Asia Cup 2022
-
ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్తో మ్యాచ్లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్తో జరిగే మ్యాచ్లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. గతేడాది జరిగిన ఆసియా కప్ నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి, ఆసియాకప్-2022లో ఆఫ్గానిస్తాన్పై అద్భుతమైన సెంచరీతో తన పూర్వ వైభవాన్ని పొందాడు. తన రిథమ్ను పొందడమే కాకుండా సెంచరీ కోసం తన మూడేళ్ల నిరీక్షణకు విరాట్ తెరదించాడు. అది విరాట్ కోహ్లికి తన అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ. ఇక ఒకనొక దశలో కోహ్లిని జట్టు నుంచి తప్పించాలని పెద్దు ఎత్తున డిమాండ్లు వినిపించాయి. పాక్ మాజీ క్రికెటర్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని హేళన చేశారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అద్భుతమైన పునరాగమనం చేసిన కోహ్లి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇక తాజాగా ఒక స్కూల్ కూడా విరాట్ కోహ్లి పట్టుదల, అలుపెరగని పోరాటానికి సలాం కొట్టింది. తమ స్కూల్లో 9వ తరగతి చదివే విద్యార్థులకు కోహ్లి పునరాగమనం గురించి వివరించాలని ప్రశ్న వేసింది. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో విరాట్ కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్న ఫోటో ఉంది. ఈ ఫోటో గురించి 100 లేదా 120 పదాల్లో వివరించాలని ప్రశ్నలో ఉంది. ఇక ఇది చూసిన కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి గురించి 100 పదాలు ఏంటి, పది పేజీలు అయినా రాయవచ్చు అంటూ అభిమానులు పోస్ట్లు చేస్తున్నారు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్ -
Ind Vs SL: స్లెడ్జింగ్తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు!
India vs Sri Lanka, 1st T20I- Hardik Pandya: ‘‘మేము గతం గురించి ఆలోచించడం లేదు. అయితే, ఒక్కటి మాత్రం నిజం. వాళ్లు ఇండియాలో ఉన్నారన్న భావన కలిగేలా చేస్తాం. కావాల్సినంత మజా అందిస్తాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ మంగళవారం నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన పాండ్యా ప్రత్యర్థి జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో శ్రీలంక చేతిలో ఓటమి గురించి ఆలోచించడం లేదన్న హార్దిక్ పాండ్యా.. ‘‘వాళ్లు (శ్రీలంక) మేటి అంతర్జాతీయ జట్టు ఇండియాతో.. అది కూడా ఇండియాలో ఆడుతున్నారన్న భావన కచ్చితంగా కలిగిస్తాం. మా కుర్రాళ్ల తరఫున నేను మీకు మాట ఇస్తున్నా. మేము వాళ్లను స్లెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మా బాడీ లాంగ్వేజ్ చాలు వాళ్లను భయపెట్టడానికి మా బాడీ లాంగ్వేజ్ చాలు. మీరు మంచి గేమ్ చూడబోతున్నారని మాట ఇస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో లంక చేతిలో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో పాండ్యా.. ఆసియా చాంపియన్ దసున్ షనక బృందాన్ని ఢీకొట్టనున్నాడు. చదవండి: BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్గా మళ్లీ అతడే! Ind Vs SL: ఆసియా చాంప్తో ఆషామాషీ కాదు! అర్ష్దీప్పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన డైనమైట్
Year Ender 2022: పొట్టి క్రికెట్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్లు క్రికెట్ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం కాదనలేని సత్యం. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్కప్ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్తో 1408 పరుగులు చేశాడు. ఓవరాల్గా సూర్య టీ20 కెరీర్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుండా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ గణాంకాలు.. - వెస్టిండీస్తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్ రేట్తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. - శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్ రేట్తో 34 పరుగులు చేశాడు. - సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్ రేట్తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. - ఐర్లాండ్తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్ రేట్తో 15 పరుగులు చేశాడు. - ఇంగ్లండ్తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్ రేట్తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. - ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్ రేట్తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - న్యూజిలాండ్తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది. - బంగ్లాదేశ్తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్ రేట్తో 30 పరుగులు చేశాడు. - ఆఫ్ఘనిస్తాన్తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్ రేట్తో 6 పరుగులు చేశాడు. - హాంగ్కాంగ్తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్ రేట్తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - నెదర్లాండ్స్తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్ రేట్తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. - పాకిస్తాన్తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్ రేట్తో 46 పరుగులు చేశాడు. - జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్ రేట్తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. టీ20 వరల్డ్కప్-2022లో సూర్యకుమార్.. - 6 మ్యాచ్లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్ రేట్తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచాడు. ఆసియా కప్-2022లో సూర్యకుమార్.. - 5 మ్యాచ్లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్ రేట్తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్ టీ20 ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. -
Team India: ద్వైపాక్షిక సిరీస్ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతర్వాత కరీబియన్ గడ్డపై 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో జరిగిన ఆసియా కప్లో సూపర్-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో సెమీస్లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్లో అయితే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది. 2021 టీ20 వరల్డ్కప్లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో గ్రూప్ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. -
Ind Vs Pak: ‘అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’
T20 World Cup 2022- India Vs Pakistan- October 23: ఆసియా కప్-2023 నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని పాక్ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, జై షా మాత్రం ఈ ఈవెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్కు వెళ్లదని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని పేర్కొన్నాడు. జై షా వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ.. ఏసీసీ అధ్యక్షుడి తీరు తమను నిరాశకు గురిచేసిందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ తాజాగా స్పందించారు. ఏ ఐసీసీ ఈవెంట్లోనూ ఆడదు.. అక్టోబరు 23న కూడా ఏఆర్వై న్యూస్తో కమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘జై షా నుంచి ఈ ప్రకటన ఊహించలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆయన మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అయితే, కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ ఆసియా కప్-2023 గనుక పాకిస్తాన్లో జరుగకపోతే.. ఇండియాతో ఇకపై పాక్ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లు అయినా సరే ఇండియాతో మ్యాచ్ ఆడదు. ఆసియా కప్ వరకు ఆగాల్సిన పనిలేదు.. అక్టోబరు 23 నాటి మ్యాచ్లో పాక్ ఇండియాతో ఆడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఒప్పుకొనే ప్రసక్తే లేదు ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్కు రావొద్దన్న నిర్ణయానికే బీసీసీఐ గనుక కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ కోసం ఇండియాకు ఎళ్లదు. అంతేకాదు తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణకు కూడా అంగీకరించదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్- పాక్ మధ్య మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక పీసీబీ, పాక్ మాజీ ప్లేయర్ల వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాక్ జట్టే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్లు.. పాక్తో మ్యాచ్ అంటేనే.. Predicted Playing XI: పాక్తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20 ప్రపంచకప్లో ఆ జట్టుతో జాగ్రత్త! లేదంటే అంతే!
T20 World Cup 2022- Gautam Gambhir Comments: టీ20 ప్రపంచకప్-2022కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16న జిలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమీబియా మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. తొలుత రౌండ్ 1 మ్యాచ్లు జరగనుండగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. ఇది ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అని గంభీర్ సూచించాడు. కాగా గత నెలలో జరిగిన ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన శీలంక ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2022 సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో శ్రీలంక తొలుత క్వాలిఫియర్ మ్యాచ్ల్లో ఆడనుంది. ఆక్టోబర్ 16న నమీబియాతో జరగనున్న మ్యాచ్తో శ్రీలంక తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ 'గేమ్ ప్లాన్'లో గంభీర్ మాట్లాడుతూ.." శ్రీలంక జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ముఖ్యంగా ఆసియాకప్లో వారు ఆడిన విధానం అద్భుతమైనది. టీ20 ప్రపంచకప్లో శ్రీలంక రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అదే విధంగా వారి స్టార్ బౌలర్లు దుష్మంత చమీర, లహిరు కుమార తిరిగి రావడంతో జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఖచ్చితంగా ఎదురు కానుంది. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్లో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోకూడదు" అని పేర్కొన్నాడు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ -
ఏడో టైటిల్ వేటలో భారత్
సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సమష్టి ప్రదర్శనతో... లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం. -
Womens Asia Cup T20: భారత మహిళలకు షాక్
సిల్హెట్ (బంగ్లాదేశ్): ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో జోరుగా దూసుకుపోతున్న భారత బృందానికి బ్రేక్ పడింది. ఫేవరెట్గా ఉన్న హర్మన్ప్రీత్ సేన పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై ఆశ్చర్యపర్చింది. శుక్రవారం మ్యాచ్కు ముందు టి20ల్లో పాక్తో 12 సార్లు తలపడి 10 సార్లు గెలిచిన భారత్... చివరిసారిగా 2016లో ఆ జట్టు చేతిలో ఓడింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ మన జట్టుపై విజయం సాధించింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాక్ 13 పరుగుల తేడాతో భారత్పై గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. గురువారం అనూహ్యంగా థాయ్లాండ్ చేతిలో ఓడిన పాక్ కోలుకొని ఆసియాకప్ టోర్నీలో తొలి సారి భారత్పై విజయాన్ని అందుకోవడం విశేషం. ఓపెనర్లు మునీబా (17; 1 ఫోర్), సిద్రా (11; 1 ఫోర్)తో పాటు ఒమైమా (0) కూడా విఫలం కావడంతో ఆరు ఓవర్ల లోపే 33 పరుగుల వద్ద పాక్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిదా దార్ (37 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 58 బంతుల్లో 76 పరుగులు జోడించారు. దీప్తి శర్మ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రకర్ 2 వికెట్లు తీసింది. ఛేదనలో ఓపెనర్లు సబ్బినేని మేఘన (15; 1 ఫోర్, 1 సిక్స్), స్మృతి మంధాన (17; 2 ఫోర్లు), హేమలత (20; 3 ఫోర్లు ) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్లో ఉన్న జెమీమా (2) విఫలం కాగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ను మారుస్తూ ఏడో స్థానంలో వచ్చిన హర్మన్ ప్రీత్ (12) ప్రయోగం విఫలమైంది. తీవ్ర ఎండ కారణంగా కీపింగ్ వదిలి మధ్యలోనే మైదానం వీడిన రిచా ఘోష్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా నష్రా బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు సాదియా ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టి రిచా గెలుపుపై ఆశలు రేపింది. అయితే అదే ఓవర్లో ఆమెను సాదియా అవుట్ చేయగా... చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా, భారత్ 4 పరుగులకే పరిమితమైంది. నష్రా 3 వికెట్లు తీయగా... నిదా, సాదియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే ఐదో లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్లో యూఏఈతో ఆడుతుంది. -
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్రౌండర్.. ఇద్దరూ ఒకేసారి!
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది. పాకిస్తాన్కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్, కైనత్ ఇంతియాజ్కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్ ప్రోత్సాహంతో సలీమా అంపైర్గా ఎదగగా.. క్రికెటర్ కావాలన్న తమ కూతురు కైనత్ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు. ఇక తండ్రిలాగే భర్త వకార్ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్ పాకిస్తాన్ ఆల్రౌండర్గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 41 ఏళ్ల వయసులో కల సాకారం బంగ్లాదేశ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా భారత్- శ్రీలంక మ్యాచ్తో అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్ పాకిస్తాన్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడంతో ఇంతియాజ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. భర్తతో కైనత్(PC: Kainat Imtiaz Instagram) నాకు గర్వకారణం.. కైనత్ భావోద్వేగం ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకుంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్ -2022లో అంపైర్గా మా మామ్! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్. వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్ తండ్రి ఖవాజా స్పో టీచర్గా పనిచేశాడు. ఇక పాక్ ఆల్రౌండర్గా ఎదిగిన కైనత్.. భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్కప్ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆడిన పాకిస్తాన్ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. View this post on Instagram A post shared by Kainat Waqar (@kainatimtiaz23) -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్లాండ్పై గెలిచింది. -
Womens Asia Cup 2022: ఫేవరెట్గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం, ఇంగ్లండ్పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్ను ఫేవరెట్గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్లో రాణించిన అఫ్గానిస్తాన్కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్లో తలపడుతుంది. టాప్–4 టీమ్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్లు ఆడగా 30 మ్యాచ్లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్తో సిరీస్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్లో కూడా భారత్ చక్కటి ఫామ్లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
'మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం బాగు చేసుకోండి'
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవరల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్-2022లోనూ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించకున్న భువీ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనూ పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన భువీ.. ఏకంగా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఆసీస్ సొంతమైంది. ఈ క్రమంలో తన చెత్త బౌలింగ్ కారణంగానే భారత్ డెత్ ఓవర్లలో విఫలమైంది అని భువనేశ్వర్ నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్ను ట్రోల్చేస్తున్న ట్రోలర్స్కు అతడి భార్య నుపుర్ నగర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రోల్స్ చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని సోషల్ మీడియా వేదికగా నగర్ ఫైర్ అయింది. "ఈ రోజుల్లో చాలా మంది ఏ పనికి రానివారు. వాళ్లు ఏమి చేయరు. ఖాళీగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ ఒకరిపై విమర్శలు, ద్వేషం వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్లకు చాలా సమయం ఉంది. వారందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే.. మీ మాటల వల్ల ఎవరూ ప్రభావితం కారు. అంతేకాకుండా మీ ట్రోల్స్ను కూడా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇతరలను విమర్శించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కోసం మీ జీవితాలను బాగు చేసుకోవడం. అది మీకు చాలా కష్టమే అని నాకు తెలుసు" అని నగర్ ఇన్స్టాగ్రామ్ రాసుకొచ్చింది. చదవండి: Ind vs Aus 2nd T20: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
ఆసియా కప్కు టీమిండియా మహిళల జట్టు.. పాక్తో మ్యాచ్ ఎప్పుడంటే?
అక్టోబర్ ఒకటి నుంచి జరగనున్న మహిళల ఆసియా కప్ టి20 టోర్నీకి బీసీసీఐ టీమిండియా జట్టును బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హర్మన్ప్రీత్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మందాన వైస్ కెప్టెన్గా నియమితురాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టులో ఉన్న ఆటగాళ్లలో దాదాపు అందరూ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యారు. గాయంతో ఇంగ్లండ్ టూర్కు దూరమైన జెమిమా రోడ్రిగ్స్ తిరిగి జట్టులోకి వచ్చింది. రేణుకా సింగ్, మేఘనా సింగ్, పూజా వస్రాకర్లు పేస్ బాధ్యతలు మోయనుండగా.. రాజేశ్వరి గైక్వాడ్, రాదా యాదవ్, స్నేహ్ రాణాలు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక ఆల్రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ సేవలందించనుంది. బ్యాటింగ్లో స్మృతి మందాన, షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దయాలన్ హేమలత, కేపీ నేవిగర్లు బ్యాటర్లుగా ఎంపిక చేసింది. ఇక తాంతియా బాటియా, సిమ్రన్ దిల్ బహుదూర్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. మహిళల ఆసియా కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ సంఘం అధ్యక్షుడు జై షా మంగళవారం విడుదల చేశారు. ఇక అక్టోబర్ 1న బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఏడు జట్లు పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, థాయ్లాండ్, మలేషియాలు మొదట రౌండ్ రాబిన్ లీగ్లో తలపడుతాయి. వీటిలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్కు చేరుతాయి. టీమిండియా మహిళలు టోర్నీలో తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 1న శ్రీలంకతో ఆడనుంది. ఆపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అక్టోబర్ 7న తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న బంగ్లాదేశ్తో, 10న థాయ్లాండ్తో ఆడనుంది. ఆసియాకప్కు టీమిండియా మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి వస్త్రాకర్, పూజా వస్త్రాకర్ గయాక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవగిరే స్టాండ్బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్ 🚨 NEWS 🚨: Team India (Senior Women) squad for ACC Women’s T20 Championship announced. #TeamIndia | #WomensAsiaCup | #AsiaCup2022 More Details 🔽 https://t.co/iQBZGVo5SK pic.twitter.com/k6VJyRlRar — BCCI Women (@BCCIWomen) September 21, 2022 చదవండి: ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్సీఏలో టికెట్ల రగడ -
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
T20 WC: యువ పేసర్పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా!
T20 World Cup 2022- Rohit Sharma- Arshdeep Singh: టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో ఈ యువ బౌలర్ బౌలింగ్ చేసిన విధానం అమోఘమని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ యార్కర్లు సంధించి ప్రత్యర్థికి చెమటలు పట్టించగల ప్రతిభ అర్ష్దీప్ సొంతమని ప్రశంసించాడు. టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా మంగళవారం ఆరంభం కానున్న తొలి టీ20కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఓపెనింగ్ జోడీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అంత తేలికేం కాదు! ప్రపంచకప్ టోర్నీలో కేఎల్ రాహుల్ ఓపెనర్గానే బరిలోకి దిగుతాడని.. విరాట్ కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్ మాత్రమేనని స్పష్టం చేశాడు. ఇక అర్ష్దీప్ గురించి మాట్లాడుతూ.. ‘‘అర్ష్దీప్ బౌలింగ్ చేస్తున్న విధానం బాగుంది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే.. ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగడం మామూలు విషయం కాదు. అర్ష్దీప్ సింగ్ తను చాలా తెలివైన వాడు. జట్టులో ఎప్పుడైతే లెఫ్టార్మ్ సీమర్ అవసరం ఎక్కువగా ఉందో అప్పుడే.. ఐపీఎల్లో తన ప్రదర్శనతో ప్రతిభను నిరూపించుకుని టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు. అతడి రాకతో మా బౌలింగ్ విభాగం పటిష్టమైంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2022 సూపర్- దశలో పాకిస్తాన్తో మ్యాచ్లో అసిఫ్ అలీ క్యాచ్ నేలపాలు చేసిన కారణంగా అర్ష్దీప్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అదే విధంగా శ్రీలంకతో మ్యాచ్లోనూ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. అతడి ఆట తీరుపై విమర్శలు మరింత పెరిగాయి. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా.. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘తనకు ఆత్మవిశ్వాస మెండు. చాలా మంది ఆటగాళ్లు ఇంట్లో కూర్చుని ఉన్నా జట్టులో అతడికి చోటు దక్కడానికి కారణం అదే. కెరీర్ తొలినాళ్లలోనే అతడు పరిణతితో వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్గా నేను.. కోచ్ ద్రవిడ్ భాయ్ అర్ష్దీప్ బౌలింగ్తో చాలా సంతృప్తిగా ఉన్నాము’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్ జట్టులో 23 ఏళ్ల ఫాస్ట్బౌలర్ అర్ష్దీప్నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్తో సిరీస్లో మాత్రం అతడికి విశ్రాంతి దొరికింది. చదవండి: Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్తో తొలి టీ20కి ముందు.. -
‘కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్’
మొహాలి: ఆసియా కప్లో అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. దాంతో టి20ల్లో రోహిత్తో కలిసి కోహ్లి ఓపెనింగ్ చేయాలనే సూచనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయిు. కేఎల్ రాహుల్ వేగంగా ఆడలేడనే కారణం కూడా దానికి జోడించారు. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్పష్టతనిచ్చాడు. రాహుల్కు మద్దతుగా నిలుస్తూ అతనే ప్రధాన ఓపెనర్ అని, కోహ్లిని తాము మూడో ఓపెనర్గానే చూస్తున్నామని వెల్లడించాడు. అవసరమైతే కొన్ని మ్యాచ్లలో కోహ్లికి ఓపెనింగ్ అవకాశం ఇస్తామని, అయితే రాహుల్ విలువేంటో తమకు బాగా తెలుసని చెప్పాడు. ‘ప్రపంచకప్లాంటి టోర్నీకి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం మంచిదే. ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అయితే ఒకసారి ఏదైనా ప్రయోగం చేశామంటే అదే శాశ్వతమని కాదు. మెగా టోర్నీకి ముందు ఆరు మ్యాచ్లు ఆడతాం కాబట్టి కోహ్లి ఓపెనింగ్ చేయవచ్చు కూడా. కానీ అతడిని మేం మూడో ఓపెనర్గానే చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచకప్లో రాహుల్ ఓపెనర్గానే ఆడతాడు. అతనో మ్యాచ్ విన్నర్. గత రెండేళ్లుగా అతని రికార్డు చూస్తే రాహుల్ ఎంత కీలక ఆటగాడో తెలుస్తుంది. ఒక మ్యాచ్లో ఒకరు బాగా ఆడారని మరో బ్యాటర్ను తక్కువ చేస్తే ఎలా. బయట ఏం మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. ఓపెనింగ్ గురించి మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్లో కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురైనా...కొత్త తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని, ఇకపై కూడా అదే శైలిని కొనసాగిస్తామని కూడా రోహిత్ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతోపాటు టి20 ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని ఆదివారం బీసీసీఐ ఆవిష్కరించింది. -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ పేసర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా గాయం కారణంగా ఆసియాకప్కు దూరమైన పేసర్లు దుష్మంత చమీరా, లహురు కుమార తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ తమ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులోకి చోటు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా ఆసియాకప్లో అదరగొట్టిన పేసర్లు మధుశంక, ప్రమోద్ మధుషాన్ కూడా ఈ మెగా ఈవెంట్కు ఎంపికయ్యారు. ఇక ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా టైటిల్ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్-2022లో తొలుత క్వాలిఫియింగ్ రౌండ్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్కు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్నెస్కు లోబడి), లహిరు కుమార(ఫిట్నెస్కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్ స్టాండ్బై ఆటగాళ్లు: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో Here's your 🇱🇰 squad for the ICC Men's T20 World Cup! ⬇️#RoaringForGlory #T20WorldCup pic.twitter.com/GU7EIl6zOw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2022 చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్కు ఎంపికచేయాల్సింది.. బాబర్కు సపోర్ట్గా ఉండేవాడు' -
కోహ్లి, రోహిత్లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని..
Legends League Cricket 2022- Asghar Afghan- Team India- T20 World Cup 2022: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో మ్యాచ్లో ఈ ఇద్దరిని అవుట్ చేస్తే సగం జట్టును పెవిలియన్కు పంపినట్లే భావించేవాళ్లమని పేర్కొన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా వీరి సొంతమంటూ హిట్మ్యాన్ రోహిత్, రన్మెషీన్ కోహ్లిలను కొనియాడాడు. గంభీర్ సారథ్యంలో.. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో అస్గర్ అఫ్గన్ ఇండియా క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన అస్గర్ హిందుస్థాన్ టైమ్స్తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసియా కప్-2022లో టీమిండియా ప్రదర్శన, టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన విజయావకాశాలపై తన అభిప్రాయాలు తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా.. టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచించేవాళ్లు అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇండియాతో మ్యాచ్ అంటేనే.. మా మొదటి ప్రాధాన్యం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లే! కోహ్లిని ఆపడం కష్టం! వాళ్లిద్దరినీ అవుట్ చేస్తే సగం జట్టును అవుట్ చేసినట్లే అని అనుకునేవాళ్లం. ప్రపంచంలోని మేటి బ్యాటర్లు అయిన వీళ్లిద్దరి గురించే మా చర్చంతా! ఎందుకంటే ఒంటిచేత్తో వాళ్లు మ్యాచ్ను మలుపు తిప్పగలరు! అందుకే... ముందు రోహిత్, కోహ్లిలను అవుట్ చేస్తే చాలు అనుకునేవాళ్లం. లేదంటే.. టీమిండియాను ఎదుర్కోవడం మరింత కష్టతరంగా మారుతుందని మాకు తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి.. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనని ఆపడం కష్టం. రోహిత్, కోహ్లిలను పెవిలియన్కు పంపితే వన్డేల్లో టీమిండియా స్కోరులో 100- 120... టీ20లలో 60- 70 పరుగులు తగ్గించవచ్చని భావించేవాళ్లం’’ అని అస్గర్ అఫ్గన్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్లో ఓటములకు అదే కారణం! అయితే.. ఇక ఆసియా కప్-2022లో రోహిత్ సేన సూపర్-4లో వరుస మ్యాచ్లు ఓడటానికి రవీంద్ర జడేజా లేకపోవడం కూడా ఒక కారణమని అస్గర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ టోర్నీలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్కప్ రూపంలో వారికి మంచి అవకాశం వచ్చిందని.. కచ్చితంగా టీమిండియా ఈ ఛాన్స్ను ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లి.. ఆసియాకప్లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో అజేయ శతకంతో రాణించి విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతేడాది మేలో కెప్టెన్సీ కోల్పోయిన అస్గర్ అఫ్గన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీ-2021లో నమీబియాతో మ్యాచ్కు ముందు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం! Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! -
T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం!
T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-3లో ఉన్న ఈ స్టార్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్లో చేసిన మొత్తం పరుగులు 68 మాత్రమే! ఆరు ఇన్నింగ్స్లో కలిపి ఇలా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన బాబర్ ఆజం.. కెప్టెన్గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విమర్శల జల్లు! ముఖ్యంగా.. ఫైనల్లో శ్రీలంక చేతిలో పాక్ ఓటమి కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులు సహా ఆ జట్టు మాజీ క్రికెటర్లు తమ సారథి తీరుపై మండిపడ్డారు. ఇక ఆసియాకప్- 2022లో రన్నరప్తో సరిపెట్టుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం.. అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్కు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. బాబర్కు ఇదే లాస్ట్ ఛాన్స్! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. బాబర్ ఆజం భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీలో గనుక పాక్ జట్టు రాణించకపోతే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మాజీ లెగ్ స్పిన్నర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బాబర్ ఆజం ప్రస్తుతం ఫామ్లో లేడు. అతడి కెప్టెన్సీపై కూడా విమర్శలు వస్తున్నాయి. అలా అయితే కెప్టెన్సీ కోల్పోతాడు! నాకు తెలిసి కెప్టెన్గా బాబర్కు ఇదే ఆఖరి అవకాశం. ఒకవేళ ప్రపంచకప్లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. దీంతో సహజంగానే అతడు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు. బాబర్ గొప్ప క్రికెటర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అతడికి అనుకూలంగా లేవు’’ అని చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపికలో కెప్టెన్గా తన పాత్ర కూడా ఉంటుందని.. కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా బాబర్ జవాబుదారీగా ఉండక తప్పదని పేర్కొన్నాడు. ఓపెనర్గా వద్దు! అదే విధంగా.. ఓపెనర్గా విఫలమవుతున్న కారణంగా బాబర్ ఆజం.. బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానాన్ని మార్చుకుంటే బాగుంటుందని డానిష్ కనేరియా సూచించాడు. ‘‘మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం స్ట్రైక్ రేటు ఆందోళన కలిగించే అంశం. పవర్ప్లేలో ఉండే సౌలభ్యాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోతున్నారు. ఓపెనర్గా పరుగులు సాధించలేకపోతున్న బాబర్ ఆజం.. వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయేమో! ఇంగ్లండ్తో సిరీస్లో వారు ఈ ప్రయోగాలు చేయవచ్చు. రిజ్వాన్కు విశ్రాంతినిచ్చారు కాబట్టి కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తే బాగుంటుంది’’ అని కనేరియా అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్ కంటే ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశలో రాణించిన బాబర్ ఆజం బృందం సెమీస్లో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు.. -
T20 WC 2022: ‘బాబర్ ఆజం, రిజ్వాన్ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవదు’
Asia Cup 2022- Pakistan- T20 World Cup 2022: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ను నమ్ముకుంటే పాకిస్తాన్ ఏ టోర్నీ కూడా గెలవలేదంటూ ఆ జట్టు మాజీ పేసర్ అకిబ్ జావేద్ అన్నాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోని టాప్ బ్యాటర్లుగా పేరొందినా జట్టుకు మాత్రం ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటం లేదంటూ విమర్శించాడు. ఈ ఓపెనర్లతో పాకిస్తాన్ ఐసీసీ టోర్నీలు గెలిచే అవకాశం లేదంటూ వ్యాఖ్యానించాడు. విఫలమైన బాబర్ ఆజం! ఆసియా కప్-2022 టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన ఆరు ఇన్నింగ్స్లో ఈ ‘స్టార్ ఓపెనర్’ చేసిన మొత్తం పరుగులు 68. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి దిగజారాడు. అదరగొట్టిన రిజ్వాన్.. అయినా! ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం 281 పరుగులతో రాణించాడు. ఆసియా కప్-2022 టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కీలక మ్యాచ్లలో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తన ఇన్నింగ్స్తో విజయాలు అందించాడు. అయితే, ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్లో మాత్రం మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఎప్పుడు ఎలా ఆడాలో తెలియదు! దూకుడేది? ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ అకిబ్ జావేద్.. బాబర్ ఆజం, రిజ్వాన్ స్ట్రైక్రేటును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఇద్దరు ఓపెనర్లు మేజర్ టోర్నీల్లో గెలిపించలేరు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ప్రపంచంలో నంబర్ 1,2 ఆటగాళ్లుగా పేరొందారు. అలాంటి బ్యాటర్లకు ఎప్పుడు ఎలా ఆడాలో తెలియాలి కదా! వైస్ కెప్టెన్ రిజ్వాన్ విషయానికొస్తే.. ఆసియా కప్లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో.. 15 ఓవర్ల పాటు ఆడాడు. అవసరమైన రన్రేటు 8 ఉన్నప్పటి నుంచి అది 17కు పెరిగేంత వరకు ఉన్నాడు. ఇలాంటి ఆట తీరుతో వీళ్లేం గెలుస్తారు’’ అని జావేద్ పెదవి విరిచాడు. అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారు! అదే విధంగా ఫఖర్ జమాన్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపడంపై స్పందిస్తూ.. ‘‘మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపి అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారు. నిజానికి బాబర్ లేదంటే రిజ్వాన్తో కలిసి ఓపెనర్గా వస్తేనే జట్టుకు ఉపయోగం ఉంటుంది. ఓపెనర్గా తను రాణించగలడు’’ అని అకిబ్ జావేద్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియాకప్-2022 రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అకిబ్ జావేద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’! ఎందుకంటే! 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! -
దూసుకొస్తున్న రన్ మెషీన్.. ఆఫ్ఘన్పై సెంచరీతో భారీ జంప్
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారీ జంప్ చేశాడు. ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్) సాధించి మళ్లీ టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్.. గత వారం ర్యాంకింగ్స్తో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్పాట్కు చేరుకున్నాడు. ఆఫ్ఘన్పై సెంచరీ సాధించడంతో కెరీర్లో 71వ శతకాన్ని, అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసిన విరాట్.. ఇదే జోరును త్వరలో జరుగనున్న టీ20 సిరీస్ల్లోనూ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) కొనసాగిస్తే తిరిగి అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయం. Big rewards for star performers from the #AsiaCup2022 in the latest update of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈 Details ⬇️ https://t.co/B8UAn4Otze — ICC (@ICC) September 14, 2022 తాజా ర్యాంకింగ్స్లో ఇవాళ (సెప్టెంబర్ 14) పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియా కప్లో దారుణంగా విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్కు దిగజారాడు. పాక్ వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సఫారీ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ హీరో, శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్ష.. 34 స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్పాట్కు చేరుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసియా కప్లో ఆఫ్ఘన్పై సంచలన ప్రదర్శన (5/4) చేసిన టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. భువీ.. 11వ స్థానం నుంచి సెవెన్త్ ప్లేస్కు చేరుకున్నాడు. టీమిండియా నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే కావడం విశేషం. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి రెండులో, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మూడో ప్లేస్లో కొనసాగుతున్నారు. ఆసియా కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విన్నర్ వనిందు హసరంగ (శ్రీలంక) తొమ్మిదో స్థానం నుంచి ఆరో ప్లేస్కు ఎగబాకాడు. -
T20 WC 2022: ప్రపంచకప్నకు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్పై వేటు
ICC Men's T20 World Cup 2022- Bangladesh Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొన్నాళ్లుగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇక మూడేళ్ల తర్వాత.. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా జట్టులోకి వచ్చిన సబీర్ రెహమాన్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఈవెంట్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం విశేషం. మహ్మదుల్లా అదే విధంగా గాయాల నుంచి కోలుకున్న నూరుల్ హసన్ సోహన్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, హసన్ మహ్మూద్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ఆసియా కప్లో ఆడిన ఆల్రౌండర్ మెహెదీ హసన్కు మాత్రం ప్రధాన జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం. అతడిని స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆసియా కప్-2022లో బంగ్లాదేశ్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. టీ20 వరల్డ్కప్-2022కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్(కెప్టెన్), సబీర్ రెహమాన్, మెహెదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొసేన్ ధ్రూబో, మొసద్దెక్ హొసేన్ సైకత్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, నూరుల్ హసన్ సోహన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, నసూమ్ అహ్మద్, హసన్ మహ్మూద్, నజ్మల్ హొసేన్ షాంటో, ఇబాదత్ హొసేన్, టస్కిన్ అహ్మద్. స్టాండ్ బై ప్లేయర్లు: షోరిఫుల్ ఇస్లాం, రిషద్ హొసేన్, మెహెదీ హసన్, సౌమ్య సర్కార్. చదవండి: Ind Vs Aus: భారత్తో సిరీస్.. ఆసీస్కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్! Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే! -
Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే!
