third ODI
-
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై ఇంగ్లండ్ను టి20ల్లో చిత్తు చేసిన తర్వాత వన్డే సిరీస్ కూడా గెలుచుకొని భారత జట్టు ఒక లాంఛనం ముగించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒకే ఒక వన్డే అందుబాటులో ఉంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది కాబట్టి బెంచీపై ఉన్న ఆటగాళ్లకు మేనేజ్మెంట్ ఒక అవకాశం ఇస్తుందా లేక విజయాల బాటలో ఉన్న జట్టును కొనసాగించి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ కోణంలో ఇది కాస్త పరువు దక్కించుకునే ప్రయత్నం. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్లలో 6 ఓడి నిరాశలో మునిగిన టీమ్ కనీసం చివరి పోరులోనైనా గెలిచి పర్యటనను ముగించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం ఆఖరి పోరుకు వేదిక కానుంది. అహ్మదాబాద్: భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల పర్యటన చివరి అంకానికి చేరింది. సిరీస్ ఫలితం తేలిపోయిన తర్వాత నేడు మొతేరా లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే నామమాత్రపు చివరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు మరో విజయం కూడా కష్టం కాకపోవచ్చు. ఇక్కడా గెలిచి సిరీస్ను 3–0తో సాధించాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు కొంత కాలం క్రితం వరకు అభేద్యమైన టీమ్గా కనిపించిన ఇంగ్లండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో పూర్తిగా విఫలమై చేతులెత్తేసింది. ఈ పోరు తర్వాత ఇరు జట్లు చాంపియన్స్ ట్రోఫీ బాట పడతాయి. కోహ్లి కొడతాడా! చాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ భారత్ బెంగ తీర్చాడు. చక్కటి సెంచరీతో సత్తా చాటుతూ అతను ఫామ్లోకి వచ్చాడు. శుబ్మన్ గిల్ వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ విలువను చూపించారు. పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారడం వల్ల ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పంత్కు కాకుండా రాహుల్కే మరో అవకాశం దక్కవచ్చు. అయితే అన్నింటికి మించి ప్రధాన బ్యాటర్లలో విరాట్ కోహ్లి ప్రదర్శన కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్టు తర్వాత మొదలైన వైఫల్యం రంజీ మ్యాచ్ మీదుగా ఇక్కడ రెండో వన్డే వరకు సాగింది. అతని స్థాయిని బట్టి చూస్తే ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ అలాంటి ఇన్నింగ్సే ఇంకా రావడం లేదు. 14 వేల మైలురాయికి మరో 89 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్లోనే దానిని పూర్తి చేసుకుంటాడా చూడాలి. బౌలింగ్ విభాగంలో షమీ ఇంకా పూర్తిగా తన లయను అందుకోలేదని గత మ్యాచ్లో అర్థమైంది. యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా తడబడుతున్నాడు. అతని స్థానంలో అర్‡్షదీప్ను ఆడించే విషయంపై మేనేజ్మెంట్ చర్చిస్తోంది. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చడం మరో సానుకూలాంశం. ఓవరాల్గా అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా ఉంది. బాంటన్కు చాన్స్... ప్రత్యర్థితో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఒక్క ఆటగాడు కూడా తనదైన స్థాయి ప్రదర్శనను కనబర్చి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. రెండు వన్డేల్లో ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేసినా విజయానికి అది సరిపోలేదు. గతంలో చూపించి విధ్వంసకర బ్యాటింగ్ ఇంగ్లండ్ నుంచి రావడం లేదు. ఓపెనర్లు సాల్ట్, డకెట్ శుభారంభాలు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత దానిని ఇతర బ్యాటర్లు కొనసాగించలేకపోతున్నారు. కెపె్టన్ బట్లర్, జో రూట్ మాత్రమే నమ్మకమైన ఆటగాళ్లుగా కనిపిస్తుండగా, రెండో వన్డేలో హ్యారీ బ్రూక్ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒవర్టన్ స్థానంలో బాంటన్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు బౌలింగ్ పూర్తిగా బలహీనంగా కనిపిస్తోంది. భారత బ్యాటర్ల ముందు ఈ బౌలర్లంతా అనామకుల్లా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరిలో కూడా ప్రత్యర్థిని నిలువరించే సత్తా కనిపించడం లేదు. సాఖిబ్ స్థానంలో ఆర్చర్ బరిలోకి దిగవచ్చు. అట్కిన్సన్, వుడ్, రషీద్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, అక్షర్, జడేజా, రాణా, షమీ, వరుణ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, లివింగ్స్టోన్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. చక్కగా పరుగులు సాధించవచ్చు. వర్షసూచన ఏమాత్రం లేదు. వేడి వాతావరణం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.13 మరో 13 పరుగులు చేస్తే రోహిత్ వన్డేల్లో 11 వేల మైలురాయిని అందుకుంటాడు. -
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్స్పిన్నర్ ఈడెన్ కార్సన్లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
India vs Sri Lanka: 27 ఏళ్ల తర్వాత... శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
కొలంబో: ఆతిథ్య స్పిన్ను ఎదుర్కోలేక బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు సిరీస్ను సమం చేసుకోలేకపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన టీమిండియా సిరీస్ను 0–2తో శ్రీలంకకు సమరి్పంచుకుంది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 110 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59; 4 ఫోర్లు) రాణించారు. రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగుల వద్దే కుప్పకూలింది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్! తర్వాత టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దునిత్ వెలలగే (5/27) చావుదెబ్బ తీయగా, వాండెర్సే, తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తమకు కలిసొచి్చన స్పిన్ ట్రాక్పై పది వికెట్లలో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టేశారు. టాపార్డర్ రాణింపుతో... టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక, అవిష్క ఫెర్నాండో శుభారంభమిచ్చారు. ఓపెనర్లిద్దరు భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. స్పిన్నర్లను దించినా యథేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు ఓపెనింగ్ వికెట్కు 89 పరుగులు జతయ్యాక నిసాంకను అక్షర్ అవుట్ చేశాడు. కానీ తర్వాత వచి్చన కుశాల్తో అవిష్క మరో భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాడు. 65 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొని సెంచరీ దిశగా సాగుతున్న అవిష్కను జట్టు స్కోరు 171 వద్ద పరాగ్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అసలంక (10), సమరవిక్రమ (0), జనిత్ (8), వెలలగే (2)లపై భారత బౌలర్లు ప్రభావం చూపారు. 77 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కుశాల్ను కుల్దీప్ బోల్తా కొట్టించడంతో లంకను 250 పరుగుల్లోపే కట్టడి చేశారు. ఈసారి వెలలగే వలలో... ఓపెనర్, కెపె్టన్ రోహిత్ ఎప్పట్లాగే తనశైలి దూకుడుతో ఆరంభం నుంచే ధాటిగా పరుగులు రాబట్టే పనిలో పడ్డాడు. కానీ శుబ్మన్ గిల్ (6) సీమర్ అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లోనే క్లీన్»ౌల్డయ్యాడు. కోహ్లి (18 బంతుల్లో 20; 4 ఫోర్లు)తో కలిసి ‘హిట్మ్యాన్’ జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. కానీ కాసేపటికే వెలలగే స్పిన్ మ్యాజిక్కు రోహిత్ వికెట్ సమరి్పంచుకోవడంతో గత రెండు మ్యాచ్ల వైనమే ఇందులోనూ కొనసాగింది. కెప్టెన్ వికెట్ పడగానే షరామామూలుగా రిషభ్ పంత్ (9), కోహ్లి, అక్షర్ పటేల్ (2), శ్రేయస్ అయ్యర్ (8) పెవిలియన్కు క్యూకట్టడంతో 82 పరుగులకే భారత్ 6 వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. జట్టుస్కోరు 100 పరుగులకు చేరగానే వాండెర్సే... పరాగ్ (15)ను, తదుపరి ఓవర్లో శివమ్ దూబే (9)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఆ కొద్దిపాటి మెరుపులతో వంద పైచిలుకు స్కోరు చేసిందే తప్ప కనీసం 150 దగ్గరకు వెళ్లలేకపోయింది. సుందర్ను తీక్షణ, కుల్దీప్ (6)ను వెలలగే అవుట్ చేయడంతో భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పంత్ (బి) అక్షర్ 45; అవిష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 96; కుశాల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 59; అసలంక (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 10; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; జనిత్ (బి) సుందర్ 8; వెలలగే (బి) పరాగ్ 2; కమిండు (నాటౌట్) 23; తీక్షణ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–89, 2–171, 3–183, 4–184, 5–196, 6–199, 7–235. బౌలింగ్: సిరాజ్ 9–0–78–1, శివమ్ దూబే 4–0–9–0, అక్షర్ 10–1–41–1, సుందర్ 8–1–29–1, కుల్దీప్ 10–0–36–1, రియాన్ పరాగ్ 9–0–54–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) కుశాల్ (బి) వెలలగే 35; గిల్ (బి) అసిత ఫెర్నాండో 6; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 20; పంత్ (స్టంప్డ్) కుశాల్ (బి) తీక్షణ 6; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 8; అక్షర్ (బి) వెలలగే 2; పరాగ్ (బి) వాండెర్సే 15; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 9; సుందర్ (సి) వాండెర్సే (బి) తీక్షణ 30; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 6; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (26.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–37, 2–53, 3–63, 4–71, 5–73, 6–82, 7–100, 8–101, 9–138, 10–138. బౌలింగ్: అసిత ఫెర్నాండో 5–0–29–1, తీక్షణ 8–0–45–2, వెలలగే 5.1–0–27–5, వాండెర్సే 5–0–34–2, అసలంక 3–1–2–0. -
రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కుసాల్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. -
శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా..కేఎల్ రాహుల్పై వేటు
కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా టాస్ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
సమం చేస్తారా.. సమర్పిస్తారా!
కొలంబో: టి20 సిరీస్ను సులువుగా గెలుచుకున్న టీమిండియాకు వన్డే సిరీస్ గెలుపు కూడా లాంఛనమే అనిపించింది. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో ఉన్న పూర్తిస్థాయి టీమిండియాకు వన్డేల్లో ఎవరూ ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. తొలి వన్డేను గెలుపు మెట్టుపై ‘టై’ చేసుకున్న రోహిత్ బృందం రెండో మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 97/0తో పటిష్టస్థితిలో ఉండి కూడా... లంక స్పిన్ మాయాజాలానికి అనూహ్యంగా కుప్పకూలింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ ఆలౌటైంది. బంతులు మాత్రం మిగిలిపోయాయి. అంటే మన బ్యాటర్లు క్రీజులో నిలువడమే కష్టమైపోతోంది. కోహ్లి, రాహుల్లాంటి సీనియర్లపై కూడా ఆతిథ్య స్పిన్ బౌలింగ్ ఆధిపత్యం చలాయిస్తోంది. ఇది జట్టును కలవరపెడుతోంది. మరోవైపు 1–0తో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న శ్రీలంక ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఆఖరి పోరులో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మన బ్యాట్లకు పని చెప్పాల్సిందే! ఈ పర్యటనలో భారత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడింది. మూడు టి20లు సహా, గత రెండు వన్డేల్లోనూ బౌలర్లు ప్రతాపం చూపారు. కానీ బ్యాటర్లే ఆ రేంజ్లో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా వన్డేల్లో చక్కని శుభారంభాలు వచి్చనా... కెపె్టన్ రోహిత్ శర్మ ధాటైన బ్యాటింగ్తో లక్ష్యాన్ని సులువుగా మారుస్తున్నా... తర్వాత వచి్చ న బ్యాటర్లు మిగిలిన లక్ష్యాన్ని ఛేదించలేకపోవడమే పెద్ద సమస్యగా మారింది.దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన టీమ్ మేనేజ్మెంట్ ఆఖరి పోరులో తమ బ్యాటింగ్ దళాన్ని సన్నద్ధం చేస్తోంది. రోహిత్ ఆడినట్లే టాపార్డర్లో కోహ్లి, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఏ కాస్తోకూస్తో ఆడినా... కొన్ని ఓవర్లు క్రీజులో పాతుకుపోయినా ఎంతటి స్పిన్నయినా తుత్తునీయలు చేయొచ్చు. జోరు మీదున్న లంక టి20 సిరీస్లో క్లీన్స్వీప్తో పల్లెకెలెలో పోగొట్టుకున్న పరువును కొలంబోలో కొల్లగొట్టాలని ఆతిథ్య శ్రీలంక పట్టుదలతో ఉంది. చక్కగా స్పిన్కు అనుకూలించే పిచ్పై బౌలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను తేలిగ్గా కూల్చేస్తున్నారు. పైగా 1–0తో ఉన్న శ్రీలంక ఇప్పుడు సిరీస్ కోల్పోలేని స్థితిలో ఉంది. ఒత్తిడేమో భారత్పై ఉంది. దీన్ని సది్వనియోగం చేసుకొని తమ స్పిన్తో తిప్పేయాలని వాండెర్సే, అసలంక పిడికిలి బిగిస్తున్నారు. కొలంబో వేదికపై లక్ష్యఛేదన మ్యాచ్ సాగేకొద్దీ కష్టతరమవుతోంది కాబట్టి టాస్ గెలిస్తే మాత్రం మరో మాటకు తావులేకుండా ఏ జట్టయినా బ్యాటింగే ఎంచుకోవడం ఖాయం. పిచ్, వాతావరణం కొలంబో పిచ్ స్పిన్కు స్వర్గధామం. దీనివల్లే ఆతిథ్య స్పిన్నర్లు చెలరేగుతున్నారు. బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే! వర్ష సూచన ఉన్నా... మ్యాచ్కైతే ఇబ్బంది ఉండకపోవచ్చు. -
INDW VS AUSW, 3rd ODI: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్ స్వీప్
వాంఖడే వేదికగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిచ్ఫీల్డ్కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా సత్తా చాటింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. జార్జియా వేర్హమ్ (3/23), మెగాన్ షట్ (2/23), అలానా కింగ్ (2/21), అన్నాబెల్ సదర్ల్యాండ్ (2/9) ధాటికి 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో స్మృతి మంధన (29), రిచా ఘోష్ (19), జెమీమా రోడ్రిగెజ్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్), పూజా వస్త్రాకర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ప్రస్తుత భారత పర్యటనలో ఆసీస్ తదుపరి టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్.. ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. -
టీమిండియాతో మూడో వన్డే.. భారీ స్కోర్ సాధించిన ఆసీస్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లిచ్ఫీల్డ్కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆసీస్ ఇదివరకే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు ముందు జరిగిన ఏకైక టెస్ట్లో మాత్రం టీమిండియా ఆసీస్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ ఆనంతరం జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచారు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్లో రేణుక సింగ్తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం సాధ్యమే. -
IND VS SA 3rd ODI: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాయి సుదర్శన్
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో (32.2వ ఓవర్) మిడాఫ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సాయి.. పక్షిలా ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బ్యాటర్ క్లాసెన్ (21) సహా ఈ క్యాచ్ను చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కామెంటేటర్లు ఈ క్యాచ్ను క్యాచ్ ఆఫ్ ద సిరీస్గా అభివర్ణించారు. క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Catch of the series - Sai Sudharsan 🫡🔥pic.twitter.com/tKr2Vrj3tq — Johns. (@CricCrazyJohns) December 21, 2023 కాగా, భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓటమి దిశగా సాగుతుంది. 38 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 192/7గా ఉంది. సౌతాఫ్రికా గెలవాలంటే 72 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రీజా హెండ్రిక్స్ (19), జార్జీ (81), డస్సెన్ (2), మార్క్రమ్ (36), క్లాసెన్ (21), మిల్లర్ (10), ముల్దర్ (1) ఔట్ కాగా.. కేశవ్ మహారాజ్ (9), హెండ్రిక్స్ (0) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, అర్ష్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. -
IND VS SA 3rd ODI: సంజూ సెంచరీ.. బట్లర్ ఏం చేశాడో చూడండి..!
ఇంగ్లండ్ పరిమత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తన ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సారధి సంజూ శాంసన్పై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న మూడో వన్డేలో సంజూ సెంచరీ (108) సాధించగా.. బట్లర్ తన కెప్టెన్ సాధించిన ఘనతను, అలాగే మరో రాయల్ (చహల్) కెప్టెన్ను అభినందిస్తున్న దృశ్యాన్ని తన ఇన్స్టా స్టోరీగా పోస్ట్ చేశాడు. బట్లర్ ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్గా మారింది. Jos Buttler's Instagram story for Sanju Samson. pic.twitter.com/uSBAcKKCTZ — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 బట్లర్.. తన ఐపీఎల్ సహచరుడు సాధించిన ఘనతను సెలబ్రేట్ చేసుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజూతో సమానంగా బట్లర్ను కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాయల్స్కు తమ కెప్టెన్పై ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి ఫిదా అవుతున్నారు. The hundred moment of Sanju Samson. 🔥pic.twitter.com/WjWODyjF3p — Johns. (@CricCrazyJohns) December 21, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. సిరీస్ డిసైడర్లో క్లిష్టమైన పిచ్పై జట్టు కషాల్లో (49/2) ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన సంజూ.. తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్ను అందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా సంజూ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. Celebration by Sanju Samson after completing his maiden International hundred. 💪🫡 pic.twitter.com/fuHEwz0RPw — Johns. (@CricCrazyJohns) December 21, 2023 The way Yuzi Chahal celebrated the hundred of Sanju Samson. 👏 pic.twitter.com/XrC4hNxgXK — Johns. (@CricCrazyJohns) December 21, 2023 -
IND VS SA 3rd ODI: శతక్కొట్టాక సంజూ సంబురాలు చూడండి..!
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుపెట్టి ఎనిమిది ఏళ్లు పూర్తయిన అనంతరం సంజూ శాంసన్ తన తొలి సెంచరీ సాధించాడు. 2015లో తొలిసారి టీమిండియాకు ఆడిన సంజూ (టీ20ల్లో) సుదీర్ఘ విరామం తర్వాత మూడంకెల మార్కును తాకాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో సంజూ తన తొలి అంతర్జాతీయ సెంచరీని బాది టీమిండియా అభిమానులకు క్రిస్మస్ కానుకను అందించాడు. సిరీస్ డిసైడర్లో క్లిష్టమైన పిచ్పై జట్టు కష్ట సమయంలో (49/2) ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన సంజూ.. చాలా ఓపిగ్గా ఇన్నింగ్స్ను నిర్మించి సెంచరీ మార్కును చేరాడు. 110 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ అనంతరం సంజూ చేసుకున్న సంబురాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. The hundred moment of Sanju Samson. 🔥pic.twitter.com/WjWODyjF3p — Johns. (@CricCrazyJohns) December 21, 2023 సంజూ తన హెల్మెట్ను కింద పడేసి కండలు చూపిస్తూ సంబురాలు చేసుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. సంజూతో పాటు స్టాండ్స్లో ఉన్న చహల్ సైతం అదే రేంజ్లో సంబురాలు చేసుకున్నాడు. సంజూ, చహల్ ఇద్దరూ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడతారన్న విషయం తెలిసిందే. The way Yuzi Chahal celebrated the hundred of Sanju Samson. 👏 pic.twitter.com/XrC4hNxgXK — Johns. (@CricCrazyJohns) December 21, 2023 సిరీస్ డిసైడర్లో సంజూ ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా మిగిలిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి కేరళ క్రికెటర్గా సంజూ చరిత్రలో నిలిచిపోతాడు. Rinku Singh, the finisher - 38 runs from just 27 balls, giving a perfect finish for 🇮🇳 pic.twitter.com/CuL1YRK2XP — Johns. (@CricCrazyJohns) December 21, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా ఛేజింగ్ చేయాల్సి ఉంది. -
అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్.. 14 ఏళ్ల తర్వాత..!
