-
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్వ్యాగన్ కారు ఇదే..
బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, పెద్ద గ్లాస్హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్హోల్డర్లతో మంచి లేఅవుట్ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తుంది.ఫోక్స్వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
మొదటి విద్యుత్కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా ఇకపై పూర్తిగా విద్యుత్ కార్లనే తయారు చేసి విక్రయించాలని జర్మనీ వాహన సంస్థ ఫోక్స్వ్యాగన్ నిర్ణయించుకుంది. తాజాగా భారత్లో తన మొదటి విద్యుత్ కారు ‘ఐడీ.4’ను ఆవిష్కరించింది. గ్లోబల్గా ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. క్రమంగా దాదాపు అన్ని కంపెనీలు ఈవీవైపు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫోక్స్వ్యాగన్ భారత్లో విద్యుత్ వాహన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే ఈ కారును విపణిలోకి విడుదల చేయనున్నట్లు ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మైఖేల్ మేయర్ తెలిపారు. ఐడీ.4ను రెండు వేరియంట్లతో తీసుకోస్తున్నారు. 62 కిలోవాట్అవర్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ఒక్కఛార్జ్లో 336 కిమీ వరకు వెళ్లగలదు. సింగిల్-మోటార్, రియర్-వీల్-డ్రైవ్తో అందుబాటులో ఉంటుంది. రెండోది 82 కిలోవాట్అవర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక్కఛార్జ్తో 443 కిమీలు వెళ్లగలదు. సింగిల్-మోటార్, డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్తో మార్కెట్లో రానుంది. ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.50లక్షలు-రూ.60లక్షల మధ్య ధర ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ కారును మార్కెట్లోని తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు ఈ ఏడాది భారత ప్రయాణికుల వాహన విపణి 5-7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని.. తాము 10-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. క్రమంగా విద్యుత్కార్లను ఆవిష్కరణను పెంచుతూ సమీప భవిష్యత్తులో పూర్తిగా ఈవీలను తయారుచేస్తామని మేయర్ తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్వ్యాగన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. -
ఆటోమొబైల్ రంగంలో మరో కీలక పరిణామం
వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్వ్యాగన్ గ్రూప్, భారత్కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా భవిష్యత్తులో తేబోయే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన విడిభాగాలను ఫోక్స్వ్యాగన్ సరఫరా చేయనుంది. ఫోక్స్వ్యాగన్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్ను మహీంద్రా తన ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ అయిన ఇంగ్లో కోసం వినియోగించనుంది. ఇంగ్లో ప్లాట్ఫామ్పై అయిదు పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. తొలి మోడల్ 2024 డిసెంబర్లో అడుగు పెట్టనుంది. -
వోక్స్వ్యాగన్ కార్లలో చాట్జీపీటీ.. అదెలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలు?
మీరు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కారు లోపల టెంపరేచర్ విపరీతంగా ఉంది. వెంటనే మీకు ‘ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్’ అనే సౌండ్ వినబడుతుంది. మీరు అదే కారులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే మీకు నోరూరించే బటర్ చికెన్ తినాలనిపిస్తుంది. వెంటనే సమీపంలో ఉన్న రెస్టారెంట్ ఎక్కుడ ఉంది? అని వెతికే పనిలేకుండా సంబంధిత రెస్టారెంట్ పిన్ కోడ్, అడ్రస్తో సహా అన్నీ వివరాలు మీకు వాయిస్ రూపంలో అందుతాయి. అలెక్సా తరహాలో రానున్న రోజుల్లో వోక్స్వ్యాగన్ కార్ల యజమానులకు పై తరహా ఏఐ టెక్నాలజీ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. వోక్స్వ్యాగన్ కార్లలో చాట్జీపీటీని ఇంటిగ్రేట్ చేస్తూ (అలెక్సా తరహా) వాయిస్ అసిస్టెంట్ను అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా లాస్ వేగాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో చాట్జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్పై ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2 నాటికి కార్లలో వోక్స్వ్యాగన్ కార్లలో చాట్జీపీటీ వాయిస్ ఓవర్ ఫీచర్ను అందుబాటులోకి తెస్తామని, తొలుత నార్త్ అమెరికా, యూరప్ కస్టమర్లు ఈ ఫీచర్ను వినియోగించుకునే సౌకర్యం కలగనుంది. టచ్ స్క్రీన్ను తాకే పనిలేకుండా సాధారణంగా ఏదైనా ఫీచర్ను వినియోగించాలంటే కార్లలో టచ్ స్క్రీన్ను తాకాల్సి ఉంటుంది. వోక్స్వ్యాగన్ అందించనున్న ఫీచర్తో ఆ అవసరం ఉండదని ఆ సంస్థ టెక్నికల్ డెవలప్మెంట్ బ్రాండ్ బోర్డ్ మెంబర్ కై గ్రునిట్జ్ తెలిపారు. వోక్స్వ్యాగన్ తన కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లలో టెక్నాలజీని స్టాండర్డ్ ఫీచర్గా మార్చిన మొదటి తయారీ సంస్థ తమదేనని తెలిపింది. అయితే, ఇప్పటికే జనరల్ మోటార్స్ గత మార్చిలో చాట్జీపీటీ ఏఐ మోడల్లను ఉపయోగించి వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్పై పనిచేస్తున్నట్లు తెలిపింది మెర్సిడెజ్ బెంజ్ కార్లతో పాటు మెర్సిడెజ్ బెంజ్ గత జూన్లో ఒక టెస్ట్ ప్రోగ్రామ్ను నిర్వహించి, ఆటోమేకర్ యొక్క ‘ఎంబీయూఎక్స్’ సిస్టమ్ను కలిగి ఉన్న సుమారు 900,000 కార్లలో చాట్జీపీటీని డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిచ్చింది. వినియోగదారులు దృష్టిలో ఉంచుకుని సినిమాలు చూడడం, రెస్టారెంట్లలలో సీట్లను బుక్ చేసుకోవడం, డ్రైవింగ్ సమయంలో అలెర్ట్లను ఇస్తుంది. -
గేర్బాక్స్ రిపేర్కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్..
