veligonda project
-
వెలిగొండ ప్రాజెక్ట్పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
‘నిమ్మల’మైన అబద్ధాలు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టుపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వక్రీకరణలతో అవాస్తవాలు మాట్లాడారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని.. దీనికోసం రూ.4 వేల కోట్లు అవసరమని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4.50 లక్షల ఎకరాలకు సాగు, 25 లక్షల మందికి తాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులను ఏవీ గత ప్రభుత్వం పూర్తి చేయలేదని, రైతులను గృహనిర్బంధం చేసి బందోబస్తు మధ్య ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. మొదటి సొరంగంలో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును, రెండో సొరంగంలో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉందని వీటిని చేయడానికి 9 నెలలు పడుతుందన్నారు. రెండో సొరంగంలో 6.8 కి.మీ. లైనింగ్ చేయాలని.. భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కూడా ఉందని, దానిని తొలగించేందుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. 21.8 కి.మీ. ఫీడర్ కెనాల్ పనుల పటిష్ఠతను తేల్చాల్సి ఉందన్నారు. 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టుకు భూమి పూజ చేసి.. 2014–19లో పనులకు రూ.1,319 కోట్లు ఖర్చు చేశారని నిమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులకు రూ.647 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. వాస్తవం ఇదీ.. 2014–19 మధ్య వెలిగొండ జంట సొరంగాలను పూర్తి చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కానీ, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ జంట సొరంగాలను 2019–24 మధ్య అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. మొదటి సొరంగం లైనింగ్ పూర్తిగా, రెండో సొరంగంలో 12 కి.మీ. పొడవునా లైనింగ్ పూర్తయింది. రెండు సొరంగాలను 2024, మార్చి 6న సీఎం హోదాలో జగన్ జాతికి అంకితం చేశారు. రెండో సొరంగం లైనింగ్ పూర్తి చేసి.. నల్లమల సాగర్ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే శ్రీశైలం నుంచి నల్లమల సాగర్కు 2024 జూన్లో నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు. రెండో సొరంగం లైనింగ్ పూర్తి చేయలేకపోయినా కనీసం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే, 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్కు శ్రీశైలం నుంచి నీటిని తరలించే అవకాశం ఉండేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి నిమ్మల వాస్తవాలను వక్రీకరిస్తుండడంపై వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం అశ్రద్ధ..! ఆగ్రహం వ్యక్తంచేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్..
-
వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్–1, జనవరి 2024లో టన్నెల్–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశామని వివరించారు. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్సార్ కలలను సాకారం చేశామన్నారు. ఇంకా నిర్వాసితులకు పునరావాసం (ఆర్ అండ్ ఆర్) కల్పనను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సీజన్లోనే ఆర్ అండ్ ఆర్కు కావాల్సిన సుమారు రూ. 1,200 కోట్లు చెల్లిస్తే.. ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చునన్నారు. ఆర్ అండ్ ఆర్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. అంచనాలు పెంచడంపైనే యావ..గతంలోనూ, 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. అమాంతంగా పనుల (సివిల్ వర్క్స్) అంచనాలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ.. నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించలేదన్నారు. గండికోటకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి.. నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ సొరంగ మార్గం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వాసితులకు చెల్లింపులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ. 1,000 కోట్లు చెల్లించి, పునరావాసం కల్పించి.. పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని గుర్తుచేశారు. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ కింద రూ. 250 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని వివరించారు. బ్రహ్మంసాగర్కు కూడా రూ. 60 కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగుగంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగామని.. తద్వారా బ్రహ్మంసాగర్లో 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగామని గుర్తు చేశారు. ఎప్పుడో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ను కూడా చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదని.. దాని కోసం కూడా రూ. 140 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి, కృష్ణా డెల్టా రైతులకు ప్రయోజనం చేకూర్చామని వివరించారు.ఈ సీజన్లోనే నల్లమల సాగర్ను నింపండి..ప్రస్తుతం కరువు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కడలిపాలు అవుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ఆర్ అండ్ ఆర్ అంశంపై దృష్టి పెట్టాలని.. వెంటనే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని.. ఈ సీజన్లోనే వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ను కృష్ణా జలాలతో నింపి ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
వెలిగొండపై పడిన రామోజీ తాత కన్ను
-
Fact Check: వెలిగొండంత అక్కసు..
సాక్షి, అమరావతి: ఏ రోగానికైనా మందు ఉంటుందేమోగానీ ఈనాడు రామోజీని పీడిస్తున్న ‘కడుపుమంట’కు మాత్రం మందులేదు. నిత్యం ఆయన్ను దహించివేస్తున్న ఆ వ్యాధి రోజురోజుకూ ముదిరిపోతోంది. దాని నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశ కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఫలితంగా ఆయన రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో.. కొంతలో కొంతనైనా ఉపశమనంగా ఉంటుందని ఆయన రోజూ తన క్షుద్ర పత్రిక ఈనాడులో సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక అశుద్ధ కథనాన్ని వండివారుస్తూ ఉదయం తనివితీరా చూసుకుని తన బాధను చల్లార్చుకుంటున్నారు. తాజాగా.. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను పూర్తిచేసిన సీఎం వైఎస్ జగన్ బుధవారం వాటిని జాతికి అంకితం చేయడాన్ని రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. చాలా పనులు మిగిలే ఉన్నాయని.. ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారమే లేదంటూ ‘వెలికొండంత పెండింగ్’ శీర్షికన తన ఆక్రోశాన్ని, కడుపులో పేరుకుపోయిన విషాన్ని గురువారం ఎప్పటిలాగే కక్కేశారు. నిజానికి.. వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ వడివడిగా పూర్తిచేస్తుండటంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. దాంతో ఆ ప్రాంత రైతుల్లో సీఎం జగన్పై ఆదరణ మరింతగా పెరిగింది. ఇది చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా మారడంతో రామోజీరావుకు నిద్రపట్టడంలేదు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయనిలా నానా అవస్థలు పడుతున్నారు. వెలిగొండను పిండేసిన బాబు.. వాస్తవానికి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004, అక్టోబరు 27న వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తన హయాంలోనే రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. 37.587 కిమీల పొడవైన జంట సొరంగాల్లో 20.333 కి.మీ.ల పనులు.. ఆ ప్రాజెక్టులోనే అంతర్భాగమైన నల్లమలసాగర్ను పూర్తిచేశారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014–19మధ్య ఈ ప్రాజెక్టుకు రూ.1,385.81 కోట్లు వ్యయంచేసినా కేవలం 6.686 కి.మీ.ల మేర మాత్రమే జంట సొరంగాల పనులు చేశారు. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టడాన్ని ఇటీవల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బయటపెట్టింది. వెలిగొండకు ఖర్చుచేసిన నిధులను చంద్రబాబు మింగేయడంవల్లే ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి. యుద్ధప్రాతిపదికన సొరంగాలు పూర్తి ఇక సీఎం వైఎస్ జగన్ రూ.978.02 కోట్లు ఖర్చుచేసి.. అందులో ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుని వెలిగొండ జంట సొరంగాల్లో మిగిలిన 10.568 కి.మీ.ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రెండు మూడు నెలల్లోనే నల్లమలసాగర్కు కృష్ణాజలాలను తరలిస్తామని ఆయన చెప్పారు. వచ్చే జూలై, ఆగస్టులలో నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలించేలోగా రూ.1,200 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టంచేశారు. తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాగే, ప్రాజెక్టును మొత్తం ఒకేసారి పూర్తిచేసి ఆయకట్టు మొత్తానికి ఒకేసారి నీళ్లందించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడాలేవు. ఎక్కడైనా ప్రాజెక్టును దశలవారీగా పూర్తిచేస్తూ అయకట్టుకు నీళ్లందిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. వెలిగొండ ప్రాజెక్టులో కూడా మిగతా పనులను పూర్తిచేసి దశలవారీగా మొత్తం ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అసలు వెలిగొండ ఒక్కటే కాదు.. 2022 సెప్టెంబరు 6న నెల్లూరు, సంగం బ్యారేజ్లు.. 2023 సెప్టెంబరు 19న హంద్రీ–నీవాలో అంతర్భాగమైనమైన లక్కసాగరం ఎత్తిపోతల.. 2023 నవంబరు 30న గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్.. 2024 ఫిబ్రవరి 26న హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి, జాతికి అంకితం చేసినప్పుడు కూడా రాజగురువు ఇలాగే విషం చిమ్మారు. -
ఆంధ్రప్రదేశ్లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే ఆయన కుమారుడిగా ఒక్కొక్కటి దాదాపు 18 కి.మీ. పైగా ఉన్న రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది? వెలిగొండ మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వమే పూర్తి చేయగా రెండో సొరంగం పనులను కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. దశాబ్దాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ఆ టన్నెల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పించిన దేవుడికి సదా రుణపడి ఉంటా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంత ప్రజల కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 30 మండలాలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా జంట టన్నెళ్లతో శరవేగంగా పూర్తి చేసిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు–ఎగువ చెర్లోపల్లి వద్ద బుధవారం ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ హయాంలో చేపట్టిన 37.6 కి.మీ పొడవైన వెలిగొండ రెండు టన్నెళ్లలో చంద్రబాబు అధికారంలో ఉండగా 6.6 కి.మీ. పనులు మాత్రమే చేయగా మిగతావి 31 కి.మీ మేర పనులు వైఎస్సార్, సీఎం జగన్ పాలనలోనే జరగడం గమనార్హం. గిద్దలూరు నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ 13,500 ఎకరాలకు సాగునీటిని అందించే రెండు ఎత్తిపోతల పథకాలకు కూడా సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. మళ్లీ మనం రాగానే నీళ్లు నింపుతాం.. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఐదు, కడప జిల్లాలో రెండు మండలాలు కలిపి మొత్తం 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ వెలిగొండ రెండు సొరంగాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో వచ్చే ఖరీఫ్లో శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు నీళ్లు తీసుకొచ్చి నింపుతున్న దృశ్యం జూలై–ఆగస్టులో ఆవిష్కృతమవుతుందని సంతోషంగా చెబుతున్నా. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ను పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల క్యారీయింగ్ కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. అంటే శ్రీశైలంలో మట్టం 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈ రోజుతో వచ్చింది. జూలై–ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ, ఆర్అండ్ఆర్ కూడా పూర్తి చేస్తాం. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టమైన రెండు టన్నెళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రిజర్వాయర్ కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలినవి పెద్దగా ఏమీ లేవు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతాం. దుర్భిక్ష ప్రాంతానికి మేలు చేయని బాబు.. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని తెలిసినా బాబు హయాంలో టన్నెళ్లు పూర్తి చేయకుండా పనులు నత్తనడకన సాగాయి. ఇందులో ఒక్కొక్కటి 18.8 కి.మీ. పొడవుతో 37.6 కి.మీ పొడవైన 2 టన్నెళ్లున్నాయి. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులతో సింహభాగం పనులు చేయగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ 2 టన్నెళ్లను వడివడిగా పూర్తి చేసి వెలిగొండను సాకారం చేశాడని చెప్పేందుకు గర్విస్తున్నా. రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన గిద్దలూరు నియోజకవర్గానికి మేలు చేసే 2 ఎత్తిపోతల పథకాలకు వెలిగొండ టన్నెళ్ల పైలాన్ సమీపంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, వెలగలపాయ ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ నిర్వహించారు. రెండు ఎత్తిపోతల పథకాలకు రూ.53 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. దీని ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. టన్నెల్లో కలియదిరిగి... పైలాన్ను ఆవిష్కరించి నిర్మాణం పూర్తి చేసుకున్న వెలిగొండ టన్నెళ్ల వద్దకు మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం జగన్ జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి వెలిగొండ నిర్మాణంలో భాగస్వాములైన అధికారులతో ఫొటోలు దిగి పేరుపేరునా అభినందించారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జంట సొరంగాల పైలాన్ వద్దకు సీఎంను తోడ్కొని వెళ్లారు. జంట సొరంగాల పైలాన్ను ఆవిష్కరించిన సీఎం జగన్ వెలిగొండ వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి టన్నెళ్లను వీక్షించారు. అనంతరం రెండో టన్నెల్ లోపలకు వెళ్లి కలియదిరిగి పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు టన్నెళ్ల పనులు, సాంకేతిక అంశాలను తెలియచేశారు. అనంతరం వెలిగొండ సావనీర్ను సీఎం ఆవిష్కరించారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రిన్స్పల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా సీఈ ఆర్ మురళీనాథ్రెడ్డి తదితరులు ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమను జ్ఞాపికగా సీఎం జగన్కు అందించగా పాదరక్షలను విడిచిపెట్టి భక్తి భావంతో స్వీకరించారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మంత్రి ఆదిమూలపు సురేష్, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. సీఎం వెంట హెలికాప్టర్లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
వెలిగొండ ప్రాజెక్టుతో 4లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు
-
నాన్నగారు మొదలుపెట్టారు కొడుకుగా నేను పూర్తి చేశాను...
-
నాడు తండ్రి శంకుస్థాపన.. నేను కొడుకు ప్రారంభోత్సవం
-
వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ దృశ్యాలు
-
యుద్ధప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి
-
వెలిగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ పనులను రూట్ మ్యాప్ ను పరిశీలిస్తున్న సీఎం జగన్
-
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్
-
Veligonda: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్
-
నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్
Live Updates.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నెరవేరిన 20 ఏళ్ల కల నాడు తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన.. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం వెలిగొండ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ చేరుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ♦ కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్ టెన్నెన్ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. ♦ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. ♦ మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ను, రెండో టన్నెల్ను పరిశీలిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
వెలిగొండ.. కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతులకిచ్చిన మరో మాటను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్.. రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ జంట సొరంగాలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రభావిత 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 15.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి ద్వారా సీఎం జగన్ శాశ్వత పరిషారం చూపారు. చంద్రబాబు దోపిడీని కడిగేసిన కాగ్.. ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ కోసం మాత్రమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014–2019 వరకూ రూ.1,385.81 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీవో–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లను దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడంవల్ల టీబీఎంలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ఇక 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలుచేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతాల రూపురేఖల్లో సమూల మార్పు.. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన దొనకొండ వద్ద 24,358 ఎకరాల్లో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి వెలిగొండ ప్రాజెక్టులో 2.58 టీఎంసీలను ప్రభుత్వం కేటాయించింది. పామూరు, పెద్దచెర్లోపల్లి మండలాల్లో, ఉప్పలపాడు పరిసర ప్రాంతాల్లో 14 వేల ఎకరాల్లో నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్) ఏర్పాటుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు వెలిగొండ ప్రాజెక్టులో 1.27 టీఎంసీలు కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో మెగా ఇండస్ట్రియల్ హబ్, నిమ్జ్లలో భారీఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మరోవైపు.. సాగునీటి సరఫరా చేయడంవల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో ఈ జిల్లాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, అంకితభావంవల్లే పూర్తి చేయగలిగాం. టీబీఎంలు పనిచేయకపోవడంతో సంప్రదాయ పద్ధతి (బ్లాస్టింగ్ చేయడం, మనుషుల ద్వారా తవ్వడం)లో పనులు చేపట్టాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ పద్ధతిలో పనులు చేపట్టడంవల్లే రెండు సొరంగాలను పూర్తి చేయగలిగాం. – శశిభూషణ్కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ఇదో మహోజ్వల ఘట్టం వెలిగొండ ప్రాజెక్టును మహానేత వైఎస్సార్ చేపడితే.. ఆయన తనయుడు సీఎం జగన్ పూర్తిచేసి బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. తండ్రి చేపట్టిన ప్రాజెక్టును తనయుడు పూర్తిచేసి జాతికి అంకితం ఇవ్వడం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్వల ఘట్టం. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు.– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, ఏపీ జలవనరుల శాఖ మహానేత వైఎస్సార్ ముందుచూపునకు తార్కాణం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో... రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ.ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు నీటిని తరలించి ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993–94లో డీపీఆర్ రూపొందించారు. కానీ, 2004 వరకూ పట్టించుకోలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిç³డియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న శ్రీకారం చుట్టారు. రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కి.మీల పొడవున ఫీడర్ చానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. నల్లమలసాగర్ రిజర్వాయర్సమగ్ర స్వరూపం ♦ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు ♦ వినియోగించే జలాలు 43.50 టీఎంసీలు ♦ గరిష్ఠ నీటి మట్టం 244 మీటర్లు (సముద్ర మట్టానికి) ♦ కనీస నీటి మట్టం214.3 మీటర్లు ♦ డెడ్ స్టోరేజ్ 10.35 టీఎంసీలు ♦ పంటలకు అవసరమైన జలాలు 38.57 టీఎంసీలు ♦ తాగునీటికి కేటాయించినవి 1.57 టీఎంసీలు ♦ ఆవిరి నష్టాలు3.36 టీఎంసీలు వెలిగొండ ప్రాజెక్టు పనులకు వ్యయం ఇలా.. ♦ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.10,010.54 కోట్లు ♦ పరిపాలన అనుమతి: రూ.8,043.85 కోట్లు ♦ 2004–14 (మహానేత వైఎస్ హయాంలో) వ్యయం: రూ.3,610.38 కోట్లు పనులకు రూ.2,890.17 కోట్లు భూసేకరణకు రూ.262.64 కోట్లు పునరావాసం కల్పనకు రూ.20.53 కోట్లు అటవీ అనుమతులకు రూ.437.04 కోట్లు ♦ 2014–19 మధ్య వ్యయం (చంద్రబాబు హయాంలో) : రూ.1,385.81 కోట్లు పనులకు రూ.1,208.35 కోట్లు, భూసేకరణకు రూ.114.89 కోట్లు పునరావాసం కల్పనకు రూ.62.57 కోట్లు ♦ 2019 మే 30 నుంచి ఇప్పటివరకూ (సీఎం జగన్ హయాంలో) వ్యయం: రూ.978.02 కోట్లు పనులకు రూ.822.08 కోట్లు భూసేకరణకు రూ.79.21 కోట్లు పునరావాసం కల్పనకురూ.76.73 కోట్లు ♦ మొత్తం వ్యయం: రూ.5,974.21 కోట్లు ♦ ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు: రూ.4,036.33 కోట్లు -
వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ కొండంత అవినీతి
-
వెలిగొండను తొలిచిన తొండ!
సాక్షి, అమరావతి: ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్ కొండంత అవినీతికి పాల్పడిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కడిగి పారేసింది. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం, ధరల వ్యత్యాసం (జీవో 22తో అదనంగా రూ.630.57 కోట్ల చెల్లింపు) రూపంలో కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఎండగట్టింది. నాడు అవినీతి.. నేడు ఆదా వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తున్నారనే సాకుతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కట్టబెట్టడం ద్వారా రూ.117.97 కోట్ల మేర లబ్ధి చేకూర్చారని తూర్పారబట్టింది. ఇక రెండో సొరంగంలో రూ.421.29 కోట్ల విలువైన 8.097 కి.మీ. పనులను ఈపీసీ విధానంలో చేస్తున్న పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి ఎల్ఎస్ ఓపెన్ పద్ధతిలో రూ.470.78 కోట్లకు పెంచి కొత్త కాంట్రాక్టర్కు అప్పగించడం ద్వారా రూ.49.49 కోట్లను దోచిపెట్టారు. ఈ పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.61.67 కోట్లను మిగిల్చిందని కాగ్ పేర్కొంది. వెలిగొండలో 2017–18 నుంచి 2020–21 మధ్య జరిగిన పనులు, చెల్లింపులపై కాగ్ తనిఖీలు నిర్వహించి రూపొందించిన నివేదికను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30 రోజుల్లో 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. శ్రీశైలం నుంచి 160.64 క్యూసెక్కులు తరలించే సామర్థ్యంతో మొదటి సొరంగం, 322.68 క్యూమెక్కులు తరలించే సామర్థ్యంతో రెండో సొరంగం, వాటి నుంచి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమలసాగర్కు తరలించేలా ఫీడర్ ఛానల్, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ ఏర్పాటు పనులను ఆరు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు. ♦ 2014 నాటికే నల్లమలసాగర్, ఫీడర్ ఛానల్, సొరంగాలు సహా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ తక్షణమే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందిస్తామంటూ ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచుకుంది. ♦ మొదటి, రెండో సొరంగాల్లో రూ.29.35 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తొలగించి వాటి వ్యయాన్ని రూ.95.44 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్టర్కు 2017 ఆగస్టులో టీడీపీ సర్కార్ అప్పగించింది. దీని ద్వారా కాంట్రాక్టర్కు రూ.66.09 కోట్లను అప్పనంగా దోచిపెట్టింది. ♦ మొదటి, రెండో సొరంగంలో ఈపీసీ విధానంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారనే నెపంతో వారిపై వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు లబ్ధి, ఖజానాపై భారం పడిందే కానీ పనుల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. -
చరిత్ర సృష్టించిన సీఎం జగన్ సర్కార్
-
ఇలా ‘వెలిగొండ’గా మరో కల సాకారం
నాడొక కల.. నేడొక నిజం.. అదే వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టులో మొదటి టన్నెల్ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన ఆయన.. రెండో టన్నెల్ తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం ద్వారా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, అమరావతి వరదాయినికి మహానేత వైఎస్ శ్రీకారం.. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో దివంగత సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా.. 23 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులనూ చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. వెలిగొండ.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. నల్లమల పర్వతశ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ 378.5 మీటర్లు, 356 మీటర్లు, 587 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. అతితక్కువ వ్యయంతో ఇన్ని టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ను నిర్మించడాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలి‘కొండంత’ చిత్తశుద్ధి.. ఇక వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 56 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావంవల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తిచేయించారు. రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో.. 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి 7.698 కి.మీల పొడవున రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. సీఎం రమేష్కు కట్టబెట్టిన రెండో సొరంగం మిగిలిన పనులను రద్దుచేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ఇక తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ఇలా ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.1,046.46 కోట్లను సీఎం జగన్ ఖర్చుచేశారు. ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. బాబు దోపిడీ కొండంత.. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయంచేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. అలాగే, 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వచ్చే సీజన్లో నీరు విడుదల ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాణ సంస్థ మేనేజర్ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖ ఈఈ పురార్ధనరెడ్డి వెలిగొండ టన్నెల్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. మాది చెప్పింది చేసే ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు హామీలు చెప్పటం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసే ప్రభుత్వం మాది. మాటిస్తే మడమ తిప్పని నైజం మా సీఎం జగనన్నది. గతంలో సంక్రాంతి, దసరా, ఉగాదికి పూర్తిచేస్తాం అని టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. అలాకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి నిధుల మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలతో ఈ ప్రాంత వాసుల కోసం పాటుపడి ఈరోజు ప్రాజెక్టు పూర్తి కావటానికి దోహదపడిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటారు. త్వరలోనే సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి రికార్డు సమయంలో పూర్తి.. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడంలో సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి వెలిగొండ ప్రాజెక్టు నిదర్శనం. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13 నాటికి.. రెండో సొరంగాన్ని రికార్డు సమయంలో మంగళవారం నాటికి పూర్తిచేశాం. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తిచేయడానికి సీఎం జగన్ దిశానిర్దేశం ఎంతో దోహదం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి, ఆయకట్టుకు నీళ్లందిస్తాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలిగొండను ఆయన తనయుడు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తుండటం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. – మురళీనాథ్రెడ్డి, చీఫ్ ఇంజనీర్, వెలిగొండ ప్రాజెక్టు -
తుది దశకు 'వెలిగొండ'
-
వాయువేగంగా వెలిగొండ
-
వాయువేగంతో వెలిగొండ
సాక్షి, అమరావతి: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఫలాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి మరో తార్కాణమిది. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సొరంగం పనులను శరవేగంగా కొలిక్కి తెస్తోంది. ఇప్పటికే 17.924 కి.మీ. పొడవున సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా మిగతా 876 మీటర్ల పనులను అక్టోబర్లోగా పూర్తి చేసేలా ముమ్మరం చేసినట్లు సీఈ మురళీనాథ్రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఈ ఏడాదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్కు తరలించి తొలి దశ పూర్తి చేసే దిశగా పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టి పడియ కాలువ ద్వారా 9,500, గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయర్ ద్వారా 3,500, రాళ్లవాగు ద్వారా 1,500) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004 అక్టోబర్ 27న వెలిగొండకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులను పూర్తి చేశారు. సొరంగాలను నల్లమల సాగర్తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక 1996 లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే అదికూడా శంకుస్థాపన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. 2014లో మళ్లీ అధికారంలో ఉండగా వెలిగొండను చంద్రబాబు కామధేనువులా మార్చుకున్నారు. రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి లేకపోవడం గత సర్కారు లూటీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ని వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు రాబట్టుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిచ్చిన చంద్రబాబు చివరకు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి అంచనా వ్యయాన్ని పెంచేశారు. అనంతరం వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019 నవంబర్లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేశారు. ► గత సర్కారు అంచనా వ్యయం పెంచిన రెండో సొరంగంలో మిగిలిన పనులను రద్దు చేసిన సీఎం జగన్ వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. నాడు టీడీపీ సర్కార్ నిర్దేశించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువ వ్యయంతో పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ. సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ► వైఎస్సార్ హయాంలోనే నల్లమల పర్వత శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో విస్తరించిన వెలిగొండ కొండల మధ్య సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కాంక్రీట్ ఆనకట్టలు నిర్మించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్ను పూర్తి చేశారు. ► శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్కు తరలించేందుకు వీలుగా 23 కి.మీ. పొడవున ఫీడర్ ఛానల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ► వెలిగొండ పనులకు ఇప్పటిదాకా రూ.953.12 కోట్లను వ్యయం చేసి ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ► రెండో సొరంగంలో కాలం చెల్లిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) స్థానంలో గతేడాది మనుషుల ద్వారా పనులను చేపట్టారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద మనుషుల ద్వారా సొరంగాన్ని తవ్విస్తున్నారు. ఇప్పటికే 6.822 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేసింది. మిగిలిపోయిన మరో 876 మీటర్ల పనులు అక్టోబర్లోగా పూర్తవుతాయి. -
సెప్టెంబర్ నెలాఖరుకు వెలిగొండ పూర్తి
పెద్దదోర్నాల /శ్రీశైలం టెంపుల్: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నెలాఖరుకి నిర్మాణం పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి కొల్లంవాగు వద్ద, మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు పుష్కలంగా జలాలు వస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగు నీరు అందుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్–1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్–2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. సుంకేశుల నుంచి తీగలేరు కెనాల్కు నీరు తరలించడం ద్వారా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరో కిలోమీటరు మేర పనులు జరగాల్సి ఉందన్నారు. ఈ పనులన్నీ మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించిన తర్వాతే నల్లమల సాగర్లో దశల వారీగా నీటిని నింపుతామని చెప్పారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన పూర్తి చేస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత త్వరలో నల్లమల సాగర్ను నింపి ప్రజలకు నీరందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోప్రయాణించిన మంత్రులు మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్ వెలిగొండ సొరంగంలో సాహస యాత్ర చేశారు. కొల్లంవాగు నుంచి మండల పరిధిలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులు జరుగుతున్న కొత్తూరు వరకు దాదాపు 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోనే ప్రయాణించారు. మంగళవారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రులు రోప్వే ద్వారా పాతాళగంగకు చేరుకున్నారు. అనంతరం బోట్లో కృష్ణా నదిలో ప్రయాణించి కొల్లంవాగుకు చేరుకున్నారు. అక్కడ హెడ్ రెగ్యులేటర్, ఇతర పనులను పరిశీలించారు. అక్కడి నుంచి బొలెరో వాహనాల్లో మొదటి సొరంగం గుండా 13 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం 6 కిలోమీటర్లు రెండో సొరంగం గుండా ప్రయాణించి కొత్తూరు చేరుకున్నారు. గాలి కూడా ఉండని ఇరుకు సొరంగ మార్గాల గుండా మంత్రులు ప్రయాణించటం సాహసమేనని పలువురు అధికారులు పేర్కొన్నారు. మంత్రుల వెంట మంత్రి సురేష్ తనయుడు విశాల్, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్రెడ్డి ఉన్నారు. -
వేగంగా ప్రాజెక్టులు
-
ప్రతి 15 రోజులకొకసారి సీఎం జగన్ ఆర్డర్స్
-
సాకారమవుతున్న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల దశాబ్దాల కల
-
వడివడిగా ‘వెలిగొండ’.. సాకారమవుతున్న ఆ మూడు జిల్లాల దశాబ్దాల కల
ఆలమూరు రామగోపాలరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు నీటిని తరలించడానికి వీలుగా 18.8 కి.మీల పొడవున మొదటి సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులను 2021 నాటికే ప్రభుత్వం పూర్తిచేసింది. కన్వేయర్ బెల్ట్ తెగిపోతుండటం, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లో సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో.. ఓ వైపు టీబీఎంతో సొరంగం తవ్వుతూనే మరోవైపు మనుషులతో తవ్వకం పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది దిశానిర్దేశం చేశారు. దీంతో 2022–23లో 5.52 కి.మీల పొడవున సొరంగం తవ్వి.. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు సృష్టించారు. మరోవైపు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నల్లమలసాగర్ పూర్తయింది. దీని నుంచి తీగలేరు కెనాల్ను అనుసంధానిస్తూ 550 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవల ప్రభుత్వం పూర్తిచేసింది. అలాగే, తీగలేరు కెనాల్కు నల్లమలసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుగా హెడ్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేసింది. తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్తో అనుసంధానం చేస్తూ 150 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవలే పూర్తిచేసిన ప్రభుత్వం.. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకూ శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన తొలిదశ పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది నల్లమలసాగర్కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు. వెలి‘గొండంత’ చిత్తశుద్ధి.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,37,300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. అక్కడి 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టును ఆ మూడు జిల్లాల ప్రజల వరదాయినిగా అభివర్ణిస్తారు. – నిజానికి.. 1996లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. – పైగా.. 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సభ కోసమే. – 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. – శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు రోజుకు 3,001 క్యూసెక్కులు తరలించేందుకు ఒక సొరంగం తవ్వేలా 1994లో డీపీఆర్ను మహానేత వైఎస్ సమూలంగా మార్చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజులు తగ్గిన నేపథ్యంలో.. రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా రెండు సొరంగాలు తవ్వేందుకు డీపీఆర్ను తయారుచేయించారు. – ఇలా శ్రీశైలానికి వరద వచ్చే 43 రోజుల్లోనే వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్ను నింపాలన్నది మహానేత వైఎస్ ఆలోచన. – ఇక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కిమీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేందుకు ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. అలాగే, తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. చంద్రబాబు వెలి‘గొండంత’ దోపిడీ విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును దోపిడికి అడ్డాగా మార్చుకున్నారు. అప్పటి నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎంల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు దండుకున్నారు. మళ్లీ 2018, 2019 నాటికి పూర్తిచేస్తామన్న చంద్రబాబు.. కమీషన్లు వసూలుచేసుకుని, ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. సీఎం జగన్ హయాంలో వడివడిగా.. మహానేత వైఎస్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ ఆది నుంచి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తిచేయించారు. – రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. కానీ, సీఎం జగన్ వీటిని రద్దుచేసి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థకు పనులు అప్పగించారు. – రెండో సొరంగంలో టీబీఎంకు కాలంచెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దీంతో.. మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ చెప్పడంతో అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్విస్తున్నారు. – ఇక 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున సొరంగం తవ్వారు. ఇది వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో రికార్డని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఏఈ అనుదీప్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం రోజుకు 12 మీటర్ల మేర పనులు చేస్తున్నామని.. ఆగస్టు నాటికి రెండో సొరంగంలో మిగిలిన 1.889 కిమీల పనులను పూర్తిచేస్తామన్నారు. – మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్కు తరలించేందుకు 23 కిమీల పొడవున తవ్విన ఫీడర్ ఛానల్ను పటిష్టం చేసే పనులను చేపట్టామని.. ఆగస్టు నాటికి వాటిని పూర్తిచేస్తామని ఆ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ ఆవుల లక్ష్మి చెప్పారు. – అలాగే, నల్లమలసాగర్ నుంచి తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువకు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని ఈఈ రమణ తెలిపారు. పునరావాసం పనులు వేగవంతం నల్లమలసాగర్లో 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. వీటిల్లోని 7,318 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికే 96 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా 7,222 నిర్వాసిత కుటుంబాలకు రూ.868.27 కోట్లతో పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు కోసం 24,158.56 ఎకరాల భూమి అవసరం. ఇందులో ఇప్పటికే 20,760.47 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.679.79 కోట్లను వ్యయంచేసి.. పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజినీరింగ్ అద్భుతం.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ప్రకాశం జిల్లాలో పశ్చిమాన నల్లమల పర్వతశ్రేణుల్లో కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ కాంక్రీట్ డ్యామ్లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న రెండు సొరంగాలు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు. ఈ ఏడాదే తొలిదశ పూర్తి ఈ ప్రాజెక్టు తొలిదశను ఈ ఏడాదే పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే తొలి సొరంగం పూర్తయింది. ఫీడర్ ఛానల్ సిద్ధంగా ఉంది. నల్లమలసాగర్ పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది పది టీఎంసీలను నల్లమలసాగర్లో నిల్వచేస్తాం. ఆ తర్వాత 30 టీఎంసీలు.. చివరగా 53.85 టీఎంసీలను నిల్వచేస్తాం. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ మహానేత ముందుచూపునకు నిదర్శనం శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం నుంచే సొరంగాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు నీటిని తరలించవచ్చు. 879 అడుగుల స్థాయిలో శ్రీశైలంలో నీరునిల్వ ఉంటే.. పూర్తి సామర్థ్యం మేరకు రోజుకు 11,583 క్యూసెక్కులను నల్లమలసాగర్కు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే 40–43 రోజుల్లోనే నల్లమలసాగర్ను నింపేలా ప్రాజెక్టు డిజైన్ను మార్చడం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపునకు తార్కాణం. – మురళీనాథ్రెడ్డి, సీఈ, ప్రకాశం జిల్లా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధివల్లే.. ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధివల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతోంది. టీబీఎంలకు కాలం చెల్లడం, కన్వేయర్ బెల్ట్లు పనిచేయకపోవడంవల్ల సొరంగాల తవ్వకం 2014 నుంచి ముందుకు కదల్లేదు. మనుషుల ద్వారా సొరంగాలను తవ్వాలని సీఎం జగన్ నిర్ణయంవల్లే ఇప్పుడు ఆ పనులు పూర్తవుతున్నాయి. 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున తవ్వాం. ప్రాజెక్టు చరిత్రలో ఇదో రికార్డు. – అబూ తలీమ్, ఎస్ఈ -
కరువు నేలలో జలధారలు
నీటి జాడలు లేక భూములు బీడు బారాయి. గుక్కెడు నీరు దొరక్క గ్రామాలకు గ్రామాలే వలసపోయాయి. దశాబ్దాలుగా కరువు కోరల్లో విలవిల్లాడిన నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. నెర్రెలు బారిన భూములు సస్యశ్యామలం కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో జలసిరులు నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రయత్నాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందు కోసం రూ.84.25 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రత్యేక జీఓ విడుదల జేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరువు నేలపై జల పరవళ్లు చూడాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంతో శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్లు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాకు ప్రధాన జలవనరుగా మారనున్న వెలిగొండ ప్రాజెక్ట్కు నిధుల వరద పారించారు. వెలిగొండతో పాటు రామతీర్థం, గుండ్లకమ్మ, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.. ఇలా కరువు సీమలో కృష్ణమ్మను పరుగులు తీయించారు. ఇప్పడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు చివరి భూములుగా ఉన్న తీగలేరు కాలువ టీ–5 పరిధిని పెంచి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. పుల్లలచెరువు మండలంలోని 9 గ్రామాలను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ నంబర్ 1824ను 2022 ఆగస్టు 17న విడుదల చేసింది. జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ. 84.25 కోట్లు మంజూరు చేసింది. తీగలేరు కాలువ అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. తీగలేరును అభివృద్ధి చేయడం ద్వారా పుల్లలచెరువు మండలంలో తాగు, సాగు నీరు అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. చిన కండలేరు ప్రాజెక్టుకు అనుసంధానం: తీగలేరు బ్రాంచ్ కాలువను అభివృద్ధి చేయటం ద్వారా ఆ కాలువ ద్వారా ప్రవహింపజేసే నీటితో పుల్లలచెరువు మండలంలోని చినకండలేరు జలాశయాన్ని అనుసంధానం చేయనున్నారు. దశాబ్దాల తరబడి తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న పుల్లలచెరువు మండల ప్రజల కష్టాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుక్కెడు నీటి కోసం వలసలు వెళ్లే గ్రామాల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించాలని సీఎంను కోరారు. దశాబ్దాలుగా కరువుతో బీడు భూములుగా మారుతున్న గ్రామాల రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి, సాగు నీటి అవసరాలు తీరాలంటే ఒక్క వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిధిని పెంచితేనే సాధ్యమని సీఎంకు వివరించారు. దీంతో ప్రత్యేక జీఓ ద్వారా నిధులు విడుదల చేశారు. 11,500 ఎకరాలు సస్యశ్యామలం: పుల్లలచెరువు మండలానికి కృష్ణా జలాలను తీసుకురావడంతో 9 గ్రామాల్లోని దాదాపు 11,500 ఎకరాలకు పైగా బీడువారిన భూములు వివిధ రకాల పంటలతో కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు వెలిగొండ ప్రాజెక్టు టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడంతో మండల ప్రజల ఆశలు చిగురించాయి. కరువు నేలలో బీడు భూములను పంట పొలాలుగా మార్చటంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు మా ప్రాంతంలో తాగు, సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. టి–5 కాలువ పనులు పూర్తిచేసి చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే మా ప్రాంతాల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. ఏళ్ల తరబడి నీరులేక ఇబ్బందులు పడుతున్నాం. సాగునీరు లేక, పంటలు పండక కరువుతో అల్లాడుతున్నాం. ప్రభుత్వం తీగలేరు కాలువ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయటంతో ఇక్కడి ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. – శివారెడ్డి, రైతు, మల్లాపాలెం కోనసీమను తలపిస్తాయి.. తీగలేరు కాలువ పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక ప్రజల కష్టాలను గుర్తించి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురే‹Ùకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టి–5 కాలువ ద్వారా చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే ఈ ప్రాంత పొలాలు కోనసీమను తలపిస్తాయి. నీరు వృథా కాకుండా పంటలను సాగు చేసుకుంటాం. – నాసరయ్య, రైతు, పుల్లలచెరువు -
2023 సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తాం
-
CM YS Jagan: ఏడాదిలో వెలిగొండ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల ప్రజల ఈ చిరకాల కోరికను తీర్చాకే 2024లో ఎన్నికలకు వెళతామని అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఆమె తనయుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (బీఎస్సార్)ల కాంస్య విగ్రహాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం బూచేపల్లి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 18.80 కిలోమీటర్ల మొదటి టన్నెల్, 18.78 కిలోమీటర్ల రెండో టన్నెల్ పనులను 2014కు ముందు నాన్నగారు ఉరుకులు, పరుగులు పెట్టించారని తెలిపారు. 2014 వరకు మొదటి టన్నెల్ను ఏకంగా 11.58 కి.మీ పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాలనలో మొదటి టన్నెల్ను కేవలం 4.33 కి.మీ. మాత్రమే తవ్వాగా, మనం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 2.89 కిలో మీటర్లు తవ్వి పూర్తి చేశామని చెప్పారు. రెండో టన్నెల్ పనులు 2014 వరకు 8.74 కిలో మీటర్లు తవ్వితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 2.35 కిలో మీటర్లు మాత్రమే తవ్వి, చేతులు దులుపుకున్నారన్నారు. మన ప్రభుత్వం వచ్చాక రెండో టన్నెల్ను ఇప్పటికే 3.71 కిలో మీటర్లు పూర్తి చేశామని, ఇక మిగిలిన 3.96 కి.మీలు కూడా 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపు రేఖలన్నీ సమూలంగా మారిపోతాయని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ మంచి చేసే మనుషులు చిరస్థాయిగా ఉంటారు ► మంచి చేసే మనుషులు చనిపోయినా, చిరస్థాయిగా మనస్సుల్లో నిలిచి ఉంటారు. మంచి చేసిన వారికి చావు ఉండదు. ఒకవైపు నాన్నగారు.. మరో వైపు సుబ్బారెడ్డి అన్న.. ఇలాంటి నాయకులను ఎవరూ మరిచిపోలేరు. – గాంధీ, అంబేడ్కర్, మహాత్మా పూలే, జగ్జీవన్ రామ్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, మహానేత వైఎస్సార్.. ఇలాంటి వారందరినీ కలకాలం తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ, వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు ఎప్పటికీ మరణం ఉండదు. వీళ్లంతా తెలుగు నేల మీద గుర్తుండిపోయే శిఖరాలు. ► నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగారు. నాన్నగారి విగ్రహంతోపాటు, ఆయనతో కలిసి అడుగులు వేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (శివప్రసాదరెడ్డి నాన్న) గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ► రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నాం. ఆ అడుగులు మరచిపోలేం ► రైతులకు ఉచిత విద్యుత్ అన్నప్పుడు.. కుయ్.. కుయ్ అని అంబులెన్స్ శబ్ధం విన్నప్పుడు, ఆరోగ్యశ్రీ అన్నప్పుడు మనకు ఆ దివంగత మహానేతే గుర్తుకు వస్తారు. ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినప్పుడు.. కొందరు తీగలు చూపి, బట్టలు ఆరేసుకునేందుకే అవి పనికొస్తాయని ఎద్దేవా చేశారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అట్టడుగున ఉన్న పేద వారు నిజంగా జీవితంలో పైకి రావాలంటే ముఖ్యమైనది చదువు మాత్రమే. పేదల పిల్లలు చదువుకోవాలని ఆ మహానేత తపించారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. లక్షల కొద్దీ ఇళ్ల నిర్మాణం, జల యజ్ఞం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి వేసిన అడుగులు ఇప్పటికీ మరిచిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ► అలా మంచి చేసిన రాజశేఖరరెడ్డి కొడుకుగా, మీ బిడ్డగా జగన్ నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మాట ఇస్తున్నా. మీ చల్లని దీవెనలతో ఎన్నికలప్పుడు చెప్పిన హామీలలో 95 శాతం పూర్తి చేశాం. మీ చిరునవ్వులు, మీ ఆప్యాయతలు పంచి పెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితునికి, మిత్రునికి, అవ్వకు, తాతకు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు. గ్రానైట్ పరిశ్రమకు భరోసా ► స్టోన్ కటింగ్ మిషన్లకు సంబంధించి చిన్న చిన్న యాజమాన్యాల కింద పది మందికి పైగా పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆరోజు నేను ఏదైతే చెప్పానో.. ఆ విధంగా మళ్లీ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడకు వచ్చే ముందే జీవో నంబరు 58 విడుదల చేశాం. ► నాన్న గారి హయాంలో తీసుకొచ్చిన ఈ స్లాబ్ పద్ధతిని 2016లో చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయి. అందుకే దాదాపు ఏడు వేల యూనిట్లకు లబ్ధి చేకూరేలా జీవో 58 తీసుకొచ్చాం. ► ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్ ఎక్కువగా ఉంటుంది. 22 క్యూబిక్æ మీటర్ల ముడి గ్రానైట్ ప్రాసెస్ యూనిట్లకు సింగిల్ బ్లేడ్కు రూ.27 వేలు, మల్టీ బ్లేడ్కు రూ.54 వేలు నెలకు ఇచ్చేలా సీనరేజ్ స్లాబు నిర్ణయించాం. శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బేŠల్డ్కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్కు రూ.44 వేల సీనరేజ్ స్లాబ్ నిర్ణయించాం. ► ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి రూ.135 కోట్లు నష్టం వాటిల్లితుందని తెలిసినా, మీ బాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ప్రకటించిన కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు స్పీడ్ అందుకుంటాయి. వాటికి అనుబంధంగా రవాణా, మార్కెట్ రంగాల్లో అవకాశాలు మెరుగుపడి కార్మికులకు మేలు జరుగుతుంది. విద్యుత్ యూనిట్కు రూ.2 రాయితీ ► గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నాను. దీంతో చిన్న చిన్న పరిశ్రమలు సైతం పుంజుకుంటాయి. చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం యూనిట్కు హెచ్టీకి రూ.6.30, ఎల్టీకీ యూనిట్ రూ.6.70 చొప్పున వసూలు చేసేది. ఆ చార్జీల్లో ఇక మీదట నుంచి ప్రతి యూనిట్కు రూ.2 రాయితీ ప్రకటిస్తున్నా. అటు స్లాబ్ సిస్టం అమలు చేయటం, ఇటు విద్యుత్ యూనిట్లలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అయినా పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని భావించాను. ► విద్యుత్ రాయితీ వల్ల ఏకంగా ప్రభుత్వానికి రూ.210 కోట్లు భారం పడుతుంది. మరో వైపు సీనరేజ్ మార్పు వల్ల రూ.135 కోట్ల భారం పడుతుంది. వెరసి రెండింటి మీద దాదాపు రూ.350 కోట్లు భారం పడుతుంది. ఈ రోజు నుంచి ఈ రెండూ అమలులోకి వస్తాయి. జెడ్పీ భవనం కోసం రూ.20 కోట్లు ► ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరిందని.. రూ.20 కోట్లు మంజూరు చేయాలని.. ఇక్కడకు వచ్చేటప్పుడు జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ అడిగారు. రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నాను. తాళ్లూరు మండలం శివరామ్పురంలోని మొగిలిగుండాల చెరువును మినీ రిజర్వాయర్గా మార్చే పనిని చేపట్టాం. ఆ అమ్మ కోరిక మేరకు ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మినీ రిజర్వాయర్గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చాం. ► మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర బాబు, కనిగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. ఒంగోలు సబర్బన్:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తి సభలో బుధవారం నవ్వుల.. పువ్వులు విరిశాయి. బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ.. డాక్టర్ వైఎస్సార్పై స్వయంగా రాసిన పాటను వినిపించారు. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. ‘ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. మళ్లెప్పుడొస్తావు రాజశేఖరన్నా.. ఏమైపోయావు రాజశేఖరన్నా.. మంచి మనసున్న రాజశేఖరన్నా.. చందమామ రూపున్న వాడా.. మా కుటుంబానికి ఆత్మీయ సోదరుడా’ అంటూ భావోద్వేగంతో పాట పాడారు. సీఎం వైఎస్ జగన్ ఆమె వద్దకు వచ్చి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని తను ఆశీనులైన కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన వారు కరతాళ ధ్వనులు చేస్తూ మనసారా నవ్వుకున్నారు. -
ఆ నాలుగూ అనుమతి ఉన్నవే
సాక్షి, అమరావతి: తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు ఉన్నాయని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)లో ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా వర్గీకరిస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కృష్ణా బోర్డుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది. అనుమతి ఉన్న ఆ నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనుంది. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ ఆరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న వీటిని పూర్తి చేసేందుకు విభజన చట్టం ద్వారా కేంద్రం అనుమతించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లోనే తప్పిదం.. ఏదైనా అనుమతించిన ప్రాజెక్టు డిజైన్లో మార్పు చేసినా, నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచినా మళ్లీ అనుమతి తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధన. విభజన తర్వాత వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల డిజైన్లను గానీ సామర్థ్యాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అంటే ఈ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు కల్వకుర్తి (25 నుంచి 40 టీఎంసీలకు), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల డిజైన్లను మార్చడంతోపాటు సామర్థ్యాన్ని కూడా తెలంగాణ సర్కార్ పెంచింది. అయితే కేంద్ర జల్ శక్తి శాఖ మాత్రం కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను గతేడాది జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించింది. వాటికి ఏడాదిలోగా అనుమతి పొందాలని, లేదంటే నీటి వినియోగానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిజైన్లు మార్చకున్నా, సామర్థ్యం పెంచకున్నా వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. కేంద్ర జల్శక్తి శాఖ విధించిన గడువు సమీపిస్తుండటంతో అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతోంది. వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలకు అనుమతి తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశాన్ని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నాలుగు ప్రాజెక్టులను అనుమతి ఉన్న వాటిగా విభజన చట్టం గుర్తించిందన్నారు. ఇప్పుడు వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని బోర్డుకు, జల్శక్తి శాఖకు స్పష్టం చేస్తామని తెలిపారు. -
నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!
చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. పాలేరూ అంతే.. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు. రుణమాఫీ పేరిట దగా 2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. హెరిటేజ్ కోసం ఒంగోలు డెయిరీ మూత... పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. వెలిగొండ పనులు నత్త నడక.... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్అండ్ఆర్ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపన జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు. మారిన గతి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ.. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జీజీహెచ్ అభివృద్ధికి రూ.170 కోట్లు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్తో పాటు జీజీహెచ్లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్ వేవ్ కోవిడ్ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ వేలాది ప్రాణాలను కాపాడింది. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్ కోసం రూ.50 లక్షలు రిలీజ్ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్ కింద రూ.340 కోట్లు కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్ డెవలప్మెంట్) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది. ► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు. ► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. ► రూ.54 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. -
వేగంగా వెలిగొండ పనులు
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనులను జవహర్రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల సాగర్లో తొలి దశలో 10.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 1.19 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. మంగళవారం కొత్తూరు వద్ద సొరంగ నిర్మాణాలను పరిశీలించి.. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష జరుపుతామని చెప్పారు. బోటులో కొల్లం వాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండో సొరంగంలో జరుగుతున్న మాన్యువల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి సొరంగం నుంచి 14వ కిలోమీటరు వద్ద రెండో సొరంగంలోకి తీసిన అప్రోచ్ టన్నెల్ను సైతం పరిశీలించారు. -
వెలిగొండపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదు
ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, కుందురు నాగార్జునరెడ్డి చెప్పారు. వైఎ స్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరగలేదని, వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడంపై మండిపడ్డారు. ఒంగోలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. చంద్రబాబు స్క్రిప్టుపై సంతకాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చేతగానివారని మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు. లేఖలు రాయడం కాదని, చేతనైతే చంద్రబాబు ఐదేళ్ల పాలన, తమ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ఒంగోలు చర్చిసెంటర్లో మీడియా సాక్షిగా బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ను 3.300 కిలోమీటర్లు మాత్రమే తవ్వారని, తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 3.500 కిలో మీటర్లు తవ్వి మొదటి టన్నెల్ను పూర్తిచేశామని చెప్పారు. బాబు పాలనలో వెలిగొండకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.700 కోట్లు కేటాయించిందని తెలిపారు. వెలిగొండ కోసం అంటూ దీక్షలు చేయడం కాదని, చేతనైతే ఎందుకు నిర్లక్ష్యం చేశారో చెప్పాలంటూ బాబును నిలదీయాలన్నారు. రామాయపట్నం పోర్టు, మైనింగ్ యూనివర్సిటీ, ఆసియా పేపర్మిల్లు, దొ నకొండ సెజ్లో విమాన విడిభాగాల పరిశ్రమలు ఎ క్కడ నిర్మించారో చూపించాలన్నారు. శనగలన్నీ కో ల్డు స్టోరేజీల్లో ఉండిపోతే క్వింటాలుకు రూ.4,750 చొప్పున తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. పొగాకు రైతుకు కిలోకి కనీసం రూ.110 ఇప్పించామని వారు పేర్కొన్నారు. -
అప్పటివరకు కేరింతలు.. అకస్మాతుగా విషాదచాయలు
గాలివీడు (వైఎస్సార్ కడప జిల్లా): విహార యాత్ర విషాదకరంగా ముగిసింది. బెంగళూరుకు చెందిన నలుగురు సరదాగా ఈత కొడుతూ నీటిలో మునిగి మృత్యువాత పడిన సంఘటన శనివారం మండల కేంద్రానికి సమీపంలోని వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు దిగువనున్న గండిమడుగులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన దాదాపు 20 మంది కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా వాయల్పాడులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపు సరదా కోసం వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం సమీపంలోని మడుగులో ఈత కోసం దిగారు. ఈత కొట్టాలని దిగిన తాజ్ మహమ్మద్(41), ఉస్మాఖానం (12), మహమ్మద్ హంజా(11), మహమ్మద్ ఫహాద్(10)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్, ఎస్ఐ చిన్నపెద్దయ్య, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలించి రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీశారు. -
తెలుగుగంగ, వెలిగొండ విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల విస్తరణ చేపట్టిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టులను చేపట్టారని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కుందూ నది నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసేలా కడప జిల్లా దువ్వూరు మండలం జొన్నవరంలో ఎత్తిపోతల పథకం చేపట్టారని, దానికి రూ.564.6 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారని లేఖలో వివరించారు. వాస్తవానికి చెన్నై నగరానికి తాగునీటి కోసం తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారని, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. అంతేగాకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ, గాలేరు– నగరి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకొని పెన్నా బేసిన్కు తరలిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 88వేల క్యూసెక్కులు తరలించేలా గ్రావిటీ కాల్వల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందని.. ఏటా పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీలు తరలిస్తూ చెన్నైకి 10 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకునే పేరిట వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారని, రిజర్వాయర్లో 875 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టులతో శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
వేగంగా వెలిగొండ రెండో టన్నెల్ పనులు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ (సొరంగం)లో మిగిలిన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ప్రభుత్వం, రెండో టన్నెల్ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. రెండో టన్నెల్ తవ్వకం పనులకు గాను అమెరికా సంస్థ రాబిన్స్ నుంచి డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను 2007లో దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ టీబీఎంలో, కన్వేయర్ బెల్ట్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు గత ప్రభుత్వం రాబిన్స్తో సంప్రదింపులు జరిపింది కానీ మరమ్మతులకు సంస్థను ఒప్పించలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాబిన్స్తో చర్చించడంతో పాటు సంస్థ ప్రతినిధులను రప్పించడం ద్వారా టీబీఎం, కన్వేయర్ బెల్ట్లకు మరమ్మతులు చేయించింది. టీబీఎంతోపాటు, కార్మికులతోనూ తవ్వించడం ద్వారా నెలకు వెయ్యి మీటర్ల చొప్పున పనులు చేయించి, ఏడు నెలల్లో మిగిలిన 7,383 మీటర్ల టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 830 అడుగులకు తగ్గిన వెంటనే ఈ టన్నెల్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభించి, జూన్లోగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. వైఎస్ హయాంలోనే సింహభాగం పనులు పూర్తి శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోగానే రోజుకు 11,582 క్యూసెక్కుల చొప్పున 43.5 టీఎంసీలు తరలించేలా రెండు టన్నెళ్లను తవ్వాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్నది వైఎస్సార్ సంకల్పం. పనులు వేగంగా కొనసాగించడంతో మహానేత హయాంలోనే టన్నెళ్లు, నల్లమలసాగర్, ప్రధాన కాలువల పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఇక మిగిలిన పనులను పూర్తిచేసే పేరుతో కాంట్రాక్టర్లతో కలసి గత ప్రభుత్వ పెద్దలు రూ.66.44 కోట్లు దోచుకున్నారు. టన్నెళ్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండను ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు అప్పగించిన రెండో టన్నెల్ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి, రివర్స్ టెండరింగ్తో రూ.61.76 కోట్లు ఖజానాకు ఆదా చేశారు. తద్వారా గత సర్కార్ అక్రమాలను బహిర్గతం చేశారు. మరోవైపు మొదటి టన్నెల్లో మిగిలిన 3.6 కి.మీల పనిని 13 నెలల రికార్డు సమయంలో పూర్తి చేశారు. లైనింగ్తో సహా మొదటి టన్నెల్ పూర్తయింది. మొదటి టన్నెల్కు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు హెడ్ రెగ్యులేటర్ను గతేడాదే పూర్తి చేశారు. ఇక రెండో టన్నెల్ ఏడు నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించడం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా నల్లమలసాగర్కు అక్టోబర్ నాటికి కృష్ణా వరద జలాలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్లో ఇప్పటి వరకు పనులు పూర్తయిన ప్రాంతం -
‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. 2019 నవంబర్ నుంచి జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. మార్చి 2020 నుంచి జూలై 2020 వరకూ లాక్డౌన్ కొనసాగింది. జూన్ నుంచి నవంబర్ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురవడంతో సొరంగం తవ్వకానికి ఆటంకం కలిగింది. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్ను 2016 నాటికే పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచిపెట్టిన టీడీపీ సర్కారు కమీషన్లు వసూలు చేసుకుంటే.. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు సమయంలో మొదటి సొరంగాన్ని పూర్తి చేయడం గమనార్హం. వేగం పుంజుకున్న రెండో సొరంగం పనులు ఇదే ప్రాజెక్ట్లో భాగమైన రెండో సొరంగం పనులను వేగవంతం చేశారు. నల్లమల సాగర్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నల్లమల సాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.1,411.56 కోట్లను జూన్ 24న మంజూరు చేశారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా నల్లమల సాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులను అభినందించిన మంత్రి అనిల్ సొరంగం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ మేఘాను మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ అభినందించారు. జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ జలంధర్లకు బుధవారం రాత్రి ఫోన్ చేసిన మంత్రి గడువులోగా పనులు పూర్తి చేశారని అభినందించారు. రెండో సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మాట నిలబెట్టుకున్న సీఎం ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు బుధవారం రాత్రి పూర్తయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు దీనిని ప్రాధాన్యత ప్రాజెక్ట్గా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి దశ పనులను పూర్తి చేసి వచ్చే సీజన్లో నల్లమల సాగర్కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తామని గత ఏడాది ఫిబ్రవరి 20న ప్రకటించారు. ఆ మేరకు పనులు పూర్తి చేయించి మాట నిలబెట్టుకున్నారు. -
వెలిగొండ పనుల వేగం పెంచండి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో 237 మీటర్ల మేర పని చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు) అడ్డురావడం వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. టన్నెల్ తవ్వకం పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, టన్నెల్ బోరింగ్ మెషీన్ తొలగించే పనులు ఫిబ్రవరికి పూర్తవుతాయని చెప్పారు. ఎట్టి పరిప్థితుల్లోనూ ఫిబ్రవరికి తొలి దశను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెండో టన్నెల్ ఆగస్టు నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఆలోగా ప్రాజెక్టు రెండో దశ ద్వారా నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని సూచించారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను దశలవారీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన కార్యాచరణ మేరకు పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
గత ప్రభుత్వం వెలిగొండపై కాలయాపన చేసింది
-
‘ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తాం’
సాక్షి, కర్నూలు: వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి శ్రీశైలం డ్యామ్ నుంచి బోట్లో వెళ్లి వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాంతంలోని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కలలను సాకారం చేసే దిశగా తలపెట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న రైతాంగానికి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుతుందని తెలిపారు. (ఏపిలోకి నైరుతి రుతుపవనాలు) గత ప్రభుత్వాలు 12 సంవత్సరాలు అవుతున్నా వెలుగొండ ప్రాజెక్టు పనులను అంతంత మాత్రంగానే పూర్తి చేశారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం నాలుగు కిలోమీటర్ల టన్నెల్ను మాత్రమే పూర్తి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం కేవలం16 నెలల్లో మూడు కిలోమీటర్లు టన్నెల్ను పూర్తి చేసిందని తెలిపారు. జూన్ 25 లోపు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సెప్టెంబర్ వరకు ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని తెలిపారు. ఏడున్నర కిలోమీటర్ల దూరమున్న రెండో టన్నెల్ పనులను 18 నెలల లోపు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తాం: మంత్రి అనిల్
-
మెట్టకు అండ వెలిగొండ
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతగా జరుగుతున్నాయి. దుర్భిక్షమైన మెట్టప్రాంతాలను ఆదుకునేందుకు దాదాపు 15 ఏళ్ల క్రితం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన అకాల మరణం తర్వాత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. మూడు దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైఎస్సార్ కలను నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్ట్ పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి ఈ పనులు పూర్తయితే, రెండో దశలో జిల్లాకు సంబంధించిన పనులు పుంజుకోనున్నాయి. ఉదయగిరి: డెల్టా ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లా పశ్చిమ దిశలోని ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లోని భూములకు సాగునీరు, తాగు నీరు అందించేందుకు 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయనమరణానంతరం అధికారం చేపట్టిన అప్పటి కాంగ్రెస్ పాలకులు, ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్ట్ను సత్వరమే పూర్తి చేసేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా ఇటీవల ప్రాజెక్ట్ను సందర్శించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జూన్కల్లా మొదటి దశ పనులు పూర్తి చేసి రెండో దశ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్సార్ సీఎంగా 2005 నుంచి 2009 వరకు ఈ ప్రాజెక్ట్ పనులను శరవేగంగా చేపట్టారు. ఆయన మరణంతో పనులు నత్తను తలపించాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్పై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అంతకు ముందు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి తమ బినామీ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టినా పనుల్లో పురోగతి లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మూడు జిల్లాల మెట్ట రైతులు దిగాలు పడ్డారు. మళ్లీ చిగురించిన ఆశలు కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగాన కొళ్లాం ప్రాంతంలోని హెడ్ రెగ్యులేటర్ నుంచి రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీరు నిల్వ చేసి అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4,47,300 ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి కొంత మేర ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఇందుకు అవసరమైన రూ.185 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. రెండో దశ పనులకు అవసరమైన రూ.1,600 కోట్లు కూడా యుద్ధప్రాతిపదికన అందజేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాలోని ఐదు మండలాల్లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో ఉదయగిరిలోని నాలుగు మండలాలకు 47 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. శరవేగంగా పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు ఈ ప్రాజెక్ట్లో అంతర్భాగంగా నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్లమల సాగర్ నుంచి 139 కి.మీ పొడవుతో తవ్విన కాలువ ద్వారా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీరు వస్తుంది. ఇక్కడ 2.02 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి 39.8 కి.మీ మేర ఉదయగిరి ఉప కాలువను తవ్వారు. తద్వారా గండిపాళెం రిజర్వాయర్కు కూడా నీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు మండలాలకు సాగు, తాగునీరందుతుంది. సీతారామపురం వద్ద నిర్మించ తలపెట్టిన సీతారామసాగర్లో పది టీఎంసీల నీరు ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుంది. మెట్టప్రాంతం సస్యశ్యామలం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గంలోని 75 శాతం మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. పెద్దిరెడ్డిపల్లి సీతారామసాగర్ రిజర్వాయర్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రాజెక్ట్ పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన బీడు భూములను చేర్చేందుకు అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాను. ఈ ఐదేళ్లలోనే సాగునీరు, తాగునీరు అందుతుంది. నెల క్రితం మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరును సందర్శించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు. – మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే -
వెలిగొండ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. మొదటి టన్నెల్లో రోజుకు సగటున 7.5–8మీటర్ల చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన ఇందులో మిగిలిన 940 మీటర్ల పని 117 రోజుల్లో పూర్తవుతుంది. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 836.20 అడుగులకు తగ్గిపోవడంతో వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులను సోమవారం ప్రారంభించనున్నారు. మూడున్నర నెలల్లో వీటిని పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. అంతేకాక.. - టన్నెల్ నుంచి ప్రధాన కాలువకు నీటిని తరలించే లింక్ కెనాల్ పనులను వేగవంతం చేశారు. - 53.85 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల పరిధిలోని 4,617 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. - జూలై నాటికి వీటిని పూర్తిచేసి ఆగస్టులో కృష్ణా వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. - రెండో టన్నెల్ పనులకు సంబంధించి టీడీపీ హయాంలో కాంట్రాక్టర్కు దోచిపెట్టిన రూ.61.76కోట్లను వైఎస్ జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు ఆదా చేసింది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి ఇక నల్లమలసాగర్ ముంపు గ్రామాల్లోని 4,617 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్వాసితులకు పరిహారం అందించి.. వారిని పునరావాస కాలనీలకు తరలించే పనులను జూలైలోగా పూర్తిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను ప్రభుత్వం ఆదేశించింది. సకాలంలో పనులను పూర్తిచేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరదను రోజుకు 11,581.68 క్యూసెక్కుల చొప్పున 45 రోజుల్లో 43.50 టీఎంసీలను తరలిస్తారు. తద్వారా దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. అలాగే, 15.25 లక్షల మంది దాహార్తిని తీరుస్తారు. సీఎం పర్యటనతో పనులు మరింత వేగం వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే.. - గడువులోగా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి.. జూలై నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలన్నారు. - నిజానికి మొదటి టన్నెల్లో ఫిబ్రవరి 20 వరకు రోజుకు 6.5–7 మీటర్ల చొప్పున పనులు జరిగేవి. సీఎం పర్యటన తర్వాత అవి వేగం పుంజుకున్నాయి. రెండో టన్నెల్ను కూడా 2021కి పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశారు. -
‘ఓపెన్’కు ఇదొక ఆరంభం మాత్రమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు పరి శీలించడానికి ఫిబ్రవరి 20న శివరాత్రికి ముందురోజు నల్లమల అడవుల ముఖ ద్వారం డోర్నాల వద్దకు వెళ్లారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు నల్లమల అడవుల్లో మరణించిన కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలోని రుద్రకొండ వద్ద ఉన్న పావురాలగుట్టకు ఈ వెలిగొండ ప్రాజెక్టు సమీప ప్రాంతం. అయితే, సీఎంగా వైఎస్సార్ జీవించివున్న రోజుల్లో నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలకు సిద్ధం అన్నప్పుడు, ‘మీడియా’ సాక్షిగా వాళ్ళు అడివిలో నుండి బయటకు వచ్చిందీ, చర్చలు ముగిసాక వాళ్ళు తిరిగి ‘లోపలికి’ వెళ్ళిందీ ఆ ప్రాంతంలోనే. మా ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది అని నక్సలైట్లను ఆహ్వానించిందీ, ఆ ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో కలపడానికి వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన శంకు స్థాపన చేసిందీ; ఇవి రెండూ జరిగింది, 2004లో వైఎస్సార్ సీఎం అయిన తొలి ఆరు నెలల్లోనే. నిజానికి ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5 న అప్పటి సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చెయ్యాలని అప్పట్లో లక్ష్యం పెట్టారు, కాని 2000 మే చివరి వరకు కనీసం అనుమతులు కూడా రాలేదు. తర్వాత 2004 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. వైఎస్సార్ సీఎం అయ్యాక, 2004 అక్టోబర్ 27న నల్లమల ముఖద్వారం గొట్టిపడియ దగ్గర దీనికి శంకుస్థాపన చేసి, వెంటనే నిధులు విడుదల చేశారు. అప్పటికి 1996లో రూ. 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి రూ. 5,500 కోట్లకు చేరింది. కానీ, వైఎస్సార్ చొరవతో 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తి అయ్యాయి. మూడు ఆనకట్టలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు ఇంకా పూర్తి కాలేదు. తండ్రి ఆనాడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు వద్ద, ఇప్పుడు తనయుడు సీఎం హోదాలో ప్రాజెక్టు సొరంగం ‘లోపలికి’ వెళ్ళడం అనేది, దృశ్యమానంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు. కానీ చూడ్డానికి అక్కడ అంతకు మించి ఇంకా ఎంతో వుంది. ఇప్పటివరకు రాజ్యం ‘లోపలికి’ వెళ్ళక, ‘ఓపెన్’ కాని చాలా కొత్త ప్రాంతాలను, ఈ ప్రభుత్వం విద్య, వైద్యంతో పేదలకు గౌరవ ప్రదమైన జీవనం ఇస్తూ, చేస్తున్న ‘ఓపెన్’కు ఇదొక ఆరంభం మాత్రమే. (చదవండి: వెలిగొండ వేగం పెరగాలి) మధ్య కోస్తాలో తూర్పుకనుమల పాదాల వద్ద నల్లమల అడవుల అంచుల్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు, జిల్లాల్లోని కరువు ప్రాంతాల్ని కలుపుకుని, 1970లో ‘ప్రకాశం’ ఒక జిల్లా అయింది. జిల్లా పశ్చిమ ప్రాంతం పెద్దగా మెరుగుపడిన పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు. 2014 లో రాష్ట్ర విభజన జరిగాక, ఇప్పుడు ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ‘ఫోకస్’ పడింది గానీ, లేకుంటే ఈ ప్రాంత పరిస్థితిని వూహించడం కష్టం. ‘వెలుగొండ’ ప్రాజెక్టు పూర్తి అయ్యాక, సాగులోకి రానున్న 4,47,300 ఎకరాల భూములకు ఇన్నేళ్లకు విలువ పెరగనుంది. కృష్ణా నది సహజ ప్రవాహాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన దారి మళ్ళించి నల్లమల అడవుల గర్భం లోపల నుండి కొండకు వేసిన సొరంగ మార్గం ద్వారా, త్వరలో నదీ జలాలు ఇకముందు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న నిత్య కరువు ప్రాంతానికి తరలివస్తాయి. తూర్పు కనుమల్లో నల్లమల అరణ్యం అంచుల్లో ఇప్పటివరకు సాగు జలాలు అందని ఇంత పెద్ద విస్తీర్ణం ఇకముందు సాగులోకి వస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాలోని 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీరు సాకర్యం లభిస్తుంది. ఏకకాలంలో ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి మధ్యకోస్తా ప్రాంతాన్నే కాకుండా రాయలసీమ జిల్లాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిపాదిత ‘మెరైన్ బోర్డ్’ వచ్చాక రామాయపట్నం, దుగ్గరాజపట్టణం పోర్టులకు రవాణా కోసం అనుసంధానం అయ్యే ఈ ప్రాంతం రూపురేఖలు చాలా తక్కువ కాలంలో మారిపోతాయి అనడంలో ఆశ్చర్యం లేదు. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక వ్యాఖ్యాత -
ఆ ఇద్దరి మధ్య తేడా అదే..!
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో తవ్వింది 600 మీటర్ల మాత్రమేనని.. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత 8 నెలల్లో 1.4 కి.మీ తవ్వారని.. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఇదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. ఆగస్టుకల్లా ఫేజ్-1 ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయని సీఎం వైఎస్ జగన్ చెప్పడం ప్రకాశం జిల్లా రైతులకు ఊరటనిస్తుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. (వెలిగొండ వేగం పెరగాలి) ఎన్పీఆర్ ఆమోద యోగ్యం కాదు.. ముస్లిం మైనారిటీల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యలను, వారిని అభద్రతా భావానికి గురిచేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించదని మరో ట్వీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ‘ఎన్పీఆర్ ప్రస్తుత రూపం మాకు ఆమోద యోగ్యం కాదు. ఇప్పటికే జీవో తెచ్చాం. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వెలిగొండ వేగం పెరగాలి
ఐదేళ్ల టీడీపీ సర్కార్ హయాంలో 600 మీటర్ల మేర టన్నెల్–1 పనులు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నమాట. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ‘ప్రాధాన్యత క్రమం’లో శరవేగంగా పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళిక అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి అధికారులకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గురువారం ఆయన వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘ప్రాజెక్టుల బాట’కు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం హెలికాఫ్టర్లో బయలుదేరి 10.55 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు (సొరంగం)–2 వద్ద పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం ట్రాలీలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1లోకి ప్రవేశించి, టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్) ద్వారా సొరంగం తవ్వకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు అనిల్కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ప్రజాప్రతినిధులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ నమూనా చూపుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఐదేళ్లలో 600 మీటర్లు.. ఎనిమిది నెలల్లో 1.4 కి.మీల సొరంగం తవ్వకం ‘ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి, 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత పనులు పడకేశాయి. ఈ పరిస్థితిలో ఈ ప్రాజెక్టు తొలి దశను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించాం. గడువులోగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ఐదేళ్లుగా పనులు ఎందుకు ముందు సాగలేదని అధికారులను ప్రశ్నించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో టన్నెల్–1 పనులు 15.2 కిలోమీటర్ల నుంచి 15.8 కిలోమీటర్ల వరకు అంటే 600 మీటర్ల మేర మాత్రమే చేయగలిగామని అధికారులు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో టన్నెల్–1 పనులను 15.8 కిలోమీటర్ల నుంచి 17.2 కిలోమీటర్ల వరకు అంటే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. టన్నెల్–1ను ఎట్టిపరిస్థితుల్లో జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. నెలకు 200 మీటర్ల చొప్పున టన్నెల్ను తవ్వుతున్నామని, జూన్–జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలింగొండ సొరంగ మార్గంలో లోకో ట్రైన్లో ప్రయాణిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో టన్నెల్–2 పనులు 410 మీటర్లే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొల్లంవాగు మీదుగా వెలిగొండ టన్నెల్ ద్వారా నీటిని విడుదల చేయడానికి సాగుతున్న హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనుల గురించి సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. హెడ్ రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ సక్రమంగా చేయక పోవడంతో వాటిని మరొక కాంట్రాక్టర్కు అప్పగించామని అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయంలోనీటి మట్టం 850 అడుగులకు తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 10.75 కిలోమీటర్ల నుంచి 11.16 కిలోమీటర్ల (410 మీటర్లు) వరకు మాత్రమే చేశారని అధికారులు వివరించారు. టన్నెల్–2ను రెండు వైపుల నుంచి తవ్వడం ద్వారా శరవేగంగా పూర్తి చేయాలని సీఎం చేసిన సూచనలకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధుల కొరత రానివ్వం.. పనులు వేగంగా చేయండి వెలిగొండ ప్రాజెక్టు పనులకు అవసరమైన 2,884.13 ఎకరాల భూమిని మార్చి 31లోగా సేకరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్లో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయని.. ఆ గ్రామాల పరిధిలోని 4,617 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారని నివేదించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. అందుకు అవసరమైన రూ.1,860 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాత కాంట్రాక్టు సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అవసరమైతే ఆ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి వేరే కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించాలని సూచించారు. పుల్లలచెరువు మండలంలో టీ–5 బ్లాక్ వద్ద అదనంగా కాలువ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగు, తాగు నీరు అందించే పనులు చేపట్టడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, వాటిని మంజూరు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ఈస్ట్రన్ కెనాల్ ద్వారా రాళ్లపాడు రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించారు. ఆ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, వేణుగోపాల్, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘వెలిగొండ’ పనులపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష
-
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్
-
‘వెలిగొండ’ పనులపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష
సాక్షి, ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాసం,హెడ్ రెగ్యులరేటర్, టన్నెల్ తవ్వకాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రధానంగా పునరావాసంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. (వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్) మొదటి విడత పనులకు కావాల్సిన నిధులు అవసరం గురించి అధికారుల నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారని..మొదటి దశ పనులు పూర్తి కావడానికి రూ.1880 కోట్లు అవసరం ఉందని అధికారులు తెలిపారని వెల్లడించారు. పెండింగ్ బిల్లులు గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని చెప్పారు. మార్చి 31 వరకు రూ.184 కోట్లు అవసరమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆగస్టు 31 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్
-
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను ఆయన గురువారం పర్యవేక్షించారు. ప్రాజెక్ట్ మొదటి టన్నెల్, రెండో టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. (వడివడిగా వెలిగొండ!) కాగా ప్రకాశం జిల్లా వరప్రదాయని, జీవధార అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జూన్కల్లా ఒకటో సొరంగం నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతో సీఎం జగన్ ఇవాళ వెలిగొండ ప్రాజెక్ట్ను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ వద్దే జిల్లా ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. (వెలిగొండ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్) శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, వైఎస్సార్ జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ తయారు చేశారు. (వెలిగొండతో పశ్చిమాన ఆనందం) -
వరాల వెలిగొండ..!