Asia Cup 2022- India vs Pakistan, Super Four Match: ‘‘ఆరోజు పాకిస్తాన్తో మ్యాచ్లో క్యాచ్ నేలపాలు చేసిన కారణంగా తాను ఆ రాత్రి సరిగా నిద్ర కూడా పోలేదని అర్ష్దీప్ నాతో చెప్పాడు. అందరిలాగే తను కూడా కాస్త టెన్షన్ పడ్డాడు. కానీ మేము అతడికి నచ్చజెప్పాం. నిజానికి తను హార్డ్వర్కర్. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని తనతో అన్నాము’’ అని టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చిన్ననాటి కోచ్ జశ్వంత్ రాయ్ అన్నాడు. పాక్తో మ్యాచ్లో ఓటమిపాలైనందుకు అర్ష్దీప్ ఎంతగానో బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క క్యాచ్ మిస్ కావడంతో.. ఆసియా కప్-2022 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు విఫలం కావడంతో దాయాది చేతిలో రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్లో అర్ష్దీప్.. పాక్ ఆటగాడు అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేయడంతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. ఈ క్యాచ్ మిస్ కావడంతో లైఫ్ పొందిన అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్సర్, ఫోర్ బాది పాక్ విజయానికి బాటలు వేశాడు. ఇక ఆఖరి ఓవర్ వేసిన అర్ష్దీప్.. నాలుగో బంతికి అసిఫ్ అలీని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపినా.. ఆ తర్వాతి బంతికి ఇఫ్తికర్ అహ్మద్ రెండు పరుగులు తీసి పాక్ను గెలిపించాడు. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ ఈ ఫాస్ట్బౌలర్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. విపరీతపు కామెంట్లతో అతడిని అవమానించారు. అంతేకాకుండా అతడి వికీపీడియా పేజీని ఎడిట్ చేసి ఓ నిషేధిత సంస్థతో సంబంధం ఉందంటూ అనుచితంగా ప్రవర్తించారు కొందరు ఆకతాయిలు. దీంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాల గురించి అర్ష్దీప్ సింగ్ కోచ్ జశ్వంత్ రాయ్ తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ నాడు(సెప్టెంబరు 4) ఈ యువ పేసర్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్న అంశం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘క్యాచ్ జారవిడిచిన తర్వాత తను చివరి ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అప్పటికే నష్టం జరిగింది. క్యాచ్ జారవిడిచిన దానికంటే అదే ఎక్కువ బాధించింది! ఆ మ్యాచ్ తర్వాత నేను తనతో మాట్లాడాను. ఆ రాత్రి తను సరిగా నిద్రపోలేకపోయానని అర్ష్దీప్ నాతో అన్నాడు. తాను ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. కేవలం ఆరోజు ఫుల్టాస్ను యార్కర్(19వ ఓవర్ ఐదో బంతి)గా ఎందుకు మలచలేకపోయానా అని తను తీవ్రంగా బాధపడినట్లు చెప్పాడు. తన ప్రణాళిక అమలు అయి ఉంటే బాగుండేది. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ ఈవెంట్ అనేది ఏ క్రికెటర్కైనా తనను తాను నిరూపించుకునే అవకాశం ఇచ్చే గొప్ప వేదిక. తప్పులు సరిదిద్దుకునే తత్వమే అర్ష్దీప్ను ఈ టోర్నీలో నిలబెడుతుంది.. టీమిండియాకు ప్రయోజనకరంగా మారుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆడే భారత జట్టులో అర్ష్దీప్నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీలంక కష్టమే! ఆసీస్ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్.. -
'నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.. పాకిస్తాన్కు ఈ పరిస్థితి వస్తుందని'
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "పాక్ సరైన యువ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరముందని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను. ప్రస్తుతం జట్టు కూర్పు అస్సలు బాగోలేదు. పాక్ మిడాలర్డర్లో సరైన ఆటగాళ్లు లేరు. జట్టు మేనేజ్మెంట్ సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు యువ క్రికెటర్లకు ఇవ్వడం లేదు. అసలు పాకిస్తాన్ ప్రణాళికలు ఎంటో నాకు ఆర్ధం కావడం లేదు. అదే విధంగా ఆసియాకప్లో ఓటమి అనంతరం రిపోర్టర్లు హెడ్కోచ్ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగలేదో నాకు తెలియదు. భారత్తో జరిగిన మ్యాచ్లో నవాజ్ అద్భుమైన బ్యాటింగ్ చేశాడు. ఆతర్వాతి మ్యాచ్లో అతడిని ఎందుకు ఆ స్థానంలో బ్యాటింగ్కు ఎందుకు రాలేదు? నసీమ్ షా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అటువంటి అప్పడు అతడితో ముందు తన నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయంచరు..? ఇటువంటి ఎన్నో తప్పులు ఆసియాకప్లో పాక్ చేసింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
ఆసియా కప్ హీరోలకు ఘన స్వాగతం.. లంక వీధుల్లో విక్టరీ పెరేడ్
ఆసియా కప్-2022 విజేత శ్రీలంకకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఓ పక్క ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నప్పటికీ ద్వీప దేశ ప్రజలు తమ హీరోలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తమను గర్వంగా తలెత్తుకనేలా చేసిన హీరోలకు బాధలన్నీ దిగమింగి సుస్వాగతం చెప్పారు. కొలొంబోలోని బండారు నాయకే ఎయిర్ పోర్టు నుంచి ఓ రేంజ్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా.. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంక ఆటగాళ్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో విజయ దరహాసం చిందిస్తూ ప్రజలకు ఆభివాదం చేస్తున్న దృశ్యాలను లంక క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 📸 Snapshots from the #AsiaCup victory parade #RoaringForGlory pic.twitter.com/ZGIEov8OxL — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 13, 2022 కాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ, ఆతర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్లపై వరుస విజయాలు సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. అనంతరం తుది పోరులో పాక్ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరోసారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భానుక రాజపక్ష (71 నాటౌట్), హసరంగ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్, హసరంగ, కరుణరత్నే చెలరేగడంతో పాక్ 147 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని చవిచూసింది. -
తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా ఘనత!
Virat Kohli On Twitter: టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డుల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్లో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికే 71 సెంచరీలు సాధించాడు ఈ రన్మెషీన్. కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన కింగ్.. ఆసియా కప్-2022లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో అజేయ శతకంతో సత్తా చాటి మునుపటి కోహ్లిని గుర్తు చేశాడు. సోషల్ మీడియాలో కోహ్లి హవా! కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసి తన విలువ చాటుకున్నాడు. తనదైన ఆట తీరుతో రోజురోజుకీ అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా మరో రికార్డు సాధించాడు కోహ్లి. అయితే, ఈసారి ఆటలో కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లో కోహ్లి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ట్విటర్లో 50 మిలియన్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇన్స్టాగ్రామ్లో.. ఇక.. ఇన్స్టాగ్రామ్లో కోహ్లికి 211 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే విధంగా ఫేస్బుక్లో 49 మిలియన్ మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో కోహ్లి ఫాలోవర్ల సంఖ్య మొత్తంగా 310 మిలియన్కు చేరింది. విరాట్ కోహ్లి(PC: Virat Kohli Instagram) కాగా ట్విటర్లో 50 మిలియన్ ఫాలోవర్ల సంఖ్యను చేరుకున్న మొదటి క్రికెటర్గా నిలిచిన కోహ్లి.. ఇన్స్టాగ్రామ్లో ఫుట్బాల్ స్టార్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో(450 మిలియన్), లియోనల్ మెస్సీ(333 మిలియన్) తర్వాత అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన మూడో క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ప్రస్తుతం.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం? క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ Thank you for all the love and support throughout the Asia Cup campaign. We will get better and come back stronger. Untill next time ❤️🇮🇳 pic.twitter.com/yASQ5SbsHl — Virat Kohli (@imVkohli) September 9, 2022 -
భారత జెండాతో ఆఫ్రిది కూతురు.. నిజమేనన్న పాక్ మాజీ ఆల్రౌండర్
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ల మధ్య జరిగిన సూపర్-4 దశ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది చిన్ని కూతురు భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అఫ్రిదిని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఈ విషయంపై లైవ్లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ రోజు (భారత్-పాక్ మ్యాచ్ జరిగిన రోజు) స్టేడియంలో 90 శాతం మంది భారత అభిమానులు, కేవలం 10 శాతం మంది పాక్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది. ఫైనల్లో పాక్పై శ్రీలంక గెలిచిన అనంతరం గంభీర్ కూడా శ్రీలంక జెండా ఊపాడు. అలా చేసినంత మాత్రనా అతను శ్రీలంకన్ అయిపోయాడా.. లేక అతన్ని శ్రీలంక అభిమాని అని అనాలా..? అంటూ ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని జర్నలిస్ట్ను కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, ఆసియా కప్లో భారత్, పాక్లు రెండు సందర్భాల్లో ఎదురెదురు పడగా.. గ్రూప్ దశలో టీమిండియా, సూపర్-4 దశలో పాక్లు గెలుపొందాయి. సూపర్-4 దశలో భారత్.. పాక్, శ్రీలంక చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది. ఫైనల్లో శ్రీలంక, పాక్లు తలపడగా.. లంకేయులు పాక్ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. -
Asia Cup Final: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది..!
ఆసియా కప్-2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్, పాక్ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి ఏకంగా టైటిల్ను ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. పాక్ను మట్టికరిపించిన తీరు థ్రిల్లింగ్గా అనిపించిందని ట్వీటాడు. క్రికెట్ లాంటి టీమ్ గేమ్లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు అవసరం లేదని లంకేయులు మరోసారి నిరూపించారని అన్నాడు. టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందని తెలిపాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. I am thrilled at Sri Lanka’s victory this evening. Not because I wanted Pakistan to lose. But because Sri Lanka’s victory reminds us that Team Sports are not about celebrities & superstars but about—yes—Teamwork! #AsiaCup2022Final — anand mahindra (@anandmahindra) September 11, 2022 కాగా, దుబాయ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో పాక్ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో ఆదుకున్నాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
పాక్ను మట్టికరిపించాక కొలొంబో వీధులు దద్దరిల్లాయి..!
ఓ పక్క ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. మరో పక్క చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, బ్రతుకు భారమై ప్రజలంతా రోడ్లెక్కడం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ బతుకీడుస్తున్న ద్వీప దేశం శ్రీలంక ప్రజలకు ఓ వార్త భారీ ఊరట కలిగించింది. నిన్న (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2022 ఫైనల్లో లంక జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్కు షాకిచ్చి టైటిల్ను ఎగురేసుకుపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నీ బరిలోకి దిగిన శ్రీలంక.. ఫైనల్లో పాక్ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. నిన్నటి మ్యాచ్లో శ్రీలంక గెలుపొందగానే ద్వీప దేశంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. మాజీ అధ్యక్షుడు గొటబాయ దేశం వదిలి పలాయనం చిత్తగించిన తర్వాత జనాలు మళ్లీ ఆ స్థాయిలో రోడ్లెక్కి సంబురాలు చేసుకున్నారు. కర్ఫ్యూ అంక్షలు సైతం పట్టించుకోని జనం కొలొంబో వీధుల్లో జాతీయ జెండాలు చేతబూని నానా హంగామా చేశారు. ముఖ్యంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువత చాలాకాలం తర్వాత రోడ్డపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. వారి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఈ టోర్నీలో శ్రీలంక పుంజుకున్న తీరును ఆ దేశ ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. విజయ గర్వంతో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. Unlimited HAPPY 😊 Congratulations @OfficialSLC Team! We celebrate #AsiaCup2022Final #Srilankan #SriLanka #Amapara #addalaichenaiBoys @Wanindu49 @dasunshanaka1 @SriLankaTweet @AzzamAmeen @KumarSanga2 @MahelaJay @RusselArnold69 @RajapaksaNamal @fernandoharin pic.twitter.com/iJAJE64Cgy — 𝗦𝗮𝗳𝗻𝗲𝗲 ✹ (@SafneeOfficial) September 11, 2022 కాగా, టోర్నీ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాక్లపై వరుస విజయాలు సాధించి టైటిల్ను చేజిక్కించుకుంది. ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలుత 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టుకోల్పోయింది. అయితే భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో చెలరేగి శ్రీలంకు డిఫెండింగ్ టోటల్ను (170/6) అందించాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగి పాక్ ఆటకట్టించారు. పాక్ నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
కోహ్లిని అధిగమించిన రిజ్వాన్
పాకిస్తాన్తో ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్-2022 తుది సమరంలో శ్రీలంక 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి ఆరో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక జట్టు.. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని భారత్, పాక్లపై వరుస విజయాలు సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంక.. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి పాక్కు వరుసగా రెండో మ్యాచ్లో షాకిచ్చింది. అద్భుతమైన హాఫ్ సెంచరీతో లంకకు డిఫెండింగ్ టోటల్ అందించిన భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. And with that, we close the DP World #AsiaCup 2022, with Sri Lanka as CHAMPIONS! 🇱🇰🏆 What a tournament we've had! 🤩 Here are the overall performers who have impressed us with their incredible displays 👏#ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/M5v6p5QGEw — AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2022 ఇక ఈ టోర్నీ మొత్తంలో 'టాప్' లేపిన ఆటగాళ్ల విషయానికొస్తే.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (281 పరుగులు).. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (276) అధిగమించి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. రిజ్వాన్ 6 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ 5 మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 92 సగటున పరుగులు సాధించాడు. వీరి తర్వాత టాప్-5లో ఆఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (196), శ్రీలంక హిట్టర్ భానుక రాజపక్స (191), పతుమ్ నిస్సంక (173) ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్కు దక్కింది. భువీ 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి ప్లేస్లో లంక స్పిన్నర్ హసరంగ (9 వికెట్లు), పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు తలో 8 వికెట్లు సాధించారు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా భువీ పేరిటే నమోదై ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భువీ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. ఇక, టోర్నీలో నమోదైన ఏకైక సెంచరీ విరాట్ సాధించినదే కావడం విశేషం. -
SL Vs Pak: పాక్తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక
ఆసియా కప్-2022 టీ20 టోర్నీ మొదటి మ్యాచ్లో పరాభవం.. అఫ్గనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. కానీ ఆ తర్వాత శ్రీలంక జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. బంగ్లాదేశ్పై తొలి గెలుపు నమోదు చేసిన దసున్ షనక బృందం విజయాల బాట పట్టి టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచింది. సూపర్-4లో వరుసగా అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్లను ఓడించి ఫైనల్ చేరి.. తుదిపోరులో మరోసారి పాక్ను మట్టికరిపించి ఆసియా కప్ 15వ ఎడిషన్ విజేతగా అవతరించింది. దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం దృష్ట్యా.. సొంత ప్రేక్షకుల కేరింతల నడుమ అందుకోవాల్సిన ట్రోఫీని దుబాయ్ గడ్డపై ముద్దాడింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజలకు.. ఈ మెగా టోర్నీలో విజయంతో ఉపశమనం కలిగించి.. వాళ్ల ముఖాలు విజయదరహాసంతో వెలిగిపోయేలా చేసింది యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు. అసాధారణ.. అద్వితీయ గెలుపు కోటి రూపాయలకు పైగా ప్రైజ్మనీ సాధించి దేశానికి శుభవార్త అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ గెలుపు నిజంగా అసాధారణమైనది. వారు పంచిన ఆనంతం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ మీద టాస్ గెలిస్తేనే విజయం అన్న అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ జయకేతనం ఎగురవేసి.. గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. మాకు సీఎస్కే ఆదర్శం! ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ మ్యాచ్లో.. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 2021 చెన్నై ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసి.. గెలిచింది. మేము మ్యాచ్ ఆడుతున్నపుడు నా మదిలో ఇదే విషయం మెదిలింది. మా జట్టులోని యువ ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వనిందు నిజంగా తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్రభావం చూపాడు. చమిక, ధనుంజయ డి సిల్వా కూడా బాగా బ్యాటింగ్ చేశారు. చివరి బాల్ను సిక్స్గా మలచడం మాకు టర్నింగ్ పాయింట్. 160 పరుగుల స్కోరు అనేది ఛేదించదగ్గ లక్ష్యంగానే కనిపిస్తుంది. అయితే, 170 మార్కు మానసికంగా ప్రత్యర్థిపై కాస్త ఒత్తిడి పెట్టేందుకు ఉపకరిస్తుంది. ఇక మధుషంక గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్గా తనకు నేను ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు మద్దతుగా నిలిచాను’’ అని షనక చెప్పుకొచ్చాడు. కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్-2021 రెండో దశ మ్యాచ్లో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు చెన్నై.. ఇప్పుడు శ్రీలంక ఈ క్రమంలో దుబాయ్లో జరిగిన మ్యాచ్లలో దాదాపు అన్నింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే, ఫైనల్లో ధోని సేన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. 27 పరుగుల తేడాతో మోర్గాన్ బృందాన్ని మట్టికరిపించి చాంపియన్గా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై అదే తరహాలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. పాక్ను 23 పరుగులతో ఓడించి ఆసియా కప్-2022 చాంపియన్గా అవతరించింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! కానీ.. -
ఆసియా కప్-2022 ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
ఆసియాకప్-2022 మహా సంగ్రామానికి ఆదివారంతో తెరపడింది. ఈ మెగా ఈవెంట్ ఛాంపియన్స్గా శ్రీలంక నిలిచింది. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా ఇది శ్రీలంకకు 6వ ఆసియాకప్ టైటిల్ కావడం గమనార్హం. ఇక అండర్ డాగ్స్గా బరిలోకి దిగి ఛాంపియన్స్గా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్మనీ రూపంలో లక్షా ఏభై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్ను బీసీసీఐ అద్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రీలంక కెప్టెన్ దసన్ శనకకు అందజేశాడు. అదే విధంగా రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్కు 75,000 డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల అరవై ఆరు వేలు) ఫ్రైజ్మనీ దక్కింది. ఆసియాకప్లో అత్యధిక పరుగులు వీరులు వీరే మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 6 మ్యాచ్ల్లో 281 పరుగులు విరాట్ కోహ్లి(భారత్)- 5 మ్యాచ్ల్లో 276 పరుగులు ఇబ్రహీం జద్రాన్(ఆఫ్గాన్)- 5 మ్యాచ్ల్లో-196 పరుగులు భానుక రాజపక్స(శ్రీలంక)- 6 మ్యాచ్ల్లో 191 పరుగులు పాతుమ్ నిస్సంక(శ్రీలంక) - 6 మ్యాచ్ల్లో 173 పరుగులు ఆసియాకప్లో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్(భారత్)- 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు వానిందు హసరంగా(శ్రీలంక)- 6 మ్యాచ్ల్లో 9 వికెట్లు మహ్మద్ నవాజ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్ల్లో 8 వికెట్లు షాదాబ్ ఖాన్(పాకిస్తాన్)- 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు హారిస్ రౌఫ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్ల్లో 8 వికెట్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగాకు మ్యాన్ ఆఫ్ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. అదే విధంగా కీలకమైన ఫైనల్లో పోరులో 71 పరుగలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్ -
ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన
Asia Cup 2022 Final SL Vs Pak- Winner Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజా అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఓటమి బాధను జీర్ణించుకోలేక తన అసహనాన్ని ఓ జర్నలిస్టుపై ప్రదర్శించాడు. తన దురుసు ప్రవర్తన కారణంగా విమర్శల పాలయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో 23 పరుగులతో లంక.. పాక్ను చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఆరవసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ బాధలో మునిగిపోయిన తమ దేశ ప్రజల మోములు నవ్వులతో వికసించేలా చేసింది దసున్ షనక బృందం. ఇదిలా ఉంటే.. తుది మెట్టుపై బోర్లా పడ్డ పాకిస్తాన్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వీక్షించిన రమీజ్ రజాను.. పాక్ ఓటమి అనంతరం విలేకరులు పలకరించారు. ఈ సందర్భంగా.. రోహిత్ జుల్గన్ అనే జర్నలిస్టు.. ‘‘ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్ అభిమానులు నిరాశచెంది ఉంటారు కదా’’ అని ప్రశ్నించారు. మీరు ఇండియా నుంచి వచ్చారా? ఇందుకు స్పందించిన రమీజ్ రాజా.. ‘‘బహుశా మీరు భారత్కు చెందిన వారు అనుకుంటా? మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు కదా?’’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా.. జర్నలిస్టు మీదమీదకు వస్తూ.. ఆయన ఫోన్ లాక్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రోహిత్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ‘‘నేను అడిగిన ప్రశ్నలో తప్పేముంది? పాకిస్తాన్ ఫ్యాన్స్ ఈ ఓటమితో బాధకు లోనై ఉంటారు కదా అన్నాను. కానీ మీరిలా నా ఫోన్ తీసుకోవడం సరైంది కాదు మిస్టర్ చైర్మన్’’ అని రమీజ్ రాజాను ట్యాగ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు రమీజ్ రాజా తీరును ఏకిపారేస్తున్నారు. ‘‘ఆయన అంత స్పష్టంగా చెబుతున్నా.. మీరు సంతోషంగా ఉన్నారని మీ ముఖమే చెబుతోందంటూ అసహనం ప్రదర్శించడం సరికాదు. బోర్డు చైర్మన్వి.. అందునా ఆటగాడివి.. క్రీడాస్ఫూర్తి తెలియదా? ఓటమిని హుందాగా అంగీకరించే మనస్తత్వం లేనపుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇలాంటి దురుసు ప్రవర్తన కారణంగా ఓటమి కంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకుంటారు’’ అంటూ పాక్, భారత నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! కానీ.. SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్! क्या मेरा सवाल ग़लत था - क्या पाकिस्तान के फ़ैन नाखुश नहीं है - ये बहुत ग़लत था एक बोर्ड के चेयरमैन के रूप में - आपको मेरा फ़ोन नहीं छीनना चाहिये था - that’s not right Mr Chairman Taking my phone was not right @TheRealPCB @iramizraja #PAKvSL #SLvsPAK pic.twitter.com/tzio5cJvbG — रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) September 11, 2022 Full enjoy 🥰 pic.twitter.com/ha3IvZY77Y — Salman (@salman_dant) September 11, 2022 -
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! కానీ..
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్తో ఫైనల్లో అతడి స్ట్రైక్రేటు 157.78. రాజపక్స అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. హసరంగ భళా రాజపక్స, హసరంగ! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు. ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్లో స్ట్రైక్రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు. మా వాళ్లు చాలా తప్పులు చేశారు ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. కాగా దుబాయ్ వేదికగా పాక్తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాకిస్తాన్పై ఘన విజయం.. శ్రీలంక జెండాతో గంభీర్ సెలబ్రేషన్స్!
Asia Cup 2022 Winner Sri Lanka: ఆసియాకప్-2022 ఛాంపియన్స్గా శ్రీలంక అవతరించింది. ఈ మెగా ఈవెంట్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన శ్రీలంక.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా టైటిల్ను ఎగరసేకిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 23 పరుగుల తేడాతో చిత్తు చేసి 6 వసారి ఆసియాకప్ విజేతగా లంక నిలిచింది. కాగా ఈ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించాక గ్రౌండ్లో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ శ్రీలంక జెండా పట్టుకోని సంబురాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక జాతీయ జెండా పట్టుకోని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. కాగా గంభీర్ ఆసియాకప్లో కామెంటేటర్గా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గంభీర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత, ఆఫ్గనిస్తాన్ అభిమానులు లంకేయుల విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శ్రీలంకకు అభినందనలు తెలుపుతూ.. మరోవైపు పాకిస్తాన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ సూపర్-4 దశలోనే భారత్, ఆఫ్గనిస్తాన్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe — Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022 చదవండి: Asia Cup 2022 Final: అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం -
SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం
Asia Cup 2022 Winner Sri Lanka- Losing Captain Babar Azam Comments: తమ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయామని.. అందుకే ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో ఓటమి పాలయ్యామని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. భనుక రాజపక్స ఆటతీరు అద్భుతమని.. అతడే మ్యాచ్ను శ్రీలంక వైపు తిప్పేశాడని కొనియాడాడు. అత్యద్భుతంగా ఆడి కప్ గెలిచినందుకు శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం శ్రీలంక- పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన లంక ఆరంభంలో తడబడ్డా భనుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో మెరుగైన స్కోరు సాధించింది. రాజపక్స అదరగొట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్(55), ఇఫ్తికర్ అహ్మద్(32) తప్ప ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి నిలవలేక పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. విజేతగా లంక 23 పరుగుల తేడాతో పాక్పై జయభేరి మోగించిన దసున్ షనక బృందం ఆసియా కప్ 15వ ఎడిషన్ చాంపియన్గా అవతరించింది. ఆల్రౌండ్ ప్రతిభతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక పాక్ రన్నరప్తో సరిపెట్టుకుంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే! ఈ నేపథ్యంలో ఫైనల్లో లంక చేతిలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తాము విఫలమయ్యామన్నాడు. ‘‘మొదటి ఎనిమిది ఓవర్లు మా ఆధిపత్యం కొనసాగింది. అయితే, రాజపక్స వచ్చిన తర్వాత సీన్ మారింది. అతడు అద్భుతంగా ఆడాడు. దుబాయ్ వికెట్ ఎంతో బాగుంటుంది. అందుకే ఇక్కడ ఆడటాన్ని ఇష్టపడతాము. కానీ.. ఈరోజు మా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. ఇక.. శుభారంభం దొరికినా.. ప్రత్యర్థి జట్టుకు 15-20 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం. ఫీల్డింగ్ కూడా బాగా చేయలేకపోయాం. సానుకూల అంశాలు కూడా ఉన్నాయి! అయితే, ఈ టోర్నీలో మాకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిజ్వాన్, నవాజ్, నసీమ్.. అద్భుతంగా రాణించారు. ఆటలో గెలుపోటములు సహజం. నిజానికి ఫైనల్లో మేము చాలా తక్కువ తప్పులే చేశాము. ఇంకా మెరుగ్గా ఆడితే బాగుండేది’’ అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్లో రాజపక్స ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లంక ఆల్రౌండర్ వనిందు హసరంగకు దక్కింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు! -
ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!
ఆసియాకప్-2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఛాంపియన్గా శ్రీలంక అవతరిచింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 147 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(55) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ 4 వికెట్లతో పాక్ను దెబ్బ తీయగా.. హాసరంగా మూడు, కరుణరత్నే రెండు వికెట్లు సాధించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడితో పాటు వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. తొలి బంతికే పది పరుగులు పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ బౌలింగ్ వేసిన శ్రీలంక పేసర్ మధు శంక మొదటి బంతికే ఏకంగా 10 పరుగులు ఇచ్చాడు. తొలి బంతినే నోబాల్గా మధుశంక వేశాడు. అనంతరం పాక్ బ్యాటర్లకు ఫ్రీహిట్ లభించింది. అయితే వరుసగా నాలుగు బంతులను కూడా వైడ్గానే అతడు వేశాడు. అందులో ఓ బంతి వైడ్తో పాటు బౌండరీకి కూడా వెళ్లింది. దీంతో తొలి ఐదు బంతులు లెక్కలోకి రాకుండానే ఎక్స్ట్రాస్ రూపంలో పాకిస్తాన్కు 9 పరుగులు వచ్చాయి. ఎట్టకేలకు ఆరో బంతిని మధుశంక సరిగ్గా వేశాడు. ఈ ఫ్రీహిట్ బంతికి సింగిల్ మాత్రమే పాక్బ్యాటర్ రిజ్వాన్ సాధించాడు. దీంతో తొలి బంతి పడేటప్పటికి పాక్ ఖాతాలో 10 పరుగులు వచ్చి చేరాయి. మధుశంక బౌలింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 0 ball 9 Runs 😂 It's a Record , thanks Srilanka #PAKvsSL#AsiaCup2022Final pic.twitter.com/ONoxeIiLxr — Mehu 💕🦋 (@mahakhan199) September 11, 2022 చదవండి: Asia Cup 2022 Final: పాకిస్తాన్పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
ఎన్నాకెన్నాళ్లకు.. ఆసియా కప్తో లంకలో పండుగ (ఫొటోలు)
-
పాకిస్తాన్పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్
15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫిని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ రిజ్వాన్(55 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం.పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఆసియా కప్ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్లో జరిగిన అప్పటి ఆసియా కప్లోనూ పాక్ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సొంత అభిమానులచే తిట్ల దండకం అందుకున్న పాకిస్తాన్!
శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఫేలవ ఫీల్డింగ్పై సొంత అభిమానులే పెదవి విరిచారు. చేతిలోకి వచ్చిన క్యాచ్లను జారవిడవడం.. మిస్ ఫీల్డ్.. రనౌట్ చేసే అవకాశాలు వదులుకోవడం కనిపించాయి. ముఖ్యంగా పాక్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ విలువైన రెండు క్యాచ్లు వదిలేయడంతో విలన్గా మారిపోయాడు. దీంతో సొంత అభిమానులే పాకిస్తాన్ జట్టుపై తిట్ల దండకం అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఇందులో బానుక రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. అయితే రాజపక్స ఇచ్చిన క్యాచ్లను రెండు సందర్భాల్లోనూ షాదాబ్ ఖాన్ వదిలేసి మూల్యం చెల్లించాడు. తొలి క్యాచ్ తాను వదిలేయగా.. రెండో క్యాచ్ను ఆసిఫ్ అలీ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆసిఫ్ అలీతో సమన్వయం లేకుండా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షాదాబ్ క్యాచ్ను నేలపాలు చెయ్యడమే గాక ఏకంగా ఆరు పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత తనను ఎక్కడ తిడతారో అని కాసేపు హై డ్రామా చేశాడు. దీంతో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ''ఈరోజు పాకిస్తాన్ ఫీల్డింగ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు''.. ''ముఖ్యంగా షాదాబ్ ఖాన్.. కాలం మారినా పాకిస్తాన్ ఫీల్డింగ్లో మాత్రం మార్పు రాదు''.. ''పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూసిన తర్వాత ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ పారిపోవడం ఖాయం..'' అంటూ కామెంట్స్తో రెచ్చిపోయారు. చదవండి: Asia Cup 2022 Final: బాబర్ ఆజం కూడా ఊహించలేదు.. -
బాబర్ ఆజం కూడా ఊహించలేదు..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బానుక రాజపక్స మెరుపులతో 170 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు మరోసారి బాబర్ ఆజం రూపంలో షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన బాబర్ ఆజం ప్రమోద్ మధుషాన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అయితే బాబర్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాములుగా ఒక బ్యాటర్ ఫైన్లెగ్ దిశగా బంతిని బాదితే కచ్చితంగా బౌండరీ లేదా పరుగులు వస్తాయి. కానీ ఇక్కడే లంక కెప్టెన్ దాసున్ షనక తెలివిని ఉపయోగించాడు. బాబర్ ఆజం ఫైన్లెగ్ దిశగా ఆడేలా బంతిని వేయమని షనక చెప్పడం.. ప్రమోద్ అదే తరహాలో బంతి వేయడం.. ఫైన్ లెగ్ దిశలో ఉన్న మధుషనక క్యాచ్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. బాబర్ ఆజం తాను ఇలా ఔట్ అవుతానని ఊహించలేదనుకుంటా.. కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఇక బాబర్ తన ఫేలవ ఫామ్ను కంటిన్యూ చేశాడు. ఆసియా కప్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లాడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో వరుసగా 10, 9, 14, 0, 30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉండడం విశేషం. అలా ఈ పాక్ కెప్టెన్ తన ఫేలవ ఆటతీరుతో ఆసియా కప్ను ముగించాల్సి వచ్చింది. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు Asia Cup 2022 Final: పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స.. -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక.. కనీసం 150 పరుగుల మార్క్ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. కానీ వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం. శ్రీలంక స్కోరు 170 ఉండగా.. అందులో రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు -
అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు
Asia Cup 2022 Final: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో లంక ఓపెనర్ కుషాల్ మెండిస్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. కుషాల్ మెండిస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో అతనికి ఇది 26వ డకౌట్. అరంగేట్రం నుంచి అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ జాబితాలో కుషాల్ మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మొయిన్ అలీ(ఇంగ్లండ్) 25 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. కగిసో రబడా(దక్షిణాఫ్రికా) 23 డకౌట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: పాకిస్తాన్పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
ఫైనల్ బరిలో శ్రీలంక, పాకిస్తాన్.. ఆసియా కప్ కొట్టేదెవరు?
ఆసియా కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే ఆసియా కప్లో చాలా మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టుదే పైచేయిగా నిలిచింది. దీంతో టాస్ మరోసారి కీలకం కానుంది. ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్ను ఓడించిన లంక మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ ఆడనుంది. ఆసియా కప్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్లో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్లతో పాటు భానుక రాజపక్స బ్యాట్తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్కు కష్టమే! మరోవైపు పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం బలంగా ఉండగా.. బ్యాటింగ్లో మాత్రం కాస్త వీక్గా కనిపిస్తోంది. గత మ్యాచ్లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఆ మ్యాచ్లో ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవరూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. అయితే పాక్ బౌలింగ్ విభాగం బలంగా ఉండడం సానుకూలాంశం. శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ -
Asia Cup 2022: లంకకు ఎదురుందా!
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ‘అండర్ డాగ్’గా బరిలోకి దిగి అదరగొట్టిన శ్రీలంక ఇప్పుడు టైటిల్పైనే కన్నేసింది. ‘సూపర్–4’లో అజేయంగా నిలిచిన సింహళ జట్టు ఇప్పుడు ఫైనల్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. సూపర్–4లో తడబడుతూ తుదిపోరుకు చేరిన పాకిస్తాన్తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. భారత్తో బాగా ఆడిన పాకిస్తాన్ తర్వాత క్రికెట్ కూన అఫ్గానిస్తాన్తో చచ్చిచెడీ చివరి ఓవర్లో ఆఖరి వికెట్తో గట్టెక్కింది. గత మ్యాచ్లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవ రూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యా టింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌ ట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. దుర్భేద్యంగా షనక బృందం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ కంటే 8వ ర్యాంకులో ఉన్న లంక జట్టే ఈ టోర్నీలో అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్లతో పాటు భానుక రాజపక్స బ్యాట్తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్కు కష్టమే! జట్లు (అంచనా) శ్రీలంక: షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్, దనుష్క గుణతిలక, ధనంజయ, కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, మదుషన్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఇఫ్తికార్, ఖుష్దిల్, షాదాబ్, నవాజ్, ఆసిఫ్ అలీ, హారిస్ రవూఫ్, హస్నైన్, నసీమ్ షా. ► పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 22 టి20 మ్యాచ్లు జరిగాయి. 13 మ్యాచ్ల్లో పాకిస్తాన్, 9 మ్యాచ్ల్లో శ్రీలంక గెలిచాయి. ► ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీ 14 సార్లు జరిగింది. శ్రీలంక ఐదు సార్లు... పాకిస్తాన్ రెండుసార్లు చాంపియన్గా నిలిచాయి. భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. -
'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'
పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా ఊర్వశి రౌతేలా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదని.. ఆమెతో కనీసం ముఖ పరిచయం కూడా లేదని పేర్కొన్నాడు. సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్తో లవ్ అఫైర్ ఉందంటూ వార్తల్లోకి వచ్చింది ఊర్వశి రౌతేలా. అప్పటి నుంచి వార్తలో ఉన్న ఊర్వశి యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో దర్శనమిచ్చింది. రిషబ్ పంత్ బ్రేకప్ చెప్పిన తర్వాత కొత్త తోడు కోసం చూస్తున్న ఊర్వశి రౌతేలా, పాక్ క్రికెటర్ నసీం షా కోసమే పాకిస్తాన్ ఆడే మ్యాచ్లకు వస్తోందంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఊర్వశి రౌతెలా స్పందించలేదు. కానీ అఫ్గాన్తో మ్యాచ్లో ఆఖర్లో రెండు సిక్సర్లు బాది హీరోగా మారిపోయిన నసీం షాకి దీని గురించి ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్కి ముందు నసీం షాను ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేశాడు.''పాకిస్తాన్ ఆడే మ్యాచులకు ఊర్వశి రౌతేలా వస్తోంది. అయితే ఆమె మీకోసమే వస్తుందని చాలా మంది అంటున్నారు దీనిపై మీరేమంటారని'' ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నసీం షా... ''నాకు ఊర్వశి ఎవరో కూడా తెలీదు. అందుకే నవ్వు వచ్చింది. కొందరు నాకు వీడియోలు పంపుతూ ఉంటారు. నాకు అవన్నీ పట్టించుకోను. నాలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. నా ఫోకస్ అంతా క్రికెట్పైనే. క్రికెట్ చూసి నన్ను ప్రేమించే, గౌరవించే వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా'' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Naseem shah smiles ones again on question about Urvashi Rautela @UrvashiRautela @BCCI #NaseemShah pic.twitter.com/RvpWxajnYX — Haseeb Arslan (@haseebArslanUK) September 10, 2022 చదవండి: Road Safety World Series: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోర Suresh Raina: సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు.. -
Sourav Ganguly: విరాట్ కోహ్లి నన్ను మించిన తోపు..!
