస్తూ నీటి విడుదల చేపడుతున్నారు. ప్రణాళిక ప్రకారం కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటి సరఫరా చేపట్టవద్దు. కానీ చివరి ఆయకట్టు వరకు నీటి సరఫరా అందడం లేదని ముందుగా 6 వేల క్యూసెక్కులకు పెంచారు. తరువాత 6500 క్యూసెక్కులకు పెంచారు. వారబందీలో తక్కువ రోజుల్లో ఎక్కువ నీటి సరఫరా చేపట్టే ప్రయోగం చేశారు. అయినా చిక్కులు తప్పడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయవద్దని ప్రాజెక్ట్ ఉన్నత అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయకట్టు రైతులు అధికారులతో సహకరించాలని కోరుతున్నారు. నీటిని వృథా చేయవద్దు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా విడుదలయ్యే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నీటి వినియోగం, నీటి నిల్వపై ప్రభావం ఉంది. రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. అందరి సహకారంతో పంటలను గట్టెక్కించేలా నీటి సరఫరా చేపడుతాం. – శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ -
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం
డిసెంబర్ 15 నుంచి రబీ యాక్షన్ప్లాన్ అమలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆరునూరైనా రబీ రైతుల ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 15 నుంచి నీటి విడుదలపై రబీ యాక్షన్ప్లాన్ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, హన్మకొండ డివిజన్లలో ఇంజినీరింగ్ అధికారులతో సమీ„ýక్షలు నిర్వహిస్తున్నాం. వీటి అనంతరం డిసెంబర్ 15 నుంచి నీటి విడుదల ప్లాన్ను అమలు చేస్తాం. రబీలో ఆరుతడి పంటలకే సాగునీరు.. రబీ కోసం నీటిని విడుదల చేసేందుకు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేస్తాం. ఆరుతడి పంటల కోసం సాగునీరు అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 55 టీఎంసీల నీరుంది. అలాగే ఎల్ఎండీలో 7 టీఎంసీలు ఉంది. ఎల్ఎండీ పైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం అయ్యింది. అందుకు సరిపడేలా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు ఆదేశాల మేరకు నిజాంసాగర్ ద్వారా 15 టీఎంసీల సింగూరు జలాలను ఎస్సారెస్పీకి తరలిస్తున్నాం. రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీకి 5 టీఎంసీలు నింపేందుకు రెండు రోజుల నుంచి 2000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశాం. మిషన్ భగీరథకు ప్రథమ ప్రాధాన్యం.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ప్రజలకు ఇంటింటికీ నల్లానీరు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మేరకు ఎస్సారెస్పీలో 6.50 టీఎంసీలు, ఎల్ఎండీలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, మిగతా నీటిని రబీ ఆరుతడి పంటలకు విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ మేరకు కాల్వల ద్వారా నీటి తరలింపు నేపథ్యంలో ఏ మేరకు ప్రాజెక్టులకు నీరు చేరుతుందో చూసిన తర్వాత రబీ యాక్షన్ప్లాన్ను అమలు చేస్తాం. ఈ క్రమంలోనే పాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో డివిజన్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు జరుపబోతున్నాం. ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఇప్పటికే సమీక్ష.. ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింది ప్రజలకు సాగు, తాగునీరు అందించే విషయమై ఇప్పటికే సమీక్షలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్ పాత కరీంనగర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథకు 12.50 టీఎంసీల నిల్వ చేయడంతో పాటు ఎస్సారెస్పీ, ఎల్ఎండీల ద్వారా రబీలో ఆరుతడి పంటలకు సాగునీరందించేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆయకట్టుకు నీరందేలా తాత్కాలిక మరమ్మతులు.. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సింగూరు మంజీరా జలాలను ఎస్సారెస్పీ, ఎల్ఎండీలకు తరలించిన పిమ్మట ప్రణాళికబద్ధంగా రబీకి నీటి విడుదల చేయనున్నాం. ఆరుతడి పంటలు వేసే రైతులకు వారబందీ, ఆన్అండ్ఆఫ్ 4–5 దఫాలు నీటి సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా కాల్వల్లో చెట్లు, పూడిక ఉంటే అందుబాటులో ఉండే కాంట్రాక్టర్లతో తాత్కాలిక మరమ్మతులు చేయిస్తాం. సరిగా నీటి సరఫరా అయ్యేలా చూస్తాం. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