కారులో సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఖర్చు వేలల్లో ఉంటుంది, అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో గేర్బాక్స్లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా కారు ఇంజిన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే.. ఇలాంటి సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఇటీవల ఫోక్స్వ్యాగన్ అమియో కారులోని DSG గేర్బాక్స్ ఇంజిన్లో సమస్య తలెత్తడంతో దానిని రిపేర్ చేసుకోవడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గేర్బాక్స్లో సమస్యను పరిష్కరించుకోవడానికే.. ఇంత బిల్ వచ్చిందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోక్స్వ్యాగన్ అమియో యజమాని 2వ, 3వ గేర్ మధ్య అప్షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహించి సర్వీస్ సెంటర్కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. డీఎస్జీ గేర్బాక్స్లో పెద్ద సమస్య ఉన్నట్లు గుర్తించి, దానిని రిపేర్ చేయడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ గేర్బాక్స్లో ఎక్కడ సమస్య ఉందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్ను సంప్రదించవచ్చు. -
ఫోక్స్వ్యాగన్ ఆఫర్ల జాతర.. టైగన్, వర్టస్ కొనుగోలుకు ఇదే మంచి సమయం!
ఫోక్స్వ్యాగన్ (Volkswagen) కంపెనీ ఎట్టకేలకు తన టైగన్ అండ్ వర్టస్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం 2022 - 2023 మోడల్ కార్లకు, BS6 ఫేజ్-2 కంప్లైంట్ ఇంజన్లతో నడిచే కార్లకు మాత్రమే లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోక్స్వ్యాగన్ టైగన్ 2022 మోడల్ ఫోక్స్వ్యాగన్ టైగన్ మీద రూ. 1.40 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కూడా వేరియంట్ను బట్టి రూ. 65,000 నుంచి తగ్గింపులు ప్రారంభమవుతాయి. టాప్లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యధిక తగ్గింపు, కంఫర్ట్లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యల్ప తగ్గింపు లభిస్తుంది. అయితే 2023 మోడల్ మీద రూ. 85,000 వరకు లభిస్తుంది. ఫోక్స్వ్యాగన్ వర్టస్ ఇక ఫోక్స్వ్యాగన్ వర్టస్ విషయానికి వస్తే.. కంపెనీ 2022 మోడల్ ఇయర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల తగ్గింపుని ప్రకటించింది. ఇది కూడా కంఫర్ట్లైన్ మాన్యువల్, టాప్లైన్ మాన్యువల్ వేరియంట్లకు అత్యధికంగా లభిస్తుంది. మరో వైపు జీటీ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్పై రూ. 20000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో 2023 మోడల్ ఇయర్ వర్టస్ కంఫర్ట్లైన్ మాన్యువల్, టాప్లైన్ మాన్యువల్, ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లపై రూ. 85,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఆఫర్స్ అనేవి నగరం నుంచి మరో నగరానికి లేదా డీలర్ నుంచి మరో డీలర్కి మారే అవకాశం ఉంటుంది. కావున టైగన్, వర్టస్ వేరియంట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్ను సంప్రదించడం మంచిది. -
ఫోక్స్వ్యాగన్ వర్టూస్, టైగున్ కొత్త ట్రిమ్స్ - ధర & వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా మధ్యస్థాయి సెడా న్ అయిన వర్టూస్, ఎస్యూవీ టైగున్ కొత్త ట్రిమ్స్ను విడుదల చేసింది. వర్టూస్ జీటీ ప్లస్ వేరియంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్రిమ్ను రూ.16.89 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. జీటీ డీఎస్జీ, జీటీ ప్లస్ వేరియంట్లలో టైగున్ను పరిచయం చేసింది. ఎక్స్షోరూంలో వీటి ప్రారంభ ధర రూ.16.79 లక్షలు. దేశవ్యాప్తంగా 121 నగరాలు, పట్టణాల్లోని 161 విక్రయ శాలల్లో ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది. -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే..!
భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతున్న కార్ల తయారీ సంస్థల్లో ఒకటి 'ఫోక్స్వ్యాగన్' (Volkswagen). ఈ జర్మన్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే టైగన్, వర్టస్ వంటి కార్లను మంచి సంఖ్యలో విక్రయిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ ఈ మోడల్స్ మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 2022 - 2023 మధ్యలో తయారైన బిఎస్-6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న మోడల్లకు కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. దీని కింద ఫోక్స్వ్యాగన్ కార్లను కొనాలనుకునే వారు టైగన్ ఎస్యూవీపై గరిష్టంగా రూ. 1.41 లక్షలు, వర్టస్ సెడాన్పై రూ. 1.03 లక్షల తగ్గింపు పొందవచ్చు. 2022 మోడల్ టైగన్లో మీరు ఎంచుకున్న వేరియంట్ను బట్టి రూ. 65,000 నుంచి రూ. 1.41 లక్షల వరకు తగ్గింపులు లభిస్తాయి. ఇందులో టైగన్ టాప్లైన్ మాన్యువల్ వేరియంట్పై ఎక్కువ, కంఫర్ట్లైన్ మాన్యువల్ వేరియంట్ మీద తక్కువ తగ్గింపు లభిస్తుంది. ఇక 2023 టైగన్ కొనుగోలుపై రూ. 91,000 బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉన్న 2023 మోడల్ టైగన్ మీద గరిష్టంగా రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) ఇప్పుడు వర్టస్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్పై రూ. 1.03 లక్షలు, 2022 ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. 2023 మోడల్ వేరియంట్ను బట్టి డిస్కౌంట్లు రూ. 20,000 నుంచి రూ. 65,000 వరకు తగ్గింపు, అదే సమయంలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉండే మోడళ్లపై ఎంచుకున్న వేరియంట్ను బట్టి రూ. 20,000 నుంచి రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది. కంపెనీ అందించే ఈ ఆఫర్ ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక డీలర్ నుంచి డీలర్కు మారే అవకాశాలు ఉన్నాయి. కావున కొనుగోలుదారుడు ఫోక్స్వ్యాగన్ కొనేటప్పుడు ఖచ్చితమైన వివరాలను పొందటానికి సమీపంలో ఉన్న డీలర్ను సంప్రదించడం మంచిదని భావిస్తున్నాము. -
టైగన్ ప్రియులకు షాక్.. భారీగా ధరలు పెంచిన ఫోక్స్వ్యాగన్
ఫోక్స్వ్యాగన్ ఇండియా గత నెలలోనే టైగన్ ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త ధరలను కూడా వెల్లడించింది. రియల్ డ్రైవ్స్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ చేయడం వల్లే ఈ ధరల పెరుగుదల జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ధరల పెరుగుదలకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఫోక్స్వ్యాగన్ టైగన్ ప్రస్తుతం కంఫర్ట్లైన్, హైలైన్, ఫస్ట్ యానివర్సరీ, టాప్లైన్, జిటి, జిటి ప్లస్ అనే ఆరు వేరియంట్లలో లభిస్తోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 45,000 పెరిగింది. అదే సమయంలో జిటి & జిటి ప్లస్ ధరలు వరుసగా రూ. 30,000, రూ. 10,000 పెరిగాయి. ఇక హైలైన్ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది. ఫోక్స్వ్యాగన్ టైగన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) ఫోక్స్వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్, 1750 ఆర్పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడింది. ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి పవర్, 1500 ఆర్పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్బాక్స్తో జతచేయబడింది. పనితీరు పరంగా ఈ రెండు ఇంజిన్లు ఉత్తమంగా ఉంటాయి. -
Volkswagen ID.2all EV: ఫోక్స్వ్యాగన్ నుంచి రానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది, ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో మేము సైతం అంటూ ముందుకు దూసుకొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మిన్నకుండిన 'ఫోక్స్వ్యాగన్' (Volkswagen) ఐడీ 2 ఆల్ కాన్సెప్ట్ రూపంలో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫోక్స్వ్యాగన్ ఐడీ 2 ఆల్ 2025 నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కేవలం రూ. 22 లక్షల (అంచనా ధర) ధరతో విడుదల కానున్న ఈ సెడాన్ మధ్యతరగతి ప్రజలను ఆకర్శించడానికి సిద్దమవుతున్న నివేదికలు చెబుతున్నాయి. డిజైన్: భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త ఫోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా ఉండే ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మ్యాట్రిక్స్ హెడ్లైట్లు, పెద్ద పనోరమిక్ సన్రూఫ్, త్రీడీ ఎల్ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్ల మధ్య సమాంతర ఎల్ఈడీ స్ట్రిప్ వంటి ఫీచర్లు ఉంటాయి. (ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?) ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 12.