1020 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసి బ్యాక్కు యాక్షన్ అన్న సంకేతాలు పంపిన టీమిండియా తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి అద్భుతమైన సెంచరీతో (61 బంతుల్లో 122 నాటౌట్) చెలరేగిన అనంతరం దాదా అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. నైపుణ్యం పరంగా కోహ్లి నన్ను మించిన ఆటగాడని ఆకాశానికెత్తాడు. రిటైరయ్యే నాటికి కోహ్లి తనకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడతాడని జోస్యం చెప్పాడు. కోహ్లి కెరీర్లో అవరోధాలను అధిగమించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు. టాలెంట్ పరంగా కోహ్లి గొప్ప ఆటగాడనటానికి అతని రికార్డులే నిదర్శనమని అన్నాడు. కెప్టెన్సీ వివాదంలో కోహ్లి పట్ల కఠినంగా వ్యవహరించిన గంగూలీ.. రన్మెషీన్ తిరిగి ఫామ్ను అందుకున్న తర్వాత ఇలా పాజిటివ్గా రియాక్ట్ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, కోహ్లి ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న విషయం విధితమే. ఈ టోర్నీలో కోహ్లి.. సెంచరీతో పాటు రెండు క్లాసిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ బాదిన కోహ్లి.. కెరీర్లో 71వ శతకాన్ని, టీ20ల్లో తొలి సెంచరీని సాధించాడు. కోహ్లి సూపర్ సెంచరీ చెలరేగడంతో నామమాత్రంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లి చివరిసారి 2019 నవంబర్లో సెంచరీ సాధించాడు. చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..! -
భువీ చర్యకు షాక్ తిన్న సూర్యకుమార్..
ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, శ్రీలంకలపై వరుస పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్తాన్పై భారీ విజయం అందుకొని టోర్నీని ముగించింది. ఆసియాకప్లో అఫ్గన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి 71వ సెంచరీతో అభిమానులను సంతోషపెట్టాడు. ఇలా ఒక హ్యాపీ ఎండింగ్తో యూఏఈని వీడిన టీమిండియా స్వదేశానికి చేరుకుంది. కాగా స్వదేశానికి బయలుదేరడానికి ముందు టీమిండియా ఆటగాళ్లు హోటల్ రూం నుంచి ఎయిర్పోర్ట్ వరకు బస్సులో వచ్చారు. కాగా ఆటగాళ్లు బస్ ఎక్కే సమయానికి పెద్ద ఎత్తున అభిమానులు గూమిగూడారు. కోహ్లి, రోహిత్, అశ్విన్, కేఎల్ రాహుల్ సహా ఇతర క్రికెటర్లు అభిమానులకు నవ్వుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో అఫ్గానిస్తాన్ మ్యాచ్ హీరో భువనేశ్వర్.. వెనకాలే సూర్యకుమార్ వచ్చాడు. భువీ కనిపించగానే.. అభిమానులు భువీ.. భువీ అంటూ గట్టిగా అరిచారు. కానీ భువనేశ్వర్ మాత్రం అభిమానులను ఏమాత్రం పట్టించుకోకుండా బస్ ఎక్కేశాడు. వెనకే ఉన్న సూర్యకుమార్.. ''నిన్ను పిలుస్తున్నారు.. వాళ్లకి హాయ్ చెప్పు'' అని భువీకి చెప్పినా అతని మాటలు వినకుండానే వెళ్లిపోయాడు. ఈ చర్యతో సూర్యకుమార్ షాక్కు గురయ్యాడు. భువీ చేసిన పనితో కన్ఫూజన్కు గురయ్యి.. అభిమానులకు సారీ చెప్పిన సూర్య బస్ ఎక్కేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత పంత్ మాత్రంఅభివాదం ఒక్కటే చేయకుండా.. వారి దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్, సెల్పీలు దిగి అభిమానులను సంతోషపరిచాడు. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. టి20 ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టి20 ఫార్మాట్లో హోం సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనుంది. చదవండి: Asia Cup 2022: లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా! ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్రౌండర్ రిప్లై అదిరింది! -
Asia Cup 2022: అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లి ఉక్కు మనిషి..: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2022 Virat Kohli Century: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, అతడి సతీమణి, నటి అనుష్క శర్మపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లి ఉక్కు మనిషి అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. కాగా గతకొన్ని రోజులుగా విమర్శల పాలైన కోహ్లి.. ఆసియా కప్-2022 టోర్నీతో తిరిగి ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన సెంచరీ ఫీట్ నమోదు చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత శతకం బాదాడు. సూపర్-4లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. దీంతో రన్మెషీన్ 71వ సెంచరీ చూడాలని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక తనకు టీ20 ఫార్మాట్లో ఇదే తొలి శతకం కావడం.. అది కూడా అత్యంత కఠిన పరిస్థితుల్లో శతకం బాదడంతో కోహ్లి సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వాళ్లిద్దరికీ అంకితం అఫ్గన్తో మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. గడ్డు పరిస్థితుల్లో తన భార్య అనుష్క తనకు అండగా నిలిచిందని.. ఈ సెంచరీ ఆమెకు, తమ చిన్నారి కూతురు వామికాకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కోహ్లి వ్యాఖ్యలపై స్పందించిన రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్.. విరుష్క జోడీని ఆకాశానికెత్తాడు. హ్యాట్సాఫ్ అనుష్క! తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ఆమె నా జీవితంలో చేదు ఘటనలను దగ్గరగా చూసింది అన్నాడు. అతడు తన భార్య గురించే ఆ మాటలు చెప్పాడు. హ్యాట్సాఫ్ టూ అనుష్క శర్మ.. వెల్డన్! నువ్వు ఐరన్ లేడీవి. అతడు ఉక్కుతో తయారైన మనిషి.. అతడెవరంటే మిస్టర్ విరాట్ కోహ్లి’’ అని అక్తర్ అభివర్ణించాడు. అదే విధంగా కోహ్లి మరో 29 సెంచరీలు చేసి సచిన్ వంద సెంచరీల రికార్డును సమం చేస్తే చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్గా నిలిచిపోతాడని పేర్కొన్నాడు. ఇందుకోసం కోహ్లి ఎంతో సంయమనం.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించాడు. నువ్వు మంచివాడివి.. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అంటూ కోహ్లిపై అభిమానం చాటుకున్నాడు. కాగా ఆసియా కప్-2022లో భారత జట్టు కనీసం ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 11న శ్రీలంక- పాకిస్తాన్ మధ్య ట్రోఫీ కోసం పోరు జరుగనుంది. చదవండి: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్రౌండర్ రిప్లై ఇదే! -
లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్ను శ్రీలంక, పాకిస్తాన్లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆసియా కప్ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం. కాగా ఆసియాకప్ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆట పరంగా ఆసియా కప్లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ -
సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..!
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. టీమిండియా తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయకుండా మూడేళ్ల పాటు టీమిండియాలో కొనసాగడం కోహ్లి ఒక్కడికే సాధ్యమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అజింక్య రహానే లాంటి వారు పలు సందర్భాల్లో సెంచరీ చేయకపోవడంతో జట్టు నుంచి తప్పించబడ్డారని గుర్తు చేశాడు. ప్రస్తుత తరం క్రికెటర్లు అరుదుగా లభించే రెండు మూడు అవకాశాల్లో సెంచరీ చేయలేకపోతే వేటు తప్పదన్న విషయాన్ని ప్రస్తావించాడు. యువ క్రికెటర్లు ఇలా 1000 రోజులు సెంచరీ లేకుండా కొనసాగడమన్నది ఊహకందని విషయమని అన్నాడు. అయితే, కోహ్లి గత రికార్డులే అతన్ని జట్టులో కొనసాగేలా చేశాయని గంభీర్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. కోహ్లి సెంచరీ సాధించిన అనంతరం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. గంభీర్.. కోహ్లికి వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలు రన్మెషీన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. గంభీర్ గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని కోహ్లిని తరుచూ టార్గెట్ చేయడం అలవాటుగా మరిందని వారు కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి గత చరిత్ర ఘనంగా ఉంది కాబట్టే అతన్ని జట్టులో కొనసాగించారని, అతనికే బోర్డు పెద్దల మద్దతు ఉంటే కెప్టెన్గా కూడా కొనసాగేవాడని అంటున్నారు. ఓ టాలెంటెడ్ ఆటగాడు అష్టకష్టాలు పడి తిరిగి ఫామ్ను అందుకుంటే మెచ్చుకోవాలే కానీ ఇలా అక్కసు వెళ్లగక్కకూడదని చురకలంటిస్తున్నారు. కాగా, ఆసియా కప్-2022లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి కెరీర్లో 71 సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల తర్వాత కోహ్లి ఈ సెంచరీ చేశాడు. కోహ్లి చివరిసారి 2019 నవంబర్లో సెంచరీ సాధించాడు. చదవండి: కింగ్ ఈజ్ బ్యాక్ ఏంటి.. ఎప్పుడు తగ్గాడని మళ్లీ పుంజుకోవడానికి..? -
SL Vs Pak: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్రౌండర్ రిప్లై ఇదే!
Asia Cup 2022 Final Sri Lanka Vs Pakistan: మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్లోనే అఫ్గనిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్పై గెలుపుతో విజయాల బాట పట్టి సూపర్-4లో అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ జట్లను ఓడించి.. ఫైనల్ వరకు అజేయ జైత్రయాత్ర... ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ప్రస్థానం ఇది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 11) పాకిస్తాన్తో జరిగే ఫైనల్లో టైటిల్ ఫేవరెట్గా మారింది దసున్ షనక బృందం. సమిష్టి కృషితో తుదిపోరుకు అర్హత సాధించి.. ఆసియా కప్ ట్రోఫీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే లంక- పాక్ జట్లు సమాయత్తమవుతున్నాయి. ‘రిహార్సల్ మ్యాచ్’లో పాక్ను చిత్తు చేసి! ఇక సూపర్- 4 ఆఖరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని పాక్ను 121 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగి 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కీలక పేసర్ నసీమ్ షా లేకుండానే పాక్ బరిలోకి దిగింది. కాగా షాహిన్ ఆఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన 19 ఏళ్ల నసీమ్ పాకిస్తాన్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తమకు కీలకమైన మ్యాచ్లో అఫ్గనిస్తాన్ బౌలర్లు అత్యద్భుతంగా పోరాడిన వేళ.. నసీమ్ ఆఖర్లో రెండు సిక్సర్లు కొట్టి అటు అఫ్గన్.. ఇటు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో అతడిపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, ఫైనల్కు ముందు లంకతో జరిగిన మ్యాచ్లో అతడికి రెస్ట్ ఇవ్వడం విశేషం. నసీం షా ఉంటాడు కదా! అయితే! ఈ నేపథ్యంలో పాక్పై విజయానంతరం మీడియాతో మాట్లాడిన లంక ఆల్రౌండర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వనిందు హసరంగకు నసీమ్ గురించి ప్రశ్న ఎదురైంది. నసీమ్ షా మీకు ఫైనల్లో గట్టి సవాల్ విసురుతాడు అని భావిస్తున్నారా అని హసరంగను ఓ పాకిస్తాన్ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు కూల్గా స్పందించిన హసరంగ.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ‘‘అదేదో ఫైనల్లోనే చూసుకుంటాం’’ అని చిరునవ్వులు చిందించాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హసరంగ చర్యపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘బిల్డప్ చూసి ఏం చెబుతావో అనుకున్నాం... కానీ.. ఒక్క మాటతో పరోక్షంగా నసీం షా గాలి తీసేశావు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
కింగ్ ఈజ్ బ్యాక్ ఏంటి.. ఎప్పుడు తగ్గాడని మళ్లీ పుంజుకోవడానికి..?
CSK Tweets On Virat Kohli: ఫోర్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై తమ మనసులో మాటను బయటపెట్టింది. కోహ్లి ప్రత్యర్ధి టీమ్ ఆటగాడైనా అతనిపై అభిమానాన్ని చాటుకుంది. కోహ్లి 1020 రోజుల తర్వాత సెంచరీ చేసిన నేపథ్యంలో ఆసక్తికర ట్వీట్లు చేసింది. ఈ వరుస ట్వీట్లు ప్రస్తుతం సోషల్మీడియలో వైరలవుతున్నాయి. ఇంతకీ సీఎస్కే కోహ్లిను ఉద్దేశించి ఏం చెప్పిందంటే.. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో (61 బంతుల్లో 122 నాటౌట్) చెలరేగాడు. ఈ సెంచరీ (71వ శతకం) కోసం కోహ్లి సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడంతో అతని కెరీర్లో ఇది ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోహ్లికి అభినందనలు తెలుపుతున్నారు. He charged head-first into battles, over and over again! pic.twitter.com/4Q0760RGtv — Chennai Super Kings (@ChennaiIPL) September 9, 2022 ఈ క్రమంలో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సైతం కోహ్లిని అభినందనలతో ముంచెత్తింది. కింగ్ ఈజ్ బ్యాక్ అని అందరూ అంటున్నారు.. ఇంతకీ కోహ్లి ఎప్పుడు పడ్డాడని తిరిగి లేవడానికి, అతనో నిరంతర పోరాట యోధుడు, సవాళ్లు ఎదురైన ప్రతిసారి నిర్భయంగా ఎదుర్కొన్నాడు, ఒక్కసారి కూడా వెనుదిరిగింది లేదు, రన్మెషీన్ పరుగులు సాధించాడు, సాధిస్తున్నాడు, సాధిస్తూనే ఉంటాడంటూ వరుస ట్వీట్లతో కోహ్లిని ఆకాశానికెత్తింది. He braved wars and scars fearlessly, turning away not once! pic.twitter.com/tVMoMNWPSR — Chennai Super Kings (@ChennaiIPL) September 9, 2022 సీఎస్కే తమ ప్రత్యర్థి ఆటగాడైన కోహ్లి పట్ల ఇంత సానుకూల ట్వీట్లు చేయడంతో అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కోహ్లిని పొగిడిన నోటితోనే జనం సీఎస్కేను సైతం అభినంధిస్తున్నారు. ప్రత్యర్ధి ఆటగాడైనప్పటికీ సీఎస్కే క్రీడా స్పూర్తి చాటుకుందని మెచ్చుకుంటున్నారు. కాగా, దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగడంతో 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘన్ 111 పరుగులకే పరిమితమై దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఆసియా కప్ ఫైనల్స్కు శ్రీలంక, పాక్ జట్లు చేరాయి. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే!
Asia Cup 2022- Team India: ‘‘గతేడాది ప్రపంచకప్ టోర్నీలో మన జట్టు ఓడిపోయినపుడు చాలా మంది దానికి కారణం విరాట్ కోహ్లి అన్నారు. కెప్టెన్ను మార్చాలని మాట్లాడారు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఆసియా కప్ గెలవలేకపోయాడు కదా’’ అని టీమిండియా మాజీ కెప్టెన్ ఆకాశ్ చోప్రా అన్నాడు. మెగా టోర్నీలో భారత్ చతికిల పడటానికి కెప్టెన్లు కారణం కాదని.. అసలు సమస్య జట్టు ఎంపికలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. కోహ్లి, రోహిత్ కారణం కాదు! గతేడాది యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్-2021లో కోహ్లి సేన తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఐసీసీ ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరు, కోహ్లి కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు చెప్పినట్లుగానే విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. చెత్త ప్రదర్శన ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. హిట్మాన్ సారథ్యంలో భారత జట్టు టీ20 ఫార్మాట్లో అద్బుత విజయాలు సాధించింది. కానీ ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడింది. డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. సూపర్-4లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో వరుస పరాజయాలతో కనీసం ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ముఖ్యంగా టోర్నీకి ముందు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడటం.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం.. అవకాశాలు అందుకున్న అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యువ ఫాస్ట్ బౌలర్లు కీలక సమయాల్లో ఒత్తిడిని జయించలేక చేతులెత్తేయడం.. తుది జట్టు కూర్పులోనూ స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో భారత జట్టు భారీ మూల్యమే చెల్లించింది. టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అదే! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. గతేడాది ప్రపంచకప్.. ఈసారి ఆసియా కప్లో భారత జట్టు ఓటమికి కెప్టెన్సీ కారణం కాదన్నాడు. జట్టు ఎంపికే ప్రధాన సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా తుది జట్టు కూర్పు విషయంలో సరైన ప్రణాళిక లేకుండానే ముందుకు వెళ్లి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. తరచూ జట్టులో మార్పులు చేయడం సరికాదని.. శ్రీలంక, పాకిస్తాన్ ఒకటీ రెండు మార్పులు మినహా ఒకే జట్టుతో ఆడి ఫైనల్కు చేరుకున్నాయని చెప్పుకొచ్చాడు. చదవండి: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్పై బాబర్ ఆజాం ఆగ్రహం -
టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన బ్యాట్ను వేలానికి పెట్టిన పాక్ ప్లేయర్
Naseem Shah: ఆసియా కప్-2022లో పాకిస్తాన్ను ఫైనల్స్కు చేర్చడానికి, టీమిండియాను పరోక్షంగా ఇంటికి పంపడానికి కారణమైన బ్యాట్ను వేలానికి పెట్టాడు పాక్ యువ పేసర్ నసీమ్ షా. సూపర్-4 దశలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన కీలక సమరంలో నసీమ్ షా.. సహచరుడు మహ్మద్ హస్నైన్ నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్తో చివరి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి (విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో), ఓటమి అంచుల్లో ఉన్న పాక్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. వరుస సిక్సర్లు బాది రాత్రికిరాత్రే హీరో అయిపోయిన నసీమ్.. తను సిక్సర్లు కొట్టడానికి తోడ్పడిన బ్యాట్ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును పాక్ వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని తెలిపాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా వెల్లడించింది. The bat with which he struck the two last-over sixes 🤩@iNaseemShah decides to auction the bat gifted to him by @MHasnainPak for a charitable cause. #AsiaCup2022 pic.twitter.com/uCF1loEXCT — Pakistan Cricket (@TheRealPCB) September 8, 2022 కాగా, గత నెల రోజులుగా పాకిస్తాన్ మునుపెన్నడూ లేని వరదల ధాటికి అతలాకుతలమైంది. వందల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. కనీవినీ ఎరుగని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది పాక్ ప్రభుత్వం. భారత్ సహా చాలా దేశాలు పాక్కు తోచిన సాయం చేశాయి. తాజాగా పాక్ యువ క్రికెటర్ నసీమ్ షా సైతం తనవంతు సాయంగా బ్యాట్ వేలం ద్వారా వచ్చిన సొమ్మును వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో టీమిండియా వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో శ్రీలంక, పాక్ జట్లు ఫైనల్స్కు చేరాయి. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్-4 దశ చివరి మ్యాచ్లో పాక్ను మట్టికరిపించిన లంక జట్టు ఆత్మ విశ్వాసంతో ఉరకలేస్తుంది. అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ టైటిల్ను ఎగరేసుకుపోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాక్ సైతం ఆసియా ఛాంపియన్గా నిలిచేందుకు ఉవ్విళ్ళూరుతుంది. చదవండి: గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్! -
'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్పై ఆడుకో'
ఆసియాకప్-2022లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు,. ఈ మెగా ఈవెంట్ అఖరి సూపర్-4 మ్యాచ్లోనూ బాబర్ అదే ఆట తీరును కొనసాగించాడు. ఈ మ్యాచ్లో 29 బంతులు ఎదుర్కొన్న ఆజాం 30 పరుగుల చేసి పెవిలియన్కు చేరాడు. ఆది నుంచే లంక బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ బాబర్.. అఖరికి హాసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన బాబర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్లో భారత్పై కేవలం 10 పరుగులు చేసి ఔటైన ఆజం..తర్వాతి మ్యాచ్లో పసికూన హాంగ్కాంగ్పై కూడా 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత్తో జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఏకంగా డకౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆజం తన టీ20 నెం1 ర్యాంక్ను కోల్పోయాడు. Babar azam aj apni taraf se Virat kohli ban'na chah raha tha lkn usy aj Rohit sharma ki trha rest krni chahye thi. #PAKvsSL — Huzaifa (@huzaifadotcom) September 9, 2022 ఈ క్రమంలో దారుణంగా విఫలమవుతున్న ఆజాంను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పసికూనలపైనే బాబర్ సెంచరీలు సాధిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్పై ఆడుకో' అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇక ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. NO TOSS NO PARTY.😂#teampakistan #BabarAzam #AsiaCup2022 #AsiaCup2022Final #SLvPAK — Shraddha 💖 (@Shraddha__queen) September 9, 2022 చదవండి: Asia Cup 2022: గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్! -
T20 WC 2022: హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. ద్రవిడ్కు కష్టకాలం: మాజీ సెలక్టర్
T20 World Cup 2022- Team India- Rahul Dravid: ఆసియా కప్-2022 టోర్నీలో డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా కనీసం ఫైనల్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకుపోతూ హాట్ ఫేవరెట్గా మెగా ఈవెంట్లో అడుగుపెట్టిన రోహిత్ సేన.. అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక మొదలు తుది జట్టు కూర్పు వరకు కొన్నిసార్లు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు ఫ్యాన్స్తో పాటు విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. వరుస విజయాలు.. కానీ అసలు పోరులో చేతులెత్తేశారు! కాగా.. కెప్టెన్ రోహిత్.. హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి మెగా టోర్నీ ఇది. ఈ ఈవెంట్కు ముందు.. వీరిద్దరి నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. వరుస విజయాలతో ప్రపంచ రికార్డులు సృష్టించింది. కానీ.. టీ20 ప్రపంచకప్-2022కు సన్నాహకంగా భావించిన ఆసియా కప్ ఈవెంట్లో మాత్రం చతికిలపడింది. ఇదిలా ఉంటే.. ఓవైపు దాయాది పాకిస్తాన్.. మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పొరుగు దేశం శ్రీలంక ఫైనల్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం.. టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. ఆసియా కప్లో టీమిండియా ప్రదర్శన ద్రవిడ్కు కష్టకాలం తెచ్చిపెట్టిందని.. భవిష్యత్తులో అతడు మరిన్ని కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందన్నాడు. అదే విధంగా రానున్న రెండు మెగా ఐసీసీ ఈవెంట్లలో గెలిస్తేనే కోచ్గా అతడికి సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ.. ‘‘తన హనీమూన్ పీరియడ్ అయిపోయిందని రాహుల్ ద్రవిడ్కు తెలుసు. జట్టును అత్యుత్తమ స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. అప్పుడే ద్రవిడ్కు సంతృప్తి కానీ అతడి ప్రయత్నాలు అందుకు సరిపోవడం లేదు. నిజంగా రాహుల్ ద్రవిడ్కు ఇది కష్టకాలం. టీ20 వరల్డ్కప్, వన్డే వరల్డ్కప్ రూపంలో రెండు మెగా ఐసీసీ ఈవెంట్లు ముందున్నాయి. ఈ రెండు టోర్నీల్లో ఇండియా గెలిస్తేనే రాహుల్ ద్రవిడ్కు సంతృప్తి దొరుకుతుంది’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అదే విధంగా తన మార్గదర్శనంలో సెనా(SENA- సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టీమిండియా టెస్టు సిరీస్లు గెలిస్తే ద్రవిడ్ సంతోషడతాడంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం -
గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్!
ఆసియాకప్-2022 సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్కు ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అఖరి ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆనూహ్యంగా ఒక్క వికెట్ తేడాతో ఆఫ్గాన్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆఫ్గాన్ బౌలర్ ఫరీద్ ఆహ్మద్, పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ ఆలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన అలీ.. తర్వాత బంతికే పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందలో ఫరీద్.. అలీ దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపున్నాడు. అయితే తన సహానాన్ని కోల్పోయిన అలీ.. బౌలర్పై కొట్టడానికి బ్యాట్ ఎత్తాడు. దీంతో ఆసీఫ్ ఆలీ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లతో పాటు, అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. ట్విటర్లో# 'బ్యాన్ ఆసీఫ్ ఆలీ' హ్యాష్ ట్యాగ్ను కూడా ఆఫ్గాన్ అభిమానులు ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరికి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఫరీద్ అహ్మద్, అసిఫ్ ఆలీలకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు చెరో డీ మోరిట్ పాయింట్ వేసింది. చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్పై బాబర్ ఆజాం ఆగ్రహం -
పాక్కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో శ్రీలంక ‘సూపర్–4’లో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఫైనల్కు ముందు ప్రాక్టీస్లా శుక్రవారం జరిగిన ‘సూపర్–4’ ఆఖరి పోరులో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లు సమష్టిగా పాక్ ఇన్నింగ్స్ను కూల్చారు. ఓపెనర్, కెప్టెన్ బాబర్ అజమ్ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు), నవాజ్ (18 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు)లు మాత్రమే కాస్త మెరుగనిపించారు. ఫామ్లో ఉన్న రిజ్వాన్ (14), ఫఖర్ జమన్ (13), ఇఫ్తికార్ (13) తేలిగ్గానే వికెట్లను సమర్పించుకున్నారు. లంక బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హసరంగ 3 వికెట్లు పడగొట్టగా, తీక్షణ, మదుశన్ రెండేసి వికెట్లు తీశారు. ధనంజయ, చమికలకు చెరో వికెట్ దక్కింది. అనంతరం సునాయాస లక్ష్యాన్ని శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్లో ఓపెనర్ కుశాల్ (0), గుణతిలక (0) డకౌట్ కావడంతో లంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధనంజయ డిసిల్వా (9) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో మరో ఓపెనర్ నిసాంక (48 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతగా ఆడి జట్టును గెలిపించాడు. రాజపక్స (19 బంతుల్లో 24; 2 సిక్సర్లు), కెప్టెన్ షనక (16 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్లు) నిసాంకకు అండగా నిలిచారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే తుదిపోరు జరుగుతుంది. చదవండి: Asia Cup 2022: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా! -
చెలరేగిన శ్రీలంక బౌలర్లు.. 121 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఆసియాకప్-2022లో భాగంగా అఖరి సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్కు శ్రీలంక చుక్కలు చూపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. మహేశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్ చెరో రెండు, దనుంజయ డి సిల్వా, , కరుణరత్నే తలా వికెట్ సాధించారు. ఇక పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజాం (30), మహ్మద్ నవాజ్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: Asia Cup 2022: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా! -
ఫైనల్కు ముందు శ్రీలంకతో పాక్ పోరు.. స్టార్ బౌలర్కు విశ్రాంతి!
ఆసియాకప్-2022 సూపర్-4 అఖరి మ్యాచ్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో ఇరు జట్లు ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నామమాత్రపు మ్యాచ్లో శ్రీలంక, పాకిస్తాన్ రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. శ్రీలంక జట్టులోకి ధనంజయ డి సిల్వా, ప్రమోద్ మదుషన్ ఎంట్రీ ఇవ్వగా.. పాక్ జట్టులోకి హాసన్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వచ్చారు. కాగా ఈ మ్యాచ్కు పాక్ స్టార్ ఆటగాళ్లు నసీం షా, షాదాబ్ ఖాన్కు విశ్రాంతి ఇచ్చారు. తుది జట్లు: పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక చదవండి: Asia cup 2022 Afg vs Ind: 'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసమే' -
'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసమే'
ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన అఖరి సూపర్-4 మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ఆఫ్గాన్పై 101 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో తన 71 సెంచరీ కోసం కోహ్లి మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అదే విధంగా ఇది కోహ్లి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్గాన్.. భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించిడంతో 111 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. Very well paid by india today vs Afghanistan#wellpaidindia #matchfixed #indvsafg #fixing pic.twitter.com/h63LMn8Ayb — Muzach 🫡 (@MuazSaqib) September 8, 2022 కాగా అంతకుముందు సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్కు ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ఒక్క వికెట్ తేడాతో ఆఫ్గాన్ పరాజయం పాలైంది. అయితే పాక్పై అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్ భారత్పై మాత్రం అన్ని విధాలుగా విఫలమైంది. Wooo wapsi ka ticket ka pesa nai thay isi lia match fix karna para..#INDvsAFG pic.twitter.com/1gyimoWSx1 — نور ٹویٹس🇵🇰 (@sheiknoor31) September 9, 2022 ఈ మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్లో కూడా చేతులెత్తేసింది. విరాట్ కోహ్లి, పంత్ ఇచ్చిన ఈజీ క్యాచ్లను ఫీల్డర్లు జారవిడిచారు. 28 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి ఏకంగా 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. Wooo wapsi ka ticket ka pesa nai thay isi lia match fix karna para..#INDvsAFG pic.twitter.com/1gyimoWSx1 — نور ٹویٹس🇵🇰 (@sheiknoor31) September 9, 2022 ఈ క్రమంలో పాక్ అభిమానులు మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ఐపీఎల్ కోసమే ఆఫ్గానిస్తాన్ ఆటగాళ్లు అమ్ముడు పోయారంటూ ట్విట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో # ఫిక్సింగ్ అనే కీవర్డ్ ట్రెండింగ్ అవుతోంది. This afghan skipper should keep his head down in shame. For IPL contracts they sell their team .Amount of catches dropped by afghan shows how money is important. #Fixing — amaan (@amaan15203715) September 9, 2022 చదవండి: Asia Cup 2022: కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు! -
Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్!
ఆసియాకప్-2022ను విజయంతో టీమిండియా ముగించింది. దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన తమ అఖరి మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయ సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో 1020 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ తన అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు. ఈ నామమాత్రపు మ్యాచ్లో కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించడంతో మ్యాచ్ ఏకపక్షం అయిపోయింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ బౌలింగ్ చేసి అందరనీ అశ్చర్యపరిచాడు. కాగా కార్తీర్ తన కెరీర్లో బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన కార్తీక్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా కార్తీక్ బౌలింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. India vs Afghanistan #AsiaCup2022 #DineshKarthik bowling pic.twitter.com/PEo8lxmuaw — Deepak Dagar (@deepak123dagar) September 8, 2022 చదవండి: Queen Elizabeth II: క్రికెటర్ చెంపపై ఆటోగ్రాఫ్ నిరాకరించిన క్వీన్ ఎలిజబెత్-2 -
'నిజమైన హీరోలు సైలెంట్గా దూసుకొస్తారు.. కోహ్లి లాగే'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించిన వేళ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆసియా కప్ నుంటి టీమిండియా వైదొలిగిందన్న విషయాన్ని కోహ్లి తన ఒక్క సెంచరీతో మరిపించేశాడు. కోహ్లి 71వ సెంచరీ కోసం దాదాపు వెయ్యి రోజులకు పైనే ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆసియాకప్లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి సెంచరీ సాధించాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేసిన కోహ్లికి టి20ల్లో ఇదే తొలి సెంచరీ. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నిజమైన హీరోలు సైలెంట్గా వస్తారు.. విమర్శించిన వారిపై మాటలతో కాకుండా పంచులతోనే సమాధానమిస్తారు.అచ్చం కోహ్లి లాగే. కంగ్రాట్స్.. మరోసారి వింటేజ్ కోహ్లిని తలపించావు'' అంటూ కామెంట్ చేశాడు. కాగా ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. టోర్నీలో ఇదే అత్యధికస్కోరు. విరాట్ కోహ్లి(61 బంతుల్లో 122 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేసింది. భువనేశ్వర్ (4–1–4–5) పేస్ దెబ్బకు 9 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్ జట్టులో ఇబ్రహీం (64 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే పోరాడాడు. RISE! Real heroes roll with the punches & prove naysayers wrong their actions… 👏🏼👏🏼👏🏼 https://t.co/HvLAKOnA5F — anand mahindra (@anandmahindra) September 9, 2022 చదవండి: KL Rahul: రిపోర్టర్ ప్రశ్నకు చిర్రెత్తిన రాహుల్.. 'డగౌట్లో కూర్చోమంటున్నారా?' Neeraj Chopra: ఎదురులేని నీరజ్ చోప్రా.. పట్టిందల్లా బంగారమే -
రిపోర్టర్ ప్రశ్నకు చిర్రెత్తిన రాహుల్.. 'డగౌట్లో కూర్చోమంటున్నారా?'
ఆసియాకప్ టోర్నీలో టీమిండియా ఫైనల్కు వెళ్లడంలో విఫలమైనప్పటికి అఫ్గన్పై భారీ విజయంతో టోర్నమెంట్ను ముగించింది. విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీకి తోడు భువనేశ్వర్ బౌలింగ్లో మెరవడంతో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో కేఎల్ రాహుల్ జట్టును నడపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. ఇంటర్య్వూ సాఫీగా సాగుతున్న వేళ ఒక రిపోర్టర్ అడిన ప్రశ్న కేఎల్ రాహుల్కు చికాకు తెప్పించింది. దీంతో కాస్త కటువుగా రిపోర్టర్కు సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయానికి వస్తే.. రోహిత గైర్హాజరీలో మ్యాచ్లో కోహ్లి.. కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఓపెనర్గా అదరగొట్టిన కోహ్లి.. ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్ రాహుల్కు ఒక ప్రశ్న సంధించాడు.'' విరాట్ కోహ్లి ఓపెనర్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్లో ఓపెనర్గా వచ్చి ఐదు సెంచరీలు బాదాడు. తాజాగా ఆసియాకప్లో అఫ్గన్తో మ్యాచ్లో అంతర్జాతీయ టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఒక వైస్ కెప్టెన్గా కోహ్లిని ఓపెనర్గా ట్రై చేస్తే బాగుంటుందని మేనేజ్మెంట్కు సలహా ఇస్తారా.. టి20 ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరగనున్న టి20 సిరీస్లకు కోహ్లినే ఓపెనర్గా ఉంటాడా?'' అని అడిగాడు. రిపోర్టర్ ప్రశ్న విన్న కేఎల్ రాహుల్.. ''మీరు నన్ను డగౌట్లో కూర్చోమని పరోక్షంగా సలహా ఇస్తున్నారా.. అమేజింగ్'' అంటూ చురకలంటించాడు. ఆ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ''ఇక కోహ్లి సెంచరీ చేయడం మాకు బోనస్ లాంటిది. వరుసగా రెండు మ్యాచ్లు ఓటమి పాలైన తర్వాత జట్టు మీద ఒత్తిడి ఉండడం సహజం. పైగా మా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. దాంతో కెప్టెన్గా నాపై బాధ్యత పెరిగింది. మంచి స్కోరు చేయాలని భావించాను. అందుకు తగ్గట్లే కోహ్లితో సమన్వయం కుదిరింది. ఈరోజు మ్యాచ్ నిస్సందేహంగా కోహ్లిదే. కాగా ఈ విజయాన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నాం. రాబోయే టి20 ప్రపంచకప్కు ఈ విజయాలను కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నా'' అంటూ ముగించాడు. చదవండి: Kohli-KL Rahul: రోహిత్ లేకుంటే ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారా! Virat Kohli-Anushka Sharma: 'మై లవ్.. నేను ఎప్పటికి నీతోనే' -
రోహిత్ లేకుంటే ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారా!