24న ‘ఎస్సారెస్పీ’ విడుదలపై సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంటలకు నీటి విడుదల విషయమై ఈ నెల 24న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. వరంగల్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు సీఎంతో పాటు వచ్చిన మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీ వినోద్లు ఎస్సారెస్పీ నుంచి పంటలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం.. మంత్రి హరీశ్రావుతో ఫోన్లో మట్లాడారు. నీటి విడుదల అంశంపై చర్చించారు. ఈ మేరకు ప్రగతిభవన్లో 24న ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రతినిధులు, అధికారులతో సమావేశమై నీటి విడుదలపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాజెక్టులో 55.24 టీఎంసీల నీరు.. ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 55.24 టీఎంసీల లభ్యత జలాలున్నాయి. మరో 35.07 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 9.68 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ప్రస్తుత ఖరీఫ్లో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అడపాదడపా నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాది రబీలో ఏకంగా 8.6లక్షల ఎకరాలకు సాగునీరందింది. ప్రస్తుత ఏడాది సైతం రబీ పంటకు నీరందించాలని రైతుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. -
శ్రీరాంసాగర్ లోకి భారీగా ఇన్ఫ్లో
నిజామాబాద్ : ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు ఎస్సారెస్పీ డీఈఈ జగదీశ్ తెలిపారు. ఈ జలాలు ఎస్సారెస్పీకి సోమవారం మధ్యాహ్నానికి చేరుకుంటాయన్నారు. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1074.00 అడుగుల (37.379 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకూ వరద కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 698.575 అడుగులు (7.233 టీఎంసీలు) ఉన్నది. ఆదివారం ప్రాజెక్టులోకి 735 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. కుడి కాల్వ ద్వారా 19 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 841 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద
నిజామాబాద్ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతోంది. బుధవారం నాటికి ప్రాజెక్టులోకి 30,664 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1071.9 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటినిల్వ 32.9 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు. -
రాష్ట్రానికి జీవధార
-
రాష్ట్రానికి జీవధార
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంతో రాష్ట్రం సస్యశ్యామలం పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో ప్రసంగం ఏడాదిలోగా ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు ఆగమేఘాలపై పనులు పూర్తి చేస్తాం వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందిస్తాం ఇక ముందు ఏటా శ్రీరాంసాగర్ పూర్తిగా నిండుతుంది తెలంగాణ సాధిస్తానని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టమీదే ఆన చేసిన అనుకున్నట్లుగానే తెలంగాణ సాధించుకున్నం ఆంధ్రా పాలకుల ప్రాజెక్టులు మోసపూరితం.. అవేవీ నీళ్లిచ్చేవి కాదు టీఆర్ఎస్ సర్కారుకు పేరు రావొద్దనే కాంగ్రెస్ నేతల కుట్రలు కేసులతో ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నరు వారిని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు సాక్షి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం రాష్ట్రానికి జీవధార అని.. దీనితో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఆగమేఘాలపై ఈ పథకం పనులు పూర్తిచేస్తామని... వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్ను నింపుతామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తయితే ఏటా ఫిబ్రవరి, మార్చిలోగా 90 టీఎంసీల నీళ్లు ఈ ప్రాజెక్టులోకి వస్తాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం పనులకు కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వరద కాలువ జీరో పాయింట్ వద్ద నిర్మించిన పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ఒక్కసారి ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపుకొంటే నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. బాల్కొండ, మెట్పల్లి, వేములవాడ, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి వెళ్లే వరద కాలువలో ఏడాదంతా నీటి నిల్వ ఉంటుందన్నారు. తద్వారా చేపలు, చెట్లు, నేలలో తేమశాతం పెరుగుతుందని.. ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రా పాలకులు కట్టిన ప్రాజెక్టులు మోసపూరితం ఎస్సారెస్పీకి పునాదిపడి 54 ఏళ్లు గడిచినా ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాలువ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పనులన్నింటిని తాము పూర్తిచేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రా పాలకులు కట్టిన ప్రాజెక్టులన్నీ మోసపూరితమైనవని, అవి నీళ్లిచ్చే ప్రాజెక్టులు కాదని ఆరోపించారు. 2001లో గులాబీ జెండా ఎగురవేసిన తర్వాత జలసాగర్ ఉద్యమం చేశామని గుర్తు చేశారు. ‘‘ఆంధ్రా పాలనలో ఇచ్చంపల్లి ఇచ్చకాయల పాలైంది.. నిజాంసాగర్ వట్టిపోయింది.. మెదక్ జిల్లా ఘనపురం నాశనమైంది.. దిండిలో బండలు తేలినయి.. కోయల్సాగర్ను కొంగలు ఎత్తుకెళ్లినయి.. అప్పర్ మానేరు అడుగంటింది.. చెరువులన్నీ తాంబాలాల్లెక్క మారినయి..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని.. ఈ తరుణంలో సాగునీటి కోసం మొదటిదశలో మిషన్ కాకతీయ చేపట్టి చెరువులను బాగు చేసుకునే పనులు ప్రారంభించామని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి గోదావరి, కృష్ణా జలాలను ఆయకట్టుకు తరలించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆనకట్టపైనే ఆన చేసిన.. ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని 1996లో శ్రీరాంసాగర్ ఆనకట్ట మీద ఆన చేశానని.. అనుకున్నట్లుగానే తెలంగాణ సాధించానని కేసీఆర్ చెప్పారు. ‘‘1996లో ఉప ఎన్నిక కోసం నిర్మల్కు వచ్చిన సందర్భంగా ఎస్సారెస్పీని సందర్శించిన. అప్పుడు ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్, ఆయిల్ లేదు.. తాళ్లు సిలుమెక్కినయి. కట్టపై రోడ్లు మోకాళ్ల లోతు గుంతలు పడ్డయి. అదే ఆంధ్రాకు నీటిని తీసుకెళ్లే నాగార్జునసాగర్ ప్రాజెక్టు మాత్రం వైష్ణవాలయంలా ధగధగలాడుతుంటే... తెలంగాణ ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ శివాలయంలా తయారైందని ఆ రోజే నా స్నేహితుడైన సత్యనారాయణగౌడ్కు చెప్పిన. అన్యాయం ఎక్కువైతే తిరుగుబాటు వస్తుందని, మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చి తీరుతుందని చెప్పిన. అసలు నేనే ఉద్యమం ప్రారంభిస్తానని ఆనకట్ట మీద ఆన చేసిన.. అనుకున్నట్లుగనే తెలంగాణను సాధించుకున్నం..’’అని పేర్కొన్నారు. ఇప్పడు తానే ముఖ్యమంత్రి హోదాలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెసోళ్లను నిలదీయండి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై 96 కేసులు వేశారని... సుందిళ్ల, అన్నారం, మల్లన్నసాగర్, పాములపర్తి రిజర్వాయర్ల విషయంలో పంచాయితీలు పెడుతున్నారని ఆరోపించారు. కొండపోచమ్మ రిజర్వాయర్కు 4,600 ఎకరాలు అవసరమైతే 4,510 ఎకరాల భూసేకరణ పూర్తయిందని... కేవలం 90 ఎకరాలకు మాత్రమే కాంగ్రెస్ నేతలు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. 25 రోజుల్లో 6 కేసులు వేశారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని.. మౌనం పాటిస్తే మనం నష్టపోతామని పేర్కొన్నారు. యాసంగి నుంచి 24 గంటల విద్యుత్ తెలంగాణ వచ్చాక రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రంలో కరెంట్ బాధలు లేకుండా చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు. వచ్చే యాసంగి నుంచే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు తెలంగాణ ప్రజలను ఏడిపించారని... వారి పాలనలో ట్రాన్స్ఫార్మర్లు, బోర్లు కాలిపోతుండేవని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మహిళలు వడ్డీలేని రుణాలు కోరుతున్నారని, వెంటనే రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాలుగు జీవధారలతో సస్యశ్యామలం నాలుగు జీవధారలతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. పెన్గంగ వంటి మొదటి జీవధార ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తోందన్నారు. రెండో జీవధార రాష్ట్రంలో 200 కిలోమీటర్లపైన ప్రవహించే గోదావరి నది అని.. అది ఎప్పటికీ 70, 80 టీఎంసీలతో నిండి ఉంటుందని తెలిపారు. ఇక మూడో జీవధార ఎస్సారెస్పీ వరద కాలువ అని, ఇది శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపడంతో పాటు, నిర్మల్, నిజామాబాద్, లోయర్మానేరు, మిడ్ మానేర్ మీదుగా వరంగల్ దాటి పోతుందని చెప్పారు. నాలుగో జీవధార మిడ్మానేరు నుంచి అనంతగిరి, రంగనాయకి సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా హైదరాబాద్ వరకు కొనసాగుతుందన్నారు. తాను ఈ అంశాన్ని మంత్రులందరికీ చెప్పానని, ప్రజలకు వివరించాలని సూచించామని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో 40 లక్షల నుంచి 45 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టు వరద కాల్వ జీరో పాయింట్ వద్ద నిర్మించిన పైలాన్ను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వమంతా హాజరు.. దాదాపుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం మొత్తం పోచంపాడు బహిరంగ సభకు హాజరైంది. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల, తలసాని, మహేందర్రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, వినోద్కుమార్, బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, షకీల్, హన్మంత్ షిండే, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, రాజేశ్వర్రావు, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా మంత్రి కేటీఆర్ సభా స్థలానికి చేరుకోలేక వెనుదిరిగారు. రాష్ట్రానికి ఊపిరినిచ్చే ప్రాజెక్టు ఇది: హరీశ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఊపిరినిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ ముంపు, అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు ఇది నీరందించగలదని తెలిపారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై కేసీఆర్ ఈ ప్రత్యేక పథకానికి రూపకల్పన చేశారని కొనియాడారు. కాళేశ్వరం నీటిని తరలించేందుకు అవసరమైతే మూడు షిఫ్టుల్లో ఉద్యోగులతో పని చేయించాలని సీఎం సూచించారని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వచ్చే నీటి శాతం తగ్గిపోతోందని.. దాంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం ఆదేశాలను ఓ భగవద్గీత, ఓ ఖురాన్లా పవిత్రంగా భావించి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాగునీటి పథకాలతో టీఆర్ఎస్కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారన్నారు. ట్రాఫిక్లో ఇరుక్కున్న కేటీఆర్ – సభకు వెళ్లకుండానే వెనక్కి.. – సెల్ఫీలు దిగేందుకు పోటీపడిన యువకులు భీమ్గల్ (బాల్కొండ): పోచంపాడ్ వద్ద బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. సీఎం సభకు వచ్చిన వాహనాలతో జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. కొద్దిసేపు ప్రయత్నించి.. సభా స్థలం సమీపం వరకు వెళ్లగలిగారు. అయితే అప్పటికే సభ పూర్తయి కేసీఆర్ వెళ్లిపోవడంతో.. కేటీఆర్ వెనుదిరిగారు. అయితే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సమయంలో సభకు వస్తున్న యువకులతో కేటీఆర్ సరదాగా సెల్ఫీలు దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో యువకులు ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. -
దిగువ నుంచి ఎగువకు గోదావరి!
► పునరుజ్జీవంతో ఎస్సారెస్పీకి మహర్దశ ► రివర్స్ పంపింగ్తో ఐదు జిల్లాలు సస్యశ్యామలం ► 10న పోచంపాడులో సీఎం శంకుస్థాపన సాక్షి, కరీంనగర్/నిర్మల్ రూరల్: ఉత్తర తెలం గాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పథకంతో మహర్దశ పట్టనుంది. గోదావరి వరద ఆధారంగా నిర్మించిన ఎస్సా రెస్పీకి మహారాష్ట్ర ప్రాజెక్టులు అడ్డంకిగా మారగా.. కాళేశ్వరం పథకంతో గోదావరి నుంచి నీటిని దిగువ నుంచి ఎగువకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసే మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం 40 ఎకరాల భూసేకరణ, 156 మెగావాట్ల విద్యుత్తో ఎస్సారెస్పీని నింపే ఈ పథకానికి రూ.1,060కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసింది. మహారాష్ట్ర ఎగువన నిర్మించిన బాబ్లీ సహా 51 ప్రాజెక్టులు, ఆనకట్టలతో ఎస్సా రెస్పీకి సమృద్ధిగా నీరు చేరిన సందర్భాలు లేవు. ఈ ఏడాది అంతటా వర్ష్షపాతం తక్కు వగా ఉండటంతో గోదావరిలో ప్రవాహం లేక పోగా, మహారాష్ట్రలోని ఎత్తిపోతలతో చుక్క కూడా ఎస్సారెస్పీలోకి రాలేదు. కాళేశ్వరం వద్ద రోజుకు 4 టీఎంసీల చొప్పున ఇప్పటికే 225 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ నేపథ్యంలో నీరు వృథా కాకుండా రివర్స్ పంపింగ్ ద్వారా మూడు ప్రాంతాల్లో లిఫ్టులు ఏర్పాటు చేసి ఎస్సారెస్పీని నింపేందుకు పునరుజ్జీవన పనులకు శ్రీకారం చుట్టారు. రివర్స్ పంపింగ్ ఇలా... ఎస్సారెస్పీలోకి నీరు రావాలంటే ఇక మహా రాష్ట్రపై ఆ«ధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందుకు గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేయనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలిస్తారు. ఈ క్రమం లో మూడుచోట్ల ఎత్తిపోతలను నిర్మించాలని నిపుణులు సూచించారు. కాళేశ్వరం నుంచి 140 కి.