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10.9 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే, ట్రావెల్ అసిస్ట్, మెమరీ ఫంక్షన్తో పార్క్ అసిస్ట్ ప్లస్, అలాగే మసాజ్ ఫంక్షన్తో కూడిన ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్ & రేంజ్: ఫోక్స్వ్యాగన్ ఐడీ 2 ఆల్ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్తో ఏకంగా 450 కిమీ రేంజ్ అందించేలా రూపొందించబడుతోంది. అంతే కాకుండా 2026 నాటికి కంపెనీ దాదాపు పది ఎలక్ట్రిక్ కార్లను విడుదలచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐడీ 2 ఆల్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ యాక్సిల్ మోటార్ 222 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 20 నిముషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. 11Kw హోమ్ ఛార్జర్ కూడా అనుకూలంగా ఉంటుంది. -
అయ్యయ్యో కొత్త కారు, రోడ్డు మీదకి రాకముందే ఇలా! వైరల్ వీడియో
సాధారణంగా చాలా మందికి కారు కొనటం ఒక కల, ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవల ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి డీలర్షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఫోక్స్వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతినింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్ల తొందర, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండా కారు నడిపితే ఇలాంగే ఉంటుందనటానికి ఇది మంచి ఉదాహరణ. నిజానికి భారతీయ మార్కెట్లో ఫోక్స్వ్యాగన్ వర్టస్ రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్, రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి. ఫోక్స్వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెడాన్ లాటిన్ NCAP క్రాస్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ పొంది దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. -
ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్వ్యాగన్ భారీ షాక్
సాక్షి, ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్వ్యాగన్ భారతీయ వినియోగదారులకు షాకిచ్చింది. భారత మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఫోక్స్వ్యాగన్ తెలిపింది. అన్ని రకాల మోడళ్లపై దాదాపు 2శాతం వరకు ధరలు పెంచు తున్నట్టు ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగాధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. వర్టస్, టైగన్ ,కొత్త టిగువాన్ మొదలు భారతదేశంలోని ఫోక్స్వ్యాగన్ ఉత్పత్తి పోర్ట్ఫోలియో అంతటా ధరల పెంపు అమల్లో ఉంటుందని పేర్కొంది. కొత్త ధరల జాబితాను వెల్లడించనప్పటికీ, కంపెనీ ఉత్పత్తి పోర్ట్ఫోలియోలో 2శాతం వరకు వరకు పెంపు ఉంటుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు ట్రిమ్స్లో అందుబాటులో ఉన్న ఫోక్స్వ్యాగన్ వర్టస్ ధర రూ. 11.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.92 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఇక టైగన్ ఎస్యూవీ ప్రస్తుతం రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్న ధర పెంపు తర్వాత రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. -
ఫోక్స్వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్: అదరిపోయే ఫీచర్స్, కలర్స్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ తొలి వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్ చేసింది. టైగన్ ఎస్యూవీని లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా కొన్ని స్పెషల్ ఫీచర్లతో ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్గా సరికొత్తగా లాంచ్ చేసింది. రైజింగ్ బ్లూ కలర్, ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్లో ఇది అందుబాటులో ఉంది. స్టాండర్డ్ టైగన్తో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ , ఇతర ఫీచర్లతో తీసుకొచ్చింది. డైనమిక్ లైన్లో తీసుకొచ్చిన ఫోక్స్వ్యాగన్ టైగన్ స్పెషల్ ఎడిషన్ రెండు ఇంజీన్లతోరానుంది. 1.0 TSI MT & ATలో అందుబాటులో ఉన్న టాప్లైన్ వేరియంట్. "1" వార్షికోత్సవ బ్యాడ్జింగ్తో స్పోర్టియర్ లుక్స్తో అదరగొడుతోంది. ఇందులో హై లగ్జరీ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, విండో వైజర్లతో సహా ప్రత్యేకంగా డిజైన్చేసిన 11 అంశాలు ఉన్నాయి. సెఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే టైగన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 వరకు ఎయిర్ బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు, రివర్స్ కెమెరా, ISOFIX, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ సిస్టమ్ లాంటి పూర్తి స్థాయి 40+ భద్రతా ఫీచర్లను జోడించింది. అదనంగా 3 పాయింట్ సీట్ బెల్ట్లతో పాటు వెనుకవైపు 3 ఎడ్జస్టబుల్ హెడ్రెస్ట్ కూడా ఉంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్తో కూడిన 1.0L TSI ఇంజన్, 5000 నుండి 115PS (85 kW) గరిష్ట శక్తిని, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక. 5500 ఆప్పిఎం వద్ద గరిష్ట టార్క్ 178 టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5L TSI EVO ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ , 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ఆప్షన్తో అమర్చబడి ఉంటుంది, ఇది 150PS (110 kW) గరిష్ట శక్తిని 5000, 6000 rpm వద్ద, 5000 టార్క్ అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన ధరలు రూ. 