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా వరప్రదాయని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అత్యధికంగా నిధులు కేటాయించి పనులు వేగంగా చేయించగలిగారు. 2005 నుంచి 2009 వరకు రిజర్వాయర్, కాలువలు, పైపులైన్ల నిర్మాణ పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో వెలిగొండ పనులకు గ్రణం పట్టినట్లైంది. టీడీపీ పాలనలో నత్తనడకన.. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వెలిగొండ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ధనార్జనే ధ్యేయంగా వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వాడుకున్నారు. గతంలో రెండో టన్నెల్ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి అంచనాలు విపరీతంగా పెంచి తన బినామీ, అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థ«కు అప్పగించారు. అయినా ఆ సంస్థ పనులను సక్రమంగా చేయలేదు. అంచనాలు పెంచి ప్రజాధానాన్ని లూటీ చేయాలని వేసిన పన్నాగం తర్వాత అధికారం కోల్పోవడంతో బెడిసి కొట్టింది. కాలువల వివరాలు ఇవే.. తీగలేరు ప్రధాన కాలువ బి. చెర్లోపల్లి వద్ద నల్లమల సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమై ప్రకాశం జిల్లాలోని 5 మండలాల్లో 62వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి రూపొందించారు. ఈ కాలువ 12.80 మీటర్ల వెడల్పుతో 48.3 కిలో మీటర్ల పొడవుతో త్రిపురాంతకం వద్ద ముగుస్తుంది. గొట్టిపడియ ప్రధాన కాలువ జమ్మనపాలెం వద్ద గొట్టిపడియ కట్టడం నుంచి జిల్లాలోని రెండు మండలాల్లో 9500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించనుంది. ఈ కాలువ 6.9 మీటర్ల వెడల్పుతో 11.435 కిలోమీటర్ల పొడవుతో గుండ్లకమ్మ వాగు వద్ద ముగుస్తుంది. తూర్పు ప్రధాన కాలువ కాకర్ల వద్ద నల్లమల సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమై జిల్లాలోని 15 మండలాలు, నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో కలిపి 2,45,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించనుంది. అదే విధంగా కంభం చెరువు కింద 6,500 ఎకరాల ఆయకట్టు భూమి స్థిరీకరించడానికి కూడా రూపొందించారు. కాలువ 15.50 మీటర్ల వెడల్పుతో 130.66 కిలోమీటర్ల పొడవుతో నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, ఉదయగిరి ఉపకాలువ రిజర్వాయర్ నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి గ్రామం వద్ద తూర్పు ప్రధాన కాలువ చివరి భాగాన 2.02 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి 39.966 కిలోమీటర్ల మేర ఉదయగిరి ఉప కాలువ తవ్వడం ద్వారా నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో 52వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, గండిపాలెం రిజర్వాయర్ కింద సాగు చేస్తున్న 6500 ఎకరాలు స్థిరీకరించడానికి ఉద్దేశించారు. పశ్చిమ ఉప కాలువ, తూర్పు ప్రధాన కాలువ నుంచి 25.45 కిలోమీటర్ వద్ద ప్రారంభమై 5 ఎత్తిపోతల ద్వారా 23.68 కిలోమీటర్ల పొడవుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 60,300 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రూపొందించారు. తురిమెళ్ల రిజర్వాయర్లో 2.453 టీఎంసీల సామర్థ్యంతో తురిమెళ్ల గ్రామం వద్ద నిర్మిస్తారు. 3.1 కిలోమీటర్ల దూరం నుంచి పడమర ఉప కాలువ ప్రారంభమై 6.7 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించిన తర్వాత దీని నుంచి రెండో ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా 3,4,5 ఎత్తిపోతల పథకాల నిర్మాణం కూడా కొంతమేర జరిగాయి. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన సీతారామసాగర్ జలాశయం 1.0 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. దాని ద్వారా మండలంలోని 7500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించారు. రాళ్ళవాగు జలాశయం, గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయాలు కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నాయి. రాళ్లవాగు జలాశయం 0.138 టీఎంసీల సామర్థ్యంతో రాళ్లపాడు గ్రామం వద్ద నిర్మించనున్నారు. దీని ద్వారా ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు గ్రామంలో 1500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయం 0.415 టీఎంసీల సామర్థ్యం కలిగి గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద గుండ్లకమ్మ వాగుమీద నిర్మించి ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో 3,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. పూర్తయితే 4,47,300 ఎకరాలకు సాగునీరు ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా వెలిగొండ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ తయారు చేశారు. కొల్లంవాగు నుంచి హెడ్రెగ్యులేటర్ శ్రీశైలం జలాశయం నీటి మట్టం 256.032 మీటర్లు ఉన్నప్పుడు జలాశయం అంతర్భాగంలో కలుస్తున్న కొల్లంవాగులోకి నీరు వచ్చి చేరుతుంది. కొల్లంవాగు జన్మస్థలం నుంచి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, సొరంగాలు, వరద కాలువ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ను నింపాల్సి ఉంది. నల్లమలసాగర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 43.58 టీఎంసీలు. కొల్లంవాగు జన్మస్థలం వద్ద 328 క్యూసెక్కుల సామర్థ్యంతో హెడ్ రెగ్యులేటర్ను నిర్మించ తలపెట్టారు. ఈ నిర్మాణం రాజీవ్ పులుల అటవీ సంరక్షణ కేంద్రం పరిధిలో ఉంది. హెడ్రెగ్యులేటర్ నుంచి రెండు సొరంగాల ద్వారా నీటిని నల్లమల కొండల్లోని నల్లమలసాగర్ రిజర్వాయర్కు చేరడానికి సుమారు 19 కిలోమీటర్ల మేర నీరు ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు సొరంగాలు ఒక్కొక్కటి 19 కిలో మీటర్ల మేర కొండలను తొలిచి నిర్మిస్తున్నారు. నల్లమల సాగర్ జలాశయం నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల మధ్య సహజ సిద్ధంగా నల్లమలసాగర్ ఏర్పడింది. అయితే కొండల మధ్య సహజ సిద్ధంగానే ఏర్పడిన సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల వద్ద ఉన్న గ్యాప్లను కాంక్రీటు ద్వారా కొండలను కలిపారు. నేడు సీఎం ప్రాజెక్టు సందర్శన పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బుధవారం మండల పరిధిలోని కొత్తూరు వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొదటి టన్నెల్, రెండో టన్నెల్ ప్రాంగణాలతో పాటు, ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించే ప్రాంగణం, రాజకీయ నాయకులు వేచి ఉండే ప్రాంతాలను పరిశీలించారు. హెలీపాడ్ వద్దకు చేరుకుని సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యవేక్షించారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన దృష్ట్యా బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను అడిషనల్ ఎస్పీలకు అప్పగించారు. ఏడుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 1000 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు 100 మంది, ఏరియా డామినేషన్ 40 మందిని నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 60 మంది కూంబింగ్ పార్టీ సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించామని ఎస్పీ తెలిపారు. హెలీపాడ్ వద్ద బారికేడ్లు, సమీక్ష ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను మంత్రి సురేష్తో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహించే అ«ధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు సవరించిన అంచనాలు విలువ రూ. 8,440 కోట్లు ఈ సంవత్సరం జనవరి 31 వరకు ఖర్చు చేసింది. రూ. 5237.30 కోట్లు నిర్మాణ పనుల కోసం రూ. 3661.46 కోట్లు భూముల కొనుగోలు ద్వారా ఖర్చు చేసింది రూ. 384.21 కోట్లు పునరావాసం కోసం రూ. 97.27 కోట్లు అటవీ శాఖకు చెల్లించింది రూ. 437.04 కోట్లు ఇతర ఖర్చులకు చెల్లించింది రూ. 657.32 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం కావాల్సిన మొత్తం భూమి 42,684 ఎకరాలు కొనుగోలు చేసింది 30,391 ఎకరాలు ఇంకా తీసుకోవాల్సిన భూములు 2,442 ఎకరాలు -
వెలిగొండకు మళ్లీ వెలుగులు
-
ప్రాజెక్టుల బాటకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో (ఆన్ గోయింగ్) ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖకు దిశా నిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్షేత్ర స్థాయిలో వాటి పనులను తనిఖీ చేయడానికి శ్రీకారం చుట్టారు. తనిఖీ అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా గురువారం వెలిగొండ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. తనిఖీ అనంతరం ప్రాజెక్టు వద్దే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఆ ప్రాజెక్టు అధికారులు, సహాయ, పునరావాస విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తొలి దశను ఈ ఏడాది పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు 2009 వరకూ శరవేగంగా సాగాయి. ఆయన హఠాన్మరణంతో ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. వంశధార, తోటపల్లి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, చింతలపూడి ఎత్తిపోతల నుంచి గోదావరి డెల్టా, ఏలేరు ఆయకట్టు ఆధునికీకరణ దాకా అన్ని ప్రాజెక్టుల పనులు పడకేశాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (‘పవర్’ఫుల్ సెక్టార్) మూడు ప్రాధాన్యతల కింద వర్గీకరణ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన వ్యయం.. కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఆధారంగా (రూ.500 కోట్ల లోపు వ్యయంతో పూర్తి కావడం, కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యతగా వర్గీకరించారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయం.. కొత్తగా 20 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను ద్వితీయ ప్రాధాన్యతగా చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ రెండు విభాగాల్లోకి రాని ప్రాజెక్టులు తృతీయ ప్రాధాన్యత) 32 ప్రాజెక్టులను మూడు ప్రాధాన్యతల కింద జలవనరుల శాఖ అధికారులు వర్గీకరించారు. వాటిని పూర్తి చేయడానికి రూ.25,698 కోట్లు అవసరం అవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారులు నివేదించారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయడం ద్వారా 10,87,360 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 16,34,821 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టును 41.19 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేయడానికి రూ.11,379 కోట్లు.. 45.72 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేయడానికి రూ.31,825 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. పోలవరం మినహా మిగతా ప్రాజెక్టుల్లో.. తొలి ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.20,872 కోట్లు, ద్వితీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టులకు రూ.1,293 కోట్లు, తృతీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.3,533 కోట్లు అవసరం అవుతాయని వివరించారు. ఆ మేరకు నిధులు సమకూర్చుతామని.. శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పనులను ఈ నెల 27న సీఎం వైఎస్ జగన్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అక్కడే అధికారులతో సమీక్షించి దిశా నిర్ధేశం చేస్తారు. శరవేగంగా పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ - ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళిక అమలుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. - వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటి దాకా రూ.5,107 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.3,480 కోట్లు అవసరం. ఇది పూర్తయితే కొత్తగా 4,47,300 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 14,800 ఎకరాలను స్థిరీకరించవచ్చు. ఈ ప్రాజెక్టులో తొలి దశను ప్రథమ ప్రాధాన్యత కింద చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. - వంశధార ప్రాజెక్టు రెండవ స్టేజ్లో ఫేజ్–2కు ఇప్పటి దాకా రూ.1,575 కోట్లు వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.464 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టును తొలి ప్రాధాన్యత కింద పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. - తోటపల్లి ప్రాజెక్టుకు ఇప్పటి దాకా రూ.810 కోట్లు వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.201 కోట్లు అవసరం. ఇది పూర్తయితే అదనంగా 62,217 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. - తాడిపూడి ఎత్తిపోతల పథకానికి ఇప్పటిదాకా రూ.586 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.380 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. కొత్తగా 41,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ఈ ప్రాజెక్టును ద్వితీయ ప్రాధాన్యత కింద పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. - గోదావరి డెల్టా ఆధునికీకరించకపోవడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. సమృద్ధిగా గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా చివరి ఆయకట్టు భూములు నీళ్లందక ఎండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆధునికీకరణ పనులు పూర్తయితే డెల్టాలో 10,13,161 ఎకరాల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చు. డెల్టా ఆధునికీకరణకు ఇప్పటిదాకా రూ.1,595.29 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు పూర్తి కావాలంటే రూ.1,379 కోట్లు అవసరం. వీటిని తృతీయ ప్రాధాన్యత కింద పూర్తి చేయడానికి జల వనరుల శాఖ చర్యలు చేపట్టింది. ఏలేరు, పెన్నా, కృష్ణా డెల్టాల ఆధునికీకరణ పనులను ఇదే రీతిలో పూర్తి చేయాలని నిర్ణయించింది. జూలై నాటికి వెలిగొండ తొలి దశ శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 11,581.68 క్యూసెక్కుల (328 క్యూమెక్కులు) చొప్పున 43.50 టీఎంసీలను తరలించి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. అప్పటి నుంచి 2019 మే 29 వరకు రెండు సొరంగాల్లో మిగిలిన పనులు.. నల్లమలసాగర్ ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించడం, 2,884.13 ఎకరాల భూసేకరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రక్షాళన చేయడంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పనులకు ‘రివర్స్ టెండరింగ్’ నిర్వహించి, రూ.61.76 కోట్లను ఖజానాకు మిగిల్చారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి ఈ ఏడాది తొలి దశను పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతో పనులు వేగం పుంజుకున్నాయి. మొదటి సొరంగంలో రోజుకు 6.45 మీటర్ల చొప్పున పనులు చేస్తున్నారు. మరో వెయ్యి మీటర్ల మేర సొరంగం పనులు చేయాలి. ఈ పనులు జూలై 15 నాటికి పూర్తవుతాయి. శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాలకు నీళ్లు చేరాలంటే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 865.1 అడుగుల్లో 122.718 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. జలాశయంలో నీటి మట్టం 840 అడుగులకు తగ్గితేగానీ హెడ్ రెగ్యులేటర్ పనులు చేపట్టలేని పరిస్థితి. మార్చి 15 నాటికి జలాశయం నీటి నిల్వ తగ్గనుంది. అప్పటి నుంచి వరద ప్రారంభమయ్యేలోగా హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. వచ్చే సీజన్లో నల్లమలసాగర్కు నీరు నల్లమలసాగర్ నిర్వాసితుల పునరావాసానికి, భూసేకరణకు రూ.1,220 కోట్లు, తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.534 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వచ్చే సీజన్లో కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరి, నీటి మట్టం 840 అడుగులకు చేరుకోగానే మొదటి సొరంగం ద్వారా రోజుకు 85 క్యూమెక్కులు(3001.35 క్యూసెక్కులు) చొప్పున తరలించి.. నల్లమలసాగర్లో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని సర్కార్ నిర్ణయించింది. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన రూ.1,880.16 కోట్లను 2020–21, 2021–22 బడ్జెట్లలో కేటాయించనుంది. -
వడివడిగా వెలిగొండ!
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెలిగొండ మొదటి సొరంగంలో మిగిలిపోయిన 1.34 కి.మీ. పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. సొరంగ మార్గంలో కఠిన శిలలు (అబ్రాసివ్ రాక్) ఉండటంతో రోజుకు తొమ్మిది మీటర్లకు బదులుగా సగటున ఐదు నుంచి ఆరు మీటర్లు తవ్వుతున్నారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు కొత్త బుష్లు, కన్వేయర్ బెల్ట్లు అమర్చడం ద్వారా సొరంగం తవ్వకం పనులను వేగవంతం చేసి మే నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సొరంగం ద్వారా తరలించే నీటిని నల్లమల సాగర్లో నిల్వ చేయాలంటే 11 ముంపు గ్రామాలకు చెందిన 4,617 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈ నేపథ్యంలో మే లోగా పునరావాస పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే సీజన్లో కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులకు చేరుకోగానే మొదటి సొరంగం ద్వారా రోజుకు 85 క్యూమెక్కులు(3001.35 క్యూసెక్కులు) చొప్పున తరలించి నల్లమలసాగర్లో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. వైఎస్సార్ హయాంలో సింహభాగం పనులు పూర్తి శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 11,581.68 క్యూసెక్కుల చొప్పున 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 15.25 లక్షల మంది దాహార్తి తీర్చే వెలిగొండ ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. అప్పటి నుంచి రెండు సొరంగాల్లో మిగిలిన పనులు, పునరావాసం, 2884.13 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చోటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించారు. శ్రీశైలం నుంచి వెలిగొండకు నీటిని తరలించేందుకు 85 క్యూమెక్కుల సామర్థ్యంతో మొదటి సొరంగాన్ని, 243 క్యూమెక్కుల సామర్థ్యంతో రెండో సొరంగం పనులను చేపట్టారు. మొదటి సొరంగం పనులను జూన్నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. రెండో సొరంగం పనులను రివర్స్ టెండర్ల ద్వారా తక్కువ ధరకే కొత్త కాంట్రాక్టర్కు అప్పగించి రూ.61.76 కోట్లను ఖజానాకు మిగిల్చారు. రెండో సొరంగంలో మిగిలిన 7.575 కి.మీ. పనులను 2021 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. మరో రూ.3,480.16 కోట్లు అవసరం – వెలిగొండ పనులకు ఇప్పటివరకు రూ.5,107 కోట్లు ఖర్చు చేశారు. – ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇంకా రూ.3,480.16 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో తొలి దశ పనుల పూర్తికి అవసరమైన రూ.1,600 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి సూచించారు. – రెండో దశ పనుల కోసం రూ.1,880.16 కోట్లను 2020–21, 2021–22 బడ్జెట్లలో కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. – మొదటి సొరంగం పనులు వేగంగా జరుగుతుండగా, రెండో సొరంగం పనులను తక్షణమే ప్రారంభించాలని కొత్త కాంట్రాక్టర్ను ఆదేశించారు. – హెడ్ రెగ్యులేటర్తోపాటు నల్లమలసాగర్లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. – నల్లమలసాగర్లో 11 గ్రామాల ప్రజలకు పునరావాస పనులను ప్రకాశం కలెక్టర్ పోలా భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు. – ఇప్పటికే పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. – గండికోట, పోలవరం ప్రాజెక్టుల తరహాలో నల్లమలసాగర్ నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
రివర్స్ హిట్
-
'రివర్స్' హోరా హోరీ!
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్(సొరంగం)లో మిగిలిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ సూపర్హిట్ అయింది. నాలుగు కాంట్రాక్టు సంస్థలు హోరాహోరీగా తలపడ్డాయి. వెలిగొండ ప్రాజెక్టు సీఈ జలంధర్ పర్యవేక్షణలో అధికారులు శనివారం ఆర్థిక బిడ్ తెరవగా నాలుగు సంస్థలు పోటాపోటీగా తక్కువ ధర కోట్ చేస్తూ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. బిడ్లో తక్కువ ధర కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థ పేర్కొన్న రూ.512.50 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2.45 గంటలపాటు ఈ–ఆక్షన్ నిర్వహించారు. ప్రతి 15 నిముషాలకు ఒకసారి పోటాపోటీగా తక్కువ ధర(లెస్)కు రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, పటేల్ ఇన్ఫ్రా, ఆర్ఆర్ ఇన్ఫ్రా కోట్ చేస్తుండటంతో ప్రక్రియ పూర్తయ్యే వరకూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ–ఆక్షన్ ముగిసే సమయానికి 7 శాతం తక్కువ ధర (రూ.491.37 కోట్లు)కు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించేలా సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వెలిగొండ రెండో టన్నెల్లో మిగిలిన పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వ ఖజానాకు రూ.61.76 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తిరుగులేనిదని మరోసారి ప్రస్ఫుటమైంది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు..! వెలిగొండ రెండో టన్నెల్ పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చిన నిపుణుల కమిటీ మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ మేరకు మిగిలిన పనుల విలువ రూ.553.13 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం గత నెల 21న రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం వెలిగొండ అధికారులు ప్రైస్(ఆర్థిక బిడ్) తెరిచారు. రూ.512.50 కోట్లకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసిన ఒక కాంట్రాక్టు సంస్థ ఎల్–1గా నిలిచినట్లు వెల్లడైంది. రూ.512.50 కోట్లను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ నిర్వహించారు. ఈ–ఆక్షన్ గడువు ముగిసే సమయానికి రూ.491.37 కోట్లు (రూ.491,36,89,564) కోట్ చేసిన ఎంఈఐఎల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్ట్రాస్టక్చర్ లిమిటెడ్) సంస్థ ఎల్–1గా నిలిచింది. 7 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థకే పనులు అప్పగించాలని సీవోటీ(కమిషనర్ ఆఫ్ టెండర్స్)కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. పారదర్శకతకు గీటురాయి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు సడలించాలని సూచించారు. ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ వేదికగా ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. చంద్రబాబు హయాంలో వెలిగొండ రెండో టన్నెల్ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ 4.69 శాతం ఎక్సెస్కు దక్కించుకున్నది. అదే సంస్థ ఇపుడు రివర్స్ టెండరింగ్లోనూ పాల్గొని అంతకన్నా తక్కువకు షెడ్యూలు దాఖలు చేసింది. ఆర్థిక బిడ్లోనూ, ఈ–ఆక్షన్లోనూ కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకు రిత్విక్ ప్రాజెక్టŠస్ కోట్ చేసింది. దీనిని బట్టి చంద్రబాబు హయాంలో ఎక్కువ ధరకు సొంతవాళ్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని అప్పనంగా అప్పగించినట్లు అర్ధమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గతంలో ఎక్కువ ధరకు దక్కించుకున్న రిత్విక్ సంస్థే ఇపుడు తక్కువ ధరకు కోట్ చేయడం, ఆసంస్థ కోట్ చేసిన ధర కంటే మరింత తక్కువ ధరకు మేఘా కోట్ చేసి టెండర్ దక్కించుకోవడం, మొత్తంగా రూ. 61.76 కోట్లు ప్రజాధనం ఆదా అవడం చూస్తే రివర్స్టెండరింగ్ విధానమనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ముందు చూపుతో, విజŠక్షతతో తీసుకున్న నిర్ణయమని మరోసారి తేటతెల్లమయిందని సాగునీటి రంగ నిపుణులు, కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఆదా జరిగింది ఇలా... వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్సీసీ–సీపీపీఎల్ సంస్థ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. 8,580 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం, 9.2 మీటర్ల వ్యాసంతో 18.787 కి.మీ.ల పొడవున సొరంగం తవ్వి 0.3 మీటర్ల మందంతో లైనింగ్ పనులను పొడిగించిన గడువు ప్రకారం 2020 మార్చి నాటికి ఆ సంస్థ పూర్తి చేయాలి. కానీ ఆ సంస్థపై గతేడాది ఆగస్టులో 60 సీ కింద వేటు వేశారు. అప్పటికి 10.750 కి.మీ.ల పనులను పూర్తి చేయగా రూ.489 కోట్ల బిల్లులు చెల్లించారు. అంటే రూ.246.21 కోట్ల పనులు మిగిలాయి. కానీ 60 సీ కింద తొలగించినప్పుడు ఆ పనుల విలువను రూ.299.48 కోట్లుగా తప్పుగా లెక్కించారు. 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచేశారు. ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనాతో గతేడాది ఆగస్టులో టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 4.69 శాతం అధిక ధరకు అంటే రూ.597.35 కోట్లకు కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఆ సంస్థ ఇప్పటివరకూ 462 మీటర్ల పనులు మాత్రమే చేసింది. వాటి విలువ తీసివేయగా మిగిలిన పనుల విలువను రూ.553.13 కోట్లుగా లెక్కించారు. ఇందులో 4.69 శాతం ఎక్సెస్ను తీసివేయగా వచ్చిన రూ. 528.35 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముందుగానే రూ. 24.78 కోట్లు ఆదా అయ్యాయి. 528.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 7 శాతం తక్కువ ధరకు అంటే రూ. 491.37 కోట్లకు మేఘా దక్కించుకుంది. దాంతో మొత్తమ్మీద 11.69 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. దానివల్ల 61.76 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్తో ఇప్పటివరకు రూ.903.09 కోట్లు ఆదా ►పోలవరం హెడ్వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం రివర్స్ టెండర్లలో రూ.782.80 కోట్లు, ►లెఫ్ట్ కనెక్టివిటీ (65వ ప్యాకేజీ ) పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.58.53 కోట్లు ►వెలిగొండ రెండో టన్నెల్ మిగిలిన పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్లలో రూ.61.76 కోట్లు ►మొత్తం ఆదా అయ్యింది రూ. 903.09 కోట్లు -
వెలిగొండ రివర్స్ టెండరింగ్: రూ. 62 కోట్లు ఆదా
-
వెలిగొండ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్
సాక్షి, అమరావతి : నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్(ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో వెలిగొండ రెండో టన్నెల్ పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధిక ధరకు పనులు దక్కించుకున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్కు వెళ్లింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్ టెండరింగ్లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. రూ. 553.13 కోట్ల టెండర్ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 87 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం విజయం సాధించిన విషయం తెలిసిందే. పోలవరం హెడ్వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో ఖజానాకు రూ.782.8 కోట్లు ఆదా అయ్యాయి. -
వెలిగొండ రెండో టన్నెల్లో రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: సాగునీటి పనుల ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘రివర్స్ బిడ్డింగ్’ ప్రక్రియలో తొలి అడుగు బలంగా వేసిన రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో మిగిలిపోయిన పనులను రూ.553.13 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్–ఓపెన్ పద్ధతిలో 18 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో జలవనరుల శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి బిడ్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 7 సాయంత్రం ఐదు వరకు టెండర్ డాక్యుమెంట్లను ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 9న సాయంత్రం ఐదు గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాలి. వచ్చే నెల 11న ఆర్థిక బిడ్ తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేస్తూ బిడ్ దాఖలు చేసిన కాంట్రాక్టర్ను ‘ఎల్–1’గా ఎంపిక చేస్తారు. ఆ కాంట్రాక్టర్ పేరును గోప్యంగా ఉంచి బిడ్లో కోట్ చేసిన ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి.. 2.45 గంటల పాటు ‘ఆన్లైన్’లో ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. ఆర్థిక బిడ్కు అర్హత సాధించిన కాంట్రాక్టర్లు 15 నిమిషాలకు ఒకసారి అంచనా వ్యయంలో 0.5 శాతం తక్కువ కోట్ చేస్తూ ఈ–ఆక్షన్లో పాల్గొనవచ్చు. ఈ–ఆక్షన్ గడువు ముగిసే సమయానికి ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వారినే ఎల్–1గా ఎంపిక చేసి సాంకేతిక అర్హతలను మరోసారి పరిశీలించి టెండర్ ఆమోదించాలని సీవోటీ(కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి ప్రతిపాదనలు పంపుతారు. వాటిని పరిశీలించి అన్నీ సజావుగా ఉంటే సీవోటీ ఆమోద ముద్ర వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు 65వ ప్యాకేజీ పనుల తరహాలోనే వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పనుల రివర్స్ టెండరింగ్లోనూ భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని జలవనరుల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బినామీల కోసం టీడీపీ హయాంలో అంచనాల పెంపు.. వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్సీసీ–సీపీపీఎల్ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. ఈ పనులను పొడిగించిన గడువు ప్రకారం 2020 మార్చి నాటికి పూర్తి చేయాలి. కానీ హెచ్సీసీ–సీపీపీఎల్పై గతేడాది ఆగస్టులో 60 సీ కింద వేటు వేశారు. అప్పటికి 10.750 కి.మీ.ల పనులు పూర్తి కాగా రూ.489 కోట్లను చెల్లించారు. రూ.246.21 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. కానీ 60సీ కింద తొలగించినప్పుడు ఆ పనుల విలువను రూ.299.48 కోట్లుగా తప్పుగా లెక్కించారు. అనంతరం 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచేశారు. ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనాతో గతేడాది ఆగస్టులో టెండర్లు పిలిచిన టీడీపీ సర్కార్ వాటిని చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 4.69 శాతం అధిక ధరకు అంటే రూ.597.35 కోట్లకు కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. రిత్విక్కు రూ.351.14 కోట్లకుపైగా దోచిపెట్టడానికి స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటివరకూ ఆ సంస్థ 462 మీటర్ల పనులు మాత్రమే చేసింది. వాటి విలువ తీసివేయగా మిగిలిన పనుల విలువను రూ.553.13 కోట్లుగా లెక్కించారు. సత్వరమే పనులు పూర్తి చేయడం, అవినీతి నిర్మూలనకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఖజానాకు భారీ ఆదా! వెలిగొండ పనుల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా రెండో సొరంగంలో మిగిలిన 7.575 కి.మీ.ల పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ డాక్యుమెంట్ నిబంధనల ప్రకారం బిడ్లు దాఖలుకు అర్హత ఉన్నట్లు కాంట్రాక్టర్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. బిడ్ దాఖలు గడువు పూర్తయిన రోజున అంచనా వ్యయంలో 2.5 శాతం బ్యాంకు గ్యారంటీ, ఒక శాతం ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సమర్పించాలి. ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో పొందుపరిచిన అర్హతల ఆధారంగా బిడ్లు దాఖలు చేసిన వారిలో అర్హత ఉన్న కాంట్రాక్లర్లను ఆర్థిక బిడ్కు వెబ్సైట్ ఆటోమేటిక్గా ఎంపిక చేస్తుంది. అర్హత లేని వారిపై ఆటోమేటిక్గా వేటు పడుతుంది. అనర్హత వేటు పడిన కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో చెల్లించిన రూ.13.82 కోట్లు, ఈఎండీ రూపంలో చెల్లించిన రూ.5.53 కోట్లు వెరసి రూ.19.35 కోట్లను అధికారులు జప్తు చేసి ఖజానాకు జమ చేస్తారు. ఆర్థిక బిడ్కు అర్హత సాధించిన వారిలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎల్–1గా ఎంపిక చేసి పేరు గోప్యంగా ఉంచుతారు. ఆయన కోట్ చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. ఈ–ఆక్షన్లో ఎవరు తక్కువ ధరకు చేయడానికి ముందుకొస్తే వారికే పనులు అప్పగిస్తారు. దీనివల్ల ఖజానాకు భారీగా ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెలిగొండ మొదటి సొరంగం పనులను కాంట్రాక్టర్ నిబంధనల మేరకు చేస్తుండటంతో 2020 జూన్ నాటికి తొలి దశను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. -
వెలిగొండతో పశ్చిమాన ఆనందం
సాక్షి, గొబ్బూరు (ప్రకాశం): పశ్చిమ ప్రాంత వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని గొబ్బూరు గ్రామం సమీపంలో ఉన్న ఎన్ఎస్ అగ్రికల్చర్ కళాశాలలో జలశక్తి అభియాన్ సౌజన్యంతో దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయంలో నీటి సంరక్షణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమ్మీద పడిన ప్రతి వర్షపు నీటిని పొదుపు చేయాలన్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో పశ్చిమ ప్రకాశం కరువు కాటకాలతో పొలాలు ఎడారిగా మారి రైతులు నష్టాలను చవిచూశారన్నారు. వ్యవసాయధారంగా ఉండే పశ్చిమ ప్రకాశంలోని రైతులు ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 4,87,000 ఎకరాలకు సాగు, 15 లక్షల మందికి తాగు నీరు అందించే అవకాశం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి ప్రజలను సంక్రాంతికి నీళ్లందిస్తానంటూ మభ్య పెట్టి మోసం చేశారని విమర్శించారు. వచ్చే ఏడాది జూన్ నెలాఖరకు మొదటి టన్నెల్ పూర్తి చేసి 1.5 లక్షల ఎకరాలకు సాగు, 3 లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు. ముంపు గ్రామాల్లోని ఆరు వేల కుటుంబాలకు నిర్వాసితుల కేంద్రాలు, కాలనీలు ఏర్పాటు చేసిన తర్వాతే వారిని బయటికి తరలిస్తామని చెప్పారు. మొదటి టన్నెల్ పూర్తికి ఇంకో 1.5 కిలోమీటర్లే.. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తి చేయడానికి కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉందని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో పండించిన పంటలు మార్కెట్కు తరలించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి మండలంలో ఎకరా స్థలం కేటాయించి గోడౌన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారి దినేష్కుమార్ మాట్లాడుతూ జలశక్తి అభియాన్ పథకం కింద నీటి వనరరులను పెంపొందేంచే పనులు చేట్టాలన్నారు. అనంతరం కళౠశాల చైర్మన్ నాదేళ్ల చంద్రమౌళి మంత్రి సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి రాంబాబులు, శాస్త్రవేత్తలకు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.శీనారెడ్డి, తహసీల్దార్ ఈ.చంద్రావతి, ఎంఈఓ వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుదర్శనరాజు, శాస్త్రవేత్తలు ఎన్.వి. రంగా, విజయాభినందన, పిన్సిపాల్ సెక్రెటరీ ముత్యాలనాయుడు, ఉపాధి హామీ ఏపీడీ వెంకట్వేర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. వెలిగొండతో సస్యశ్యామలం యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ప్రధాన ఉద్ధేశంతో దింవగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి బడ్జెట్లో నిధులు కేటాయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాక్షస పాలన చేసిన టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రేమతో వాటిని ప్రారంభించలేదని, డబ్బులు దండుకోవటానికేనని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు తరువాత వెలిగొండ ప్రాజెక్టు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వచ్చే ఏడాదికి వెలిగొండ నుంచి కృష్ణాజలాలు వస్తాయని ప్రజల హర్షధ్వనులమధ్య ఆయన ప్రకటించారు. అనంతరం పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని డివైడర్లపై మొక్కలను నాటారు. వర్ధంతి సభానంతరం ఆయన పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు బజార్ ఏర్పాటు చేయటానికి ఎస్బీఐకు సమీపంలోని పంచాయతీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.రాజశేఖరెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, మండల అధ్యక్షుడు దొంతా కిరణ్గౌడ్, బీసీ, యువజన విభాగాల రాష్ట్ర కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, శ్రీశైలం దేవస్థానం కమిటీ మాజీ సభ్యుడు ఐ.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రైతు పక్షపాతి వైఎస్సార్ సీపీ రైతు పక్షపాతి అని, బడ్జెట్లో రైతులకు అధిక నిధులు కేటాయించామని మంత్రి సురేష్ చెప్పారు. దళారుల వ్యవస్థ నిర్మూలించడానికి రూ. 2 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం మండల రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మార్కాపురం ఎమ్మెల్యే కుందుకు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పొలాల్లో కందకాలు, ఫారంపాండ్స్, చెక్డ్యామ్లు ఏర్పాటు చేసుకోవడంతో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత రైతులు వర్షం కురిస్తేనే పంటలు సాగు చేసుకునే పరిస్థితి ఉందని, త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి నీరందిస్తామన్నారు. -
‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. దీనికి సమాధానంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తవ్విన కాల్వలపై లిఫ్టు పెట్టి పట్టిసీమ పేరుతో గత ప్రభుత్వం తెగ హడావిడి చేసిందన్నారు. పట్టిసీమలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ తెలిపిందని గుర్తుచేశారు. మహానేత వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజక్టు మొదటి సొరంగ పనులను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా మంత్రి అనిల్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మహానేత వైఎస్సార్ మొదలుపెట్టారని గుర్తుచేశారు. 2012లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారని తెలిపారు. ఎన్నికలకు నాలుగు నెలలు ఉందనగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఈ ప్రాజెక్టును మరోసారి మొదలుపెట్టారని విమర్శించారు. నాలుగేళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు దానిని ప్రారంభించడం చూస్తే వారికెంతా చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉందన్నారు. -
వచ్చే ఏడాదికి వెలిగొండ ప్రాజెక్టుకు నీరు
మార్కాపురం: వచ్చే ఏడాదికి వెలిగొండ ప్రాజెక్టు నీరు పశ్చిమ ప్రాంతంలో పారుతుందని, పొలాల్లో పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిలు అన్నారు. సోమవారం రైతు దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లుగా వ్యవసాయం నిర్వీర్యమైందని, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అన్నదాతలు తల ఎత్తుకునేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి ఖర్చుల కింద రూ.12,500 జమ చేస్తారని, కనీస మద్దతు ధరలు కూడా ప్రకటించి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్నదాతల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కొండేపల్లిని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం మండలంలోని కొండేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొండేపల్లి గ్రామంలో విజోత్సవ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మా గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని భరోసా ఇచ్చారు. మా తండ్రి కేపీ కొండారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించడం జరిగిందని, ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా చేయడం మీ కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవల కాలంలో రాజధానిలో కలవడం జరిగిందన్నారు. తొలుత ఈ ప్రాంత వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. అలాగే శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి మార్కాపురం చెరువును సాగర్ వాటర్ నింపడానికి కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి మాట్లాడుతూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కాలంలోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందిందన్నారు. పట్టణంలో ముస్లింలకు షాదీఖానా, హిందువులకు కల్యాణ మండపం, పట్టణంలోని తాగునీటి అవసరాలకు సాగర్ పైపులైన్, ప్రస్తుతం టీడీపీ నాయకులు వేసిన సీసీ రోడ్డులు కూడా ఆయన మంజూరు చేయించిన పనులను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బుశ్శెట్టి నాగేశ్వర రావు, నాగిశెట్టి, యూత్ నాయకులు శివారెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
ఏడాదిలోగా వెలిగొండ నీరు
సాక్షి, ఒంగోలు సిటీ: వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఏడాదిలో మొదటి సొరంగం పనులను పూర్తి చేసి రైతులకు పది టీఎంసీల నీటిని ఇవ్వడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఒంగోలులోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను గల ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దసరా, సంక్రాంతి పండుగ పేర్లు చెప్పి ప్రజలను మోసగించిందని విమర్శించారు. జిల్లా అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడు పాలు పంచుకుంటానని అన్నారు. రామాయపట్నం ఓడరేవు మైనర్ పోర్టుకు చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేశారని, ఐదేళ్లు కాలాన్ని వెళ్లబుచ్చి చివరి రోజుల్లో ప్రజల్ని మభ్యప్టెటడానికి శంకుస్థాపన చేశారని అన్నారు. మాది శంకుస్ధాపనల పార్టీ కాదని ప్రాజెక్టులను సాధించే పార్టీగా వైవీ స్పష్టం చేశారు. ఐదేళ్లు చంద్రబాబు కృష్ణపట్నం పోర్టు నిర్వాహకుల ప్రాపకం కోసం పని చేసిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. రామాయపట్నం మేజర్ పోర్టు కేంద్రం పరిధిలోనిది అన్నారు. కేంద్రం సహాయాన్ని తీసుకొని మేజర్ పోర్టు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధికలగనుందని తెలిపారు.రానున్న బడ్జెట్లో ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని పేర్కొన్నారు. అవినీతిని సహించేది లేదు.. గత ప్రభుత్వం అవినీతిని అన్నింటా సంస్ధాగతం చేసిందని సుబ్బారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాల్లో అవినీతి, అక్రమాలను పెంచి పోషించారని అన్నారు. జగన్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏ పథకంలోనైనా అవినీతి. కాంట్రాక్టుల్లో కుంభకోణాలు నెలకున్నాయని అన్నారు. రూ.కోట్ల కొద్ది ప్రజాధనం లూఠీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్ధానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. -
వెలిగొండ ప్రాజెక్ట్ జీవనాడి లాంటిది
-
పునరావాసంపై కదలిక
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): వెలిగొండ ప్రాజెక్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నష్టపరిహారం తప్ప... గత పదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పునరావాస పనులు... ప్యాకేజి ... పరిహారం... వెలిగొండ ముంపు గ్రామాల రైతులకు అందలేదు. ముఖ్యమంత్రిగా నెల రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్ 30 నాటికి మొదటి దశ నీరు అందించటంతో పాటు, పునరావాస కాలనీ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించటంతో 10 రోజుల నుంచి పనుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ పోలా భాస్కర్ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించటంతో పాటు పునరావాస కాలనీల నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు, రైతుల్లో పునరావాస కాలనీలపై ఆశలు చిగురించాయి. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గోగులదిన్నె, తోకపల్లె, ఇడుపూరు, వేములకోట, ఒందుట్ల వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనులపై జాయింట్ కలెక్టర్ షన్మోహన్, స్పెషల్ కలెక్టర్ చంద్రమౌళితో ప్రాజెక్టు ఎస్ఈ వీర్రాజు కలిసి శనివారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, సిమెంట్ కాలువలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, దేవాలయాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గతంలో ఇలా.. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు ప్రభుత్వం పునరావాస కాలనీలు ప్రారంభించక, అటు ఉన్న గ్రామాల్లో శిథిలమైన గృహాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య పర్యావరణానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం, రైతుల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడ వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇంతకాలం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహించింది. పదేళ్లుగా నష్టపరిహారం కోసం వెలిగొండ ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా, సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతండా, కాకర్ల, మాగుటూరు తండా, సాయినగర్, కృష్ణనగర్, తదితర గ్రామాల ప్రజలు ఎదురు చూశారు. ప్రభుత్వం పరిహారం చెల్లింపు, ఆర్ఆర్ ప్యాకేజి అమలులో చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేసింది. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్లను నిర్మించారు. ఈ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహించారు. సుమారు పదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు. గొట్టిపడియ గ్రామ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 18 ఏళ్లు నిండిన వారి కుటుంబాలు సుమారు 1800 వరకు ఉన్నాయి. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 80 కుటుంబాలు, సుంకేసులలో 2,760 కుటుంబాలు, కలనూతలలో 1,040 కుటుంబాలు, గుండంచర్లలో 1,150 కుటుంబాలు, కాటంరాజుతండాలో 40 కుటుంబాలు ఉన్నాయి. గొట్టిపడియ డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల్లోని కొంత మందికి మార్కాపురం మండలం వేములకోట వద్ద, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుంకేసుల గ్రామస్తులకు మార్కాపురం మండలం గోగులదిన్నె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద, గుండంచర్ల గ్రామస్తులకు దరిమడుగు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. స్థల సేకరణ మాత్రమే ఇప్పటికీ జరిగింది. ఇప్పటి వరకు గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీంతో వర్షాకాలంలో ముంపు గ్రామాల ప్రజలు కొద్దిగా నీరు వచ్చినా క్షణ క్షణం భయంగా కాలం గడపాల్సి వస్తోంది. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి తొమ్మిదేళ్లు కావొస్తుంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు. మంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రత్యేక దృష్టి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆర్ఆర్ ప్యాకేజి అమలుపై దృష్టి సారించారు. చాలా ఆనందంగా ఉంది జగనన్న సీఎం కాగానే వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు పునరావాస పనులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవటంతో నత్తనడకన సాగాయి. 10 రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉండటంతో పాటు పునరావాస పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. – పుప్పాల మార్తమ్మ, ఎంపీటీసీ, గొట్టిపడియ జగనన్న సీఎం కాగానే మాకు నమ్మకం పెరిగింది పదేళ్లుగా మేమందరం నిర్లక్ష్యానికి గురయ్యాం. ముఖ్యమంత్రిగా జగనన్న ఎన్నిక కావటంతో వెలిగొండ ప్రాజెక్టుపై మాలో ఆశలు చిగురించాయి. కలెక్టర్ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టుపై రివ్యూ చేయటం సంతోషాన్నిచ్చింది. పునరావాస కాలనీలు త్వరగా పూర్తి చేయాలి. మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నీరు ఇవ్వాలి. – తుమ్మా వెంకటరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత, గొట్టిపడియ గ్రామం -
‘వెలిగొండ ప్రాజెక్ట్కు జాతీయహోదా ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి వంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి తప్పక ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఈవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్ట్కు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మూలంగానే రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను వైఎస్సార్సీపీ 22 ఎంపీ సీట్లు గెల్చుకుందని తెలిపారు. -
వెలిగొండతోనే ప్రకాశం
సాక్షి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. ప్రాజెక్టుతో ప్రధానంగా సాగు, తాగునీటి ఇబ్బందులు తీరతాయని, తద్వారా పరిశ్రమలు తరలివచ్చే అవకాశముందని ఆయన ప్రభుత్వానికి నివేదించనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సోమవారం విజయవాడలో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు పోలా భాస్కర్ హాజరుకానున్నారు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేసిన ఆయన సోమవారం ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితోనే ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నాటికి ఫేజ్–1 పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామన్నారు. ఆ మేరకు ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ఫేజ్–1 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. వెలిగొండ పరిధిలో ప్యాకేజీకి సంబంధించి రూ.450 కోట్లు, భూసేకరణకు రూ.240 కోట్లు, సాగర్ పరిధిలో 132 కేవీ విద్యుత్లైన్ రీలొకేట్ చేసేందుకు రూ.304 కోట్లు, ఇన్ప్రాస్టక్చర్, గృహాల నిర్మాణానికి కలిపి రూ.450 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించనున్నారు. దీంతో పాటుగా టన్నెల్–1 నిర్మాణానికి రూ.250 కోట్లు, హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.50 కోట్లు, ఫీడర్ కెనాల్ లైనింగ్కు రూ.130 కోట్లు చొప్పున రూ.450 కోట్లు అవసరమని ఇరిగేషన్ అధికారులు నివేదించారు. ఈ నిధులతో 8 లేఅవుట్ కాలనీల నిర్మాణం చేసి నీటిని విడుదల చేసే లోపు పూర్తి చేయాల్సివుంది. వెలిగొండ పూర్తయితే జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందుతుందని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వెలిగొండ నీళ్లు వస్తే కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక వాడలు పూర్తి చేయవచ్చన్నారు. రూ.56 కోట్లు కేటాయిస్తే ఏపీఐఐసీ ద్వారా నిమ్జ్కు భూసేకరణ పూర్తి అవుతుందన్నారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరువుసాయం రూ.398 కోట్లు.. జిల్లాకు కరువు సాయం రూ.398 కోట్లు రావాల్సి ఉందని దానిని వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ భాస్కర్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రధానంగా గ్రామీణ తాగునీటి రంగానికి సంబంధించి రూ.66 కోట్లు, పట్టణ తాగునీటికి సంబంధించి రూ.31.73 కోట్లు, వ్యవసాయరంగానికి సంబంధించి రూ.236 కోట్లు, పశుసంవర్దక శాఖకు సంబంధించి రూ.57.38 కోట్లు చొప్పున గత ఏడాధి రెండు సీజన్లకు సంబంధించిన పరిహారం రావాల్సి ఉందని, ఇది రిలీజ్ చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. సాగర్ ఆధునీకరణ నిధులు కోసం.. గతంలో నాగార్జున సాగర్ కుడికాలువ ఆధునీకరణ పనులు రూ.73.69 కోట్లతో చేపట్టారని 47 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని మిగిలి ఉన్న 53 శాతం పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్కు చివరి ఆయకట్టుకు నీటిని ఇవ్వవచ్చని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. రూ.47 కోట్లు నిధులు ఇస్తే మిగిలిన పనులు పూరి చేస్తామన్నారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీకి భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కలెక్టర్ నివేదించారు. ఈ ఏడాది ఒంగోలులోనే తాత్కాలిక భవనంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భోదన నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. యూనివర్సిటీకి సైతం భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అవసరమై నిధులు కేటాయిస్తుందన్నారు. వీటితో పాటు కలెక్టర్ల సదస్సులో గ్రామ సచివాలచ ఏర్పాటు, పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల నియామకాలు, పౌరసరఫరాల శాఖ ద్వారా సక్రమంగా నిత్యావసర సరుకుల పంపిణీ, అమ్మఒడి, పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సర్వశిక్షా అభియాన్ ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పెన్షన్లు తదితర అంశాలను సీఎం కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. -
‘పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రారంభింపచేస్తాం’
సాక్షి, ప్రకాశం : ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి సమీక్షించారు. జిల్లాలో గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య ఉందన్నారు. ఒంగోలు, మర్కాపురంలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కావరిడార్ పనులపై త్వరలో సమీక్షిస్తామన్నారు. రైతులకు పగటిపైట తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్రిపుల్ ఐటీ తరగతులను ఒంగోలుకు తీసుకొస్తాం : ఆదిమూలపు జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం ఇడుపులపాయలో నడుస్తోందని, ఆ తరగతులను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు త్వరలో జిల్లాల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేష్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రెండు ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాని మారుస్తామన్నారు. -
నేను ఉన్నాను...