1020 రోజులు... ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడేళ్లుగా ఎదురు చూసిన క్షణం... సింగిల్ తీసినంత సులువుగా సెంచరీలు సాధించిన కోహ్లి 70 నుంచి 71కి చేరేందుకు మైళ్ల కొద్దీ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న భావన... ఆటలో లోపం కనిపించలేదు, పరుగులు చేయడం లేదనే సమస్య రాలేదు... అయితే తన ఘనతలే తనకు శత్రువుగా మారినట్లుగా, తానే నిర్దేశించిన స్థాయిని అందుకోలేని ప్రతీ సారి అభిమానులకు అదో వైఫల్యంలాగే కనిపించింది. బయట నుంచి విమర్శలు, విశ్లేషణలు సరే సరి. రోజులు గడచిపోతున్నా... టెస్టులు, వన్డేలు ముగిసిపోతున్నా ఆ శతకం మాత్రం రాదే! ఇక ఎప్పుడో, అసలు చేస్తాడా లేదా అనుకుంటున్న దశలో కోహ్లి కొట్టి పడేశాడు. అనూహ్యంగా, గతంలో ఒక్క సెంచరీ లేని ఫార్మాట్లో మెరుపు శతకంతో చెలరేగాడు. వేయి రోజులకు పైగా సాగిన వేదనకు తెర దించుతూ తనకే సొంతమైన సొగసరి షాట్లతో సత్తా చాటాడు. చూడచక్కటి సిక్సర్తో ఆ ఘనతను అందుకొని చిరునవ్వులు చిందించాడు. ఫలితం పరంగా ప్రాధాన్యత లేని మ్యాచ్లోజట్టు ఆటకంటే ఒక అద్భుత వ్యక్తిగత ప్రదర్శనకు సలామ్ కొట్టి తీరాల్సిందే. ఇదంతా పక్కనబెడితే టీమిండియా అభిమానుల్లో ఒక సందేహం తలెత్తింది. గురువారం అఫ్గనిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్తో సూర్యకుమార్ ఓపెనింగ్ చేస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా విరాట్ కోహ్లి ఓపెనర్గా వచ్చాడు. ఇద్దరు కలిసి అఫ్గన్ బౌలింగ్ను ఒక ఆట ఆడుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రోహిత్ శర్మ లేకపోతే కోహ్లి, కేఎల్ రాహుల్ ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారా అంటూ అభిమానులు కామెంట్ చేశారు. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇస్తే కానీ సరిగ్గా ఆడడేమోనని పేర్కొన్నారు. నిన్నటి మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆటతీరు కూడా అలాగే ఉంది. 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగలు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లి కూడా రోహిత్ గైర్హాజరీలో బ్యాట్ను ఝులిపించడంతో ఈ అనుమానాలు ఎక్కువయ్యాయి. హిట్మ్యాన్తో కోహ్లి, రాహుల్కు బయటకు మంచి సంబంధాలే కనిపిస్తున్నప్పటికి.. లోలోపల మాత్రం రోహిత్తో ఈ ఇద్దరికి సరైన సమన్వయం లేదని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. మరొక విషయమేంటంటే.. కోహ్లి, రాహుల్కు మధ్య మంచి సన్నిహిత్యం ఉందని.. హిట్మ్యాచ్ లేకపోతే వీరిపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడుతుంటారని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. వాస్తవానికి రోహిత్తో కోహ్లి, రాహుల్కు ఎలాంటి సమస్య లేదనుకోవచ్చు. ఏది ఏమైనా ఆసియాకప్ నుంచి టీమిండియా నిష్ర్కమించినప్పటికి.. కోహ్లి సెంచరీతో కమ్బ్యాక్ ఇవ్వడం.. కేఎల్ రాహుల్ అర్థసెంచరీతో ఫామ్లోకి రావడం శుభసూచకం. ఒక రకంగా ఈ ఓటమి భారత్కు ఒక గుణపాఠం. రానున్న టి20 ప్రపంచకప్కు ముందు ఇలాంటి దెబ్బ పడితేనే టీమిండియా జాగ్రత్తగా ఉంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. టి20 ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరగనున్న టి20 సిరీస్లు భారత్కు మంచి ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. -సాక్షి, వెబ్డెస్క్ చదవండి: కోహ్లి కమాల్..అఫ్ఘాన్ పై భారత్ ఘన విజయం Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు -
అఫ్గానిస్తాన్ పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
'డియర్.. ఈ సెంచరీ నీకే అంకితం'
విరాట్ కోహ్లి.. టీమిండియా రన్మెషిన్గా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి.. నాలుగేళ్ల నుంచి మాత్రం సెంచరీ కోసం పరితపిస్తున్నాడు. మధ్యలో కరోనా వల్ల విరామం వచ్చినప్పటికి.. ఆ తర్వాత చాలా మ్యాచ్లు ఆడినప్పటికి హాఫ్ సెంచరీలు సాధించాడే కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. కోహ్లి సెంచరీ కోసం అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఇక కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీ రావడం కష్టమే అని హేటర్స్ ఫిక్స్ అయిన తరుణంలో 71వ సెంచరీని బాది తనపై వస్తున్న ట్రోలింగ్కు చెక్ పెట్టేశాడు. అంతేకాదు ఆసియా కప్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడని భావించిన అభిమానుల కలను కోహ్లి నెరవేర్చాడు. ఎందుకంటే ఆసియా కప్లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. తనకు అచ్చొచ్చిన టోర్నీలోనే కోహ్లి శతకం సాధించాడు. ఆసియాకప్లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి 53 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లికి టి20ల్లో ఇదే తొలి సెంచరీ. అలాగే టి20 కెరీర్లోనూ కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరును అందుకున్నాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 'టి20 ఫార్మాట్లో సెంచరీ చేస్తానని నేను పెద్దగా అనుకోలేదు. అందుకే 71వ సెంచరీ ఇలా చేయడం కాస్త షాకింగ్గా అనిపించింది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయా. త్వరలో 34 ఏళ్లు నిండబోతున్నాయి. చాలామంది నా ఫామ్ గురించి మాట్లాడారు. 71వ సెంచరీ రావడం లేదని అన్నారు. అయితే నేను మాత్రం ఇప్పటికే చేసిన 70 సెంచరీల గురించే ఆలోచించా. బయట చాలా జరుగుతాయి. అన్నివేళలా నాకు అండగా నిలబడిన వ్యక్తికి ఈ సెంచరీ అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా. డియర్ అనుష్క... ఇది నీకోసం. అలాగే వామిక కోసం కూడా. క్లిష్ట సమయాల్లో అనుష్క నాకు అండగా నిలబడింది. ఈ నాలుగు వారాల గ్యాప్ నాకెంతో ఉపయోగపడింది. బ్రేక్ తీసుకున్నాకే నేనెంత అలిసిపోయానో అర్థమైంది. అందుకే కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నెట్స్లో ఎక్కువ సమయం గడిపాను. మళ్లీ పూర్వ ఫామ్లోకి వస్తాననే భావన నాలోనే కలిగింది.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు -
కోహ్లి కమాల్..అఫ్ఘాన్ పై భారత్ ఘన విజయం
దుబాయ్: విరాట్ కోహ్లి (61 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అంతర్జాతీయ టి20 కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఆసియా కప్ను భారత్ విజయంతో ముగించింది. ‘సూపర్–4’లోని తమ ఆఖరి పోరులో భారత్ 101 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను చిత్తుగా ఓడించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. టోర్నీలో ఇదే అత్యధికస్కోరు. రాహుల్ (41 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. మరో వైపు మ్యాచ్లోనే కాదు... ఈ టోర్నీకే హైలైట్ ఇన్నింగ్స్ను కోహ్లి ఆవిష్కరించాడు. 11వ ఓవర్లో 32 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టిన కోహ్లి... మరో యాభై పరుగులకు 21 బంతులే సరిపోయాయి. 19వ ఓవర్ తొలి రెండు బంతుల్ని 4, 6గా బాదేసిన విరాట్ కేవలం 53 బంతుల్లో (11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాన్ని అందుకున్నాడు. 16 ఓవర్లు పూర్తయినప్పడు కూడా కోహ్లి స్కోరు 68 పరుగులే. శతకం చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఫరీద్ వేసిన 17వ ఓవర్లో 2 బౌండరీలు బాదిన విరాట్ తర్వాత ఫారుఖి బౌలింగ్లోను 2 ఫోర్లు కొట్టాడు. ఈ ధాటికి నైన్టీస్లోకి వచ్చిన కోహ్లి... ఫరీద్ 19వ ఓవర్ రెండు బంతులు వేయగానే సెంచరీ పూర్తయ్యింది. ఫారుఖి వేసిన ఆఖరి ఓవర్లో కోహ్లి 6, 6, 4 కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేసింది. భువనేశ్వర్ (4–1–4–5) పేస్కు 9 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్ జట్టులో ఇబ్రహీం (64 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే పోరాడాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) నజీబుల్లా (బి) ఫరీద్ 62; కోహ్లి నాటౌట్ 122; సూర్యకుమార్ (బి) ఫరీద్ 6; పంత్ నాటౌట్ 20; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–119, 2–125. బౌలింగ్: ఫారుఖి 4–0–51–0, ముజీబ్ 4–0–29–0, ఫరీద్ 4–0–57–2, రషీద్ 4–0–33–0, నబీ 3–0–34–0, అజ్మతుల్లా 1–0–8–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: హజ్రతుల్లా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రహ్మతుల్లా (బి) భువనేశ్వర్ 0; ఇబ్రహీమ్ నాటౌట్ 64; కరీమ్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 2; నజీబుల్లా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; నబి (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 7; అజ్మతుల్లా (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ 1; రషీద్ (సి) అక్షర్ (బి) హుడా 15, ముజీబ్ (బి) అశ్విన్ 18; ఫరీద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–9, 4–9, 5–20, 6–21, 7–54, 8–87. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–4–5, దీపక్ 4–0–28–0, అర్‡్షదీప్ 2–0–7–1, అక్షర్ 4–0–24–0, అశ్విన్ 4–0–27–1, హుడా 1–0–3–1, దీనేశ్ కార్తీక్ 1–0–18–0. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లికి ఇది తొలి సెంచరీ. గతంలో 94 నాటౌట్ (హైదరాబాద్లో, వెస్టిండీస్పై–2019 డిసెంబర్ 6) అతని అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్కు ముందు కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్ 23న కోల్కతాలో బంగ్లాదేశ్పై టెస్టులో సెంచరీ సాధించాడు. 122: టి20ల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. టీమిండియా ఆటగాళ్లు 10 సెంచరీలు నమోదు చేయగా కోహ్లికంటే ముందు రోహిత్ (4 సెంచరీలు), రాహుల్ (2), రైనా, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించారు. 71: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్ (71)తో కోహ్లి సమంగా నిలిచాడు. అతను టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. సచిన్ (100) అగ్రస్థానంలో ఉన్నాడు. సెంచరీల మధ్య ఇంత విరామం రావడటం నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను 60 పరుగులు చేసినా విఫలం అయ్యాడనడం కూడా ఆశ్చర్యపరిచేది. ఇంత కాలంగా కూడా చాలా బాగా ఆడుతున్నా సెంచరీకి అది సరిపోలేదేమో. గతంలోనూ నాకు దేవుడు ఎన్నో గొప్ప క్షణాలు అందించాడు. ఇదీ దైవనిర్ణయమే. కష్టపడటమే మన చేతుల్లో ఉంది. నేనూ ఈ రోజు చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశా. ఆసియా కప్కు ముందు చాలా మంది నాకు ఎన్నో సలహాలిచ్చారు. నేనూ బాగా ఆడిన పాత వీడియోలు మళ్లీ మళ్లీ చూసుకున్నాను. కానీ ఆట మాత్రం అదే. మానసికంగానే ఏదో సమస్య ఉందని అనిపించి కొంత విరామం తీసుకున్నా. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో వచ్చి బాగా ఆడా. నా కష్టకాలంలో అండగా నిలిచిన నా భార్య నేను జీవితాన్ని చూసే ధోరణితో మార్పు తెచ్చింది. ఆమెతో పాటు నా కూతురు వామికకు ఈ సెంచరీ అంకితం’ చదవండి: Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు -
'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు వెయ్యి రోజుల తర్వాత సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆసియా కప్లో గురువారం అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి తన టి20 కెరీర్లో తొలి సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి టీ20ల్లో వంద సిక్సర్ల మార్క్ను కూడా అందుకున్నాడు. ఇక టి20ల్లో 3500కు పైగా పరుగులను అందుకున్నాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ తర్వాత ఈ రెండు ఫీట్లు అందుకున్న రెండో భారత క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ఇక కోహ్లి కెరీర్లో ఇది 71వ సెంచరీ. 522 ఇన్నింగ్స్ల్లో కోహ్లి 71వ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్తో(71 సెంచరీలు, 668 ఇన్నింగ్స్లు) కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్( 782 ఇన్నింగ్స్ల్లో వంద సెంచరీలు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కుమార సంగక్కర(666 ఇన్నింగ్స్ల్లో 63 సెంచరీలు), జాక్వెస్ కలిస్(617 ఇన్నింగ్స్ల్లో 62 సెంచరీలు) నాలుగో స్థానంలో ఉన్నాడు. అఫ్గన్తో మ్యాచ్కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో కేఎల్ రాహుల్తో కలిసి కోహ్లి ఓపెనింగ్కు వచ్చాడు. తుఫాను వచ్చే ముందు ఎంత నిశబ్దంగా ఉంటుందో అలాగే మొదలైంది టీమిండియా ఇన్నింగ్స్. మొదటి మూడు ఓవర్లు కుదురుకోవడానికి టైం తీసుకున్న కోహ్లి ఆ తర్వాత తన బ్యాట్కు పనిచెప్పాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లి.. ఆ తర్వాత చేసిన 50 పరుగులకు మాత్రం కేవలం 17 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన కోహ్లి.. వింటేజ్ కోహ్లిని గుర్తుకుతెచ్చాడు. 💯🙌👌@imVkohli #AsiaCup2022 #INDvAFG pic.twitter.com/J8asz3zXpk — BCCI (@BCCI) September 8, 2022 -
ఆఫ్గన్తో మ్యాచ్.. రోహిత్కు రెస్ట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో ఇవాళ(గురువారం) భారత్, అఫ్గనిస్తాన్ల మధ్య నామమాత్రపు పోరు జరగనుంది. శ్రీటాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. ఇక టీమిండియా ఈ మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్, హార్దిక్ పాండ్యా, చహల్ స్థానాల్లో దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్లు తుది జట్టులోకి వచ్చారు. అఫ్గనిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. లంక, పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన టీమిండియా కనీసం అఫ్గన్తో మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అఫ్గనిస్తాన్ను తక్కువ అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే బుధవారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్ పోరాట పటిమ అందరిని ఆకట్టుకుంది. దాదాపు పాక్ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్.. ఆఖరి ఓవర్లో చేసిన తప్పిదంతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. భారత్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్ అఫ్గనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫరూఖీ -
పాకిస్తాన్ నటికి టీమిండియా మాజీ క్రికెటర్ దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK — Amit Mishra (@MishiAmit) September 7, 2022 No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij — Amit Mishra (@MishiAmit) September 8, 2022 చదవండి: Naseem Shah: మ్యాచ్ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్ను అప్పుగా.. ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
మ్యాచ్ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్ను అప్పుగా..
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరు జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు పాక్ బ్యాటర్లకు అఫ్గన్ బౌలర్లు చుక్కలు చూపించినప్పటికి.. ఆఖరి ఓవర్లో వచ్చిన పదో నెంబర్ ఆటగాడు నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టుకు ఒక వికెట్తో సంచలన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆసియా కప్ ఫైనల్కు చేరుకున్న పాకిస్తాన్.. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) తుదిపోరులో శ్రీలంకతో అమితుమీ తేల్చుకోనుంది. అయితే మ్యాచ్ను శాసించిన ఆ రెండు సిక్సర్ల కోసం నసీమ్ షా బ్యాట్ను అప్పుగా తెచ్చుకున్నాడు. అదేంటి నసీమ్ షాకు బ్యాట్ లేదా.. అనే డౌట్ రావొచ్చు. నసీమ్ షాకు బ్యాట్ ఉన్నప్పటికి అది బాగా లేకపోవడంతో తనతో పాటే క్రీజులో ఉన్న మహ్మద్హస్నైన్ను బ్యాట్ అడిగి తీసుకున్నాడు. హస్నైన్ బ్యాట్తోనే నసీమ్ షా ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. కాగా మ్యాచ్ అనంతరం నసీమ్ షా మాట్లాడుతూ.. ''నాకు తెలిసి ఈరోజు అందరూ నా బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటారు. అయితే మీకు తెలియని విషయమేంటంటే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు నెట్స్లో తీవ్ర బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా. అయితే నా బ్యాట్ సరిగా లేకపోవడంతో మహ్మద్ హస్నైన్ బ్యాట్ను తీసుకున్నా. ఆ బ్యాట్తోనే రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించా'' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మహ్మద్ హస్నైన్ కూడా స్పందింస్తూ.. ''ఓవర్ ప్రారంభానికి ముందు నసీమ్ నా దగ్గరకి వచ్చి బ్యాట్ అడిగాడు. సరే ఒకవేళ సింగిల్ తీస్తే బ్యాట్ను తిరిగి ఇవ్వు అని చెప్పా. కానీ నసీమ్ నాకు బ్యాట్ ఇచ్చే అవకాశం లేకుండానే తానే రెండు సిక్సర్లు బాది సంచలన విజయం అందించాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. The winning sixes from Naseem Shah🔥 Pakistan goes straight into the final 🇵🇰#STARZPLAY #AsiaCup #AsiaCup2022 #asiacup22 #Watchlive #cricketlive #cricketmatch #teampakistan #teamafghanistan #crickethighlights pic.twitter.com/aMupmwKKGA — Cricket on STARZPLAY (@starzplaymasala) September 7, 2022 చదవండి: పాకిస్తాన్ ఫైనల్కు.. టీమిండియా ఇంటికి -
ఆఫ్ఘన్ బౌలర్ను బ్యాట్తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. వైరల్ వీడియో
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో పాకిస్తాన్ వికెట్ తేడాతో గట్టెక్కింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా.. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్కు అపురూప విజయాన్ని అందించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. అయితే అంతకుముందు ఓవర్లో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర ఘటన క్రికెట్ ప్రేమికులను విస్మయాన్ని గురి చేసింది. 19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాది జోరుమీదున్న పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ను బ్యాట్తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్ తప్పు కూడా ఉంది. ఆసిఫ్ను ఔట్ చేశానన్న ఆనందంలో ఫరీద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో కోపం ఆపుకోలేక పోయిన ఆసిఫ్ అలీ.. ఫరీద్పై బ్యాట్తో దాడి చేయబోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూవెళ్తూ ఫరీద్కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరలైంది. క్రికెట్ అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పాక్ ఆటగాడి ఓవరాక్షన్పై మండిపడుతున్నారు. క్రికెట్లో వికెట్ తీశాక సంబురాలు చేసుకోవడం కామనేనని, దానికి ఆసిఫ్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని దండిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడటం అనేది జెంటిల్మెన్ గేమ్ సంస్కృతి కాదని హితవు పలుకుతున్నారు. మరికొందరైతే పాక్ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలిన ఐసీసీని కోరుతున్నారు. The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate #PAKvAFG pic.twitter.com/AQzxurWNB7 — Nadir Baloch (@BalochNadir5) September 7, 2022 కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. పాక్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్కు ఆఫ్గన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పొదుపుగా బౌలింగ్ చేయటంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి పాక్పై ఒత్తిడి పెంచారు. అయితే చివర్లో షాదాబ్ ఖాన్ (26 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (8 బంతుల్లో 16; 2 సిక్సర్లు), నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) భారీ సిక్సర్లు బాది ఆఫ్ఘన్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హక్ ఫారూఖీ (3/31), ఫరీద్ మాలిక్ (3/31), రషీద్ ఖాన్ (2/25) చెలరేగినప్పటికీ నసీమ్ షా వరుస సిక్సర్లతో పాక్ను గెలిపించాడు. ఈ దెబ్బతో ఆఫ్ఘన్ సహా భారత్ కూడా ఇంటిముఖం పట్టింది. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్లో పాక్-శ్రీలంక జట్లు తలపడతాయి. చదవండి: Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు -
Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు
ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా ఆఖరి ఓవర్లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్ను గెలిపించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్ చేసింది 129 పరుగులే అయినప్పటికీ.. పాక్కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడటంతో ఆఫ్ఘాన్ ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa — Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022 అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్ అభిమానులు మాత్రం ఓవరాక్షన్ చేశారు. మ్యాచ్ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. కుర్చీలు విరుగగొట్టి, పాక్ అభిమానులపై దాడులు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అప్పటివరకు పాక్ అభిమానులతో కలిసి మ్యాచ్ చూసిన ఆఫ్ఘన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా పేట్రేగిపోయి తాలిబన్లలా అమానవీయంగా వ్యవహరించారు. కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం సృష్టించారు. ఆఫ్ఘన్ ఫ్యాన్స్ దెబ్బకు పాక్ అభిమానులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియం నుంచి దౌడు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏ క్రీడలోనైనా గెలుపోటములు సహజమని, వాటిని క్రీడా స్పూర్తితో స్వీకరించాలే కానీ ఇలా దాడులకు దిగడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. జెంటిల్మెన్ గేమ్లో ఇలాంటి చర్యలను సహించకూడదని, ఆఫ్ఘన్ అభిమానులను స్టేడియాల్లోకి రానీయకుండా నిషేధించాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించడాన్ని మాత్రం భారత అభిమానులు తప్పుపడుతున్నారు. అక్తర్ ఆఫ్ఘన్ అభిమానుల దుశ్చర్యను ఖండిస్తూ, హిత బోధ చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అక్తర్ చిలకపలుకులు పలికింది చాలు.. ముందు మీ ఆటగాళ్లను ప్రవర్తన సరిచేసుకోమని చెప్పు అంటూ ఆసిఫ్ అలీ-ఆఫ్ఘన్ బౌలర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ను ఆసిఫ్ అలీ బ్యాట్తో కొట్టబోయాడు. చదవండి: మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్గా -
పసికూనలు చెలరేగుతున్న వేళ, టీమిండియాకు ఎందుకీ దుస్థితి..?
క్రికెట్ పసికూనలుగా పరిగణించబడే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా రాణిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న వేళ, టీమిండియా లాంటి ప్రపంచ స్థాయి జట్టు తమకంటే తక్కువ స్థాయి జట్ల చేతుల్లో ఓటమిపాలవుతూ అవమానాల పాలవుతుందన్నది కాదనలేని సత్యం. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో టీమిండియా సూపర్-4 దశలో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో భంగపడి టోర్నీ నుంచి నిష్క్రమించడమే ఇందుకు నిదర్శనం. ఈ టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు అద్భుత ప్రదర్శనలతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మన్ననలు అందుకుంటుంటే.. టీమిండియా మాత్రం ఇతర జట్ల జయాపజాయాలపై ఆధారపడి ఫైనల్ బెర్తు కోసం ఎదురుచూసింది. టీమిండియా పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది. అసలు టీమిండియాకు ఏమైంది..? కారణాలు విశ్లేషిస్తే.. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు, టీమిండియా ఈ దుస్థితికి కూడా ఇంచుమించు అన్నే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే.. మొదటిది బీసీసీఐ అతి జోక్యం. భారత క్రికెట్ బోర్డు ఇటీవలి కాలంలో జట్టు ఎంపిక, ఇతరత్రా వివాదాలు (కోహ్లి కెప్టెన్సీ), తుది జట్టు కూర్పు.. ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని పెత్తనం చలాయిస్తుంది. బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నికైన నాటి నుంచి భారత జట్టులో వీరి జోక్యం మరింత అతిగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ వీరిద్దరు కలగజేసుకోవడం, జట్టులో గ్రూపులు కట్టడం (రోహిత్, కోహ్లి), ఆటగాళ్లపై విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అప్లై చేయడం, కోచ్ను చెప్పుచేతల్లో పెట్టుకోవడం, తమ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్ కోసం జాతీయ జట్టు ప్రయోజనాలను దెబ్బకొట్టడం, ఆటగాళ్ల ఇష్టాఅయిష్టాలతో పని లేకుండా రెస్ట్ పేరుతో పక్కకు పెట్టడం, ఆటగాళ్లు రాణిస్తున్నా కారణం లేకుండా పక్కకు పెట్టడం, రిజర్వ్ బెంచ్ బలంగా ఉన్నా వారికి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం, సీనియర్లు పదే పదే విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం, తరుచూ కెప్టెన్లను, ఓపెనర్లను మార్చడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో బీసీసీఐ అనవసరంగా తలదూరుస్తూ జట్టు ఇలా తయారవ్వడానికి కారణమైంది. టీమిండియా ఇలా తయారవ్వడానికి బోర్డు అతి జోక్యమొక్కటే కారణం కాదు. కొందరు సీనియర్లు సైతం పెద్దల అండదండలతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ, జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేస్తుండటం కూడా మరో కారణమని చెప్పాలి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు ఏ సిరీస్ ఆడతారో, ఏ సిరీస్ నుంచి తప్పుకుంటారో ఎవరికీ అర్ధం కాని విషయం. వీరు ఏ వ్యక్తిగత కారణాల చేతనో తప్పుకున్న తర్వాత బోర్డు తాపీగా ఓ ప్రెస్ మీట్ పెట్టి గాయం లేదా రెస్ట్ అనే కుంటి సాకులు చూపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే ఈ సో కాల్డ్ సీనియర్లు ఐపీఎల్ సమయంలో ఇలా జట్టు నుంచి తప్పుకునే సాహసం చేయరు. ఎందుకంటే, ఈ పేద క్రికెటర్లకు అన్నం పెట్టే అక్ష్యయపాత్ర అదే కాబట్టి. ఐపీఎల్ కోసం ఇంతలా తాపత్రయపడే క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడాల్సి వచ్చేసరికి లేని పోని కారణాలు తెరపైకి తెచ్చి జారుకుంటారు. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోని సీనియర్లు.. జట్టులో స్థానం గల్లంతవుతుందని అనుకుంటే అప్పుడు కూడా వ్యక్తిగత ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప.. జట్టు గెలుపోటములతో మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తారు. ఎంతో నైపుణ్యం కలిగిన భారత క్రికెటర్లను ఇకనైనా దారికి తేవాలంటే, తొలుత ఐపీఎల్ను నియంత్రించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్లో లభించే నడిమంత్రపు సిరి కోసం, ఎండార్స్మెంట్ల రూపంలో వచ్చే ఈజీ మనీ కోసం భారత క్రికెటర్లు ఆశపడి దేశ ప్రయోజనాలను గాలికొదిలేస్తున్నారన్నది వీరి భావన. భారత జట్టు ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మరడానికి మరో కారణం కూడా ఉంది. జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఘెర వైఫల్యం. కోచ్గా ఎంపికైన మొదట్లో అందరికీ అవకాశాలు కల్పిస్తానని ప్రగల్భాలు పలికిన ఆయన.. బోర్డు అపరిమిత జోక్యం కారణంగా ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకోలేకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో తుది జట్టు ఎంపికలో నెలకొన్న గందరగోళమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ద్రవిడ్ ఒకరిన ఆడించాలని భావిస్తే.. బోర్డు మరోకరిని రెకమెండ్ చేస్తుంది. సూపర్-4 దశలో వికెట్కీపర్ స్థానం విషయంలో, గాయపడ్డ జడేజా స్థానం విషయంలో ద్రవిడ్ చాలా మదనపడినట్లు సమాచారం. కెప్టెన్ ఓవరాక్షన్.. రోహిత్ ఫుల్టైమ్ కెప్టెన్గా మారాక టీమిండియాను వరుస విజయాల (చిన్న జట్లపై) బాట పట్టిస్తున్నప్పటికీ.. ప్రవర్తన విషయంలో మాత్రం హిట్మ్యాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బోర్డు సపోర్ట్ భారీగా ఉండటంతో అతను పట్టపగ్గాలు లేకుండా సహచరులతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ విమర్శలపాలవుతున్నాడు. ఒకప్పుడు కోహ్లిదే ఓవరాక్షన్ అనుకున్న అభిమానులు, సహచర ఆటగాళ్లు.. ప్రస్తుతం రోహిత్ ప్రవర్తన చూసి నివ్వెరపోతున్నారు. కోహ్లితో పోలిస్తే రోహిత్ ఓవరాక్షన్ రెట్టింపైందని గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల పంత్, హార్ధిక్, అర్షదీప్లతో అతను వ్యవహరించిన తీరు బాధాకరమని వాపోతున్నారు. ఇలా టీమిండియా దుస్థితికి కారణాలు విశ్లేషిస్తూ పోతే అంతమే ఉండదు. భారత క్రికెట్ బోర్డు ఇకనైనా మేల్కొని పై లోపాలనైనా సరిదిద్దుకుంటే మున్ముందు టీమిండియా పూర్వవైభవం సాధించే అవకాశం ఉంది. ఓ పక్క శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు రకరకాల సంక్షోభాల్లో కొట్టిమిట్టాడుతూనే అంతర్జాతీయ వేదికలపై రాణిస్తుంటే.. టీమిండియా మాత్రం అన్ని ఉండి ఐదో తనం తక్కువైందన్న రీతిలో వ్యవహరిస్తుంది. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్లోనైనా టీమిండియా తలరాత మారాలని ఆశిద్దాం. చదవండి: 'టి20 ప్రపంచకప్కు 95శాతం జట్టు రెడీ'.. రోహిత్పై విమర్శలు -
నామమాత్రపు పోరులో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనున్న భారత్.. ఈ మ్యాచైనా గెలుస్తుందా..?