15.40 లక్షలు- రూ. 16.90 లక్షల వరకు ఉంటాయి. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్లో టాప్ 3 ఫైనలిస్ట్గి నిలిచి ప్రపంచస్థాయిలో టైగన్ ఖ్యాతిగడించిందని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగా టైగన్ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. టైగన్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 40 వేల కంటే ఎక్కువ ఆర్డర్లను సాధించగా , 22వేల టైగన్లను డెలివరీ చేసింది. -
ఫోక్స్వ్యాగన్ సెడాన్ వర్టస్ సంచలనం
హైదరాబాద్: జర్మనీకి చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోక్స్వ్యాగన్ మధ్యస్థాయిసెడాన్ వర్టస్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే 2,000లకుపైగా యూనిట్లు డెలివరీ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ చేసిన దగ్గర్నుంచి ఈ కారు అద్భుతమైన స్పందనతో కస్టమర్ డిమాండ్ను సాధించిందని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన 'బిగ్ బై డెలివరీ', మెగా డెలివరీ ప్రోగ్రామ్ను ఇండియా వ్యాప్తంగా ప్రారంభించామని చెప్పింది. ప్రారంభ ఆఫర్లో వర్టస్ ధర ఎక్స్షోరూంలో రూ.11.21 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్ట్రైన్స్ పొందుపరిచారు. 1.0 లీటర్ ట్రిమ్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 1.5 లీటర్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ 18.67 కిలోమీటర్ల మైలేజీ ఉంటుందని తెలిపింది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుండై వెర్నా, స్కోడా స్లావియాలకు ఇది పోటీనిస్తుంది. ఎంక్యూబీ ఏ0 ఇండియా ప్లాట్ఫామ్పై పూణే సమీపంలోని చకన్ ప్లాంటులో ఇది తయారైంది. కాగా ఫోక్స్వ్యాగన్ ఇటీవల రిలీజ్ చేసిన వర్టస్ ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఫీట్ను సాధించింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక షోరూం ఒకేరోజు 150 కార్లను డెలివరీ చేసింది. తద్వారా ఇండియా బుక్ రికార్డ్స్లో వర్టస్ చోటు సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. -
ఈ విషయంలో ఈ కారు రికార్డు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
ఫోక్స్వ్యాగన్ తాజాగా రిలీజ్ చేసిన వర్చు కారు రికార్డు సృష్టించింది. ఇంత వరకు ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం అరుదైన ఫీట్ను అవలీలాగా సాధించింది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఇటీవల వర్చుస్ పేరుతో సరికొత్త సెడాన్ను మార్కెట్లో రిలీజ్ చేసింది. మార్కెటింగ్ స్ట్రాటెజీగా రికార్డ్ మెగా డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా డీలర్లకు పిలుపునిచ్చింది. ఫోక్స్ వ్యాగన్ మెగా డెలివరీ ప్రోగ్రామ్లో భాగంగా కేరళాకు చెందిన ఈవీఎం మోటార్స్ అండ్ వెహికల్స్ అనే డీలర్లు రికార్డు సృష్టించారు. జూన్ 9న కారు మార్కెట్లో రిలీజ్ అవగా అదే రోజు రికార్డు స్థాయిలో ఒకే డీలర్ నుంచి 150 సెడాన్ కార్లు డెలివరీ చేశారు. ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించి ఒక సెడాన్ కారు ఒకే డీలర్ నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో డెలివరీలు జరగలేదు. దీంతో ఈ ఆరుదైన ఫీట్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఇప్పటి వరకు ఈవీఎం డీలర్లు 200ల వరకు వర్చుస్ కార్లను డెలివరీ చేయగలిగారు. ఫోక్స్వ్యాగన్ వర్చుస్ కారు ప్రారంభం ధర రూ.11.21 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. చదవండి: ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం -
ఫోక్స్ వ్యాగన్ నుంచి సరికొత్త వర్చ్యూ
ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జర్మన్ కార్మేకర్ ఫోక్స్ వ్యాగన్ ఇండియాలో మరో కొత్త కారును ప్రవేశపెట్టింది. సెడాన్ విభాగంలో ఈ కొత్త మోడల్ను అందుబాటులోకి తేనుంది. ఈ కారు కనీస ధర రూ. 11.21 లక్షలు ఉండగా హై ఎండ్ మోడల్ ధర రూ.17.92 లక్షలు (ఎక్స్షోరూం) గా ఉంది. ఆరు వేరియంట్లలో, ఆరు రంగుల్లో ఈ కారు లభించనుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 152 షోరూమ్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఫీచర్లు - క్యాబిన్ మరియు బూట్ స్పేస్ 526 లీటర్లు - 20 సెంటీమీటర్ల డిజిటల్ కాక్పిట్ - 25.65 స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్ సిస్టమ్ - యాప్ కనెక్టివిటీ ఫీచర్లు - కీ లెస్ ఇంజన్ స్టార్ట్ , ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ - 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు , 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ మాన్యువల్/ఆటో టార్క్ - వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్టెక్స్ సిల్వర్, కుర్కుమా ఎల్లో, క్యాండీ వైట్, రైజింగ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. The New Volkswagen Virtus launched at a starting price of ₹ 11.21 Lakh. The striking, exhilarating, German-engineered marvel will be available in Dynamic and Performance variants.#TheNewVolkswagenVirtus #Sedan2022 #VolkswagenSedan #SedanIndia #VolkswagenIndia #Volkswagen pic.twitter.com/TiUPdEELCD — Volkswagen India (@volkswagenindia) June 9, 2022 లోటు తీరేనా ప్రస్తుతం ఇండియాలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎస్యూవీ, సబ్ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ ఇలా రకరకాలుగా మార్కెట్లోకి ఎస్యూవీలు వస్తున్నాయి. ఎస్యూవీల తర్వాత మల్టీ పర్పస్ వెహికల్స్ కూడా డిమాండ్ బాగానే ఉంది. దీంతో సెడాన్ విభాగంలో కొత్త మోడళ్ల రాక బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎంట్రీ, మిడ్లెవల్లో ఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఫోక్స్వ్యాగన్ వర్చ్యూ పేరుతో కొత్త సెడాన్ను తెస్తోంది. చదవండి: టాటా మోటార్స్ ‘ఈవీ’ రైడ్ -
‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్వ్యాగన్లు
ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఫోక్స్ వ్యాగన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో మహీంద్రా గ్రూపు తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను ఫోక్స్ వ్యాగన్ సమకూరుస్తుంది. మోటార్, ఇతర ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ను ఎంఈబీ సంస్థ అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. -
ఫోక్స్వ్యాగన్కి సవాల్ విసిరిన ఎలన్మస్క్
ఎప్పటి నుంచో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే జర్మనీ పెట్టింది పేరు. అలాంటి జర్మనీలో మళ్లీ ఫోక్స్వ్యాగన్దే ఆధిపత్యం. ఫోక్స్వ్యాగన్ బ్రాండ్కి తోడు పోర్షే, స్కోడా, లంబోర్గిని, ఆడి వంటి అనేక బ్రాండ్లు ఈ కంపెనీ సొంతం. అలాంటి దిగ్గజ కంపెనీకి జర్మనీ గడ్డ మీదనే సవాల్ విసిరారు బిజినెస్ ఫైర్బ్రాండ్ ఎలన్మస్క్. గిగా ఫ్యాక్టరీ కాన్సెప్టుతో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కొత్త రూపు తీసుకొచ్చారు ఎలన్ మస్క్. భారీ పెట్టుబడితో అతి భారీగా తయారీ పరిశ్రమను నెలకొల్పి ప్రొడక్షన్ వ్యయం తగ్గించేయడం ఈ గిగా ఫ్యాక్టరీల లక్ష్యం. అలాంటి ఫ్యాక్టరీ తాజాగా జర్మనీలో ప్రారంభించారు ఎలన్ మస్క్. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షూల్జ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 12 వేల మంది కార్మికులు పని చేస్తున్న ఈ ఫ్యాక్టరీ జర్మనీలోనే పెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ ఫ్యాక్టరీ మీద 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు ఎలన్ మస్క్. రాబోయే రోజుల్లో ఏడాదికి ఐదు లక్షల కార్లు తయారు చేయడం ఈ గిగా ఫ్యాక్టరీ లక్ష్యం. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఫోక్స్ వ్యాగన్దే ఆధిపత్యం. యూరప్లో 25 శాతం మార్కెట్తో ఏడాదికి 4.50 లక్షల ఈవీ కార్లను విక్రయిస్తోంది ఫోక్స్ వ్యాగన్. ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ చేతిలో 95 వేల ఈవీ కార్ల ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. ఎలన్ మస్క్ ప్రారంభించి టెస్లా గిగా ఫ్యాక్టరీతో రాబోయే రెండుమూడేళ్లలో ఫోక్స్వ్యాగన్కి తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. యూరప్ మార్కెట్లో టెస్లాకి 13 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇక కొత్తగా గిగా ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి వస్తే మార్కెట్లో టెస్లా మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. దీంతో జర్మన్ పీపుల్స్ కార్ల కంపెనీకి ఇబ్బందులు తప్పేలా లేవు. గిగా ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పటికీ 2022 ఏడాదికి సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం 54 వేల కార్లుగానే ఉండనుంది. 2023లో 2.80 లక్షల ఉత్పత్తి చేసి 2025 కల్లా ఏడాదికి 5 లక్షల కార్ల ఉత్పత్తి సామర్యం చేరుకోవాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లా దూకుడుకి చెక్ పెట్టే పనిలో భాగంగా ఫోక్స్వ్యాగన్ సైతం తన ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
ఎలక్ట్రిక్ మైక్రోబస్ను లాంచ్ చేయనున్న ఫోక్స్వ్యాగన్..!