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అధికారం వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాలో కరువును పారద్రోలుతానని జిల్లా వాసులకు హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆ హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వెలిగొండ అధికారులు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీని నెరవేర్చక చంద్రబాబు జిల్లా వాసులను వంచిస్తే సీఎం అయిన మరుక్షణమే వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి వెలిగొండను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పెన్షన్ల మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచగా ఆ వెంటనే ఆశ వర్కర్ల జీతాలను రూ.3వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇక డయాలసిస్ స్టేజీలో ఉన్న కిడ్నీ బాధితుల పెన్షన్లను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. మొత్తంగా వరుసపెట్టి అన్ని హామీలను రోజుకొకటి చొప్పున నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పశ్చిమలో కరువు దూరం.. ఇక ప్రకాశం జిల్లా వరప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో కరువును పారద్రోలేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి నీరిస్తానని జగన్ జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం సీట్లో కూర్చున్న మరుక్షణమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఇచ్చిన మాట మేర సోమవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ తాజా పరిస్థితిని ఆరా తీశారు. ఇచ్చిన మాట మేరకు మరో ఏడాదిలో పనులు పూర్తి చేసి నీరివ్వాలంటే ఏం చేయాలన్నదానిపై అధికారులను సమగ్ర నివేదిక కోరారు. తక్షణమే పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ సీఈ సుధాకర్ బాబు నేతృత్వంలో అదికారులు వెలిగొండ ఫేజ్–1 పనులను ఏడాదిలోపు పూర్తిచేసి వచ్చే సీజన్ నాటికి జిల్లాకు నీటిని విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏడాదిలోపే ఫేజ్–1 పనులు.. వెలిగొండ ప్రాజెక్టులోని ఫేజ్–1 పరిధిలో ఇంకా 2.1 కిలోమీటరు టన్నెల్ తవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 8 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వకం సాగుతోంది. టన్నెల్ తవ్వకం పనులు వేగవంతం చేయాలని, పనులు ఆగకుండా కొనసాగించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు మెగా కన్స్ట్రక్షన్స్కు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. టన్నెల్– 1 పనుల కోసం రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇక కొల్లం వాగు పరిధిలో రెండు హెడ్ రెగ్యులేటర్లు నిర్మించాల్సి ఉండగా ఫేజ్–1 పరిధిలో ఒక హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం రూ.50 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇప్పటికే హెడ్ రెగ్యులేటర్కు సంబంధించి 4 మీటర్ల మేర కాంక్రీటు పనులు జరిగాయి. శ్రీశైలం రిజర్వాయర్లోకి నీరు చేరక ముందే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్ మేర లైనింగ్ చేయాల్సి ఉంది. ఇందు కోసం మరో రూ.130 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఇక ఆర్అండ్ ఆర్ పనులకు మరో రూ.400 కోట్లు అవసరం అవుతుంది. గొట్టిపడియపై డిస్ట్రిబ్యూటరీలు, తీగలేరు పై స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ.1000 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఈ పనులను పూర్తి చేస్తే గిద్దలూరు నియోజకవర్గంలోని అర్థవీడు, కంభం, బేస్తవారిపేట మండలాల పరిధిలో 22వేల ఎకరాలు, మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, తర్లుపాడు మండలాల పరిధిలో 30,700 ఎకరాలు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లల చెరువు, పెద్దారవీడు, వైపాలెం, దోర్నాల, త్రిపురాంతకం మండలాల పరిధిలో 66,300 ఎకరాలు మొత్తం 1.19 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. 300కు పైగా గ్రామాల పరిధిలోని ప్రజలకు తాగునీరు అందుతుంది. సీఎం జిల్లా వాసులకు హామీ ఇచ్చిన మేరకు ఫేజ్ –1 పనులను ఏడాది తిరక్కుండానే పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రెండుమూడు రోజుల్లో మరో మారు సీఎంను కలిసి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఈ సమయానికి వెలిగొండ టన్నెల్–1 ద్వారా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. బాబు హయాంలో అంతా అదిగో.. ఇదిగో.. ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు సర్కారు వెలిగొండను గాలికొదిలింది. అంతకు ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో దాదాపు 70 శాతం పనులు పూర్తి కాగా బాబు హయాంలో పట్టుమని పదిశాతం పనులు కూడా ముందుకు సాగలేదు. పనులు చేయకపోయినా అదిగో నీరిస్తాం.. ఇదిగో నిరస్తామంటూ చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు జిల్లా వాసులను వంచనకు గురి చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి పీఠం అధీష్టించిన వెనువెంటనే వెలిగొండ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మాట తప్పని.. మడమ తిప్పని వ్యక్తి అని కొనియాడుతున్నారు. వెలిగొండ పూర్తి అయితే ప్రకాశం జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. -
మోదీకి ప్రకాశం వాసుల ఝలక్..
సాక్షి, ప్రకాశం: తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వినూత్న మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తూ తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు అవశ్యకతను చాటిచెప్పుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ బరిలో నిలుస్తున్న వారాణాసి లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మలు శుక్రవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పలువురు స్థానికులు కూడా వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాళభైరవ ఆలయం వద్ద వెలిగొండ పోరాట సాధన సమితి సభ్యులు నిరసన తెలిపారు. కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్నారు. ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. మరోవైపు మోదీపై పోటీ చేయడానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు కూడా గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని నిజామాబాద్ రైతులు పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో రైతులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీ కవిత బరిలో నిలిచిన నిజామాబాద్ స్థానం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అక్కడ ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఇబ్బందికరంగా మారింది. -
ఏళ్లుగా ఏమార్చుతున్నారు..!
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ప్రజల ఆశాదీపం, జీవధార అయిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల పనులు మందకొడిగానే సాగుతున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి పబ్బం గడుపుకోవడం మినహా గడచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం సాధించేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ సంవత్సరాంతానికి పూర్తిచేస్తాం.. సంక్రాంతికి నీరిచ్చేస్తాం అంటూ ప్రకటనలు చేసి జిల్లా ప్రజల్ని ఏమార్చుతూ వచ్చారు. కానీ, ఏ ఒక్క మాట నెరవేరలేదు. బోరింగ్ యంత్రాలతో పనులకే బ్రేక్.. కొంతకాలంగా బోరింగ్ యంత్రాలు మరమ్మతులకు గురికావటంతో సొరంగాలను తొలిచే ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. కొండను తొలిచే మెషీన్లకు అనుసంధానం చేసే పంపుల కోసం కొన్ని నెలల క్రితం ఇటలీ నుంచి ఆర్డరు చేశారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో షిప్పుల ద్వారా నౌకాశ్రయాలకు చేరుకున్నాయి. అక్కడ నుంచి వాటిని వెలిగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చారు. మొత్తం ఆరు పంపులు తెప్పించిన కాంట్రాక్టర్లు వాటిలో రెండింటిని రెండు మెషీన్లకు బిగించారు. మరో నాలుగు పంపులను అందుబాటులో ఉంచారు. దీంతో దాదాపు 14 రోజుల నుంచి బోరింగ్ మెషీన్లు కొండను తొలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. రోజుకు ఒక్కో సొరంగం 10 నుంచి 15 మీటర్లు తవ్వాల్సి ఉంటే అందులో సగం కూడా తవ్వలేకపోతున్నాయి. సొరంగంలో ముడిరాయి పడటం వల్లనే తవ్వకాలు ఆలస్యమవుతున్నాయన్నది జలవనరుల శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న మాట. రోజుకు మొదటి సొరంగంలో 5.5 నుంచి 6 మీటర్లు మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రెండో సొరంగంలో కేవలం 3 మీటర్లు మాత్రమే తవ్వకాలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లను మార్చి ఏం లాభం? ప్రాజెక్టు పనులతో పాటు రెండు సొరంగాల తవ్వకం పనులు ముందుకు సాగటం లేదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లనే మార్చింది. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా పనులు మాత్రం ముందుకుసాగలేదు. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు ఇప్పించుకున్నా పనుల విషయంలో నత్తే నయం అన్న నానుడిగా తయారైంది. వందల, వేల కోట్లు ప్రజాధనం ఆవిరై పోతున్నా నిర్మాణ ఆశయం మాత్రం నెరవేర్చలేదని జిల్లా ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా చెప్పిన ఏ ఒక్క మాట కూడా నెరవేరలేదు. 2018 జూన్ కల్లా పూర్తి చేసి నీరు ఇస్తామని గతంలో చెప్పారు. ఆ తరువాత సంవత్సరం ఆఖరుకు అని ఘంటా పథంగా చెప్పి ప్రజలను ఏమార్చారు. 2018 సంవత్సరం మొదట్లో పనులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పటికీ అదే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన మాటకే దిక్కులేకపోతే ఇక ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో, అసలు ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా లేదా అన్న సందేహంలో జిల్లా ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్నారు. పాత కాంట్రాక్టర్లను తప్పించిన ప్రభుత్వ పెద్దలు వాళ్లకు అనుకూలమైన వారికి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. మొదటి టన్నెల్ పనులను మేఘ కాంట్రాక్టర్లకు, రెండో టన్నెల్ పనులను రిత్విక్ కాంట్రాక్ట్ కంపెనీకి అప్పగించారు. చివరకు ఏళ్ళ తరబడి జిల్లా ప్రజలను ఏమార్చుతేనే ఎట్టకేలకు 2019 సాధారణ ఎన్నికలను కూడా పూర్తి చేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కింది. 2022 కూడా కష్టమే.. వెలిగొండ రెండో టన్నెల్ పనులు రోజుకు కనీసం 4 మీటర్లు కూడా ముందుకు సాగటం లేదు. సరాసరిన 3 మీటర్లు మాత్రమే టన్నెల్ బోరింగ్ మెషీన్లు తొలుస్తున్నాయి. వాస్తవానికి రోజుకు 10 నుంచి 15 మీటర్లు మేర రెండో టన్నెల్ను తొలచాల్సి ఉంది. ఈ విధంగా పనులు జరిగితే 2022 సంవత్సరానికి కూడా పనులు సాగవని నిపుణులు చెబుతున్నారు. మొత్తం రెండో టన్నెల్ దాదాపు 19 కిలో మీటర్లు మేర సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 11 కిలో మీటర్ల మేర తవ్వారు. ఇంకా 8 కిలో మీటర్లు తవ్వాలి. ఇకపోతే మొదటి టన్నెల్ రోజుకు సరాసరిన 12 మీటర్లు తవ్వాలి. అయితే అదికాస్తా రోజుకు 5.5 నుంచి 6 మీటర్ల మేర మాత్రమే తవ్వగలుగుతున్నారు. ఇది మొత్తం 18.8 కిలో మీటర్లు సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. ఇంకా మొత్తం 3.5 కిలో మీటర్లు తవ్వాల్సి ఉంది. మొబలైజేషన్ కింద రూ. 84.2 కోట్లు వెలిగొండ పనులు ముందుకు సాగటానికి అంటూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్ కింద రూ. 84.2 కోట్లు కూడా విడుదల చేసింది. విడుదల చేసి కూడా నెలలు గడుస్తోంది. అయినా ఇటలీ నుంచి ఆరు పంపులను మాత్రమే తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు ఇంకా మెషీన్లకు సంబంధించిన విడిభాగాలు తెప్పించాల్సి ఉంది. మరి వాటిని ఎప్పటికి తెప్పిస్తారో వేచి చూడాలి. పనులు ముందుకు సాగటంలో ముఖ్యమంత్రి మాటకే దిక్కు లేకుండా పోయింది. 2018 ఆఖరుకు పనులు పూర్తి చేసి జిల్లాతో పాటు వైఎస్సార్ కడప జిల్లా ప్రజలకు కూడా నీరిస్తానని చెప్పిన చంద్రబాబు మాట నీటి మూటగానే మిగిలిపోయింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలో కొల్లం వాగు వద్ద చేపట్టిన హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ముడిరాయి పడటంతో ఆలస్యం... సొరంగాల్లో ముడి రాయి వస్తుండటంతో తవ్వకాలు ఆలస్యమవుతున్నాయి. వడివడిగా తవ్వటం వలన మెషీన్లు మరమ్మతులకు గురవుతాయన్న ఉద్దేశంతోనే నిదానంగా పనులు చేస్తున్నారు. ఒకవేళ పంపులు చెడిపోయి ఆటంకం ఏర్పడితే ఇంకా ఆలస్యమవుతుందేమోనని జాగ్రత్తగా పనులు చేపడుతున్నారు. మెషీన్లకు సంబంధించిన పంపులను అదనంగా అందుబాటులో ఉంచాం. కొల్లంవాగు వద్ద డిజైన్లు పూర్తయి వారం పది రోజుల్లో కాంక్రీటు పనులు ప్రారంభిస్తాం. ఒక సొరంగం 20 మీటర్లు, మరో సొరంగం 10 మీటర్లు తవ్వగలిగాం.– బి.సుధాకర్బాబు,జలవనరుల శాఖ జిల్లా చీఫ్ ఇంజనీరు -
బాబు చెప్పే మాయ మాటలు కుర్చీలినాల్సిందే.!
సాక్షి, ప్రకాశం: ‘‘బాగున్నారా తమ్ముళ్లూ.. ఐదేళ్లూ పాలన బ్రహ్మాణ్నంగా చేశాం. అందరూ ‘మళ్లీ మీరే రావాల’నే పరిస్థితికొచ్చారు. వర్షాలు కురవకపోయినా రైతులను ఆదుకునేందు కోస్రం రెయిన్గన్లిచ్చాము. వెలిగొండ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి భూములను సస్యశామలం చేస్తా. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీపోయి ధర్నా చేస్తే అందరూ మనల్నే చూశారు. పార్లమెంట్లో హోదా కోస్రం పోరాడింది మన ఎంపీలే. మనం రాజీనామాలు చేసేందుకు ముందుకొస్తే ఈ నరేంద్ర మోడీ భయపడ్డాడు. అటుపక్క కేసీఆర్ను చూస్తే డ్రామాలాడుతున్నాడు. మోసం చేసేవాళ్లను నమ్ముతారా.. గట్టిగా రెండు చేతులూ పైకెత్తి మీ మద్దతు తెలపండి. మరొక్కసారి అడుగుతున్నా.. మోసం చేసే వాళ్లను నమ్ముతారా..?’’ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో ఇదీ సీఎం చంద్రబాబుగారి వరుస.. ప్రజలేమనకుంటారోననే బెరుకు లేకుండా గంటల తరబడి చంద్రబాబు ఉపన్యాసాలివ్వడం.. అవి విన్నోళ్లు టీ కొట్లు, రచ్చబండల మీద చర్చకు పెట్టడం(బాబు గారి మాటల గారడీపై ఎల్లో మీడియా ఎలాగూ చర్చలు పెట్టదులెండి).. ఎన్నికల సమయం కదా.. ఎక్కడ నలుగురు కలిసినా చంద్రబాబు గారి హామీలు, ఆయన చెబుతున్న మాటలే సెంటర్ పాయింట్. ‘‘రైతుల రుణాలు మొత్తం ఒకేసారి మాఫీ చేస్తానన్నాడు ఎక్కడ చేశాడు.. ఇరవై వేలో, ముప్పై వేలో వస్తే వడ్డీకిపాయె. ఇంకెక్కడ ఆయన మాఫీ చేసింది. బాబు సీఎం అయినప్పుడు డ్వాక్రా రుణాలు రూ.11 వేల కోట్లుంటే.. ఇప్పుడు పాతిక వేల కోట్లయింది. బాబు కుర్చీ ఎక్కినప్పటి నుంచి చినుకు రాలిందా చెప్పు.. నీళ్లు చెమ్మ లేకుండా రెయిను గన్నులు ఏమి చేసుకోను’’. ‘‘ఏమీ చేయకుండా అన్నీ చేశానని చెప్పుకుంటే జనం నమ్ముతరా. మళ్లీ.. ‘తమ్ముళ్లూ నన్ను నమ్మండి.. నమ్మండి’ అని ఓట్ల కోసం దేబిరిస్తున్నాడు. ఆ తెలుగుదేశపోళ్లు కూడా చంద్రబాబు చెప్పే మాటలినలేక సభలకు కూడా పోవడం లేదు. కుర్చీలన్నీ ఖాళీగుంటున్నాయి. బాబు చెప్పే మాటలు ఆ కుర్చీలినాల్సిందే’’. ‘‘ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడుతుంటే మద్దతివ్వకుండా ఎదురు తిట్టిండు. జనమంతా జగన్ పక్కకు ఎక్కడ పోతారోనని హోదా కావాలని డ్రామా ఆడుతున్నాడు. నల్లచొక్కా ఒకటేసుకుని ఊర్లమ్మటి తిరిగి గవర్నమెంట్ సొమ్ము కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ పనేదో ముందే చేసుంటే ఈపాటికి హోదా వచ్చేది కదా..’’ ‘‘ఆ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానని నాలుగుసార్లు తిరిగిండు. అదిప్పటి వరకు పూర్తి కాలేదు..’’ రచ్చబండల మీద చర్చలు ఇలా సాగిపోతున్నాయ్. -
బొల్లినేనికి బంపరాఫర్
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో కాకర్ల గ్యాప్ పనుల్లో సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ సంస్థకు రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చెప్పడం ఆలస్యం.. ఆయన సూచనలు పాటిస్తూ ఆగమేఘాలపై సదరు కాంట్రాక్టర్కు బంపర్ ఆఫర్ కింద ఈ అ‘ధన’పు సొమ్ము మంజూరు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీపీ) మౌలిక సూత్రాల్ని తుంగలో తొక్కేశారు. డిజైన్ మారడం వల్ల కాంట్రాక్టర్ అదనపు పనులు చేయాల్సి వచ్చిందని.. ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించాల్సి వస్తోందంటూ ఉత్తర్వుల్లో సమర్థించుకోవడం గమనార్హం. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా కాంట్రాక్టర్కు అదనపు లబ్ధి చేకూర్చుతూ ఇలా ఉత్తర్వులు జారీ చేయడాన్ని జలవనరుల శాఖ వర్గాలే తప్పుపడుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా కాకర్ల గ్యాప్ను పూడ్చటం ద్వారా ఎన్వోఎఫ్ డ్యామ్ నిర్మించి.. దాని ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు పనుల్ని రూ.206.80 కోట్లకు ఎస్సీఎల్–బీఎస్పీసీఎల్(జేవీ) 2005లో దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పనులు పూర్తి కావాలి. కానీ పనులు పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయినా పనులు పూర్తి చేయలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్పై అమితప్రేమ చూపింది. డిజైన్ మారడంతో 30 కాంక్రీట్ నిర్మాణాల స్థానంలో 48 నిర్మించాల్సి వస్తోందని.. ఆ మేరకు అదనపు బిల్లులివ్వాలని ఆ సంస్థ 2015లో సర్కార్కు ప్రతిపాదనలు పంపింది. ఈపీసీ విధానానికి ఇది విరుద్ధమని జలవనరులశాఖ అధికారులు తోసిపుచ్చారు. అయితే సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో జిల్లా స్థాయి స్టాండింగ్ కమిటీ(డీఎల్ఎస్సీ), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)లకు ఈ ప్రతిపాదనలను పంపారు. ఆ కమిటీల్లోని అధికారులపై ఒత్తిడి తెచ్చి అదనపు బిల్లుల మంజూరుచేసేలా ప్రతిపాదన చేయించారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి ఇంటర్నల్ బెంచ్మార్క్ కమిటీ(ఐబీఎం) తిరస్కరిస్తూ వచ్చింది. ఐబీఎం కమిటీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అదనపు నిధులిచ్చే ప్రతిపాదనపై చంద్రబాబు ఆమోదముద్ర వేయించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టర్కు అదనపు లబ్ధి కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయకూడదు. కానీ సీఎం సూచనల మేరకు బొల్లినేనికి రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ ఉత్తర్వులు జారీ చేసేశారు. -
టన్నెళ్లలో టన్నుల్లో అవినీతి
సాక్షి, అమరావతి: రోజుకు ఐదారు మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వుతున్నారనే నెపంతో పాత కాంట్రాక్టర్లపై ప్రభుత్వ పెద్దలు వేటు వేశారు. సొరంగాల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, టెండర్ నిబంధనలను అడ్డుపెట్టుకుని కోటరీ కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినప్పుడు మొదటి విడత కమీషన్లు దండుకున్నారు. సొరంగాలను తవ్వే టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కొత్త బుష్లు, కన్వేయర్ బెల్ట్లు అమర్చి మరమ్మతులు చేసేందుకు రూ.245.63 కోట్లను కేటాయించేశారు. అయితే అవేమీ చేయకనే ఆ నిధులను కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు మింగేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జి లో 4.47లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 15.25లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును 2005లో రూ.5,150 కోట్లతో చేపట్టారు. తన హయాంలో రూ.3,433.84 కోట్లను ఖర్చుచేసి 75 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. డిసెంబర్ 2016 నాటికే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు జూన్ 2, 2016న ప్రకటించారు. ఆ క్రమంలో సొరంగాల పనులను వేగంగా పూర్తి చేయాలంటే.. టీబీఎంలకు కొత్త బుష్లు, కన్వేయర్ బెల్ట్లు అమర్చాలని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. నిబంధనలను తుంగలో తొక్కి రూ.68.44 కోట్లను జూన్ 5, 2016న సర్కార్ మంజూరు చేసింది. కానీ.. టీబీఎంలకు ఎలాంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి ఆ నిధులను కాంట్రాక్టర్లతో కలిసి కీలక మంత్రి మింగేశారు. దాంతో రోజుకు ఐదారు మీటర్ల చొప్పున మాత్రమే సొరంగాల పనులు జరిగేవి. జనవరి, 2019 నాటికి మొదటి సొరంగం, ఆగస్టు, 2019 నాటికి రెండో సొరంగం పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు జూన్ 8, 2018న మరోసారి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ను 18.8 కిమీలు తవ్వాలి. జూన్, 2018 వరకూ 15.2 కిమీల పనులు పూర్తయ్యాయి. రెండో టన్నెల్ను 18.787 కిమీలు తవ్వాలి. జూన్, 2018 వరకూ 10.750 కి.మీలు పూర్తయ్యాయి. రోజుకు ఐదారు మీటర్ల మేర కూడా పనులు చేయడం లేదనే నెపంతో.. పాత కాంట్రాక్టర్లపై చంద్రబాబు వేటు వేయించారు. మొదటి సొరంగం పనుల్లో రూ.116.447 కోట్లు.. రెండో సొరంగంలో రూ.299.48 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. మొదటి సొరంగం పనుల వ్యయాన్ని రూ.292.15 కోట్లకు, రెండో సొరంగం పనుల వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేశారు. రోజుకు కనీసం సగటున పది మీటర్ల చొప్పున సొరంగం తవ్వాలనే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. మొదటి టన్నెల్ పనులను రూ.245.39 కోట్లకు మేఘకు, రెండో టన్నెల్ పనులను రూ.597.11 కోట్లకు రిత్విక్కు గత నవంబర్లో కట్టబెట్టారు. మొబిలైజేషణ్ అడ్వాన్సుల కింద రూ.84.2 కోట్లను ఇచ్చేసి.. వాటినే తొలి విడత కమీషన్ల కింద వసూలు చేసుకున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తే మొదటి సొరంగం మార్చి 2020 నాటికి రెండో సొరంగం పనులు జనవరి, 2021 నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాత కాంట్రాక్టర్లను కొనసాగించినా అదే సమయానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉండేదని, ప్రభుత్వానికి రూ.596.36 కోట్లు ఆదా అయ్యేవని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
వెలిగొండ ప్రాజెక్ట్ పై సాక్షి స్పెషల్ ఫోకస్
-
మరమ్మతుల పేరుతో రూ.245.63 కోట్ల దోపిడీ
సాక్షి, అమరావతి : రోజుకు ఐదారు మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వుతున్నారనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై ప్రభుత్వ పెద్దలు వేటువేశారు. ఆ తర్వాత దాని అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి ఆ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను కమీషన్లుగా దండుకున్నారు. సొరంగాలను తవ్వే టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కొత్త బుష్లు, కన్వేయర్ బెల్ట్లు అమర్చకుండానే అమర్చినట్లుగా, మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.245.63 కోట్లను కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు మింగేశారు. వెలిగొండ ప్రాజెక్టులో జరుగుతున్న ఈ బాగోతం వివరాలివీ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 4.47లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును 2005లో రూ.5,150 కోట్లతో చేపట్టారు. తన హయాంలో 75 శాతానికిపైగా పనులు పూర్తిచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్.. డిసెంబరు 26నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి ప్రకాశం జిల్లాకు నీరందిస్తామని 2016 జూన్ 2న సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ క్రమంలో సొరంగాల పనులను శరవేగంగా పూర్తిచేయాలంటే టీబీఎంలకు కొత్త బుష్లు, కన్వేయర్ బెల్ట్లు అమర్చాలని కాంట్రాక్టర్లు చేసిన ప్రతిపాదనలను సర్కార్ ఆమోదించి రూ.68.44కోట్లను మంజూరు చేసింది. కానీ.. టీబీఎంలకు ఎలాంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి ఆ నిధులను కాంట్రాక్టర్లతో కలిసి కీలక మంత్రి మింగేశారు. దీంతో రోజుకు ఐదారు మీటర్ల చొప్పున మాత్రమే సొరంగాల పనులు జరుగుతుండడంతో సీఎం మాటమార్చారు. జనవరి, 2019 నాటికి మొదటి సొరంగం, ఆగస్టు, 2019 నాటికి రెండో సొరంగం పూర్తిచేస్తామని జూన్ 8, 2018న చెప్పారు. రోజుకు పది మీటర్ల లక్ష్యంతో.. 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో 3.6కి.మీ, రెండో టన్నెల్లో 8.037కి.మీ.ల పనులు మిగిలాయి. రోజుకు ఐదారు మీటర్ల మేర కూడా పనులు చేయడంలేదనే సాకుతో.. పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద ముఖ్యనేత సూచనలతో వేటు వేయించారు. దీంతో మొదటి సొరంగం పనుల్లో రూ.116.447 కోట్లు, రెండో సొరంగంలో రూ.299.48 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. ఆ తర్వాత ధరల సర్దుబాటు, పనుల పరిమాణం పెంచి అదనపు చెల్లింపుల ద్వారా ఆ విలువను మొదటి సొరంగానికి రూ.186.31కోట్లు, రెండో సొరంగం విలువను రూ.479.17కోట్లుగా జలవనరుల శాఖాధికారులు నిర్ణయించారు. ఇక ఈ పనులలో భారీ కమీషన్లు వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇందుకు అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. దీంతో టీబీఎంల బుష్లు, కన్వేయర్ బెల్ట్ మార్చడం పేరుతో మొదటి సొరంగం పనుల వ్యయాన్ని రూ.292.15 కోట్లకు, రెండో సొరంగం వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేసి రోజుకు సగటున పది మీటర్ల చొప్పున సొరంగం తవ్వాలనే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. మొదటి టన్నెల్ పనులను రూ.245.39 కోట్లకు ‘మేఘ’కు, రెండో టన్నెల్ పనులను రూ.597.11 కోట్లకు రిత్విక్కు గత నవంబర్లో కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.84.2 కోట్లను ఇచ్చేసి వాటినే తొలి విడత కమీషన్ల కింద వసూలు చేసుకున్నారు. మాయచేసి దోచేశారు.. కానీ, నవంబరు నుంచి ఇప్పటివరకూ మొదటి సొరంగంలో రోజుకు సగటున ఐదు మీటర్లు, రెండో సొరంగంలో రెండు మీటర్ల చొప్పున మాత్రమే పనులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశాన్ని ప్రతి సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షల్లో వెలిగొండ అధికారులు చెబుతున్నా పట్టించుకునే నాథుడులేడు. టీబీఎంలకు బుష్లు, బెల్ట్లు అమర్చకుండానే అమర్చినట్లు చూపి మొదటి సొరంగంలో రూ.86.88 కోట్లు, రెండో సొరంగంలో రూ.158.75 కోట్లు వెరసి రూ.245.63 కోట్లను దోచుకున్నారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు.. పనులు పూర్తికాకపోవడంతో గడువును మరోసారి పెంచారు. అయినా.. మొదటి సొరంగం మార్చి 2020, రెండో సొరంగం పనులు జనవరి 2021 నాటికి కూడా పూర్తయ్యే అవకాశాల్లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు. పాత కాంట్రాక్టర్లను కొనసాగించినా అదే సమయానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉండేదని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.596.36 కోట్లు ఆదా అయ్యేవని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
బాబుది పూటకో మాట..తడవకో అబద్ధం
పెద్దదోర్నాల: పూటకో మాటతో, తడవకో అబద్ధంతో మభ్య పెడుతున్న మిమ్మల్ని ప్రజలెలా నమ్ముతారు బాబు అని సంతనూతలపాడు ఎమ్మెల్యే, యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని కటకానిపల్లెలో జరిగిన నిన్ను నమ్మం బాబు–2 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడును ప్రజలెలా నమ్ముతారు అని ప్రశ్నించారు. ఇప్పుడు గుర్తుకు వచ్చారా బీసీలు..? బీసీ వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీసీలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని బీసీలకు సమ న్యాయం జరగాలంటే జగనన్న నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అధికారంలోకి రాగానే పూర్తిగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, అందరికీ ఇళ్లు నినాదాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నరేళ్లయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 2014 మోడీతో పొత్తు పెట్టుకుని సోనియాగాంధీని విమర్శించిన చంద్రబాబు నేడు మోడీని తిడుతూ రాహల్, సోనియా గాంధీ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం కక్కుర్తి కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టు అంచనాలను అమాంతం పెంచిన ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులు తన అనుయాయులకు అప్పగించారన్నారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసి గడిచిన సంక్రాతికే నీరిస్తామన్న హామీని నిలబెట్టుకోలేని మిమ్మల్ని ప్రజలెలా విశ్వసిస్తారు బాబూ అంటూ ప్రశ్నించారు. జగన్తోనే వెలిగొండ పూర్తి జగన్మోహన్రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి వస్తున్నారని, వైఎస్ జగన్ మోహనరెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, వెలిగొండ ప్రాజెక్టు జగన్తోనే పూర్తవుతుందన్నారు. ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మోసాలు గుర్తించాలని కోరారు. కటకానిపల్లెలో కార్యకర్తలు భారీ భైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే సురేష్ భారీ ర్యాలీతో గ్రామంలో పర్యటించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అ«ధ్యక్షుడు జంకె ఆవులరెడ్డి, నూర్ బాషాల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు రసూల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు లాలూనాయక్, నాయకులు దండా సుబ్బారెడ్డి, బొల్లేపల్లి సీతయ్య, నల్లబోతుల వెంకటేశ్వర్లు ,చిట్యాల లక్ష్మీరెడ్డి, యక్కంటి మల్లారెడ్డి, వెన్నా కాశిరెడ్డి, కర్రా మల్లారెడ్డి, వల్లభనేని పవన్కుమార్, అల్లు రాంభూపాల్రెడ్డి, గొల్మారి ఆంజనేయరెడ్డి, అలుగుల లక్ష్మయ్య, మాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వెలిగొండను నేనే ప్రారంభిస్తా..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తానే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రామాయపట్నం పోర్టు, ఏషియన్ పల్ప్ పేపరు పరిశ్రమల స్థాపనకు గుడ్లూరు మండలం రావూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పైలాన్లను ఆవిష్కరించారు. నాలుగున్నరేళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయని చంద్రబాబు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సభలో మరోమారు వెలిగొండను తానే పూర్తి చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఈ ఏడాది నీరిస్తానంటూ ప్రకటించడం తప్ప పనులు పూర్తి చేసింది లేదు, నీటిని విడుదల చేసింది లేదు. ఇప్పుడు తాజాగా తేదీ చెప్పకుండా వెలిగొండను తానే ప్రారంభిస్తానని చెప్పి తప్పించుకోవడం పై అధికార పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇక ఒంగోలులో యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరై మూడేళ్లు దాటుతున్నా దీనికి సంబంధించి ఒక్క భవనాన్ని కూడా నిర్మించని చంద్రబాబు జిల్లాకు ట్రిపుల్ ఐటీ ఇచ్చిన చెప్పారు. హార్టికల్చర్ కాలేజీ ఇచ్చామన్నారు. రూ.469 కోట్లతో ఎన్నెస్పీ కుడి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. రూ.275 కోట్లతో నీరు–చెట్టు పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ను దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే 95 శాతం పనులు పూర్తి చేయగా గడిచిన నాలుగున్నరేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులను కూడా పూర్తి చేయలేదు. అయినా రూ.90 కోట్లతో గుండ్లకమ్మ రిజర్వాయర్ను తామే పూర్తి చేసినట్లు రామాయపట్నం సభలో చంద్రబాబు ప్రకటించారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తామే పూర్తిచేశామని త్వరలోనే జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలో ఒంగోలు జాతి పశువులను కాపాడేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా పశు ప్రదర్శన, పశువులకు పోటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలో 7 జాతీయ రహదారులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జన్మభూమిలో వినతి పత్రాలు ఇచ్చిన అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టులు రామాయపట్నం వద్ద 3,200 ఎకరాలలో రూ.4,500 కోట్ల వ్యయంతోరామాయపట్నం పోర్టు, రావూరు, చేవూరు గ్రామాల మధ్య 2,400 ఎకరాలలో రూ.24,500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని, ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. పేపర్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సంబం«ధించి రాష్ట్ర ప్రభుత్వం, ఇండోనేషియాకు చెందిన పేపర్ ఉత్పత్తి పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, ముత్తమల అశోక్రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, డోలా బాలవీరాంజనేయ స్వామి, కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, విజయ్కుమార్, కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు, ఏపీ పోర్ట్స్ చైర్మన్ ప్రవీణ్ కోయ, పేపరు పరిశ్రమ ప్రతినిధులు విజయ, సురేష్ కొల్లం, జోసఫ్, జిల్లా కలెక్టరు వి.వినయ్చంద్, జాయింట్ కలెక్టరు నాగలక్ష్మీ, ట్రైనీ కలెక్టరు నిశాంతి, ఆర్డీఓ కెఎస్ రామారావు, స్టెప్ సీఈఓ రవి, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
వెలిగొండ నీళ్లు ఏ సంక్రాంతికి బాబూ?
యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి సంక్రాంతి నాటికి నీళ్లు ఇస్తానన్నావు, ఏ సంక్రాంతికి నీళ్లు ఇస్తావన్న విషయం స్పష్టం చేయలేదని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. వైవీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలు సాగునీరు మాట అటుంచి తాగునీటి కోసం అల్లాడుతుంటే టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పశ్చిమ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీరు తాగి మరణిస్తున్నా.. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని ఆయన అన్నారు. ఫ్లోరైడ్ నీటితో జిల్లాలో దాదాపు 500 మంది మరణించినా టీడీపీ నాయకులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కరువుతో అలమటిస్తోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని, రైతు ఆత్మహత్యలు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కరువు పీడిత ప్రాంత ప్రజలను ఆదుకోవటానికి పశ్చిమ ప్రకాశంను సస్యశ్యామలం చేయటానికి వైఎస్సార్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి 70 శాతం పనులు పూర్తి చేశారని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, పర్సెంటేజీల కోసం కాంట్రాక్టర్ను మార్పు చేశారని విమర్శించారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలని తాను 3 నెలల క్రితం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన కనిగిరి నుంచి పాదయాత్ర చేసినా ప్రభుత్వం కళ్లు తెరవలేదన్నారు. జగన్తోనే వెలిగొండ సాధ్యం: టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ఆ పెద్దమనుషులు అధికారం చేజిక్కించుకొని ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని వైవీ విమర్శించారు. ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే వెలిగొండ ప్రాజెక్టు సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. జగన్ సీఎం అయిన సంవత్సరంలోపేప్రాజెక్టును పూర్తి చేస్తారని అన్నారు. సీఎం అఫిడవిట్ వల్లే హైకోర్టు మార్పు: ఏపీలో హైకోర్టు డిసెంబర్ 15 నాటికి సిద్ధం అంటూ సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ప్రకారమే హైకోర్టును తరలించేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా అమరావతిలో రాజధాని నిర్మిస్తూనే ఉన్నావు.. అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయిన వాడివి హైకోర్టు సిద్ధం అంటూ అఫిడవిట్ ఏ విధంగా ఇచ్చావని ఆయన ప్రశ్నించారు. కాసుల కోసం పాకులాడుతున్నారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చరిష్మా, ఆ పార్టీ గుర్తుతోపాటు వైఎస్సార్ బొమ్మను అడ్డుపెట్టుకొని గెలిచిన ప్రజాప్రతినిధులు అధికార దాహంతో పార్టీ ఫిరాయించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. వారికి అధికారం ఉన్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టును గాలికి వదిలివేసి కాసుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులను త్యాగం చేయడం వల్లనే అని ఆయన అన్నారు. పదవులు ప్రధానం కాదని, ప్రజాసేవే పరమావధిగా భావించించిన వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నారని ఆయన కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారని, పేదల వద్దకు వైద్యం తీసుకొని వెళ్లేలా మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారని ఆయన అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకుడు వెన్నా హనుమారెడ్డి, వైపాలెం ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పెద్దారవీడు, పెద్దదోర్నాల జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు డి.కిరణ్గౌడ్, యు.శ్రీనివాసరెడ్డి, జె.ఆవులరెడ్డి, పి.చంద్రమౌళిరెడ్డి, సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర నాయకులు కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, కె.ప్రమీల, ధనలక్ష్మిబాయి, అరుణాబాయి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మారిన బాబు మాట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు మాట మార్చారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని చాలా కాలంగా చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి శుక్రవారం వెలిగొండను సందర్శించిన అనంతరం ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. అది సాధ్యం కాకపోతే లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేస్తామని కొత్తపల్లవి అందుకున్నారు. ఈలెక్కన ఫిబ్రవరికి పనులు జరిగే పనికాదన్న విషయం బాబు చెప్పకనే చెప్పినట్లైంది. విశేషం ఏమిటంటే ఏప్రిల్ నెలలో ఆగిపోయిన టన్నెల్ నిర్మాణ పనులు ముఖ్యమంత్రి వచ్చే నాటికి ప్రారంభం కాలేదు. మరో నెల రోజులకు కూడా పనులు మొదలయ్యే పరిస్థితి లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వెలిగొండను బాబు సర్కారు గాలికి వదిలినట్లే లెక్క. పశ్చిమ ప్రాంతంలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. దీంతో ఈ ప్రాంతంపై చంద్రబాబుకు అక్కసు ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు సాగు, తాగునీరు లేక అష్ట కష్టాలు పడుతున్నా బాబు సర్కారుకు కనికరం కలగలేదు. పలుమార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు జిల్లావాసులు తనకు సహకరించలేదని బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన బాబు మరుసటి ఏడాది వెలిగొండ నీరిస్తానని పేరుకు ప్రకటించినా పనుల సంగతి గాలికొదిలారు. అంచనాలు పెంచుకుని దాదాపు రూ.3 వేల కోట్లు కొల్లగొట్టినా పనులు మాత్రం వేగవంతం చేయలేదు. ఇప్పటికి టన్నెల్ 1లో మూడు కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉండగా టన్నెల్ 2లో 8 కిలోమీటర్ల పనులు అలాగే ఉండిపోయాయి. ఇక ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులు ఇటీవలే మొదలైనా పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి వెలిగొండ పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పడం తప్ప పనులు వేగవంతం చేసిన పాపాన పోలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. కాంట్రాక్టర్ల మార్పుతో టన్నెల్ పనులు ఏప్రిల్ నెలలోనే ఆగిపోయాయి. కొత్త కాంట్రాక్టర్లు వచ్చినా పనులు మొదలు పెట్టలేదు. తీరా ఎన్నికల ఏడాది వచ్చేసరికి బాబుకు వెలిగొండ గుర్తొచ్చింది. పశ్చిమ ప్రాంతవాసులు ఓట్లు, సీట్లు అవసరమొచ్చాయి. ఇప్పుడు వెలిగొండ పూర్తి చేస్తానంటూ బాబు మరోమారు జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నానికి దిగారు. నిన్న మొన్నటి వరకు జనవరి, సంక్రాంతికి నీరిస్తానని చంద్రబాబు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆగిపోయిన పనులు మొదలు కాలేదు. పోలవరం తరహాలో ప్రతినెలా వెలిగొండ పై రివ్యూ చేసి పనులు పూర్తి చేస్తానని బాబు గొప్పగా చెప్పినా దాని ఊసేలేదు. ఎట్టకేలకు శుక్రవారం చంద్రబాబు వెలిగొండను సందర్శించారు. కనీసం ముఖ్యమంత్రి వచ్చే సమయానికైనా పనులు మొదలవుతాయని ఆశించారు. కానీ పనులు మొదలు కాలేదు. బాబు వచ్చి వెలిగొండ టన్నెల్ చూడడం మినహా చేసిందేమీ లేదు. త్వరలో పనులు పూర్తి చేసి ఫిబ్రవరికి నీరిస్తానని చంద్రబాబు పైకి చెప్పినా ఆ మాటపై ఆయనకే నమ్మకం లేదు. అందుకే బాబు తరహాలో ఫిబ్రవరికి పనులు పూర్తికాకపోతే లిఫ్ట్ ద్వారా అయినా నీరిస్తానని మాటదాటేశాడు. బాబు చెప్పినట్లు లిఫ్ట్ ద్వారా నిరివ్వాలన్నా టన్నెల్ 1 పనులతో పాటు, హెడ్రెగ్యులేటర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. టన్నెల్ 1లో ఇంకా మూడు కిలోమీటర్లు పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి పనులు మొదలు కాలేదు. మొదలయ్యేందుకు మరో నెల పైనే పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ పనులు మొదలైనా సగటున రోజుకు 10 మీటర్లకు మించి పని జరిగే పరిస్థితులు లేవు. ఈ లెక్కన మరో పది నెలలు విరామం లేకుండా పనిచేసిన టన్నెల్ 1 పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఇక ఇప్పటికి 80 శాతం హెడ్ రెగ్యులేటర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గితే తప్ప ఆ పనులు పూర్తయ్యే పరిస్థితులు లేవు. ఈ లెక్కన యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా ఏడాది ముగిసే నాటికి టన్నెల్ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు సైతం ముగుస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెలిగొండ పనులు, నీరంటూ చంద్రబాబు మరోమారు ప్రకాశం జిల్లా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నానికి దిగారు. -
వెలిగొండ మళ్లీ గుర్తొచ్చింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ద్వారా పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీరు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్ల పాలనా కాలం ముగుస్తున్నా ఆ హామీలు నెరవేరలేదు. పనులు పూర్తి కావడం సంగతి దేవుడెరుగు... ఆగిన పనులు మొదలు పెట్టడం కూడా టీడీపీ సర్కారుకు చేత కాలేదు. ఏడు నెలలుగా టన్నెల్ పనులు ఆగి పోయినా ప్రభుత్వం స్పందించలేదంటే వెలిగొండపై సీఎం చంద్రబాబుకు ఏ పాటిదో శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతుంది. వెలిగొండ పూర్తి చేసి పశ్చిమ ప్రకాశానికి నీరు ఇవ్వడమే చంద్రబాబుకు ఇష్టం లేదని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం ఉంది. టీడీపీకి ఓట్లు, సీట్లు కట్టబెట్టలేదన్న అక్కసుతోనే చంద్రబాబు వెలిగొండను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. తీరా ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు బాబుకు మళ్లీ వెలిగొండ గుర్తొచ్చింది. ఓట్ల కోసం వెలిగొండ నీళ్లంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. పోనీ ఆ హామీ అయినా నెరవేరుతుందా అంటే అదీ లేదు. పనులు మొదలు కాకుండానే పూర్తికావడం అసాధ్యం. ఆగస్టులో వెలిగొండ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగితే వెంటనే వెలిగొండను పూర్తి చేస్తున్నామంటూ టీడీపీ సర్కారు హడావిడి చేసింది తప్ప పనులు మొదలు పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు తరహాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నెలనెలా రివ్యూ చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. చెప్పిన మూడు నెలల తర్వాత చంద్రబాబు శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు రావడం గమనార్హం. కమీషన్ల కోసం కొత్త పనులు.. పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య వివాదంతో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్ పనులు నిలిచి పోయాయి. ఆర్థిక లబ్ధే పరమావధిగా టీడీపీ ముఖ్యనేతలు వెలిగొండ పనుల అంచనాలను పెంచుకోవడంతో పాటు కమిషన్ల కోసం పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో వివాదం కోర్టుమెట్టెక్కింది. దీంతో టన్నెల్–1 పనులు ఏప్రిల్ నెలలో నిలిచిపోగా టన్నెల్–2 పనులు ఫిబ్రవరిలోనే ఆగిపోయాయి. వెలిగొండ పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఆ పార్టీ ఒంగోలు మాజీఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగష్టు 15 నుంచి వెలిగొండ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. దీంతో బెంబేలెత్తిన భారీ నీటిపారుదల శాఖా మంత్రి ఆగస్టు 15 నాటికి వెలిగొండ టన్నెల్–1 పనులను మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర ముగిసేలోపే పనులు ప్రారంభమవుతాయని అందరూ భావించారు. మంత్రి, ముఖ్యమంత్రి, ఇచ్చిన హామీ నీటి మూటగానే మారింది. నవంబర్ ప్రారంభమైనా పనులు మొదలు కాలేదు. మరో వైపు ఫేజ్ 2 లో భాగంగా పూర్తి చేయాల్సిన టన్నెల్– 2 పనులు సైతం మొదలు కాలేదు. టన్నెల్–1లో 18.820 కి.మీ. తవ్వాల్సి ఉండగా ఇప్పటి వెలిగొండ మళ్లీ గుర్తొచ్చింది వరకు 15.167 కి.మీ. మాత్రమే తవ్వారు. ఇక టన్నెల్–2లో 18.838 కి.మీ. తవ్వాల్సి ఉండగా 10.703 కి.మీ. మాత్రమే తవ్వారు. ఫేజ్–1 పూర్తయ్యే దెన్నడో.. ఫేజ్ 1లో టన్నెల్–1 పనులను పూర్తి చేసి సంక్రాంతి నాటికే వెలిగొండ ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇది జరగాలంటే తొలుత టన్నెల్–1 పనులతో పాటు ప్యాకేజ్–2 పరిధిలోని తీగలేరు, సుంకేశుల డ్యామ్, మూడో ప్యాకేజీ పరిధిలోని గొట్టిపడియ డ్యామ్, కెనాల్స్, నాల్గవ ప్యాకేజీ పరిధిలోని తూర్పు ప్రధాన కాలువ, కాకర్ల డ్యామ్, ప్యాకేజీ 5లో టన్నెల్–2 పనులు, 6వ ప్యాకేజీలో తూర్పు ప్రధాన కాలువ, 7వ ప్యాకేజీ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి కావాల్సి ఉంది. టన్నెల్–1 పనులు ఇప్పటి వరకు 82 శాతం పూర్తి కాగా తీగలేరు, సుంకేశుల డ్యామ్ పనులు 73.1 శాతం, గొట్టిపడియా డ్యామ్, కెనాల్స్ 99 శాతం, తూర్పు ప్రధాన కాలువ, కాకర్ల డ్యామ్ 82 శాతం, టన్నెల్–2 64 శాతం, తూర్పు ప్రధాన కాలువ 66.8 శాతం, ఎడమ ప్రధాన కాలువ 61.6 శాతం చొప్పున మొత్తంగా సగటున 67 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మూడు కిలోమీటర్లు మేర టన్నెల్–1లో కాలువ తవ్వాల్సి ఉంది. దివంగత నేత వైఎస్ హయాంలో 12 కిలోమీటర్ల మేర టన్నెల్–1 కాలువ తవ్వారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు సర్కారు తవ్వింది 3 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా మూడు కిలోమీటర్లకు పైగా తవ్వాల్సి ఉంది. నాలుగున్నరేళ్లలో మూడు కిలోమీటర్లు తవ్వి మరో రెండు నెలల్లో మూడు కిలోమీటర్లు కాలువ తవ్వి నీరిస్తాననడాన్ని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. బాబు హామీల పరంపర : అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది వెలిగొండ ద్వారా కరువు ప్రాంతం పశ్చిమ ప్రకాశానికి నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఇవిగో నీళ్లంటూ మాట ఇవ్వడం తప్ప నెరవేర్చింది లేదు. ♦ నాలుగు నెలలక్రితం ఈ డిసెంబర్కు నీరిస్తామంటూ కందుకూరు సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత కనిగిరి సభలో సంక్రాంతికి వెలిగొండ నీరంటూ మరోమారు మాట మార్చారు. ♦ వెలిగొండ పనులను మొదలు పెడుతున్నట్లు మంత్రి దేవినేని ఉమ, జిల్లా టీడీపీ నేతలు మూడు నెలల క్రితం హడావిడి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ సందర్శిస్తున్నట్లు చెప్పారు. పోలవరంలాగే ప్రతినెలా వెలిగొండపై సీఎం రివ్యూ నిర్వహిస్తారని గొప్పలు చెప్పారు. ముఖ్యమంత్రి సైతం ఇదే చెప్పారు. నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు సీఎం వెలిగొండను సందర్శించింది లేదు. వెలిగొండ పనులు మొదలైంది లేదు. ♦ తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండను సందర్శిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా పనులు మొదలవుతాయోమో చూడాలి. మరి పనులు ఎప్పటికి పూర్తి అవుతాయన్నది చంద్రబాబుకే తెలియాలి. అంచనాల పెంపుపైనే శ్రద్ధ.. వెలిగొండ పనులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు అంచనాలను మాత్రం భారీగా పెంచుకున్నారు. తొలుత రూ.5,150 కోట్ల అంచనాలతో ఉన్న ప్రాజెక్టు వ్యయం తాజాగా రూ.1,784 కోట్లకు చేరింది. ఈ లెక్కన రూ.2,634 కోట్లు పెంచుకున్నారు. బాబు సర్కారు పెంచిన వెలిగొండ అంచనాలను చూసి సీనియర్ ఇంజినీరింగ్ ప్రముఖులే నివ్వెరపోతున్నారు. ఇదేం దోపిడీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఉదృతమవుతున్న వెలిగోండ ప్రాజెక్ట్ ఉద్యమం
-
‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికే’
-
చంద్రబాబు మోసకారి..
-
‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికే’
సాక్షి, ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు వల్ల కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వెలిగొండ టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కేవలం 30 శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కరువునుపారద్రోలుతానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను నివారించగలిగారా అని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద మట్టి పనులే మొదలు పెట్టలేదని, సంక్రాంతిలోగా ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. హెడ్ రెగ్యులేటర్ కంప్లీట్ కాకుండా ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. బాబు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే పాదయాత్ర చేశానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత చంద్రబాబును ప్రజలే ఇంటికి పంపిస్తారని తెలిపారు. కనిగిరి నుంచి వెలిగొండ టన్నెల్ వరకు వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర కొనసాగింది. 14 రోజుల పాటు సాగిన పాదయాత్రలో ఆయన మొత్తం 207 కిలోమీటర్లు నడిచారు. ముగింపు సభకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేతలు పార్థసారథి, బాలినేని శ్రీనివాస్రెడ్డి తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు మోసకారి.. సొంత మామ దివంగత నేత ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పెద్ద మోసకారి అని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు మెజార్టీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడు ప్రాజెక్ట్లను పట్టించుకోలేదని, వైఎస్సార్ ఉండి ఉంటే ఎప్పుడో వెలిగొండ పూర్తయ్యేదన్నారు. ప్రజలకు మేలు చేయాలని బాబుకే లేదని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటుతో బుద్ది చెప్పాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీని గెలిపించాలని ఈ సందర్భంగా మేకపాటి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులను చంద్రబాబు అటకెక్కించారని సీనియర్ నేత బాలినేని విమర్శించారు. వైఎస్సార్ హయాంలోనే ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి పనిలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు. -
‘ప్రాజెక్టులపై చంద్రబాబు విషం కక్కారు’
సాక్షి, హైదరాబాద్ : వెలిగొండ ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తాగటానికి కూడా నీళ్లు లేని ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు ఏరియా అని, కృష్టా నదికి చేరువలో ఉన్నప్పటికీ తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా నిలిచిపోయిందన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు అందించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలు సుదీర్ఘకాలం పోరాటం చేశారన్నారు. గతంలో 9 ఏళ్లు పాలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ది లేదని, ఈ విషయం ఆయన రాసుకున్న పుస్తకం చదివితే అర్థం అవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు శుద్ద దండుగ అని, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడికి పావల వడ్డీ కూడా తిరిగిరాదని, చంద్రబాబు విషం కక్కారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రాజెక్టులు దగ్గర శంకుస్థాపనలు చేసి ఒక్క ప్రాజెక్టును కూడా మొదలుపెట్టకుండా చంద్రబాబు ప్రజలను దారుణంగా వంచించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించని చంద్రబాబు 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి కనీసం ప్రాజెక్టును మొదలుపెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. వ్యవసాయానికి సాగునీరే ప్రధానమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంతో 56 ప్రాజెక్టులు మొదలు పెట్టారని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో కరువును శాశ్వతంగా తరమికొట్టాలనే లక్ష్యంతో వైఎస్సార్ 2005లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. -
కరువు నేలలోసిరులు పండిద్దాం
ఆరుగాలం శ్రమించి, ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు. పొలాలు కౌలుకు తీసుకుని పడరాని పాట్లు పడుతున్నాం. మార్కెట్లో వస్తువుల రేటు చూస్తే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నామయ్యా.. అంటూ పలువురు రైతులు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర 11వ రోజు శనివారం దొనకొండ మండలంలో సాగింది.రుద్రసముద్రం గ్రామానికి కాలినడకన వస్తున్న సుబ్బారెడ్డికి మార్గం మధ్యలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలు, బొగ్గుబట్టీల్లో పని చేస్తున్నకార్మికులు తమ కష్టాలను విన్నవించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని, దుర్భిక్ష పరిస్థితులను దూరం చేసి, కరువు నేలల్లో సిరులు పండిద్దామంటూ వైవీ వారికి భరోసా ఇచ్చారు. దొనకొండ (తాళ్లూరు): వర్షాభావ పరిస్థితులతో ప్రకాశం ప్రజలు అల్లాడి పోతున్నారని, వారి సంక్షేమం చూడాల్సిన చంద్రబాబు అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రజా పాదయాత్రలో భాగంగా శనివారం దొనకొండ మండల పర్యటనలో వైవీ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజక్టు పూర్తి చేయించడం ద్వారా తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకే తాను ప్రజా పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసుకుని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకుందామన్నారు. అప్పడు ఇదే భూమిలో సిరులు పండించుకోవచ్చని భరోసా ఇచ్చారు. వెలుగొండ సాధించే వరకు తాను విశ్రమించబోనన్నారు. దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బాదం మాధవరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసుకుని నవరత్నాల అమలుతో రాజన్న రాజ్యాన్ని స్థాపించుకుందామన్నారు. యాత్రలో భాగంగా వైవీ రుద్రసముద్రం గ్రామం వద్ద బొగ్గు బట్టీల్లో పని చేస్తున్న కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. మిర్చి నాటుతున్న కూలీలతో మమేకమయ్యారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని ఎంపీ వద్ద వాపోయారు. ప్రస్తుతం మిరప నారు అధిక రేట్లు పలుకుతున్నామని భూమనపల్లికి చెందిన పాలపర్తి మల్లయ్య తెలిపారు. నాగలి దున్నుతున్న రైతుతో మాట్లాడారు. కొద్దిసేపు నాగలి పట్టి అరక దున్నారు. తమ గ్రామానికి వస్తున్న వైవీకి రుద్రసముద్రం గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. బొగ్గుల కార్మికులకు పరామర్శ ... రుద్రసముద్రం మార్గంలో బొగ్గుల బట్టీలను వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. బొగ్గుల తయారు చేస్తున్న కార్మికులను పరామర్శించారు. బట్టీల వద్దే నివసిస్తున్న ఏడు కుటుంబాల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను పనిలో పెట్టకుండా చక్కగా ఉన్నత చదువులు చదివించాలని వారికి సూచించారు. అవసరమైతే చదువులకు తాము చేయూత ఇస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయ కర్త బుర్రా మధుసూధన్యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పి.శ్యాం ప్రసాద్రెడ్డి, రిటైర్డు మధ్యప్రదేశ్ అడిషినల్ డీజీపీ, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కూచిపూడి బాబూరావు, చుండూరు మాజీ జెడ్పీటీసీ కొండా శివప్రసాద్రెడ్డి, దొనకొండ, దర్శి, కురిచేడు, తాళ్లూరు మండల కన్వీనర్లు కాకర్ల క్రిష్ణారెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, బి.వెంకయ్య, వేణుగోపాలరెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి, తదితరులు వైవీని కలసి సంఘీభావం తెలిపారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ వైవీ ప్రజా పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. విలువలతో కూడిన జగన్మోహన్రెడ్డి వెంటే కాపులు ఉంటారన్నారు. నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుకు కాపులు గుర్తొచ్చారని, ఎన్నికల సమయంలో కాపులు, వడ్డెలు, రజకులు, ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి బాబు మోసం చేశారని కోలా పేర్కొన్నారు. వైవీకి వినతుల ల్లువ ♦ తన బిడ్డకు యాక్సిడెంలో కాలు పూర్తిగా దెబ్బతిన్నదని, తండ్రిలేని బిడ్డను ఆదుకోమంటూ గంగదేవిపల్లెకు చెందిన భూ లక్ష్మమ్మ ఎంపీ వైవీని వేడుకున్నారు. ♦ కరువు వల్ల జీవాలకు మేత, నీరు కరువయ్యాయని, గొర్రెలకు బీమా కల్పించాలనే విషయాన్ని కూడా తమకు ఎవరూ చెప్పడం లేదని బ్రహ్మారావుపేటకు చెందిన గొర్రెల కాపరి కన్నేబోయిన హనుమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వైవీని కలిసి గొర్రె పిల్లను బహూకరించారు. కందిలో తీవ్ర నష్టాలు కంది సాగు చేసి నిరుడు తీవ్రంగా నష్టపోయామని, ఐదెకరాల్లో కంది పంట వేస్తే రూ.20 వేలకు పైగా అప్పే మిగిలిందని రుద్రసముద్రం రైతు యర్ర నాగయ్య వాపోయాడు. నష్ట పరిహారం కూడ అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నాగయ్య పొలంలో వైవీ కొద్దిసేపు నాగలి పట్టి సేద్యం చేశారు. కష్టాలు తీరాలంటే ప్రాజెక్టు రావాలి.. మిరప సాగు చేస్తున్న తమకు బోర్లలో నీరు తగ్గుముఖం పట్టడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు కఠారి ఈశ్వరయ్య, సావిత్రి, వల్లెం రమణమ్మ, కొండ్రు అల్లూరమ్మ, వల్లె మల్లేశ్వరిలు చెప్పారు. నీటి కష్టాలు తీరాలంటే ప్రాజెక్టు రావాలయ్యా అని వైవీకి విన్నవించారు. ధోబీ ఘాట్ఏర్పాటుకు వినతి.. రుద్ర సముద్రం రజక కాలనీలో రజకులు ఎంపీ వైవీని కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వాగులలో నీరు లేక పోవటంతో బట్టలు ఉతకటం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. దోభీ ఘాట్లను, బోర్లను ఏర్పాటు చేస్తే తమకు బతుకుదెరువు ఉంటుందన్నారు. రజకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో ఆ అంశం ఉందని వైవీ చెప్పారు. పాద యాత్ర సాగిందిలా... ప్రజా పాదయాత్ర శనివారం దొనకొండలో ఉదయం 9.43 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు రుద్ర సముద్రం సమీపానికి చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం తిరిగి 3.10గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. పుల్లాయపల్లి మీదుగా కట్టకిందిపాలెం వరకు సాగి సాయంత్రం 5.43 గంటలకు ముగిసింది. 11వ రోజు 15 కి.మీలు యాత్ర సాగింది. నేటి షెడ్యూల్.. ఆదివారం ఉదయం 9.00 గంటలకు ప్రజా పాదయాత్ర దొనకొండ మండలం కట్టకిందిపాలెం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి యర్రగొండపాలెం నియోజక వర్గంలోకి ప్రవేశిస్తుంది. పెద్దారవీడు మండలం కంభంపాడు క్రాస్రోడ్డు దాటుకొని తోకపల్లి ఎస్సీ కాలనీ, తోకపల్లి, రాజంపల్లి, చుట్టమిట్ల క్రాస్ వరకు సాగుతుంది. -
అలుపెరుగని బాటసారి
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. పశ్చిమలో వ్యవసాయం పండుగ చేయాలి. బీళ్లుగా మారిన పంట భూములు పచ్చని పైర్లతో కళకళలాడాలి. రైతన్నకువ్యవసాయం పండుగ కావాలి. తడారిన గొంతుకల దప్పిక తీరాలి. ఇదే కసితో వందల కిలోమీటర్ల మేర అలుపెరుగక ముందుకు సాగుతున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవిని తృణప్రాయంగా త్యజించిన పెద్దాయన తమ ప్రాంతానికి కాలినడకన వస్తుంటే పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతిస్తున్నాయి. ఆయన వెంట నడుస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, మద్దతుదారులతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. వెలిగొండ సాధనే ధ్యేయంగా మండుటెండను సైతం లెక్కచేయక ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆబాలగోపాలం ఆయనఅడుగులో అడుగు వేసి బాసటగా నిలుస్తున్నారు. చంద్రబాబు సర్కారు మోసాన్ని ఎండగడుతూ.. పల్లె ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ సాగుతున్న వైవీ ప్రజా పాదయాత్ర శుక్రవారం10 రోజులు పూర్తి చేసుకుంది. మూడు నియోజకవర్గాల్లో 140 కిలోమీటర్లకు పైగా సాగింది. ఆగస్టు 15న కనిగిరి నుంచి ప్రారంభమైన యాత్ర పదో రోజు మార్కాపురం నియోజకవర్గం నుంచి దర్శి నియోజకవర్గం దొనకొండ చేరింది. మార్కాపురం రూరల్/మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర 10వ రోజు శుక్రవారం మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో సాగింది. మార్కాపురం మండలం గజ్జలకొండ నుంచి ప్రారంభమైన యాత్రలో వైవీకి అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు.మహిళలు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇండ్లచెరువులో మహిళలు ఆయనకు హారతులిచ్చి, పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు. మాజీ సర్పంచి పాతకోట సునీతాకోటిరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ జెండాను వైవీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు వర్షాలు లేక పొలాలు బీడుగా మారాయని, భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏకరువు పెట్టారు. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీ వాసులు సుబ్బారెడ్డి ఎదుట వాపోయారు. సమస్యలు విన్న ఆయన త్వరలో మన ప్రభుత్వం వస్తుంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, నేతలు వెన్నా హనుమారెడ్డి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు తదితరులు అడుగులో అడుగేసి వైవీతో పాటు నడిచాడు. దర్శి, చీరాల నియోజకవర్గ సమన్వయకర్తలు బాదం మాధవరెడ్డి, యడం బాలాజీలు పాదయాత్రలో పాల్గొని వైవీకి పలు సమస్యలను వివరించారు.కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిల్పా మోహన్రెడ్డి, కర్నూల్ పార్లమెంటు కో ఆర్డినేటర్ రాములు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జీ ఆసిఫ్ ఖాన్, కోడమూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మురళీకృష్ణ, యువ నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, దొనకొండ, దర్శి, కురిచేడు, తాల్లూరు మండల కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, బి.వెంకయ్య, వేణుగోపాలరెడ్డి, జెడ్పీటీసీలు మారం వెంకటరెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొంగటి శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ మోషె తదితరులు వైవీకి సంఘీభావం తెలిపారు. నేటి షెడ్యూల్... శనివారం దొనకొండ నుంచి ఉదయం 9.00 గంటలకు పాదయాత్ర ప్రారభమవుతుంది. అక్కడ నుంచి రుద్రసముద్రం చేరుతుంది. భోజన విరామం అనంతరం కొచ్చరకోట వరకు సాగుతుంది. పాదయాత్రసాగింది ఇలా.. ప్రజాపాదయాత్ర శుక్రవారం మార్కాపురం మండలం గజ్జలకొండలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. గుండవారిపల్లె, నాగిరెడ్డి పల్లె, పిచ్చిగుంట్లపల్లి మీదుగా 11.30 గంటలకు దర్శి నియోజకవర్గంలో ప్రవేశించింది. దొనకొండ మండలం ఇండ్లచెరువులో మధ్యాహ్నం 12.30 భోజన విరామం అనంతరం 3.15గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సాయత్రం 5.30గంటలకు దొనకొండలో బహిరంగ సభ అనంతరం 6.10గంటలకు యాత్ర ముగిసింది. 10వ రోజు మొత్తం 14.1 కి.మీ మేర యాత్ర సాగింది. -
కొనసాగుతున్న వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర
సాక్షి, ప్రకాశం : ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాద్రయాత్ర 11వ రోజుకు చేరింది. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ పాదయాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూస్తున్నారని, జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారే తప్పా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జిల్లా తాగు, సాగు నీరు సమస్య తీరాలని, అది వెలిగొండ ప్రాజెక్టుతోనే ఈ సమస్య తీరనుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోగా పూర్తి చేస్తాం చంద్రబాబు ప్రకాశం జిల్లా రైతులను నట్టేట ముంచారని, వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబువి దొంగ మాటలని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోని పూర్తిచేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, నాలుగేళ్లు గడిచిన ఇంత వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. జిల్లా కరువు కొరల్లో చిక్కుకుందని, ఫ్లోరైడ్ నీళ్లు తాగి జనం పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. వైఎస్ జగన్ నాయకత్వంలో ఏడాదిలోపు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, 15 రోజుల పాటు సుమారు 200 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తన పాదయాత్రకి మద్దతిస్తున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు. -
పిట్టల్లా రాలిపోతున్నా పట్టదా?
సాక్షి, మార్కాపురం (ప్రకాశం జిల్లా) : జిల్లాల్లో ఫ్లొరైడ్ బాధితులు పిట్టల్లా రాలుతున్న పట్టించుకోరా? అని రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్ట్ సాధన కోసం ఆయన కనిగిరి నుంచి ప్రజా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ పాదయాత్ర మార్కాపురం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ను మూలన పడేసిన దుర్మార్గుడు సీఎం చంద్రబాబు అని మండిపడ్డారు. జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని, తాగడానికి నీళ్లు లేవని ప్రజలు తనతో వాపోతున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. మర్కాపురానికి నీళ్లు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రో ప్రజలకు తమ అధినేత వైఎస్ జగన్ భరోసా కల్సిస్తున్నారని చెప్పారు. రాజన్న తనయుడిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా సాధించుకుందామని, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. జగన్ నాయకత్వంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేసుకుందామన్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు జంకే వెంటకట్ రెడ్డి, ఆదిములపు సురేశ్, ఎమ్మేల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కేపీ కొండా రెడ్డి, చెంచు గరటయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు అంటే మోసమని, ఆయనకు ప్రాజెక్టులు కట్టడం ఇష్టం లేదని వెల్లంపల్లి మండిపడ్డారు. టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవని, కళ్లు ఉండి చూడలేని గుడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే ఆదిములపు సురేశ్ ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్ట్ను నిర్లక్షం చేసిన సీఎం చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ప్రజలు కక్ష్య గట్టారని, వైఎస్ జగన్ సీఎం అయితేనే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్రాంతికి వెలిగొండ నీళ్లు ఇస్తామన్న చంద్రబాబు మాటలు.. నీటి మీద రాతలని ఉమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. రైతులు, యువత సమస్యలు చంద్రబాబుకు పట్టవని, రాజకీయ అవసరాలే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్తో పొత్తుకు బాబు తాపత్రయం సిగ్గు చేటని మండిపడ్డారు. -
భూములన్నీ బీడు.. ఆశలన్నీ మోడు
‘‘చెరువులన్నీ ఎడారులను తలపిస్తున్నాయి.. సాగు భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి..రైతులు కూలీలుగా మారిపోతున్నారు. వెలిగొండ పూర్తయితే ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువుకు ప్రాజెక్టు నుంచి నీరు నింపే అవకాశం ఉంది. తురిమెళ్ళ, రాచర్ల చెరువుల్లాంటి ఎన్నిటినో నీటితో నింపి తాగునీరు ఇవ్వొచ్చు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే వెలిగొండ పూర్తి కాలేదు. ముడుపులు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి తప్ప రైతు సంక్షేమానికి ఉపయోగపడే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర సోమవారం కంభం, అర్ధవీడు మండలాల్లో సాగింది. కంభం/అర్థవీడు(ప్రకాశం) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రజలకు తాగు, సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అందులో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన రూ.3500 కోట్లతో 75 శాతం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్ల పాలన పూర్తవుతున్నా ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తవ్వలేక పోయారని విమర్శించారు. 2014 నుంచి ఏటా మరో సంవత్సరానికి వెలిగొండను పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా నిదులు కేటాయించ లేదని ఆరోపించారు. ఇటీవల జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ నాటికి వెలిగొండ పూర్తి చేసి నీరిస్తామని హామీ ఇచ్చారని, నాలుగున్నరేళ్లలో జరగని పనులు నాలుగు నెలల్లో ఏవిధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. ప్రజాపాదయాత్రలో భాగంగా సోమవారం మండల కేంద్రం కంభంలోని కందులాపురం కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని దీంతో పాటు ప్రజలకు తాగునీరు అందుతుందని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు, కంభం మండలంలో 19 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని అన్నారు. కంభం చెరువు 32 అడుగులు ఉండగా ప్రస్తుతం 20 అడుగుల పైన పూడికతో నిండిపోయిందని. కనీసం పూడిక తీత పనులు చేపట్టాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వెలిగొండ పూర్తి చేస్తామని, సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ రహిత సమాజాన్ని రూపొందిస్తామన్నారు. వ్యవసాయాన్ని సస్యశామలం చేస్తామని తెలిపారు . అశోక్రెడ్డికి పుట్టగతులు లేకుండా చేయండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షతో ఫ్యాను గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల అశోక్రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయి చంద్రబాబు సంకనెక్కాడని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఇలాంటి నాయకులకు పుట్టగతులు లేకుండా చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్రాంతికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీరిస్తామని చెబుతున్న టీడీపీ నాయకులు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. సంక్రాంతి తర్వాత నీరు ఇవ్వకపోతే టీడీపీ సర్కారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇంకా 14 నెలల పదవీకాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ఎంపీ పదవిని త్యజించిన గొప్ప నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీరందించాలన్న లక్ష్యంతో కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు 207 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నారన్నారు. ఎన్నికలు నాలుగునెలలు ఉందన్న ఉద్దేశంతో చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు అన్న క్యాంటీన్లు, నిరుద్యోగభృతి ఇప్పుడు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమా తన శాఖ పనికంటే ఇరిగేషన్కు చంద్రబాబుకు మధ్య బ్రోకర్ గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీతోనే న్యాయం.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న పోరాటం ఎనలేనిదన్నారు. వైఎస్సార్ సీపీతోనే పేద ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఫ్యాను గుర్తుపై గెలుపొంది పార్టీ మారిన అశోక్రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేందు సిద్ధంగా ఉన్నారన్నారు. కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు.. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లో అత్యంత ఆదరణ కనిపిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అన్నారు. సీఎం చంద్రబాబు పట్టిసీమ పేరుతో వేలకోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పక్కనబెట్టి కొత్త ప్రాజెక్టులను తయారు చేస్తూ అందులో కమీషన్లు నొక్కుతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక ఎక్కడైనా వర్షాలు కురిశాయా, చెరువులు నిండాయా? అని ప్రజలను ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యాళ్ళూరి వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, కామూరి రమణారెడ్డి, పిడతల అభిషేక్రెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కేవీ రమణారెడ్డి, చుండూరు రవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా.చేరెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి చెన్నువిజయ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పఠాన్సుభాన్ఖాన్, మండల కన్వీనర్లు లాయర్ శ్రీనివాసులరెడ్డి, బొల్లాబాలిరెడ్డి, పఠాన్ జఫల్లా ఖాన్, బోయళ్ళ జనార్దన్ రెడ్డి, కర్నూలు జిల్లా నేతలు గౌరు వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైవీ ఎదుట సమస్యల మొర.. పాదయాత్రగా వస్తున్న వైవీకి స్థానికులు సమస్యలు విన్న వించారు. ప్రధానంగా సూరేపల్లె, కందులాపురం, కంభం గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని, ట్యాంకర్లు వస్తేనే నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వర్షాభావం కారణంగా ఇటుకల పరిశ్రమ మూతపడే స్థాయికి వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు లేక జీవాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గొర్రెల కాపరులు వాపోయారు. గ్రాసం లేక వందల మైళ్లు వెళ్లి నల్లమల అడవుల్లో గ్రాసం తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హోరెత్తిన హోదా నినాదం.. పాదయాత్రలో ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగాయి. విద్యార్థులు, యువకులు ఫ్లకార్డులు పట్టుకొని యాత్ర కొనసాగించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, వైఎస్సార్ అమలు పరిచిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆట పాటల ద్వారా కోలాట భజన బృందాలు చేసిన ప్రదర్శనలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. కందులాపురం సెంటర్లోని అంబేడ్కర్, వైఎస్సార్, శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వెలిగొండ పూర్తి’
సాక్షి, కంభం: కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ప్రారంభించిన ప్రజా పాదయాత్ర ఆరో రోజు(సోమవారం) కంభం చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీ రెడ్డి అధ్యక్షతన కంభం పట్టణంలో నిర్వహించిన బహిరంగ ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అంతేకాకుండా జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని తెలిపారు. నియోజకవర్గంలోని 60వేల ఎకరాలకు, కంభం మండలంలోని 19వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం ముడుపులు వచ్చే ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది లోపే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తారని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభకు వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు భారీగా జనం తరలివచ్చారు. -
‘అధికారంలోకి వస్తే ఏడాది లోపే వెలిగొండ పూర్తి’
-
అధికార పార్టీ ఎంపీ అంటే అంతేమరి!