Asia Cup 2022 IND VS AFG: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్ ఆఖరి పోరుకు ముందే నిష్క్రమణకు సిద్ధమైంది. సూపర్–4లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య నేడు నామమాత్రమైన మ్యాచ్ జరుగుతుంది. రెండేసి విజయాలతో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరడంతో గురువారం జరిగే మ్యాచ్ ఆడి రావడం తప్ప టీమిండియా, అఫ్గానిస్తాన్లకు యూఏఈలో ఇక ఏం మిగల్లేదు. ఒత్తిడిలో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగి ఫైనల్కు వెళ్లలేని స్థితిలో ఉన్న భారత్ ఒత్తిడిలో కూరుకుపోయింది. గ్రూప్ దశలో బాగున్న పరిస్థితి ‘సూపర్–4’కు వచ్చేసరికి మారిపోయింది. ఓపెనింగ్లో రాహుల్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ల ప్రదర్శన భారత మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్లపై టి20 ప్రపంచకప్ ఆడాల్సిన జట్టు ఇది కాదేమోనన్న సందేహాన్ని రేకెత్తిస్తోంది. హిట్టర్లుగా ముద్రపడిన రాహుల్, పాండ్యా, పంత్లు పాక్, శ్రీలంకలతో జరిగిన పోటీల్లో ఆడినట్లుగా లేదు. అదేదో సిరీస్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లా తేలిగ్గా తీసుకున్నారు. ఇక బౌలింగ్ విభాగం కూడా తీసికట్టుగానే ఉంది. అనుభవజ్ఞుడైన సీమర్ భువనేశ్వర్, స్పిన్నర్లు చహల్, అశ్విన్ ఇలా ఎవరూ మ్యాచ్ను మలుపుతిప్పే వికెట్లే తీయలేదు. ఇది హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు కూర్పుపై చేస్తున్న కసరత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. -
పాకిస్తాన్ ఫైనల్కు.. టీమిండియా ఇంటికి
షార్జా: భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గానిస్తాన్పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ ఆసియా కప్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ‘సూపర్–4’లో బుధవారం అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాదాబ్ (26 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్లు), ఇఫ్తికార్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) రాణించారు. జట్టు స్కోరు 97 పరుగుల స్కోరు వద్ద షాదాబ్ అవుట్ కాగా... స్వల్పవ్యవధిలో పాక్ 6 వికెట్లు కోల్పోయి పరాజయానికి దగ్గరైంది. పాక్ నెగ్గేందుకు ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా... ఫారూఖి వేసిన తొలి రెండు బంతులపై సిక్సర్లు కొట్టిన నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్స్లు) పాక్ జట్టును గెలిపించడంతోపాటు ఫైనల్కు చేర్చాడు. అంతకుముందు అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జద్రాన్ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ హజ్రతుల్లా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు), ఆఖర్లో రషీద్ ఖాన్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పాక్ బౌలర్లు రవూఫ్ 2, నసీమ్ షా, హస్నైన్, నవాజ్, షాదాబ్ తలా ఒక వికెట్ తీశారు. -
పాక్ టార్గెట్ 130.. ఇక బౌలర్లపైనే భారం
ఆసియాకప్ టోర్నీలో సూపర్-4 లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్గన్ బ్యాటర్లు పరుగులు తీయడంలో ఇబ్బంది పడ్డారు. అఫ్గనిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీ జర్దన్ 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హజరతుల్లా జజేయ్ 21, రహమనుల్లా గుర్బాజ్ 17 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 2, నసీమ్ షా, మహ్మద్ హుస్నైన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.కాగా ఈ మ్యాచ్లో అఫ్గనిస్తాన్ గెలుపుపైనే భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఆఫ్గన్ నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ఇక బౌలర్లపైనే బారం పడనుంది. చదవండి: Asia Cup 2022: మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్గా -
మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్గా
సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్ అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీకి వందో మ్యాచ్. సాధారణంగా ఒక క్రికెటర్కు వందో మ్యాచ్ అంటే చాలా ప్రతిష్టాత్మకం. ఎలాగైనా ఆ మ్యాచ్ను మధురానుభూతిగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి నబీ ప్రతిష్టాత్మక వందో మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. తద్వారా నబీ టి20 క్రికెట్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. టి20ల్లో వందో మ్యాచ్లో గోల్డెన్ డక్ అయిన తొలి ఆటగాడిగా మహ్మద్ నబీ నిలిచాడు. ఇక నబీ వరుసగా ఎనిమిదో మ్యాచ్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో నబీ స్కోర్లు 5, 9, 6, 5, 0, 8, 1, 0 ఉన్నాయి. ఇందులో రెండు గోల్డెన్ డక్లు ఉండడం గమనార్హం. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ గెలుస్తూనే టీమిండియాకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. -
'టి20 ప్రపంచకప్కు 95శాతం జట్టు రెడీ'.. రోహిత్పై విమర్శలు
టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా చేజేతులా ఓటములను కొనితెచ్చుకొని సూపర్-4 దశలోనే ఇంటిబాట పట్టాల్సి వస్తోంది. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్ల్లో కేవలం బౌలింగ్ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిందంటే అతిశయోక్తి కాదు. ఆసియాకప్లో టీమిండియా పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడినప్పుడు భువనేశ్వర్ కుమార్ మంచి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. అయితే ఆ తర్వాత లయను కోల్పోయిన భువీ.. కీలకదశలో పరుగులిచ్చి టీమిండియా ఓటమికి ప్రధాన బాధ్యత వహించాల్చి వచ్చింది. భువనేశ్వర్తో పాటు మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదనే చెప్పాలి. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించగా.. గాయంతో జడేజా టోర్నీకి దూరమవ్వడం మరో ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఆసియాకప్ను టి20 ప్రపంచకప్కు సన్నాహకంగా భావిస్తున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బల్లగుద్ది చెప్పాడు. టి20 ప్రపంచకప్కు టీమిండియా ఆడబోయే ది బెస్ట్ టీమ్ ఇక్కడే దొరుకుతుందని చెప్పాడు. కానీ తీరా చూస్తే బెస్ట్ టీమ్ కాదు కదా... అసలు జట్టులో చాలా మార్పుల అవసరం కనిపిచింది. ఆసియాకప్లో ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడితే.. నాలుగుసార్లు తుది జట్టులో మార్పులు జరిగాయి. దీంతో కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్లపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ ముగిశాక నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ లో తుది జట్టు ఎంపికపై తాము కసరత్తులు చేస్తున్నామని.. ఆమేరకు 95 శాతం జట్టు సిద్ధమైందని పేర్కొన్నాడు. అయితే రోహిత్ శర్మ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఘాటుగా స్పందించారు. రోహిత్ మాట్లాడుతూ.. ''టి20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే 90-95 శాతం జట్టు రెడీ అయింది. కొన్ని మార్పులు చేర్పులున్నాయి. వాటిని కూడా తొందర్లోనే పూరిస్తాం. అయితే కొన్ని విషయాల్లో క్లారిటీ రాలేకపోతున్నాం. అందుకే ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా ఫలితమేంటో తెలిసేది. అందుకే ఆసియా కప్లో కొన్ని ప్రయోగాలు చేశాం. ఆసియా కప్కు ముందు మేం నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం. రెండో స్పిన్నర్.. ఆల్రౌండర్ అయ్యేలా చూసుకున్నాం. నేను ఏ విషయంలో అయినా ముందు ప్రయత్నం చేసి తద్వారా ఫలితాలను బట్టి ఒక అంచనాకు వస్తాను. అదే ఆసియా కప్ లోనూ చేశాను. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక మీడయం పేసర్ తో ఆడితే ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను. మాకు టీ20 ప్రపంచకప్ కు ఇంకా సమయముంది.. ఆలోపు మాకు మరో రెండు సిరీస్ లు ఉన్నాయి.. అక్కడా మాకు ప్రయోగాలు చేయడానికి ఆస్కారముంది’ అని అన్నాడు. దీపక్ హుడాకు బౌలింగ్ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది. ఐదుగురు బౌలర్లతో ఆడితే ఏమవుతుందనే కోణంలో ప్రయత్నించాం. లంకతో మ్యాచ్ లో అప్పటికే ఇద్దరు ఓపెనర్లు కుదురుకున్నారు. ఆ సమయంలో అటాకింగ్ స్పిన్ వేసే చహల్, అశ్విన్ కు బంతినిస్తే బెటరని అనిపించింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ గా నా మనసులో హుడా కూడా ఉన్నాడు. మేం త్వరగా వికెట్లు తీసుంటే హుడాతో బౌలింగ్ చేయిద్దామనుకున్నా. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్లో ఆడేటప్పుడు ఇది గుణపాఠంగా పనికొస్తుంది. ఇక కార్తిక్ ఆడించకపోవడంపై ఒక కారణం ఉంది. మిడిలార్డర్ లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకున్నాం. అందుకే పంత్ను ఆడించాం. అంతేగానీ కార్తీక్ ఫామ్ గురించో.. మరొకటో కాదు.. అయితే ఆ వ్యూహం బెడిసికొట్టింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Indian 🇮🇳 skipper @ImRo45 talks about Dilshan's performance, respecting every opponent, and seeing the confidence in Arshdeep Singh 💪🏼#SLvIND #ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/oJPiXWFP7h — AsianCricketCouncil (@ACCMedia1) September 6, 2022 -
పాక్తో మ్యాచ్.. ఆఫ్గన్ గెలిస్తేనే టీమిండియాకు అవకాశం
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో బుధవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మద్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక అఫ్గానిస్తాన్ గెలుపుపైనే టీమిండియాకు ఆసియా కప్లో అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఆఫ్గన్ ఓడిందో ఇక టీమిండియా ఇంటిబాట పట్టాల్సిందే. శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఓడిన అఫ్గానిస్తాన్కు పాక్తో మ్యాచ్ కీలకమని చెప్పొచ్చు. బ్యాటింగ్లో నజీబుల్లా జర్దన్, రహమతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్, హజరతుల్లా జజాయ్లు, కెప్టెన్ మహ్మద్ నబీ పెద్ద బలం కాగా.. వీరు విఫలమైతే మాత్రం అఫ్గన్లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు. ఇక బౌలింగ్లో రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్లు సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఇక టీమిండియాపై విజయంతో జోష్లో ఉన్న పాకిస్తాన్.. ఆఫ్గన్తో మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరాలని ఉవ్విళ్లూరుతుంది. కెప్టెన్ బాబర్ ఆజం విఫలమైనప్పటికి.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సహా ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, కుష్దిల్ షా, ఇఫ్తికర్ అహ్మద్లు బ్యాటింగ్లో రాణిస్తుండడం సానుకూలాంశం. ఇక బౌలింగ్లో నసీమ్ షా, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అంచనాలకు మంచి రాణిస్తున్నారు. ఇక రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు టి20ల్లో రెండుసార్లు తపలడగా.. రెండుసార్లు పాక్నే విజయం వరించింది. 2013లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత గతేడాది టి20 ప్రపంచకప్లో మరోసారి తలపడగా పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఇక వన్డేల్లో నాలుగుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ పాకిస్తాన్నే విజయం వరించింది. -
ఇప్పటికే మునిగారు.. ఇకనైనా జాగ్రత్త పడండి
ఆసియా కప్ 2022లో టీమిండియా సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా ఓడింది అంటే బౌలర్ల వైఫల్యం, ఫేలవ ఫీల్డింగ్ వల్లే అని చెప్పొచ్చు. అంతేకాదు ఆల్రౌండర్ జడేజా లేని లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పుజారా మాట్లాడాడు. ''ఆసియాకప్ టోర్నమెంట్లో టీమిండియాకు ప్రస్తుత కాంబినేషన్ సరిగ్గా పని చేయడం లేదు. జట్టుకు మరో బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకుంటునే మంచిది. లెగ్ స్పిన్తో పాటు బ్యాటింగ్లోనూ పరుగులు చేయగల సమర్థుడు.ఇప్పటికే మునిగాం.. ఇకనైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కనీసం అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో గెలిస్తే విజయంతో టోర్నీని ముగించినట్లు అవుతుంది. ఇక రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తిక్కు అవకాశం ఇవ్వాల్సిందే. బహుశా టి20 ప్రపంచకప్ తర్వాత దినేశ్ కార్తిక్ క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి జట్టులో ఉన్నప్పుడే అతనికి అవకాశాలు ఇవ్వడం సమజసం. హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. పేస్ ఆల్ రౌండర్ను పూర్తి కోటా బౌలింగ్ వేసేలా అన్ని టైంలలో ప్రయోగించలేము. ఇక 6 నుంచి 15 ఓవర్ల మధ్య సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోతుంది. ఇక స్లాగ్ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్ల వరకు సరైన బ్యాటర్లు లేరు. కాబట్టి దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: పాక్ కెప్టెన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో చాహర్ ఎంట్రీ..! -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో దీపక్ చాహర్ ఎంట్రీ..!
Deepak Chahar Replaces Avesh Khan: ఆసియా కప్ 2022లో టీమిండియా పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేక సూపర్-4 దశలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న టీమిండియా.. అన్ని అయిపోయాక దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతతో జట్టుకు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ స్థానంలో తదుపరి ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోయే మ్యాచ్లో బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్కు అవకాశం కల్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే పని సూపర్-4 దశలో పాక్తో జరిగిన మ్యాచ్కు ముందే చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లంక చేతిలో ఓటమితో టీమిండియా ఫైనల్కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన దశలో ఈ మార్పు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. జట్టు ఎంపికలో మున్ముందైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత సెలెక్టర్లను హెచ్చరిస్తున్నారు. జట్టులో కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడు బ్యాటర్లు, బౌలర్లను కాకుండా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా సాన పట్టేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్కప్కు కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా గత ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్.. ఇటీవలే జింబాబ్వే సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లతో రాణించాడు. చాహర్ జింబాబ్వే సిరీస్లో పర్వాలేదనిపించినా ఆసియా కప్కు ఎంపిక చేయకపోవడంతో టీమిండియా తగిన మూల్యమే చెల్లించుకుంది. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు చాహర్ను జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుంది. కాగా, ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్లు స్టాండ్ బై ప్లేయర్లు ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్కాట్ చేస్తేనే..! -
పాక్ కెప్టెన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్మురేపాడు. ఆసియాకప్లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రిజ్వాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్లో మూడు మ్యాచ్లాడిన రిజ్వాన్ ఒక అర్థసెంచరీ సాయంతో 197 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్లో రిజ్వాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 815 పాయింట్లతో తొలి స్థానంలో రిజ్వాన్ ఉండగా.. నిన్నటివరకు టాప్ ప్లేస్లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 794 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా స్టార్ మార్క్రమ్ 792 పాయింట్లతో మూడు.. టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. ఇక ఆసియాకప్లో భాగంగా సూపర్-4లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 612 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక ఒక స్థానం ఎగబాకి 675 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా తరపున ఆసియాకప్లో టాప్ స్కోరర్గా ఉన్న కోహ్లి మాత్రం రెండు స్థానాలు దిగజారి 29వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్వుడ్ 792 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తబ్రెయిజ్ షంసీ రెండు, ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 248 పాయింట్లతో షకీబ్ అల్ హసన్ రెండు.. 221 పాయింట్లతో మొయిన్ అలీ మూడో స్థానంలో ఉన్నాడు. On 🔝 of the @MRFWorldwide ICC Men’s T20I Batting Rankings 👑 Congratulations, @iMRizwanPak 👏 👉 https://t.co/mvY3tc8Zdi — ICC (@ICC) September 7, 2022 చదవండి: ఆసియా కప్లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై! -
దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్కాట్ చేస్తేనే..!
ఆసియా కప్ 2022లో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానులు సోషల్మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్-4 దశలో తొలుత పాక్ చేతిలో, తాజాగా శ్రీలంక చేతిలో ఎదురైన ఘోర పరాభవాలను జీర్ణించుకోలేని అభిమానులు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం ఐపీఎలేనని విరుచుకుపడుతున్నారు. దేశం కోసం మ్యాచ్లు గెలవాలన్న కసి టీమిండియాలో కొరడిందని, జాతికి ప్రాతినిధ్యం వహించేప్పుడు భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలాగేనా ఆడేదని ఏకి పారేస్తున్నారు. #boycottipl This is what happens when u have too many expectations on nations match just play ipl and generate money pic.twitter.com/83Ti8JYrmo — NihaL Vaishya 🇮🇳 (@VaishyaNihal) September 6, 2022 వెళ్లి ఐపీఎల్ ఆడి డబ్బు కూడబెట్టుకోండి.. భారత్ గెలిచినా, ఓడినా మీకు పట్టదు అంటూ ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి టీమిండియా ఓటముల్లో కీలక పాత్రధారిగా మారిన రిషబ్ పంత్ను ఎగాదిగా వాయించేస్తున్నారు. పంత్కు సీరియస్నెస్ అనేదే లేదని, దేశం కోసం ఆడుతున్నాడన్న ధ్యాసే లేదని, ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ క్రికెట్పై లేదని మండిపడుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లు ఇలా తయారవ్వడానికి ఐపీఎలే కారణమని, బీసీసీఐ ఇకనైనా మేల్కొని ఐపీఎల్కు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటమే మానేస్తారని హెచ్చరిస్తున్నారు. #boycottipl the Indian team has lost the will to win matches for the country. Lousy body language. pic.twitter.com/qvpm25592a — स्वतंत्र मैं 🇮🇳 (@anshukumarmish4) September 6, 2022 ఏడాదికి ఓసారి ఐపీఎల్ నిర్వహిస్తుంటేనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేప్పుడు భారత ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఏడాదికి రెండు ఐపీఎల్లు నిర్వహిస్తే అంతే సంగతులని కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఐపీఎల్ చూడటం మానేసినప్పుడే.. భారత ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేసి, క్యాష్ రిచ్ లీగ్ మాయలో కెరీర్లు నాశనం చేసుకుంటారని బల్ల గుద్ది చెబుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్లోనూ భారత ఆటగాళ్ల తీరు మారకుంటే జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసి, ఐపీఎల్ ఆడని ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. The day from which Indian Public Stop watching IPL the day from. That this Useless team start playing for the country & pride not running for the money Same happens in the T20 WC #boycottipl pic.twitter.com/oOIGpX6XsN — 💫 ͡K͎ ͜ᴀ ʀ ͡ ͜ᴛ ʜ 𝚒 ͡💫🇮🇳 (@its_karthikoff) September 7, 2022 చదవండి: అర్షదీప్పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్ -
అర్షదీప్పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్
ఆసియా కప్ సూపర్-4 దశలో పాక్తో జరిగిన మ్యాచ్లో కీలక సమయంలో క్యాచ్ జారవిడిచిన టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్పై కొందరు దురభిమానులు ముప్పేట దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అల్లరి మూకలు.. అర్షదీప్ తల్లిదండ్రులను బెదిరించడం, అతన్ని అంతమొందిస్తామని సోషల్మీడియాలో కామెంట్లు పెట్టడం, అర్షదీప్ వికీపీడియాలో భారత్ బదులు ఖలిస్తాన్ అని మార్పులు చేయడం వంటి దుశ్చర్యలకు తెగబడ్డారు. తాజాగా భారతీయుడిగా చెప్పుకున్న ఓ అగంతకుడు ఓ అడుగు ముందుకేసి అర్షదీప్పై నేరుగా దూషణకు దిగాడు. శ్రీలంకతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు హోటల్కు బయల్దేరే క్రమంలో (టీమ్ బస్ ఎక్కుతుండగా) అక్కడే ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్న ఓ వ్యక్తి.. అర్షదీప్ డ్రాప్ క్యాచ్ను ఉద్దేశిస్తూ పంజాబీలో అసభ్యపదజాలం వాడి దూషించాడు. ఇది గమనించిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్.. సదరు వ్యక్తిని అడ్డుకున్నాడు. అర్షదీప్ను ఎందుకు దూషిస్తున్నావని నిలదీశాడు. అర్షదీప్ భారత ఆటగాడని, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేదని ఎడాపెడా వాయించాడు. ఈ విషయాన్ని అక్కడే సెక్యూరిటీ సిబ్బందికి వివరిస్తుండగా ఆ అగంతకుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అగంతకుడు దూషిస్తుండగా.. అర్షదీప్ సైతం కాసేపు ఆగి, కౌంటరిద్దామని అనుకున్నట్లున్నాడు. ఎందుకులే లేనిపోని గొడవ అనుకున్నాడో ఏమో.. మారు మాట్లాడకుండా బస్ ఎక్కేశాడు. ఈ తతంగం మొత్తానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. అర్షదీప్కు అండగా నిలిచిన విమల్ కుమార్ అనే జర్నలిస్ట్ను భారత అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇది కదరా దేశ భక్తి, దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల పట్ల గౌరవమంటే అంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై! -
అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై!
ఆసియాకప్-2022లో భారత్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన డూ ఆర్డై మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా ఈ మ్యాచ్ భారత బ్యాటర్లు పర్వాలేదనిపించనప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) అర్ధసెంచరీతో చేలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఫైనల్ బెర్త్ను శ్రీలంక దాదాపు ఖారారు చేసుకుంది. అయితే లీగ్ మ్యాచ్ల్లో దుమ్ము రేపిన భారత్.. కీలకమైన సూపర్-4 దశలో వరుసుగా ఓటముల చవి చూడటం పట్ల అభిమానలు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. #AsiaCupT20 to #india, khatam tata byebye goodbye gyaa #INDvsSL — Abdullah zaka (@Abdullahzaka10) September 6, 2022 సోషల్ మీడియా వేదికగా భారత జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి' అంటూ ఓ ట్విటర్ యూజర్ పోస్టు చేశాడు. కాగా భారత్ ఫైనల్ చేరాలంటే కొన్ని అద్భుతాలు జరిగాలి. సూపర్-4లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్గానిస్తాన్తో జరగనున్న సూపర్-4 మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించాలి. Indian fans waiting for indian team at Mumbai airport:#INDvsSL #AsiaCupT20 #AsiaCup2022#Goodbye pic.twitter.com/ojuEJ1OyRp — Ahtasham Riaz (@AhtashamRiaz22) September 6, 2022 అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత్, పాక్, ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. Bhuvi: Yesterday he gave away 19 run in the 19th over and today 14 ..#INDvSL pic.twitter.com/YQYNo6j0zh — Hiesnberg (@MALAYMU96793905) September 6, 2022 చదవండి: పాక్ పేసర్ నసీమ్ షాతో ఉన్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా -
Urvashi Rautela: పంత్తో చెడింది.. పాక్ యువ పేసర్పై మనసు పారేసుకుంది..!
Pant-Urvashi Rautela-Naseem Shah: బాలీవుడ్ అప్ కమింగ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవలి కాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్తో కొద్ది రోజుల పాటు ప్రేమాయణం నడిపిన రౌతేలా.. తాజాగా అతనికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆసియా కప్కు ముందు పంత్-రౌతేలా సోషల్మీడియా వేదికగా మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని తొలుత రౌతేలానే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022 ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రౌతేలా మాట్లాడుతూ.. ఆర్పీ (పంత్ను ఉద్దేశిస్తూ) అనే ఓ సెలబ్రిటి తన కోసం 16 గంటల పాటు పడిగాపులు కాశాడని వివాదానికి తెరలేపింది. దీనికి ప్రతిగా పంత్ సైతం తనదైన స్టయిల్లో స్పందించాడు. కొంతమంది పేరు, ప్రఖ్యాతల కోసం ఎంతకైనా దిగజారుతారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తారని, ఫైనల్గా.. ప్లీజ్ అక్క, నన్ను వదిలేయ్ అంటూ రౌతేలాకు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చాడు. పంత్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న రౌతేలా.. పంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పంత్ ఓ కౌగర్ హంటర్ (తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో లైంగిక సంబంధం కోరుకునే వ్యక్తి) అని.. చోటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ప్రతిగా పంత్ మరో కౌంటరిచ్చాడు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు అక్కా అంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఈ మాటల యుద్ధానికి పుల్స్టాప్ పడింది. అయితే రౌతేలా ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది. అసలు క్రికెట్ అంటేనే నచ్చదు అన్న ఆమె.. ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలామంది పంత్పై ప్రేమను చంపుకోలేక రౌతేలా మ్యాచ్ చూసేందుకు వచ్చిందని కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ విషయం వేరున్నట్లు ఆలస్యంగా తెలిసింది. రౌతేలా మ్యాచ్కు వచ్చింది పంత్ను చూసేందుకు కాదని, పంత్తో చెడటంతో ఆమె పాక్ యువ బౌలర్ నసీమ్ షాతో ప్రేమలో పడిందని, అతన్ని ఎంకరేజ్ చేసేందుకే మ్యాచ్కు వచ్చిందని పలు కథనాల ద్వారా తెలిసింది. Aj pata Chala hamare NASEEM ko kiski Nazar lagi hai#UrvashiRautela pic.twitter.com/kllpMbbN6E — Muhammad Ibrahim (@Muhmmd_here) September 6, 2022 ఈ విషయాన్ని రౌతేలా కూడా పరోక్షంగా అంగీకరించిందని సమాచారం. నషీమ్ షా, తన ఫోటోలను కలిపి ఓ అభిమాని ఎడిట్ చేసిన వీడియో రీల్ను రౌతేలా తన ఇన్ట్స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో సదరు కథనాల్లో నిజం లేకపోలేదని క్రికెట్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన రీల్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. అటు భారత అభిమానులే కాకుండా పాక్ ఫ్యాన్స్ సైతం రౌతేలాను ఆటాడుకుంటున్నారు. పంత్ను భ్రష్ఠు పట్టించావు.. ఇప్పుడు మా వాడిని సంక నాకిద్దామని వచ్చావా అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. Hath jorr k kehta hai dor rahy hmary larky se phly hi usky jawani may cramps parte hein..#NaseemShah #UrvashiRautela pic.twitter.com/31WhuEf6t8 — RoMeoo (@RomanRaza4) September 6, 2022 చదవండి: క్రికెట్ నచ్చదంటూనే స్టేడియంలో ప్రత్యక్షమైన బాలీవుడ్ బ్యూటీ! -
ఏం చేస్తున్నావు రోహిత్.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు!
ఆసియాకప్-2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డ్లో తన ప్రశాంతతను కోల్పోయాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో క్యాచ్ జారవిడిచిన అర్ష్దీప్ సింగ్పై గట్టిగా అరవడం.. అదే విధంగా పంత్ ఔటయ్యాక క్లాస్ పీకడం వంటి సంఘటలను చూశాం. అయితే మరో సారి రోహిత్ సహానాన్ని కోల్పోయాడు. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా కీలక మ్యాచ్లో శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే శ్రీలంక విజయానికి అఖరి ఓవర్లో 7 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ బంతిని అర్ష్దీప్ సింగ్ చేతికి ఇచ్చాడు. అయితే అఖరి ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్దీప్.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ రోహిత్ మాత్రం అర్ష్దీప్ మాటలను పట్టించుకోకుండా ముఖం తిప్పి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో రోహిత్ ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, నిజంగా సిగ్గు చేటు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అఖరి ఓవర్లో అర్ష్దీప్ అద్భుతమైన యార్కర్లను వేశాడు. అయితే రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా.. ఐదో బంతికి బైస్ రూపంలో శ్రీలంకకు విన్నింగ్ రన్స్ వచ్చాయి. Jokes apart but this is how you treat youngsters? Imagine being a captain and insulting your bowler like this during a live and crucial match. Shame on rohit sharma.pic.twitter.com/yoaAR1XWES — Saith Abdullah (@SaithAbdullah99) September 6, 2022 చదవండి: Ravindra Jadeja: జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్ -
జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఆసియా కప్లో హాంగ్కాంగ్తో మ్యాచ్ సందర్భంగా జడ్డూ కుడి మోకాలి గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జడేజా గాయాన్ని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స అనివార్యమని సూచించారు. ఈ నేపథ్యంలో జడ్డూకు నిన్న సర్జజీ జరిగింది. శస్త్ర చికిత్స సక్సెస్ అయినట్లు జడేజానే స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సర్జరీ చేయించుకునే క్రమంలో తనకు చాలామంది మద్దతుగా నిలిచారని.. బీసీసీఐ, సహచరులు, సపోర్ట్ స్టాఫ్, ఫిజయోలు, డాక్టర్లు మరి ముఖ్యంగా అభిమానులు నా వెన్నంటే నిలిచారని జడ్డూ తెలిపాడు. త్వరలోనే కోలుకునే ప్రక్రియ మొదలుపెడతానని, సాధ్యమైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అంటూ సర్జరీ తర్వాతి ఫోటోను షేర్ చేస్తూ కామెంట్స్ జోడించాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) కాగా, గత కొంతకాలంగా జడేజా గాయాలతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాతి నుంచి జడ్డూ ఆడిన ప్రతి సిరీస్లోనూ ఏదో ఒక గాయం బారిన పడుతూ వస్తున్నాడు. గాయం కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా అర్ధంతరంగా వైదొలిగాడు. తాజాగా ఆసియా కప్లో కీలక దశ మ్యాచ్లకు ముందు గాయం తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం టీమిండియాపై భారీగా చూపింది. సరైన బౌలింగ్ ఆల్రౌండర్ లేక టీమిండియా ఆసియా కప్ బరిలో నుంచి దాదాపుగా వైదొలిగింది. పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో కాని, తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కాని జడేజా ఉండి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని భారత అభిమానులు భావిస్తున్నారు. అంతకుముందు గ్రూప్ దశలో పాక్తో జరిగిన మ్యాచ్లో ఆతర్వాత హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో జడ్డూ అన్ని విభాగాల్లో పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. గాయంతో జడేజా జట్టు నుంచి వైదొలగడంతో సూపర్-4 దశలో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో జడ్డూ టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికైనా కోలుకుని జట్టులో చేరాలని టీమిండియా అభిమానాలు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ఆసియాకప్లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా! -
వరుస ఓటములు.. అయినా భారత్ ఫైనల్కు చేరే ఛాన్స్! ఎలా అంటే?
ఆసియాకప్-2022 లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టిన టీమిండియా.. కీలకమైన సూపర్-4 దశలో చేతులెత్తేసింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై ఓటమి చెందిన భారత్.. శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్లో కూడా పరాజయం పాలైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా ఫైనల్కు చేరే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. అయితే సాంకేతికంగా చూస్తే ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. అయితే టీమిండియా భవితవ్యం ఆఫ్గానిస్తాన్ శ్రీలంక జట్టులపై ఆధారపడి ఉంది. భారత్ ఫైనల్కు చేరాలంటే ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫైనల్కు చేరాలంటే అద్భుతాలే జరగాలి. సూపర్-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్తో జరగనున్న మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్గానిస్తాన్తో జరగనున్న సూపర్-4 మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత్, పాక్, ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. కాగా సూపర్-4లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపుగా ఫైనల్లో అడుగుపెట్టినట్టే. ఇక రన్రేట్ విషయానికి వస్తే.. భారత్(-0.126), ఆఫ్గానిస్తాన్(-0.589) కంటే పాకిస్తాన్(+0.126) మెరుగ్గా ఉంది. టీ20 ప్రపంచకప్-2021లో కూడా.. టీ20 ప్రపంచకప్-2021లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వరల్డ్కప్ లీగ్ మ్యాచ్ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంపైనే భారత్ సెమీస్ ఆశలు ఆధారపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గాన్ ఓటమిపాలైంది. దీంతో భారత్ టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారైనా ఆసియా కప్లో పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలని భారత జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. Hoping for the best, ready for the worst 🤞🏻#INDvSL #AsiaCupT20 #TeamIndia pic.twitter.com/yRqWCsZgN4 — Sportskeeda (@Sportskeeda) September 6, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Asia Cup 2022: ఆసియాకప్లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా! -
ఆసియాకప్లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా!
ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఫైనల్ చేరే అవకాశాలను భారత్ చేజార్చుకుంది. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్లో మధుశంక వేసిన ఓ అద్భుతమైన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. తద్వారా ఆసియాకప్లో ఓ చెత్త రికార్డును కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్ వన్డే, టీ20 ఫార్మాట్లో డకౌటైన తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, షనక, కరుణరత్నే చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19. 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(52), కుశాల్ మెండిస్(57) పరుగులతో రాణించగా.. అఖరిలో కెప్టెన్ 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #ViratKohli pic.twitter.com/R0buE9Zxd7 — Ehsan ul haq (@the_ehsanulhaq) September 6, 2022 చదవండి: Asia Cup 2022: రోహిత్ సిక్సర్; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే! -
'నీ కీపింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్'
ఆసియాకప్-2022లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా భారత్ ఫైనల్కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, షనక, కరుణరత్నే చెరో రెండు వికెట్లు సాధించారు. అదరగొట్టిన శ్రీలంక ఓపెనర్లు ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మెండిస్, నిసంకా అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన యజువేంద్ర చాహల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి భారత్ను మళ్లీ తిరిగి మళ్లీ పోటీలో నిలబెట్టాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ అశ్విన్ 14 ఓవర్లో కీలకమైన గుణతిలక వికెట్ పడగొట్టాడు. అదే విధంగా 15 ఓవర్ తొలి బంతికే మంచి ఊపు మీద ఉన్న కుశాల్ మెండిస్ను చాహల్ పెవిలియన్కు పంపాడు. దీంతో క్రీజులో ఇద్దరు కొత్త బ్యాటర్లు ఉండడంతో మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగేలా కనిపించింది. ఇక 16 ఓవర్తో స్పిన్నర్ల నాలుగు ఓవర్ల కోటా పూర్తి అయిపోయింది. విఫలమైన భారత పేసర్లు ఈ క్రమంలో అఖరి నాలుగు ఓవర్లలో లంక విజయానికి 42 పరుగులు అవసరమయ్యాయి. 17 ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ 9 పరుగులు ఇవ్వగా.. 18 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా 12 పరుగులు ఇచ్చాడు . ఇక అఖరి రెండు ఓవర్లలో లంక విజయానికి 12 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ భువనేశ్వర్ కుమార్ చేతికి బంతి అందించాడు. అయితే 19 ఓవర్ వేసిన భువీ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా సమీకరణాలు మారిపోయాయి. #boycottipl India needs a w&k like dhoni #RishabhPant #INDvSL #arshdeepsingh #Dhoni pic.twitter.com/xhiTqLnBr1 — Omkar Upadhyay (@Up03403195Omkar) September 7, 2022 అఖరిలో అర్ష్దీప్ అదుర్స్ అఖరి ఓవర్లో 7 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్దీప్ బౌలింగ్ వేయడానిక వచ్చాడు. తొలి నాలుగు బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చి అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అఖరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్దీప్ వేసిన ఐదో బంతిని షనక మిస్ చేసుకున్నాడు. దీంతో బంతి నేరుగా వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లింది. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసిన పంత్ ఈ క్రమంలో షనక బై రన్కు ప్రయత్నించడంతో.. పంత్ వికెట్లకు త్రో చేశాడు. అయితే బంతి వికెట్లకు తాకకుండా బౌలర్ అర్ష్దీప్ సింగ్ చేతికి వెళ్లింది. అర్ష్దీప్ కూడా నాన్స్ట్రైక్ వైపు త్రో చేశాడు. అప్పడు కూడా బంతి వికెట్లకు తగలకుండా లాంగ్ అన్ వైపు వెళ్లింది. ఈ క్రమంలో బైస్ రూపంలో రెండు పరుగులను లంక బ్యాటర్లు పూర్తి చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లంక లక్ష్యాన్ని చేధించింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(52), కుశాల్ మెండిస్(57) పరుగులతో రాణించగా.. అఖరిలో కెప్టెన్ 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కార్తీక్ జట్టులోఉండాల్సింది! అయితే ఈ మ్యాచ్లో కార్తీక్ను కాదని పంత్ను ఆడించడంపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్లో కీలకమైన సమయంలో షనక స్టంపింగ్ ఛాన్స్ను కూడా పంత్ మిస్ చేశాడు. అదే విధంగా అఖరి ఓవర్లో రనౌట్ అవకాశాన్ని కూడా మిస్ చేసిన పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్లి త్రో చేయాల్సిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ఈ సమయంలో ధోనిని గుర్తు చేసుకుంటారు. కాగా 2016 టీ20 ప్రపంచకప్ ఓ మ్యాచ్లో భారత్పై బంగ్లాదేశ్ విజయానికి అఖరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో.. పాండ్యా వేసిన బంతిని బ్యాటర్ మిస్ చేసుకున్నాడు. అయితే బంతి నేరుగా వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. Why Dhoni is Invaluable . #INDvSL#RishabhPant pic.twitter.com/c949JACXDf — Autumn (@Autumn_streek) September 6, 2022 వెంటనే ధోని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. దీంతో భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా అభిమానులు ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. 'మిస్ యూ' ధోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా కార్తీక్ జట్టులో ఉండి ఉంటే బాగండేది అని వాపోతున్నారు. బ్యాటింగ్లో కూడా పంత్ విఫలమయ్యాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'నీ కీపింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్' అంటూ కామెంట్ చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Asia Cup 2022: రోహిత్ సిక్సర్; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే! -
శ్రీలంక విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్ (ఫొటోలు)
-
Asia Cup 2022: భారత్ కథ ముగిసె!
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్కు ఊహించని షాక్! అభిమానుల గుండె పగిలె ఫలితం శ్రీలంక చేతిలోనూ ఎదురైంది. సూపర్ –4లో వరుసగా రెండో ఓటమి. దీంతో ఫైనల్ ఆశలకు దాదాపు తెరపడింది. నేడు పాకిస్తాన్పై అఫ్గానిస్తాన్ అద్భుతం చేస్తే తప్ప మనకు దారే లేదు. మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్లతో భారత్ను ఓడించిన శ్రీలంక ఫైనల్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. మొదట టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. మదుషంక 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. నిసాంక (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన షనకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కెప్టెన్ ఒక్కడే! గత మ్యాచ్కు భిన్నంగా ఆట మొదలైంది. పాక్పై ధాటిగా ఆరంభమైన ఓపెనింగ్ మెరుపులు... శ్రీలంకపై కరువయ్యాయి. ఓపెనర్ రాహుల్ (6) రెండో ఓవర్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరుసటి ఓవర్లోనే కోహ్లి (0) డకౌటయ్యాడు. 13 పరుగులకే రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రోహిత్ బాధ్యతగా నడిపించాడు. అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టి రన్రేట్ పెంచాడు. మళ్లీ తనే వేసిన పదో ఓవర్లో మరో సిక్సర్, బౌండరీతో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 79/2. సగం ఓవర్లు అయిపోవడంతో ‘హిట్మ్యాన్’ ధాటిని మరింత పెంచాడు. కానీ ఆ క్రమంలోనే వెనుదిరిగాడు. హసరంగ వేసిన 12వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. మరుసటి ఓవర్లో కరుణరత్నే స్లో డెలివరీతో రోహిత్ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి సూర్యకుమార్ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్)ను స్లో బౌన్సర్తో షనక పెవిలియన్ చేర్చాడు. పాండ్యా (17), పంత్ (17) పెద్దగా మెరిపించలేదు. అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) చేసిన ఆ కాస్త పరుగులతోనే కష్టంగా 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెలరేగిన ఓపెనర్లు లంక ఛేదన తొలి ఓవర్లో కేవలం పరుగుతో మొదలైంది. తర్వాత ఓవర్ నుంచి ఫోర్లతో, అటు నుంచి సిక్సర్లతో చకచకా సాగిపోయింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ల జోరుతో అర్‡్షదీప్ తేలిపోయాడు. ఐదో ఓవర్లో అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రీలంక 5.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. మరో ఐదు ఓవర్లు... మొత్తంగా సగం ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. అవతలివైపు ఓపెనర్లే లక్ష్యంలో సగం స్కోరును (10 ఓవర్లలో 89/0) దాటేశారు. 12వ ఓవర్ వేసిన చహల్ నిసాంకతో పాటు అసలంక (0)ను పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో గుణతిలక (1)ను అశ్విన్, కుశాల్ మెండిస్ను చహల్ అవుట్ చేయడంతో 110 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరం ఆనందంలో తేలియాడింది. కానీ రాజపక్స వచ్చీ రాగానే స్పిన్నర్లిదరి ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. తర్వాత కెప్టెన్ షనక కూడా జాగ్రత్తగా ఆడటంతో లక్ష్యానికి చేరువైంది. ఆఖరి అవకాశాన్ని కూడా కీపర్ పంత్, బౌలర్ అర్‡్షదీప్ చేజార్చడంతో లంక మరో బంతి ఉండగానే గెలిచింది. 2 బంతుల్లో 2 పరుగుల సమీకరణం వద్ద ఐదో బంతిని షనక బీట్ అయ్యాడు. పంత్ వికెట్లపై విసరగా తగలకుండా బంతి బౌలర్ అర్‡్షదీప్ చేతుల్లో పడింది. తను పరుగెత్తుకుంటూ వికెట్లను కొట్టకుండా బలంగా విసరడంతో అవుట్ కావాల్సిన చోట ఓవర్త్రోతో 2 పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 6; రోహిత్ (సి) నిసాంక (బి) కరుణరత్నే 72; కోహ్లి (బి) మదుషంక 0; సూర్యకుమార్ (సి) తీక్షణ (బి) షనక 34; పాండ్యా (సి) నిసాంక (బి) షనక 17; పంత్ (సి) నిసాంక (బి) మదుషంక 17; దీపక్ హుడా (బి) మదుషంక 3; అశ్వి న్ (నాటౌట్) 15; భువనేశ్వర్ (బి) కరుణరత్నే 0; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–11, 2–13, 3–110, 4–119, 5–149, 6–157, 7–158, 8–164. బౌలింగ్: మదుషంక 4–0–24–3, మహీశ్ తీక్షణ 4–0–29–1, చమిక 4–0–27–2, అసిత ఫెర్నాండో 2–0–28–0, హసరంగ 4–0–39–0, షనక 2–0–26–2. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రోహిత్ (బి) చహల్ 52; కుశాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 57; అసలంక (సి) సూర్యకుమార్ (బి) చహల్ 0; గుణతిలక (సి) రాహుల్ (బి) అశ్విన్ 1; రాజపక్స (నాటౌట్) 25; షనక (నాటౌట్) 33; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–97, 2–97, 3–110, 4–110. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–30–0, అర్‡్షదీప్ 3.5–0–40–0, పాండ్యా 4–0–35–0, చహల్ 4–0–34–3, అశ్విన్ 4–0–32–1. భారత్ ఫైనల్ చేరాలంటే... నేడు జరిగే మ్యాచ్లో పాకిస్తాన్పై అఫ్గానిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. అనంతరం గురువారం జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్పై భారత్ కూడా విజయం సాధించాలి. శుక్రవారం జరిగే మ్యాచ్లో పాకిస్తాన్పై కూడా శ్రీలంక తప్పనిసరిగా నెగ్గాలి. ఇలా జరిగితే శ్రీలంక ఫైనల్ చేరుతుంది. భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు రెండు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ మూడు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్కు వెళుతుంది. ఒకవేళ నేడు అఫ్గానిస్తాన్పై గెలిస్తే పాకిస్తాన్ ఫైనల్లోకి అడుగు పెడుతుంది. పాక్ , భారత్లపై అఫ్గానిస్తాన్ గెలిచి... లంకపై పాకిస్తాన్ నెగ్గితే... పాక్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్రేట్ ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుతాయి. -
రోహిత్ సిక్సర్; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే!
ఆసియా కప్లో భాగంగా టీమిండియా, శ్రీలంక మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత్ కెప్టెన రోహిత్ శర్మ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రోహిత్ శర్మ కొట్టిన ఒక సిక్స్ హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ అసితా ఫెర్నాండో వేశాడు. ఓవర్ తొలి బంతినే రోహిత్ డీప్స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు. అయితే ఇక్కడే ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు వెనుక వైపు తాకింది. వెనుకకు తిరిగి ఉన్నాడు కాబట్టి సరిపోయింది.. అదే ఒకవేళ ముందుకు నిల్చొని ఉండుంటే సీన్ సితార్ అయ్యేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానకి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 72 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక 3, దాసున్ షనక, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు, మహిష్ తీక్షణ ఒక వికెట్ తీశాడు. #RohitSharma Keep your eyes on the ball when Hitman is in such form#INDvsSL pic.twitter.com/8J7UXgywVc — Cricket fan (@Cricket58214082) September 6, 2022 చదవండి: Rohit Sharma: ఆసియా కప్లో రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు US Open 2022: అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్ దించకుండా తాగింది -
లంకతో మ్యాచ్కు ముందు కోహ్లి ఆసక్తికర పోస్ట్
ఆసియా కప్కు ముందు ఫామ్లో లేని కోహ్లి టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు అర్థశతకాలతో కమ్బ్యాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్న కోహ్లి ప్రస్తుతం టీమిండియా తరపున లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. అయితే పాక్తో మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పుడు ధోని మినహా మిగతవారెవరు మెసేజ్ చేయలేదని.. ధోనితో తనకున్న ప్రత్యేక అనుబంధం వల్ల ఇది జరిగిందంటూ పేర్కొన్నాడు. కాగా కోహ్లి వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీసీసీఐని టార్గెట్ చేస్తూ కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడంటూ కొంతమంది పేర్కొన్నారు. అయితే అతని వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. ఆ విమర్శించిన వారిలో మాజీ క్రికెటర్లు ఉన్నారు. ఇంకా ఏం మెసేజ్ కావాలి అంటూ గావస్కర్ కోహ్లిపై విమర్వలు కురిపించాడు. అయితే ఈ సమస్య ముగిసిపోకముందే కోహ్లి మంగళవారం లంకతో మ్యాచ్కు ముందు.. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో ఆసక్తికర పోస్టు చేశాడు. ''నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు.. నీ పక్కనున్న వాళ్లలో ఎవరు సంతోషించారో.. నువ్వు బాధలో ఉన్న సమయంలో నీ బాధను ఎవరైతే పంచుకున్నారో.. వాళ్లకు మాత్రమే నీ గుండెల్లో పదిలమైన స్థానం ఉంటుంది.'' అంటూ పేర్కొన్నాడు. ''కోహ్లి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశాడో అర్థం కాలేదు''అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. -
లంక ఘన విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్
లంక ఘన విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్ ఆసియాకప్ నుంచి టీమిండియా నిష్ర్కమించింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది. లంక ఇన్నింగ్స్లో పాతుమ్ నిసాంక 52, కుషాల్ మెండిస్ 57 పరుగులు చేయగా.. చివర్లో దాసున్ షనక 33, బానుక రాజపక్స 25 పరుగులు నాటౌట్గా నిలిచి లంకకు విజయమందించారు. టీమిండియా బౌలర్లలో చహల్ 3, అశ్విన్ ఒక వికెట్ తీశారు. చహల్ మ్యాజిక్.. నాలుగో వికెట్ కోల్పోయిన లంక ► 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ తెలివైన బంతితో కుషాల్ మెండిస్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రాజపక్స 7, షనక 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. చహల్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ ► టీమిండియాతో మ్యాచ్లో శ్రీలంక వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మొదట 52 పరుగులు చేసిన నిసాంక సూర్యకుమార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత చరిత్ అసలంక డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 46 పరుగులతో ఆడుతున్నాడు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక.. 8 ఓవర్లలో 74/0 ►174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ధాటిగా ఆడుతువంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. పాతుమ్ నిసాంక 39, కుషాల్ మెండిస్ 35 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 174.. 4 ఓవర్లలో లంక స్కోరెంతంటే? ►174 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. పాతుమ్ నిసాంక 23, కుషాల్ మెండిస్ 4 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 173/8.. శ్రీలంక టార్గెట్ 174 ►ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 72 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్, కోహ్లిలు తొందరగా పెవిలియన్ చేరినప్పటికి.. రోహిత్, సూర్యకుమార్లు టీమిండియా ఇన్నింగ్స్ను నడిపించారు. మూడో వికెట్కు ఇద్దరి మధ్య 96 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. అయితే రోహిత్, సూర్యకుమార్లు ఔటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీనిక తోడూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 200 పరుగుల స్కోరు దాటుతుందనుకుంటే 173 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక 3, దాసున్ షనక, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు, మహిష్ తీక్షణ ఒక వికెట్ తీశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రిషబ్ పంత్(17) ఔట్ ►శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా రిషబ్ పంత్(17) మధుషనక బౌలింగ్లో నిసాంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు దీపక్ హుడా(3 పరుగులు).. దిల్షాన్ మధుషనక బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ(72) ఔట్ శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. దాటిగా ఆడిన రోహిత్ శర్మ(72) కరుణరత్నే బౌలింగ్లో నిసాంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 109/2 ► శ్రీలంకతో టీ20లో టీమిండియా దూకుడుగానే ఆడుతోంది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేరికి.. ► పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 91 పరుగులు సాధించింది. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్శర్మ, సూర్యకుమార్ యాదవ్లు నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే.. ►ఆసియా కప్లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 79 పరుగులు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ► టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు సాధించారు. 9 ఓవర్లకు టీమిండియా 65/2 ► తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 65 పరుగులు చేసి రెండు వికెట్లు నష్టపోయింది. రోహిత్ శర్మ(41), సూర్యకుమార్(15) పరుగులతో క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లు ముగిసేరికి.. ► ఏడు ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 54 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే? ► 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి డకౌట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ► శ్రీలంకతో మ్యాచ్లో కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి.. దిల్షాన్ మధుషనక బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(6) ఔట్ ► శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు మాత్రమే చేసి మహీష్ తీక్షణ బౌలింగ్లోఘెల్బగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక ► ఆసియాకప్లో భాగంలో సూపర్-4లో మంగళవారం టీమిండియా, శ్రీలంకల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఫైనల్ బరిలో నిలవాలంటే టీమిండియా లంకపై తప్పనిసరిగా గెలవాల్సిందే. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఏంచుకుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక టీమిండియా బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బౌలింగ్ పెద్ద సమస్యగా మారిపోయింది. గత మ్యాచ్లో భువనేశ్వర్ కూడా ధారళంగా పరుగులు ఇవ్వడంతో బౌలింగ్ కూర్పులో ఒక స్పష్టత లేకుండా పోయింది. అలాగే పంత్, కార్తిక్లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది కూడా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇక అఫ్గానిస్తాన్పై విజయంతో శ్రీలంక ఫుల్ జోష్లో ఉంది. మరి టీమిండియాతో మ్యాచ్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని లంక ఉవ్విళ్లూరుతుంది. -
'ఏం మెసేజ్ కావాలి'.. కోహ్లిపై దిగ్గజ క్రికెటర్ ఆగ్రహం
టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో తనకు ధోని మినహా మిగతావారు ఎవరు మెసేజ్ చేయలేదని కోహ్లి బాధపడిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా కోహ్లి వ్యాఖ్యలను టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. కోహ్లిని ఉద్దేశించి 'ఇంకా ఎవరి మెసేజ్ కావాలి' అంటూ పరోక్షంగా చురకలంటించాడు. ''స్వతహాగా కెప్టెన్సీ వదులుకున్నాక అతనికి ఇంకేం మద్దతు కావాలో అర్ధం కావట్లేదు. అసలు కోహ్లి ఎవరి మద్దతు కోరుకుంటున్నాడో తెలియట్లేదు. కనీసం ఎవరి పేర్లైనా ప్రస్తావించి ఉంటే వారినే వెళ్లి అడిగేవాళ్లం. కోహ్లి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కెప్టెన్సీ వదిలేయడం, కోల్పోవడం చాలా సహజమని.. ముగిసిపోయిన అధ్యాయాన్ని కోహ్లి మళ్లీ తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన వ్యక్తి ఆట మీదే ఫోకస్ పెట్టడమే మంచిది. కెప్టెన్గా ఉన్నప్పుడు తన సహచరుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కసారి కెప్టెన్సీ వదిలేశాక.. నీ ఆట మీద ఫోకస్ పెడితే మంచిది'' అంటూ చురకలంటించాడు. 1985లో తాను కెప్టెన్సీని వదులుకున్నప్పుడు ఎవరూ తనకు ప్రత్యేకంగా మెసేజ్లు పెట్టలేదని గావస్కర్ గుర్తుచేసుకున్నాడు. చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు US Open 2022: అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్ దించకుండా తాగింది -
అఫ్రిది అప్పుడు అలా బాదడం వల్లే అశ్విన్ను తుది జట్టులోకి తీసుకోవడం లేదు..!
Asia Cup 2022: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ అవాక్కులు చవాక్కులు పేలాడు. 2014 ఆసియా కప్ తర్వాత భారత్-పాక్ మ్యాచ్ల్లో అశ్విన్ను ఎందుకు తీసుకోవడం లేదనే చర్చలో పాల్గొంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. 2014 ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ సందర్బంగా అశ్విన్ వేసిన చివరి ఓవర్లో షాహిద్ అఫ్రిది వరుసగా రెండు సిక్సర్లు బాది పాక్ను గెలిపించడమే ఇందుకు కారణమని గొప్పలు పోయాడు. అఫ్రిది అప్పుడు అలా బాదడం వల్లే అశ్విన్ను నేటికీ భారత్-పాక్ మ్యాచ్ల్లో ఆడించడం లేదని పిచ్చి కూతలు కూశాడు. పీటీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. హఫీజ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా అనుకుంటూ పోతే భారత బ్యాటర్ల ధాటికి చాలామంది పాక్ బౌలర్ల కెరీర్లే అర్ధంతరంగా ముగిసిపోయాయని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. Why Ashwin not playing regularly in recent past #PAKvIND matches. Credit to @SAfridiOfficial Boom Boom master strokes in #AsiaCup2014 pic.twitter.com/0MjjUFJ4ia — Mohammad Hafeez (@MHafeez22) September 5, 2022 వాస్తవానికి అశ్విన్ను టీ20ల్లో ఆడించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, యువ స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుండమే ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తున్నారు. మరికొందరైతే.. ప్రత్యర్ధికి తమ జట్టు కూర్పుతో పని ఏంటని, ఆటగాళ్ల ఎంపికలో తమ వ్యూహాలు తమకు ఉంటాయని అంటున్నారు. అశ్విన్ జట్టులో ఉన్నా లేకపోయిన ఈ మధ్యకాలంలో పాక్ పొడించిందేమీ లేదని, కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే వారు గెలుపొందారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హఫీజ్ పైత్యం వదిలించారు. కాగా, వన్డే ఫార్మాట్లో జరిగిన 2014 ఆసియా కప్ మ్యాచ్లో (భారత్-పాక్) పాక్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండింది. కెప్టెన్ ధోని అశ్విన్పై నమ్మకంతో అతనికి బంతినందించాడు. ఆ ఓవర్ తొలి బంతికే అజ్మల్ను ఔట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాతి బంతికి సింగిల్ను ఇచ్చాడు. అప్పుడే స్ట్రయిక్లోకి వచ్చిన షాహిద్ అఫ్రిది.. వరుసగా రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలుండగానే పాక్కు విజయతీరాలకు చేర్చాడు. -
ఆసియా కప్ను పాక్ ఎగరేసుకుపోతుంది..! జోస్యం చెప్పిన సెహ్వాగ్ బాబా
Sehwag Prediction On Asia Cup 2022 Winner: ఆసియా కప్ 2022 విజేత ఎవరనే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సూపర్-4 మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్లో టీమిండియా ఓడితే.. దాయాది పాకిస్తాన్కు ఆసియా కప్ ఎగరేసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ భారత అభిమానులకు మింగుడుపడని జోస్యం చెప్పాడు. ఆసియా కప్లో చాలాకాలం తర్వాత పాక్ టీమిండియాపై విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే.. దాయాదికే ఆసియా ఛాంపియన్గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ జోస్యం విషయం అటుంచితే.. శ్రీలంకతో నేడు జరుగబోయే మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైతే ఫైనల్కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయే మాట వాస్తవమే. ఇదే జరిగితే, సూపర్-4 టేబుల్ టాపర్గా శ్రీలంక, మరో మ్యాచ్ ఓడినా టేబుల్ సెకెండ్ టాపర్గా పాకిస్తాన్ ఫైనల్స్కు చేరతాయి. బలాబలాల విషయంలో లంకతో పోలిస్తే పాక్దే పైచేయిగా ఉండటంతో ఫైనల్లో పాక్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్లో భారత్ భారీ తేడాతో గెలిస్తే.. సమీకరణలు ఇందుకు విరుద్దంగా మారతాయి. రోహిత్ సేన లంకపై గెలిస్తేనే సరిపోదు, మరో సూపర్-4 పోరులో ఆప్ఘనిస్తాన్ను కూడా భారీ తేడాతో మట్టికరిపించాల్సి ఉంటుంది. టీమిండియా ఫైనల్స్కు చేరేందుకు రన్ రేట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదంటే తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్ భారీ విజయాలు సాధించాల్సి ఉంది. ఈ రెండు విజయాలు ఇచ్చే ఊపుతో అలాగే సూపర్-4 దశలో పాక్ చేతిలో ఎదురైన చేదు అనుభవం తాలూకా కసితో టీమిండియా ఫైనల్లో ఎంతటి ప్రత్యర్ధినైనా మట్టికరిపించే అవకాశం ఉంటుంది. మరోవైపు పాక్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో గెలిస్తే.. వచ్చే ఆదివారం జరుగబోయే ఫైనల్లో దెబ్బతిన్న బెబ్బులి భారత్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గ్రూప్ దశలో లంక, బంగ్లా జట్లకు షాకిచ్చిన ఆఫ్ఘాన్.. తమ తదుపరి సూపర్-4 మ్యాచ్ల్లో భారత్, పాక్లతో తలపడాల్సి ఉంది. ఆఫ్ఘాన్.. ఈ రెండు జట్లలో ఏదో ఒకదానికి షాకిచ్చినా ఫైనల్ బెర్తులు తారుమారవుతాయి. ఏదిఏమైనప్పటికీ ఇవాల్టి మ్యాచ్లో లంకను మట్టుబెట్టడమే భారత్ ముందున్న ప్రధమ లక్ష్యం. చదవండి: IND VS SL: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..? -
'శ్రీలంకతో మ్యాచ్కు అతడిని జట్టులోకి తీసుకురండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా డూ ఆర్ డై మ్యాచ్లో శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా భారత్ తమ సూపర్-4 తొలి మ్యాచ్లో పాక్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఫైనల్కు చేరాలంటే వరుసగా శ్రీలంక, ఆఫ్గానిస్తాన్పై విజయం సాధించాలి. ఇక గత మ్యాచ్లో పాక్పై జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. శ్రీలంకతో మ్యాచ్లో జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అదే జట్టుతో ఆడుతోందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో శ్రీలంకతో కీలక పోరుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ సబా కరీం సూచించాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు అశ్విన్ కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండియా స్పోర్ట్స్ న్యూస్తో కరీం మాట్లాడుతూ.. శ్రీలంకతో జరిగే కీలక మ్యాచ్కు హుడా స్థానంలో అశ్విన్ను జట్టులోకి తీసుకోవాలి. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో కలిపి ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అశ్విన్ అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్. అతడికి కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా ఉంది అని" కరీం పేర్కొన్నాడు. శ్రీలంకతో మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
IND VS SL: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
ఆసియా కప్ 2022 సూపర్-4 దశ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 6) భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ స్టేజీలో శ్రీలంక ఇప్పటికే ఓ విజయం (ఆఫ్ఘనిస్తాన్పై) సాధించి మెరుగైన రన్రేట్తో (0.589) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా.. పాక్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (-0.126) నిలిచింది. ఫైనల్కు అర్హత సాధించాలంటే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు, పసికూనే కదా అని శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో లంకేయులు భారీ స్కోర్ను అలవోకగా ఛేదించి మాంచి జోష్ మీద ఉన్నారు. శ్రీలంక అదే జోష్ను ఈ మ్యాచ్లోనూ కంటిన్యూ చేస్తే.. టీమిండియా ఇంటి బాట పట్టక తప్పదు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ సైతం ఆసియా కప్లో శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నాయి. ఈ టోర్నీలో శ్రీలంకకు భారత్తో సమానమైన విన్నింగ్ రికార్డు ఉంది. ఆసియా కప్ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్లు జరగ్గా.. భారత్ 10, శ్రీలంక 10 మ్యాచ్ల్లో గెలుపొందాయి. టీ20ల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో టీమిండియా లంకేయులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 25 టీ20 మ్యాచ్లు జరగ్గా భారత్ 17, శ్రీలంక 7 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్ల మధ్య తాజాగా జరిగిన 5 టీ20లను పరిశీలిస్తే.. చివరి 3 మ్యాచ్ల్లో టీమిండియానే విజయం సాధించినప్పటికీ.. వారి సొంతగడ్డపై జరిగిన 2 టీ20ల్లో లంకేయులే జయకేతనం ఎగురవేశారు. ఓవరాల్గా చూస్తే.. లంక జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ, వారిదైన రోజున వారిని ఆపడం మాత్రం చాలా కష్టం. బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కనబడే శ్రీలంక.. బ్యాటింగ్లో మాత్రం తగినంత డెప్త్ కలిగి ఉంది. ఈ మ్యాచ్లో టాస్ మరోసారి కీ రోల్ ప్లే చేయనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కే మొగ్గు చూపే అవకాశం ఉంది. తుది జట్ల అంచనా.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక చదవండి: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
అర్షదీప్కు అండగా నిలబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో పాక్తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్లో కీలక సమయంలో సునాయాసమైన క్యాచ్ డ్రాప్ చేసి దారుణమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్న టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్కు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతుంది. సహచర ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ అర్షదీప్కు అండగా నిలబడగా.. మాజీలు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రాలు సైతం యువ పేసర్కు మద్దతుగా నిలిచారు. తాజాగా రాజకీయ పార్టీ ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) కూడా తామూ అర్షదీప్ వెంటే అంటూ ముందుకొచ్చింది. I just met bowling superstar Arshdeep's family in Kharar, Punjab. His parents have persevered & sacrificed so much. His struggle & perseverance, from humble origins to playing for India at international stage is inspiring. We all stand firmly with Arsh today. #IStandWithArshdeep pic.twitter.com/mcT1DlPsRl — Raghav Chadha (@raghav_chadha) September 5, 2022 ఆప్ ఎంపీ రాఘన్ చద్దా పంజాబ్లోని ఖరార్లో ఉన్న అర్షదీప్ ఇంటికి వెళ్లి, అతని తల్లిదండ్రులను పరామర్శించారు. ట్రోలింగ్ గురించి పట్టించుకోవద్దని, హైఓల్టేజీ మ్యాచ్ల్లో తప్పులు జరగడం సహజమని, అందు గురించి చింతించరాదని, తామంతా అర్షదీప్ వెంటే ఉన్నామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అర్షదీప్ కుటుంబసభ్యులు సైతం ట్రోలింగ్ను పాజిటివ్గానే తీసుకుంటున్నామని రాఘవ్ చద్దాకు తెలిపారు. అర్షదీప్ కుటుంబ సభ్యులను కలిసిన విషయాన్ని రాఘవ్ చద్దా 'ఐ స్టాండ్ విత్ అర్షదీప్' అనే హ్యాష్ ట్యాగ్ జోడించి ట్విటర్లో షేర్ చేశాడు. మరోవైపు కొందరు దురాభిమానులు అర్షదీప్ వికీపీడియా పేజీలో భారత్ బదులు ఖలిస్తాన్ అని ఎడిట్ చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. కాగా, పాకిస్తాన్తో సెప్టెంబర్ 4 జరిగిన హోరాహోరీ సమరంలో అర్షదీప్ కీలక సమయంలో (15 బంతుల్లో 31 పరుగులు) సునాయాసమైన క్యాచ్ను జారవిడిచిన విషయం తెలిసిందే. ఫలితంగా పాక్.. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: ఒత్తిడిలో తప్పులు సహజమే.. అర్షదీప్కు కింగ్ కోహ్లి మద్దతు -
'జడేజా స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది'
ఆసియాకప్-2022 టోర్నీ మధ్య నుంచి భారత్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్బైగా ఉన్న అక్షర్ పటేల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ బదులగా పేసర్ దీపక్ చహర్ను జట్టులోకి తీసుకోవాల్సింది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఇండియా న్యూస్తో కరీమ్ మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్ తొలి రెండు మ్యాచ్ల్లో భారత పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం మనం చూశాం. కాబట్టి గాయపడిన జడేజా స్థానంలో పేసర్ దీపక్ చాహర్ను ఎంపిక చేయాల్సింది. చాహర్ టీ20 స్పెషలిస్టు. అతడికి కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు జట్టులో ఉంటే పాకిస్తాన్ అంత పెద్ద టార్గెట్ను చేధించేది కాదు. కాగా ఇప్పటికే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఇప్పుడు అక్షర్ రూపంలో నాలుగో స్పిన్నర్ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో నాకు అర్ధం కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు -
కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు
BCCI Slams Kohli: టెస్ట్ కెప్టెన్సీ వదిలేశాక, కెరీర్ హీన దశలో ఉన్న నన్ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక్కడే ఫోన్ చేసి పలకరించాడన్న కోహ్లి వ్యాఖ్యలపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మండిపడ్డాడు. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత కోహ్లికి బీసీసీఐ సహా జట్టు సభ్యులు, మాజీలు అండగా నిలబడ్డప్పటికీ కోహ్లి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశాడు. గడ్డుకాలంలో తనకెవరూ అండగా నిలబడలేదని కోహ్లి వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని, బీసీసీఐ అధ్యక్షుడు సహా బోర్డు సభ్యులందరూ అతనికి సోషల్మీడియా వేదికగా అండగా నిలబడ్డారని గుర్తు చేశాడు. ఒడిదుడుకులు అధిగమించి కెరీర్లో విజయవంతంగా ముందుకు సాగాలని తామంతా మెసేజ్లు చేసిన విషయాన్ని కోహ్లి మరిచాడా అని చురకలంటించాడు. ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతుంటే, విశ్రాంతి అవసరమని తాము చేసిన సిఫార్సులను కోహ్లి మరిచాడని ధ్వజమెత్తాడు. ఇంత చేసినా తనకెవరు అండగా నిలబడలేదని కోహ్లి అనడం బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. అతను తిరిగి గాడిలో పడ్డాక చేసిన మేలులను మరచి ఇలా కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికాడు. The bond between MS Dhoni & Virat Kohli is pure gold. pic.twitter.com/g6pbSRkwp0 — Johns. (@CricCrazyJohns) September 4, 2022 కాగా, ఆసియా కప్ సూపర్-4 దశలో పాక్ చేతిలో పరాజయం అనంతరం ప్రెస్ మీట్లో బీసీసీని ఉద్దేశిస్తూ కోహ్లి చేసిన వ్యాఖ్యలు మళ్లీ అగ్గి రాజేశాయి. కోహ్లి ఫామ్లోని వచ్చాడో లేదో మళ్లీ స్టార్ట్ చేశాడని అతని వ్యతిరేకులు మండిపడుతున్నారు. సమసిపోయిన అధ్యాయాన్ని మళ్లీ ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకని మరికొందరు కోహ్లికి చురకలంటిస్తున్నారు. చదవండి: ఒత్తిడిలో తప్పులు సహజమే.. అర్షదీప్కు కింగ్ కోహ్లి మద్దతు -
'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో కీలక పోరుకు సిద్దమైంది. దుబాయ్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్లో టీమిండియా తాడోపేడో తేల్చుకోనుంది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్కు ఎదురైన పరాజయం .. ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది. భారత్ ఫైనల్కు చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఇక శ్రీలంకతో డూ ఆర్డై మ్యాచ్కు భారత జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూచించాడు. దారుణంగా విఫలమవుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అవేశ్ ఖాన్ను తుది జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. అదే విధంగా భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అతడు తెలిపాడు. చాహల్ను పక్కన పెట్టి అవేష్ ఖాన్కు తిరిగి జట్టులోకి తీసుకురావాలి. అదే విధంగా రవి బిష్ణోయ్కు ఈ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలి. అతడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో చాహల్ అంతగా రాణించలేకపోయాడు. కాబట్టి లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్కు మరిన్ని అవకాశాలు కల్పించే సమయం అసన్నమైంది అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో బిష్ణోయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చాహల్ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. శ్రీలంకతో మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్కు చాన్స్ ఉందా? -
శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్కు చాన్స్ ఉందా?
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి రెండు మ్యాచ్లలో భారత్ జోరు చూస్తే పాకిస్తాన్పై మళ్లీ గెలవడం ఖాయమనిపించింది. అయితే ఆదివారం పాక్ చేతిలో ఎదురైన పరాజయం ‘సూపర్–4’ దశను ఆసక్తికరంగా మార్చింది. ఫైనల్ చేరాలంటే మూడు మ్యాచ్లలో కనీసం రెండు గెలవాల్సి ఉండగా, తొలి మ్యాచ్లో ఓటమి టీమిండియాపై ఒత్తి డి పెంచింది. మిగిలిన రెండు మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది. అశ్విన్కు చాన్స్ ఉందా! టి20 ప్రపంచకప్కు ఈ వారంలోనే భారత జట్టును ప్రకటించనున్నారు. ఇలాంటి స్థితిలో ఆసియా కప్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇస్తూ అన్ని రకాల ప్రత్యామ్నాయాలను భారత్ పరీక్షిస్తోంది. అయితే పాకిస్తాన్ చేతిలో ఓడటంతో మరోసారి తుది జట్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ గత మ్యాచ్లో శుభారంభం అందించడం సానుకూలాంశం. టోర్నీలో రెండో అర్ధ సెంచరీతో కోహ్లి ఫామ్లోకి రాగా, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా మరోసారి చెలరేగాల్సి ఉంది. పాక్తో మ్యాచ్లో హార్దిక్ రెండు విభాగాల్లోనూ నిరాశపర్చాడు. కీపర్ రిçషభ్ పంత్, దినేశ్ కార్తీక్ మధ్య టీమ్ మేనేజ్మెంట్ ఇంకా తేల్చుకోలేకపోతోంది. హాంకాంగ్తో మ్యాచ్లో ఇద్దరూ ఆడగా, గత పోరులో కార్తీక్ స్థానంలో బ్యాటర్గా దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. హుడాకు మరో అవకాశం ఇస్తారా లేక కార్తీక్ను మళ్లీ ఆడిస్తారా చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్లాంటివాళ్లు లేకపోవడంతో బౌలింగ్లో తడబాటు కనిపిస్తోంది. ఎంతో నమ్ముకున్న భువనేశ్వర్ పాక్తో మ్యాచ్లో 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు దానిని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. స్పిన్ విభాగంలో ఒక మార్పు జరగవచ్చు. ఆశించిన స్థాయిలో చహల్ రాణించడం లేదు కాబట్టి సీనియర్ ఆఫ్స్పిన్నర్ అశ్విన్కు ఒక అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడని ఖాయంగా చెప్పవచ్చు. స్టార్లు లేకపోయినా లీగ్ దశలో అఫ్గానిస్తాన్తో తొలి మ్యాచ్లో ఓడగానే శ్రీలంక జట్టును అంతా తేలిగ్గా చూశారు. అయితే తర్వాతి రెండు మ్యాచ్లలో ఆ జట్టు చూపిన పోరాటపటిమ, యువ ఆటగాళ్ల పట్టుదల అభినందనీయం. ఈ రెండు మ్యాచ్లలోనూ ఓటమికి చేరువై గెలుపునకు ఎలాంటి అవకాశం లేని స్థితి నుంచి లంక మ్యాచ్లు గెలవగలిగింది. ముందుగా బంగ్లాదేశ్ను ఇంటికి పంపిన ఆ జట్టు ‘సూపర్–4’లో గెలుపుతో అఫ్గానిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటర్లు షనక, కుశాల్ మెండిస్, గుణతిలక, రాజపక్స కీలక సమయాల్లో రాణించి జట్టు విజయానికి కారణం కాగా, చివర్లో చమిక కరుణరత్నే కూడా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. బౌలింగ్ లో గుర్తింపు ఉన్న పేసర్లు ఎవరూ లేకపోవడం లంక జట్టు బలహీనత. అయితే ఐపీఎల్లో ఆడిన స్పిన్నర్లు మహీశ్ తీక్షణ, హసరంగ భారత్పై ప్రభావం చూపగలరు. -
తుది జట్టులో ఎవరుండాలో ఓ క్లారిటీతో ఉండాలి.. !