ఎట్టకేలకు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ మైక్రోబస్ లేదా మల్టీ పర్పస్ వెహికిల్ VW ID. BUZZను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ఐకానిక్ VW బస్ సరికొత్తగా ఎలక్ట్రిక్ అవతార్లో కన్పించనుంది. ఈ ఏడాది చివర్లో యూరప్ మార్కెట్లలోకి వీడబ్య్లూ ఐడీ.బజ్ అందుబాటులోకి రానుంది. సరికొత్త హాంగులతో..! మల్టీ పర్పస్ వెహికిల్ విభాగంలో ఫోక్స్ వ్యాగన్ VW ID. BUZZ భారీ ఆదరణను పొందింది. పలు కారణాలతో ఫోక్స్వ్యాగన్ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రసుత్తం VW ID. BUZZ వ్యాన్ సరికొత్తగా ఎలక్ట్రిక్ రూపంలో రానుంది. ఈ వాహనం బజ్ గ్రూప్కు చెందిన మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ కిట్ (MEB) ప్లాట్ఫారమ్పై ఆధారపడనుంది. ఇది యూరప్లోని మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ బస్, ట్రాన్స్పోర్టర్. ఈ కారు కార్గో, ప్యాసింజర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! ఫోక్స్వ్యాగన్ ID. Buzz 150 kW లేదా 201 bhp ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. 1 kW ఏసీ వాల్ ఛార్జర్ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు, అయితే, ఇది 170 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు కూడా మద్దతును ఇవ్వనుంది. ఈ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ రేంజ్ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రెట్రో లుక్స్తో, మరింత స్టైలిష్గా..! సరికొత్త ID. Buzz 1950 VW బస్ T1 మోడల్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఈవీ షార్ట్ ఫ్రంట్ ఓవర్హాంగ్లతో రానుంది. ఐకానిక్ ఫ్రంట్ దాని మధ్య V-ఆకారపు ఫ్రంట్ ప్యానెల్తో పాటు ఆధునిక ఎల్ఈడీ హెడ్లైట్లతో వస్తుంది. బంపర్ ప్రత్యేకమైన డైమండ్ ప్యాటర్న్ గ్రిల్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ వాహనంలో సెంట్రల్ టచ్స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ , అన్ని ఇతర ఆధునిక అంశాలతో రానుంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్లో చవకైన బైక్గా..! -
భారత్కు ఫోక్స్వ్యాగన్ వర్చూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్వ్యాగన్ వర్చూస్ సెడాన్ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 115 పీఎస్ పవర్తో 1.0 లీటర్, 150 పీఎస్ పవర్తో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్ట్రైయిన్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో రూపుదిద్దుకుంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్, స్కోడా స్లేవియా వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. మధ్య స్థాయి ప్రీమియం సెడాన్స్ విభాగంలో 12–15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ‘కొత్త ఉత్పాదన రాగానే విభాగం వృద్ధి చెందుతుంది. 2022 డిసెంబర్ నాటికి ఈ విభాగం 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. కారు నిర్మాణ శైలికి ఇప్పటికీ దేశంలో ఆదరణ ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో ఈ శైలి కార్ల వాటా 12–14 శాతం కైవసం చేసుకుంది. ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మధ్యస్థాయి సెడాన్ విభాగం గతేడాది 28 శాతం వృద్ధి చెందింది’ అని వివరించారు. -
సీన్ రివర్స్.. దిగుమతి రోజులు పోయాయ్..