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ టెండర్ల వివాదం నుంచి గట్టెక్కేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ అదిరిపోయే ప్లాన్ వేసింది. పనులను పాత కాంట్రాక్టర్కే సబ్ కాంట్రాక్టుకు అప్పగించడం ద్వారా టెండర్ల వివాదానికి చెక్ పెట్టడంతోపాటు తట్టెడు మట్టెత్తకుండానే రూ.200 కోట్లకు పైగా లబ్ధి పొందడానికి వ్యూహం రచించింది. 4.65 అధిక ధరలకు టెండర్ వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రెండో టన్నెల్ను 18.838 కి.మీ.ల పొడవున తవ్వే పనులను రూ.735.21 కోట్లకు హెచ్సీసీ–సీపీపీఎల్(జాయింట్ వెంచర్) సంస్థ 2007లో దక్కించుకుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 2012 నాటికే ఈ పనులు పూర్తి కావాలి. కానీ 2015 వరకూ పూర్తి కాలేదు. 2016 డిసెంబర్ నాటికి ఈ టన్నెల్ పనులు పూర్తి చేయాలనే సాకు చూపుతూ అదేఏడాది జూలై 5న కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా రూ.17.29 కోట్లను ప్రభుత్వం ఇచ్చేసింది. అయినా టన్నెల్ పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండో టన్నెల్ పనులు పూర్తి చేయాలనే నెపంతో మిగిలిపోయిన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ పనుల విలువను రూ.299.48 కోట్లుగా ఐబీఎం తేల్చింది. కానీ, ముఖ్యనేత ఒత్తిడి మేరకు అంచనా వ్యయాన్ని పెంచేస్తూ మార్చి 22న జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన అంచనా వ్యయంతో చేపట్టే పనులను సీఎం రమేశ్ సంస్థకే అప్పగించాలని ముఖ్యనేత నిర్ణయించారు. ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి నెలలో సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 4.65 శాతం అధిక ధరలకు సీఎం రమేశ్ సంస్థ టెండర్ దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినకుండా 60సీ నిబంధన కింద తమపై వేటు వేసిందంటూ పాత కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో పాత కాంట్రాక్టర్ వాదనను విని, లెక్కలు తేల్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం), క్వారీ, చేసిన పనులకు అదనపు బిల్లులతో కలిపి రూ.185 కోట్లు పరిహారంగా ఇవ్వాలని పాతకాంట్రాక్టర్ ప్రతిపాదించారు. లేకపోతే పెంచిన అంచనా వ్యయం మేరకు బిల్లులు ఇస్తే ఆ పనులు తామే చేస్తామని పేర్కొన్నారు. పాత కాంట్రాక్టరే సబ్ కాంట్రాక్టర్ టెండర్ల వివాదం నుంచి గట్టెక్కడంతోపాటు భారీగా లబ్ధి పొందడానికి సీఎం రమేశ్ మాస్టర్ ప్లాన్ వేశారు. టన్నెల్ పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇస్తామని.. వాటి పాత విలువ అంటే రూ.299 కోట్లకు అదనంగా ఇంకో రూ.70 కోట్లు ఇస్తామని, వాటిని మీరే చేసుకోవాలని పాత కాంట్రాక్టర్కు ప్రతిపాదించారు. ఇందుకు పాత కాంట్రాక్టర్ అంగీకరించినట్లు తెలిసింది. దీనివల్ల పనులు చేయకుండానే రూ.200 కోట్లకుపైగా ప్రయోజనం పొందడానికి సీఎం రమేశ్ పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది. -
దోపిడీ పాలనకు చరమగీతం పాడదాం
కొనకనమిట్ల: ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు దోపిడీ ప్రభుత్వానికి చరమ గీతం పాడుదామని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం తెచ్చుకుందామన్నారు. పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి వెలిగొండ ప్రాజెక్ట్ను తక్షణమే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైవీ చేపట్టిన పాదయాత్ర మూడో రోజు శుక్రవారం కొనకనమిట్ల మండలం గొట్లగట్టు నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభంలో స్థానిక మహిళలు సుబ్బారెడ్డికి హారతులిచ్చి ఆయన వెంట అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు. పాదయాత్ర గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, చినమనగుండం, నాగంపల్లి, వింజవర్తిపాడు, మీదుగా వెలుగొండ స్వామి ఆలయం వరకు కొనసాగింది. చినమనగుండం బస్టాండ్ సెంటర్లో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో వైవీకి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. బ్రాహ్మణపల్లి, నాగంపల్లి వద్ద మహిళలు పూలు చల్లుతూ వైవీకి స్వాగతం పలికారు. గొట్లగట్టు పొలాల్లో పనులు చేసే మహిళా కూలీలు వైవీ బస చేసిన శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఆయా గ్రామాలకు వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసి అమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, సానికొమ్ము పిచ్చిరెడ్డి, నాయకులు వెన్నా హనుమారెడ్డి, రమణారెడ్డి, వై.వెంకటేశ్వరావులు వైవీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు వైవీతో కలిసి పాదయాత్రకు మద్దతు పలికారు. ఆరు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది.. ‘ఇన్నాళ్లు ఓపిక పట్టాం.. ఇంకో ఆరు నెలలు ఓపిక పడితే మనమందరం కోరుకున్న ప్రభుత్వం జగనన్న సారధ్యంలో వస్తుందని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని సమస్యలు పరిష్కరించుకొందాం’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి వెలిగొండ ప్రాజెక్ట్ సాధించే వరకు నిరంతరం పోరాడాలని, అందుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలు విన్నవించిన రైతులు.. నాగంపల్లిలో రైతులతో వైవీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారు విన్నవించిన సమస్యలను ఓపికగా విని రైతులు ఈ ప్రభుత్వంలో ఇంత ఇబ్బందులు పడుతున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వస్తుందని ధైర్యంగా ఉండాలన్నారు. రైతులతో ఇన్సూరెన్ కట్టించుకొన్నప్పటికి వారు సాగు చేసిన పంటలు ఎండిపోయి నష్ట పోతే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదని నాగంపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ వస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని, మహానేత వైస్సార్ ఆ నాడు ప్రాజెక్ట్కు అంకురార్పన చేశారని పలువురు రైతులు గుర్తు చేశారు. గ్రామానికి చెందిన యలమంద కాశమ్మ మూడేళ్లుగా ఇళ్లు పడగొట్టి కాలనీ కోసం దరఖాస్తు చేసుకొంటే ఇప్పటికి కాలనీ మంజూరు చేయలేదని వైవీ ఎదుట వాపోయింది. బాధితులకు భరోసా.. నాగంపల్లి ఎస్సీ కాలనీలో సైడు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వైవీ దృష్టికి తెచ్చారు. ఓ వీధిలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగి పడిపోయే స్థితిలో ఉండటాన్ని వైవీ గుర్తించారు. స్పందించిన ఆయన ఫోన్లో విద్యుత్శాఖ ఏఈతో మాట్లాడి రెండు రోజుల్లో కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలనీకి చెందిన వికలాంగుడు కొండ్రు జోజయ్య వైవీని కలిసి తన సమస్యలను వివరించి మూడు చక్రాల సైకిల్ కావాలని అడిగాడు. మూడు చక్రాల సైకిల్ ఇప్పిస్తానని వైవీ హామీ ఇచ్చారు. గొట్లగట్టుకు చెందిన ఉప్పుటూరి శ్రీనివాసులు కుమారుడు అనిల్ వెంకటరామచరణ్ ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురై చేయి దెబ్బతిన్నది ఆదుకోవాలని శ్రీనివాసులు వైవీని కోరారు. పాదయాత్రకు ఆయిన తరువాత ఒంగోలుకు రావాలని వైవీ సూచించారు. పాదయాత్ర కార్యక్రమంలో వైవీ భద్రారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వాకా వెంకటరెడ్డి, సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, వెంకటకొండారెడ్డి, ఎంపీపీలు ఉడుముల రామనారాయణరెడ్డి, కె.నరసింహరావు, జడ్పీటీసీలు మెట్టు వెంకటరెడ్డి, సాయిరాజేశ్వరరావు, భాషాపతిరెడ్డి, తాళ్లూరు వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు, ఎంపీటీసీ ఉప్పుటూరి పెద్దవెంకటయ్య, సొసైటీ చైర్మన్లు కామసాని వెంకటేశ్వరరెడ్డి, ఉడుముల కాశిరెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి, వైస్ ఎంపీపీ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతకోట వెంకటకృష్ణారెడ్డి, నాగరాజుగౌడ్, గొట్టం వెంకటరెడ్డి, మహిళా నాయకులు కంది ప్రమీళారెడ్డి పాల్గొన్నారు. పాదయాత్ర సాగింది ఇలా... మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. గొట్లగట్టు వద్ద మహిళలు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలుకగా, బ్రాహ్మణపల్లె, చినమనగుండం మీదుగా మధ్యాహ్నం 1 గంటకు నాగంపల్లి గ్రామానికి చేరుకుంది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర వింజవర్తిపాడు మీదుగా సాయంత్రం 5.30 గంటలకు వెలుగొండ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరింది. మూడోరోజు సుమారు 15.3 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. -
ఊపిరి ఉన్నంత వరకు పోరు ఆగదు
ప్రకాశం, కనిగిరి: ఊపిరి ఉన్నంత వరకు వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం సాగిస్తానని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయక పోతే.. మనందరి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాది కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. వెలిగొండ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర రెండో రోజు గురువారం కనిగిరి నియోజకవర్గంలోని హెచ్ఎంపాడు మండలం, మార్కాపురం నియోజవర్గంలోని కొనకనమిట్ల మండలాల్లో రెట్టించిన ఉత్సాహంతో సాగింది. హెచ్ఎంపాడులో ఎంపీపీ గాయం బలరాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లోని ప్రజలకు సురక్షిత తాగు నీరు, సాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజక్టును ప్రారంభించి.. 70 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. వైఎస్ మరణం తర్వాత ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయన్నారు. చంద్రబాబు శిలాఫలకాలు వేయడం తప్ప పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. 2014లో ఎన్నికల్లోఏడాదిలో వెలిగొండను పూర్తి చేస్తానని హామీలిచ్చిన చంద్రబాబు నాలుగున్నరేళ్లయినా పనులు అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. చంద్రబాబు హామీలన్నీ ఓట్ల కోసమేనని, ప్రజల కోసం.. ఆచరణ కోసం కాదని అందుకు ఆయన చరిత్రే నిదర్శనమని విమర్శించారు. జిల్లాలో ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తోందని.. వెయ్యి అడుగులు వేసి నీళ్లు పడే పరిస్థితి లేదన్నారు. కలుషిత నీళ్లుతాగి కనిగిరి, కొండపి నియోజకవర్గాల్లో సుమారు 600 మంది ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధులతో ప్రజల ప్రాణాలు పోగట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నాసర్కారుకు చలనం లేదు.. ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఈ ప్రభుత్వంలో చలనం లేదని వైవీ మండిపడ్డారు. ప్రాణాలు నిలవాలంటే వెలిగొండ నీరే శరణ్యమన్నారు. హాజీపురం, నందనవనం, రాళ్లపల్లి చెరువులకు నీరు రావాలన్నా... ప్రతి ఎకరాకు సాగు నీరు, సురక్షిత తాగు కావాలన్నా వెలిగొండ పూర్తి కావాలన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కళ్లు తెరపించేందుకే ప్రజా పాదయాత్ర చేపట్టినట్లు వైవీ చెప్పారు. జగన్ అధికారంలో రాగానేధరల స్థికరణ పథకం కంది, శనగ, జామాయిల్, సుబాబుల్ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, చేతి కొచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలో రాగానే నవరత్నాల్లో భాగంగా రైతులకు ధరస్థిరీకరణ పథకాన్ని చేపడతామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకుంటారని వెల్లడించారు. వెనుకబడిన కనిగిరి ప్రాంత అభివృద్ధికి ఉపయోగ పడే నిమ్జ్, నడికుడి కాళహాస్తి రైలు మార్గం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కనీస ప్రారంభానికి నోచుకోలేదన్నారు. 2018 కల్లా రైలు మార్గం చేపట్టి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నా ఎన్డీఏ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే నిమ్జ్ను పథకానికి కనీసం ల్యాండ్ ఎక్వీజేషన్ కూడా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టారు. కనిగిరి ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే.. నిమ్జ్, నడికుడి కళాహస్తీ.. రైలుమార్గంను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో వైవీ వెంట మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్, జెడ్పీటీసీ పల్లాల నారపరెడ్డి, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, పారిశ్రామిక వేత్త చింతల చెర్వుసత్యన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్షంలోనూ దారి వెంట పూల జల్లు పాదయాత్ర ప్రారంభమైన కొద్ది నిమిషాలకే చిరుజల్లుల వర్షం ప్రారంభమైంది. హెచ్ఎంపాడులో జరిగిన సభలో వర్షంలో నిలబడే జనం వైవీ ప్రసంగాన్ని విన్నారు. హజీపురం అడ్డరోడ్డు వద్ద నుంచి లింగారెడ్డిపల్లి చివరి వరకు సాగిన పాద యాత్రలో ప్రజలు ప్రతి గ్రామంలో ఎదురొచ్చి హారతులిచ్చారు. పూల దండలు వేసి, పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. సీతారాంపురానికి చెందిన వృద్ధులు, మహిళలు యాత్రకు మద్దతుగా అడుగు కలిపారు. సమస్యలు వింటూ..ముందుకు సాగుతూ.. తమ ప్రాంతానికి కాలినడకన వస్తున్న సుబ్బారెడ్డికి ప్రతి గ్రామం వద్ద, కాలనీల వద్ద ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నమించారు. పింఛన్లు, పక్కాగృహాలు, ఇంటి స్థలాలు, నీటి సమస్య తదితర అంశాలను ప్రజలు వైవీ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికి న్యాయం చేస్తానని వైవీ వారికి భరోసా ఇచ్చారు. 20 కుటుంబాలు పార్టీలో చేరిక.. పాదయాత్రలో భాగంగా హనుమంతునిపాడు మండలం కోటతిప్పల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కొండంరాజు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వెలుగొండ ప్రాజెక్టు సాధన పాదయాత్ర విజయవంతం కావాలని మహిళలు రామాలయంలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పాదయత్ర మండలంలోని లింగారెడ్డిపల్లి వరకు సాగింది. రెండో రోజు యాత్ర సాగిందిలా.. కనిగిరి : గురువారం హెచ్ఎంపాడు మండలం హాజీపురం క్రాస్ రోడ్డు నుంచి ఉదయం 9.42 నిమిషాలకు ప్రారంభించారు. పాదయాత్ర హెచ్ఎంపాడుకు చేరుకున్న తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతలు మాట్లాడారు. అనంతరం పాదయాత్ర కొండారెడ్డిపల్లి మీదుగా కోటతిప్పలకు మధ్యాహ్నం 1గంటకు చేరుకుంది. అక్కడ భోజన విరామం తర్వాత 3.10కు తిరిగి బయలుదేరి రషీద్పురం, దాసరపల్లి, లింగారెడ్డి మీదుగా సాగిన యాత్ర మార్కాపురం నియోజకవర్గం కేకే మిట్ల మండలంలోని నాయుడు పాలెంలోకి సాయంత్రం 5.30గంటలకు యాత్ర ప్రవేశించింది. రెండోరోజు హెచ్ఎంపాడు మండలంలో సుమారు 13 కిమీటర్లు మేర పాదయాత్ర సాగింది. నాయుడుపేటలో ఘన స్వాగతం కొనకనమిట్ల: పాదయాత్రగా వస్తున్న వైవీ సుబ్బారెడ్డికి కొనకనమిట్ల మండలం నాయుడుపేటలోఘన స్వాగతం లభించింది. సాయంత్రం 4.30గంటలకు మార్కాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించగానే స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి గజమాలలతో సుబ్బారెడ్డికి ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. నాయుడుపేట నుంచి మొదలైన పాదయాత్ర నాయుడుపేట ఎస్సీ కాలనీ మీదుగా గొట్లగట్టు చేరింది. బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించా రు. మార్కాపురం నియోజకవర్గంలో మూడు కిలోమీటర్ల మేర సాగిన యాత్ర సాయంత్రం 6.30 గంటలకు ముగిసింది. వైవీకి స్వాగతం పలికిన వారిలో సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు ఉడుముల రామనారాయణరెడ్డి, కే.నరసింహారావు, జడ్పీటీసీలు మెట్టు వెంకటరెడ్డి, సాయి రాజేశ్వరరావు, ఎం.రంగారెడ్డి, బాషాపతిరెడ్డి, పార్టీ కన్వీనర్లు రాచమల్లు వెంకటరామిరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వాకా వెంకటరెడ్డి ఉన్నారు. -
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పూర్తిస్థాయి వైద్యం
-
చంద్రబాబు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులిస్తారు
-
వట్టి మాటలు కట్టిపెట్టండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగేళ్లుగా అధికారంలో ఉండి వెలిగొండ పనలను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతికి వెలిగొండ నీరిస్తానంటూ పశ్చిమ ప్రాంతవాసులను వంచిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఒంగోలులో సాక్షితో మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో కనీసం మూడు కిలో మీటర్లు కూడా వెలిగొండ టన్నెల్ తవ్వలేదని, వచ్చే 5 నెలల్లో మూడున్నర కిలోమీటర్ ఎలా తవ్వుతారని బాలినేని ప్రశ్నించారు. జిల్లా వాసులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. వెలిగొండ టన్నెల్ పనులు నిలిచి పోయి మూడు నెలలు దాటుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు వెలిగొండ పనులంటూ హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళవారం పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసిన అధికార పార్టీ నేతలు వెలిగొండకు వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. దివంగత నేత వైఎస్ హయాంలోనే60 శాతానికి పైగా వెలిగొండ పనులు పూర్తి చేశారన్నారు. వైఎస్ మరణంతోనే వెలిగొండ పనులు నిలిచి పోయాయన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు వెలిగొండ ప్రాజెక్టు పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తెలియచెప్పడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ పాదయాత్ర చేపట్టిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేసి నీరిస్తామని బాలినేని స్పష్టం చేశారు. -
వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర ప్రారంభం
సాక్షి, ప్రకాశం : టీడీపీ సర్కారుపై వైఎస్సార్సీపీ సమరశంఖం పూరించింది. ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాద్రయాత్ర బుధవారం ప్రారంభమైంది. కనిగిరిలో బహిరంగ సభ అనంతరం వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు పార్టీ నేతలు పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, 15 రోజుల పాటు సుమారు 200 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద చివరి రోజున పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఇంత వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని అన్నారు. జిల్లా తాగు, సాగు నీరు సమస్య తీరాలని, అది వెలిగొండ ప్రాజెక్టుతోనే ఈ సమస్య తీరనుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా రైతులను నట్టేట ముంచారని, వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబువి దొంగ మాటలని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోని పూర్తిచేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, నాలుగేళ్లు గడిచిన ఇంత వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. జిల్లా కరువు కొరల్లో చిక్కుకుందని, ఫ్లోరైడ్ నీళ్లు తాగి జనం పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. వైఎస్ జగన్ నాయకత్వంలో ఏడాదిలోపు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పాదయాత్రకి మద్దతిస్తున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు. సుబ్బారెడ్డి పాదయాత్రకు మద్దతుగా మర్రిపూడి మండలం నుంచి 100 వాహనాలతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పొదిలి మండలం నుండి 30 వాహనాలతో ర్యాలీగా వచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేస్తోంది
-
పోలీసుల ఎదుటే టీడీపీ నేతల దౌర్జన్యం..!
సాక్షి, కనిగిరి/ఒంగోలు : కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. పోలీసుల ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. దౌర్జన్యంపై ప్రశ్నించిన తమపై టీడీపీ నేతలు దాడికి దిగారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి చేస్తున్న పాదయాత్రను తట్టుకోలేకే టీడీపీ ఇలాంటి చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు. -
నత్తకు మేనత్త!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. టన్నెల్ పనులతో పాటు కాలువ పనులు, భూ సేకరణ, పునరావాసం సైతం ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులు తప్ప నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టు పనులు అడుగు ముందుకు పడలేదు. దీంతో వెలిగొండ నీళ్లు కలగానే మారాయి. పశ్చిమ ప్రాంతంలో పంటల సంగతి దేవుడెరుగు గుక్కెడు నీరందక ప్రజల గొంతులెండుతున్నాయి. ఫ్లోరైడ్ నీటి పుణ్యమా కిడ్నీ వ్యాధులతో వందలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి సీఎం చంద్రబాబు, ఆయన వందమాగదులకు మళ్లీ వెలిగొండ గుర్తుకొచ్చింది. ఇదిగో నీళ్లిస్తాం.. అదిగో నీళ్లిస్తామంటూ ప్రచారం మొదలెట్టారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రజలకు తెలియచెప్పడంతో పాటు ప్రాజెక్టు పనులు వేగవంతం కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు సిద్ధమైంది. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతోంది. ఆగస్టు 15న కనిగిరి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. 15 రోజులకు పైగా కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం, నియోజకవర్గాల్లో 207 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభం సందర్భంగా కనిగిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నేతలే కాక పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ఉద్దేశం ఇదీ.. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా నీటిని మల్లించి ప్రకాశం జిల్లాలోని 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాసిరెడ్డినాయన మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వరికుంటపాడు, దుత్తలూరు, సీతారాంపురం, మర్రిపాడు తదితర మండలాల పరిధిలో 84,000 ఎకరాలకు సాగునీరుతో పాటు 15.25 లక్షల మందికి తాగునీరును అందించడమే వెలిగొండ ప్రాజెక్టు ఉద్దేశం. వైఎస్సార్ హయంలో అధిక నిధులు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు పనుల కోసం 2004 నుంచి 2009 వరకు రూ.1734.35 కోట్లు కేటాయింపులు చేయగా రూ.1466.46 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన పనులన్నీ వైఎస్ హాయంలోనే పూర్తయ్యాయి. బాబు అధికారం చేపట్టాక 5వ బడ్జెట్తో కలిపి రూ.1208.4 కోట్లు కేటాయింపులు చేసినట్లు చెబుతున్నా ఆ నిధుల్లో కొంత మేర మాత్రమే ఖర్చు చేశారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో రూ.2,634 కోట్లు అదనంగా పెంచుకొని అటు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు ప్రజాధనం దోపిడీకి సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లు కోట్లు కొల్లకొట్టడంతో చూపిస్తున్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలున్నాయి. నీటి విడుదలపై పూటకోమాట... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ముగిసింది. వెలిగొండ ద్వారా నీళ్లిస్తామంటూ మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. టన్నెల్ పనులు మూడు నెలలుగా పూర్తిగా నిలిచి పోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 నాటికి కూడా టన్నెల్–1 పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. 2016 చివరి నాటికే తొలుత వెలిగొండ నీళ్ళిస్తామన్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మాట మార్చి 2017, 2018 డిసెంబర్కు తాజాగా 2019 సంక్రాంతి అంటున్నారు. తాజా పరిస్థితి చూస్తే ఫేజ్–1 పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి మాట నెరవేరే పరిస్థితి లేదు. నత్తనడకన జరుగుతున్న పనులను చూస్తే నిర్దేశిత గడువుకు ఫేజ్–1 పనులు పూర్తి కావడం కలే. పునరావాసం దోపిడీ.. వెలిగొండ ప్రాజెక్టు కింద మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, గొట్టిపడియా, అక్కచెరువు, సాయినగర్, కృష్ణానగర్, లక్ష్మిపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతండా తదితర గ్రామాలు ముంపుకు గురి కానున్నాయి. ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గతంలో ఇందుకోసం రూ.58 కోట్లు కేటాయించగా, తాజాగా ఆ మొత్తాన్ని రూ.489 కోట్లకు పెంచడం గమనార్హం. మొత్తంగా అంచనాలను పెంపు పేరుతో బాబు ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలున్నాయి. -
పాదయాత్ర చేయనున్న మాజీ ఎంపీ
సాక్షి, ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేయనున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు పాదయాత్ర రూట్మ్యాప్ను వైఎస్సార్సీపీ నేతలు సమావేశమై ఖరారు చేశారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు కోసం జిల్లా ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ ప్రభుత్వంలోనే వెలిగొండ 70శాతం పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే గడువు ప్రతి ఏడూ చంద్రబాబు మార్చుకుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు తాగు నీటి కోసం అల్లాడుతున్నారని వివరించారు. చంద్రబాబు ఎన్నిసార్లు జిల్లా ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. సంక్రాంతి కానుకగా వెలిగొండ ప్రాజెక్టు ఇస్తా అంటూ జిల్లా ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయబోతున్నారని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. వెలిగొండపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తోందో ప్రజలకు వివరించేందుకు ఆగస్టు 15 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. జగన్ని ఎదుర్కొనే దుమ్ములేకే ఆయన సతీమణిపై టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కోర్టులో డాక్యుమెంట్స్ దాఖలు చేయకుండానే పచ్చ పత్రికలు ఎలా రాశాయని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు కేసులకు, బెదిరింపులకు తాము బయపడమని స్పష్టం చేశారు. అన్నీ ఎదుర్కొంటామని, ఎలాంటి కేసులయినా చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. -
కంభం చెరువు కరువుకు దర్పణం
కంభం: ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు నాడి వంటిదని అటువంటి ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈప్రాంత ప్రజలు సాగు, తాగు నీరందక అల్లాడుతున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశామలం చేస్తామని చెప్పారు. సోమవారం కంభం చెరువు సందర్శించిన ఆయన ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కంభం చెరువును ఎడారిని తలపించడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వానికి కంభం చెరువు కనబడటం లేదా..? అని ప్రశ్నించారు. గత 40 ఏళ్ళల్లో కంభం చెరువు నిండింది మూడు సార్లు అంటే ఈ ప్రాంతంలో ఎంత కరువు ఉందో అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రకృతి సహకరించక వర్షాలు కూడా కురవడం లేదన్నారు. ఫలితంగా కంభం చెరువుపై ఆధార పడిన నాలుగు మండలాల ప్రజలు తాగు, సాగు నీరందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పైభాగంలో గుండ్లకమ్మ, జంపలేరుపై కడుతున్న కట్టడాల నుంచి వర్షాలు కురిసినప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా కంభం చెరువుకు రావాల్సిన నీటిని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. చెరువు 18 అడుగుల మేర పూడి పోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.12 కోట్లు జపాన్ నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చెరువు అభివృద్ధి జరగకుండానే నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. ఏడాదికి కిలో మీటర్ కూడా తవ్వలేదు. అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో కేవలం రూ.600 కోట్లు ఖర్చుపెట్టి కనీసం మూడున్నర కిలోమీటర్ల సొరంగం కూడా తవ్వలేదన్నారు. నాలుగేళ్లలో నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తి చేయని చంద్రబాబు 6 నెలల్లో 3 కిలోమీటర్ల పనులు పూర్తిచేసి నీళ్లిస్తానని చెప్పడం ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం తెస్తాం.. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ నీటివల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కమీషన్ల కోసం టెండర్లు పిలిచే కార్యక్రమం చేస్తుందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేసేలా కనబడటం లేదని విమర్శించారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని 5 నియోజకవర్గాల్లో ప్రజలను సమాయత్తం చేసి ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని అప్పటికి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సంలోగా పూర్తి చేసి కంభం చెరువులో 365 రోజులు నీళ్లు ఉండేలా చేసే బాధ్యత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆయన వెంట పార్టీ గిద్దలూరు నియోజకవర్గ కన్వీనర్ ఐవీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, అభిషేక్రెడ్డి, కంభం మండల కన్వీనర్ లాయర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు ఉన్నారు. -
సీఎం రమేశ్ సంస్థకే ‘వెలిగొండ’ పనులు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో ‘సాక్షి’ చెప్పిందే జరిగింది. హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ రెండో టన్నెల్(సొరంగం) టెండర్లలో అధికారులు శుక్రవారం ఫైనాన్స్(ఆర్థిక) బిడ్ తెరిచారు. 4.65 శాతం ఎక్సెస్కు(అదనపు ధర) టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆ సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు వెలిగొండ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జబ్బార్ నివేదిక పంపారు. కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యేలా ముఖ్యనేత చక్రం తిప్పడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ ఎత్తున భారం పడింది. ఈ వ్యవహారంలో ముఖ్యనేత రూ.కోట్లలో లబ్ధి పొందనున్నారు. వ్యూహం ప్రకారమే ఎల్–1గా రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులకు ఏప్రిల్ 26న నిర్వహించిన టెండర్లలో అక్రమాలను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. మే 8న మళ్లీ టెండర్లు పిలిచింది. ఈ పనులను ఎలాగైనా సీఎం రమేశ్కు అప్పగించాలని ముందే నిర్ణయించిన ముఖ్యనేత కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యేలా చక్రం తిప్పారు. ఫలితంగా తన కోటరీలో ప్రధాన కాంట్రాక్టర్ అయిన సీఎం రమేశ్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్, నవయుగ, పటేల్ ఇంజనీరింగ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇది గతనెల 24న తెరిచిన టెక్నికల్ బిడ్లో వెల్లడైంది. శుక్రవారం తెరిచిన ఫైనాన్స్ బిడ్లో లాలూచీ పర్వం బహిర్గతమైంది. సీఎం రమేశ్ సంస్థ 4.65 శాతం ఎక్సెస్కు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిస్తే.. నవయుగ 4.87 శాతం ఎక్సెస్కు బిడ్ దాఖలు చేసి ఎల్–2గా, పటేల్ సంస్థ 4.91 శాతం ఎక్సెస్కు బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలివడమే కుమ్మక్కు పర్వానికి నిదర్శనం. తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన సీఎం రమేశ్ సంస్థకు పనులు అప్పగించాలని వెలిగొండ చీఫ్ ఇంజనీర్ సీవోటీకి ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదం తెలపడమే తరువాయి.. ఆ పనులను సీఎం రమేశ్ సంస్థకు అప్పగించనున్నారు. -
‘వెలిగొండ’లో విస్తుగొలిపే అవినీతి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల(సొరంగాల) పనుల్లో ముఖ్యనేత, మరో కీలక మంత్రి అందిన కాడికి మింగేయాలని తహతహలాడుతున్నారు. మొదటి టన్నెల్లో రూ.89.50 కోట్ల విలువైన పనులను వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్ఫ్రా సంస్థకు నామినేషన్ విధానంలో కట్టబెట్టాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెస్తున్నారు. పాత కాంట్రాక్టర్ నుంచి 60సీ నిబంధన కింద ఈ పనులను తొలగించాలంటే స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని చెబుతున్నా లెక్కచేయడం లేదు. కావాల్సిన వారికి పనులు కట్టబెట్టి, కమీషన్లు నొక్కేయాలన్నదే వారి అసలు వ్యూహం. నామినేషన్పై అప్పగించాలట! వెలిగొండ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గడువు తక్కువగా ఉంది, పనులు త్వరగా పూర్తి కావాలనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై వేటు వేసింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.601.49 కోట్లు పెంచేసింది. అస్మదీయులైన కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించి రూ.300 కోట్లకు పైగా కమీషన్లు కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ఇటీవల టెండర్లు నిర్వహించారు. మొదటి టన్నెల్లో కొన్ని పనులే మిగిలిపోయాయి. వీటి విలువ రూ.25.43 కోట్లకు మించదు. ఆ పనులపై టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి కన్ను పడింది. దాంతో సదరు పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, శ్రీనివాసరెడ్డి సంస్థకు నామినేషన్పై అప్పగించాలని ముఖ్యనేత ఆదేశించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక రూ.89.50 కోట్ల విలువైన పనులను శ్రీనివాసరెడ్డి సంస్థకు నామినేషన్పై అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. సీఎస్ అభ్యంతరాలు బేఖాతర్ వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ చానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల తవ్వకం పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించకుండానే గతేడాది మార్చి 23న ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. ముఖ్యనేత, కీలక మంత్రి బెదిరింపుల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి సంస్థ మినహా ఇతరులెవరూ బిడ్ దాఖలు చేయలేదు. దాంతో సింగిల్ బిడ్నే ఆమోదించాలంటూ హైపవర్ కమిటీకి వెలిగొండ అధికారులు ప్రతిపాదనలు పంపారు. భారీ పనులు చేసే సామర్థ్యం లేని ఆర్కే ఇన్ఫ్రాకు రూ.91.52 కోట్ల విలువైన పనులను ఎలా అప్పగిస్తారంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదిర్శ దినేష్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్కే ఇన్ఫ్రాకు అప్పట్లో రూ.91.52 కోట్ల పనులను దొడ్డిదారిన అప్పగించగా, ఇప్పుడు రూ.89.50 కోట్ల విలువైన పనులు నామినేషన్పై కట్టబెడుతుండడం వెనుక లోగుట్టు ఏమిటన్నది తెలిసిందే. చేయని పనులకు రూ.11.67 కోట్లు చెల్లింపు సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్ మీదుగా పడవపై కొల్లం వాగుకు చేరుకోవాలి. కానీ, భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా ఆర్కే ఇన్ఫ్రా మాయాజాలం ప్రదర్శించింది. ఆ సంస్థతో కుమ్మక్కైన అధికారులు చేయని పనులు చేసినట్లు రూ.11.67 కోట్లు చెల్లించేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ విచారణకు ఆదేశించారు. కానీ, ముఖ్యనేత రంగ ప్రవేశంతో విచారణ ప్రాథమిక దశలోనే అటకెక్కింది. -
‘వెలిగొండ’ టెండర్లలో సీఎం రమేష్ చేతివాటం
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల(సొరంగాల) టెండర్లలో లాలూచీ పర్వం మరోసారి బట్టబయలైంది. రెండో టన్నెల్ పనుల్లో రూ.300 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేసేందుకు ముఖ్యనేత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్, నవయుగ, పటేల్ ఇంజనీరింగ్ సంస్థలతో అదనపు(ఎక్సెస్) ధరలకు బిడ్లు దాఖలు చేయించారు. శనివారం ఫైనాన్స్(ఆర్థిక) బిడ్ను తెరిచి, సీఎం రమేష్ సంస్థకు ఈ పనులు అప్పగించనున్నట్లు సమాచారం. వెలిగొండ ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టన్నెళ్ల పనులను వేగవంతం చేయాలన్న సాకు చూపి నిబంధనలు తుంగలో తొక్కి 2016 జూలై 5న కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లు ఇచ్చేసింది. అయినా పనుల్లో వేగం పెరగడం లేదంటూ 60సీ నిబంధన కింద రెండు టన్నెళ్ల కాంట్రాక్టర్లపై వేటువేసింది. మొదటి టన్నెల్లో మిగిలిపోయిన 3.6 కిలోమీటర్ల పనుల విలువను రూ.116.44 కోట్లుగా.. రెండో టన్నెల్లో మిగిలిపోయిన 8.037 కిలోమీటర్ల పనుల విలువను రూ.299.48 కోట్లుగా స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) లెక్కగట్టింది. అయితే, ముఖ్యనేత ఒత్తిడి మేరకు మొదటి టన్నెల్లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.292.15 కోట్లు, రెండో టన్నెల్లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేసింది. నోటిఫికేషన్కు ముందే బేరసారాలు మొదటి టన్నెల్ పనులకు రూ.234.04 కోట్ల అంచనా వ్యయంతో, రెండో టన్నెల్ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి 26న టెండర్ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ చేయకముందే కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు జరిపారు. పెంచిన అంచనా వ్యయం రూ.596 కోట్లలో.. సింహభాగాన్ని కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి పథకం రచించారు. గత నెల 20న ఫైనాన్స్ బిడ్ తెరిచారు. తొలి టన్నెల్ పనులకు ఇద్దరు కాంట్రాక్టర్లు, రెండో టన్నెల్ పనులకు ఒకే కాంట్రాక్టర్ బిడ్లు దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ టెండర్లను ఆమోదించకూడదు. అయినా ఆమోదించాలంటూ ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రెండో టన్నెల్ టెండర్లను రద్దు చేశారు. రెండోసారీ అదే తీరు రెండో టన్నెల్కు 570.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్)– ఓపెన్ విధానంలో ఈ నెల 8న మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు సంస్థలతో అదనపు ధరలకు టెండర్లు దాఖలు చేయించేలా ముఖ్యనేత వ్యూహం రచించారు. అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన సంస్థకు పనులు దక్కేలా మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో బిడ్లు దాఖలు చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. బుధవారం తెరిచిన టెక్నికల్ బిడ్లో కుమ్మక్కు పర్వం బహిర్గతమైంది. శనివారం ఫైనాన్స్ బిడ్ తెరిచి, సీఎం రమేష్ సంస్థకు పనులు కట్టబెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 300 కోట్ల రూపాయలకుపైగా ముడుపులు చేతులు మారనున్నట్లు అంచనా. -
డిసెంబర్కు నీళ్లంట..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే డిసెంబర్ నాటికే టన్నెల్–1 పనులు పూర్తిచేసి వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారం నీరు–ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కందుకూరులో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు. గత నాలుగేళ్లలో వెలిగొండ నీటిని ఏడాదికొకమారు చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం తాజాగా వచ్చే డిసెంబర్కే వెలిగొండ నీరంటూ సరికొత్త ప్రకటన చేయడంపై జిల్లా వాసులే కాక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్లుగా వెలిగొండ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల కాలంలో దాదాపుగా పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.204 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో పాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ప్రభుత్వానికి పాత కాంట్రాక్టర్లకు మధ్య విబేధాలు తలెత్తాయి. పాత వారికి బిల్లులిచ్చి పనులను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా పాత కాంట్రాక్టర్లను తప్పించి కొత్తవారికి పనులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. పనుల అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకొని రూ.234 కోట్ల టన్నెల్–1 పనులతో పాటు రూ.570 కోట్ల టన్నెల్–2 పనులకు ఇటీవలే టెండర్లు పిలిచింది.పాత కాంట్రాక్టర్లయిన షబీర్, షూ, ప్రసాద్, కోస్టల్, హెచ్సీసీకంపెనీలు కోర్టుకు వెళ్ళడంతో టెండర్ల వ్యవహారంపెండింగ్లో పడింది. ఇప్పటి వరకు జరిగిన టన్నెల్ పనులు.. ఇప్పటి వరకు 18 కి.మీ. టన్నెల్–1 పనుల్లో 15.167 కిలోమీటర్లు, 18 కిలోమీటర్ల టన్నెల్–2 పనుల్లో 10.708 కిలోమీటర్లు పని మాత్రమే పూర్తయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి టన్నెల్–1లో 13 కి.మీ. మేర పని పూర్తయింది. ఇంకా 5 కి.మీకుపైనే పని పెండింగ్లో ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో కేవలం రెండున్నర కి.మీ. మాత్రమే పని జరిగింది. చంద్రబాబు చెప్పినట్లు టన్నెల్–1 పనులను పూర్తిచేసి ఫేజ్–1లో వెలిగొండ ద్వారా నీరివ్వాలంటే ఇంకా 3 కి.మీ.కుపైనే టన్నెల్ను తవ్వాల్సి ఉంది. దీంతో పాటు రూ.100 కోట్ల నిధులతో చేపట్టిన కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. రాబోయే డిసెంబర్ అంటే ఏడున్నర నెలల కాలమే. ఏడున్నర నెలలో 3 కి.మీ. మేర టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఇది ఎంత మేర సాధ్యమన్నది ప్రశ్నార్థకం. బాబు కొత్త హామీపై జిల్లా ప్రజలతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు అధికారంలోకి వస్తూ్తనే 2016 నాటికి వెలిగొండ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేస్తామన్నారు. అప్పటి నుంచి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వెలిగొండ నీటి విడుదలకు కొత్త తేదీలను ప్రకటిస్తూనే ఉన్నారు. పనులు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. బాబు హామీలు నీటి మూటే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పని చేయకుండా బిల్లులు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్లో ఎస్టిమేషన్లను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, మంత్రి దేవినేని ఉమ సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయం, ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, మనసులో మాట పుస్తకంలోనే ఆ విషయం చెప్పారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మన వాడే రూ.13.27 కోట్లు ఇచ్చేయ్..!