ఆసియా కప్ సూపర్-4 దశలో పాక్ చేతిలో పరాజయం అనంతరం ఆ దేశ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా తుది జట్టు ఎంపికపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో ఎవరెవరు ఉండాలో కనీసం కోచ్కైనా పూర్తి అవగాహణ ఉండాలని చవాక్కులు పేలాడు. తుది జట్టు ఎంపికలో ఇంత గందరగోళం ఏంటని ప్రశ్నించాడు. 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ నానా అవస్థలు పడుతుందని, జట్టు కూర్పు విషయంలో యాజమాన్యం, కోచ్కు ఓ క్లారిటీ ఉండాలని బిల్డప్ ఇచ్చాడు. ఓ ఆటగాడు విఫలమైతే లేదా గాయపడితే ప్రత్యామ్నాయ ఆటగాడిని ముందే ఎంచుకోవాలని అనవసర సలహాలు ఇచ్చాడు. గాయం కారణంగా రవీంద్ర జడేజా, అనారోగ్యం కారణంగా ఆవేశ్ ఖాన్లు జట్టుకు దూరమైన నేపథ్యంలో వారి స్థానాల్లో సంబంధిత స్పెషలిస్ట్లను జట్టులోకి తీసుకోవాలి కాని.. అనవసర మార్పులు, చేర్పులు చేసి చేతులు కాల్చుకుందని అన్నాడు. స్పెషలిస్ట్ వికెట్కీపర్ కమ్ ఫినిషర్ కోటాలో ఎంపిక చేసుకున్న దినేశ్ కార్తీక్ను పక్కకు పెట్టి ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకోవడమేంటని అవగాహన లేకుండా పేలాడు. ఆల్రౌండర్ కోటాలో దీపక్ హుడాను తీసుకున్నప్పుడు అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడమేంటని ప్రశ్నించారు. మొత్తంగా సూపర్-4 దశలో పాక్తో మ్యాచ్కు టీమిండియా ఎంపిక గందరగోళంగా ఉందని అన్నాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్ వేదికగా అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, భారత్-పాక్ల మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో.. పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ గెలుపొందింది అనడం కంటే.. టీమిండియా పరాజయంపాలైందని అనడమే బెటరని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: లంకతో సమరం.. పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! -
లంకతో సమరం.. పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 4) పాకిస్తాన్తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను టీమిండియా ఆటగాళ్లు చేజేతులా జారవిడిచి ప్రత్యర్ధికి చేతికి అప్పగించారు. తొలుత బ్యాటింగ్లో అత్యుత్సాహం (పంత్, హార్ధిక్ చెత్త షాట్ సెలెక్షన్), అనంతరం బౌలింగ్ (భువీ, హార్ధిక్, చహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం), ఫీల్డింగ్లో (కీలక సమయంలో అర్షదీప్ క్యాచ్ జారవిడచడం) అనవసర తప్పిదాలు టీమిండియా పుట్టి ముంచాయి. పాక్ చేతిలో ఈ ఊహించని పరాభవం నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సూపర్-4 దశలో తదుపరి జరిగే మ్యాచ్ల్లో వికెట్కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్ చహల్లపై వేటు వేయడం ఉత్తమమని టీమిండియా యాజమాన్యాన్ని సూచిస్తున్నారు. రేపు (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్లో పంత్, చహల్లను పక్కకు పెట్టి వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్లను ఆడించాలని కోరుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ కోటాలో ఎంపిక చేసిన పంత్.. రైట్ హ్యాండర్లా షాట్ ఆడేందుకు ప్రయత్నించి (రివర్స్ స్వీప్) వికెట్ పారేసుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చహల్ సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడని మండిపడుతున్నారు. వీరిద్దరిని తీసేసి డీకే, అక్షర్లకు అవకాశం ఇస్తే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! లేదంటే మనం ఇంటికే! -
టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో ( మెన్స్ అండ్ వుమెన్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగులు చేసిన రోహిత్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ (3531) పేరిట ఉండేది. అయితే తాజా మ్యాచ్తో రోహిత్ శర్మ(3548) ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 127 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 3548 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 27 హాఫ్ సెంచరీలతో పాటు 4 సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రోహిత్(3548) పరుగులతో టాప్లో ఉండగా.. గప్టిల్(3497), కోహ్లి(3462) పరుగులతో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Asia Cup 2022: ఆస్పత్రిలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు! -
ఆస్పత్రిలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు!
ఆసియాకప్-2022లో భాగంగా భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో మహ్మద్ హస్నైన్ వేసిన ఓ బౌన్సర్ బంతిని ఆపే క్రమంలో రిజ్వాన్ మెకాలికి గాయమైంది. అనంతరం ఫిజియో సాయం తీసుకుని ఫీల్డ్లో కొనసాగాడు. ఓ వైపు గాయంతో బాధపడుతునే బ్యాటింగ్లో కూడా రిజ్వాన్ దుమ్మురేపాడు. 51 బంతుల్లో 71 పరుగులు సాధించి పాక్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం రిజ్వాన్ను స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా సోమవారం దృవీకరించింది. అయితే అతడి స్కాన్ రిపోర్ట్స్కు సంబంధించి ఇప్పుడు వరకు ఎటువంటి సమాచారం తెలియలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్పై పాక్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాల వల్ల టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) పరుగలతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(28), రోహిత్ శర్మ(28) పరుగులతో రాణించారు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. చదవండి: Asia Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్పై విజయం.. సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఆటగాళ్లు! -
ఒత్తిడిలో తప్పులు సహజమే.. అర్షదీప్కు కింగ్ కోహ్లి మద్దతు
పాకిస్తాన్తో నిన్న (సెప్టెంబర్ 4) జరిగిన హోరాహోరీ సమరంలో కీలక సమయంలో (15 బంతుల్లో 31 పరుగులు) సునాయాసమైన క్యాచ్ను జారవిడిచి, జట్టు పరాజయానికి పరోక్ష కారణమైన టీమిండియా యువ పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్కు సహచర ఆటగాడు, జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. పాక్ చేతిలో ఊహించని పరాభవం ఎదురవడం, అందుకు అర్షదీపే కారణమని భావిస్తున్న జనం సోషల్మీడియా వేదికగా అతనిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంత ఈజీ క్యాచ్ పట్టలేవా.. నీ వల్లే మ్యాచ్ చేజారిందని అర్షదీప్ను నిందిస్తున్నారు. ఎంత పొదుపుగా బౌలింగ్ చేస్తే మాత్రం, గల్లీ క్రికెటర్లు పట్టే క్యాచ్లు కూడా పట్టలేవా అంటూ ఏకిపారేస్తున్నారు. క్యాచ్ జారవిడిచినందుకు అప్పుడే కెప్టెన్ రోహిత్చే చీవాట్లు తిన్ని అర్షదీప్.. మ్యాచ్ చేజారిన అనంతరం అభిమానులు ఆగ్రహావేశాలకు బలవుతున్నాడు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లి అర్షదీప్కు మద్దతుగా నిలిచాడు. పాక్తో మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనై తప్పులు చేస్తారని, అందుకు నేను కూడా అతీతుడ్ని కాదని, అర్షదీప్ జారవిడిచిన క్యాచ్ చాలా కీలకమే అయినప్పటికీ అతన్ని ఈ రేంజ్లో నిందించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కోహ్లి ఈ మేరకు అర్షదీప్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. తప్పులను ఒప్పుకుని గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికాడు. జట్టులో సీనియర్లు, కెప్టెన్, కోచ్ అర్షదీప్కు అండగా ఉన్నారని, అతను అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు. అర్షదీప్కు కోహ్లితో పాటు భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా మద్దతుగా నిలిచారు. వాస్తవానికి ఆ ఒక్క డ్రాప్ క్యాచ్ మినహా బౌలింగ్లో అర్షదీప్ స్థాయికి మించి సత్తా చాటాడు. ఆఖరి ఓవర్లో పాక్ గెలుపుకు 7 పరుగులు కావాల్సిన తరుణంలో బంతినందుకుని ఆసిఫ్ అలీ వికెట్ పడగొట్టడంతో పాటు తొలి నాలుగు బంతుల్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్పై భారత్కు ఆశలు చిగురించేలా చేశాడు. అయితే ఇఫ్తికార్ అహ్మద్ ఐదో బంతికి 2 పరుగులు రాబట్టి పాక్కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. చదవండి: Ind Vs Pak: ఏయ్.. నువ్వేం చేశావో అర్థమైందా అసలు? అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్ -
ఉత్కంఠ పోరులో భారత్పై విజయం.. సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఆటగాళ్లు!
ఆసియాకప్-2022లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. మరో బంతి మిగిలూండగానే చేధించింది. కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం సాధించగానే పాక్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాక్ ఆటగాళ్లు అఖరి ఓవర్ జరుగుతున్న క్రమంలో చాలా టెన్షన్ పడుతూ కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజం అయితే డ్రెస్సింగ్ రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 6న శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్కు చేరాలంటే శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ జట్లపై ఖచ్చితంగా విజయం సాధించాలి. The raw emotions, the reactions and the celebrations 🤗 🎥 Relive the last over of Pakistan's thrilling five-wicket win over India from the team dressing room 👏🎊#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/xHAePLrDwd — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2022 చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! లేదంటే మనం ఇంటికే!
Asia Cup 2022 - How India Can Qualify Final: ఆసియా కప్-2022 టీ20 సూపర్-4 దశను టీమిండియా ఓటమితో ఆరంభించింది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) దాయాది పాకిస్తాన్తో పోరులో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రోహిత్ సేన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ముందుకు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్లు కీలకంగా మారాయి. మరి ఫైనల్ రేసులో టీమిండియా నిలిచేందుకు అవసరమైన సమీకరణాలు ఏమిటో గమనిద్దాం. అప్పుడు భారత్.. ఇప్పుడు పాకిస్తాన్ లీగ్ దశలో తమ మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్స్ బాదడంతో రోహిత్ సేన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, సూపర్-4 మొదటి మ్యాచ్లో సీన్ రివర్స్ అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో గెలుపు పాక్ను వరించింది. యాధృచ్చికంగా టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధిస్తే.. పాకిస్తాన్ సైతం ఐదు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగా గెలుపును సొంతం చేసుకుంది. అందుకే మనకంటే మెరుగ్గా పాకిస్తాన్ ఇదిలా ఉంటే లీగ్ దశలో హాంగ్ కాంగ్తో మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో గెలుపొందితే.. పాకిస్తాన్ ఏకంగా 155 పరుగుల తేడాతో పసికూనపై జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్(0.126).. టీమిండియా(-0.126) కంటే రన్రేట్ పరంగా మెరుగైన స్థితిలో ఉంది. రెండేసి పాయింట్లతో శ్రీలంక, పాకిస్తాన్ ఆసియా కప్-2022 టీ20 టోర్నీ లీగ్ దశలో అఫ్గనిస్తాన్ చేతిలో పరాభవానికి శ్రీలంక.. సూపర్-4 తొలి మ్యాచ్లో బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ మొదటి బంతి వరకు సాగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో అఫ్గన్ను ఓడించి లంక విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు పాయింట్లు సాధించి సూపర్-4 టాపర్గా ఉంది. పాకిస్తాన్ సైతం టీమిండియాపై గెలుపుతో రెండు పాయింట్లు సాధించగా.. రన్రేటు పరంగా శ్రీలంక(0.589) పటిష్ట స్థితిలో ఉంది. ఇక ఇప్పటికే సూపర-4 దశలో ఒక్కో మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా, అఫ్గనిస్తాన్ సున్నా పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ముందు దసున్ షనక బృందాన్ని, తర్వాత అఫ్గన్ను చిత్తు చేస్తేనే.. సూపర్-4 స్టేజ్లో టీమిండియా తమ తదుపరి మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 6) రాత్రి ఏడున్నర గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబరు 8(గురువారం)న భారత్- అఫ్గనిస్తాన్తో తలపడనుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్లలో ఒక్కటి ఓడినా.. టీమిండియా ఇంటిబాట పట్టక తప్పదు. ఎందుకంటే శ్రీలంక, పాకిస్తాన్లు ఇప్పటికే ఒక్కో విజయంతో పటిష్ట స్థితిలో ఉన్నాయి. లంక టీమిండియాను ఓడించి, అఫ్గన్ మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడితే చాలు నేరుగా ఫైనల్కు దూసుకెళ్తుంది. ఇతర జట్ల పరిస్థితి? ఇక పాకిస్తాన్.. అఫ్గనిస్తాన్ లేదంటే శ్రీలంకను ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. అదే విధంగా.. ఒకవేళ శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్లను భారత్ ఓడించినట్లయితే.. ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ పోరును మరోసారి వీక్షించే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అలా కాకుండా.. ఏ రెండు ఇతర జట్లు వరుసగా భారీ విజయాలు నమోదు చేసినా.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ సైతం భారత్, పాకిస్తాన్ను ఓడిస్తే ఫైనల్కు చేరుకునే అవకాశం ఉంటుంది. చదవండి: Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్! వైరల్ Asia Cup 2022 - Ind Vs Pak: పంత్పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..? -
హార్ధిక్పై విరుచుకుపడిన రోహిత్.. అదే రేంజ్లో ఎదురుతిరిగిన స్టార్ ఆల్రౌండర్
ఆసియా కప్ 2022 సూపర్-4 దశ మ్యాచ్ల్లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 4) భారత్-పాక్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేసిన తప్పిదాల కారణంగా పాక్ను విజయం వరించింది. తద్వారా గ్రూప్ దశలో రోహిత్ సేన చేతిలో ఎదురైన పరాభవానికి పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. All The Best @RishabhPant17 🥺🥺#RohitSharma #RishabPant #INDvsPAK pic.twitter.com/LwDu5sqInF — 𝓒𝓱𝓲𝓴𝓾 (@Chiku2324) September 4, 2022 ఓపెనర్లు రోహిత శర్మ (20 బంతుల్లో 28; ఫోర్, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. అయితే మధ్యలో రిషబ్ పంత్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), హార్ధిక్ పాండ్యా (0) అనవసర తప్పిదాల కారణంగా భారత్ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. పంత్ అనవసర రివర్స్ స్వీప్కు ప్రయత్నించి వికెట్ను సమర్పించుకోగా.. హార్ధిక్ షార్ట్ బంతిని సరిగ్గా ఆడలేక సునాయాస క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. నిర్లక్ష్యపు షాట్ ఆడినందుకు గాను పెవిలియన్కు చేరాక పంత్పై విరుచుకుపడిన రోహిత్.. మ్యాచ్ సందర్భంగా హార్ధిక్తోనూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. పంత్పై డ్రస్సింగ్ రూమ్లో ఎగిరెగిరిపడిన రోహిత్.. బ్యాటింగ్కు వెళ్లే ముందు హార్ధిక్తోనూ వాదించినట్లు లైవ్లో కనిపించింది. రోహిత్ వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. పంత్.. రోహిత్ క్లాస్ పీకుతుంటే సంజాయిషీ చెప్పుకునే ప్రయత్నం చేయగా.. హార్ధిక్ మాత్రం రోహిత్కు ఎదురు సమాధానం చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. నువ్వేంటి నాకు చెప్పేది.. అన్నట్లుగా హార్ధిక్ హావభావాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఐపీఎల్లో హార్ధిక్ ముంబై ఇండియన్స్ని వదిలి వెళ్లడానికి కూడా రోహితే కారణమని పాండ్యా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ.. పాక్తో మ్యాచ్లో బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైన హార్ధిక్.. బౌలింగ్లోనూ దారుణంగా నిరాశపరిచాడు. 4 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టి ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. గ్రూప్ దశలో ఆల్రౌండ్ ప్రదర్శనతో పాక్ను ఒంటిచేత్తో మట్టికరించిన హార్ధిక్.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాడు. pic.twitter.com/YoptT7KBuu — Guess Karo (@KuchNahiUkhada) September 5, 2022 హార్ధిక్తో పాటు భువీ (1/40), చహల్ (1/43) ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు 18వ ఓవర్లో అర్షదీప్.. అసిఫ్ అలీ క్యాచ్ జారవిడచడంతో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ చేతిలో చిత్తైంది. అర్ష్దీప్ తప్పిదంతో బతికిపోయిన అసిఫ్ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో (భువనేశ్వర్ కుమార్) సిక్స్, ఫోర్.. ఆఖరి ఓవర్లో (అర్ష్దీప్) బౌండరీ బాది పాక్ను విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. చివరి రెండు బంతుల్లో పాక్ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఇఫ్తికర్ అహ్మద్ లాంఛనం మ్యాచ్ను ముగించాడు. చదవండి: Ind Vs Pak: ఏయ్.. నువ్వేం చేశావో అర్థమైందా అసలు? అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన అర్థసెంచరీ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో కోహ్లికి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమాన్హం. ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 60 పరుగులు సాధించాడు. కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో అర్ధ శతకం సాధించిన రన్మిషన్.. ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో విరాట్ కోహ్లికి ఇది 32వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్ రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో రోహిత్ను కింగ్ కోహ్లి అధిగమించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో కోహ్లి(32) టాప్లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(31), బాబర్ ఆజాం (27), డేవిడ్ వార్నర్ (23), మార్టిన్ గప్తిల్ (22) ఉన్నారు. చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: పంత్పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..? -
పంత్పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..?
ఆసియాకప్-2022లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా ఈవెంట్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(71) పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా బ్యాటింగ్లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం దారుణంగా విఫలమయ్యంది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(60) అర్ధసెంచరీతో చేలరేగగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్ (28) పరుగులతో రాణించారు. అయితే ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ పంత్, హార్ధిక్ పాండ్యా తీవ్రంగా నిరాశ పరిచారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్ను చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్ బౌలింగ్లో.. ఐదో బంతికి రివర్స్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా పాయింట్ ఫీల్డర్ చేతికి వెళ్లింది. దీంతో పంత్ పెవిలియన్కు చేరాడు. కాగా ఓ వైపు వికెట్లు కోల్పోతున్న క్రమంలో పంత్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో నిర్లక్షమైన షాట్ ఆడి పెవిలియన్కు చేరిన పంత్పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు అటువంటి షాట్ ఆడావు అంటూ పంత్పై హిట్మ్యాన్ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో దినేష్ కార్తీక్కు పక్కన పెట్టి మరీ పంత్ను తీసుకున్నారు. All The Best @RishabhPant17 🥺🥺#RohitSharma #RishabPant #INDvsPAK pic.twitter.com/LwDu5sqInF — 𝓒𝓱𝓲𝓴𝓾 (@Chiku2324) September 4, 2022 చదవండి: Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు -
అర్ష్దీప్ బంగారం.. అతడిని నిందించడం ఆపండి: భారత మాజీ స్పిన్నర్
Asia Cup 2022 Ind Vs Pak- Arshdeep Singh Drops Catch: టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్కు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ క్యాచ్ను వదిలేయరని.. అర్ష్దీప్ను విమర్శించడం మానుకోవాలని సూచించాడు. పాకిస్తాన్ మెరుగ్గా ఆడిన విషయాన్ని గమనించాలని.. అంతేతప్ప భారత జట్టుపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సూపర్-4 తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. బౌలర్ల వైఫల్యం కారణంగా 181 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా ఆఖర్లో రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇవ్వడం.. కీలక సమయంలో అర్ష్దీప్ క్యాచ్ నేలపాలు చేయడం పాక్కు కలిసి వచ్చింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో గెలుపు పాక్ సొంతమైంది. విమర్శల వర్షం.. అండగా భజ్జీ ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అర్ష్దీప్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇందుకు ట్విటర్ వేదికగా స్పందించిన హర్భజన్ సింగ్.. విమర్శకుల తీరుపై మండిపడ్డాడు. ఈ మేరకు.. ‘‘అర్ష్దీప్ సింగ్ను నిందించడం ఆపండి. కావాలని ఎవరూ క్యాచ్ వదిలేయరు. భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లను చూసి మనం గర్వించాలి. నిజానికి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మెరుగ్గా ఆడింది. కానీ అందుకు అర్ష్నున, మన జట్టును తప్పుబడుతూ వారిని అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు. అర్ష్ బంగారం’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్, కోహ్లి సైతం ఇక టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం అర్స్దీప్కు అండగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచించాడు. అదే విధంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని.. ఒత్తిడి ఉన్నపుడు ఇలాంటివన్నీ సహజమని అర్ష్దీప్నకు మద్దతుగా నిలిచాడు. కట్టుదిట్టంగానే బౌలింగ్.. కానీ కాగా పాక్తో మ్యాచ్లో మొత్తంగా 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్దీప్ 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తన వల్ల లైఫ్ పొందిన అసిఫ్ అలీని అవుట్ చేశాడు. రవి బిష్ణోయి మినహా మిగతా బౌలర్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో ఈ యువ ఫాస్ట్బౌలర్ మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ అసలైన క్యాచ్ జారవిడవడం వల్ల విమర్శల పాలవుతున్నాడు. చదవండి: Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు Asia Cup 2022 - Ind Vs Pak: పంత్పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..? Stop criticising young @arshdeepsinghh No one drop the catch purposely..we are proud of our 🇮🇳 boys .. Pakistan played better.. shame on such people who r putting our own guys down by saying cheap things on this platform bout arsh and team.. Arsh is GOLD🇮🇳 — Harbhajan Turbanator (@harbhajan_singh) September 4, 2022 Arshdeep is a strong character. Stay that way boy. @arshdeepsinghh — Irfan Pathan (@IrfanPathan) September 4, 2022 -
'అర్ష్దీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ ఇవ్వాలి.. ఎందుకంటే'
Asia Cup 2022 Ind Vs Pak- Arshdeep Singh: ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా పాక్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ వేసిన బౌలింగ్లో.. అసిఫ్ అలీ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో షార్ట్ థర్డ్మెన్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్ష్దీప్ సింగ్.. ఈజీ క్యాచ్ను జారవిడిచాడు. ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆసిఫ్ అలీ 16 పరుగులు సాధించి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఈ క్రమంలో ఆర్ష్దీప్ సింగ్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారత్ ఓటమికి బాధ్యుడు అతడే అని అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. 'అర్ష్దీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ ఇవ్వాలి.. అది కూడా పాక్ తరపున' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆటలో ఇటువంటి తప్పిదాలు సహజమే అంటూ అర్ష్దీప్కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్ Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు Every Indian to Arshdeep Singh when he dropped the catch #INDvsPAK2022 #INDvsPAK pic.twitter.com/oe4oNZFWn6 — Just Another Guy (@JustNotherGuy11) September 4, 2022 Arshdeep Singh winning Man of the Match, but from Pakistan's side.#INDvPAK #AsiaCupT20 pic.twitter.com/P1mftciIhx — Duke 🦁 (@DukeForPM7) September 4, 2022 చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్ -
ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు
Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Virat Kohli Comments: ఆసియా కప్-2022 టోర్నీలో అద్బుత ఇన్నింగ్స్ ఆడుతూ విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెబుతున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. మెగా ఈవెంట్కు ముందు నిలకడలేమి ఫామ్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ మాజీ సారథి. అయితే, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీలో అడుగుపెట్టి.. తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఆసియా కప్ టీ20 ఈవెంట్లో దాయాది పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో 35 పరుగులు చేశాడు కోహ్లి. ఇక హాంగ్ కాంగ్తో మ్యాచ్లో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే విధంగా సూపర్-4 తొలి మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థిపై 60 పరుగులు సాధించి సత్తా చాటాడు. కానీ, బౌలర్ల వైఫల్యం కారణంగా ఈ మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పలేదు. ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. తనను విమర్శిస్త్ను వారికి దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా.. నిజాయితీగా సలహాలు ఇచ్చేవాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటూ విమర్శకులకు చురకలు అంటించాడు. టీవీతో ముందు కూర్చుని ఏదో వాగినంత మాత్రాన తాను పట్టించుకోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజాయితీ ఉన్నవాళ్లైతే.. టీవీల్లో వాగరు! ఈ మేరకు.. ‘‘నేను టెస్టు కెప్టెన్సీ వదిలేసినపుడు.. నాకు కేవలం ఒకే ఒక వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. గతంలో నేను ఎంతో మంది ప్లేయర్లతో కలిసి ఆడాను. చాలా మంది దగ్గర నా ఫోన్ నంబర్ కూడా ఉంది. కానీ వాళ్లెవరూ కనీసం నన్ను పలకరించలేదు. అయితే, టీవీ చర్చల్లో మాత్రం నాకు సలహాలు ఇస్తుంటారు. ఇంతకీ నాకు మెసేజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరంటే.. ఎంఎస్ ధోని. నిజంగా మనకు ఒకరిపట్ల గౌరవం, వారు బాగు పడాలని కోరుకునే మంచి మనసు ఉంటే.. ఆయనలా ప్రవర్తిస్తారు. నిజానికి ఆయన నుంచి నేను ఏమీ ఆశించలేదు. ఆయన కూడా అంతే. నా నుంచి ఏమీ ఆశించలేదు. ధోని కెప్టెన్సీలోనే నేను.. నా సారథ్యంలో ధోని ఆడినపుడు మేము ఎప్పుడూ అభద్రతా భావానికి గురికాలేదు. నేను చెప్పేది ఏమిటంటే.. ఒకరికి నిజంగా మనం మంచి చేయాలనుకుంటే.. సహాయం చేయాలని భావిస్తే.. వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి. ఉపయోగకరంగా ఉంటుంది. వాటికి విలువ ఉండదు అంతేకానీ.. టీవీ చర్చల్లో.. ప్రపంచం అంతా చూస్తుండగా.. నాకు సలహాలు ఇస్తే వాటికి ఏమాత్రం విలువ ఉండదు. అలాంటి వారి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నేరుగా మాట్లాడినపుడే ఎదుటి వ్యక్తి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. నిజానికి టీవీల్లో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్లను నేను పట్టించుకోను. వాళ్ల బుద్ధి ఎలాంటిదో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. విజయవంతంగా ముందుకు సాగేందుకు దారిని మాత్రమే చూపిస్తాడు. అయితే, దానిని ఎలా వినియోగించుకున్నామన్నది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఇతరుల పట్ల ఎలా మసలుకోవాలో మన ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని కోహ్లి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వారిని ఉద్దేశించేనా? కాగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ తర్వాత కోహ్లి స్వయంగా టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేశాడు. అయితే, అనూహ్య రీతిలో అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి తనకు తానుగా తప్పుకొన్నాడు. కోహ్లి వైదొలిన తర్వాత రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు సారథిగా నియమితుడయ్యాడు. ఇక కోహ్లి తాజా వ్యాఖ్యలు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సహా తనను విమర్శించిన లెజెండ్ కపిల్ దేవ్ వంటి వాళ్లను ఉద్దేశించినవే అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్! వైరల్ Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్ -
Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం: రోహిత్
Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Rohit Sharma Comments On Loss: ‘‘ఇది ప్రతిష్టాత్మక మ్యాచ్. కాబట్టి తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్, నవాజ్ల జోడీని విడదీయలేకపోయాం. వారిద్దరి అద్భుతమైన భాగస్వామ్యం మా విజయావకాశాలను దెబ్బకొట్టింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తాము మెరుగైన స్కోరు నమోదు చేసినా దానిని కాపాడుకోలేకపోయామంటూ విచారం వ్యక్తం చేశాడు. మెరుగైన స్కోరే! ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిజ్వాన్, నవాజ్ జోరుకు బ్రేక్ వేయలేకపోయిన భారత బౌలర్లు టీమిండియా స్టార్ బ్యాటర్ 60 పరుగులతో భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. ఆదిలోనే కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పట్టుదలగా నిలబడ్డాడు. 51 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 15 పరుగులకే పెవిలియన్ చేరినా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మహ్మద్ నవాజ్ 20 బంతుల్లోనే 42 పరుగులు సాధించి పాక్ విజయానికి బాటలు వేశాడు. రవి, భువీ, అర్ష్దీప్.. ఇక 18, 19 ఓవర్లలో భారత బౌలర్లు రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్ వైడ్ల రూపంలో భారీగా పరుగులు సమర్పించుకోవడం.. కీలక సమయంలో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ను అర్ష్దీప్ వదిలేయడం వంటి పరిణామాల నేపథ్యంలో గెలుపు పాక్ను వరించింది. ఐదు వికెట్ల తేడాతో భారత్ దాయాది చేతిలో ఓటమి పాలైంది. మాకంటే పాక్ మెరుగ్గా ఆడింది ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆటగాళ్లు తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఈ మ్యాచ్లో తాము చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నాడు. ‘‘వాళ్ల జట్టులో కూడా క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. సమయం వచ్చినపుడు తమను తాము నిరూపించుకున్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. నిజానికి సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని తెలుసు. అయితే, 180 పరుగులు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మేము మెరుగైన స్కోరే నమోదు చేశాం. అయితే, దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యాం. కోహ్లిపై రోహిత్ ప్రశంసలు ఈ మ్యాచ్లో క్రెడిట్ పాకిస్తాన్కే దక్కుతుంది. మాకంటే వాళ్లు బాగా ఆడారు’’ అని రోహిత్ అన్నాడు. ఇక జట్టుకు అవసరమైన సమయంలో రాణించాడంటూ హిట్మ్యాన్.. విరాట్ కోహ్లిని ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ వికెట్లు కోల్పోయిన సమయంలో తను బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. చదవండి: Asia Cup 2022: 'కింగ్ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే' Asia Cup 2022: పాక్పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత! Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్! వైరల్ A brilliant 60 off 44 deliveries from @imVkohli makes him our Top Performer from the first innings. A look at his batting summary here 👇👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/VPEfamGENJ — BCCI (@BCCI) September 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాకిస్తాన్తో పోరులో భారత్కు తప్పని నిరాశ (ఫోటోలు)
-
Ind Vs Pak: ఏయ్.. నువ్వేం చేశావో అర్థమైందా అసలు? అర్ష్దీప్పై మండిపడ్డ రోహిత్
Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Arshdeep Singh Drops A Sitter: ఆసియా కప్-2022 టోర్నీ సూపర్-4లో మొదటి మ్యాచ్లోనే టీమిండియాకు పరాభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. భారత బ్యాటర్లు ఆకట్టుకున్నా.. బౌలర్లు విఫలం కావడంతో హోరాహోరీ మ్యాచ్లో దాయాదిదే పైచేయి అయింది. ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్లో అర్ష్దీప్ జారవిడిచిన క్యాచ్ వల్ల రోహిత్ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అర్ష్దీప్ తప్పిదంతో బతికిపోయిన పాక్ ఆటగాడు అసిఫ్ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ బాదాడు. ఇక ఆఖరి ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లోనూ మరోసారి బంతిని బౌండరీకి తరలించాడు. చివరి ఓవర్ నాలుగో బంతికి అసిఫ్ అలీని అర్ష్దీప్ అవుట్ చేసినా అప్పటికే మ్యాచ్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి రెండు బంతుల్లో పాక్ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఇఫ్తికర్ అహ్మద్ లాంఛనం పూర్తి చేసి తమ జట్టును గెలిపించాడు. అర్ష్దీప్పై అరిచిన రోహిత్ కీలకమైన సమయంలో అర్ష్దీప్ క్యాచ్ నేలపాలు చేయడంతో ఉత్కంఠగా మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక మైదానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే దాయాదితో ప్రతిష్టాత్మక పోరు.. అందునా పట్టు బిగించే తరుణంలో అర్ష్దీప్ క్యాచ్ అందుకోలేకపోవడంతో హిట్మ్యాన్ సహనం కోల్పోయాడు. ‘ఏంటిది.. ఏం చేశావో అర్థమైందా నీకసలు’ అన్నట్లుగా అరుస్తూ అర్ష్దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా భారత్కు ఓటమి ఎదురైన నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం బౌలర్ల తీరుపై గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇక టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి టాప్ స్కోరర్గా నిలిచాడు. 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు కోహ్లి. చదవండి: Asia Cup 2022: 'కింగ్ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే' Asia Cup 2022: పాక్పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత! pic.twitter.com/YoptT7KBuu — Guess Karo (@KuchNahiUkhada) September 5, 2022 A brilliant 60 off 44 deliveries from @imVkohli makes him our Top Performer from the first innings. A look at his batting summary here 👇👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/VPEfamGENJ — BCCI (@BCCI) September 4, 2022 -
'కింగ్ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే'
ఆసియాకప్-2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో వరుసగా కోహ్లి వరుసగా రెండో ఆర్ధసెంచరీ సాధించాడు. హాంగ్కాంగ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కింగ్.. పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లోనూ తన బ్యాట్ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్లో 44 బంతుల్లో 60 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఇన్నింగ్స్లో 4 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 154 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి తిరిగి తన రిథమ్ను పొందడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన క్రికెటర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'కింగ్ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే' అంటూ కామెంట్ చేశాడు. #ViratKohli #RohitSharma #KingKohli #Virat #Kohli pic.twitter.com/ajSFFego9K — Shrivizhnu.offl (@shrivizhnu) September 1, 2022 Finished? Not a T20 Player? Time to sit back and just enjoy the greatness which is Virat Kohli 🔥#INDvPAK #AsiaCup2022 #Indiancricketteam pic.twitter.com/ZedRgTZjwZ — Sportskeeda (@Sportskeeda) September 4, 2022 చదవండి: Asia Cup 2022: పాక్పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత! -
పాక్పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత!
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్ తలా వికెట్ సాధించారు. పాక్పై భారత బ్యాటర్ల సరికొత్త చరిత్ర టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 54 పరుగులు అందించారు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీ20ల్లో పాకిస్తాన్పై భారత్ తమ అత్యధిక పవర్ప్లే స్కోరు నమోదు చేసింది. అంతకుముందు 2012లో పాకిస్తాన్పై భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోయి 48 పరుగులు చేసింది. చదవండి: Asia Cup 2022 IND VS PAK: చేలరేగిన కింగ్ కోహ్లి.. పాకిస్తాన్ టార్గెట్ 182 పరుగులు -
Asia Cup 2022 IND VS PAK: ఉత్కంఠ పోరులో పాక్ విజయం
దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పాక్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్లో.. ఆసిఫ్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను అర్ష్దీప్ సింగ్ జారవిడిచాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ ఫలితం తారుమారు అయిపోయింది. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆసిఫ్ అలీ 16 పరుగులు సాధించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. మహ్మద్ నవాజ్(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, బిష్ణోయ్, ఆర్ష్దీప్, హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) అర్ధ సెంచరీతో చేలరేగగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. 147 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్(71) వికెట్ పాక్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పాక్ విజయానికి 18 బంతుల్లో 33 పరుగులు కావాలి. మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 136 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న నవాజ్(42).. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. పాక్ విజయానికి అఖరి నాలుగు ఓవర్లలో 43 పరుగులు కావాలి. 14 ఓవర్లకు స్కోర్: 119/2 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ధీటుగా ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్(55), నవాజ్(33) పరుగులతో ఉన్నారు. 12 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్: 96/2 12 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్(46), నవాజ్(20) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 63 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జమాన్.. చాహల్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 9 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్: 67/2 8 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్: 57/1 8 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్(32), ఫఖర్ జమాన్(10) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. బాబర్ ఔట్ 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బాబర్ ఆజాం.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 4 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్: 22/1 చేలరేగిన కింగ్ కోహ్లి.. పాకిస్తాన్ టార్గెట్ 182 పరుగులు పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) అర్ధ సెంచరీతో చేలరేగగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్ తలా వికెట్ సాధించారు. అర్ధసెంచరీతో చేలరేగిన కింగ్ కోహ్లి పాకిస్తాన్తో మ్యాచ్లో కింగ్ కోహ్లి అద్భుతమైన అర్ధసెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కోహ్లి తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్ 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియాకు బిగ్ షాక్.. హార్దిక్ ఔట్ టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగాడు. మహ్మద్ హస్నైన్ బౌలింగ్లో నవాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులో దీపక్ హుడా, విరాట్ కోహ్లి ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 126 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన పంత్.. షాదాబ్ ఖాన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. 13 ఓవర్లకు టీమిండియా స్కోర్: 118/3 13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(33), పంత్(9) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నవాజ్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్(13) ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్ 62 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రాహుల్(28).. షాదాబ్ ఖాన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, కోహ్లి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 54 పరుగులు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. హరీస్ రౌఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. దూకుడుగా ఆడుతోన్న భారత ఓపెనర్లు టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), కేఎల్ రాహుల్(19) పరుగులతో ఉన్నారు. రెండు ఓవర్లకు భారత్ స్కోర్: 20/0 రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(15), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. ఆసియాకప్-2022లో భాగంగా సూపర్-4 దశలో భారత్- పాక్ జట్లు దుబాయ్ వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్కు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్కు జట్టులో చోటు దక్కలేదు. ఇక హాంగ్ కాంగ్తో మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా తిరిగి జట్టలోకి వచ్చాడు. అదే విధంగా దీపక్ హుడా, రవి బిష్ణోయ్కు తొలిసారిగా తుది జట్టులోకి చోటు దక్కింది. మరోవైపు పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయ పడిన పేసర్ దహాని స్థానంలో మహ్మద్ హస్నైన్కకు చోటుదక్కింది. తుది జట్లు టీమిండియా: రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ పాకిస్తాన్: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ! -
పాక్పై ఒక్కసారి కూడా పేలని హిట్మ్యాన్ తూటా.. ఆందోళనలో అభిమానులు
అంతర్జాతీయ టీ20ల్లో దాదాపు అన్ని దేశాలపై ఘనమైన రికార్డు కలిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. దాయాది పాక్పై మాత్రం పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 134 మ్యాచ్లు ఆడి 139.8 స్ట్రయిక్ రేట్తో 4 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 3520 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. పాక్పై 9 టీ20ల్లో 13.66 సగటున 112.32 స్ట్రయిక్ రేట్తో కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్కసారి కూడా అర్ధసెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చేసిన 30 పరుగులకే ఇప్పటివరకు అతని అత్యధిక స్కోర్గా కొనసాగుతుంది. నాటి మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్.. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆతర్వాత 15 ఏళ్లుగా రోహిత్ ఒక్కసారి కూడా కనీసం 30 పరుగుల మార్కును అందుకోలేకపోవడం విచారకరం. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్లోనూ హిట్మ్యాన్ మరోసారి విఫలమయ్యాడు. 18 బంతులు ఆడి ఓ సిక్సర్ సాయంతో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. టీ20ల్లో ఇలా ఉంటే, పాక్పై వన్డేల్లో రోహిత్కు మంచి రికార్డే ఉంది. కెరీర్ మొత్తంలో దాయాదితో 17 సార్లు తలపడగా.. 48.66 సగటున 730 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్లో 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చేసిన 140 పరుగులు హిట్మ్యాన్ కెరీర్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. పాక్పై వన్డేల్లో పర్వాలేదనిపిస్తూ, టీ20ల్లో ఫ్లాప్ అవుతున్న హిట్మ్యాన్ నుంచి అతని అభిమానులు భారీ ఇన్నింగ్స్ను ఆశిస్తున్నారు. ఇవాల్టి మ్యాచ్లో ఎలాగైనా చెలరేగి హిట్మ్యాన్ పేరుకు సార్ధకత చేకూర్చాలని కోరుకుంటున్నారు. చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్.. అవేష్ ఖాన్కు నో ఛాన్స్! భారత యువ పేసర్ ఎంట్రీ! -
పాకిస్తాన్తో మ్యాచ్.. అవేష్ ఖాన్కు నో ఛాన్స్! భారత యువ పేసర్ ఎంట్రీ!
ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ లీగ్ దశలో పాక్ను మట్టికరిపించిన టీమిండియా.. ఈ మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో స్టాండ్బైగా ఉన్న పేస్ బౌలర్ దీపక్ చహర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న అవేష్ ఖాన్ పక్కన బెట్టి చహర్ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు చాహర్ నెట్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాబట్టి పాక్తో మ్యాచ్కు చాహర్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. చాహర్ పవర్ప్లే కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్కు ముందు గాయపడిన చాహర్.. తిరిగి జింబాబ్వే సిరీస్తో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన చాహర్ 5 వికెట్లతో అదరగొట్టాడు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ! -
పాకిస్తాన్తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!
ఆసియాకప్-2022లో మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఇకఈ టోర్నీ లీగ్ మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. ఈ మ్యాచ్లో విజయం సాధించి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. మరో వైపు భారత్ మాత్రం దాయాది జట్టును మరోసారి మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్గా( మెన్స్ అండ్ వుమెన్) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సుజీ బేట్స్ 3531 పరుగులతో తొలి స్థానంలో ఉంది. ఈ జాబితాలో రోహిత్ శర్మ 3520 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 12 పరుగులు సాధిస్తే బేట్స్ను ఆధిగమించి తొలి స్థానానికి చేరుకుంటాడు. చదవండి: IND Vs PAK Super-4: 'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు! -
బిగ్బాస్6: తొలి రోజే భారీ దెబ్బ.. ఆ గండం నుంచి ‘బిగ్బాస్’ బయటపడేనా?
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. మరికొద్ది గంటల్లో బిగ్బాస్ 6 ప్రారంభం కానుంది. ఈ రోజు (సెప్టెంబర్ 4) సాయంత్రం 6 గంటలకు స్టార్మా ఈ షో ప్రసారం కానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. నేడు అంగరంగ వైభవంగా ఆరో సీజన్ ప్రారంభం కానుంది. అయితే తొలి రోజే బిగ్బాస్కి భారీ దెబ్బ పడనుంది. ఈ బిగ్ రియాల్టీ షోని గ్రాండ్గా లాంచ్ చేసి మంచి టీఆర్పీ రేటింగ్ని సాధించాలని భావించిన మేకర్స్ ఆశలకు గండి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. (చదవండి: ప్రోమో వచ్చేసింది.. ఈ కంటెస్టెంట్స్ని గుర్తు పట్టారా?) ఈ షో ప్రారంభం సమయంలోనే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో నేడు భారత్-పాక్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ఎఫెక్ట్ కచ్చితంగా ‘బిగ్బాస్’పై పడుతుంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. బిగ్బాస్ షోని ఇష్టపడే యువతలో కూడా చాలామంది క్రికెట్ ప్రియులు ఉంటారని.. వాళ్ల మొదటి ప్రాధాన్యత ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కే ఉంటుందని కొంతమంది సీనీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ క్రికెట్ గండం నుంచి ‘బిగ్బాస్’ బయట పడి మంచి టీఆర్పీ రేటింగ్ని సాధిస్తాడో లేదో చూడాలి. -
పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్కు అనారోగ్యం
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో ఇవాళ (సెప్టెంబర్ 4) భారత్-పాక్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ కీలక సమరానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు జట్టు కోచ్ ద్రవిడే స్వయంగా ప్రకటించాడు. ఆవేశ్ జ్వరంతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని, అందుకే అతను ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని మీడియాకు వివరించాడు. అయితే హెడ్ కోచ్ మాటలను బట్టి చూస్తే పాక్తో కీలక సమరంలో ఆవేశ్ ఆడటం అనుమానమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆవేశ్.. పాక్తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాకపోయినా, తదుపరి మ్యాచ్ల సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ఈ సందర్భంగా ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఆవేశ్ తుది జట్టులో ఉండడనడానికి పరోక్ష సంకేతంగా భావిస్తున్నారు టీమిండియా అభిమానులు. Rahul Dravid gives an update on Avesh Khan ahead of India's clash against Pakistan.#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/hB1PHLEFfk — CricTracker (@Cricketracker) September 3, 2022 ఒకవేళ ఆవేశ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే, తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆవేశ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియాలో మరో స్పెషలిస్ట్ పేసర్ లేకపోవడంతో, అశ్విన్తో ఆ ప్లేస్ను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే పాక్తో మ్యాచ్లో పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో అశ్విన్, చహల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయపడి టోర్నీకి దూరమైన ఆల్రౌండర్ జడేజా స్థానాన్ని దీపక్ హుడా భర్తీ చేసే అవకాశం ఉంది. వికెట్కీపర్గా ఎవరిని ఆడించాలనే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫినిషర్ కోటాలో డీకేనే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఇది జరిగితే పంత్ మళ్లీ పెవిలియన్కు పరిమితం కాక తప్పదు. భారత్ తుది జట్టు(అంచనా).. రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్ చదవండి: 'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు! -
'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు!
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల కామెంట్లు తారాస్థాయిలో ఉంటాయి. మా జట్టు ఫెవరెట్ అని గొప్పలు చెప్పుకున్నప్పటికి.. ఆరోజు మ్యాచ్లో ఎవరు మంచి ప్రదర్శన చేస్తే వారికే విజయం దక్కుతుంది. తాజాగా మరికొద్ది గంటల్లో ఆసియాకప్ 2022లో భాగంగా భారత్, పాకిస్తాన్లు సూపర్-4లో మరోసారి తలపడనున్నాయి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్న సంగతి పక్కనబెడితే.. ఈ ఆదివారం హోరాహోరి పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ టీమిండియా విజయం సాధించి ఆధితప్యం చెలాయించాలని చూస్తుంటే.. పాక్ మాత్రం ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక పాక్ అభిమాని తన ట్విటర్లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలుతుంది.. పాక్కు భారీ విజయం ఖాయం అంటూ పోస్ట్ చేశాడు. '' హాంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38 పరుగులకే ఆలౌటైంది. అదే ప్రదర్శనను పాక్ బౌలర్లు భారత్పై చేస్తారని ఊహించుకోండి.. ఫలితం మీకే కనిపిస్తుంది.. టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాజయం మూటగట్టుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు. పాక్ అభిమాని పోస్ట్ చూసిన భారత్ ఫ్యాన్స్ ఊరుకుంటారా. వెంటనే సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకసారి జరిగిందని ప్రతీసారి జరగాల్సిన అవసరం లేదు..'' కలల కనొచ్చు తప్పులేదు.. కానీ మీకు అంత సీన్ లేదు..''.. అదే 36 పరుగుల విషయంలో సీన్ రివర్స్ అయితే.. ఎలా ఉంటుంది'' అంటూ విమర్శలు వర్షం కురిపించారు. ఇక మరొక భారత అభిమాని మాత్రం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ''అవును టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కావొచ్చు.. కానీ చేధనలో మీ జట్టు(పాకిస్తాన్) 33 పరుగులకే కుప్పకూలనుంది. మా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్లోనే బెస్ట్ స్పెల్(3-1-6-9) నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోనున్నాడని ఊహించుకున్నాం.. ఇప్పుడేం చేస్తావు'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. Imagine Pakistan repeating the same bowling performance as of yesterday tomorrow as well and get India all out on 36 😭😭 — Fakhruu :^) 🏏 (@BajwaKehtaHaii) September 3, 2022 And there comes pakistan's batsmen to chase 37. 💥 . . . . . . . Ruko jara sabar Karo!!!🤚 . . . . Surprise surprise.... . Pak all out on 33/10. Bhuvi adjudged M.O.M for his best T20i performance of 3-1-6-9.💥 — Srinath Somani (@srinathsomani06) September 3, 2022 Once more today 😭😂 pic.twitter.com/bm4yY2OaZP — Nameisdarshan (@lingraddi) September 4, 2022 Than Imagine Pakistan lost by 6 runs — Naresh Malvi (@Naresh_Malvi1) September 3, 2022 చదవండి: 'ఆసియా కప్లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది' Mushfiqur Rahim: టీ20లకు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్ -
టీ20లకు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
పొట్టి క్రికెట్ నుంచి సీనియర్లు వరుసగా వైదొలుగుతుండటంతో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక వరుస పరాజయాల బాట పట్టిన బంగ్లాదేశ్కు తాజాగా మరో షాక్ తగిలింది. ఆ జట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, స్టార్ వికెట్కీపర్ ముష్ఫికర్ రహీం.. పొట్టి క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేశాడు. టెస్ట్లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు రహీం వెల్లడించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా.. ఫ్రాంచైజీ క్రికెట్కు మాత్రం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15 — Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022 రహీం.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో బ్యాటింగ్, వికెట్కీపింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన (1, 4 పరుగులు) కనబర్చి జట్టు పరాజయాలకు పరోక్ష కారణంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో కీలక సమయంలో క్యాచ్ను జారవిడిచి తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కారణమయ్యాడు. కాగా, తమ కంటే చిన్న జట్ల చేతుల్లో కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఇది రెండో షాక్ అని చెప్పాలి. ఇదే ఏడాది జులైలో సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ టీ20లకు గుడ్బై చెప్పి తొలి షాకివ్వగా.. తాజాగా ముష్ఫికర్ బంగ్లాను మరో దెబ్బేశాడు. 35 ఏళ్ల ముష్ఫికర్.. బంగ్లా తరఫున 82 టెస్ట్ల్లో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5235 పరుగులు, 236 వన్డేల్లో 8 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీల సాయంతో 6774 పరుగులు, 102 టీ20ల్లో 115 స్ట్రయిక్ రేట్తో 6 హాఫ్ సెంచరీ సాయంతో 1500 పరుగులు సాధించాడు. వికెట్కీపింగ్లో రహీం అన్ని ఫార్మాట్లలో కలిపి 449 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: 'ఆసియా కప్లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది' -
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్ఘాన్ యువ బ్యాటర్.. ఆసియా కప్లో ఇదే బెస్ట్
ఆసియా కప్ 2022 సూపర్-4 దశ మ్యాచ్ల్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 3) ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక.. ఆఫ్ఘాన్ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి గ్రూప్ దశలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్కు శుభారంభం లభించినా.. ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టలేక భారీ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడి 19.1 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఎంతలా అంటే ఆఫ్ఘాన్ మ్యాచ్ ఓడినా గుర్భాజ్నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుర్భాజ్.. ఈ ఇన్నింగ్స్ ద్వారా పలు రికార్డులకు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డుతో (22 బంతుల్లో) పాటు ఆసియా కప్ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియాకప్ టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డు గతంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2016లో బంగ్లాదేశ్పై 55 బంతుల్లో 83 పరుగులు) పేరిట ఉండేది. నిన్నటి మ్యాచ్తో గుర్భాజ్ రోహిత్ రికార్డును బద్దలు కొట్టి ఆసియా కప్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో సూపర్ ఫామ్లో ఉన్న గుర్భాజ్.. 3 మ్యాచ్ల్లో 167 స్ట్రయిక్ రేట్తో 45 సగటున 135 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. శ్రీలంకపై తొలి మ్యాచ్లో 18 బంతుల్లో 40 పరుగులతో విధ్వంసం సృష్టించిన గుర్భాజ్.. ఆతర్వాత బంగ్లాదేశ్తో (11) జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు. చదవండి: 'ఆడింది చాలు పెవిలియన్ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం -
'ఆసియా కప్లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది'
టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లుకు ఆస్కారం లేకపోవడంతో కేవలం మెగాటోర్నీల్లో మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. తాజాగా ఆసియా కప్లో వారం గ్యాప్ వ్యవధిలో రెండోసారి ఎదురుపడుతున్నాయి. మరి లీగ్ దశలో టీమిండియాతో చేతిలో ఓడిన పాకిస్తాన్ సూపర్-4 దశలో భారత్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ టీమిండియాతో మ్యాచ్కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రిజ్వాన్ మాటల మధ్యలో జోకులు వేసి నవ్వించాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్నుద్దేశించి.. '' వారం వ్యవధిలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగడం రెండోసారి. రెండుజట్లు ఎప్పుడు తలపడినా రసవత్తర పోరు ఖాయం. అయితే ముచ్చటగా మూడోసారి కూడా మ్యాచ్ జరగాలని.. అది వచ్చే ఆదివారం ఫైనల్ మ్యాచ్ కావాలని ఇరుదేశాల అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఫలించాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇది చూసిన తర్వాత ఒక జోక్ చెప్పాలనిపిస్తుంది. నాకైతే ఆసియా కప్ ఆడుతున్నట్లు లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్ సిరీస్ ఆడుతున్నట్లుగా ఉంది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. అయితే యాదృశ్చికమో లేక అలా జరగాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ.. రిజ్వాన్ చెప్పిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తున్నాయి. పేరుకే ఆసియా కప్ టోర్నీగా పెట్టి.. భారత్, పాకిస్తాన్ల మధ్య దైపాక్షిక సిరీస్కు బదులు ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే.. కచ్చితంగా వచ్చే ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్-పాకిస్తాన్లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉందని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్లో 36 పరుగులు చేసిన రిజ్వాన్.. హాంగ్ కాంగ్తో మ్యాచ్లో 78 పరుగులు నాటౌట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా ఫఖర్ జమాన్ ఫిప్టీ చేయగా.. చివర్లో కుష్దిల్ షా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా 193 పరుగుల భారీ స్కోరు చేసిన పాక్.. అనంతరం హాంగ్ కాంగ్ను 38 పరుగులకే కుప్పకూల్చి 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సూపర్-4లో అడుగుపెట్టిన పాక్.. భారత్తో మ్యాచ్కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో Chamika Karunaratne: 'నాలుగేళ్ల పగను మనసులో దాచుకున్నా'.. అందుకే నాగిన్ డ్యాన్స్ -
'ఆడింది చాలు పెవిలియన్ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం
ఆసియా కప్ టోర్నీ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతుందని మనం అనుకునేలోపే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం సూపర్-4లో భాగంగా అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్లో రషీద్ ఖాన్, దనుష్క గుణతిలకల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 17 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులతో ఆడుతోంది. గుణతిలక, రాజపక్సలు సమన్వయంతో ఆడుతూ లంకను విజయపథంవైపు నడిపిస్తున్నారు. అప్పటికే 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక 17వ ఓవర్ రషీద్ ఖాన్ వేశాడు. వేసిన తొలి బంతినే దనుష్క బౌండరీగా మలిచాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన రషీద్.. దనుష్కపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా దనుష్క గుణతిలక కూడా రషీద్కు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బానుక రాజపక్స వచ్చి వారిద్దరిని విడదీసి రషీద్కు సర్దిచెప్పాడు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే ఓవర్ నాలుగో బంతికి గుణతిలక క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇక పెవిలియన్ వెళ్లు అంటూ రషీద్ తన చేతితో గుణతిలకకు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్ అంతా సమిష్టిగా రాణించడంతో విజయాన్ని అందుకుంది. బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అదరగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్లు), ఇబ్రహీమ్ జద్రాన్ (40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. SL vs AFG - Rashid Khan pic.twitter.com/EbNMcojZo9 — MohiCric (@MohitKu38157375) September 3, 2022 చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో AFG Vs SL Super-4: టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి -
భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో
ఆసియా కప్ టోర్నీలో వారం గ్యాప్ వ్యవధిలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్లు మరోసారి తలపడనున్నాయి. లీగ్ దశలో పాక్ను చిత్తు చేయడమే గాక.. హాంగ్ కాంగ్పై విజయం సాధించిన గ్రూఫ్ టాపర్గా నిలిచిన టీమిండియా మరోసారి ఫెవరెట్గా కనిపిస్తుంది. అయితే హాంగ్ కాంగ్తో మ్యాచ్లో భారీ విజయం సాధించిన పాకిస్తాన్ మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ముఖ్యంగా పాక్ బౌలర్లు హాంగ్ కాంగ్ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయం. వాస్తవానికి ఆసియా కప్లో బరిలోకి దిగిన టీమిండియా జట్టులో బౌలింగ్ విభాగం కాస్త వీక్గా కనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండడంతో బౌలింగ్ లోపాలు బయటపడడం లేదు. భువనేశ్వర్ కుమార్ మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆవేశ్ ఖాన్ దారాళంగా పరుగులు సమర్పించుకుంటుంగా.. అర్ష్దీప్ సింగ్ వికెట్లు తీస్తున్నప్పటికి పరుగులు కూడా బాగానే ఇస్తున్నాడు. ఇక స్పిన్నర్ చహల్ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. దీనికి తోడు గాయంతో ఆల్రౌండర్ జడేజా ఆసియా కప్కు దూరమయ్యాడు. దీంతో బౌలింగ్ విభాగం మరింత వీక్ అయింది. అయితే భారత్తో పోలిస్తే పాకిస్తాన్ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్గా కనిపిస్తోంది. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ రూపంలో నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నారు. ఇదే విషయమై టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. పాక్తో పోరుకు ముందు శనివారం సాయంత్రం ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. పాకిస్తాన్ బౌలర్లంతా సెక్సీగా భారత్ బౌలర్లు లేరంటూ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' నాకు ఆ పదం వాడాలని ఉంది.. కానీ బయటికి చెప్పలేను. నా మైండ్లోకి ఆ పదం వచ్చినప్పటికి.. అభ్యంతరంగా అనిపిస్తుండడంతో నోటి వద్దే ఆగిపోయింది. అయితే అదొక నాలుగు అక్షరాల పదం.. మొదటి అక్షరం 'S'తో మొదలవుతుంది. పాకిస్తాన్ బౌలర్లు.. భారత్ బౌలర్ల కంటే పటిష్టంగా కనిపిస్తున్నారు. దీంతో మరోసారి మంచి మ్యాచ్ చూడబోతున్నాం'' అని చెప్పుకొచ్చాడు. అయితే ద్రవిడ్ ఆ అక్షరం 'S'తో మొదలవుతుంది అని చెప్పగానే అక్కడున్న రిపోర్టర్లు వెంటనే.. ద్రవిడ్ సార్ మీరేం చెప్పాలనుకున్నారో మాకు అర్థమైంది. సెక్సీ అనే పదం ఎలా అనాలో తెలియక మీరు ఇబ్బంది పడ్డారు.. మీ బాధను అర్థం చేసుకున్నాం అంటూ తెలిపారు. దీంతో ద్రవిడ్తో పాటు మిగతావాళ్లు కూడా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Can you guess what he's saying pic.twitter.com/t1w57T7fiY — Sanju Here 🤞👻 (@me_sanjureddy) September 3, 2022 చదవండి: Asia Cup 2022: భారత్, పాకిస్తాన్ మధ్య ‘సూపర్–4’ మ్యాచ్ IND Vs PAK Super-4: టీమిండియాతో మ్యాచ్కు ముందు పాక్కు ఎదురుదెబ్బ -
'నాలుగేళ్ల పగను మనసులో దాచుకున్నా'.. అందుకే నాగిన్ డ్యాన్స్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా గ్రూఫ్ దశలో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక సూపర్-4 దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్పై లంక మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ జట్టు బ్యాటర్ చమిక కరుణరత్నే నాగిన్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ట్విటర్ను షేక్ చేశాయి. తాజాగా నాగిన్ డ్యాన్స్ చేయడంపై కరుణరత్నే స్పందించాడు. నాలుగేళ్ల పగను మనుసులో దాచుకున్నానని.. అందుకే ఇవాళ నాగిన్ డ్యాన్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 2018 నిదహాస్ ట్రోఫీలో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ చేరిన క్రమంలో బంగ్లాదేశ్ కోచ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా మైదానంలో వచ్చి నాగిన్ డ్యాన్స్ చేయడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటి శ్రీలంక జట్టులో కరుణరత్నే లేకపోయినప్పటికి ఆ మ్యాచ్ను టీవీలో చూశాడు. అయితే తాను జట్టులోకి వచ్చిన తర్వాత బంగ్లదేశ్తో మ్యాచ్లు ఆడినప్పటికి అలాంటి అవకాశం రాలేదు. తాజాగా ఆసియా కప్ రూపంలో బంగ్లాదేశ్ను నాకౌట్ చేయడం.. కరుణరత్నే నాలుగేళ్ల పగను నాగిన్ డ్యాన్స్ రూపంలో బయటికి తీసి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక శనివారం జరిగిన సూపర్-4 లీగ్ దశలో అఫ్గానిస్తాన్పై విజయం సాధించిన లంక ప్రతీకారం తీర్చుకుంది. What a view Nagin Dance 🐍 🐍 By Chamika karunaratne #AsiaCupT20 #BANVSSL @ChamikaKaru29 pic.twitter.com/47yxsHLelL — Sumit Raj (@Iam_SUMITRAJ) September 1, 2022 చదవండి: బంగ్లాదేశ్పై సంచలన విజయం.. నాగిన్ డాన్స్ చేసిన శ్రీలంక ఆటగాడు! -
టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి
ఆసియా కప్ 2022లో సూపర్-4 లీగ్ దశలో అఫ్గానిస్తాన్పై శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో అఫ్గాన్ చేతిలో ఎదురైన ఓటమికి లంక బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్లో అఫ్గాన్ జట్టు చెత్త రికార్డు నమోదు చేసింది. 2015 నుంచి చూసుకుంటే అఫ్గాన్పై ఒక జట్టు అత్యధిక పరుగులను చేజింగ్ చేయడం ఇది నాలుగోసారి. ఇక అఫ్గాన్పై భారీ లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా శ్రీలంక నిలిచింది. తాజా మ్యాచ్లో లంక అఫ్గాన్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంతకముందు ఇదే ఏడాది బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్.. చేజింగ్లో 169 పరుగులు చేసి గెలిచింది. అంతకముందు రెండు సందర్భాల్లో హాంకాంగ్ జట్టు అఫ్గానిస్తాన్పై 163, 162 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇక తాజాగా షార్జా వేదికగా శ్రీలంక తమ టి20 క్రికెట్లో భారీ లక్ష్యాన్ని చేధించి రికార్డు నమోదు చేసింది. ఇక ఇదే ఆసియాకప్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో లంక భారీ లక్ష్యాలను చేధించింది. బంగ్లాదేశ్పై 184 పరుగుల చేజింగ్తో పాటు.. తాజాగా అఫ్గాన్పై 176 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: AFG Vs SL Super-4: ఆఖర్లో వచ్చి అదరగొట్టిన రాజపక్స.. లంక ప్రతీకార విజయం -
ఆఖర్లో వచ్చి అదరగొట్టిన రాజపక్స.. లంక ప్రతీకార విజయం
షార్జా: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ సూపర్–4 దశ తొలి లీగ్ మ్యాచ్లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. శనివారం జరిగిన మ్యాచ్లో 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్ అంతా సమిష్టిగా రాణించడంతో లంక విజయాన్ని అందుకుంది. అయితే ఆఖర్లో బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్లు), ఇబ్రహీమ్ జద్రాన్ (40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ 2, అస్తిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషనక తలా ఒక వికెట్ తీశారు. -
Asia Cup 2022: భారత్, పాకిస్తాన్ మధ్య ‘సూపర్–4’ మ్యాచ్
దుబాయ్: క్రికెట్ అభిమానులకు వరుసగా రెండో ఆదివారం అసలైన సాయంత్రపు వినోదం. వారం రోజుల వ్యవధిలో భారత్, పాకిస్తాన్ జట్లు రెండోసారి తలపడనున్నాయి. ఆసియా కప్ ‘సూపర్–4’ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సరిహద్దు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేని లోటును తీరుస్తూ టోర్నీలో జరుగుతున్న రెండో రౌండ్ పోరు కూడా అంతే ఆసక్తిని రేపుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో చివరి ఓవర్లో విజయంతో భారత్దే పైచేయి అయింది. రోహిత్ శర్మ సేన అదే జోరును కొనసాగిస్తుందా లేక బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాక్ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. -
అఫ్గన్ బ్యాటర్ విధ్వంసం.. లంక టార్గెట్ 176
ఆసియాకప్ 2022లో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు) మెరుపులు మెరిపించాడు. 46 పరుగుల వద్ద అఫ్గన్ తొలి వికెట్ కోల్పోయినప్పటికి ఆ తర్వాత రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్(38 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 40 పరుగులు) రాణించారు. ఇద్దరి మధ్య దాదాపు 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే చివర్లో వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో అఫ్గానిస్తాన్ స్కోరు తగ్గింది. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ 2, అస్తిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషనక తలా ఒక వికెట్ తీశారు. -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్ ఔట్
Ravindra Jadeja Set To Miss T20 World Cup: టీ20 వరల్డ్కప్ 2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్కప్కు కూడా దూరంగా కానున్నాడని తెలుస్తోంది. మోకాలి శస్త్ర చికిత్స నేపథ్యంలో జడ్డూ మెగా టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు జడేజాకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అంచనా. దీంతో జడేజా మరో ఆరు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉంటాడని సమాచారం. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాక్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. ఆతర్వాత హంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన జడేజా ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్లో జడ్డూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ అనంతరం మోకాలి గాయం తిరగబెట్టడంతో జడ్డూ టోర్నీ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. జడేజా ఇటీవలి కాలంలో వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చి పోతున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో మ్యాచ్కు ముందు పాక్కు ఎదురుదెబ్బ -
టాస్ గెలిచిన శ్రీలంక; ప్రతీకారమా.. దాసోహమా!
ఆసియాకప్-2022లో లీగ్ దశ మ్యాచ్లు శుక్రవారంతో ముగిశాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి అఫ్గానిస్తాన్, శ్రీలంక సూపర్-4లో అడుగు పెట్టాయి. ఇక ఈ మెగా టోర్నీలో సూపర్-4 దశలో శనివారం అఫ్గానిస్తాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని లంక పట్టుదలగా ఉంది. అయితే లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ మంచి విజయాలు నమోదు చేసిన అఫ్గాన్ సేనను ఏ మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. అయితే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కుషాల్ మెండిస్ సూపర్గా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది. ఆఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇక బ్యాటింగ్లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్తో పాటు నజీబుల్లా జద్రాన్ కూడా దుమ్ము రేపుతున్నాడు. కాగా ప్రస్తుత ఫామ్ను ఈ మ్యాచ్లో కూడా ఆఫ్గానిస్తాన్ కొనసాగిస్తే.. సూనయసంగా విజయం సాధించడం ఖాయం. ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిల్లోనూ విఫలమైన లంక, రెండు మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ పరంగా అదరగొట్టింది. అయితే ఆ జట్టులో అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరు కూడా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జట్టులో స్టార్ ఆల్రౌండర్ వనిందు హాసరంగా ఉన్నప్పటికీ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో లంక బౌలర్లు రాణిస్తే ఆఫ్గాన్కు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, సమీవుల్లా షిన్వారీ, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహక్మాన్, ఫజల్హాల్ శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక -
టీమిండియాతో మ్యాచ్కు ముందు పాక్కు ఎదురుదెబ్బ
ఆసియాకప్లో టీమిండియా, పాకిస్తాన్లు ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ షాహనవాజ్ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్కు దూరమయ్యాడు. నిజానికి హాంగ్ కాంగ్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తూనే దహనీ గాయపడ్డాడు. అయితే మ్యాచ్లో దహనీ తన కోటా ఓవర్లను పూర్తి చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్కు దహనీ స్థానంలో ముహ్మద్ హస్నైన్, హసన్ అలీలలో ఎవరు ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పీసీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. '' సూపర్-4లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగనున్న మ్యాచ్లో దహనీ అందుబాటులో ఉండడం లేదు. పక్కటెముకల గాయంతో మ్యాచ్కు దూరమయ్యాడు. హాంకాంగ్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడే దహనీ గాయపడ్డాడు. మరో 48 గంటలు గడిస్తే దహనీ గాయంపై మరింత స్పష్టత వస్తుంది. కాగా దహని స్థానంలో హసన్ అలీ లేదా ముహ్మద్ హస్నైన్లలో ఎవరో ఒకరు ఆడుతారు.'' అంటూ తెలిపింది. ఇక దహనీ గాయపడినా.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ల రూపంలో పాకిస్తాన్కు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. చదవండి: Mohammad Hafeez: టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం పాక్తో బిగ్ ఫైట్కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్ పెట్టుకుని..! -
టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం
మాములుగానే భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరుదేశాల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో రెచ్చిపోతారు. అయితే ఇవన్నీ క్రీడాస్పూర్తి పరిధిలోని ఉంటాయి. తాజాగా టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పొగడ్తల వర్షం కురిపించాడు. పొగడ్తలు కురిపించినప్పటికి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. మరి హఫీజ్ చేసిన వ్యాఖ్యలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ''నాకు ఎక్కువ విషయాలు తెలియవు. ఒకటి మాత్రం బాగా తెలుసు. సమాజంలో ఎవరు డబ్బు బాగా సంపాదిస్తే వారిని ప్రేమించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇది బీసీసీఐకి అక్షరాలా సరిగ్గా తూగుతుంది. ఎందుకంటే టీమిండియాను రెవెన్యూ సృష్టించే దేశం. ప్రపంచంలో ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్ జరిగినా.. అక్కడ టీమిండియా స్పాన్సర్ చేస్తే జాక్పాట్ కొట్టినట్లే. ఇలాంటి విషయాలు ఎవరు కాదనలేరు. అందుకే టీమిండియాను ''లాడ్లాస్''గా అభివర్ణిస్తా. ఎందుకంటే సంపదను వృద్ధి చేయడంలో బీసీసీఐకి ఎవరు సాటి రారు అని చెప్పుకొచ్చాడు. మహ్మద్ హఫీజ్ కోణంలో వినడానికి బాగున్నా.. అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. టీమిండియాను పొగిడినప్పటికి భారత్ అభిమానులు అతనిపై తిట్ల దండకం అందుకున్నారు. '' బీసీసీఐ సంపన్న బోర్డు అని చెప్పుకొచ్చాడు.. కానీ టీమిండియా ఆడిన క్రికెట్ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. అంటే టీమిండియా మంచి క్రికెట్ ఆడకున్నా బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తుందా.. టీమిండియా మంచి క్రికెట్ ఆడుతుంది కాబట్టే బీసీసీఐకి డబ్బులు వస్తున్నాయి. 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన తర్వాతే బీసీసీఐ అనే పేరు వినిపించింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ సంపన్న బోర్డుగా అవతరించింది. మరి దీని వెనుక ఉన్న కారణం.. ఇన్నేళ్లలో టీమిండియా మంచి క్రికెట్ ఆడడమే కదా. బీసీసీఐని సంపన్న బోర్డు అంటూనే టీమిండియాను తక్కువ చేసి మాట్లాడాడంటూ'' అభిమానులు గరం అయ్యారు. ఇక ఆసియాకప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్లు ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా జరగనున్న మ్యాచ్లో టీమిండియా మరో విజయం సాధిస్తుందా లేక పాక్ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది చూడాలి. కాగా లీగ్ దశలో పాకిస్తాన్ను టీమిండియా 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. Laadla 😍 pic.twitter.com/V48JqojFmc — Mohammad Hafeez (@MHafeez22) September 2, 2022 Kitna doglapan karte he log 🤡🤡 Pahele hamari cricket ki tarrif Abhi paiso ki kar raha Retirement ke baad 2 waqt ki roti ke liya india ka name lo Kya strategy he😂😂 pic.twitter.com/l03nq1yDdd — Borish_81🇮🇳 (@Borish81) September 2, 2022 Laadla Bowler of Pakistan 😍 A Man who can't even bowl properly is an Expert on Cricket for Pakistan. As usual Cheap Pakistani showing his HATE for India because they can't compete on Field and on Economy. Professor Check World Cup Records and Latest Bheek from IMF of $1.17 Bn.😂 pic.twitter.com/kKU1a1qlwr — Knight Rider (@iKnightRider19) September 2, 2022 India is team who proved with their performance that they are one of the best team . Even we being Pakistani knows that how good is their team . You just trying to me in limelight by passing such comments. Shame — Jahangir Ahmed 🫐 (@Jahangi13967996) September 2, 2022 చదవండి: Asia Cup 2022 Super 4: పాక్తో మ్యాచ్.. మూడు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా..! AUS Vs ZIM: టీమిండియాపై చేయలేనిది ఆసీస్తో చేసి చూపించారు