మీ. మేర ఎత్తిపోతలు నిర్మించి నీటిని తీసుకొస్తారు. మొత్తం ఏడు ఎత్తిపోతలు నిర్మి స్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఎత్తిపోతలకు సంబంధించిన పంపుహౌస్ నిర్మాణపనులు కాళేశ్వరం పథకంలో భాగంగా కొనసాగుతున్నాయి.ఎల్లంపల్లి, నంది మేడా రం వద్ద ఇదివరకే పంపుహౌస్ నిర్మాణ పనులు పూర్తయి వినియోగంలో ఉండగా, వరదకాలు వపై మూడు ఎత్తిపోతల పనులు, పంపుహౌస్ నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు, దాని నుంచి ఎల్లంపల్లి జలాశ యంలోకి తరలిస్తారు. నంది మేడారం చెరువు సామర్థ్యం పెంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారానికి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని వరదకాల్వలోకి తరలిస్తారు. వరదకాల్వ ద్వారా మధ్యమానేరు, ఎస్సారెస్పీ లకు నీటి సరఫరా చేసేందుకు మూడు ఆనకట్టలు నిర్మించి, రోజుకు టీఎంసీ చొప్పున మధ్యమానేరు, ఎస్సారెస్పీలోకి పంపిస్తారు. బాగా వర్షాలు పడే సమయంలో జూలై నుంచి 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని తరలిస్తే, ఆ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 14 లక్షల ఎకరాలు ఆయకట్టు, దానిపై ఆధారపడిన ఎత్తిపోతలు, ఇతర స్కీములకు సమృద్ధిగా నీరు అందుతుంది. 10న సీఎం శంకుస్థాపన.. ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకానికి సీఎం కేసీఆర్ ఈ నెల 10న పోచంపాడులో శంకు స్థాపన చేయనున్నారు. ఉత్తర తెలంగాణలో పూర్వ ఐదు జిల్లాల్లో సుమారు 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగించే ఈ పథకం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్సారెస్పీ ఆయకట్టులో లబ్ధిపొందే ప్రాంతాలకు చెందిన సుమారు ఐదు లక్షల మంది రైతులను ఈ శంకు స్థాపన కార్యక్రమంలో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మొత్తానికి ఇన్చార్జిగా మంత్రి ఈటల రాజేందర్ను నియమించగా, జిల్లాల వారీగా మంత్రులను.. ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించారు. -
సీఎం కేసీఆర్ రైతుగా ఆలోచిస్తున్నారు
► ఆయన నిర్ణయాలతో సాగునీటి రంగం బలోపేతం: హరీశ్ ► ఏపీ పాలకులు తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదు ► ఎస్సారెస్పీని నిర్వీర్యం చేశారు.. దానికి మళ్లీ ప్రాణం పోస్తాం ► అందుకే ఎస్సారెస్పీ పునర్జీవన పథకం ► పథకానికి 10న సీఎం శంకుస్థాపన.. అక్కడే బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఎంతో అన్యాయం జరిగింది. ఏపీ పాలకులు తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు సోయి లేక ఎంతో నష్టం వాటిల్లింది. సీఎం కేసీఆర్ ఒక రైతుగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో సాగునీటి రంగం బలోపేతమవుతోంది. ఇందులో భాగంగానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణకు మరో రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తాం. మొత్తంగా రూ.2 వేల కోట్లతో పనులు మొదలు కానున్నాయి’’అని మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని తీసుకుంటూ ఎస్సారెస్పీ వరద కాల్వలను జలాశయంగా వాడుకుంటామని, మూడు చిన్న ఎత్తిపోతల ద్వారా ఆ నీటిని ఎస్సారెస్పీ జలశయానికి చేరుస్తామని చెప్పారు. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 80 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేయలేకపోతున్నామన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి ఈ నెల 10న సీఎం శంకుస్థాపన చేస్తారని, అదేరోజు మధ్యాహ్నం ప్రాజెక్టు వద్ద రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. గోదావరిపై తెలంగాణలోని ముఖ్యమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఇప్పటి దాకా చుక్కనీరు రాలేదని, అదే మేడిగడ్డ వద్ద నిత్యం లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా కిందకు వెళ్లిపోతోందని హరీశ్ పేర్కొన్నారు.1964లో మొదలైన ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు ఒక్కసారి కూడా నీరివ్వలేదని చెప్పారు. గతేడాది ఎస్సారెస్పీ ప్రాజెక్టు తాగునీరు కూడా అందివ్వలేక పోయిందని, ఇదంతా గత పాలకులైన కాంగ్రెస్, టీడీపీల పుణ్యమని హరీశ్ ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే ఎస్సారెస్పీ పునర్జీవన పథకం చేపట్టినట్టు వివరించారు. ఉమ్మడి పాలనలో అక్కడ అలా.. ఇక్కడ ఇలా! ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలోని ధవళేశ్వరం, ప్రకాశం, సుంకేసుల ఆనకట్టలన్నింటినీ బ్యారేజీలుగా మార్చుకున్నారని, కేసీ కెనాల్ను ఆధునీకరించారని కానీ తెలంగాణలోని సదర్మట్ను విస్మరించారని హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చాకే సదర్మట్ను బ్యారేజీగా మార్చేందుకు రూ.315 కోట్లు విడుదల చేశామని, దీనివల్ల 1.6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టను విస్మరించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి భూసేకరణ కూడా పెద్దగా అవసరం లేదని కేవలం 40 ఎకరాలు సేకరిస్తే సరిపోతుందని, 156 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, మూడు దశల్లో 33 మీటర్లు ఎత్తి పోస్తే ఎస్సారెస్పీ జలాశయానికి నీటిని చేర్చొచ్చని వివరించారు. -
ఆయకట్టుకు ‘శ్రీరామ’రక్ష!
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు - ఎస్సారెస్పీ–వరద కాల్వ లింకుతో 11 లక్షల ఎకరాల స్థిరీకరణ సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ఇక కళకళలాడనుంది! ప్రాజెక్టు పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ‘కాళేశ్వరం’ నీళ్లతో భరోసా లభించనుంది. ఎగువ నుంచి వరదొచ్చినా రాకున్నా, ప్రాజెక్టు పరిధిలో వర్షాలు కురిసినా కురవకున్నా.. ఇక నీళ్లకు ఢోకా ఉండబోదు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులపాటు 60 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సారెస్పీ–ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) లింకు పథకం ద్వారా 11 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 40 ఎకరాల భూసేకరణ మాత్రమే అవసరం కానుంది. తక్కువ వ్యయం, తక్కువ ముంపు గరిష్ట ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకానికి ప్రాధాన్యం ఇస్తోంది. వెయ్యి కోట్లతో అనుమతులు.. గోదావరిలోని 75 శాతం డిపెండబులిటీ జలాల ప్రకారం ఎస్సారెస్పీకి 196 టీఎంసీల నీటి లభ్యత ఉండాల్సింది. అయితే ఎగువన మహారాష్ట్ర కట్టిన వివిధ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కారణంగా దిగువకు ప్రవాహాలు పడిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే గోదావరిలో నీటి లభ్యత గత ఇరవై ఏళ్లలో 196 టీఎంసీల నుంచి 54 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు ఈ నీటిపై ఆధారపడిన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వల కింది ఆయకట్టుకు, గుత్పా, అలీసాగర్, చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన 95 టీఎంసీల నీటి అవసరాల్లో భారీగా కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ఒక ప్రతిపాదన రాగా, ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు వరుసగా 11 బ్యారేజీలు నిర్మాంచాలని మరో ప్రతిపాదన వచ్చింది. అయితే దీనికి సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయం అయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని ఎఫ్ఎఫ్సీ (ఇందిరమ్మ వరద కాల్వ) ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించింది. దీనికి రూ.1,067 కోట్లతో అనుమతులు ఇచ్చింది. ఈ పథకం అమల్లోకి వస్తే ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్ కింద 5.50 లక్షల ఎకరాలు, సరస్వతి కెనాల్ కింద 40 వేలు, లక్ష్మీ కెనాల్ కింద 20 వేలు, కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 కింద లక్ష ఎకరాలు, ప్యాకేజీ 21, 22 కింద 3.50 లక్షలు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ లిఫ్ట్ పథకాల కింద మిగతా ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఇలా ఎఫ్ఎఫ్సీకి ఇరువైపులా దాదాపు లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉన్నది. ఇందిరమ్మ వరద కాల్వ తవ్వకాలు జరిపినపుడు చుట్టు పక్కలలో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎండిపోయాయి. కాల్వల దగ్గర తలపెట్టిన తూముల నిర్మాణంతో నీటిని లిఫ్ట్ చేసుకొని రైతులు పంపుల ద్వారా నీటిని తరలించుకోవచ్చు. దీంతో పాటే మిషన్ భగీరథకు అవసరమైన 7.76 టీఎంసీల నీటి అవసరాలను సైతం ఈ పథకం తీర్చుతుంది. ఇక ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరిగి వరదలు వచ్చినా ముందున్న ప్రణాళికల ప్రకారం ఎఫ్ఎఫ్సీ నుంచి మిడ్ మానేరుకు నీటిని మళ్లించవచ్చు. నీళ్లున్నప్పుడు ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగనుండగా, నీళ్లు లేనప్పుడు దిగువ నుంచి ఎగువకు నీటిని తీసుకుంటారు. నీటి రివర్స్ పంపింగ్ ఇలా.. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులపాటు 60 టీఎంసీలను మూడు స్టేజ్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేసి ఎస్సారెస్పీకి తరలిస్తారు. ► కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వను 102వ కి.మీ. వద్ద వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) క్రాస్ చేస్తుంది. ఇక్కడ్నుంచి ఒక టీఎంసీ నీటిని 68వ కి.మీ., 32వ కి.మీ. వద్ద రెండు దశల్లో 5 పంపుల ద్వారా 8828 క్యూసెక్కుల నీటిని 10 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తారు. ► తర్వాత 18వ కి.మీ. వద్ద మరో 5 మోటార్లతో 11 మీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేస్తారు. ► ఈ మూడు స్జేజీల విధానం ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ జలాశయానికి చేరతాయి. నేడు టెండర్లు.. ఈ పథకానికి సోమవారం టెండర్లు పిలిచేలా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏడాదిలో దీన్ని పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
ఇందిరమ్మ వరద కాల్వ వ్యయం రెట్టింపు!
► దేవాదులలోని 2లక్షల ఎకరాల ఆయకట్టు చేర్చడంతో పెరిగిన వ్యయం ► అంచనా రూ.4,729కోట్ల నుంచి 9,886 కోట్లకు పెంపు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడి చేపట్టిన ఇంది రమ్మ వరద ప్రవాహ కాల్వ (ఎఫ్ఎఫ్సీ) వ్యయం రెట్టింపు కానుంది. ప్రాజెక్టు ప్రస్తుత అంచనా రూ.4,729 కోట్లు ఉండగా, రీ ఇంజనీరింగ్లో భాగంగా జరిగిన మార్పు లతో దాని వ్యయం రూ.9,886 కోట్లకు చేరనుంది. సవరించిన అంచనాలకు ఆమో దం తెలపాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా త్వర లో దీనికి ఆమోదం లభించనుంది. 1,331 కోట్లతో ఆరంభమై 9 వేల కోట్లకు ఎస్సారెస్పీ దిగువ తీరం నుంచి 20 టీఎంసీల వరద నీటిని వినియోగించుకుంటూ 2.20 లక్షల ఎకరాలకు నీటినిచ్చేలా ఎఫ్ఎఫ్సీని చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పరిధిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దేవాదుల పరిధిలోని ఆయ కట్టును ఎఫ్ఎఫ్సీలోకి తెస్తూ కీలక నిర్ణయం జరిగింది. గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.18 టీఎంసీల నీటిని దేవాదుల ప్రాజెక్టుకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజె క్టును చేపట్టారు. ఇక్కడ వరద కేవలం 120 రోజులే ఉంటుందని, 27టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని లెక్కగట్టారు. ఈ నీటితో ముందుగా నిర్ణయించిన 6.21లక్షల ఎకరా లకు సాగు నీరందించడం కుదరదని తేలింది. సుమారు 2లక్షల ఎకరాలకు నీటి కొరత ఏర్పడుతున్న దష్ట్యా, ప్రత్యామ్నాయంగా ఈ ఆయకట్టుకు వరద కాల్వల ద్వారా నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు కొత్తగా వరద కాల్వ ద్వారా నీటిని అందించా లంటే 3.3 కిలోమీటర్ల అదనపు టన్నెల్ నిర్మాణంతో పాటు 48 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ తవ్వాలని అధికారులు ప్రతిపాదిం చారు. దీంతో పాటే మిడ్మానేరు రిజర్వా యర్ కెనాల్ తొలి నుంచి 36 కిలోమీటర్ల వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,600 క్యూసె క్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచా లని ప్రతిపాదించారు. దీనికి తోడు గౌరవెల్లి రిజర్యాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8,23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి పెంచారు. దీనికి తోడు మిడ్మానేరు, ఇతర రిజర్వాయర్ల కింద భూసేకరణ, ఆర్అండ్ఆర్ ఖర్చు సైతం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుత అంచనా రూ.9,886కోట్లకు చేరింది. -
వరద కాల్వ నుంచి శ్రీరాంసాగర్కు ఎత్తిపోతలు
60 రోజుల పాటు రోజుకో టీఎంసీ తరలించేలా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించా లని, ఇందుకు అదనపు(సప్లిమెంటేషన్) ఎత్తిపోతల పథ కాన్ని చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పథకం సమగ్ర ప్రతిపాద నలు తయారు చేయాలంటూ ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద స్టేజ్–1లో 9.68లక్షలు, స్టేజ్–2 కింద 5లక్షల ఎకరాల ఆయకట్టుంది. అయితే 20 ఏళ్లుగా పూడిక పెరగడంతో ప్రాజెక్టు సామర్థ్యం 112 నుంచి 90 టీఎంసీలకు తగ్గింది. ఎగువన మహా రాష్ట్ర విచ్చిలవిడిగా బ్యారేజీలు, చెక్డ్యామ్లు కట్టడంతో దిగువకు వచ్చే ప్రవా హాలు 149 నుంచి 54 టీఎంసీలకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి నీరందించే పథకానికి ఇటీవల కేబినెట్ బృందం సిఫార్సు చేసింది. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2టీఎంసీల్లో రోజు కో టీఎంసీ 60రోజులపాటు ఎత్తిపోసేలా పథకాన్ని ప్రతి పాదించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పథకానికి వ్యయం రూ.650కోట్లు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకంలోని తపాస్ పల్లి, ఇతర డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని తరలించి చెరువులను నింపడానికి ఆఫ్టేక్ స్లూయిస్ల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వుని చ్చింది. ఇందుకు రూ.1.03కోట్లు విడుదల చేసింది. -
'సాక్షి' ఎఫెక్ట్ : ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ వరద కాలువకు శనివారం నీటిని విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి నిబంధనలకు విరుద్ధంగా వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో.. 25 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆశలు, ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తీరు మారాలన్నారు. ప్రతిపక్షాలు సూచనలు చేయాలి కానీ ప్రతి పనికి అడ్డుపడటం సరికాదని హితవు పలికారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు నెలకు రూ. వెయ్యి పెన్షన్ అందజేయనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై 'సాక్షి'లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. -
ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. -
బాబ్లీ గేట్లు బంద్..
బాల్కొండ: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను శనివారం మూసివేశారు. దీంతో ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉండాలి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక్కో గేటును క్రమంగా దించుతూ మొత్తం 14 గేట్లను మూసివేశారు. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, దించడం త్రిసభ్య సమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరగాలన్న కోర్టు ఆదేశాల మేరకు.. ఎస్సారెస్పీ ఎస్ఈ సత్యనారాయణ, నాందేడ్ ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్ సమక్షంలో గేట్లను మూసివేశారు. దీంతో, వచ్చే జూలై 1 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి కానీ, ఎగువ ప్రాంతాల నుంచి కాని ఎస్సారెస్పీలోకి చుక్క నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. -
జలకళతో ఉట్టిపడుతోన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
-
ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టునికి సోమవారం కూడా వరద నీరు వచ్చిచేరుతోంది. సుమారు లక్ష క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా వస్తుండగా.. అంతే మొత్తంలో నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా..ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు ఉంది. -
ఎస్సారెస్పీ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీ అధికారులు 40 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 1.70 లక్షల క్యూసెక్కు నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు ఉంది. -
మూడు జిల్లాల్లో హై అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలోని మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదతో శనివారం సాయంత్రానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 3.60 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారిని అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. -
ఎస్సారెస్సీ కాలువకు భారీ గండి
-
ఎస్సారెస్సీ కాలువకు భారీ గండి
కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్సీ కాలువకు మంగళవారం ఉదయం భారీ గండి పడింది. నీరంతా వృథాగా పోతోంది. కాలువ నీరు దమ్మక్క చెరువు భారీగా చేరుతుండడంతో దమ్మక్కచెరువుకు గండిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. గండి ఫలితంగా మ్యాడంపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఎమ్మెల్యే బి.శోభ సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. గత కొద్ది రోజులుగా ఎస్సారెస్సీ నుంచి కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్కు 6500 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు. కాలువ మరమ్మతు పనులు ల్పోభూయిష్టంగా ఉండడంవల్లే గండి పడిందని స్థానికులు పేర్కొన్నారు.