సాక్షి, అమరావతి: చిన్న పనే చేయలేక చేతులెత్తేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థకు పెద్ద పనిని అప్పగించడం ద్వారా అక్రమాలకు తెరలేపిన సర్కారు.. అధికారులపై ఒత్తిడి తెచ్చి చేయని పనులకు రూ. 11.67 కోట్లను అక్రమంగా బిల్లులు చెల్లించింది. ఈ అక్రమాలకు వెలిగొండ ప్రాజెక్టు వేదికగా మారింది. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించకుండానే రూ.91.52 కోట్ల విలువైన పనులను సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను గతేడాది ఆగస్టు 9న శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా సంస్థకు ఖరారు చేశారు. అయితే హంద్రీ–నీవాలో మూడు మీటర్ల వ్యాసార్థంతో కూడిన చిన్న సొరంగం పనులే చేయలేని సంస్థకు వెలిగొండ ప్రాజెక్టులో 9.2 మీటర్ల వ్యాసార్థంతో భారీ సొరంగం తవ్వకం పనులను అప్పగించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ హైపవర్ కమిటీ సమావేశంలో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలంటూ సర్కార్కు ప్రతిపాదించడం అప్పట్లో సంచలనం రేపింది. అయినా సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ఒత్తిళ్లతో ఆ పనులు శ్రీనివాసరెడ్డికే దక్కాయి. సొరంగం తవ్వకుండానే బిల్లులు: వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్ మీదుగా పడవపై కొల్లంవాగుకు చేరుకోవాలి. యంత్ర సామాగ్రిని అక్కడికి తరలించాలంటే భారీ పడవలు అవసరం. కానీ.. భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా మాయాజాలం చేశారు. సొరంగాల తవ్వకం, హెడ్ రెగ్యులేటర్ పనుల పునాదుల కోసం 31,312 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,87,645 క్యూబిక్ మీటర్ల రాతి తవ్వకం పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.11.67 కోట్లను చెల్లించేశారు. కానీ.. వీటిని ఎం–బుక్లో రికార్డు చేయలేదు. సొరంగం పనులు ఎన్ని మీటర్లు, ఎంత ఎత్తులో చేశారన్న లెక్కలు కూడా తీయలేదు. ఎం–బుక్లో రికార్డు చేయకుండా పీఏవో(పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్) బిల్లులు చెల్లించరు. కానీ.. ఉన్నతస్థాయి ఒత్తిడి రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పీఏవో బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. కోటరీ కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదుతో.. శ్రీనివాసరెడ్డి సంస్థకు కట్టబెట్టిన పనుల కోసం సీఎం కోటరీలోని ఎంపీకి చెందిన కాంట్రాక్టు సంస్థ పోటీ పడింది. కానీ సీఎం సూచనల మేరకు ఆ తర్వాత వెనక్కు తగ్గింది. వెలిగొండ సొరంగాల పనుల కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. మిగిలిన పనులకు తాజాగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనులపై కన్నేసిన ఎంపీ సంస్థ ప్రతినిధులు ఇటీవల వెలిగొండ సీఈ జబ్బార్తో సమావేశమైనట్లు తెలిసింది. ఆ తర్వాత శ్రీశైలం జలాశయం మీదుగా కొల్లంవాగు వద్దకు వెళ్లి సొరంగాలను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి సంస్థకు పనులు అప్పగించి ఆర్నెళ్లయినా పనులు ప్రారంభించలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన సీఈ జబ్బార్ అధికారులను ఆరా తీయగా రూ.11.67 కోట్ల విలువైన పనులను చేసినట్లు ఈఈ వివరించారు. ఆ సంస్థ పనులే ప్రారంభించలేదు కదా.. బిల్లులు ఎలా చెల్లిస్తారని సీఈ జబ్బార్ నిలదీయడంతో అసలు విషయం బయటపడిందని అధికారవర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ నుంచి సాంకేతిక అనుమతి లేకుండా ప్రారంభించిన సన్నాహక పనులకు మరో రూ.13.27 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇంతలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రంగంలో దిగడంతో విచారణ అటకెక్కినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై వెలిగొండ ఎస్ఈ రెడ్డెయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బిల్లులు చెల్లించామని చెప్పారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించామన్నారు. పనులకు సీడీవో సీఈ నుంచి అనుమతి రానిమాట వాస్తవమేనని వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తామేమీ నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలిపారు. -
ఎన్నాళ్లు మోసగిస్తారు?
మార్కాపురం/పెద్దదోర్నాల: మూడు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ మూడేళ్లుగా ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ మాట్లాడుతూ టన్నెల్–1 పూర్తి కావాలంటే రూ.150 కోట్లు, టన్నెల్–2కు రూ.350 కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రభుత్వం 2014–15లో రూ.50 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించినట్టు చెప్పారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సుమారు రూ.37 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వెలిగొండ మొదటి టన్నెల్ పనులు 2008 ఆగస్టు 19న ప్రారంభం కాగా, 2014 నాటికి 12 కిలోమీటర్లు పూర్తయ్యాయని చెప్పిన ఎంపీ వైవీ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం 3 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మొదటి టన్నెల్కు 6 కోట్లు, 2వ టన్నెల్కు 3 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. రెండవ టన్నెల్ పనులు 2009లో ప్రారంభం కాగా, మొత్తం 18.82 కిలోమీటర్లుకు గానూ 2014 నాటికి 10.68కిలోమీటర్ల దూరం పూర్తయిందని, 2014 నుంచి ఇప్పటి వరకు 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయన్నారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 36 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయగా, ఇప్పుడు రూ.97 కోట్లతో ప్రతిపాదనలు చేశారన్నారు. మొదటి టన్నెల్ పనులు 2018 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇప్పటికి 14.92 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. రోజుకు ఐదారు మీటర్లకు మించి పనులు జరగటం లేదని ఎంపీ చెప్పారు. వెలిగొండతో కరువు దూరం.. ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 735 గ్రామాలు, నెల్లూరు జిల్లాలో 30, కడప జిల్లాలో 30 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 3.35 లక్షల ఎకరాలకు సాగునీరు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గల్లోని 80 వేల ఎకరాలు, కడప జిల్లాలోని పొరుమామిళ్ల, కలసపాడు, బద్వేలు ప్రాంతాల్లో 26వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఎంపీ వైవీ అన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, నాలుగేళ్లుగా వర్షాలు లేక, పంటలు పండక, తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ ప్రాంతంలో కరువు పోతుందని, 2018కి ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆర్ఆర్ ప్యాకేజిని నిర్వాసిత గ్రామాల ప్రజలకు తక్షణమే అందించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన పాదయాత్ర పూర్తయిన తరువాత వెలిగొండ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో పాదయాత్ర చేపడతామని ఆయన చెప్పారు. పోలవరంతోపాటు వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ వెంట మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పిడతల సాయి కల్పనారెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, పెద్దారవీడు, తర్లుపాడు, పెద్దదోర్నాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు మాలకొండయ్య, రామనారాయణరెడ్డి, సాయి రాజేశ్వరరావు, రంగారెడ్డి, డి.వెంకటరెడ్డి, బాషాపతిరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, కె.నరసింహారావు, మెట్టు వెంకటరెడ్డి, నల్లబోతుల కొండయ్య, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, జంకె ఆవులరెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి, రమణమ్మ, ఆవులమంద పద్మ, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వెలిగొండ ప్రాజెక్టు డీఈలు ఏకాంబరేశ్వరయ్య, రామమోహనరావు ఉన్నారు. దోచుకోవడానికే కాంట్రాక్టర్ మార్పు.. పాత కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకుండా 60సీ జీఓ విడుదల చేసి కడప జిల్లాకు చెంది టీడీపీ నేతగా ఉన్న కొత్త కాంట్రాక్టర్ను నియమించుకుంటున్నారని ఎంపీ చెప్పారు. 2వ టన్నెల్ పనులు 2019మే నాటికి పూర్తి చేయాల్సి ఉండగా నిధులు లేక పాత బకాయిలు చెల్లించకపోవటంతో ప్రాజెక్టు పనులు రెండు నెలల నుంచి నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 500 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభిస్తే టన్నెల్ పనులు పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా, చంద్రబాబునాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో మూడేళ్లుగా వెలిగొండ ప్రాజెక్టును 2018కి పూర్తి చేస్తామంటూ ప్రకటిస్తున్నారని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే కచ్చితంగా వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కాంట్రాక్టర్లను మార్చినంత మాత్రాన దోపిడీ జరగటమే తప్ప, పనులు ముందుకు జరగవన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. -
వెలి‘కొండంత’ అవినీతి!
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో కొండంత అవినీతి బయటపడుతోంది. కాంట్రాక్టర్లతో కలసి ముఖ్యనేత, మరో కీలక మంత్రి భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేయడానికి వ్యూహం రచించారు. పనులు వేగవంతం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ తీర్మానం ద్వారా కాంట్రాక్టర్లకు గతంలో రూ. 68.44 కోట్లు అదనపు నిధులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని చెప్పి 60సీ నిబంధన కింద వేటు వేయాలని నిర్ణయించారు. ఇంకోవైపు జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 5,150 కోట్ల నుంచి రూ. 7,784.28 కోట్లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. తద్వారా అంచనా వ్యయాన్ని రూ. 2,634.28 కోట్లు పెంచేశారు. పెంచిన ధరలతో మళ్లీ టెండర్లు పిలిచి, తమ కోట రీలోని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి భారీ ఎత్తున దోచుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. పెంపులో దోపిడీ వ్యూహం.. శ్రీశైలం జలాశయం నుంచి 43.5 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 885 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో రూ. 5,150 కోట్ల వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. ఏడు ప్యాకేజీల కింద పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు ప్రధాన మైనవి. మొదటి సొరంగాన్ని 7 మీటర్ల వ్యాసా ర్థంతో 18.828 కి.మీలు, రెండో సొరంగాన్ని 9.2 మీటర్ల వ్యాసార్థంతో 18.838 కి.మీలు తవ్వాలి. వీటిలో మొదటి సొరంగం పనులను రూ.624.60 కోట్లకు, రెండో సొరంగం పనులను రూ.735.21 కోట్లకు కాంట్రా క్టర్లకు అప్పగించారు. 2006 నుంచి 2014 వరకు మొదటి సొరంగం పనుల్లో 13.146 కి.మీలు, రెండో సొరంగం పనులు 9.413 కి.మీలు పూర్తి చేశారు. సొరంగాల పనులను త్వరితగతిన పూర్తి చేయడం పేరుతో కాంట్రా క్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ ముఖ్యనేత, కీలక మంత్రి కలసి భారీ దోపిడీకి వ్యూహం రచించారు. మొదటి సొరంగాన్ని 4.233 కి.మీలు, రెండో సొరంగాన్ని 8.275 కి.మీల మేర ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి సొరంగం అంచనా వ్యయాన్ని రూ. 930.99 కోట్లకు, రెండో సొరంగం అంచనా వ్యయాన్ని రూ. 1,031 కోట్లకు పెంచారు. మిగిలిపోయిన మొదటి సొరంగం పనులను రూ. 306.39 కోట్లకు, రెండో సొరంగం పనులను రూ. 483.37 కోట్లకు కొత్తగా టెండర్లు పిలవనున్నారు. ఐదు ప్యాకేజీల్లోనూ అదే దందా.. - రెండో ప్యాకేజీ కింద ఫీడర్ కెనాల్, తీగలేరు గ్యాప్, కెనాల్ పనులను రూ. 254.50 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందులో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ఈ ప్యాకేజీ అంచనా వ్యయాన్ని రూ. 688 కోట్లకు పెంచారు. - మూడో ప్యాకేజీ కింద గొట్టిపడియ గ్యాప్తో పాటు 14.440 కి.మీల పొడవున కెనాల్ తవ్వే పనులను రూ. 380 కోట్లకు కాంట్రాక్టర్కు అప్పగించారు. ఇప్పటికే గొట్టిపడియ గ్యాప్తో, 14 కి.మీల కెనాల్ పనులు పూర్తి చేశారు. కేవలం 0.440 కి.మీల కెనాల్ తవ్వకం మిగిలింది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ. 480 కోట్లకు పెంచారు. - నాలుగు ప్యాకేజీ కింద కాకర్ల జలాశయంతో పాటు 44.625 కి.మీల పొడవున తూర్పు ప్రధాన కాలువ తవ్వే పనులను రూ. 206 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. జలాశయం పనులు 80 శాతం పూర్తయ్యాయి. తూర్పు ప్రధాన కాలువ పనులు 700 మీటర్ల మేర మాత్రమే మిగిలింది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ. 855 కోట్లకు పెంచారు. - ఆరో ప్యాకేజీ కింద 86.20 కి.మీల పొడవున ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.1,135 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందులో ఇప్పటికే 68.20 కి.మీల పొడవునా ప్రధాన కాలువ తవ్వేశారు. 18 కి.మీల మేర కాలువ తవ్వాల్సి ఉంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ. 1,448 కోట్లకు పెంచారు. - ఏడో ప్యాకేజీ కింద పశ్చిమ ఉపకాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.757 కోట్ల నుంచి రూ.977 కోట్లకు పెంచారు. ఈ ఐదు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. - ప్రాజెక్టుకు 41,130 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకూ 29 వేల ఎకరాలు సేకరించారు. భూసేకరణ వ్యయాన్ని రూ.970 కోట్లకు పెంచారు. మొత్తం పనుల వ్యయం రూ.1,159 కోట్లకు పెంచారు. వెరసి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 2,634.28 కోట్లు మేర పెంచారు. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి చేసి రూ. 4,485.28 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. గతేడాది వరకూ పట్టించుకోని ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం 2016 జూన్ 24 వరకూ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. అప్పుడు జరిగిన కేబినెట్లో జూన్, 2017 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని తీర్మానించారు. కన్వేయర్ బెల్ట్లు, టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లకు కొత్త బుష్లను సమకూర్చితేనే రోజుకు కనీసం పది మీటర్ల వంతున సొరంగం తవ్వవచ్చని తేల్చారు. వాటిని సమకూర్చుకోవడానికి నిబంధనలను విరుద్ధంగా మొదటి సొరంగం కాంట్రాక్టర్లకు ఒకేసారి రూ. 50.15 కోట్లు, రెండో సొరంగం కాంట్రాక్టర్కు ఒకేసారి రూ. 18.29 కోట్లను జూలై 5, 2016న అదనంగా ఇచ్చారు. ఇప్పటి వరకూ మొదటి సొరంగం కాంట్రాక్టర్ రోజుకు కేవలం 2.86 మీటర్ల చొప్పున 1,459 మీటర్ల మేర తవ్వితే, రెండో సొరంగం కాంట్రాక్టర్ రోజుకు 2.25 మీటర్ల చొప్పున 1,150 మీటర్ల మేర తవ్వారు. విచిత్రం ఏంటంటే.. ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వక ముందు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు మీటర్లు తవ్వేవారు. ఈ పనులను బట్టి అదనంగా ఇచ్చిన రూ. 68.44 కోట్లను కాంట్రాక్టర్లతో కలసి కీలక మంత్రి కాజేసినట్లు స్పష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. బోరింగ్ మెషీన్లను జర్మనీ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి.. వారి ముసుగులో పాత కాంట్రాక్టర్లతోనే పనులు చేయించి, పెంచిన వ్యయాన్ని దోచుకోవాలన్నది ముఖ్యనేత ఎత్తుగడని జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇప్పటివరకూ తొలి సొరంగం కాంట్రాక్టర్కు రూ. 629.54 కోట్లు, రెండో సొరంగం కాంట్రాక్టర్కు రూ. 547.63 కోట్లు చెల్లించారు. -
వెలిగొండ పనులు టీడీపీ ఎంపీకి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఇష్టానుసారంగా మార్చి వేస్తోంది. ఇటీవలే రూ.91.15 కోట్ల కొల్లంవాగు హెడ్రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తప్పించి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి చెందిన ఆర్కె ఇన్ఫ్రాకు కట్టబెట్టిన సర్కారు తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని టన్నెల్–1, 2 పరిధిలోని పనులను సైతం కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. టన్నెల్–1 పనులను కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించనున్నారు. టన్నెల్–2 పనులను కోస్తా ప్రాంతానికి చెందిన మెగా కన్స్ట్రక్షన్స్కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పనుల కేటాయింపుకు సంబంధించిన తంతు నేడో.. రేపో..ముగియనుంది. ఇప్పటికే ఒకమారు అంచనాలను పెంచుకొని పనులు వేగవంతం చేయని ప్రభుత్వం టన్నెల్–1,2 పనుల అంచనాలను మరోమారు భారీగా పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. పనుల అప్పగింతకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో పెద్దలకు కోట్లాది రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు టన్నెల్–1 పనులను ప్రసాద్, షూ, సబీర్ జాయింట్ వెంచర్ చేస్తుండగా కోస్టల్ కంపెనీ టన్నెల్–2 పనులను చేస్తోంది. టన్నెల్–1 పనులు 18.820 కిలోమీటర్ల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 14.755 కి.మీ మాత్రమే చేశారు. ఇక టన్నెల్–2 పనులు 18.838 కి.మీకు గాను ఇప్పటి వరకూ 10.72 కి.మీ మాత్రమే చేశారు. టన్నెల్–2 పనులు పూర్తిగా ఆగాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోనే పనులు చేయలేని పరిస్థితి నెలకొందని పాత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇప్పటి వరకూ రూ.50 కోట్లమేర పాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు పాతరేట్లు గిట్టుబాటు కావడం లేదని, రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోని సర్కార్ రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచి పనులను అధికార పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. పనులు అధికార పార్టీకి చెందిన ఎంపీ, మరికొందరికి అప్పగించేందుకు ఇరిగేషన్ కీలక అధికారి కీలకపాత్ర పోషించగా కిందిస్థాయి అధికారులు సైతం ఇందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. తొలుత పనులు అప్పగించిన కాంట్రాక్టర్లకు నిధులిచ్చి పనులు వేగంగా వేయించడంలో శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం దానిని గాలికొదిలింది. అవే పనులను మరోమారు కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి కోట్లు కొల్లగొట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు స్వాధీనం చేసుకున్న కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో అందిన కాడికి దండుకొని ఆ తర్వాత పనులు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. కొల్లంవాగు హెడ్రెగ్యులేటర్ పనులను సైతం జులైలో అధికార పార్టీ నేతకు అప్పగించినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం గమనార్హం. వెలిగొండ టన్నెల్–1 పనితో పాటు కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనిని పూర్తి చేసి తొలుత 2017 నాటికే నీళ్లిస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట మార్చి 2018 డిసెంబర్కు నీళ్లిస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. పనుల తీరు ఇలాగే కొనసాగితే మొదటి దశ పనులు ఏడాదిలో పూర్తి కావడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టడం మాని చిత్తశుద్ధితో పని చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
వెలిగొండ.. అంచనాల కొండ
ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలో అంచనాలు పెంచుకొనే విషయంలో ప్రభుత్వం చూపించే శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించడం లేదు. 2017 నాటికే పనులు పూర్తిచేసి జిల్లా వాసులకు సాగు, తాగునీరందిస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు మాటమార్చి 2018 నాటికి నీరంటోంది. పనుల తీరుచూస్తే మరో పదేళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచుకొని ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2013–14 ప్రారంభంలో రూ.5,150 కోట్ల అంచనాలతో ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా ఈ అంచనాలను రూ.7,784 కోట్లకు పెంచుతూ ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి ఫిబ్రవరిలో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అంచనాలను పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేడో, రేపో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. భారీగా పెంచుకున్న అంచనాలు.. ప్యాకేజీ–1 నుంచి ప్యాకేజీ–6 వరకు వివిధ రకాల పనుల అంచనాల విలువ కోట్లాది రూపాయలు పెరిగిపోయింది. ప్యాకేజీ–1లో టన్నెల్–1 పనులు గత అంచనాల కంటే రూ.306.39 కోట్లు అదనంగా పెంచారు. ప్యాకేజీ–2లో తీగలేరు ఫీడర్ కెనాల్ పనులు రూ.433.5 కోట్ల మేర పెంచారు. ప్యాకేజీ–3 పరిధిలోని గొట్టిపడియ అంచనాలను రూ.100 కోట్లు పెరిగాయి.ప్యాకేజీ–4 పరిధిలోని తూర్పు ప్రధాన కాలువ (కాకర్ల డ్యామ్) అంచనాలు ఏకంగా రూ.690 కోట్లు పెంచడం గమనార్హం. ప్యాకేజీ–5 పరిధిలో టన్నెల్–2 పాత అంచనాలు రూ.296 కోట్లు, ప్యాకేజీ–6లోని తూర్పు ప్రధాన కాలువ అంచనాలను రూ.313 కోట్లు, ప్యాకేజీ–7లో పశ్చిమ ఉపకాలువ రూ.220 కోట్ల మేర అదనంగా పెరిగింది. మొత్తంమీద రూ.2,634 కోట్లు అదనంగా పెంచారు. పనులపైనా రూ.1159 కోట్లు పెంచగా భూసేకరణ పైనా రూ.970 కోట్లు పెంచారు. కేవలం రూ.58 కోట్లున్న ఆర్.ఆర్. పనులపైన రూ.489 కోట్లు పెంచారు. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్లో సైతం రూ.16 కోట్లు పెంచారు. మొదలు కాని హెడ్ రెగ్యులేటర్ పనులు.. వెలిగొండ ప్రాజెక్టు కోసం 41,408 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా 24,908 ఎకరాలు మాత్రమే సేకరించారు. వెలిగొండ పరిధిలో 11 ముంపు గ్రామాలుండగా 2006 నుంచి ఇప్పటి వరకు ఐదు గ్రామాలకు మాత్రమే ఆర్.ఆర్. సెంటర్లు గుర్తించారు. ఇంకా ఆరు గ్రామాలను గుర్తించాల్సి ఉంది. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కోర్టు కేసులున్నా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని చేర్చే హెyŠ æరెగ్యులేటర్ పనులను ఇంత వరకు మొదలు పెట్టకపోవడం గమనార్హం. తాజాగా రూ.95 కోట్లతో హెడ్రెగ్యూలేటర్ పనులు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి సింగిల్ టెండర్ ఆమోదించింది. వాస్తవానికి హెడ్ రెగ్యులేటర్ నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం పనులు చేసే పరిస్థితి లేదు. అక్కడ వసతి లేదు. ఒక వైపు శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్, మరో వైపు ఫారెస్ట్. పట్టుమని రెండు ఎకరాల స్థలం కూడా పనులు జరిగే ప్రాంతంలో లేదు. హెడ్ రెగ్యులేటర్తో పాటు టన్నెల్ పనులను అటు వైపు నుంచి చేపడుతున్నట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అదే జరిగితే పనులకు సంబంధించిన మట్టిని ఎక్కడికి తరలించాలో తెలియని పరిస్థితి. ఫారెస్ట్లో వేద్దామంటే ఇప్పటికీ అటవీశాఖ అనుమతి లేదు. అనధికారికంగా ఫారెస్ట్ అధికారులతో ప్రాజెక్టు అధికారులు ఒప్పందానికి వచ్చే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ ద్వారా వారికి అనధికారికంగా డబ్బులు ముట్టజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది. పేరుకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ ఇప్పట్లో పని చేసే పరిస్థితి కానరావడం లేదు. మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్కు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు హెడ్రెగ్యూలేటర్ టెండర్లు పిలిచినట్లు ఇరిగేషన్ అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ లెక్కన వెలిగొండ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. -
కళ్లార్పకుండా.. కమిట్మెంట్తో అబద్ధాలు
వెలిగొండను నేనే పూర్తి చేశా కరువు లేకుండా చేశా సీమలో 24 గంటలు వ్యవసాయ విద్యుత్ ఇచ్చా శాసన మండలిలో సీఎం కనికట్టు సాక్షి, హైదరాబాద్: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో సీఎం చంద్రబాబునాయుడు తనకు తానే సాటి అని మరోసారి చాటుకున్నారు. 1995 నుంచి 2004 వరకూ తాను అధికారంలో ఉన్నంతకాలం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులను చేపడితే... వాటినెలా పూర్తి చేస్తారని చంద్రబాబు విమర్శించారు. కానీ శనివారం శాసనమండలిలో... వైఎస్సార్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను తానే చేపట్టినట్లు, ఆ ఘనత తనదేనన్నట్లు చెప్పుకోవడంపై టీడీపీ నేతలే ముక్కున వేలేసుకుంటుండటం గమనార్హం. మండలిలో చంద్రబాబు వ్యాఖ్యలను, అసలు వాస్తవాలనూ పరిశీలిద్దాం... హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని నేనే చేపట్టా. పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) వరకూ హంద్రీ-నీవా ప్రధాన కాలువను వెడల్పు చేస్తా. వరద వచ్చినపుడు అధికంగా నీటిని తీసుకెళ్తా. డిసెంబర్ నాటికి మడకశిర కుప్పం నియోజకవర్గాలకు నీళ్లందిస్తా. ఇదీ వాస్తవం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులకు 1996లో, 1999లో రెండుసార్లు చంద్రబాబు పునాదిరాయి వేసి అటకెక్కించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవాను చేపట్టి తొలి దశను పూర్తి చేశారు. రెండో దశ పనుల్లో 50 శాతం పనులను పూర్తి చేశారు. ఈ ఏడాది ఈ తొలి దశ ఆయకట్టుకింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉండగా... ఒక్క ఎకరానికి కూడా నీళ్లందించిన పాపాన పోలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారుతోందని మొన్నటివరకూ ఆందోళనలు చేశారు. ఇక అలాంటి ఆందోళనలు వద్దు. సాగునీళ్లందించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తా. వాస్తవం: తెలుగు గంగ ఆయకట్టు కింద వైఎస్సార్ జిల్లాలో ఒక్క ఎకరం కూడా సాగు చేయలేదు. కేసీ కెనాల్ కింద ఏడు వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. ఆ పంటలకూ నీళ్లందక ఎండిపోతున్నాయి. హెచ్చెల్సీ కింద ఒక్క ఎకరానికి కూడా నీటిని విడుదల చేయలేదు. కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ కింద పది వేల ఎకరాల్లో సాగు చేసిన ఆరు తడి పంటలు కూడా నీళ్లందక ఎండిపోతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేనే పూర్తి చేశా వాస్తవ చిత్రం: 1996 మధ్యంతర ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు పునాదిరాయి వేసినా పనులు మొదలు పెట్టలేదు. వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే రూ.5,150 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆయన హయాంలో రూ.2,850 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన పనులు పూర్తిచేయడంపై చంద్రబాబు దృష్టి సారించడం లేదు. కానీ.. ఆ ప్రాజెక్టు పూర్తయినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. రెయిన్గన్లు, నీటి ట్యాంకర్లతో 4,69,462 ఎకరాల విస్తీర్ణంలో నీటి ఎద్దడికి గురయిన వేరుశనగ, కంది, అపరాలు, ప్రత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలకు నీటి తడులను ఇచ్చి పంటలను రక్షించాము. నిజం ఇదీ: 9.88 లక్షల (నాలుగు లక్షల హెక్టార్లు) ఎకరాల్లో పంట చేతికి రాకుండానే ఎండిపోయింది. ఈనెల మొదటి వారానికి రాష్ట్రంలోని మొత్తం 670 మండలాలకు 309 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలినాళ్లలో విత్తిన 6,33,235 హెక్టార్లలో 4 లక్షలకు పైగా హెక్టార్ల వేరుశనగ పంట ఎండిపోయింది. ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ గుర్తించినా బయటపెట్టలేదు. కరువును పారదోలేందుకు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 24 గంటల వ్యవసాయ విద్యుత్ ఇచ్చా. ఇతర కరువు ప్రాంతాల్లో ఏడు గంటలకు మరో రెండు గంటలు అదనంగా విద్యుత్ ఇచ్చా. నా హయాంలో మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రం పయనిస్తోంది. వాస్తవ చిత్రం: అదనపు విద్యుత్ ప్రకటనకు ముందు రాష్ట్రంలో 172 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటే.. ప్రకటన తర్వాత ఇది రోజుకు 168 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ప్రభుత్వరంగ సంస్థ జెన్కో ఉత్పత్తిని సగటున రోజుకు 105 మిలియన్ యూనిట్ల నుంచి 51 మిలియన్ యూనిట్లకు తగ్గించి, దాని స్థానంలో ప్రైవేటు విద్యుత్ను కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటికీ డిస్కమ్లకు రూ. 14 వేల కోట్ల రుణభారం ఉంది. ఈ తరహాలో విద్యుత్ కొనుగోలు చేసి.. దాన్ని మిగులుగా చెప్పుకుంటున్నారు. -
అవినీతి కొండ..వెలిగొండ
– ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు – రూ.2,634 కోట్లకు పెరిగిన అంచనాలు – పనులు చేయకుండానే బిల్లులు – నత్తనడన అరకొర పనులు – పూర్తికాని భూసేకరణ – పునరావాసం గాలికి వెలిగొండ ప్రాజెక్టు..మూడు జిల్లాల రైతాంగం కడగండ్లు తీర్చే వరప్రదాయిని. ఇప్పుడు అదే ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ పెద్దలకు కల్పతరువుగా మారింది. ప్రాజెక్టు అంచనాలను ఉన్నపళంగా వేల కోట్లు పెంచేసి భారీ దోపిడీకి తెరలేపారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కోట్ల రూపాయలు కరిగిపోతున్నా..ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. వెలిగొండలో పెంచుకున్న అంచనాలు ఇవీ.. పనులు గతంలో అంచనాలు తాజా పెరిగింది కోట్ల రూపాయల్లో పా్యకేజీ 1లోని (టన్నెల్–1) రూ.624 రూ.934 రూ.306.39 పా్యకేజీ 2లో ఫీడర్ కెనాల్, తీగలేరు కెనాల్ రూ.254.50 రూ.688 రూ.434 పా్యకేజీ 3లో గొట్టిపడియ రూ.380 రూ.480 రూ.100 పా్యకేజీ 4లో కాకర్ల డ్యామ్ రూ.206 రూ.855 రూ.649 టన్నెల్–2లో ప్యాకేజీ నెం.5 రూ.735 రూ.1,031 రూ.296 పా్యకేజీ నెం.6లో తూర్పుప్రధాన కాలువ రూ.1135 రూ.1348 రూ.213 పా్యకేజీ నెం.7లో పశ్చిమ ఉపకాలువ రూ.757 రూ.975 రూ.218 మెుత్తం మీద పెరిగిన వ్యయం రూ.2,634 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ అధినేత, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచి కోట్లు దోచుకుంటున్నారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మూడు జిల్లాల రైతాంగం ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తాజా పరిస్థితి ఇది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగుస్తోంది. వెలిగొండ ద్వారా నీళ్లిస్తామంటూ ఏడాది నుంచి బాబు మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అంచనాలను మాత్రం భారీగా పెంచుకున్నారు. తొలుత నిన్న, మొన్నటి వరకు రూ.5,150 కోట్ల అంచనాలతో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు వ్యయం తాజాగా రూ.7,784 కోట్లకు చేరింది. ఈ లెక్కన రూ.2,634 కోట్లు పెంచుకున్నారు. బాబు సర్కారు పెంచిన వెలిగొండ అంచనాలను చూసి సీనియర్ ఇంజినీరింగ్ ప్రముఖులే నివ్వెరపోతున్నారు. ఇదేం దోపిడీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నత్తనడకన భూసేకరణ ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో విస్తరించిన ఉన్న వెలిగొండ ప్రాజెక్టు కింద డ్యామ్లు, రహదారులు, కాలువలు పరిధిలో మొత్తం 41,480 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. భూసేకరణ కోసం గతంలో ప్రభుత్వం కేవలం రూ.508 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయగా, చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. గతంతో పోలిస్తే అదనంగా రూ.462 కోట్లు పెంచుకున్నారు. పోనీ భూసేకరణ అయినా వేగవంతంగా చేస్తున్నారంటే అది లేదు. బాబు రెండేళ్ల పాలనలో పట్టుమని 100 ఎకరాలు కూడా సేకరించలేదు. పునరావాసం దోపిడీ వెలిగొండ ప్రాజెక్టు కింద మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, గొట్టిపడియ, అక్కచెరువు, సాయినగర్, కృష్ణానగర్, లక్ష్మిపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతండా తదితర గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గతంలో ఇందుకోసం రూ.58 కోట్లు కేటాయించగా, తాజాగా ఆ మొత్తాన్ని రూ.489 కోట్లకు పెంచడం గమనార్హం. మొత్తంగా అంచనాలను పెంపు పేరుతో బాబు ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నిలువు దోపిడీ!
♦ వెలుగొండ భూసేకరణలో భారీ అవినీతి ♦ ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు ♦ రూ.970 కోట్లకు పెరిగిన భూసేకరణ వ్యయం ♦ గత కేటారుుంపులతో పోల్చితే రూ.462 కోట్లు అదనంగా పెంపు ♦ కొత్త ప్రతిపాదనలకు నేడో.. రేపో ఆమోద ముద్ర ♦ సేకరించాల్సిన భూమి 41,480 ఎకరాలు ♦ సేకరించింది 24,908 ఎకరాలు ♦ ముందుకు సాగని భూసేకరణ అధికారపార్టీ నేతలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. వెలుగొండ భూసేకరణ పేరుతో ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచుకొని కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. భూసేకరణకు గత ప్రభుత్వం రూ.508 కోట్లు మాత్రమే కేటాయించగా తాజాగా చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. పెరిగిన అంచనాలకు ఒకటి, రెండు రోజుల్లో ఆమోదముద్ర పడనుంది. ఈ అవినీతిలో ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లుఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ కోసం గతంలో ప్రభుత్వం రూ.508 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయగా, చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. గతంతో పోలిస్తే భూముల ధరలు పెరిగాయని చూపించి అంచనాలను రూ.462 కోట్లు పెంచుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో తాజా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా నేడో.. రేపో ఆమోద ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కలిసి వెలుగొండ భూసేకరణ పేరుతో తెరలేపిన భారీ అవినీతికి ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారులు కూడా సహకారం అందించినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ప్రభుత్వ అధినేతతో పాటు నీటిపారుదల శాఖ మంత్రికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వారి సూచనల మేరకే కాంట్రాక్టర్లు దోపిడీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో అన్ని విభాగాల్లో అంచనాలు ఇబ్బడిముబ్బడిగా పెంచి కాంట్రాక్టర్లు నిలువు దోపిడీకి సిద్ధమవ్వడం పట్ల ఇంజినీరింగ్ నిపుణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో గత ప్రభుత్వాలు దోపిడీకి పాల్పడ్డాయని పనిగట్టుకొని విమర్శలు చేసే చంద్రబాబు సర్కారు ఇంత భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపడంపై నీటిపారుదల శాఖ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. పోనీ భూసేకరణ అయినా వేగవంతంగా చేస్తున్నారంటే అది లేదు. బాబు రెండేళ్ల పాలనలో పట్టుమని 100 ఎకరాలు కూడా సేకరించిన పాపానపోలేదు. పని చేయకుండానే అంచనాల పెంపు పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమవ్వడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నత్తనడకన భూసేకరణ.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో విస్తరించిన ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కింద డ్యామ్లు, రహదారులు, కాలువలు పరిధిలో మొత్తం 41,480 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ, గొట్టిపడియ, వెలుగొండ తూర్పు ప్రధాన కాలువ, ఉదయగిరి ఉపకాలువ, పడమర ఉపకాలువ, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, వెలుగొండ ప్రాజెక్టు కాకర్ల డ్యామ్, సుంకేశుల డ్యామ్ తదితర వాటి పరిధిలో ఈ మొత్తం భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 24,908 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు చెబుతున్నా 14,823 ఎకరాలు మాత్రమే భూములు సేకరించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 7,585 ఎకరాలు అటవీ భూములున్నాయి. ఈ లెక్కన ఇంకా 26,657 ఎకరాలు భూములను సేకరించాల్సి ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా భూసేకరణ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. -
భారీగా భూముల పందేరం!
మంత్రివర్గ సమావేశంలో పలు సంస్థలకు భూకేటాయింపులు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానితోపాటు పలు జిల్లాల్లో వివిధ సంస్థలకు భారీగా భూకేటాయింపులు చేస్తూ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ప్రైవేటులో కొత్తగా నాలుగు వ్యవసాయ, నాలుగు ఉద్యానవన, ఒక డెయిరీ బిజినెస్, రెండు మత్స్య యూనివర్సిటీల ఏర్పాటు కోసం త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణం కోసం అర్బన్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖలకు డిప్యుటేషన్పై వెళ్లిన వైద్యులు తిరిగి మాతృ శాఖకు రావాలని ఆదేశాలిచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-1కు 60 శాతం అడ్వాన్సు కింద రూ.20.25 కోట్లు, విదేశీ మారక ద్రవ్యంలో వచ్చిన తేడాల కింద రూ.28 కోట్లు, టన్నెల్-2కి 60 శాతం అడ్వాన్సు కింద రూ.6.69 కోట్లు, విదేశీ మారక ద్రవ్యంలో వచ్చిన తేడా కింద రూ.11.60 కోట్లు కేటాయింపు చేశారు. నాలా పన్ను వసూళ్లకు సంబంధించిన నిర్ణయంపై సమగ్ర నివేదికను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. కాకినాడ పోర్టును కమర్షియల్ పోర్టుగా మార్చేందుకు స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. వంశధార ప్రాజెక్టు భూసేకరణకు రూ.433.44 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. -
వైఎస్ హయాంలోనే వెలిగొండకు వెలుగు
* బాబు హయాంలో ఆ ప్రాజెక్టుకు గ్రహణం * తొమ్మిదేళ్ల హయంలో ఖర్చు చేసింది రూ.13.5 కోట్లే సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పరుగులు పెట్టగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి రూ. 5,150 కోట్ల అంచనా వ్యయంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 1995లోనే ప్రాజెక్టుకు అనుమతి వచ్చింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు పలుమార్లు శంకుస్థాపనలు చేశారు. ఆయన అప్పటి 9 సంవత్సరాల పాలనలో ప్రాజెక్టుకు చేసిన వ్యయం కేవలం రూ. 13.5 కోట్లే. అది కూడా చిల్లర ఖర్చు కిందే చూపించారు. నిర్మాణం కోసం చేసిన ఖర్చు దాదాపు శూన్యమే. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుకు విశేష ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఈ ప్రాజెక్టుకు రూ. 1,448.14 కోట్లు ఖర్చు చేశారు. పనులు వేగంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. అనంతరం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాలు కూడా వైఎస్ ఒరవడినే కొనసాగించాయి. వారిద్దరి హయాంలో రూ. 2053.05 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపటే ్టనాటికి ప్రాజెక్టు పనుల్లో 63 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు బాబు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన పని కేవలం 3.25 శాతమే.ప్రాజెక్టు పనుల్లో 66.25 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలను తవ్వుతున్నారు. బాబు అధికారం చేపట్టేనాటికి ఒకటో సొరంగం 6.75 కిలోమీటర్లు మిగిలిపోయి ఉండగా, ఈ రెండేళ్లకాలంలో తవ్వింది కేవలం 0.75 కిలోమీటర్లే. రెండో సొరంగం దాదాపు 10 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులోనూ 0.6 కిలోమీటర్లు తవ్వకం పనులు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో చేసిన ఖర్చు రూ. 500 కోట్ల లోపే. గతంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు, అదనపు ధరల చెల్లింపులకే అధిక శాతం ఇవ్వడం గమనార్హం. -
వేగం పెంచండి
పట్టిసీమ, పోలవరం కుడికాలువల నిర్మాణంపై సీఎం సమీక్ష సాక్షి, విజయవాడ బ్యూరో: పోలవరం కుడి ప్రధాన కాలువ పనులను వారంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖాధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రులు, అధికారులతో పట్టిసీమ, పోలవరం కుడికాలువ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ, ఇతర శాఖలను కూడా ఈ పనులకే వినియోగిస్తున్న దృష్ట్యా పనులు వేగంగా చేయాలని సూచించారు. గెయిల్, హెచ్పీసీఎల్ కంపెనీలు వేసిన పైపు లైన్లను వేరే చోటుకు తరలించే విషయం గురించి సీఎం ఆ కంపెనీల చైర్మన్లతో ఫోన్లో మాట్లాడారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధిక సామర్థ్యం గల యంత్రాలను రప్పిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం నీటిని కుడి ప్రధాన కాలువకు మళ్లించేందకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తమ్మిలేరు ఆక్విడెక్ట్ పనుల్లో ప్రస్తుతం 260 మంది నిపుణులు పనిచేస్తున్నారని, ఇంకా 150 మంది అవసరమవుతారని అధికారులు ఆయనకు వివరించారు. నెల్లూరు జిల్లా సోమశిల, వెలిగొండ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. సమావేశంలో మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో నిలిపి ఉంచిన బస్సులోకి వెళ్లారు. రాత్రికి ఇక్కడే బస చేసిన ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు ఓఎస్డీగా కృష్ణమోహన్ సాక్షి, హైద రాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కార్యాలయం ప్రత్యేకాధికారిగా (ఓఎస్డీ)గా పి.కృష్ణమోహన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐైవె ఆర్ కృష్ణారావు గురువారం ఉత్తర్వులిచ్చారు. ఏడాది పాటు ఓఎస్డీగా కొనసాగుతారు. ప్రస్తుతం కృష్ణమోహన్ విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏ) రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. -
రూ.30 వేల రుణానికి రూ.302 మాఫీ!