టీమిండియా తాత్కాలిక సారధి కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 21 పరుగులు చేసిన రాహుల్ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో (వన్డేల్లో) 1000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల క్రితం ఈ ఫీట్ను టీమిండియా మాజీ వికెట్కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని సాధించాడు. కాగా, సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆచితూచి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్లతో (10) పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (44), తిలక్ వర్మ (6) క్రీజ్లో ఉన్నారు. 25 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/3గా ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్, హెండ్రిక్స్, ముల్దర్లకు తలో వికెట్ దక్కింది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగ్గా, తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 1-1తో సమంగా ముగిసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. డిసెంబర్ 26న తొలి టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3న రెండో టెస్ట్ ప్రారంభమవుతాయి. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద (33.2వ ఓవర్) సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ముల్దర్ (1) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (21) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (29.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో జార్జీ (81) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 141 పరుగుల వద్ద (25.5వ ఓవర్) సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో మార్క్రమ్ (36) ఔటయ్యాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2 ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్ (19) క్రీజ్లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 76 పరుగుల వద్ద (14.4 ఓవర్లో) సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్లో డస్సెన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టార్గెట్ 297.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్ (11) క్రీజ్లో ఉన్నారు. సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్ 297 నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ ఔట్ కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో అక్షర్ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్ (2) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. విలియమ్స్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి సంజూ పెవిలియన్కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్ పటేల్ (1) క్రీజ్లో ఉన్నారు. శతక్కొట్టిన సంజూ టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఇబ్బంది పడ్డ తిలక్ ఆఖరికి తిలక్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్ బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్ వన్డేల్లో తన తొలి హాఫ్ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్లో సంజూ శాంసన్ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/3గా ఉంది. 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3గా ఉంది. సంజూ శాంసన్ (71), తిలక్ వర్మ (39) క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్ను సాధించాడు. సంజూకు జతగా తిలక్ వర్మ (8) క్రీజ్లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 121/3గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగుల వద్ద (18.5వ ఓవర్) టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముల్దర్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ (21) ఔటయ్యాడు. శాంసన్ (38), తిలక్ క్రీజ్లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న శాంసన్, రాహుల్ 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్ (33), కేఎల్ రాహుల్ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 95/2గా ఉంది. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2గా ఉంది. సంజూ శాంసన్ (19), కేఎల్ రాహుల్ (7) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 50/2గా ఉంది. సంజూ శాంసన్ (9), కేఎల్ రాహుల్ (1) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్ బౌలింగ్లో రజత్ పాటిదార్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1గా ఉంది. సాయి సుదర్శన్ (9), సంజూ శాంసన్ క్రీజ్లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0 తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్ (5), రజత్ పాటిదార్ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0గా ఉంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియా పార్ల్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
IND VS AUS 3rd ODI: రోహిత్ రేర్ ఫీట్.. వన్డేల్లో తొలిసారి..!
టీమిండియా సారథి రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లో తొలిసారి ఓ రేర్ ఫీట్ను సాధించాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్మ్యాన్.. తన వన్డే కెరీర్లో మొట్టమొదటి సారి హాఫ్ సెంచరీ మార్క్ను పవర్ప్లేలో టచ్ చేశాడు. హిట్మ్యాన్ 251 మ్యాచ్ల వన్డే కెరీర్లో తొలిసారి ఇంత వేగంగా (పవర్ ప్లేలో) హాఫ్ సెంచరీ మార్కును (31 బంతుల్లో) చేరుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిట్మ్యాన్ ఇదే జోరును కొనసాగిస్తే రానున్న వరల్డ్కప్ పవర్ప్లేల్లో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలే అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 57 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఇదే మ్యాచ్లో హిట్ మ్యాన్ మరో రికార్డును కూడా సాధించాడు. స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (260) బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్.. స్వదేశంలో సిక్సర్ల కింగ్గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 3 సిక్సర్ల దూరంలో (551) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔటయ్యాడు. 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో హిట్మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. -
IND VS AUS 3rd ODI: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔట్ కాగా.. విరాట్ క్రీజ్లోకి వచ్చాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/1గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 275 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
IND VS AUS 3rd ODI: వన్డేల్లో బుమ్రా చెత్త ప్రదర్శన
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్లో టీమిండియా పేసు గుర్రం అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. బుమ్రా తన వన్డే కెరీర్లో చెత్త గణాంకాల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన బుమ్రా 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు (81) సమర్పించుకుని, ఈ మ్యాచ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ఇండియన్ బౌలర్ అయ్యాడు. 2017లో కటక్తో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లోనూ బుమ్రా ఇలాగే 81 పరుగులు సమర్పించుకున్నాడు. వవ్డేల్లో బుమ్రా చెత్త ప్రదర్శనల్లో ఇవి టాప్ 2లో ఉండగా.. 2017లో ఇంగ్లండ్పై సమర్పించుకున్న 79 పరుగులు, 2020లో ఆసీస్పై సమర్పించుకున్న 79 పరుగులు ఆ తర్వాతి చెత్త ప్రదర్శనలుగా రికార్డయ్యాయి. ఇవాల్టి మ్యాచ్లో బుమ్రా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ మ్యాచ్లో తొలి 5 ఓవర్లలో వికెట్లేమీ తీసుకోకుండా 51 పరుగులు ఇచ్చిన అతను.. ఆతర్వాతి 5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తీసిన 3 వికెట్లలో మ్యాక్స్వెల్ను క్లీన్బౌల్డ్ చేసిన యార్కర్ డెలివరీ హైలైట్ అని చెప్పాలి. -
IND VS AUS 3rd ODI: అరుదైన క్లబ్లో చేరిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్లో చేరాడు. రాజ్కోట్ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 27) జరుగుతున్న మూడో వన్డేలో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును అందుకున్న 17వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 145 వన్డేలు ఆడిన స్మిత్.. 12 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5049 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్మిత్ 70 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. కాగా, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్ల్లో 18426 పరుగులు) పేరిట ఉంది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ రికార్డు రికీ పాంటింగ్ సొంతం చేసుకున్నాడు. పాంటింగ్ 374 వన్డేల్లో 13589 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున వన్డేల్లో 10000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడు కూడా పాంటింగే కావడం విశేషం. ఇదిలా ఉంటే, టీమిండియాతో మూడో వన్డేలో ఆసీస్ ధాటిగా ఆడుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 31 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. డేవిడ్ వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. స్మిత్ (70), లబూషేన్ (13) క్రీజ్లో ఉన్నారు. 3 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
భారత్ అలౌట్ 286 పరుగుల వద్ద (49.4 ఓవర్లు) టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 286 పరుగుల వద్ద (48.3 ఓవర్లు) టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సంగా బౌలింగ్లో జడేజా(35) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 270 పరుగుల వద్ద (45.3 ఓవర్లు) టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో లబూషేన్కు క్యాచ్ ఇచ్చి బుమ్రా (5) ఔటయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియా టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. 257 పరుగుల వద్ద (41.5 ఓవర్లు) భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 249 పరుగుల వద్ద (38.3 ఓవర్లు) టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (48) క్లీన్ బౌలయ్యాడు. రవీంద్ర జడేజా (9), కుల్దీప్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 233 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. భారత్ గెలవాలంటే 76 బంతుల్లో 120 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్లో క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. 35.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 223/4గా ఉంది. భారత గెలుపుకు 85 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ విరాట్ కోహ్లి 56 పరుగుల వద్ద మ్యాక్స్వెల్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 26.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/3గా ఉంది. శ్రేయస్ (14), కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 168/2గా ఉంది. విరాట్ (54), శ్రేయస్ (13) క్రీజ్లో ఉన్నారు.భారత్ లక్ష్యానికి మరో 185 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో హిట్మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో లబూషేన్కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (18) ఔటయ్యాడు. రోహిత్ శర్మ (55), విరాట్ కోహ్లి క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 353.. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న రోహిత్ శర్మ 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో సుందర్ నిదానంగా ఆడుతున్నాడు. సుందర్ 18 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 56/0గా ఉంది. రెచ్చిపోయిన ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ లక్ష్యం టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ బుమ్రా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (72) ఔటయ్యాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 345/7. ఆరో వికెట్ కోల్పోయిన అసీస్ 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ (9) ఔటయ్యాడు. లబూషేన్ (42), కమిన్స్ క్రీజ్లో ఉన్నారు. మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మ్యాక్స్వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 281/5. లబూషేన్ (33), గ్రీన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 267 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అలెక్స్ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్ (26), మ్యాక్స్వెల్ క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 242 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్ (74) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 242/3గా ఉంది. లబూషేన్ (13), అలెక్స్ క్యారీ (0) క్రీజ్లో ఉన్నారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్ మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 215/2. స్మిత్ (61), లబూషేన్ క్రీజ్లో ఉన్నారు. స్మిత్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా మార్ష్ 26.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును అందుకుంది. మార్ష్ (89) సెంచరీ దిశగా పరుగులు పెడుతుండగా.. స్మిత్ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 202/1. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 120/1గా ఉంది. మిచెల్ మార్ష్ (43), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్లో ఉన్నారు. విధ్వంసకర హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన వార్నర్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 84/1. మిచెల్ మార్ష్ (22), స్టీవ్ స్మిత్ (6) క్రీజ్లో ఉన్నారు. వార్నర్ విధ్వంసకర హాఫ్ సెంచరీ చాలా రోజుల తర్వాత వార్నర్ మునుపటి ఫామ్ను కనబరుస్తున్నాడు. టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో అతను 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ధాటిగా ఆడుతున్న వార్నర్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఓపెనర్లు వార్నర్ (27 బంతుల్లో 43), మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 22) శుభారంభాన్ని అందించారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 65/0గా ఉంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్వుడ్. -
సొంతగడ్డపై బంగ్లాదేశ్కు చుక్కెదురు.. సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
సొంతగడ్డపై బంగ్లాదేశ్కు చుక్కెదురైంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో పర్యాటక జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులకు ఆలౌటైంది. ఆడమ్ మిల్నే (4/34), ట్రెంట్ బౌల్ట్ (2/33), మెక్కొంచి (2/18) బంగ్లా పతనాన్ని శాశించగా.. లోకి ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో (76) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తౌహిద్ హ్రిదోయ్ (18), ముష్ఫికర్ రహీమ్ (18), మహ్మదుల్లా (21), మెహిది హసన్ (13) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ యంగ్ (70), హెన్రీ నికోల్స్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్ (28), టామ్ బ్లండెల్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ అరంగేట్రం ఆటగాడు డీన్ ఫాక్స్క్రాఫ్ట్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!
పసికూన ఐర్లాండ్పై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ టీమ్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. సాల్ట్కు విల్ జాక్స్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ జాక్ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (54 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. డకెట్తో పాటు సామ్ హెయిన్ (4) క్రీజ్లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, వాన్ వొయెర్కోమ్ ఓ వికెట్ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో రికార్డు స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు.. వన్డే పవర్ ప్లేలో ఇంగ్లండ్ అత్యధిక స్కోర్: 107/2 8 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును తాకింది వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఫిలిప్ సాల్ట్ (22 బంతుల్లో) కాగా, ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ రెగ్యులర్ టీమ్ సభ్యులంతా వరల్డ్కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ టీమ్కు జాక్ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు. -
BAN VS NZ 3rd ODI: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ అరుదైన ఘనత
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో 21 పరుగులు చేసిన అతను.. తన వ్యక్తిగత స్కోర్ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్ ఇక్బాల్ (243 మ్యాచ్ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (256 మ్యాచ్ల్లో 7406), షకీబ్ అల్ హసన్ (240 మ్యాచ్ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు. కెరీర్లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (2/33), ఆడమ్ మిల్నే (4/34), ఫెర్గూసన్ (1/26), రచిన్ రవీంద్ర (1/20), కోల్ మెక్కొంచి (2/18) బంగ్లాదేశ్ను దెబ్బతీశారు. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (76) ఒక్కడే రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా, ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
ఆసీస్తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొహాలీలో వేదికగా జరిగిన తొలి వన్డేను 5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఇండోర్లో నిన్న (సెప్టెంబర్ 24) జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే ఈనెల 27న రాజ్కోట్లో జరుగనుంది. రోహిత్ రీఎంట్రీ.. ఆసీస్తో తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ మూడో వన్డే బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఈ వన్డేకు శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇవ్వడంతో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్తో కలిసి హిట్మ్యాన్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. విరాట్, హార్దిక్ కూడా.. తొలి రెండు వన్డేలకు రోహిత్తో పాటు రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు సైతం మూడో వన్డే బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరితో పాటు రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా సైతం ఆఖరి వన్డే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. జట్టు మేనేజ్మెంట్ జడేజాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తేనే కుల్దీప్ బరిలో ఉంటాడు. అశ్విన్ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన సిరాజ్ ఈ మ్యాచ్లో కూడా నిరీక్షించాల్సి ఉంటుంది. గిల్తో పాటు తొలి రెండు వన్డేలు ఆడిన శార్దూల్ ఠాకూర్ కూడా రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకే ప్రకటించిన వరల్డ్కప్ జట్టులో నుంచి సైతం శార్దూల్ను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. అతని స్థానంలో అశ్విన్ జట్టులోకి రావడం ఖాయమని సమాచారం. ఆసీస్తో మూడో వన్డేకు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా -
IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్
ఈనెల 27న రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న నామమాత్రపు చివరి వన్డేకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడి, ఆసీస్తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక ఆసీస్తో జరిగే మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీఏలోని రిహాబ్లో ఉన్న అక్షర్ గాయం నుంచి కోలుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత సెలక్టర్లు ఆసీస్తో మూడో వన్డేకు అక్షర్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్షర్ వరల్డ్కప్కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అక్షర్ వరల్డ్కప్ సన్నాహక మ్యాచ్ల సమయానికంతా కోలుకుంటాడని చెబుతున్నాయి. మరోవైపు వరల్డ్కప్లో అక్షర్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్తో సిరీస్లో జోరును ప్రదర్శిస్తూ సెలెక్టర్లకు సవాలు విసిరాడు. యాష్ ఆసీస్తో తొలి రెండు వన్డేల్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో వరల్డ్కప్లో స్పిన్ ఆల్రౌండర్గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వరల్డ్కప్ సమయానికి అక్షర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. అక్షర్, అశ్విన్లలో ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. వీరిద్దరిలోనే ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కాక సెలెక్టర్లు సతమతమవుతుంటే, వాషింగ్టన్ సుందర్ నేను కూడా లైన్లో ఉన్నానంటూ సవాలు విసురుతున్నాడు. మరి ఉన్న ఒక్క స్పిన్ ఆల్రౌండర్ పోజిషన్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా, వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల బృంధాన్ని అన్ని జట్లు సెప్టెంబర్ 28వ తేదీలోపు ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. నిన్న జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
శివాలెత్తిన బెన్ స్టోక్స్.. 15 ఫోర్లు, 9 సిక్సర్లు.. డబుల్ సెంచరీ మిస్
వరల్డ్కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని జట్టులో చేరిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్బై చెప్పిన స్టోక్సీ.. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో జరుతున్న సిరీస్తోనే వన్డే క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. రెండో వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. The highest individual ODI score for England 🙌 1⃣8⃣2⃣ runs 1⃣2⃣4⃣ balls Sixes 9⃣ Fours 1⃣5⃣ See them all here 👇 — England Cricket (@englandcricket) September 13, 2023 లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగుతున్న మూడో వన్డేలో తొలి బంతి నుంచి పూనకం వచ్చినట్లు ఊగిపోయిన స్టోక్స్ పట్టపగ్గాల్లేకుండా పేట్రేగిపోయాడు. కేవలం 124 బంతుల్లోనే 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. 1⃣8⃣2⃣ reasons to catch up on that simply incredible innings 😱 We put 3⃣6⃣8⃣ on the board 🏏💥 See the best of the action here 👇 — England Cricket (@englandcricket) September 13, 2023 తొలుత డేవిడ్ మలాన్ (95 బంతుల్లో 96; 12 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోతున్న సమయంలో ఆచితూచి ఆడిన స్టోక్స్.. అర్ధసెంచరీ పూర్తి చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మలాన్ 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ ఏమాత్రం తగ్గని స్టోక్స్, రెట్టింపు ఉత్సాహంతో బౌండరీలు, సిక్సర్లు బాది సెంచరీ, ఆతర్వాత 150 పరుగులు పూర్తి చేశాడు. మధ్యలో కాసేపు కెప్టెన్ బట్లర్ (38; 6 ఫోర్లు, సిక్స్) అతనికి జత కలిశాడు. Ridiculous. Scorecard/clips: https://t.co/Pd380O21mn@IGCom | #EnglandCricket pic.twitter.com/6FGco9sV24 — England Cricket (@englandcricket) September 13, 2023 182 పరుగుల వద్ద మరో భారీ సిక్సర్కు ప్రయత్నించి స్టోక్స్ ఔటయ్యాడు. స్టోక్స్ ఔటయ్యాక ఆఖర్లో వికెట్లు వెనువెంటనే పడిపోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 368 పరుగుల వద్ద ముగిసింది. 11 బంతులు వేస్ట్ అయ్యాయి. ఒకవేళ స్టోక్స్ ఔట్ కాకుండా ఉండివుంటే, అతను డబుల్ సెంచరీ, ఇంగ్లండ్ 450కిపైగా పరుగులు తప్పక చేసుండేది. స్టోక్స్, మలాన్, బట్లర్ మినహా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో అందరూ తేలిపోయారు. ODI 💯 #4 🙌 Just 76 balls! 😅@IGCom | @benstokes38 pic.twitter.com/FaVlwikMbB — England Cricket (@englandcricket) September 13, 2023 ఓ పక్క స్టోక్స్ తాండవం చేస్తున్నా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఏమాత్రం తగ్గకుండా 5 వికెట్లతో చెలరేగాడు. స్టోక్స్ అందరు బౌలర్లకు చుక్కలు చూపించినప్పటికీ బౌల్ట్ తప్పించుకున్నాడు. స్టోక్స్ను ఔట్ చేసిన బెన్ లిస్టర్ ఆఖర్లో 3 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకన్నారు. కాగా, 4 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో న్యూజిలాండ్, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందాయి. అంతకుముందు జరిగిన 4 మ్యాచ్ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. Reaching 50 in style! 😍 Scorecard/clips: https://t.co/Pd380O21mn@IGCom | @benstokes38 pic.twitter.com/QKo94vqknl — England Cricket (@englandcricket) September 13, 2023 -
మూడో వన్డేలోను పాకిస్తాన్దే విజయం
అఫ్గనిస్తాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను పాకిస్తాన్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. శనివారం కొలంబోలో జరిగిన చివరి మ్యాచ్లో పాక్ 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ను ఓడించింది. ముందుగా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రహమాన్ (64) హాఫ్ సెంచరీ చేయగా, షాహిదుల్లా (37), రియాజ్ హసన్ (34) మాత్రమే కొద్దిగా పోరాడారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. -
చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
విండీస్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ నెగ్గింది. తొలుత 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్.. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచి, రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్.. మూడో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్పై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), సంజూ శాంసన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, కారియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ను భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి 151 పరుగులకే కుప్పకూల్చారు. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్ (3/30), కుల్దీప్ యాదవ్ (2/25), ఉనద్కత్ (1/16) అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ ఆటగాళ్ల పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ 35.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (32), కారియా (19), అల్జరీ జోసఫ్ (26), గడకేశ్ మోటీ (39 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
IND vs WI 3rd ODI: విజయమా... ప్రయోగమా!
వెస్టిండీస్తో రెండో వన్డేలో ఓటమి తర్వాత ‘మేం భవిష్యత్తుపై దృష్టి పెట్టాం. ప్రస్తుత ఫలితాలు ముఖ్యం కాదు. అందుకే భిన్నమైన కూర్పుతో తుది జట్టు కోసం ప్రయోగాలు చేస్తున్నాం’ అని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. నిజంగానే ద్రవిడ్ మాటలను చేతలకు అన్వయిస్తే మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం ఖాయం. ఇలాంటి స్థితిలో భారత్ చివరి వన్డేలో నెగ్గి సిరీస్ గెలుచుకుంటుందా లేక గత మ్యాచ్లాగే తలవంచుతుందా చూడాలి. తరూబా (ట్రినిడాడ్): వన్డే వరల్డ్కప్ ఆతిథ్య జట్టు హోదాలో సిద్ధమవుతున్న భారత్ జట్టు వరల్డ్ కప్కు అర్హత సాధించని టీమ్తో సిరీస్ విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలోనే కష్టంగా నెగ్గిన టీమిండియా... రెండో వన్డేలో ఓటమిపాలు కావడంతో సిరీస్ 1–1గా సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఏకపక్షంగా మారకుండా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఆ ఇద్దరికీ... రోహిత్, కోహ్లి గత మ్యాచ్లాగే ఆడకపోతే భారత జట్టుకు సంబంధించి ఇద్దరు బ్యాటర్లపై ప్రధానంగా చర్చ సాగనుంది. తమను తాము నిరూపించుకోవాల్సిన స్థితిలో సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్లు బరిలోకి దిగుతున్నారు. కోచ్ చెప్పిన దాన్ని బట్టి వీరిద్దరికి మరో అవకాశం ఖాయం. సూర్య వన్డేల్లో ఇంకా తడబడుతుండగా... చాలా కాలం తర్వాత దక్కిన అవకాశాన్ని సామ్సన్ ఉపయోగించుకోలేకపోయాడు. మూడు, నాలుగు స్థానాల్లో వీరు రాణిస్తే జట్టుకు మేలు కలుగుతుంది. ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా, గిల్ ఇంకా ప్రభావం చూపలేదు. హార్దిక్ కూడా అంచనాలకు తగిన విధంగా రెండు విభాగాల్లోనూ రాణించలేకపోతున్నాడు. బౌలింగ్లో ఉమ్రాన్, ముకేశ్, కుల్దీప్లు తమ సత్తా మేరకు ఆడితే విండీస్ను కట్టడి చేయగలరు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే భారత్ విజయావకాశాలు మెరుగవుతాయి. ఆత్మవిశ్వాసంతో... తొలి వన్డేలో కుప్పకూలినా... రెండో మ్యాచ్లో గెలుపు విండీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా కెపె్టన్ షై హోప్ చక్కటి ఫామ్తో ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మేయర్స్ గత మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. కింగ్, అతనజ్ కూడా రాణించడంతో పాటు కార్టీ కూడా నిలబడితే జట్టు మంచి స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. విండీస్ బౌలింగ్ గత మ్యాచ్లో ఆకట్టుకుంది. పేసర్లలో అల్జారి జోసెఫ్ పదునైన పేస్తో భారత్ను ఇబ్బంది పెట్టగా రొమారియో షెఫర్డ్ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి సమష్టిగా రాణించి సొంతగడ్డపై సిరీస్ సాధించాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. పిచ్, వాతావరణం బ్రియాన్ లారా స్టేడియం ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్కు ఆతిథ్యం ఇచి్చంది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఈ వేదికపై జరిగిన దేశవాళీ వన్డేల్లో స్వల్ప స్కోర్లే నమోదు కావడం పిచ్ పరిస్థితికి ఒక సూచిక. మ్యాచ్ రోజు వాన ముప్పు లేదు. -
విరాట్కు విశ్రాంతి పొడిగింపు.. మూడో వన్డేలో కూడా బెంచ్కే పరిమితం..?
విండీస్తో రెండో వన్డేలో ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకున్న టీమిండియా.. మూడో వన్డేలో కూడా అదే బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. రెండో మ్యాచ్లో కెప్టెన్ రోహిత్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్కు విశ్రాంతినిచ్చిన మేనేజ్మెంట్.. మూడో వన్డేలో రోహిత్ను జట్టులోకి తెచ్చి, విరాట్కు విశ్రాంతిని పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ట్రినిడాడ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్కు ముందు జట్టుతో పాటు విరాట్ కనిపించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కానీ, మేనేజ్మెంట్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కోహ్లికి రెస్ట్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్కు మరో అవకాశం ఇవ్వాలన్నది టీమిండియా యోచనగా తెలుస్తుంది. Will Virat Kohli be rested tomorrow? He didn't travel with team to Trinidad yesterday? No confirmation if he will join the team today. In all fairness Surya and Sanju should get 1 more game and Virat gains nothing playing this series. #IndvWI — Kushan Sarkar (@kushansarkar) July 31, 2023 ఇదిలా ఉంటే రోహిత్, కోహ్లి లేని టీమిండియా ప్రయోగం రెండో వన్డేలో మిస్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో టీమిండియా వరల్డ్కప్కు కూడా అర్హత సాధించలేని విండీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా విండీస్ 3 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (55), శుభ్మన్ గిల్(34) మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోటీ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ (48 నాటౌట్) విండీస్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ 2019 తర్వాత ఓ వన్డేలో టీమిండియాపై గెలవడంతో ఈ మ్యాచ్ ఫలితానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్ట్ 1న భారత్-విండీస్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ అనంతరం భారత్.. విండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. -
పడి లేచిన శ్రీలంక.. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ కైవసం
ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ కోల్పోయిన లంకేయులు, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని సిరీస్ను చేజిక్కించుకున్నారు. హంబన్తోట వేదికగా ఇవాళ (జూన్ 7) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో లంక బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు తలవంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. చమీర (4/63), హసరంగ (3/7), లహీరు కుమార (2/29), తీక్షణ (1/16) చెలరేగడంతో 22.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో నబీ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (51), దిముత్ కరుణరత్నే (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ తరుపు ముక్క రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటింగ్లో 8 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రషీద్.. 4 ఓవర్లు బౌల్ చేసి వికెట్ లేకుండా 21 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, ఈ సిరీస్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్లో పర్యటించనుంది. అక్కడ వీరు ఓ టెస్ట్, 3 వన్డేలు, 2 టీ20లు ఆడనున్నారు. చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..! -
పసికూనలపై బంగ్లా టైగర్స్ ప్రతాపం.. ఈ స్థాయి విజయం తొలిసారి
పసికూన ఐర్లాండ్పై బంగ్లాదేశ్ టైగర్స్ ప్రతాపం చూపించారు. సిల్హెట్ వేదికగా ఇవాళ (మార్చి 23) జరిగిన మూడో వన్డేలో బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారు. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్ను బంగ్లాదేశ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయం బంగ్లాదేశ్ ఊహించిందే అయినప్పటికీ ఈ స్థాయి విజయం మాత్రం ఊహించి ఉండదు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (8.1-1-32-5), తస్కిన్ అహ్మద్ (10-1-26-3), ఎబాదత్ హొస్సేన్ (6-0-29-2) ధాటికి 28.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలగా, అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. లిటన్ దాస్ (38 బంతుల్లో 50; 10 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అంతకుముందు ఐర్లాండ్ ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు బంగ్లా పేసర్ల ఖాతాలోకే వెళ్లగా.. ఇలా జరగడం బంగ్లా వన్డే హిస్టరీలో ఇదే తొలిసారి. -
వరుసగా మూడో మ్యాచ్లోనూ గోల్డన్ డకౌట్ అయిన సూర్యకుమార్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు, టీ20 స్టార్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో స్కై.. వరుసగా మూడు మ్యాచ్ల్లో గోల్డన్ డకౌటయ్యాడు (తొలి బంతికే ఔట్). దీంతో టీమిండియా అభిమానులు సోషల్మీడియా వేదికగా అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో స్టార్క్ బౌలింగ్లో తొలి బంతికే ఎల్బీడబ్యూ అయిన సూర్యకుమార్.. ఆతర్వాత విశాఖలో జరిగిన రెండో వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్లోనే తొలి బంతికే ఎల్బీడబ్యూ ఔట్ అయ్యాడు. తొలి రెండు వన్డేల్లో ఒకే బౌలర్ చేతిలో ఒకేలా ఔటైన సూర్యకుమార్.. చెన్నై వేదికగా ఇవాళ (మార్చి 22) జరుగుతున్న మూడో వన్డేలో ఆస్టన్ అగర్ బౌలింగ్లో తొలి బంతికే క్లీన్ బౌల్డై అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. సూర్యకుమార్ను తక్షణమే వన్డే జట్టు నుంచి తొలగించాలని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కొందరేమో ఇంత నిర్లక్ష్యంగా ఆడే వ్యక్తిని టీ20 జట్టు నుంచి కూడా తప్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 42 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. రోహిత్ శర్మ (30), శుభ్మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32), అక్షర్ పటేల్ (2), విరాట్ కోహ్లి (54), సూర్యకుమార్ యాదవ్ (0) ఔట్ కాగా.. హార్ధిక్ (39), జడేజా (14) క్రీజ్లో ఉన్నారు. భారత్ గెలవాలంటే 48 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. -
IND VS AUS 3rd ODI: సెంచరీ కొట్టిన సిరాజ్
టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. 18 టెస్ట్ల్లో 47 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టిన సిరాజ్ మియా 24 వన్డేల్లో 47 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 50 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 101 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని కోల్పోయిన రోజే సిరాజ్ 100 వికెట్ల మైలురాయిని అధిగమించడం విశేషం. ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్లో సిరాజ్ తొలిస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానంలో ఉన్న జోష్ హాజిల్వుడ్ అగ్రస్థానానికి ఎగబాకగా.. మూడో స్థానంలో ఉన్న ట్రెంట్ బౌల్ట్ సెకెండ్ ప్లేస్కు చేరుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 37 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. రోహిత్ శర్మ (30), శుభ్మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32), అక్షర్ పటేల్ (2), విరాట్ కోహ్లి (54), సూర్యకుమార్ యాదవ్ (0) ఔట్ కాగా.. హార్ధిక్ (29), జడేజా (7) క్రీజ్లో ఉన్నారు. భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. -
మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చిన అనుకోని అతిథి.. తల గోక్కుంటూ నవ్వుకున్న రోహిత్
చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ఓ అనుకోని అతిధి వచ్చి గ్రౌండ్ స్టాఫ్ను ముప్పుతిప్పలు పెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా 43వ ఓవర్లో ఓ శునకం మైదానంలో చొరబడి, గ్రౌండ్ సిబ్బందికి పట్టుకోండి చూద్దాం అన్న ఛాలెంజ్ విసిరింది. ఇద్దరు సిబ్బంది శునకాన్ని బయటకు తరమాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సిబ్బంది కింద కూడా పడ్డారు. ఈ మొత్తం తంతును చూస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల గోక్కుంటూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. New fielder in the fields 😂#INDvsAUS pic.twitter.com/lR48zIOASs — YASIR SHEIKH🇮🇳 (@yasir__aadeez) March 22, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్ టార్గెట్ను ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్ చేశారు. ట్రవిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (47), డేవిడ్ వార్నర్ (23), లబూషేన్ (28), అలెక్స్ క్యారీ (38), స్టోయినిస్ (25), సీన్ అబాట్ (26), అస్టన్ అగర్ (17), స్టార్క్ (10), జంపా (10 నాటౌట్) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 30 ఓవర్లు పూర్తియ్యే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30), శుభ్మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32), అక్షర్ పటేల్ (2) ఔట్ కాగా.. కోహ్లి (49), హార్ధిక్ (0) క్రీజ్లో ఉన్నారు. -
షేన్ వార్న్ పూనాడా ఏంది కుల్దీప్, అంతలా తిప్పేశావు..?
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్ టార్గెట్ను ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్ చేశారు. ట్రవిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (47), డేవిడ్ వార్నర్ (23), లబూషేన్ (28), అలెక్స్ క్యారీ (38), స్టోయినిస్ (25), సీన్ అబాట్ (26), అస్టన్ అగర్ (17), స్టార్క్ (10), జంపా (10 నాటౌట్) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. Peach of a Delivery by Kuldeep Yadav to dismiss Alex Carey 🔥pic.twitter.com/9vxNV4fJ81 — Kriti Singh (@kritiitweets) March 22, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్.. అలెక్స్ క్యారీని క్లీన్బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. తొలి బంతి నుంచే గింగిరాలు తిరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్.. 39వ ఓవర్ తొలి బంతికి స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ పునాడా అని డౌట్ వచ్చేలా బంతిని మెలికలు తిప్పి క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించని క్యారీ, బౌల్డ్ అయ్యాక పెట్టిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరలవతోంది. 10 years ago today !!! This is one of my favourite deliveries.... Thanks boys.... pic.twitter.com/MXGlDNVHTV — Shane Warne (@ShaneWarne) July 6, 2015 వాస్తవానికి కుల్దీప్ కూడా ఆ బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించి ఉండడు. లెగ్ స్టంప్ అవల పడ్డ బంతి ఏకంగా హాఫ్ స్టంప్ను గిరాటు వేయడంతో బ్యాటర్తో పాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. ఈ తరహా బంతులు ఎక్కువగా లెజెండరీ షేన్ వార్న్ వేయడం చూశాం. తాజాగా కుల్దీప్ అలాంటి బంతి వేయడంతో ఇతనికి షేన్ వార్న్ ఏమైనా పూనాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు. కుల్దీప్ కూడా మంచి టర్నరే అయినప్పటికీ, బంతి ఇంతలా టర్న్ అయిన దాఖలాలు లేవు. కుల్దీప్ మ్యాజిక్ డెలివరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
స్టార్క్ దెబ్బకు వణికిపోతున్న టీమిండియా.. మూడో వన్డేలోనైనా గెలుస్తారా..?
39/4, 49/5.. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్లు ఇవి. సొంతగడ్డపై కొదమసింహాల్లా రెచ్చిపోయే టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు ప్రస్తుత వన్డే సిరీస్లో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ పేస్ ధాటికి గజగజ వణికిపోతున్నారు. ఫలితంగా భారత్ పవర్ ప్లేల్లో చెత్త గణాంకాలు నమోదు చేసింది. తొలి వన్డేలో కేఎల్ రాహుల్ (75 నాటౌట్), రవీంద్ర జడేజా (45 నాటౌట్) పుణ్యమా అని గట్టెక్కిన భారత్.. రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. నిప్పులు చెరిగే వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, ఇరువైపుల బంతిని అద్భుతంగా స్వింగ్ చేసిన స్టార్క్ రెండో వన్డేలో భారత టాపార్డర్ బ్యాటర్ల భరతం పట్టాడు. స్టార్క్ ధాటికి టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెండు వన్డేల్లో స్టార్క్ ఇద్దరు భారత బ్యాటర్లను ఒకేలా ఔట్ చేశాడు. శుభ్మన్ గిల్ను ఆఫ్ స్టంప్ అవతల టెంప్టింగ్ డెలివరీ వేసి బట్టలో వేసుకున్న స్టార్క్.. సూర్యకుమార్ యాదవ్ను రెండు మ్యాచ్ల్లో ఒకేలా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో (టెస్ట్ సిరీస్) ఏమంత ప్రభావం చూపించని స్టార్క్.. వన్డే సిరీస్ ప్రారంభంకాగానే జూలు విదిల్చిన సింహంలా గర్జిస్తున్నాడు. తొలి వన్డేలో 3, రెండో వన్డేలో 5 వికెట్లు పడగొట్టిన స్టార్క్ దెబ్బకు భారత ఆటగాళ్లు క్రీజ్లోకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో స్టార్క్ సంధిస్తున్న స్వింగింగ్ యార్కర్లను ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లకు ప్యాంట్ తడిసిపోతుంది. ఇలాంటి బంతులకు నిస్సహాయులుగా వికెట్ సమర్పించుకోవడం తప్ప భారత బ్యాటర్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే పరిస్థితి చెన్నై వేదికగా జరిగే ఆఖరి వన్డేలోనూ కొనసాగితే, టీమిండియా సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. స్టార్క్ విషయంలో భారత ఆటగాళ్ల మైండ్సెట్ మారకపోతే.. చెన్నై వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం తప్పకపోవచ్చు. ఆసీస్ స్పీడ్స్టర్ విషయంలో భారత బ్యాటర్లు, ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లు ప్రత్యేక ప్రణాళిక, ప్రాక్టీస్ లేకపోతే.. త్వరలో భారత్లోనే జరుగనున్న వన్డే వరల్డ్కప్లో స్టార్క్ రూపంలో టీమిండియాకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపఖండపు పిచ్లపై మహామహులైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న భారత బ్యాటర్లకు స్టార్క్ పెద్ద విషయమేమి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదిలా ఉంటే, ఆసీస్తో మూడో వన్డేలో ఎలాగైనా నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. రెండో వన్డేలో జరిగిన పొరపాట్ల విషయంలో అంతర్మధనం చేసుకున్న భారత ఆటగాళ్లు, ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. బ్యాటింగ్ విషయంలో, ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం విషయంలో టీమిండియా భారీ కసరత్తే చేస్తుంది. చెన్నై పిచ్ బ్యాటింగ్కు సహకరించే అవకాశం ఉంది కాబట్టి, రెండో వన్డే ఆడిన జట్టునే భారత మేనేజ్మెంట్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. -
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్
వైట్ బాల్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆల్రౌండర్గా చలామణి అవుతున్న బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ మరో అరుదైన రికార్డు సాధించాడు. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (మార్చి 6) వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శన ((71 బంతుల్లో 75; 7 ఫోర్లు), (10-0-35-4))తో అదరగొట్టిన షకీబ్.. రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్గా, ఓవరాల్గా 14వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో షకీబ్కు ముందు కేవలం ఇద్దరు మాత్రమే 200 వన్డే వికెట్ల మైలురాయిని అధిగమించారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టగా.. షకీబ్ 227 వన్డేల్లో 4.45 ఎకానమీ రేట్తో 300 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో స్పిన్ దిగ్గజం, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ (534) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వసీం అక్రమ్ (502), వకార్ యూనిస్ (416), చమిందా వాస్ (400), షాహిద్ అఫ్రిది (395), షాన్ పొలాక్ (393), గ్లెన్ మెక్గ్రాత్ (381), బ్రెట్ లీ (380), లసిత్ మలింగ (338), అనిల్ కుంబ్లే (337), సనత్ జయసూర్య (323), జవగల్ శ్రీనాథ్ (315), డేనియల్ వెటోరీ (305), షకీబ్ అల్ హసన్ (300), షేన్ వార్న్ (293) వరుసగా 2 నుంచి 15 స్థానాల్లో ఉన్నారు. బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ తొలి రెండు వన్డేల్లో గెలుపొందడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్ రహీమ్ (70), షకీబ్ (75) అర్ధసెంచరీలతో రాణించారు. జోప్రా ఆర్చర్ 3, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు, క్రిస్ వోక్స్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఇంగ్లండ్.. షకీబ్ (4/35) విజృంబించడంతో 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌటై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జేమ్స్ విన్స్ (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. బంగ్లా పర్యటనలో ఇంగ్లండ్ తదుపరి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. మార్చి 9, 12, 14 తేదీల్లో 3 టీ20లు జరుగనున్నాయి. -
మూడేళ్ల తర్వాత సెంచరీ ఏంటీ.. అలా ఎలా చూపిస్తారు..? రోహిత్ శర్మ ఉగ్రరూపం
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. అతనితో పాటు శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకం, ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకంతో చెలరేగినప్పటికీ.. న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా టీమిండియా 3 మ్యాచ్ల ఈ సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. కాగా, ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ బ్రాడ్కాస్టర్లపై మండిపడిన ఘటన ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ సెంచరీ చేసిన వెంటనే బ్రాడ్కాస్టర్లు టీవీల్లో.. "రోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత చేసిన సెంచరీ" అంటూ ఊదరగొట్టాయి. ఇదే హిట్మ్యాన్కు కోపం తెప్పించింది. మూడేళ్ల తర్వాత సెంచరీ ఏంటీ..? ఇది నిజమే అయ్యుండొచ్చు. నేను వన్డేల్లో చివరిసారిగా సెంచరీ చేసింది 2020 జనవరిలో. ఆతర్వాత టెస్ట్ల్లో 2021 సెప్టెంబర్ 2న సెంచరీ చేశాను. ఈ విషయం పక్కన పెడితే.. 2020-23 మధ్యకాలంలో నేను ఎన్ని వన్డేలు ఆడానన్న విషయాన్ని బ్రాడ్కాస్టర్లు గ్రహించాలి (ఈ మధ్యకాలంలో రోహిత్ కేవలం 12 వన్డేలు, 2 టెస్ట్లు మాత్రమే ఆడాడు).. ఇది చూపించకుండా రోహిత్ శర్మ 1100 రోజుల తర్వాత సెంచరీ చేశాడు, మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడు అంటూ గణాంకాలతో ఊదరగొట్టడం సరికాదని హిట్మ్యాన్ మీడియా సమక్షంలో బ్రాడ్కాస్టర్లపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. మూడేళ్లు అంటే వినడానికి చాలా లాంగ్ గ్యాప్గా అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో బ్రాడ్కాస్టర్లు విచక్షణతో ప్రవర్తించాలి, ప్రజలకు తామేమీ మెసేజ్ ఇస్తున్నామో అర్ధం చేసుకోవాలి, ఇలా చేయడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు, వాస్తవాలను వక్రీకరించినట్లవతుందంటూ చురకలంటించాడు. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
టీమిండియా చేతిలో కివీస్ క్లీన్స్వీప్.. వన్డే సిరీస్ మనదే
ఇండోర్: మళ్లీ భారత బ్యాట్లు గర్జించాయి. న్యూజిలాండ్ బంతులు డీలా పడ్డాయి. దీంతో పరుగుల తుఫాన్లో కివీస్ క్లీన్స్వీప్ అయ్యింది. ఫలితంగా మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 3–0తో దక్కించుకుంది. అంతేకాకుండా వన్డే ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ బృందం మూడో స్థానం నుంచి మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుబ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. తర్వాత న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు శార్దుల్కు దక్కగా... శుబ్మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నాడు. ఓపెనర్ల ధనాధన్ ఫామ్లో ఉన్న భారత ఓపెనర్లు రోహిత్, గిల్ కష్టమైన బంతిని, ఓవర్ను గౌరవిస్తూ... అదుపు తప్పిన బంతులకు బౌండరీనే శిక్షగా విధించారు. డఫీ ఐదో ఓవర్లో గిల్, రోహిత్ చెరో సిక్సర్ బాదారు. ఫెర్గూసన్ 8వ ఓవర్ను గిల్ 4, 0, 4, 4, 6, 4లతో చితగ్గొట్టాడు. ఏకంగా 22 పరుగుల్ని పిండుకున్నాడు. డఫీ పదో ఓవర్లో రోహిత్ ఒక బౌండరీ రెండు సిక్స్లు బాదాడు. ఓపెనర్ల ధాటికి భారత్ స్కోరు 12.4 ఓవర్లలో వంద దాటింది. గిల్ 33 బంతుల్లో (8 ఫోర్లు, 2 సిక్స్లు), రోహిత్ 41 బంతుల్లో (4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. కానీ కివీస్ బౌలర్లే జోడీని విడగొట్టలేకపోయారు. ఓవర్కు 8 పైచిలుకు పరుగుల రన్రేట్తో భారత్ 24.1 ఓవర్లోనే 200 పరుగుల మైలురాయి చేరుకుంది. ఆ వెంటనే రోహిత్ 83 బంతుల్లో, గిల్ 72 బంతుల్లో శతకాలు పూర్తిచేసుకున్నారు. రోహిత్ను బౌల్డ్ చేసి బ్రేస్వెల్ 212 పరుగుల ఓపెనింగ్ వికెట్ కు తెరదించాడు. కాసేపటికే గిల్ జోరుకు టిక్నెర్ చెక్ పెట్టాడు. తర్వాత కోహ్లి (36; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ (17; 1 ఫోర్, 1 సిక్స్), సూర్య (14; 2 సిక్సర్లు) విఫలమయ్యారు. పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్లు), శార్దుల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో చెలరేగాడు. కాన్వే సెంచరీ వృథా న్యూజిలాండ్ ఖాతా తెరువక ముందే అలెన్ (0)ను పాండ్యా డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ కాన్వే ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. నికోల్స్ (42; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అండతో సిక్సర్లతో మెరిపించాడు. నికోల్స్ ఆటను కుల్దీప్ ముగించగా.. ఆ తర్వాత మిచెల్ (24; 2 ఫోర్లు), లాథమ్ (0), ఫిలిప్స్ (5)లు శార్దుల్ పేస్కు తలవంచారు. కాన్వే 71 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతన్ని ఉమ్రా న్ అవుట్ చేశాడు. బ్రేస్వెల్ (26; 3 ఫోర్లు, 1 సిక్స్), సాన్ట్నర్ (34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు క్రీజులో నిలిచారు. 30: వన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు. అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్ల జాబితాలో పాంటింగ్తో కలిసి రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ (49), కోహ్లి (46) టాప్–2లో ఉన్నారు. 360: న్యూజిలాండ్తో సిరీస్లో గిల్ చేసిన రన్స్. మూడు మ్యాచ్ల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా బాబర్ ఆజమ్ (పాక్; 2016లో విండీస్పై) పేరిట ఉన్న రికార్డును గిల్ సమం చేశాడు. 19: న్యూజిలాండ్తో మూడో వన్డేలో భారత బ్యాటర్ల సిక్స్ల సంఖ్య. 2013లో ఆస్ట్రేలియాపై కూడా భారత్ 19 సిక్స్లు కొట్టింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) బ్రేస్వెల్ 101; గిల్ (సి) కాన్వే (బి) టిక్నెర్ 112; కోహ్లి (సి) అలెన్ (బి) డఫీ 36; ఇషాన్ (రనౌట్) 17; సూర్యకుమార్ (సి) కాన్వే (బి) డఫీ 14; పాండ్యా (సి) కాన్వే (బి) డఫీ 54; సుందర్ (సి) మిచెల్ (బి) టిక్నెర్ 9; శార్దుల్ (సి) లాథమ్ (బి) టిక్నెర్ 25; కుల్దీప్ (రనౌట్) 3; ఉమ్రాన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385. వికెట్ల పతనం: 1–212, 2–230, 3–268, 4–284, 5–293, 6–313, 7–367, 8–379, 9–385. బౌలింగ్: డఫీ 10–0–100–3, ఫెర్గూసన్ 10–1–53–0, టిక్నెర్ 10–0–76–3, సాన్ట్నర్ 10–0–58–0, మిచెల్ 4–0–41–0, బ్రేస్వెల్ 6–0–51–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) పాండ్యా 0; కాన్వే (సి) రోహిత్ (బి) ఉమ్రాన్ 138; నికోల్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 42; మిచెల్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 24; లాథమ్ (సి) పాండ్యా (బి) శార్దుల్ 0; ఫిలిప్స్ (సి) కోహ్లి (బి) శార్దుల్ 5; బ్రేస్వెల్ (స్టంప్డ్) ఇషాన్ (బి) కుల్దీప్ 26; సాన్ట్నర్ (సి) కోహ్లి (బి) చహల్ 34; ఫెర్గూసన్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 7; డఫీ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 0; టిక్నెర్ (నా టౌట్) 0; ఎక్స్ట్రాలు 19; మొత్తం (41.2 ఓవర్లలో ఆలౌట్) 295. వికెట్ల పతనం: 1–0, 2–106, 3–184, 4–184, 5–200, 6–230, 7–269, 8–279, 9–280, 10–295. బౌలింగ్: పాండ్యా 6–0–37–1, సుందర్ 6–0–49–0, శార్దుల్ 6–0–45–3, ఉమ్రాన్ 7–0–52–1, కుల్దీప్ 9–0–62–3, చహల్ 7.2–0–43–2. -
IND VS NZ 3rd ODI: నంబర్ వన్ జట్టుగా అవతరించిన టీమిండియా
న్యూజిలాండ్పై మూడో వన్డేలో గెలుపు అనంతరం.. స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో కివీస్ను ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా ఊడ్చేసిన రోహిత్ సేన మరో అరుదైన గౌరవం కూడా దక్కించుకుంది. టీమిండియా.. తాజా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్కు ముందు మూడో స్థానంలో ఉండిన టీమిండియా.. టాప్ ప్లేస్లో ఉండిన ఇంగ్లండ్ను వెనక్కు నెట్టి అగ్రపీఠానికి చేరుకుంది. The new No.1 team in the @MRFWorldwide ICC Men's ODI Team Rankings 🤩 More 👉 https://t.co/sye7IF4Y6f pic.twitter.com/hZq89ZPO31 — ICC (@ICC) January 24, 2023 3 వన్డేల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో, తాజాగా ముగిసిన ఆఖరి మ్యాచ్లో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్కు చేరుకునేందుకు మరో 4 మ్యాచ్ల దూరంలో (4 టెస్ట్లు) ఉంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ✅ A dominant win in a series decider✅ A record win at home✅ Strong comeback after multiple setbacksIndia's journey to the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings had a bit of everything 👀https://t.co/f9qr0P1xIb— ICC (@ICC) January 24, 2023 అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ను ఓపెనర్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్). హెన్రీ నికోల్స్ (42), మిచెల్ సాంట్నర్ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
కాన్వే సుడిగాలి శతకం వృధా.. కివీస్ను ఊడ్చేసిన టీమిండియా
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇండోర్ వేదికగా ఇవాళ (జనవరి 24) జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, పర్యాటక జట్టును ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా ఊడ్చేసింది. ఈ విజయంతో భారత్.. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. Another comprehensive performance from #TeamIndia as they outclass New Zealand by 90 runs in Indore to complete a 3-0 whitewash. 🙌🏽 Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/7IQZ3J2xfI — BCCI (@BCCI) January 24, 2023 ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. .@imShard scalped 3️⃣ crucial wickets with the ball when the going got tough and bagged the Player of the Match award as #TeamIndia registered a 90-run victory in the final #INDvNZ ODI 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/cpKbBMOTll — BCCI (@BCCI) January 24, 2023 అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ను ఓపెనర్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్). హెన్రీ నికోల్స్ (42), మిచెల్ సాంట్నర్ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 3⃣6⃣0⃣ runs in three matches 🙌@ShubmanGill becomes the Player of the Series for his sensational performance with the bat, including a double-hundred in the #INDvNZ ODI series👏👏 Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/77HJHLgJoL— BCCI (@BCCI) January 24, 2023 Captain @ImRo45 collects the trophy as #TeamIndia clinch the #INDvNZ ODI series 3⃣-0️⃣ 👏🏻👏🏻Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/5D5lO6AryG— BCCI (@BCCI) January 24, 2023 -
కోహ్లి, ఇషాన్ ఇద్దరూ ఒకేవైపు.. ఏం జరిగిందో చూడండి..!
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరుగు కోసం టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ ఒకేవైపు పరిగెత్తారు. ఫలితంగా ఇషాన్ కిషన్ రనౌటయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీలు చేసి వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లి (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 17; ఫోర్, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపిస్తున్నారు. ఇన్నింగ్స్ 35వ ఓవర్ మూడో బంతికి ఇషాన్ కవర్స్ దిశగా బంతిని ఆడి పరుగు కోసం కోహ్లికి పిలుపునిచ్చాడు. ఇందుకు కోహ్లి వెంటనే రియాక్ట్ అయ్యాడు. అయితే ఇషాన్ క్రీజ్ సగం మధ్యకు వచ్చాక మనసు మార్చుకుని, తిరిగి స్ట్రయికింగ్ ఎండ్కు వెళ్లాడు. అప్పటికే కోహ్లి క్రీజ్లోకి చేరుకోగా.. ఇషాన్ అతన్ని ఫాలో అయ్యాడు. pic.twitter.com/KZpVEBKwt7 — Saddam Ali (@SaddamAli7786) January 24, 2023 పరుగుకు వెళ్లాలా వద్దా అన్న సందిగ్దంలో ఉండిన ఇషాన్ చివరికి వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇషాన్కు ఇంకా పిల్ల చేష్టలు పోలేదని, ప్రొఫెషనల్ ఆటగాడిగా ప్రవర్తించట్లేదని మండిపడుతున్నారు. రన్కు పిలిచి మనసు మార్చుకోవడం ఆటలో సహజమే అయినప్పటికీ.. ఇషాన్లో ఎక్కడా సిరీయస్నెస్ కనిపించలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇషాన్ ఇదే సిరీస్లో రెండో వన్డేలోనూ ఇలాగే ఇమెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. అనవసరంగా స్టంపింగ్కు అప్పీల్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. అప్పుడు కూడా నెటిజన్లు ఇషాన్ను ఇలాగే ఆటాడుకున్నారు. ఇషాన్కు పిల్ల చేష్టలు ఇంకా పోలేదని పరుష పదజాలం ఉపయోగించి కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్, గిల్ మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోర్ చేసింది. -
రోహిత్, గిల్ మెరుపు శతకాలు, ఆఖర్లో హార్ధిక్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. రోహిత్, గిల్ ఔటయ్యాక వడవడిగా వికెట్లు కోల్పోయిన భారత్.. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శార్ధూల్ ఠాకూర్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో 375 పరుగుల మార్కు దాటింది. రోహిత్-గిల్ క్రీజ్లో ఉండగా.. ఓ దశలో టీమిండియా 400 పరుగుల మైలురాయిని సునాయాసంగా దాటుతుందని అంతా భావించారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరు ఔట్ కావడం టీమిండియాకు మైనస్ అయ్యింది. ఆతర్వాత వచ్చిన కోహ్లి (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్) కొద్ది సేపు మెరుపులు మెరిపించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 17; ఫోర్, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (9 బంతుల్లో 14; 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 9; ఫోర్) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో టిక్నర్, డఫ్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఖరి ఓవర్లో భారత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. కాగా, 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్లోనూ భారత్ గెలిస్తే.. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. -
4 వన్డేల్లో 2 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. శుభ్మన్ గిల్ పేరిట పలు రికార్డులు
అరివీర భయంకర ఫామ్లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ఇవాళ (జనవరి 24) న్యూజిలాండ్పై మూడో వన్డేలో సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 78 బంతులు ఎదుర్కొన్న గిల్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 112 చేశాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీని, గత 4 వన్డేల్లో 3వ సెంచరీని నమోదు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ (న్యూజిలాండ్పై తొలి వన్డేలో 208) కూడా ఉంది. ఇవాల్టి మ్యాచ్లో గిల్ సెంచరీ సాధించాక పలు ప్రపంచ రికార్డుల్లో భాగమయ్యాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 4 వన్డే సెంచరీలు (21) పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్కు చెందిన ఇమామ్ ఉల్ హాక్ (9) అగ్రస్థానంలో ఉండగా.. క్వింటన్ డికాక్ (16), డెన్నిస్ అమిస్ (18), షిమ్రోన్ హెట్మేయర్ (22) 2, 3, 5 స్థానాల్లో నిలిచారు. భారత్ తరఫున అతి తక్కువ వన్డేల్లో 4 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ధవన్ 24 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించగా.. గిల్ 21 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇదే మ్యాచ్లో గిల్ మరో ప్రపంచ రికార్డును సమం చేశాడు. 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరసన నిలిచాడు. బాబర్ 2016 విండీస్ సిరీస్లో 360 పరుగులు చేయగా.. గిల్ ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్లో అన్నే పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఇమ్రుల్ కయేస్ (349), డికాక్ (342), గప్తిల్ (330) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 38.4 ఓవర్ల పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. రోహిత్ (101), గిల్ (112)తో పాటు కోహ్లి (36), ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ యాదవ్ (14) కూడా ఔటయ్యారు. -
అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్న గిల్.. మరో మెరుపు సెంచరీ
టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్లో అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచే పరుగుల వరద పారిస్తున్న గిల్.. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో నుంచి ధనాధన్ ఇన్నింగ్స్లకు శ్రీకారం చుట్టాడు. అప్పటివరకు స్లోగా ఆడతాడు అన్న ముద్రను గిల్ ఈ మ్యాచ్తో చెరిపేశాడు. లంకతో తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ (60 బంతుల్లో 70; 11 ఫోర్లు) చేసిన గిల్.. ఆతర్వాతి మ్యాచ్లో 21 పరుగులకే ఔటైనప్పటికీ, మూడో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్లో 97 బంతులు ఎదుర్కొన్న గిల్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఇంతటితో ఆగని గిల్ మేనియా.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ సిరీస్లో తొలి వన్డేలో గిల్ ఏకంగా డబుల్ సెంచరీతో (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఇంతటితో సంతృప్తి చెందని ఈ పంజాబ్ యువకెరటం.. రెండో వన్డేలో అజేయమైన 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంత చేశాక కూడా గిల్ పరుగుల దాహం తీరలేదు. ఇవాళ (జనవరి 24) ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మరో విధ్వంసకర శతకం బాదాడు. ఈ మ్యాచ్లో గిల్.. 72 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ (103 పరుగులు) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ షాట్లు ఆడే విధానం, అతని ఫామ్ చూసి ఈ మ్యాచ్లో కూడా డబుల్ సెంచరీ బాదడం ఖాయమని అంతా ఊహించారు. అయితే గిల్ మరో భారీ షాట్కు ప్రయత్నించి టిక్నర్ బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి 112 (78; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల వద్ద ఔటయ్యాడు. వన్డే కెరీర్లో 4వ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఇదే మ్యాచ్లో రోహిత్ సైతం విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాదాపు 17 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో 85 బంతులను ఎదుర్కొన్న హిట్మ్యాన్.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. హిట్మ్యాన్కు వన్డేల్లో ఇది 30వ సెంచరీ కాగా, అన్ని ఫార్మట్లలో కలిపితే 42వది. రోహిత్, గిల్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన కోహ్లి (25), ఇషాన్ కిషన్ (12) కూడా ధాటిగా ఆడుతుండటంతో టీమిండియా స్కోర్ 33 ఓవర్ల తర్వాత 260/2గా ఉంది. -
దుమ్మురేపిన రోహిత్, గిల్
అప్డేట్: కివీస్తో మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ రికార్డు స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (64 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (56 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధశతకాలు పూర్తి చేసి సెంచరీల దిశగా సాగుతున్నారు. వీరిద్దరి ధాటికి టీమిండియా 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. కాగా, 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్లోనూ భారత్ గెలిస్తే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. న్యూజిలాండ్పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.. ఈ మ్యాచ్లో శతకాల దిశగా దూసుకెళ్తున్న రోహిత్-గిల్లు ఈ ఫీట్లు సాధించకముందే మరో రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రోహిత్-గిల్ జోడీ రికార్డుల్లోరకెక్కింది. వీరిద్దరు తొలి వికెట్కు అజేయమైన 204 పరుగులు జోడించారు. ప్రస్తుతం రోహిత్ (99), గిల్ (98) క్రీజ్లో ఉన్నారు. గతంలో (2009లో) సెహ్వాగ్-గంభీర్ జోడీ పేరిట ఈ రికార్డు ఉండేది. వీరిద్దరు న్యూజిలాండ్పై తొలి వికెట్కు అజేయమైన 201 పరుగులు జోడించారు. వీరి తర్వాత లంక జోడీ జయసూర్య-ఉపుల్ తరంగ (201) మూడో స్థానంలో ఉంది. -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
IND VS NZ 3rd ODI: స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. జనవరి 24న నామమాత్రంగా జరిగే మూడో వన్డేలో ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో షాబాజ్ అహ్మద్, చహల్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లకు విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచే ప్రారంభంకానున్న టీ20 సిరీస్ (న్యూజిలాండ్తో) నేపథ్యంలో చహల్, ఉమ్రాన్ మాలిక్లకు ఓ అవకాశం ఇవ్వాలన్నది మేనేజ్మెంట్ అభిప్రాయమని సమాచారం. చహల్, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ టీ20 జట్టులో కూడా ఉండటంతో ఈ మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పైన పేర్కొన్న మూడు మార్పులు మినహాయించి, రెండో వన్డే ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, గిల్, వన్డౌన్లో విరాట్ కోహ్లి, ఆతర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్ధిక్, షాబాజ్ అహ్మద్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, చహల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్లో భారత్ తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
సంక్రాంతి అంటే కోహ్లికి పూనకాలే.. పండగ రోజు కింగ్ ఎన్ని శతకాలు కొట్టాడంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కింగ్ బద్దలు కొట్టిన అరుదైన రికార్డుల జాబితాలో ఓ అసాధారణ రికార్డు దాగి ఉందన్న విషయం మనలో చాలామంది గమనించి ఉండరు. Virat Kohli on 15th January:- In 2017 - 122(102) vs ENG in ODIs. In 2018 - 153(217) vs SA in Tests. In 2019 - 104(112) vs AUS in ODIs. In 2023 - 166*(110) vs SL in ODIs. pic.twitter.com/1e9qG6KoYW — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 అదేంటంటే.. కింగ్ కోహ్లికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూనకం వస్తుంది. ఈ పర్వదినాన (జనవరి 15) కోహ్లి ఏకంగా 4 సెంచరీలు బాదాడు. 2017 సంక్రాంతి రోజున ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. Declare 15th January as "Virat Kohli Day"@imVkohli pic.twitter.com/DVHA476m5E — Pratham. (@75thHundredWhen) January 15, 2023 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన కింగ్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది సంక్రాంతి తనకెంత అచ్చొచ్చిన పండగో మరోసారి చాటాడు. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ పరిమాణాలను ఓ అభిమాని సోషల్మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. A good day on the field and it was wonderful to watch @ShubmanGill & @imVkohli bhai bat today. Congratulations on your 100s and thanks to the almighty for giving me this opportunity to contribute in team’s biggest win. Shukar 🙏🇮🇳 @BCCI pic.twitter.com/ZDAVMRL250 — Mohammed Siraj (@mdsirajofficial) January 15, 2023 సంక్రాంతి రోజు కోహ్లి శతక్కొట్టుడు గణాంకాలను చూసిన అభిమానులు జనవరి 15ను 'విరాట్ కోహ్లి డే' గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేదిక ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సంక్రాంతి రోజు మ్యాచ్ ఉందంటే కింగ్కు పూనకం వస్తుంది.. ఈ రోజు ప్రత్యర్ధులు ఎంతటి వారైనా జాగ్రత్తగా ఉండాలని కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. Milestone of Virat Kohli today: 46th ODI Hundreds. 74th International Hundred. Most Hundreds in 2023. His 2nd highest score in ODIs. 10th ODI Hundred vs SL, first ever. Highest ever score in Greenfield. Most Sixes in an innings in his ODI career. 2nd Hundred in this series. pic.twitter.com/mES2axrI9N — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 కాగా, లంకపై సూపర్ సెంచరీతో పలు రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. కెరీర్లో 46వ వన్డే శతకాన్ని, ఓవరాల్గా 74వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో శ్రీలంకపై 10వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓ ప్రత్యర్ధిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ సెంచరీ సాధించే క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, లంకతో మూడో వన్డేలో కోహ్లి విధ్వంసకర శతకంతో పాటు శుభ్మన్ గిల్ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్ (2/16) ధాటికి 73 పరుగులకే ఆలౌటై, 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. -
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్లకు రెస్ట్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం కల్పించింది. మరోవైపు శ్రీలంక సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే తుది జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, కసున్ రజిత -
లంకతో మూడో వన్డే.. క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి భారత్
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మధ్య టి20 సిరీస్లోనైనా ఫలితం చివరి మ్యాచ్ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు వన్డే సిరీస్లో మాత్రం రెండో మ్యాచ్కే ఫలితం తేలిపోయింది. టీమిండియా 2–0తో సిరీస్ గెలుచుకోగా, చివరి పోరుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. మరో విజయంతో సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, టి20ల తరహాలో కనీసం ఒక విజయంతోనైనా ముగించి పరువు నిలబెట్టుకోవాలని లంక కోరుకుంటోంది. మార్పు ఉంటుందా... ‘అవసరమైతే తర్వాతి మ్యాచ్లో మార్పులు చేస్తాం’... రెండో వన్డే ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. సిరీస్ ఇప్పటికే చేతికందడంతో స్వల్ప మార్పులతో రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించాలనేది ఆలోచన. గత రెండు మ్యాచ్లలోనూ అవకాశం దక్కకుండా అర్షదీప్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ బెంచీపై వేచి చూస్తున్నారు. వీరిలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. ముగ్గురికీ అవకాశం ఇవ్వాలనుకుంటే ఉమ్రాన్, రాహుల్, అక్షర్లను పక్కన పెట్టవచ్చు. మరోవైపు భుజం నొప్పితో గత మ్యాచ్కు దూరమైన చహల్ పూర్తిగా కోలుకున్నాడు. అతడిని ఆడిస్తారా లేక రెండో వన్డే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. ఇతరత్రా భారత జట్టుకు ఎలాంటి సమస్యలు లేవు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లంతా ఫామ్లో ఉన్నారు. కాబట్టి ప్రధాన బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. వీరంతా తమ స్థాయికి తగినట్లు ఆడితే నిలువరించడం లంకకు చాలా కష్టమవుతుంది. నిసాంక పునరాగమనం... గత మ్యాచ్లో భారత బ్యాటింగ్ను కాస్త ఇబ్బంది పెట్టి మ్యాచ్ను హోరాహోరీగా మార్చగలిగినా... శ్రీలంక అసలు సమస్య బ్యాటింగ్లోనే ఉంది. ఆశించిన స్థాయిలో కీలక ఆటగాళ్లు ప్రదర్శన ఇవ్వకపోవడంతో పేలవ స్కోరుకే పరిమితమైన జట్టు ఏమీ చేయలేకపోయింది. అందరికంటే సీనియర్ కుశాల్ మెండిస్ మరింత బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు చేయాల్సి ఉంది. గాయంతో రెండో వన్డేకు దూరమైన నిసాంక తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అతని స్థానంలో ఆడిన నువనిదు ఫెర్నాండో అరంగేట్ర మ్యాచ్లోనే అర్ధసెంచరీ సాధించడంతో పక్కన పెట్టలేని పరిస్థితి. దాంతో అసలంకను తప్పించవచ్చు. బౌలింగ్లో అంతంత మాత్రంగానే ఉన్న లంక భారత బ్యాటింగ్ను ఎంత వరకు నిలువరించగలదో చూడాలి. -
లంకతో మూడో వన్డే.. వన్డేల్లో అత్యధిక స్కోర్ బాదిన ఆఫ్ఘన్ బ్యాటర్
AFG VS SL 3rd ODI: 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన ఆఫ్ఘనస్తాన్ జట్టు 1-1తో సిరీస్ను సమం చేసుకుంది. సిరీస్లోని తొలి మ్యాచ్లో పర్యాటక జట్టు 60 పరుగుల తేడాతో గెలుపొందగా.. వర్షం కారణంగా రెండో మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దైంది. నిన్న (నవంబర్ 30) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిధ్య జట్టు 4 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ ఓడించడంతో సిరీస్ సమంగా ముగిసింది. మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోర్ చేయగా.. శ్రీలంక జట్టు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 49.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ తొలి మ్యాచ్లో సెంచరీ బాది సూపర్ ఫామ్లో ఉన్న ఇబ్రహీమ్ జద్రాన్ ఈ మ్యాచ్లోనూ భారీ శతకం (138 బంతుల్లో 162; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీ సాధించడం ద్వారా జద్రాన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. కేవలం 8 వన్డేల్లోనే 3 శతకాలు బాది జోరుమీదున్న 20 ఏళ్ల జద్రాన్.. ఆఫ్ఘన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో వన్డేల్లో ఆఫ్ఘన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు మహ్మద్ షెహజాద్ (131) పేరిట ఉండేది. కాగా, ఈ మ్యాచ్లో జద్రాన్కు జతగా నజీబుల్లా (77) రాణించినప్పటికీ.. ఆఫ్ఘన్ బౌలర్లు భారీ టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమ్యారు. కుశాల్ మెండిస్ (67), చరిత్ అసలంక (83 నాటౌట్), చండీమాల్ (33), దసున్ షనక (43), దునిత్ వెల్లలగే (31 నాటౌట్) సంయుక్తంగా రాణించి మ్యాచ్ను గెలిపించడంతో పాటు శ్రీలంక సిరీస్ కోల్పోకుండా కాపాడుకోగలిగారు. సిరీస్లో రెండు శతకాలతో చెలరేగిన ఇబ్రహీమ్ జద్రాన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కగా.. చరిత్ అసలంకకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
చెత్త ఫామ్పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవలి కాలంలో దారుణంగా విఫలమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ.. సోషల్మీడియాలో ఓ మినీ సైజ్ ఉద్యమమే నడుస్తుంది. పంత్ వరుసగా విఫలమవుతున్నా వరుస అవకాశాలు కల్పిస్తూ అతన్ని వెనకేసుకొస్తున్న బీసీసీఐపై సైతం ఫ్యాన్స్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. టీమిండియాలో చోటుకు అన్ని విధాల అర్హుడైన సంజూ శాంసన్కు అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టి, పంత్కు వరుస ఛాన్స్లు కల్పించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు జట్టు యాజమాన్యాన్ని, కోచ్, కెప్టెన్లను గట్టిగా నిలదీస్తున్నారు. ఇదే అంశంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. రిషబ్ పంత్నే డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడు. న్యూజిలాండ్తో మూడో వన్డేకి ముందు పంత్తో మాట్లాడుతూ.. పేలవ ఫామ్పై ఇబ్బందికర ప్రశ్నలు సంధించాడు. Rishabh Pant interview with Harsha Bhogle before 3rd ODI against NZ talking about rain, batting position, stats and scrutiny over T20i performance & WK drills. #NZvINDonPrime pic.twitter.com/TjOUdnPTCz — S H I V A M 🇧🇷 (@shivammalik_) November 30, 2022 హర్షా భోగ్లే: గతంలో వీరేంద్ర సెహ్వాగ్ను కూడా ఇదే ప్రశ్న ఆడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. పరిమిత ఓవర్ల ఫార్మాట్తో పోలిస్తే మీ టెస్ట్ మ్యాచ్ల రికార్డు బాగా ఉంది. దీనిపై మీరేమంటారు..? పంత్: సర్.. రికార్డులనేవి కేవలం నంబర్లు మాత్రమే. అయినా నా వైట్ బాల్ గణాంకాలు కూడా ఏమంత చెత్తగా లేవని నేననుకుంటాను. హర్షా భోగ్లే: నా ఉద్దేశం మీ వైట్ బాల్ గణాంకాలు బాగాలేవని కాదు.. టెస్ట్ రికార్డులతో పోలిస్తే.. అవి కాస్త నార్మల్గా ఉన్నాయన్నదే నా ఉద్దేశం. పంత్: సర్.. కంపారిజన్ అనేది నా లైఫ్లో పార్ట్ కాదు.. ఇప్పుడు నాకు 25, 30-32 ఏళ్లు వచ్చాక మీరు ఇలా చేస్తే ఓ అర్ధం ఉంటుందంటూ అసహనంగా సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. పంత్ మూడో వన్డేలోనూ విఫలం కావడంతో నెటిజన్లు అతన్ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఏదైనా ఉంటే బ్యాట్తో సమాధానం చెప్పాలి.. కరెక్ట్గా ప్రశ్నించినప్పుడు అంత అసహనం ఎందుకని నిలదీస్తున్నారు. -
మళ్లీ నిరాశపర్చిన పంత్.. కెప్టెన్, కోచ్పై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
క్రైస్ట్చర్చ్లోని హాగ్లే పార్క్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. న్యూజిలాండ్ బౌలర్లు ఆడమ్ మిల్నే (3 వికెట్లు), ఫెర్గూసన్ (1), డారిల్ మిచెల్ (1) ధాటికి టీమిండియా 121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. గిల్ (13), ధవన్ (28), పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (6) దారుణంగా విఫలం కాగా, శ్రేయస్ అయ్యర్ (49) పర్వాలేదనిపించాడు. దీపక్ హుడా (3), వాషింగ్టన్ సుందర్ (8) క్రీజ్లో ఉన్నారు. 28 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 131/5గా ఉంది. కాగా, ఈ మ్యాచ్లోనూ వికెట్కీపర్ రిషబ్ పంత్ వైఫల్యాల పరంపర కొనసాగడం టీమిండియా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా పంత్ మారేది లేదు.. తక్షణమే అతన్ని జట్టు నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా పంత్ను వెనకేసుకొస్తున్న జట్టు మేనేజ్మెంట్ను దుయ్యబట్టారు. ఇకనైనా మీ ఒంటెత్తు పోకడలు ఆపుతారా లేక పంత్ను జట్టులో శాశ్వత సభ్యుడిగా కొనసాగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అడిగే వారు లేరని వరుసగా విఫలమవుతున్నా పంత్కు వరుస ఛాన్స్లు ఇస్తున్నారు.. ఫామ్లో ఉన్న సంజూ శాంసన్కు మాత్రం ప్రతి మ్యాచ్లోనూ అన్యాయం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. మూడో వన్డేలో పంత్ వైఫల్యం చెందడంతో అతనిపై విమర్శనాస్త్రాలతో సోషల్మీడియా హోరెత్తుతుంది. పంత్కు వ్యతిరేకంగా, సంజూ శాంసన్కు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. ఈ విషయంలో బీసీసీఐ, జట్టు మేనేజ్మెంట్, కెప్టెన్, కోచ్ల వైఖరిని ఎండగడుతున్నారు. -
IND VS NZ 3rd ODI: వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దు
New Zealand vs India, 3rd ODI: న్యూజిలాండ్- టీమిండియా మధ్య మూడో వన్డేకు కూడా వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో గెలిచిన ఆతిథ్య కివీస్ సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. ఇక రెండో వన్డేలో కూడా వరణుడి ఆటంకం కారణంగా మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం.. కివీస్ గెలవాలంటే..! ఇన్నింగ్స్ 18 ఓవర్ల తర్వాత వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 116 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాన్వే (38), విలియమ్సన్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ తొలి వికెట్కు 97 పరుగులు జోడించాక న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ (57) ఔటయ్యాడు. గేర్ మార్చిన ఓపెనర్లు.. లక్ష్యం దిశగా సాగుతున్న కివీస్ ఆరంభంలో ఆచితూచి ఆడిన కివీస్ ఓపెనర్లు ఆతర్వాత క్రమంగా వేగం పెంచారు. ఫిన్ అలెన్ (53) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడుతుండగా.. డెవాన్ కాన్వే (31) నిదానంగా ఆడుతున్నాడు. 16 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 93/0. ఆ జట్టు గెలవాలంటే 34 ఓవర్లలో మరో 127 పరుగులు చేయాల్సి ఉంది. టార్గెట్ 220.. ఆచితూచి ఆడుతున్న కివీస్ ఓపెనర్లు 220 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన కివీస్ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0. డెవాన్ కాన్వే (7), ఫిన్ అలెన్ (16) క్రీజ్లో ఉన్నారు. రాణించిన సుందర్, శ్రేయస్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (49), వాషింగ్టన్ సుందర్ (51) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, సౌథీ 2, ఫెర్గూసన్, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. తొమ్మిదో వికెట్ డౌన్.. పోరాడుతున్న సుందర్ 47వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 46.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 213/9. సుందర్ (45) ఒక్కడు పోరాడుతున్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 44.3వ ఓవర్లో టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో సౌథీకి క్యాచ్ ఇచ్చి చహల్ (8) ఔటయ్యాడు. 45 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 206/8. సుందర్ (44), అర్షదీప్ సింగ్ (3) క్రీజ్లో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 170 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన దీపక్ చహర్.. మిచెల్ బౌలింగ్లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆరో వికెట్ డౌన్ 149 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. సౌథీ బౌలింగ్లో వికెట్కీపర్ టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి దీపక్ హుడా (12) ఔటయ్యాడు. సుందర్, చాహర్ క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో టీమిండియా.. 121 పరుగులకే సగం వికెట్లు డౌన్ 121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. మంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన శ్రేయస్ అయ్యర్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా క్రీజ్లో ఉన్నారు. డేంజరెస్ సూర్యకుమార్ యాదవ్ ఔట్ 25వ ఓవర్ తొలి బంతికి డేంజరెస్ సూర్యకుమార్ యాదవ్ (6) ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే బౌలింగ్లో సౌథీకి క్యాచ్ ఇచ్చి స్కై పెవిలియన్ బాటపట్టాడు. 25 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 116/4. శ్రేయస్ అయ్యర్ (49), దీపక్ హుడా (1) క్రీజ్లో ఉన్నారు. మళ్లీ నిరాశపర్చిన పంత్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న పంత్, మరోసారి నిరాశపరిచాడు. 16 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి మిచెల్ బౌలింగ్లో ఫిలిప్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 87/3. శ్రేయస్ అయ్యర్ (28), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ మిల్నే బౌలింగ్లో కెప్టెన్ శిఖర్ ధవన్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 55/2. శ్రేయస్ అయ్యర్ (12), రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 8వ ఓవర్ నాలుగో బంతికి టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. పరుగులు చేసేందుకు బాగా ఇబ్బంది పడిన శుభ్మన్ గిల్ (22 బంతుల్లో 13) ఆడమ్ మిల్నే బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 43/1. నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఆచితూచి బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లలో శిఖర్ ధవన్ (25) ఓ మోస్తరుగా ఆడుతుండగా.. గిల్ (5) నిదానంగా ఆడుతున్నాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 31/0. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్చర్చ్లోని హాగ్లే పార్క్ వేదికగా ఇవాళ (నవంబర్ 30) జరుగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యంగా వేశారు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు ప్రారంభమవుతుంది. భారత తుది జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హూడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, చహల్ న్యూజిలాండ్ తుది జట్టు.. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్ -
IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్
న్యూజిలాండ్తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. క్రైస్ట్చర్చ్లోని హాగ్లే పార్క్ వేదికగా రేపు (నవంబర్ 30) జరుగబోయే మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్ ఫోర్కాస్ట్లో పేర్కొంది. క్రైస్ట్చర్చ్లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ప్రెడిక్షన్లో వెల్లడించింది. ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్ జరిగితే, సిరీస్ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్ 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన హార్ధిక్ సేన.. 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే, మొదట వచ్చేది సంజూ పేరే..!
భారత తుది జట్టు కూర్పులో ఇటీవలి కాలంలో యువ ఆటగాడు సంజూ శాంసన్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని దేశ విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు. అసామనమైన ప్రతిభ, టెక్నిక్, ధాటిగా ఆడగల సామర్థ్యం పెట్టుకుని కూడా శాంసన్.. టీమిండియా ఆడిన చాలా మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమవుతున్నాడు. అతని ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 27 మ్యాచ్లు (11 వన్డేలు, 16 టీ20లు) మాత్రమే అడాడంటే, బీసీసీఐ అతనిపై ఏ రేంజ్లో చిన్న చూపు చూస్తుందోనన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అడపాదడపా అవకాశాలు వస్తే, అందులో రాణించినా ఆ మరుసటి మ్యాచ్లోనే రకరకాల కారణాలు చెప్పి సంజూని తుది జట్టు నుంచి తప్పించడం మేనేజ్మెంట్కు పరిపాటిగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ఇందుకు తాజా ఉదాహరణ. సంజూకు అన్యాయం జరుగుతుందన్న విషయం.. బీసీసీఐ సహా యావత్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంపై ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు. ఈ విషయంపై జర్నలిస్ట్లు భారత టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ప్రశ్నిస్తే.. నా జట్టు నా ఇష్టమన్నది అతని నుంచి వచ్చిన సమాధానం. ఇదే విషయంపై వన్డే సారధి ధవన్ను ప్రశ్నించగా.. జట్టు సమతూకం, ఆరో బౌలర్ అవసరం అని పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆరో బౌలర్ అవసరం అయితే, పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ను తప్పించాలి కాని, శాంసన్ను తప్పించడమేంటని అని అభిమానులు అడిగితే స్పందించేవాడే కరువయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ప్రస్తావించాడు. భారత తుది జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే.. మొదటగా వచ్చే పేరు శాంసన్దేనని అన్నాడు. ఇది చాలా బాధాకరం. తనను జట్టు నుంచి ఎందుకు తప్పిస్తున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో శాంసన్ ఉన్నాడంటూ సానుభూతిని వ్యక్తం చేశాడు. శాంసన్ అద్భుతమైన ప్లేయర్ అని మేనేజ్మెంట్ కూడా తెలుసు, అయినా సరైన అవకాశాలు ఇవ్వకుండా అతని కెరీర్ను నాశనం చేస్తుందంటూ జాఫర్ ధ్వజమెత్తాడు. శాంసన్పై ఇంత చిన్నచూపు చూసే యాజమాన్యం పంత్ను మాత్రం ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్ధం కావట్లేదని అన్నాడు. రేపు (నవంబర్ 30) జరుగబోయే మూడో వన్డేలోనైనా మేనేజ్మెంట్ శాంసన్కు అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూడాలని తెలిపాడు. -
IND VS NZ 3rd ODI: హార్ధిక్ను ఆదుకున్న వరుణుడు ధవన్ను కరుణిస్తాడా..?
మాంచి వర్షాకాలంలో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన టీమిండియా.. వరుణుడి పుణ్యమా అని టీ20 సిరీస్ను గెలుచుకోగలిగింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన హార్ధిక్ సేన.. వరుణుడు సహకారంతో 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లోనూ టీ20 సిరీస్ తరహాలోనే సమీకరణాలు మారిపోయాయి. అయితే టీ20 సిరీస్లో వరుణుడు టీమిండియా పక్షాన నిలబడగా.. వన్డే సిరీస్లో ఆతిధ్య జట్టుకు అనుకూలంగా నిలిచాడు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ గెలుపుతో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లగా, ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ రద్దుతో టీమిండియా సిరీస్ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. వరుణుడు కరుణించి, ఆట సాధ్యపడి, ఈనెల 30న (బుధవారం) జరిగే మూడో వన్డేలో గెలిస్తే, సిరీస్ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే టీమిండియా ముందు ఉంది. అయితే, మూడో వన్డేకు వేదిక అయిన క్రైస్ట్చర్చ్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీమిండియా సిరీస్పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వరుణుడు కటాక్షించక, మూడో వన్డే రద్దైతే.. తొలి మ్యాచ్లో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్లో హార్ధిక్ను ఆదుకున్న వరుణుడు.. ధవన్కు వన్డే సిరీస్ను కనీసం డ్రా చేసుకునే అవకాశాన్నైనా కల్పిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. -
ఇదేం షాట్ రా బాబు.. ఇండియాలో అయితే స్టేడియం బయటపడేది..!
Mitchell Marsh Massive 115 Metre Six: 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (నవంబర్ 22) జరిగిన ఆఖరి వన్డేలో ఆతిధ్య ఆస్ట్రేలియా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆసీస్.. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. Clobbered 115 metres! 💥 Mitch Marsh middled this one! #AUSvENG #Dettol | #PlayOfTheDay pic.twitter.com/QzToL1irbC — cricket.com.au (@cricketcomau) November 22, 2022 తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. మిచెల్ మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్.. ఆసీస్ ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఆ జట్టు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఓ కళ్లు చెదిరే షాట్ ఆడి మైదానంలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఓల్లీ స్టోన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్గా మలిచాడు. మార్ష్ కొట్టిన ఈ షాట్ నేరుగా స్టాండ్స్లోకి వెళ్లి ల్యాండైంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెల్బోర్న్ మైదానంలో బంతికి స్టాండ్స్లోకి వెళ్లిందంటే.. ఇండియాలోని గ్రౌండ్స్లో బంతి మైదానం దాటుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ సిక్సర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ సిక్సర్ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 2013లో సౌతాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ స్టేడియంలో ఏకంగా 153 మీటర్ల అత్యంత భారీ సిక్సర్ బాదాడు. -
ఆస్ట్రేలియా ఓపెనర్ల విధ్వంసం.. వార్నర్, హెడ్ శతక్కొట్టుడు
3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో.. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి శతక్కొట్టుడు ధాటికి ఇంగ్లండ్ బౌలర్లకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. హెడ్, వార్నర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి.. ఇంగ్లీష్ ఫీల్డర్లను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించారు. ముఖ్యంగా హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి. పరుగుల వరద పారించాడు. వార్నర్, హెడ్ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు. అయితే 39 ఓవర్లో పరుగు వ్యవధిలో వీరిద్దరూ ఔటవ్వడంతో ఆతిధ్య జట్టు 400 పరుగుల మైలురాయిని చేరుకునే సువర్ణావకాశాన్ని చేజార్చకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ చివర్లో వర్షం పడటంతో మ్యాచ్ను చెరి 48 ఓవర్లకు కుదించగా.. ఆసీస్ తమ కోటా ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓల్లీ స్టోన్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టగా, లియామ్ డాసన్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై 221 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా, ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
IND VS SA 3rd ODI: ప్రపంచ రికార్డు సమం చేసిన భారత్
న్యూఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 11) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ శుభమన్ గిల్ (49) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. శ్రేయస్ అయ్యర్ (28) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఫలితంగా భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, ఈ విజయంతో భారత్.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును సమం చేసింది. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు (అన్ని ఫార్మాట్లలో) సాధించిన జట్టుగా టీమిండియా.. ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2003లో ఆసీస్ అన్ని ఫార్మాట్లలో కలిపి 38 విజయాలు (రికీ పాంటింగ్ సారధ్యంలో 30 వన్డేలు, 8 టెస్ట్లు) నమోదు చేయగా.. ఈ ఏడాది భారత్ ఇప్పటికే (ఈ క్యాలెండర్ ఇయర్లో భారత్ ఇంకా 11 మ్యాచ్లు ఆడాల్సి ఉంది) 38 విజయాలు (56 మ్యాచ్ల్లో 23 టీ20లు, 2 టెస్ట్లు, 13 వన్డేలు) సాధించి ఆసీస్ రికార్డుకు ఎసరు పెట్టే దిశగా సాగుతుంది. 5 వరుస పరాజయాలతో ఈ క్యాలెండర్ ఇయర్ను ప్రారంభించిన భారత్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా వరుస విజయాల బాట పట్టింది. ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై భంగపడ్డా.. ఆతర్వాత వరుసగా వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఇంగ్లండ్, తాజాగా దక్షిణాఫ్రికాపై వరుస విజయాలు సాధించింది. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/18), వాషింగ్టన్ సుందర్ (2/15), షాబాజ్ అహ్మద్ (2/32), సిరాజ్ (2/17) ధాటికి సఫారీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. సఫారీ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వీరిలో క్లాసెన్ (34) టాప్ స్కోరర్ కాగా.. జన్నెమాన్ మలాన్ 15, జన్సెన్ 14 పరుగులు సాధించారు. -
తిప్పేసిన స్పిన్నర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డు
టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 11) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. నేటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/18), వాషింగ్టన్ సుందర్ (2/15), షాబాజ్ అహ్మద్ (2/32) ధాటికి సఫారీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. వీరికి సిరాజ్ (2/17) సహకరించాడు. సఫారీ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వీరిలో క్లాసెన్ (34) టాప్ స్కోరర్ కాగా.. జన్నెమాన్ మలాన్ 15, జన్సెన్ 14 పరుగులు సాధించారు. వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్.. ఈ మ్యాచ్లో 99 పరుగులకే చాపచుట్టేసిన దక్షిణాఫ్రికా వన్డేల్లో తమ నాలుగో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. 1993 ఆసీస్పై చేసిన 63 పరుగులు ఆ జట్టు వన్డే చరిత్రలో అత్యల్ప స్కోర్ కాగా.. 2008లో ఇంగ్లండ్పై 83 పరుగులు, ఈ ఏడాది అదే ఇంగ్లండ్పై మరోసారి 83 పరుగులకే ఆలౌటై వన్డేల్లో తమ రెండు, మూడు అత్యల్ప స్కోర్లను నమోదు చేసింది. తాజాగా టీమిండియాపై 99 పరుగులకే ఆలౌటై వన్డేల్లో తమ నాలుగో అత్యల్ప స్కోర్ను రికార్డు చేసింది. 1999లో నైరోబీలో చేసిన 117 పరుగులు భారత్పై దక్షిణాఫ్రికాకు ఇప్పటివరకు అత్యల్ప స్కోర్గా ఉండేది. ఈ మ్యాచ్లో సఫారీ టీమ్ ఆ రికార్డును కూడా చెరిపేసింది. -
IND Vs SA 3rd ODI: సఫారీలతో టీమిండియా హోరాహోరీ
న్యూఢిల్లీ: భారత గడ్డపై దక్షిణాఫ్రికా పర్యటన చివరి అంకానికి చేరింది. టి20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను చేజార్చుకోరాదని పట్టుదలగా ఉండగా... స్టార్లు లేకపోయినా సిరీస్ గెలవగల సత్తా తమలో ఉందని భారత బృందం నిరూపించే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మూడో వన్డేలో సఫారీ టీమ్తో టీమిండియా తలపడనుంది. రెండు మ్యాచ్లలో ఇరు జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే మరో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే వాన కారణంగా పూర్తి స్థాయి మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. మార్పుల్లేకుండానే... రెండో వన్డేలో భారత జట్టు ఆటను చూస్తే ఈ సిరీస్ ద్వారా జట్టుకు ఆశించిన ఫలితం దక్కినట్లే అనిపిస్తోంది. భారత్ కోణంలో యువ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించడమే ఈ సిరీస్లో కీలకం కాగా అందరూ ఆశించిన స్థాయిలో రాణించారు. బ్యాటింగ్లో శ్రేయస్, సామ్సన్, ఇషాన్ కిషన్ సత్తా చాటగా, ఆల్రౌండర్గా శార్దుల్, బౌలింగ్లో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. షహబాజ్ కూడా అరంగేట్రంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనే కనబర్చాడు. పేసర్లలో సిరాజ్ పదునైన బౌలింగ్ హైలైట్గా నిలిచింది. తన తాజా ప్రదర్శనతో అతను టి20 వరల్డ్ కప్ జట్టులో బుమ్రా స్థానంలో చోటు దక్కించుకునే అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. మరోవైపు రెండు మ్యాచ్లలోనూ విఫలమైన శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్ ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరం ఉంది. వీరిద్దరు జట్టుకు శుభారంభం అందిస్తే తిరుగుండదు. ముఖ్యంగా వచ్చే వన్డే వరల్డ్కప్ వరకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శిఖర్ సొంతగడ్డపై గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడటం అవసరం. మొత్తంగా రెండో వన్డే విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో భారత యువ జట్టు మరో గెలుపుపై దృష్టి పెట్టింది. బవుమా రాణించేనా! భారత్లో అడుగు పెట్టిన నాటినుంచి దక్షిణాఫ్రికాకు అతి పెద్ద సమస్య కెప్టెన్ బవుమా బ్యాటింగ్. నాలుగు మ్యాచ్లలో వరుసగా 0, 0, 3, 8 పరుగులు చేసిన బవుమా వరల్డ్కప్కు ముందు ఆఖరి పోరులోనైనా రాణించాలని జట్టు కోరుకుంటోంది. అనారోగ్యంతో గత మ్యాచ్కు దూరమైన అతను ఇక్కడ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. డికాక్ శుభారంభం అందించాల్సి ఉండగా, ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన మార్క్రమ్ కూడా మరో కీలక ఇన్నింగ్స్పై గురి పెట్టాడు. బవుమా తిరిగొస్తే మలాన్ను తుది జట్టు నుంచి తప్పించడం ఖాయం కాబట్టి హెన్డ్రిక్స్పై అదనపు భారం ఉంది. టూర్ మొత్తం మంచి ప్రదర్శన ఇచ్చిన మిల్లర్ అదే జోరు కొనసాగిస్తే సఫారీ టీమ్ సిరీస్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అయితే రబడ, నోర్జే తమ స్థాయిలో గొప్ప బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆల్రౌండర్గా పార్నెల్ కూడా తమ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. కేశవ్ మహరాజ్ ఆకట్టుకోవడంతో మరోసారి రెండో స్పిన్నర్ లేకుండానే జట్టు బరిలోకి దిగనుంది. ఇలాంటి స్థితిలో పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ముగించగలదా చూడాలి. -
రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ
-
Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’
కోల్కతా: మూడో వన్డేలో ఇంగ్లండ్ చివరి బ్యాటర్ చార్లీ డీన్ను భారత బౌలర్ దీప్తి శర్మ రనౌట్ చేసిన తీరు వివాదంపై మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర చర్చ జరిగింది. దీప్తి బంతి వేయకముందే డీన్ క్రీజ్ దాటడంతో నిబంధనల ప్రకారం దీప్తి ఆమెను రనౌట్ చేసినా... మరోసారి క్రీడాస్ఫూర్తి అంశం ముందుకు వచ్చింది. దీనిపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పటికే వివరణ ఇచ్చినా దీప్తి శర్మ కూడా స్పందించింది. రిటైర్ అయిన పేసర్ జులన్ గోస్వామితో పాటు దీప్తికి స్వదేశం తిరిగొచ్చిన అనంతరం కోల్కతా విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది. ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని దీప్తి వివరణ ఇచ్చింది. దీప్తి వ్యాఖ్యలపై ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ మళ్లీ స్పందించింది. ‘మ్యాచ్ ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే చార్లీ అవుటైంది. మ్యాచ్తోపాటు సిరీస్ గెలిచేందుకు భారత్కు అన్ని విధాలా అర్హత ఉంది. అయితే రనౌట్ గురించి మమ్మల్ని హెచ్చరించారనడంలో వాస్తవం లేదు. నిజానికి వారు చేసింది తప్పు కాదు కాబట్టి హెచ్చరించాల్సిన అవసరం లేదు. కానీ తాము చేసిన దానిని సమర్థించుకోవాలని, అందుకు హెచ్చరిక అనే ఒక అబద్ధాన్ని వాడుకోవాలని కూడా భారత్ భావించరాదు’ అని నైట్ వ్యాఖ్యానించింది. తానియా గదిలో చోరీ... వన్డే సిరీస్లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్లో ఆమె బస చేసిన మారియట్ హోటల్లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. -
జులన్కు క్లీన్స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్లో ‘డకౌట్’కాగా... బౌలింగ్లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్పై తొలిసారి. -
స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీ.. కివీస్ను ఊడ్చేసిన ఆసీస్
స్వదేశంలో కివీస్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో స్టీవ్ స్మిత్ (105) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 25 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్మిత్ సెంచరీ, మార్నస్ లబూషేన్ (52), అలెక్స్ క్యారీ (42 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగుల చేసింది. ఆఖర్లో కెమరూన్ గ్రీన్ (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, సౌథీ, ఫెర్గూసన్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కివీస్ మరో బంతి మిగిలుండగానే 242 పరుగల వద్ద ఆలౌటైంది. ఫిన్ అలెన్ (35), గ్లెన్ ఫిలిప్ (47), జేమ్స్ నీషమ్ (36), మిచెల్ సాంట్నర్ (30) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్ల ఏ ఓక్క బ్యాటర్ను కుదురుకోనివ్వలేదు. సీన్ అబాట్ (2/31), కెమరూన్ గ్రీన్ (2/25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కివీస్పై ఒత్తిడి పెంచారు. ఆఖర్లో స్టార్క్ (3/60) చెలరేగి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. హేజిల్వుడ్, జంపా తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో హాఫ్ సెంచరీ, సెంచరీతో రాణించిన స్టీవ్ స్మిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. కాగా, సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఆసీస్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆసీస్ తదుపరి టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. చదవండి: స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు! -
ఆసీస్పై చారిత్రక విజయానంతరం జింబాబ్వే ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..!
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన అనంతరం జింబాబ్వే ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ అనంతరం మైదానంలో తెగ హడావుడి చేసిన ఆ జట్టు ప్లేయర్స్.. తిరుగు ప్రయాణంలో బస్సులో అంతకుమించిన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బస్సులో ఆటగాళ్లంతా డ్యాన్స్లు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంలో మునిగితేలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏమాత్రం అంచనాలు లేని జట్టు ప్రపంచ మేటి జట్టుకు షాకిస్తే ఇలాగే ఉంటదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పసికూన జింబాబ్వే 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో మట్టికరిపించడంతో జింబాబ్వే ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆసీస్ గడ్డపై తొలి గెలుపు సాధించిన జింబాబ్వే సభ్యులు వినూత్న రీతిలో సంబురాలు చేసుకుంటూ నానా హంగామా చేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆసీస్ నామమాత్రంగా సాగిన ఆఖరి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. #3rdODI | Castle Corner, see what you’ve done? But who can blame us! Thanks for the support and inspiration, home or away! @CastleCornerZW #AUSvZIM | #VisitZimbabwe pic.twitter.com/Vp6VYRWSXU — Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022 జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ సంచలన స్పెల్తో (3 ఓవర్లలో 5/10) చెలరేగడంతో ఆసీస్ 31 ఓవర్లలో 141 పరుగులకే చాపచుట్టేసింది. డేవిడ్ వార్నర్ (96 బంతుల్లో 94; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో వార్నర్, మ్యాక్స్వెల్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్తో పాటు బ్రాడ్ ఇవాన్స్ (2/35), న్యాయుచి (1/15), నగర్వా (1/27), సీన్ విలియమ్స్ (1/36) కూడా రాణించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే సైతం మధ్యలో తడబడింది. ఓపెనర్లు కైటానో (19; 4 ఫోర్లు), మరుమణి (35; 4 ఫోర్లు) పర్వాలేదనిపించినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు మెదెవెరె (2), సీన్ విలియమ్స్ (0), సికందర్ రజా (8) దారుణంగా విఫలమయ్యారు. అయితే కెప్టెన్ రెగిస్ చకబ్వా (72 బంతుల్లో 37; 3 ఫోర్లు).. టోనీ మున్యోంగో (17), ర్యాన్ బర్ల్ (11)ల సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 39 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 3, స్టార్క్, గ్రీన్, స్టోయినిస్, అగర్ తలో వికెట్ పడగొట్టారు. -
IND vs ZIM 3rd ODI: క్లీన్స్వీప్పై భారత్ గురి
హరారే: ఇప్పటికే 2–0తో సిరీస్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ లక్ష్యంగా నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ రాణించి జింబాబ్వేను కట్టడి చేశారు. బ్యాటింగ్లో శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్ ఆకట్టుకోగా... తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో రాణించి ఫామ్లోకి రావాలని భావిస్తున్నారు. రెండు వన్డేల్లో టాస్ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించిన కెప్టెన్ రాహుల్ ఈసారి టాస్ గెలిస్తే భారత బ్యాటర్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఆఖరి వన్డేలో భారత టీమ్ మేనేజ్మెంట్ ఆల్రౌండర్ షహబాజ్ అహ్మద్కు తొలిసారి అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరోవైపు జింబాబ్వే జట్టు అన్ని విభాగాల్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. సొంతగడ్డపై భారత జట్టుపై 2010లో చివరిసారి వన్డేలో గెలిచిన జింబాబ్వే మళ్లీ గెలుపు రుచి చూడాలంటే అద్భుతమే చేయాల్సి ఉంటుంది. -
IND VS WI 3rd ODI: 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
పోర్ట్ ఆఫ్స్పెయిన్: విండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ లక్ష్యం 35 ఓవర్లలో 257 పరుగులు వర్షం అంతరాయం కారణంగా వెస్టిండీస్- ఇండియా మూడో వన్డేలో 36 ఓవర్లలో 225/3 వికెట్ల వద్ద భారత ఇన్నింగ్స్కు తెరపడింది. డక్వర్త లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. టీమిండియా బ్యాట్స్మన్లలో శుభమన్ గిల్ 98 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్ నిలిచాడు. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్ను ముగించడంతో గిల్ తృటిలో సెంచరీని కోల్పోయాడు. అనుకున్నదే అయ్యింది.. వర్షం మొదలైంది వాతావరణ శాఖ హెచ్చరికలే నిజమయ్యాయి. వారు చెప్పినట్లుగానే మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 24 ఓవర్లు పూర్తయ్యాక వర్షం మొదలుకావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఈ సమయానికి టీమిండియా స్కోర్ 115/1. క్రీజ్లో గిల్ (51), శ్రేయస్ (2) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 23వ ఓవర్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హేడెన్ వాల్ష్ బౌలింగ్లో పూరన్కు క్యాచ్ ఇచ్చి ధవన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/1. గిల్కు (51) జతగా శ్రేయస్ క్రీజ్లోకి వచ్చాడు. గిల్ హాఫ్ సెంచరీ మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో గిల్ వన్డేల్లో ఈ ఫీట్ను రెండోసారి చేశాడు. 22 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. ధవన్ 73 బంతుల్లో 58 పరుగలతో క్రీజ్లో ఉన్నాడు. ధవన్ ఫిఫ్టి.. 100 దాటిన టీమిండియా స్కోర్ ఓపెనర్లు ధవన్ (54), గిల్ (44)లు టీమిండియాకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 20 ఓవర్లలో అజేయమైన 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధవన్ వన్డేల్లో 37వ ఫిఫ్టి సాధించాడు. ఈ సిరీస్లో ధవన్కు ఇది రెండో హాఫ్ సెంచరీ. డ్రింక్స్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 87/0 తొలి 10 ఓవర్లు నిదానంగా ఆడిన భారత్.. ఆతర్వాత కాస్త వేగం పెంచింది. ఓపెనర్లు ధవన్ 57 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 48 పరుగులు, గిల్ 46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 36 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. డ్రింక్స్ విరామం సమయానికి (17 ఓవర్లు) భారత్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. గేర్ మార్చని ఓపెనర్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిదానంగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు 11 ఓవర్లు దాటినా గేర్ మార్చడం లేదు. ధవన్ 34 బంతులు ఆడి 23 పరుగులు చేయగా.. గిల్ 32 బంతులను ఎదుర్కొని అన్నే పరుగులు సాధించాడు. 11 ఓవర్లు దాటినా టీమిండియా 50 పరుగుల మార్కును (47/0) చేరుకోలేదు. ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 17/0 టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (8), శిఖర్ ధవన్ (9) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండయా స్కోర్ 17/0. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ను టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు విండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. రోవ్మన్ పావెల్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్ స్థానాల్లో జేసన్ హోల్డర్, కీమో పాల్, కీచీ క్యార్టీ జట్టులో చేరారు. భారత్: శిఖర్ ధవన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, కీచీ క్యార్టీ, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్ -
IND VS WI: మూడో వన్డేకు పొంచి ఉన్న వాన గండం..!
విండీస్తో 3 వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే మూడో వన్డేకు వాన గండం పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే మ్యాచ్కు వేదిక అయిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఆకాశం మేఘావృతమైందని, మ్యాచ్ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్లో పేర్కొంది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్ మొదలైనా మధ్యమధ్యలో వరుణ ఆటంకాలు తప్పవని, 50 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు తప్పి, 50 ఓవర్ల పాటు సజావుగా సాగాలని టీమిండియా కోరుకుంటుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి కాన్ఫిడెంట్గా ఉన్న ధవన్ సేన ఈ మ్యాచ్లోనూ గెలిచి విండీస్ను వైట్వాష్ చేయాలని భావిస్తుంది. మరోవైపు గత రెండు మ్యాచ్ల్లో చివరి వరకు పోరాడి ఓడిన విండీస్ సైతం ఈ మ్యాచ్ను ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక జట్ల విషయానికొస్తే.. టీమిండియా ఈ మ్యాచ్లో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు విండీస్ రెండో వన్డేలో కొనసాగించిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పించాల్సి వస్తే గత మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అకీల్ హొసెన్పై వేటు వేసే ఆస్కారం ఉంది. చదవండి: Ind Vs WI: విండీస్తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! -
India vs West Indies: క్లీన్స్వీప్ లక్ష్యంగా...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఓటమి ఖాయమైన మ్యాచ్లో అనూహ్య విజయంతో సిరీస్నే గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్స్వీప్పై కన్నేసింది. నేడు జరిగే ఆఖరి వన్డేలోనూ నెగ్గి ఆతిథ్య కరీబియన్ను వైట్వాష్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి కనీసం పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే మూడో వన్డే ఆసక్తికరంగా జరగనుంది. ఈ వేదికపై గత రెండు మ్యాచ్ల్లోనూ ఇరు జట్లు భారీస్కోర్లు నమోదు చేశాయి. చివరి పోరు కూడా ఇక్కడే జరగనుండటంతో మరోసారి ప్రేక్షకులకు పరుగుల విందు ఖాయంగా కనిపిస్తోంది. జోరుమీదున్న భారత్ ఇక్కడ వరుస విజయాలతోనే కాదు... ఇటీవల వరుస సిరీస్ విజయాలతో భారత్ జోరు మీదుంది. ఆటగాళ్లు మారినా... సీనియర్లు లేకపోయినా... ఫలితంలో మాత్రం ఏ తేడా లేదు. అదే ఉత్సాహం. అదే పట్టుదల. నిర్లక్ష్యం దరిచేరనీయకుండా కుర్రాళ్లు రాణిస్తున్నారు. టీమిండియా గత రెండు వన్డేల్లోనూ 300 పైచిలుకు స్కోర్లు చేసింది. కెప్టెన్ ధావన్ సహా టాపార్డర్ బ్యాటర్స్ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సూపర్ఫామ్లో ఉన్నారు. అయ్యర్ అర్ధసెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సంజూ సామ్సన్ కూడా గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆరో వరుసలో బ్యాటింగ్కు దిగుతున్న దీపక్ హుడా సత్తా చాటుతున్నాడు. అక్షర్ పటేల్ ‘షో’ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఏ రకంగా చూసిన భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బెంగ ఏమైనా ఉంటే అది సూర్యకుమార్పైనే! తను కూడా చివరి పోరులో బ్యాట్ ఝుళిపిస్తే మరో భారీస్కోరుకు తిరుగుండదు. ఇక బౌలింగ్లోనే కాస్త మెరుగుపడాలి. వెస్టిండీస్కు మరో 300 ప్లస్ అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలి. ఓదార్పు విజయంపై... మరోవైపు వెస్టిండీస్ పరిస్థితి భారత్కు పూర్తి భిన్నంగా ఉంది. ప్రత్యర్థి జట్టుకు దీటుగా 300 పైచిలుకు పరుగులైతే చేస్తోంది. కానీ అంత చేసినా... తొలి వన్డేలో ఛేదనలో ఆఖరుకొచ్చేసరికి వెనుకబడింది. రెండో మ్యాచ్లో చేసింది కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు షై హోప్, కైల్ మేయర్స్, బ్రూక్స్, కింగ్ చెప్పుకోదగ్గ స్కోర్లే చేస్తున్నారు. కానీ బౌలింగ్ వైఫల్యాలతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈసారి బౌలింగ్ లోపాలపై దృష్టి పెట్టిన కరీబియన్ జట్టు ఆఖరి పోరులో గెలిచి తీరాలనే కసితో ఉంది. సమష్టి విజయంతో భారత్ క్లీన్స్వీప్ను అడ్డుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. పిచ్, వాతావరణం రెండు వన్డేల్లో పరుగుల వరద పారింది. కానీ... రెండే రోజుల వ్యవధిలో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం మరో పిచ్ను వినియోగిస్తున్నారు. ఇక్కడ సీమర్లకు అనుకూలం. ఈ రోజు చినుకులు కురిసే అవకాశం కూడా ఉంది. జట్లు (అంచనా) భారత్: ధావన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, సంజూ సామ్సన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దుల్, సిరాజ్, చహల్, అవేశ్ ఖాన్/ప్రసిధ్ కృష్ణ. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), షై హోప్, కైల్ మేయర్స్, బ్రూక్స్/కార్టీ, బ్రాండన్ కింగ్, పావెల్, హోసీన్, షెఫర్డ్/కీమో పాల్, జోసెఫ్, సీల్స్, హేడెన్ వాల్‡్ష. -
IND vs ENG 3rd ODI: పంత్ ధమాకా...
భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే... సిరాజ్ టాప్ లేపాడు. హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ను కట్టడి చేశాడు. బ్యాటింగ్ పిచ్పై ఆతిథ్య జట్టు 259 పరుగులకే ఆలౌట్! ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఛేదన మొదలవగానే బ్యాటింగ్ కష్టాలు ఎదురయ్యాయి. భారత టాపార్డర్ (రోహిత్ 17, ధావన్ 1, కోహ్లి 17) చేసిన పరుగులు 35. విజయంపై ఆశల్లేని ఈ దశలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం భారత్ను గెలుపు మలుపు తిప్పింది. పంత్ అజేయ శతకం సిరీస్ విజయాన్నిచ్చింది. మాంచెస్టర్: వన్డే సిరీస్ కూడా 2–1తో భారత్ చేతికే చిక్కింది. మూడో వన్డేలో రోహిత్ శర్మ బృందం ఐదు వికెట్లతో ఇంగ్లండ్పై నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్స్లు), జేసన్ రాయ్ (31 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు. హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్లు) గెలిపించేదాకా క్రీజులోనే నిలిచాడు. హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... హార్దిక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. రాణించిన బట్లర్, రాయ్ వరుస బౌండరీలతో మొదలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఆదిలోనే సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. షమీ తొలి ఓవర్లోనే రాయ్ 3 ఫోర్లు బాదాడు. రెండో ఓవర్ వేసిన సిరాజ్ పరుగైన ఇవ్వకుండా బెయిర్స్టో (0), రూట్ (0)లను డకౌట్ చేశాడు. దీంతో రాయ్, స్టోక్స్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు) అడపాదడపా బౌండరీలతో స్కోరు పెంచారు. అయితే హార్దిక్ వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పంపాడు. మొయిన్ అలీ (44 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో కెప్టెన్ బట్లర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం లివింగ్స్టోన్ (31 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఓవర్టన్ (33 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. పంత్ వీరోచితం ఓపెనర్లు ధావన్ (1), రోహిత్ (17) సహా కోహ్లి (17)లను రీస్ టాప్లీ పడగొట్టేశాడు. భారత్ స్కోరు 38/3. సూర్యకుమార్ (16) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 16.2 ఓవర్లలో 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కూలాయి. ఇంకా బోలెడు ఓవర్లున్నా... పెద్ద లక్ష్యం... కానీ చేతిలో ఉన్న 6 వికెట్లలో బ్యాటర్స్ ముగ్గురే! ఇక గెలుపే కష్టమనుకున్న దశలో నింపాదిగా ఆడుతున్న పంత్కు జతయిన హార్దిక్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే పాండ్యా 43 బంతుల్లో, పంత్ 71 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్కు 133 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో స్కోరు 200 దాటింది. కాసేపటికే పాండ్యా అవుటైనా... జడేజా (7 నాటౌట్) అండతో 106 బంతుల్లో (10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించిన పంత్... విల్లే వేసిన 42వ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే పంత్ మరో బౌండరీ కొట్టి భారత్ను విజయతీరానికి చేర్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) పంత్ (బి) పాండ్యా 41; బెయిర్స్టో (సి) అయ్యర్ (సబ్) (బి) సిరాజ్ 0; రూట్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 0; స్టోక్స్ (సి అండ్ బి) పాండ్యా 27; బట్లర్ (సి) జడేజా (బి) పాండ్యా 60; అలీ (సి) పంత్ (బి) జడేజా 34; లివింగ్స్టోన్ (సి) జడేజా (బి) పాండ్యా 27; విల్లే (సి) సూర్యకుమార్ (బి) చహల్ 18; ఓవర్టన్ (సి) కోహ్లి (బి) చహల్ 32; కార్స్ (నాటౌట్) 3; టాప్లీ (బి) చహల్ 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–66, 4–74, 5–149, 6–198, 7–199, 8–247, 9–257, 10–259. బౌలింగ్: షమీ 7–0–38–0, సిరాజ్ 9–1–66–2, ప్రసిధ్కృష్ణ 9–0–48–0, హార్దిక్ పాండ్యా 7–3–24–4, చహల్ 9.5–0–60–3, జడేజా 4–0–21–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రూట్ (బి) టాప్లీ 17; ధావన్ (సి) రాయ్ (బి) టాప్లీ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) టాప్లీ 17; పంత్ (నాటౌట్) 125; సూర్యకుమార్ (సి)బట్లర్ (బి) ఓవర్టన్ 16; పాండ్యా (సి) స్టోక్స్ (బి) కార్స్ 71; జడేజా (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (42.1 ఓవర్లలో 5 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–38, 4–72, 5–205. బౌలింగ్: టాప్లీ 7–1–35–3, విల్లే 7–0–58–0, కార్స్ 8–0–45–1, అలీ 8–0–33–0, ఓవర్టన్ 8–0–54–1, స్టోక్స్ 2–0–14–0, లివింగ్స్టోన్ 2–0–14–0, రూట్ 0.1–0–4–0. -
ENG vs IND: విజయంతో ముగించేందుకు...
మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డే సిరీస్లో రెండు మ్యాచ్లు ముగిసేసరికి ఇరు జట్ల సమంగా నిలిచిన స్థితిలో ఆఖరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో సత్తా చాటేందుకు భారత్, ఇంగ్లండ్ సన్నద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ను 10 వికెట్ల తేడాతో గెలిచి రెండో మ్యాచ్లో 100 పరుగులతో ఓడిన రోహిత్ సేన చివరి సమరంలో సత్తా చాటుతుందా చూడాలి. ధావన్పై దృష్టి... గత మ్యాచ్లో ఓడినా భారత బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ బ్యాటింగ్ మరో సారి కీలకం కానుండగా, అన్ని వైపులనుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి తన ఫేవరెట్ ఫార్మాట్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. రాబోయే వెస్టిండీస్ టూర్నుంచి కూడా దూరంగా ఉండనున్న కోహ్లి తన అసలు స్థాయి చూపేందుకు ఈ మ్యాచ్ సరైన అవకాశం కల్పిస్తోంది. అతను ఇక్కడ చెలరేగితే తిరుగుండదు. అయితే శిఖర్ ధావన్ ఆట కూడా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే టూర్కు కెప్టెన్గా కూడా వ్యవహరించనున్న ధావన్ తన పాత శైలిలో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. తొలి వన్డేలో 54 బంతుల్లో 31 పరుగులు చేసిన అతను తర్వాతి మ్యాచ్లో 9 పరుగులు చేసేందుకు 26 బంతులు తీసుకున్నాడు. రోహిత్, ధావన్ సమష్టిగా చెలరేగితే భారత్కు శుభారంభం లభిస్తుంది. మిడిలార్డర్లో పంత్ తన దూకుడును ప్రదర్శించాల్సి ఉంది. సూర్యకుమార్, హార్దిక్, జడేజా మరోసారి బ్యాటింగ్లో కీలకం కానున్నారు. అయితే గత కొంత కాలంగా బౌలర్గా పూర్తిగా విఫలమవుతున్న జడేజా ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. బౌలింగ్లో బుమ్రా, షమీ ఖాయం కాగా గత మ్యాచ్లో 4 వికెట్లు తీసిన చహల్ మరోసారి ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. ప్రసిధ్ ఆకట్టుకున్నా...బ్యాటింగ్ను మరింత బలంగా మార్చేందుకు అతని స్థానంలో శార్దుల్ను ప్రయత్నించే అవకాశం ఉంది. అందరూ అంతంతే... పేసర్ రీస్ టాప్లీ ఆరు వికెట్ల అద్భుత ప్రదర్శన ఇంగ్లండ్కు రెండో మ్యాచ్లో విజయాన్ని అందించింది కానీ లేకపోతే మరో పరాభవం మిగిలేది. ఘనత వహించిన బ్యాటింగ్ లైనప్ వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమైంది. ఒక్క బ్యాటర్ కూడా రెండు మ్యాచ్లలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. స్వయంగా కెప్టెన్ బట్లర్ ఇబ్బందిపడుతుండగా, ఓపెనర్లు రాయ్, బెయిర్స్టో ప్రభావం చూపలేకపోతున్నారు. రూట్, స్టోక్స్ జట్టులోకి రావడంతో అదనంగా వచ్చిన ప్రయోజనం ఏమీ కనపడలేదు. లివింగ్స్టోన్ కూడా పెద్ద స్కోరు చేయాల్సి ఉంది. ఆల్రౌండర్లు విల్లీ, అలీ రెండో మ్యాచ్లో ఆదుకున్నారు. వీరిద్దరు ఈ సారి కూడా కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్లో టాప్లీతో పాటు ఇతర పేసర్లు రాణించాల్సి ఉంది. ఇంగ్లండ్ కూడా మార్పుల్లేకుండా అదే జట్టులో బరిలోకి దిగవచ్చు. పిచ్, వాతావరణం సాధారణ వికెట్. బ్యాటింగ్కు అనుకూలం. వర్షం సమస్య లేదు. ఓల్డ్ట్రఫోర్డ్ మైదానంలో గత 9 వన్డేల్లో ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. -
తన ఫామ్పై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన కోహ్లి
కెరీర్లో దుర్భర దశను ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. తన ఫామ్పై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రేంజ్లో కౌంటరిచ్చాడు. తనపై అవాక్కులు చవాక్కులు పేలే వాళ్లకి రన్ మెషీన్ తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు. డార్లింగ్.. నేను కింద పడితే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి..? అంటూ తనను టార్గెట్ చేసిన వారికి చురకత్తిలాంటి సూక్తితో బదులిచ్చాడు. ఈ కోట్ను కోహ్లి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. Perspective pic.twitter.com/yrNZ9NVePf — Virat Kohli (@imVkohli) July 16, 2022 కాగా, విరాట్ కోహ్లి 2019 నవంబర్ 22 తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో మూడంకెల స్కోర్ చేసింది లేదు. అంతకుముందు కెరీర్లో 70 శతకాలు బాదిన రన్ మెషీన్.. ఈ మధ్యకాలంలో ఒక్క శతకం కూడా చేయలేకపోయాడు. దీంతో అతనిపై ముప్పేట దాడి మొదలైంది. చాలామంది వ్యతిరేకులు కోహ్లిని టీమిండియా నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్స్టా వేదికగా విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు. తన ఫామ్పై ఎవ్వరూ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని పరోక్ష సందేశాన్ని పంపాడు. ఇదిలా ఉంటే, కోహ్లి ఫామ్పై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విమర్శలు గుప్పిస్తుంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ మాత్రం కింగ్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. కోహ్లిని కార్నర్ చేస్తున్న వారికి హిట్మ్యాన్ తనదైన శైలిలో బదులిస్తున్నాడు. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా కోహ్లికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. కోహ్లి తన ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హార్ట్ టచింగ్ ట్వీట్ను పోస్టు చేశాడు. చదవండి: Kohli poor form: విరాట్ కోహ్లికి ఏమైంది..? -
20 ఏళ్ల తర్వాత ఆసీస్పై వన్డే సిరీస్ సొంతం
కెప్టెన్ బాబర్ ఆజమ్ (105 నాటౌట్; 12 ఫోర్లు), ఇమామ్ (89 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్ల సిరీస్ను పాక్ 2–1తో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై పాక్ తొలిసారి వన్డే సిరీస్ దక్కించుకుంది. ముందుగా ఆసీస్ 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్కాగా... పాక్ 37.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. -
ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. సిరీస్ క్లీన్స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
కేప్టౌన్: రెండో వన్డేతో సిరీస్ పోయింది. ఇప్పుడు ఆఖరి ఓటమితో పరువు పోయింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలై సిరీస్ను 0–3తో చేజార్చుకుంది. మొదట దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ (124; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించాడు. డసెన్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ధావన్ (61; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (65; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లి అవుట్ కావడంతోనే క్లీన్స్వీప్ ఖాయమైనప్పటికీ... దీపక్ చహర్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్ను ఎన్గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధావన్ (బి) బుమ్రా 124; మలాన్ (సి) పంత్ (బి) చహర్ 1; బవుమా (రనౌట్) 8; మార్క్రమ్ (సి) సబ్–రుతురాజ్ (బి) చహర్ 15; డసెన్ (సి) శ్రేయస్ (బి) చహల్ 52; మిల్లర్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 39; ఫెలుక్వాయో (రనౌట్) 4; ప్రిటోరియస్ (సి) సూర్యకుమార్ (బి) ప్రసిధ్ కృష్ణ 20, కేశవ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; మగాలా (సి) రాహుల్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 287. వికెట్ల పతనం: 1–8, 2–34, 3–70, 4–214, 5–218, 6–228, 7–272, 8–282, 9–287, 10–287. బౌలింగ్: దీపక్ చహర్ 8–0–53–2, బుమ్రా 10–0–52–2, ప్రసిధ్ కృష్ణ 9.5–0–59–3, జయంత్ యాదవ్ 10–0–53–0, చహల్ 9–0–47–1, శ్రేయస్ అయ్యర్ 3–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మలాన్ (బి) ఎన్గిడి 9; ధావన్ (సి) డికాక్ (బి) ఫెలుక్వాయో 61; కోహ్లి (సి) బవుమా (బి) కేశవ్ 65; పంత్ (సి) మగాలా (బి) ఫెలుక్వాయో 0; శ్రేయస్ అయ్యర్ (సి) ఫెలుక్వాయో (బి) మగాలా 26; సూర్యకుమార్ (సి) బవుమా (బి) ప్రిటోరియస్ 39; దీపక్ చహర్ (సి) ప్రిటోరియస్ (బి) ఎన్గిడి 54; జయంత్ (సి) బవుమా (బి) ఎన్గిడి 2; బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్వాయో 12; చహల్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం ( 49.2 ఓవర్లలో ఆలౌట్) 283. వికెట్ల పతనం: 1–18, 2–116, 3–118, 4–156, 5–195, 6–210, 7–223, 8–278, 9–281, 10–283. బౌలింగ్: ఎన్గిడి 10–0–58–3, ప్రిటోరియస్ 9.2–0– 54–2, మగాలా 10–0–69–1, కేశవ్ మహరాజ్ 10–0–39–1, ఫెలుక్వాయో 7–0–40–3, మార్క్రమ్ 3–0–21–0. -
Viral Video: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. లైవ్లో కనిపించిన కోహ్లి కుమార్తె
Vamika First Photo Goes Viral: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తె వామికా లైవ్లో దర్శనమిచ్చింది. స్టాండ్స్లో తల్లి అనుష్క శర్మ చేతుల్లో ఉండగా కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో వామిక ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. కాగా, కోహ్లి దంపతులు మొదటి నుంచి చిన్నారి వామిక ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లి-అనుష్క దంపతులకు వామిక.. గతేడాది జనవరి 11న జన్మించింది. She is soo soo cute🥺❤️This one is for the baby❤️#ViratKohli #vamika #INDvsSAF pic.twitter.com/IyEvvSicqd— Ananya Sharma (@Theananyasharma) January 23, 2022 చదవండి: "కోహ్లిని బలవంతంగా తప్పుకునేలా చేశారు.." పాక్ మాజీ బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఫైరవుతున్న ఫ్యాన్స్
Virat Kohli Slammed For Chewing Gum During National Anthem: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేకి ముందు భారత జాతీయ గీతాలాపన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన పనికి భారత అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఎలా ఉన్నా, దేశం పట్ల అమితమైన గౌరవం కలిగిన కోహ్లి.. మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపన సమయంలో చూయింగ్ గమ్ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లి వింతగా ప్రవర్తించడంతో భారతీయులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. Virat Kohli busy chewing something while National Anthem is playing. Ambassador of the nation.@BCCI pic.twitter.com/FiOA9roEkv — Vaayumaindan (@bystanderever) January 23, 2022 ఆన్ ఫీల్డ్(బ్యాటింగ్ ఫామ్), ఆఫ్ ద ఫీల్డ్(కెప్టెన్సీ విషయంలో బీసీసీఐతో గొడవ) విషయాలు పక్కకు పెట్టి మరీ అతనిపై విరుచుకుపడుతున్నారు. జాతీయ గీతం ఆలపించేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని ఫైరవుతున్నారు. కోహ్లి నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. జాతీయ జట్టుకు ఆడడం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. కాగా, టీమిండియా కెప్టెన్సీకి గుడ్బై చెప్పాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ కసిగా కనిపించే కోహ్లిలో ఆ ఫైర్ మిస్ అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మైదానంలో, డ్రెసింగ్ రూమ్లో పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. కోహ్లి ఇలా మారడానికి బీసీసీఐ అతని పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమని అతని అభిమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గంగూలీ, జై షాలు జట్టు నుంచి సైతం తప్పిస్తామని వార్నింగ్లు ఇచ్చారని, అందుకే కోహ్లి ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని కూడా లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం అతనే స్వయంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చదవండి: ఇన్ని రోజులు కెప్టెన్గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇకపై కుదరదు..! -
ఇన్ని రోజులు కెప్టెన్గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇకపై కుదరదు..!
Harbhajan Singh Warns Virat Kohli Over Batting Form: గత రెండేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ గట్టిగా హెచ్చరించాడు. ఇన్ని రోజులు కెప్టెన్ హోదాలో ఉన్నావు కాబట్టి నడిచిందని, ఇకపై రాణించకపోతే జట్టులో స్థానం కూడా గల్లంతవుతుందని అలర్ట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొందని, ఇది దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ చేయాలని సూచించాడు. త్వరలో ఐపీఎల్ 2022 ప్రారంభంకానుండగా, క్యాష్ రిచ్ లీగ్లో రాణించే దేశీయ ఆటగాళ్లు సైతం టీమిండియాలో స్థానం కోసం పోటీపడతారని, వీరి నుంచి కూడా కోహ్లి స్థానానికి ముప్పు పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చాడు. ఎంతటి ఘన చరిత్ర కలిగిన ఆటగాడికైనా మంచి ప్రదర్శనలే జట్టులో స్థానం కల్పిస్తాయని, కోహ్లి అందుకు అతీతుడేమీ కాదని అభిప్రాయపడ్డాడు. గతంలో దిగ్గజ క్రికెటర్లు సైతం జట్టులో స్థానం కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించాడు. ఐదు నెలల క్రితం వరకు కోహ్లి అన్ని ఫార్మాట్లలో జట్టు కెప్టెన్గా ఉన్నాడని, జట్టు ఎంపికలో కెప్టెన్కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఫామ్తో సంబంధం లేకుండా తుది జట్టులో ఉన్నాడని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని కోహ్లి గ్రహించాలని సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోహ్లిపై ఒత్తిడి సహజమేనని, అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. కాగా, విరాట్ కోహ్లి.. గత రెండేళ్లుగా బ్యాటింగ్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో అతను ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం అతను టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2022: అందుకే స్టొయినిస్ను ఎంపిక చేశారు: గంభీర్ -
అమ్మాయిలూ సూపర్: రికార్డు విజయం... రికార్డు బ్రేక్
29 అక్టోబర్, 2017... ఆస్ట్రేలియా మహిళల జట్టు చివరిసారి వన్డేల్లో ఓడిన రోజు. ఆ మ్యాచ్ తర్వాత ఆ్రస్టేలియా జైత్రయాత్ర మొదలైంది. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు కాదు... వరుసగా 26 వన్డేల్లో ఆ జట్టు గెలుస్తూ వచి్చంది. పురుషుల, మహిళల క్రికెట్లో ఏ జట్టుకూ సాధ్యంకాని ఘనతను సాధించింది. ఎట్టకేలకు 3 సంవత్సరాల 11 నెలల తొమ్మిది రోజుల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా మహిళల జట్టు వన్డేల్లో ఓటమి చవిచూసింది. రెండో వన్డేలో చివరి బంతికి ఓడిపోయిన బాధను అధిగమిస్తూ... సిరీస్ను కోల్పోయిన విషయాన్ని విస్మరిస్తూ... మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు చివరిదైన మూడో వన్డేలో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా దూకుడుగా ఆడింది. మూడు బంతులు మిగిలి ఉండగా 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా తమ వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును సృష్టించింది. దాదాపు నాలుగేళ్లుగా ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాకు పరాజయం రుచి చూపించింది. చివరి వన్డేలో ఓడినా ఆస్ట్రేలియా 2–1తో సిరీస్ను సొంతం చేసుకుంది. మెకాయ్ (క్వీన్స్లాండ్): తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి డీలాపడ్డ భారత మహిళల జట్టు చివరి వన్డేలో మాత్రం రికార్డు ఛేదనతో అదరగొట్టింది. 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. వన్డేల్లో భారత్కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. మరోవైపు వరుసగా 26 వన్డేల్లో నెగ్గిన ఆ్రస్టేలియాకు ఇదే తొలి పరాజయం. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య ఈనెల 30న ఏకైక టెస్టు (డే/నైట్) మొదలవుతుంది. శుభారంభం... టాస్ గెలిచిన ఆ్రస్టేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. యాష్లే గార్డ్నర్ (62 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్లు), బెత్ మూనీ (64 బంతుల్లో 52; 6 ఫోర్లు), తహిలా మెక్గ్రాత్ (32 బంతుల్లో 47; 7 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో మూడు వికెట్లు తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు షఫాలీ వర్మ (91 బంతుల్లో 56; 7 ఫోర్లు), స్మృతి మంధాన (25 బంతుల్లో 22; 3 ఫోర్లు) తొలి వికెట్కు 59 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అనంతరం యస్తిక భాటియా (69 బంతుల్లో 64; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. షఫాలీ, యస్తిక రెండో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. ఈ క్రమంలో షఫాలీ, యస్తిక వన్డేల్లో తమ తొలి అర్ధ సెంచరీలను సాధించారు. షఫాలీ అవుటయ్యాక రిచా ఘోష్ (0), యస్తిక, పూజా వ్రస్తాకర్ (3), కెపె్టన్ మిథాలీ రాజ్ (16) వెంట వెంటనే అవుటవ్వడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే దీప్తి శర్మ (30 బంతుల్లో 31; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) నిలబడి భారత్ను విజయం దిశగా నడిపించారు. అయితే ఓవర్ తేడాలో వీరిద్దరూ పెవిలియన్కు చేరడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో జులన్ గోస్వామి (7 బంతుల్లో 8 నాటౌట్; 1 ఫోర్), మేఘన సింగ్ (3 బంతుల్లో 2 నాటౌట్) ఒత్తిడికి లోనుకాకుండా ఆడి మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్కు విజయాన్ని అందించారు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఆసీస్ స్పిన్నర్ మోలినెక్స్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి మేఘన పరుగు తీయలేదు. రెండో బంతికి సింగిల్ తీసి జులన్ గోస్వామికి స్ట్రయిక్ ఇచి్చంది. మూడో బంతిని జులన్ గోస్వామి ముందుకు వచ్చి స్ట్రయిట్ లాఫ్టెడ్ షాట్ కొట్టింది. బంతి బౌండరీ దాటింది. భారత్కు విజ యం ఖాయమైంది. రెండో వన్డేలో జులన్ గోస్వామి వేసిన చివరి ఓవర్లోనే భారత్ ఓటమి చవిచూడగా... మూడో వన్డేలో జులన్ గోస్వామియే భారత్కు విజయాన్ని కట్టబెట్టింది. తాజా గెలుపుతో భారత్ 2019లో వదోదరాలో దక్షిణాఫ్రికాపై ఛేదించిన 248 పరుగుల లక్ష్యం రికార్డును సవరించింది. సంక్షిప్త స్కోర్లు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: 264/9 (అలీసా హీలీ 35, ఎలీస్ పెర్రీ 26, బెత్ మూనీ 52, యాష్లే గార్డ్నర్ 67, తహిలా మెక్గ్రాత్ 47, జులన్ గోస్వామి 3/37, పూజా వస్త్రాకర్ 3/46); భారత్ ఇన్నింగ్స్: 266/8 (49.3 ఓవర్లలో) (షఫాలీ వర్మ 56, స్మృతి మంధాన 22, యస్తిక భాటియా 64, దీప్తి శర్మ 31, స్నేహ్ రాణా 30, అనాబెల్ సదర్లాండ్ 3/30). ఈ విజయంతో చాలా ఆనందంగా ఉన్నాం. భారత్లో భారత్పైనే ఆస్ట్రేలియా వరుస విజయాల పరంపర మొదలైంది. ఆసీస్ విజయాలకు మనమే అడ్డకట్ట వేయగలమని జట్టు సభ్యులకు చెబుతూ వచ్చాను. చివరికి అమ్మాయిలు నిజం చేసి చూపించారు. షఫాలీ, యస్తిక, స్నేహ్ రాణా అద్భుతంగా ఆడారు. – మిథాలీ రాజ్