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇండియాలో తయారైన కార్లను విదేశాలకు ఎగుమతి చేసే స్టేజ్కి చేరుకుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్లాంటులో తయారు చేసిన కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ‘ఇంజనీరిడ్ ఇన్ ఇండియా డ్రివెన్ బై ది వరల్డ్’ కాన్సెప్టుతో ఈ పని చేపట్టింది. పూనేలో ఉన్న కార్ల తయారీ యూనిట్లో రూపొందిన టీ క్రాస్ మోడల్ కారును మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్టు స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా చైర్మన్ కాన్వాన్ సిలీన్ ప్రకటించారు. ఇక్కడ తయారైన కార్లకు మెక్సికో, సౌతాఫ్రికా, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనా దేశాల్లో చాలా డిమాండ్ ఉందని ఫోక్స్వ్యాగన్ ప్రతినిధులు తెలిపారు. గతంలో వెంటో కారుని ఎగుమతి చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇండియాలో టైగూన్ మోడల్లతో అమ్ముడవుతున్న కారుకి విదేశాల కోసం టీ క్రాస్ పేరుతో ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. ఇండియలోని ప్లాంట్లో తయారైన కార్లు 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. జర్మనీ ప్లాంట్లకు ఏమాత్రం తగ్గని క్వాలిటీతో ఇండియాలో కార్లు తయారు చేస్తున్నామన్నారు. చదవండి:కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..! -
వామ్మో ఒమిక్రాన్ ! కరోనాతో చైనాలో పరిస్థితి చేజారుతోందా ?
కరోనా విషయంలో బయటి ప్రపంచానికి చైనా చెప్పేదొకటి.. క్షేత్రస్థాయిలో జరిగేదొకటి. కరోనా వ్యాప్తి ఇప్పటికీ కంట్రోల్లోనే ఉందంటూ చైనా చెబుతున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చైనాలో కరోనా తీవ్రతను తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫోక్స్ వ్యాగన్ తీసుకున్న నిర్ణయం కూడా వాటి సరసన చేరింది. చైనా యూనిట్లు ప్రపంచలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా పేరుంది జర్మన్ కార మేకర్ ఫోక్స్ వ్యాగన్కి. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. చైనాలోని టియాన్జిన్ నగరంలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి కార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు కార్ల తయారీలో వినియోగించే విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ప్రమాదకరంగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఫ్యాక్టరీలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఒక్కసారిగా చైనాలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో ఫోక్స్ వ్యాగన్ యాజమాన్యం ఆందోళన చెందింది. దానికి తగ్గట్టే ఫోక్స్వ్యాగన్ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం నాటికి 30 మందికి కరోనా నిర్థారణ కాగా గురువారం మరో 41 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. కఠిన నిర్ణయం ఊహించని వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో టియాన్జిన్ నగరంలో ఉన్న కార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, కాంపోనెంట్ ఫ్యాక్టరీ రెండింటిని మూసేస్తున్నట్టు గురువారం ఫోక్స్వ్యాగన్ ప్రకటించింది. చైనాలోని తమ యూనిట్లలో కోవిడ్ ప్రవేశించింది. ఇప్పటికే కోవిడ్ లక్షణాలు ఉన్న యాభై మందికి పైగా శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడి ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిస్తున్నామని ఫోక్స్వ్యాగన్, చైనా ప్రతినిధి తెలిపారు. ఔ చదవండి: ఎక్కడ నుంచైనా పనిచేయండి..! తిరిగేందుకు రూ. లక్ష మేమిస్తాం..! -
ఫోక్స్వ్యాగన్ కొత్త టిగువన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కొత్త టిగువన్ ఎస్యూవీని ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.31.99 లక్షలు. 2.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్, 7 స్పీడ్ డీఎస్జీ 4మోషన్ ట్రాన్స్మిషన్, ఐక్యూ లైట్తో ఇంటెలిజెంట్, అడాప్టివ్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్స్, గెశ్చర్ కంట్రోల్తో 20.32 సెంటీమీటర్ల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, యూఎస్బీ సి–పోర్ట్స్, వియెన్నా లెదర్ సీట్స్, సాఫ్ట్ టచ్ డ్యాష్బోర్డ్, 6 ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఏర్పాటు ఉంది. ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3 జోన్ క్లైమెట్రానిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్ వంటి హంగులు ఉన్నాయి. జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
మాజీ ప్రేమికుల కథ
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
ఐపీఎస్లను వెంటనే డెప్యుటేషన్పై పంపండి
దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
కోర్టు ప్రాంగణంలోనే హత్యాయత్నం
ఆగని టీడీపీ ఉన్మాదం
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
విశాఖ విమల విద్యాలయం మూసివేత
Advertisement