వెలిగొండ ప్రాజెక్టు(ప్రకాశం జిల్లా): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేయడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా గురువారం రాత్రి ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు టెన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ తాను 30వేల రూపాయల రుణం తీసుకుంటే 302 రూపాయలు మాత్రమే మాఫీ అయినట్లు తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మలేం అని రైతులు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. -
ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు పోరాటం:వైఎస్ జగన్
వెలిగొండ ప్రాజెక్టు(ప్రకాశం జిల్లా): సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు టెన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించిన అనంతరం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు రైతులు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వహస్తాలతో వెలిగొండ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తీ అవుతుందా అని ఎదురు చూస్తున్నామని ఆవుల రెడ్డి అనే రైతు చెప్పారు. సాగుకు నీరులేక పాలు అమ్ముకొని బతుకుతున్నట్లు తెలిపారు. వైఎస్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. 1996లో ఎంపీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇక్కడకు వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. ఎన్నికల తరువాత ఈ ప్రాజెక్టు గురించి మర్చిపోయారు. 2004 వరకు 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం 13.5 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఏడాదికి కోటిన్నర రూపాయలు కూడా కేటాయించలేదు. ఈ ప్రాజెక్టుకు 4500 కోట్ల రూపాయలు కావలసి ఉండగా, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఉపయోగపడుతుంది. 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరాంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అయితే చంద్రబాబు మొన్నటి బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. నామ మాత్రంగా నిధులు కేటాయిస్తూ రాయలసీమ అంటే ప్రేమ అని కపట నాటకం ఆడుతున్నరని ఆయన విమర్శించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే నీరు 200 నుంచి 400 టీఎంసీల ఉంటుంది. గత ఏడు సంవత్సరాలుగా ఇలాగే జరుగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో నీరు సముద్రంలో కలుస్తున్నట్లు చెప్పారన్నారు. 60 నుంచి 80 రోజులు వరదలు వస్తాయి. జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలలో నీరు సముద్రంలో కలుస్తుంది. ఆ సమయంలోనే నీటిని నిల్వ చేయవలసిన అవసరం ఉందన్నారు. నీరు నిల్వ చేసే సామర్ధ్యం ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. నదులు వరదలుగా మారే సమయంలో నీటి నిల్వ కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని మన పెద్దలు నిర్ణయించారని చెప్పారు. దీని ద్వారా 200 టీఎంసీల నీరు నిల్వ చేసి, ఆ తరువాత కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వవచ్చుని తెలిపారు. ఇటువంటి పోలవరం ప్రజెక్టుని వదిలి, పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని చెప్పారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బు గుంజుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్టు మొదలు పెట్టారని విమర్శించారు. ఆ ప్రాజెక్టు టెండర్ నిబంధనలు కూడా వారికి అనుకూలమైనవారికి, అనుకూలంగా ఉండేవిధంగా రూపొందించారని చెప్పారు. ఆ కాంట్రాక్టర్లు అదనంగా కోట్ చేసినా, ఆ అదనపు డబ్బుని కూడా బోనస్గా ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు 1600 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. -
వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం
-
వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం
ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా వైఎస్ జగన్ గురువారం రాత్రి ఇక్కడకు వచ్చారు. ఈ బృందం వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తోంది. ఉదయం విజయవాడలోని ప్రకాశం బ్యారేజిని పరిశీలించిన ఈ బృందం అక్కడ రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాడింది. అనంతరం ఈ బృందం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోంది. -
వెలుగొండ ను పూర్తి చేస్తాం
2016 ఆగస్టుకు మొదటి దశ మంత్రి దేవినేని ఉమ పెద్దదోర్నాల : వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను 2016 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను శనివారం మంత్రి, నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకో రైలులో మొదటి సొరంగ నిర్మాణ పనులు నిలిచి పోయిన ప్రాంతానికి మంత్రి చేరుకుని టీబీఎం యంత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న వెలుగొండ ప్రాజెక్టుతోపాటు, జిల్లాలోని మరో ప్రాముఖ్యం ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను మెదటి ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బడ్జెట్లో వెలిగొండకు కేటాయించిన 153 కోట్లే కాకుండా అవసరమైతే ఎన్ని వేల కోట్లైనా కేటాయించి పూర్తి చేస్తామన్నారు. మరో నెల రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.13 మరుగున పడిన నేపధ్యంలో పనుల పురోగతిపై నిపుణుల కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం జీవో నెం.22ను విడుదల చేసిందన్నారు. గృహాలకు 24 గంటలు, వ్యవసాయ రంగానికి 7 గంటల నిరంతర విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం రెండో సొరంగ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకుమార్, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, సిడిసిడి వో గిరిధరరెడ్డి, క్వాలీటీ కంట్రోల్ సీఈ, జయప్రకాష్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ, వరలక్ష్మి, కడప ఇరిగేషన్ ఎస్సి కోటేశ్వరరావు, ప్రకాశం ఎస్ఈ రమణమూర్తి, సీఈ వీర్రాజు, మార్కాపురం, గిద్దలూరు మాజీ ఎమ్మేల్యేలు కందుల నారాయణరెడ్డి, అన్నా రాంబాబు, యర్రగొండపాలెం త్రిసభ్య కమిటీ సభ్యుడు అంబటి వీరారెడ్డి, జిల్లా కార్యవర ్గసభ్యుడు కాసా రఘనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిధులివ్వకుంటే ఉద్యమం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాదిలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో కేవలం రూ. 75 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇవి పాత బిల్లులకు సరిపోవడంతో కొత్తగా పనులు చేస్తే డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో రెండు నెలలుగా ప్రాజె క్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. వచ్చే బడ్జెట్లో కనీసం రూ. 250 కోట్లు కేటాయిస్తేగాని తొలిదశ పూర్తయ్యే అవకాశం లేదన్నారు. నిధులు కేటాయించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనుకాడరని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలుగొండ, గుండ్లకమ్మ, రామతీర్ధం, గొట్టిపాటి హమనుమంతరావు ప్రాజెక్టు, చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తికాకుండా నిలిచిపోయాయన్నారు. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందునే ఈ ప్రభుత్వం ఈ మాత్రమైనా స్పందిస్తోందన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. యు.పి.ఎ. ప్రభుత్వం రామాయపట్నం పోర్టును కాదని దుగరాజపట్నం పోర్టును విభజన బిల్లులో పొందుపరిచిందని గుర్తు చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల చివరి రోజున తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి జిల్లా పరిస్థితిని వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించేందుకు వనరులు లేకపోతే పీపీపీ పద్దతిలోనైనా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు కోసం రైల్వే మంత్రిని కలిశామని, ఆయన తమ ముందే జీఎంకు ఫోన్ చేసి 15 రోజుల్లో టెండర్లు పిలవాలని ఆదేశించారని గుర్తు చేశారు. తాను విజయవాడ డీఆర్ఎంతో మాట్లాడానని టెండర్లకు ప్రతపాదనలు పంపినట్లు చెప్పారన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు అవసరమైన నడికుడి - శ్రీకాళహస్తి లైన్ కోసం తాను, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు రైల్వే మంత్రిని కలిసి వివరించామని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో కలిసి వచ్చారని చెప్పారు. వచ్చే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నారు. ఈ రైల్వే లైన్ వస్తే గుంటూరు నుంచి చిత్తూరు వరకూ నాలుగు జిల్లాల్లో పలుప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దొనకొండను రాజధానిగా చేయకపోయినా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రోడ్లు, రైలు మార్గాలు అభివృద్ధి చెందితేనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల దొనకొండ- ఒంగోలు రైలు మార్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఒంగోలు - నంద్యాల మధ్య నాలుగులైన్లుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి నితిన్గడ్కారిని కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు.రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని చెప్పారు. డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్పేయి, మదన్మోహన్ మాలవీయకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిలు పాల్గొన్నారు. -
భూమి ధర చెల్లిస్తాం
తోకపల్లె(పెద్దారవీడు) : పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల కోసం పునరావాస స్థలాల సేకరణ అంశంపై వై.పాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు, జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్లు గురువారం పరిశీలించారు. తోకపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాసానికి ఎంపిక చేసిన స్థలాలను, పొలాలను వదిలివేయూలని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం 12 ఎకరాలు తీసుకోగా.. వారు కోర్టుకు వెళ్లారని వివరించారు. జేసీ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లో అసైన్మెంట్ భూములుగా గుర్తిస్తే మరో చోట పొలాలు ఇస్తామని..సెటిల్మెంట్ భూమి అయితే ప్రస్తుత ధర ప్రకారం నగదు చెల్లిస్తామన్నారు. సుంకేసుల గ్రామ ఎస్సీలకు, గుండంచర్ల గ్రామానికి చెందిన నిర్వాసితులకు గృహాలు నిర్మించేందుకు ప్లాన్ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, బీసీ జనరల్, ముస్లింలకు వేర్వేరుగా గృహాలను నిర్మించాలని.. మసీదు, చర్చి, దేవాలయాలు వారి ఇళ్ల వద్దే ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెలాఖరు లోపు పట్టాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే డేవిడ్రాజు మాట్లాడుతూ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా పాఠశాలలుండాలన్నారు. -
నిలిచిన వెలిగొండ పనులు
పూర్తిగా ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులకు మళ్లీ బ్రేక్ పడింది. పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండో టన్నెల్ పనులు నిలిచిపోగా..పది రోజుల నుంచి మొదటి టన్నెల్ పనులు కూడా ఆగిపోయాయి. గత నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఏడాదిలోపు పూర్తి చేసి నీరందిస్తామని ప్రకటించారు. పనులు ఆగిపోవడంతో సీఎం హామీ అమలుపై సందేహాలు నెలకొన్నాయి. గట్టి రాయే ప్రధాన అడ్డంకి.. పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం సొరంగ మార్గం తవ్వేటప్పుడు గట్టి రాయి పడటమే. ఈ రాయి తగిలి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) ముందు భాగంలోని బ్లేడ్లు విరిగిపోతున్నాయి. మొదటి టన్నెల్ వ్యాసార్ధం 8 మీటర్లు కాగా..రెండో టన్నెల్ వ్యాసార్ధం 9.2 మీటర్లు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నెలకు 400 మీటర్ల దూరం పనిచేయాల్సి ఉండగా..ఇప్పటి వరకు 250 నుంచి 275 మీటర్లకు మించి పనులు సాగలేదు. మొత్తం మీద ఇప్పటి వరకు మొదటి సొరంగం 9 కి.మీ, రెండో సొరంగం 12 కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఇందు కోసం సుమారు రూ.850 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. బిల్లుల చెల్లింపు, అనుమతుల్లోనూ జాప్యం: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండో టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వివిధ అనుమతులు, బిల్లుల చెల్లింపులో జాప్యం కూడా కారణమైంది. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నిర్మించే హెడ్ రెగ్యులేటర్కు పోయేందుకు అటవీశాఖ, నీటి పారుదల శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. మొదటి టన్నెల్ పనులు పది రోజుల నుంచి నిలిచిపోయాయి. బలమైన రాయి తగలడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టర్లు విరిగిపోతున్నట్లు గుర్తించారు. జర్మనీ, అమెరికా దేశాల నుంచి ఈ కట్టర్లు తెప్పించాల్సి ఉంది. రాయికి తగినట్లు మిషన్లు తయారు చేసేందుకు..రాయి పటిష్టతను పరీక్షించేందుకు విదేశాలతో పాటు చెన్నై ఐఐటీకి పంపారు. ఫలితాలు వచ్చాక వాటిని అనుసరించి కట్టర్లు తయారు చేయించి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు టన్నెల్ నిర్మాణంలో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. తొలుత అంచనాల మేరకు 2008 నాటికి మొదటి టెన్నెల్ పనులు పూర్తి కావాల్సి ఉండగా..2010లో పనులు ప్రారంభించారు. 2012 జూన్కు పనులు ముగించాలని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా..ఈ ఏడాది చివరికి కూడా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. -
అప్పుడు దండగ... ఇప్పుడు పిచ్చోళ్లా
రైతులంటే అంత చులకనా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్: జిల్లాలో శనగరైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేశారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ళ పాలనలో వ్యవసాయం దండగ అన్నాడని, ఇప్పుడు శనగ రైతులను పిచ్చోళ్లనడం చూస్తుంటే చంద్రబాబు వైఖరికి ఏంటో అర్ధమవుతుందన్నారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గాని, మంత్రి గాని జిల్లాలో ఉన్న సమస్యలపై ఏ ఒక్క రోజైనా తమ ముఖ్యమంత్రితో మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రబుత్వం స్పందించి శనగరైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు రూ.75 కోట్లు నిధులిచ్చి ఏ విధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. మొదటి టన్నెల్ పూర్తి చేయటానికి రూ.250 కోట్లు అవసరమవుతుందని అయితే ఇంత తక్కువ నిధులు కేటాయించిన చంద్రబాబు ఏ విధంగా సంవత్సరంలో పూర్తి చేయగలరని నిలదీశారు.ఇప్పటికైనా అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మొద్దునిద్రను వీడి ప్రజాసమస్యలు, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి పార్టీలకు అతీతంగా పని చేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
అండగా ఉంటాం
కొమరోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడతామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన గిద్దలూరు నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్రాజు హాజరయ్యారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామనడానికి సిగ్గుండాలన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. పశ్చిమ ప్రాంత వరప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించాను..ఏడాదిలోపు పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో కేవలం రూ.70 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టి వేలకోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆయనే బతికుంటే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. వెలిగొండ సొరంగ మార్గం పూర్తికావాలంటే 14 నెలల సమయం పడుతుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తికావాలంటే 5 నుంచి 7 వేల కోట్ల రూపాయల నిధులను వచ్చే బడ్జెట్లోనైనా మంజూరు చేసేలా జిల్లా మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఉద్యమిస్తామని వైవీ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ, వినుకొండ, మార్టూరులను రాజధానికి అనువైన ప్రాంతాలుగా సూచిస్తే ఆ విషయాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ మంత్రులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై జిల్లాకు చెందిన టీడీపీ మంత్రి గానీ, ఎమ్మెల్యేలుగానీ పెదవి విప్పలేదని విమర్శించారు. జిల్లాలో రూ.5,600 కోట్ల వ్యవసాయ, రూ.1800 కోట్ల డ్వాక్రా రుణాలను చేస్తామని చెప్పి రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులను మోసం చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రజలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ ఇచ్చినా అప్రజాస్వామికంగా టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. పశ్చిమ ప్రాంతవాసిగా తాను ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అధికారాన్ని దగ్గరలో కోల్పోయామని కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దన్నారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజాసమస్యల కోసమే పోరాడుతున్నారన్నారు. అసెంబ్లీలో జగన్ను నిలువరించేందుకు టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పింఛను కమిటీల్లో సామాజిక కార్యకర్తలుగా పచ్చచొక్కా కార్యకర్తలను నియమించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లోని అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపులో కృషిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలియని చంద్రబాబు నిజస్వరూపం వంద రోజుల్లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి ప్రస్తుతం ఉన్న సీట్లలో సగం కూడా రావని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ బండారు వెంకట లక్షమ్మ, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, మాజీ సమితి అధ్యక్షుడు ముత్తుముల భాస్కర్రెడ్డి, రాష్ట్ర యువజన సంఘం కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త ముత్తుముల రమణారెడ్డి, వాణిజ్య విభాగం నాయకుడు క్రాంతికుమార్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రూ.2500 కోట్లు కావాలి
ఒంగోలు అర్బన్ : ‘వెలిగొండ’ పూర్తవ్వాలంటే ఇంకా రూ.2500 కోట్లు అవసరమని ప్రాజెక్ట్ ఎస్ఈ సుధాకర్రావు వెల్లడించారు. ప్రాజె క్ట్ అధికారులతో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఎస్ఈ సుధాకర్రావు బృందంతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. = ఈ సందర్భంగా సుధాకర్రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తొలి విడతగా రూ. 1250 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. = ఇప్పటికి రూ.3500 కోట్లు ఖర్చు చేసి 57 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. = మొత్తం ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే ఇంకా రూ.2500 కోట్లు అవసరమని వివరించారు. తాత్కాలికంగా నీరు విడుదల చేయాలంటే ప్రధాన టన్నెల్స్ పూర్తవ్వాలని, అందుకోసంరూ.250 కోట్లు అవసరమని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తయితే నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప జిల్లాలకు తాగునీటి సమస్య కూడా తీరే అవకాశం ఉందన్నారు. = రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ పనులూ జరగటం లేదని, కేవలం వెలిగొండ పనులే జరుగుతున్నాయని పేర్కొన్నారు. = వచ్చే రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని సుధాకర్రావు బృందం తెలిపింది. = అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రాజెక్ట్కు సంబంధించిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. = సమావేశంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఈఈలు రమేష్ (కంభం), రాఘవరెడ్డి (మార్కాపురం), భూషన్బాబు (దోర్నాల), కంభం డీఈ అబూసలీం, ఎస్ఈ కార్యాలయం డీఈ చైతన్య, కాకర్ల గ్యాప్ ప్రాజెక్ట్ మేనేజర్, జేఈ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
‘వెలిగొండ’పై వైఎస్సార్సీపీ గళం
ఒంగోలు అర్బన్ : జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో వైఎస్సార్ సీపీ శాసన సభ్యులు తమ వాణి వినిపించారు. సమావేశాలు గురువారం మొదలై జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ను అభినందిస్తూ మాట్లాడే అవకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలకు లభించింది. వారిలో వైఎస్సార్సీపీ నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్రాజు, జంకె వెంకటరెడ్డి ఉన్నారు. తొలుత స్పీకర్గా ఎంపికైన డాక్టర్ కోడెల శివప్రసాద్రావును అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పశ్చిమ ప్రాంతం ప్రజల కష్టాలు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితేనే తీరుతాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని గుర్తుచేశారు. సభాపతి గతంలో భారీ నీటిపారుదల శాఖామాత్యులుగా పనిచేశారని వారికి వెలిగొండ ఆవశ్యకత తెలుసని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పీకర్ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తాగు, సాగునీటి సమస్య తీరి పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. -
‘వెలిగొండ’కు మోక్షం
మార్కాపురం, న్యూస్లైన్: పశ్చిమ ప్రాంత రూపురేఖలు మార్చే వెలిగొండ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు లభించడంతో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యేందుకు మార్గం సుగమమైంది. నిలిచిపోయిన టన్నెల్, కాలువల పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా ‘వెలిగొండ’కు మోక్షం దోర్నాల సమీపంలోని టన్నెల్ పనులు ఆగిపోయాయి. రాజీవ్ టైగర్ ప్రాజెక్టు కావడంతో అనుమతి లేకుండా పనులు ప్రారంభిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖాధికారులు వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయడంతో పనులు నిలిపేశారు. గత శనివారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అనుమతులు వచ్చాయి. దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు. మొదటి టన్నెల్ వ్యాసార్థం 8 మీటర్లు కాగా..18.82 కి.మీల పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 11.52 కి.మీ మేర కాలువ తవ్వారు. రెండో టన్నెల్ వ్యాసార్థం 10 మీటర్లు కాగా, 18.82 కి.మీ పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. 8.45 కి.మీ మేర కాలువలు తవ్వారు. రెండు టన్నెల్స్కు సంబంధించి సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నెలకు 400 మీటర్ల పొడవున పనిచేయాల్సి ఉండగా, గట్టిరాయి, సుద్ధ, బురదమట్టి, నీళ్లు వస్తుండటంతో 300 మీటర్లకు మించి పనులు సాగడం లేదు. మొత్తం 7 ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. అటవీ శాఖ మొత్తం 3069.91 హెక్టార్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, కాకర్ల, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, తదితర అటవీ ప్రాంతాల్లోని ఈస్ట్రన్ కెనాల్, తీగలేరు, ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దోర్నాల ప్రాంతంలో ఫీడర్ కాలువ పొడవు 21.6 కి.మీ కాగా, 10.2 కి.మీ మాత్రమే అటవీ శాఖ అనుమతులు లభించడంతో అంత వరకు తవ్వి నిలిపేశారు. తీగలేరు కాలువ మొత్తం పొడవు 48 కి.మీ కాగా, 5 కి.మీ పొడవున కాలువ తవ్వారు. అలాగే, ఈస్ట్రన్ కాలువకు కూడా అటవీ శాఖ అనుమతి లభించకపోవడంతో నిలిచిపోయింది. అటవీశాఖ అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మార్కాపురం పరిధిలో 1691 హెక్టార్లు, గిద్దలూరు పరిధిలో 1169 హెక్టార్లు, నెల్లూరు జిల్లా పరిధిలో 108 హెక్టార్లు, కడప జిల్లాలోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసింది. 2014కు పూర్తి చేయాలన్న లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డిలు వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించకపోవడంతో టన్నెల్ పనులు నత్తనడకతో పోటీ పడుతున్నాయి. కృష్ణానది మిగులు జలాల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని 45 రోజుల పాటు కొల్లంవాగు ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయిస్తే 43.50 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుతుంది. టన్నెల్స్ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపుల్లో నీటిని నింపుతారు. {పాజెక్టు పూర్తయితే అర్ధవీడులో 3 వేల ఎకరాలు, కంభంలో 17,300, బేస్తవారిపేటలో 11,200, మార్కాపురంలో 27,700 ఎకరాలు, కొనకనమిట్లలో 30 వేలు, తర్లుపాడులో 20 వేలు, హెచ్ఎంపాడులో 39,400, కనిగిరిలో 9,900, పొదిలిలో 5,200, కురిచేడులో 6 వేలు, దొనకొండలో 17 వేలు, పుల్లలచెరువులో 11,500, మర్రిపూడిలో 4,400, పెద్దారవీడులో 21,900, యర్రగొండపాలెంలో 19,800, దోర్నాలలో 6,100, త్రిపురాంతకంలో 32,300, గిద్దలూరులో 10,600, రాచర్లలో 11,500, కొమరోలులో 5,500, పామూరులో 2,300, సీఎస్పురంలో 24,500, వెలిగండ్లలో 17,600 ఎకరాలకు వెలిగొండ జలాలు అందుతాయి. -
‘వెలిగొండ’కు అటవీ అనుమతులు
ఒంగోలు టౌన్, న్యూస్లైన్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు ఎట్టకేలకు శనివారం అటవీ శాఖ అనుమతి లభించింది. ఐదేళ్లుగా మూడు జిల్లాల ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడివడిగా సాగిన ప్రాజెక్టు పనులు ఆయన మరణం తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారయ్యాయి. ప్రధానంగా ప్రాజెక్టు కాలువల నిర్మాణం నల్లమల అటవీ ప్రాంతంలో చేయాల్సి ఉండటంతో.. అటవీ అనుమతులు లభించక పనులు నిలిచిపోయాయి. అటవీ శాఖకు పరిహారం కింద ప్రభుత్వం రూ.280 కోట్ల నిధులు చెల్లించింది. ఇన్నేళ్ల ఎదురుచూపుల తరువాత ఎట్టకేలకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మిపార్ధసార థి భాస్కర్ శనివారం జీవో నంబర్ 59 ద్వారా అటవీ భూములకు అనుమతి ఇచ్చారు. మొత్తం 3069.91 హెక్టార్లకు అటవీ శాఖ క్లియరెన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో మార్కాపురం వన్యప్రాణ సంరక్షణ అటవీ పరిధిలోని 1691 హెక్టార్లకు అనుమతి మంజూరైంది. అదే విధంగా గిద్దలూరు డివిజన్ అటవీ శాఖ పరిధిలోని 1169 హెక్టార్లకు, నెల్లూరు జిల్లా పరిధిలోని 103 హెక్టార్లకు, కడప జిల్లాలోని మరికొంత అటవీ భూమికి కూడా అనుమతి ఇచ్చారు. -
'అరణ్య ' రోదన
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీశాఖ బ్రేకులు అటవీ అనుమతులు లభించక ఎక్కడి పనులు అక్కడే కాకర్ల డ్యాం పరిధిలో 600 ఎకరాలకు అందని పరిహారం ముంపు గ్రామాలకు ఆర్ ఆర్ ప్యాకేజీ నీటి మీద రాతే {పాజెక్టులంటే గిట్టని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పాలనలో ప్రాజెక్టు పూర్తయ్యేది నిజమేనా? {పాజెక్టు పూర్తిపై రైతుల్లో అనుమానాలు .. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం.. జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజానీకం చిరకాల వాంఛ.. వేలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసే కల్పతరువు వెలిగొండ ప్రాజెక్టు..! అంతటి ప్రాచుర్యం పొందిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆగమేఘాల మీద కోట్లాది రూపాయల నిధులూ మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కంభం రూరల్ పశ్చిమ ప్రాంత వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. పనుల పురోగతి ఒక అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. అధికారులు, ఆనాటి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వెలిగొండ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రాజెక్టులో భాగమైన కాకర్ల ఆనకట్టకు సంబంధించిన కాలువ పనులు అటవీశాఖ అనుమతులు లభించక ముందుకు సాగడం లేదు. ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు పదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానేత వైఎస్సార్ జీవించి ఉంటే అటవీశాఖ అనుమతులు ఈ పాటికే వచ్చి ప్రాజెక్టు పనులు ఎప్పుడో పూర్తయ్యేవని పశ్చిమ ప్రాంత రైతులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ మొదటి విడత రూ.206 కోట్లు, రెండో విడత రూ. 250 కోట్లు మొత్తం రూ. 456 కోట్లు మంజూరు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఆయన మంజూరు చేసిన నిధుల్లో ఇప్పటి వరకు రూ.320 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి కావాలంటే అటవీశాఖాధికారుల అనుమతులు అవసరం. అటవీశాఖకు పరిహారం కింద ప్రభుత్వం రూ.280 కోట్లు చెల్లించినా నేటికీ అనుమతులు లభించకపోవడం గమనార్హం. తూర్పు కాలువ పొడవు 42.625 కిలోమీటర్లు (ప్రాజెక్టు నుంచి బేస్తవారిపేట మండలం పూసలపాడు వరకు) కాగా ఇప్పటి వరకు 32 కిలోమీటర్ల మేర పని మాత్రమే పూర్తి చేశారు. నాగులవరం- మొహిద్దీన్పురం, పెద్దనల్లకాలువ- కృష్ణాపురం, కృష్ణాపురం - సంగాపేటల మధ్య అటవీ ప్రాంతం ఉండటంతో పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలపై అటవీశాఖ అనుమతుల కోసం పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలెవరూ ఒత్తిడి తేలేదు. డ్యాం నిర్మాణాన్ని వివిధ బ్లాకులుగా విభజించి ఇప్పటి వరకూ 80 శాతం పనులు పూర్తి చేసినట్లు సైట్ ఇన్చార్జి మల్లికార్జున తెలిపారు. మోసపోయిన రైతులు కాకర్ల డ్యాం నిర్మాణంలో ముంపునకు గురవుతున్న 600 ఎకరాల భూములకు సంబంధించి రైతులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదు. అధికారులను కలిసి వేడుకున్నా.. పనులు అడ్డుకున్నా.. చివరకు బాధిత రైతులు నిరవధిక దీక్షలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. న్యాయం కోసం నాలుగేళ్ల కిందట రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ప్యాకేజీ ఉత్తుత్తిదే... ముంపు గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామన్న ప్రభుత్వం మాటలు నీటి మీద రాతలయ్యాయి. ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, మొట్టిగుంజి, సాయిరాం నగర్, కృష్ణానగర్ ప్రజలకు పునరావాస ప్యాకేజీ కింద బేస్తవారిపేట మండలం ఒందుట్ల వద్ద స్థలాన్ని సేకరించి అక్కడ గృహాలు నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. మొదటి నుంచి ప్రాజెక్టులను వ్యతిరేకించే చంద్రబాబు ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తారంటే ఈ ప్రాంత ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. పోరాటం చేస్తాం :ముత్తుముల అశోక్రెడ్డి, ఎమ్మెల్యే, గిద్దలూరు పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా జరిగేందుకు పోరాటం చేస్తాం. ఒంగోలు ఎంపీ ైవె వీ సుబ్బారెడ్డి సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అటవీశాఖ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సాధిస్తాం. రైతుల శ్రేయస్సు కోసం వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుంది. -
నాటి స్వర్ణయుగంలో ప్రకాశం
జిల్లా పశ్చిమప్రాంత వాసుల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. రూ4500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 4.38లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. అలాగే మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించి 2008లో జాతికి అంకితం చేశారు. చీమకుర్తి వద్ద నిర్మించిన రామతీర్థం ప్రాజెక్టు వల్ల జిల్లాలోని 72974 ఎకరాలకు సాగు నీరు అందుతోంది, 56 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు మంచి నీరు తరలిస్తున్నారు. ఉలిచి చెక్ డ్యాం పూర్తయింది. పాలేరు రిజర్వాయర్, యర్రంచినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. సాగర్ ఆధునికీకరణకు రూ298 కోట్లు, ఓగేరు పథకానికి రూ45 కోట్లు, భవనాశి రిజర్వాయర్కు రూ27 కోట్లను వైఎస్ కేటాయించారు. చంద్రబాబు మాత్రం ప్రాజెక్టుల గురించి మరచిపోయారు. రూ.148.19 కోట్ల ‘విద్యుత్ వెలుగులు’ వైఎస్ హయాంలో జిల్లాలో 86,207 వ్యవసాయ కనెక్షన్లుండగా.. 71321 మంది రైతులు ఉచిత విద్యుత్ వల్ల లబ్ధిపొందారు. విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణ నిమిత్తం రూ88.69 కోట్లను వైఎస్ విద్యుత్ శాఖకు అందించారు. అంటే ఏడాదికి సగటున రూ17.84 కోట్ల రూపాయలను నాటి వైఎస్ ప్రభుత్వం భరించింది. అంతే కాకుండా చంద్రబాబు హయాంలో 63,559 మంది రైతులకు చెందిన రూ59.50 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. చంద్రబాబు పాలనలో మాత్రం కరెంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలతో రైతులు సతమతమయ్యేవారు. కరెంటు లేక పంటలన్నీ ఎండిపోయేవి. అదనంగా 1.7 లక్షలకు పెరిగిన పెన్షనర్లు చంద్రబాబు హయాంలో ఉన్న 1.08 పింఛనుదారులు ఇక్కట్లు పడేవారు. కేవలం నెలకు రూ75 రూపాయలతో విసిగిపోయేవారు. వీరిలో కేవలం 2200 మంది వికలాంగులే లబ్ధిపొందేవారు. అయితే వైఎస్ సీఎంగా వచ్చాక జిల్లాలో 1.78 లక్షలమందికి అదనంగా పెన్షన్లు మంజూరు చేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేతలకు ఇచ్చే రూ75ను రూ200 పెంచారు. ఆ తర్వాత వికలాంగుల పింఛన్ను రూ500కు పెంచారు. ఇలా వికలాంగులు సంఖ్య 26వేలకు పైగా చేరింది. ఇక వైఎస్ జిల్లాకు ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ వచ్చేలా చేశారు. దీనికోసం రూ125 కోట్లు కేటాయించారు. అభ్యున్నతి సాధించిన పొదుపు మహిళలు పావలా వడ్డీ పథకంతో పొదుపు గ్రూపుల్లోని 43341 స్వయం సహాయక సంఘాలకు వైఎస్ హయాంలో రూ852.34 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. దీనికోసం వారికి పావలా వడ్డీ కింద రూ180.9 కోట్ల రాయితీ లభించింది. మెప్మా ద్వారా 4213 సంఘాలకు రూ42.80 కోట్ల రుణాలు, రూ85.98 లక్షల పావలా వడ్డీ రాయితీ లభించింది. ఆమ్ఆద్మీ యోజన ద్వారా 1.89 లక్షల మంది రైతులకు రూ67.90 లక్షలు అందాయి. అభయహస్తం ద్వారా ఎంతోమంది లబ్ధిపొందారు. చంద్రబాబు పాలనలో మాత్రం 22010 స్వయం సహాయక సంఘాలకు కేవలం రూ109.89 కోట్ల రుణాలు అందజేశారు. -
మొండిచేయి
ఒంగోలు, న్యూస్లైన్: జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిధుల కేటాయింపులో అంకెల గారడీ తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న శ్రద్ధ ప్రభుత్వ పెద్దల్లో కనిపించడం లేదు. గత ఏడాది కేటాయించిన నిధుల్లో కనీసం పాతిక శాతం కూడా ఖర్చు చేయకపోగా..తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా అంతంత మాత్రంగానే నిధులు విదిల్చారు. ఇదేనా న్యాయం: 6 జిల్లాలో కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయం రూ.592.18 కోట్లు. అందులో ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.535.68 కోట్లు. అయితే 2013-14లో రూ.29 కోట్లు కేటాయించారు. కానీ ఇంతవరకు ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మళ్లీ మరో రూ.29 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అంకెల గారడీనే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6 పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రూ. 5150 కోట్లు అవసరం. కానీ ఇంత వరకు ఖర్చుచేసింది రూ.3378.12 కోట్లు మాత్రమే. దీనికితోడు 2013-14 బడ్జెట్లో రూ. 402 కోట్లు అన్నారు. కానీ విడుదల చేసింది కేవలం రూ. 105.48 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రూ. 402 కోట్లు అంటూ ప్రకటించడం గమనార్హం. 6యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.177 కోట్లు అవసరమని భావించగా ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.90.47 కోట్లు మాత్రమే. 2013-14 సంవత్సరంలో రూ.17 కోట్లు కేటాయించారు. కానీ అందులో ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.2.91 కోట్లే. తాజాగా దీనికి మరో రూ.17 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఇదీ పరిస్థితి: కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువల అభివృద్ధి పనులకు రూ. 130.22 కోట్లకు అగ్రిమెంట్ అయింది. కానీ ఇంతవరకు కేవలం రూ. 10 కోట్ల లోపు మాత్రమే ఖర్చుచేశారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని డ్రైనేజీ కాలువల అభివృద్ధి కోసం దాదాపు రూ.140 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు అందులో ఖర్చుచేసింది రూ. 40 కోట్లలోపు మాత్రమే. ఇంకా వీటికి సంబంధించి కొన్నిచోట్ల టెండరు వేసేందుకు సైతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి. 6మాగుంట సుబ్బరామిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు 2013-14లో కోటి రూపాయల నిధులు కేటాయించారు. కానీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకపోవడం గమనార్హం. 6 శ్రీపోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు రూ. 50.50 కోట్లు అవసరమని భావించగా ఇంతవరకు కేటాయించిన మొత్తం రూ.10.85 కోట్లు. 2013-14లో రూ.9 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చుచేసిన మొత్తం రూ.15 లక్షలు కావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 6 ఒంగోలులో పోతురాజు కాలువ అభివృద్ధికి రెండో దశలో రూ. 18 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినా దీనికి సంబంధించి జాడ కూడా లేకపోవడం గమనార్హం. -
వానొస్తే వనవాసమే
మార్కాపురం, న్యూస్లైన్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని ప్రజల పునరావాసంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షం వచ్చిందంటే స్థానికులు భయంభయంగా కాలం గడుపుతున్నారు. మార్కాపురం, పెద్దారవీడు, అర్ధవీడు మండలాల్లోని గొట్టిపడియ, అక్కచెరువు, సుంకేసుల డ్యామ్ కింద చింతలముడిపి, సుంకేసుల, కాటంరాజు తండా, కలనూతల, గుండంచర్ల, కాకర్ల డ్యామ్ కింద సాయినగర్, లక్ష్మీపురం, కాకర్ల తదితర గ్రామాలన్నీ ముంపు గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కింద వీరిలో కొందరి గృహాలకు, పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. పునరావాసం కల్పించే విషయంలో ఆరేళ్లుగా అదిగో, ఇదిగో అంటూ అధికారులు కాలం గడుపుతున్నారు. పునరావాస కాలనీలు నిర్మించాల్సిన స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయన్న కారణంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు గొట్టిపడియ, కాకర్ల డ్యామ్లకు నీరు చేరడంతో గ్రామాలు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. అక్కచెరువు, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల ప్రజలు నాలుగు రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. గొట్టిపడియ, అక్కచెరువులో 900 కుటుంబాలున్నాయి. చింతలముడిపి, కాటంరాజు తండాల్లో 56 గృహాల్లో 72 కుటుంబాలు, సుంకేసులలో 1139 గృహాల్లో 1552 కుటుంబాలు, కలనూతలలో 514 గృహాల్లో 620 కుటుంబాలు, గుండంచర్లలో 237 గృహాల్లో 700 కుటుంబాలు, కాకర్ల డ్యామ్ పరిధిలో 140 గృహాల్లో 210 కుటుంబాలు నివసిస్తున్నాయి. గొట్టిపడియలో రెండు వర్గాల ప్రజలుండగా, ఒక వర్గం వారు అల్లూరిపోలేరమ్మ దేవాలయం వద్ద, మరో వర్గం వారు కోమటికుంట వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. సుంకేసుల డ్యామ్ కింద సుంకేసులలో కొంత మంది గ్రామస్తులు గోగులదిన్నె వద్ద, తోకపల్లె వద్ద పునరావాస కాలనీలు కావాలని కోరారు. కలనూతల గ్రామస్తుల్లో కొంత మందికి మార్కాపురం మండలంలోని ఇడుపూరులో పునరావాస కాలనీ ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు నిర్ణయించారు. గుండంచర్ల గ్రామస్తుల కోసం దేవరాజుగట్టు వద్ద భూములను పరిశీలించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో అధికారులు పునరావాస కాలనీలకు స్థలాలు చూడగా కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ పొలాలను సేకరణ కింద తీసుకోవద్దని కోర్టుకు వెళ్లటంతో పెండింగ్ లో ఉన్నాయి. గత వారం గొట్టిపడియ, కాకర్ల డ్యామ్లకు కొద్దిపాటి నీరు చేరడంతో మూడు రోజుల పాటు ఈ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏ క్షణంలో వరద ముంచుతుందోనన్న ఆందోళన ఏర్పడింది. గొట్టిపడియ, కాకర్ల డ్యామ్లకు ఇప్పటికీ వరదనీరు ఉంది. ఈ గ్యాప్లను నల్లమల సాగర్గా పిలుస్తారు. భవిష్యత్లో భారీ వర్షాలు కురిస్తే తమ గతి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అటు స్వగ్రామాలను వదలి బయటకు రాలేక, ఇటు ప్రభుత్వం పునరావాసం కల్పించక దిక్కుతోచని స్థితిలో కొండ కోనల్లో కాలం గడుపుతున్నారు. పునరావాస ప్యాకేజి కింద తమకు త్వరగా కాలనీలు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు.