Australia vs Srilanka
-
ఉపుల్ తరంగ విధ్వంసం.. ఆసీస్పై శ్రీలంక ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో శ్రీలంక మాస్టర్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వడోదర వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక రెండో స్ధానానికి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో షాన్ మార్ష్(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 77), బెన్ డంక్(29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 56) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు.అతడితో పాటు డానియల్ క్రిస్టియన్(34), కటింగ్(19) పరుగులతో రాణించారు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్.. శ్రీలంకపై మాత్రం కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో గుణరత్నే, ఉదనా, చతురంగ డిసిల్వా తలా వికెట్ సాధించారు.తరంగ విధ్వంసం..అనంతరం 218 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ బౌలర్లను తరంగా ఉతికారేశాడు. కేవలం 54 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు లహిరు తిరమానే(34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ బెన్ లాఫ్లిన్ మూడు వికెట్లు పడగొట్టగా.. డానియల్ క్రిస్టియన్ రెండు, జేవియర్ డోహెర్టీ ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న సచిన్ సేన.. అదే జోరును ఇంగ్లండ్ మాస్టర్స్పై కొనసాగించాలని భావిస్తోంది. -
జయసూర్య జమానాలో పూర్వ వైభవం దిశగా శ్రీలంక
1996 వన్డే వరల్డ్ కప్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయిన శ్రీలంక.. ఆతర్వాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్లో అద్భుత విజయాలు సాధించింది. 1999 వరల్డ్కప్లో గ్రూప్ స్టేజ్లో పరిమితమైన లంకేయులు.. 2003లో సెమీస్కు.. 2007, 2011 ప్రపంచకప్ల్లో ఫైనల్స్కు చేరారు. 2015 వరల్డ్కప్ వరకు వన్డేల్లో లంక ప్రయాణం సాఫీగా సాగింది.అయితే గత దశాబ్దకాలంలో ఆ జట్టు శోభ మసకబారింది. సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్తో శ్రీలంక బలహీన జట్టుగా మారిపోయింది. భారత్లో జరిగిన 2023 వరల్డ్కప్కు క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించింది. ఘన కీర్తి కలిగిన శ్రీలంక క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్లో పోటీపడటం.. అక్కడ కూడా దారుణ పరాజయాలు మూటగట్టుకోవడంతో ఈ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు.అయితే దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య రాకతో (హెడ్ కోచ్గా) శ్రీలంక ప్రదర్శనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెస్ట్లు, టీ20ల విషయాన్ని పక్కన పెడితే.. ద్వీప జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తుంది. జయసూర్య జమానాలో శ్రీలంక.. భారత్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది.రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది ఈ జట్టు భారత్ను సైతం 2-0 తేడాతో ఓడించింది. ప్రస్తుతం లంక జట్టులో ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ జయసూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. నిస్సంక, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, చరిత్ అసలంక బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. లంక జట్టు బౌలింగ్ గతంలో పోలిస్తే మరింత బలపడింది. నాణ్యమైన స్పిన్నర్లు తయారవుతున్నారు. మొదటి నుంచే ఆ జట్టు పేస్ విభాగం బలంగా ఉంది.జయసూర్య రాక ముందు చిన్న జట్ల చేతుల్లో సైతం ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2002లో భారత్తో కలిసి సంయుక్తంగా ఛాంపియన్గా నిలిచింది. త్వరలో జరుగబోయే మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు అర్హత సాధించినా, శ్రీలంక మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంకతో పాటు ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్కు కూడా అర్హత సాధించలేకపోయింది.జయసూర్య హెడ్ కోచ్గా ఉండగా శ్రీలంక సాధించిన విజయాలువన్డే సిరీస్లో భారత్పై 2-0 తేడాతో విజయంఇంగ్లండ్లో టెస్ట్ విజయంన్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్లో విజయంవెస్టిండీస్పై టీ20 సిరీస్ విజయంవెస్టిండీస్పై వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయంన్యూజిలాండ్తో టీ20 సిరీస్ డ్రాన్యూజిలాండ్పై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయంఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయం -
SL vs Aus: శతక్కొట్టిన కుశాల్ మెండిస్.. అసలంక ధనాధన్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో శ్రీలంక స్టార్ క్రికెటర్ కుశాల్ మెండిస్(Kusal Mendis) శతక్కొట్టాడు. అద్భుత సెంచరీతో మెరిసి.. ఆసియా ఖండంలో వన్డే ఇంటర్నేషనల్స్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టెస్టు సిరీస్ వైట్వాష్ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసిన స్టీవ్ స్మిత్ బృందం.. వన్డేల్లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయింది. కొలంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డే(Sri Lanka vs Australia)లో 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆతిథ్య శ్రీలంక 1-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.వన్డేల్లో లంక ఆధిక్యంఇదే జోరులో రెండో వన్డేలోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలనే తలంపుతో బరిలోకి దిగింది. కొలంబో(Colombo)లోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆసీస్ పేసర్ ఆరోన్ హార్డీ ఓపెనర్ పాతుమ్ నిసాంక(6)ను స్వల్ప స్కోరు వద్ద బౌల్డ్ చేయడంతో ఆదిలోనే లంకకు ఎదురుదెబ్బ తగిలింది.అయితే, యువ ఓపెనర్ నిషాన్ మదుష్క.. వన్డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ కలిసి శ్రీలంక ఇన్నింగ్స్ చక్కదిద్దారు. కంగారూ పేసర్ బెన్ డ్వార్షుయిస్ నిషాన్ను అవుట్ చేసి ఈ జంటను విడదీశాడు. 70 బంతులు ఎదుర్కొన్న నిషాన్ 51 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక మెండిస్తో కలిసి నిషాన్ రెండో వికెట్కు 98 పరుగులు జతచేశారు.జంపా బౌలింగ్లోఇక నిషాన్ నిష్క్రమణ తర్వాత కూడా చెలరేగిన మెండిస్ శతకం పూర్తి చేసుకున్నాడు. 115 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అయితే, జంపా బౌలింగ్లో మాథ్యూ షార్ట్కు క్యాచ్ ఇవ్వడంతో కుశాల్ మెండిస్ శతక ఇన్నింగ్స్కు తెరపడింది. కెప్టెన్ చరిత్ అసలంక(66 బంతుల్లో 78 నాటౌట్)తో కలిసి 94 పరుగులు జతచేసి కుశాల్ పెవిలియన్ చేరాడు.కాగా కుశాల్ మెండిస్కు ఆస్ట్రేలియాపై ఇది తొలి వన్డే శతకం కాగా ఓవరాల్గా ఐదవది. ఇదిలా ఉంటే.. మిగిలిన వాళ్లలో కమిందు మెండిస్(4) విఫలం కాగా.. జనిత్ లియనగే 21 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి శ్రీలంక 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్డీ, డ్వార్షుయిస్, సీన్ అబాట్, ఆడం జంపా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు! -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన శ్రీలంక..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాలను ఘనంగా ఆరంభించాలని భావించిన ఆస్ట్రేలియాకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించారు. 215 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ 33.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది.లంక స్పిన్నర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం ప్రత్యర్ధి స్పిన్నర్ల ముందు తేలిపోయారు. వచ్చిన వారు వచ్చినట్టగా పెవిలియన్కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలాగే, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ అసలంక, హసరంగా చెరో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ(41) టాప్ స్కోరర్గా నిలవగా.. హార్దీ(32), సీన్ అబాట్(20) పర్వాలేదన్పించారు. కమ్మిన్స్, స్టార్క్, మాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్లు లేని లోటు ఈ మ్యాచ్లో కన్పించింది.అసలంక విరోచిత సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అయితే లంక కెప్టెన్ చరిత్ అసలంక మాత్రం విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులందరూ విఫలమైన చోట అసలంక అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 126 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో అసలంక 127 పరుగులు చేశాడు. అతడితో పాటు దునిత్ వెల్లలాగే(30) కీలక పరుగులు సాధించారు.మిగతా ఆటగాళ్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఈల్లీస్, జాన్సన్, హార్దే తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 14న ఇదే వేదికలో జరగనుంది. కాగా ఇంతకుముందు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రెండో వన్డే అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా పయనం కానుంది. అయితే ఈ మెగా టోర్నీకి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పాటు జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, మార్ష్ వంటి స్టార్ ప్లేయర్లు గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా ఈ ఈవెంట్ కోసం అప్డేటడ్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]చదవండి: వారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
ఆస్ట్రేలియా ఆధిపత్యం.. డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్ర
శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. తద్వారా పద్నాలుగేళ్ల తర్వాత లంక గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలుపును నమోదు చేసింది. అంతేకాదు.. మరో అరుదైన ఘనతనూ తన ఖాతాలో వేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2023-25 సీజన్లో ఇప్పటికే ఆసీస్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.స్మిత్ కెప్టెన్సీలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ డబ్ల్యూటీసీ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడింది. గాలె వేదికగా జరిగిన ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.స్మిత్ కెప్టెన్సీలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆసీస్.. లంకను 257 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టుకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ స్మిత్(131)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(156) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 414 పరుగులు చేసింది.ఆ తర్వాత శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ బృందం కేవలం ఒక వికెట్ కోల్పోయి కథ ముగించింది. డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్రకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియాకు ఇది 33వ విజయం. తద్వారా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా 2019లో డబ్ల్యూటీసీ మొదలుకాగా.. ఇప్పటి వరకు 53 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా 33 విజయాలు సాధించి.. పదకొండు మ్యాచ్లలో ఓడిపోయింది. తొమ్మిది మ్యాచ్లు డ్రా చేసుకుంది. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. 65 మ్యాచ్లు పూర్తి చేసుకున్న స్టోక్స్ బృందం 32 మ్యాచ్లలో గెలిచి.. 25 మ్యాచ్లలో ఓడింది. ఎనిమిది మ్యాచ్లు డ్రా చేసుకుంది.మూడో స్థానంలో టీమిండియాఇక డబ్ల్యూటీసీ తొలి రెండు సీజన్లలో ఫైనల్కు చేరగలిగిన టీమిండియా మూడో స్థానంలో ఉంది. 56 మ్యాచ్లకు గానూ 31 గెలిచి.. 19 ఓడి.. రెండు డ్రా చేసుకుంది. కాగా డబ్ల్యూటీసీ అరంగేట్ర విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో సీజన్లో ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక తాజా ఎడిషన్లో టైటిల్ కోసం ఆసీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. లంకతో సిరీస్కు ముందే డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్ జట్టు చివరకు 67.54 విజయాల శాతంతో రెండో స్థానం దక్కించుకుంది. రెండేళ్ల వ్యవధిలో 19 టెస్టు మ్యాచ్లు ఆడిన ఆసీస్ 13 విజయాలు, 4 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా 69.44 విజయాల శాతంతో పట్టిక ‘టాప్’ ప్లేస్ దక్కించుకుంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. గత రెండు పర్యాయాలు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు 50.00 విజయాల శాతంతో పట్టికలో మూడో స్థానానికి పరిమితమైంది. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
WPL 2025: యూపీ వారియర్స్కు కొత్త కెప్టెన్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్కు కొత్త కెప్టెన్గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడి 136.57 స్ట్రయిక్రేట్తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్లోని మిగతా మూడు జట్లకు హర్మన్ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు. లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్దేగాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2–0తో చేజిక్కించుకుంది. కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 200 క్యాచ్లు అందుకున్న ఐదో ప్లేయర్గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. కరుణరత్నే వీడ్కోలు శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
రెండో టెస్టులో శ్రీలంక ఓటమి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25ను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖావాజా(27), మార్నస్ లబుషేన్(26) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు. అంతకుముందు 211/8 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో పర్యాటక ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే శ్రీలంక ఉంచగల్గింది.కాగా లంక బ్యాటర్లలలో సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (149 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (14) ఎక్కువసేపు నిలువలేకపోగా... పతుమ్ నిషాంక (8), దినేశ్ చండిమాల్ (12), కమిందు మెండిస్ (14), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (23) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వెబ్స్టెర్ రెండు వికెట్లు సాధించాడు.ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 414 పరుగుల భారీ స్కోర్ చేయగా..శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 257 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ సత్తాచాటారు. రెండు ఇన్నింగ్స్ల కలిపి కునేమన్, లియోన్ చెరో ఏడు వికెట్లు పడగొట్టారు.కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించి ఆసీస్ తమ డబ్ల్యూటీసీ బెర్త్ను ఖారారు చేసుకుంది. జూన్11 నుంచి జూన్ 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో కంగారులు తలపడనున్నారు.చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా
టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) పరుగులు వరద పారిస్తున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టు సూపర్ సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో టెస్టులోనూ తన బ్యాట్కు పనిచెప్పాడు.ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో స్మిత్ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. 254 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 131 పరుగులు చేశాడు. కాగా మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్మిత్ అలెక్స్ క్యారీతో కలిసి నాలుగో వికెట్కు 259 పరుగులు జోడించాడు. తద్వారా ఓ అరుదైన స్మిత్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 11 మంది ఆటగాళ్లతో 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ టెస్టుల్లో 10 మంది ఆటగాళ్లతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తాజా మ్యాచ్తో రికీ ఆల్టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.చరిత్ర సృష్టించిన అలెక్స్-స్మిత్..అదే విధంగా ఈ మ్యాచ్లో అభేధ్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ జోడీ సైతం ఓ అరుదైన ఫీట్ను తమ పేరిట లిఖించుకున్నారు. శ్రీలంక గడ్డపై నాలుగో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పర్యాటక జట్టు జోడీ వీరిద్దరూ నిలిచారు.గతంలో ఈ రికార్డు మైకెల్ హస్సీ-షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2011లో పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్లో హస్సీ-షాన్ మార్ష్ 258 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో దిగ్గజ క్రికెటర్ల రికార్డును స్మిత్-అలెక్స్ జోడీ బ్రేక్ చేశారు. -
శ్రీలంకతో రెండో టెస్టు.. విజయం ముంగిట ఆస్ట్రేలియా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(48), నిషాన్ పెర్రిస్(0) ఉన్నారు. అయితే లంక జట్టు ప్రస్తుతం 54 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా బౌలర్లలో కునేమన్ 4 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియోన్ మూడు, వెబ్స్టర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు 330/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంబించిన ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 414 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులకు తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల ఆధిక్యం లభించింది.స్మిత్, కేరీ సెంచరీల మోత..కాగా మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్మిత్, కేరీ లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జంట ఆడుతూ పాడుతూ పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఈ క్రమంలో స్మిత్ 191 బంతుల్లో టెస్టుల్లో 36వ సెంచరీ నమోదు చేసుకోగా... కేరీ 118 బంతుల్లో టెస్టుల్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్కు 239 పరుగులు జోడించారు.ఇక శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జై సూర్య ఐదు వికెట్లతో సత్తాచాటగా.. పెర్రిస్ మూడు, మెండిస్ రెండు వికెట్లు సాధించారు. అదేవిధంగా శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (139 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయన్, కునేమన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి సిరీస్లో 1–0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని -
సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(Steve Smith) మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో అద్బుత క్యాచ్లను అందుకున్న స్మిత్.. తాజాగా మరోసారి తన సంచలన ఫీల్డింగ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు.గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్.. నాలుగో బంతిని దనుంజయ డిసిల్వాకు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శ్రీలంక కెప్టెన్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి సిల్వా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ తన కుడివైపునకి డైవ్ చేస్తూ సింగల్ హ్యాండ్తో సంచలన క్యాచ్ను అందుకున్నాడు. అది చూసిన డిసిల్వా బిత్తరపోయాడు. చేసేదేమి లేక డిసిల్వా(23) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.స్మిత్ సరికొత్త చరిత్ర..కాగా ఈ మ్యాచ్లో స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో ప్రబాత్ జైసూర్య క్యాచ్ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.పాంటింగ్ 287 ఇన్నింగ్స్లలో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ ఇప్పటివరకు 205 ఇన్నింగ్స్లలో 198 క్యాచ్లను తీసుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్లలో ద్రవిడ్.. 210 క్యాచ్లను తీసుకున్నాడు.స్మిత్ 12 క్యాచ్లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. కాగా ఈ మ్యాచ్లో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో స్మిత్(131) సెంచరీతో మెరిశాడు. తద్వారా ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting)ను స్మిత్ అధిగమించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్కు భారీ షాక్.. OUTSTANDING from Steve Smith 😮What. A. Catch. #SLvAUS pic.twitter.com/mVIJLZWbGI— 7Cricket (@7Cricket) February 8, 2025 -
స్టీవ్ స్మిత్ ఖాతాలో 36వ టెస్ట్ శతకం.. రూట్ రికార్డు సమం
ఆస్ట్రేలియా తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్ల్లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ శతకాన్ని స్మిత్ 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో పూర్తి చేశాడు. స్మిత్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. లంక పర్యటనలో స్మిత్కు ఇది వరుసగా రెండో సెంచరీ. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనూ స్మిత్ శతక్కొట్టాడు. THE MAN, THE MYTH, THE LEGEND - ITS STEVE SMITH IN TEST CRICKET 🦁 pic.twitter.com/phZ6XlCX9T— Johns. (@CricCrazyJohns) February 7, 2025తాజా సెంచరీతో స్మిత్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) రికార్డును సమం చేశాడు. రూట్, స్మిత్ టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్గా పిలువబడే వారిలో ప్రస్తుతం స్మిత్, రూట్ అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. కేన్ విలియమ్సన్ (Kane Williamson) 33, విరాట్ కోహ్లి (Virat Kohli) 30 సెంచరీలతో స్మిత్, రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.తాజా సెంచరీ స్మిత్కు టెస్ట్ కెప్టెన్గా 17వ సెంచరీ. ఈ సెంచరీ స్మిత్కు ఆసియాలో 7, శ్రీలంకలో 4వది. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్మిత్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్, రూట్తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. సచిన్ తర్వాతి స్థానాల్లో జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఉన్నారు.టెస్ట్ల్లో స్మిత్ సెంచరీలు..ఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్లో 8శ్రీలంకలో 4భారత్లో 3న్యూజిలాండ్లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్లో 1మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్ట్లో స్మిత్ శతక్కొట్టడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆసీస్ 10 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. 68 ఓవర్ల అనంతరం ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్కు జతగా క్రీజ్లో ఉన్న అలెక్స్ క్యారీ (92) కూడా శతకానికి చేరువయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
స్టీవ్ స్మిత్ సరికొత్త చరిత్ర.. ఆసీస్ తొలి బ్యాటర్గా అరుదైన ఫీట్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అద్బుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంక(Sri Lanka vs Australia)తో రెండో టెస్టులోనూ ఈ కుడిచేతి వాటం ఆటగాడు సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న స్మిత్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.ఆల్టైమ్ రికార్డు బద్దలుఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్మిత్ మళ్లీ ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే.భారత్తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్బోర్న్లో భారీ శతకం(140)తో చెలరేగాడు. అనంతరం.. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ తాత్కాలిక స్మిత్ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్లో కూడా చేరాడు.ఇక తాజాగా లంకతో రెండో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ శతకం దిశగా పయనిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా గడ్డ మీద పందొమ్మిది వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని.. ఆస్ట్రేలియా తరఫున హయ్యస్ట్ రన్స్కోరర్గా నిలిచాడు. లంకతో రెండో టెస్టు భోజన విరామ సమయానికి స్మిత్.. ఆసియాలో 1917 పరుగులు పూర్తి చేసుకున్నాడు.కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన స్మిత్ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆతిథ్య లంకను ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి గాలెలో రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్ల విజృంభణ కారణంగా 257 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్(22 బంతుల్లో 21), ఉస్మాన్ ఖవాజా(57 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(4) మరోసారి విఫలమయ్యాడు.ఈ దశలో స్మిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ వేగంగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడైన ప్రదర్శన కారణంగా 55 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద నిలిచింది.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 👉స్టీవ్ స్మిత్: 23 మ్యాచ్లలో సగటు 50.35తో 1917+ పరుగులు. అత్యధిక స్కోరు- 178*- శతకాలు ఆరు.👉రిక్కీ పాంటింగ్: 28 మ్యాచ్లలో సగటు 41.97తో 1889 పరుగులు- అత్యధిక స్కోరు 150- శతకాలు ఐదు👉అలెన్ బోర్డర్: 22 మ్యాచ్లలో సగటు 54.51తో 1799తో 1799 పరుగులు- అత్యధిక స్కోరు 162- శతకాలు ఆరు👉మాథ్యూ హెడెన్: 19 మ్యాచ్లలో 50.39 సగటుతో 1663 పరుగులు- అత్యధిక స్కోరు 203- శతకాలు నాలుగు👉ఉస్మాన్ ఖవాజా: 17 మ్యాచ్లలో 61.76 సగటుతో 1544 పరుగులు- అత్యధిక స్కోరు 232- శతకాలు ఐదు. -
SL VS AUS 2nd Test: ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ (Australia) వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో 35 ఏళ్ల తర్వాత 3000 పరుగులు సాధించిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ క్రికెట్ చరిత్రలో 35 అంతకుమించిన వయసులో ఎవరూ 3000 పరుగుల మార్కును తాకలేదు. ఖ్వాజాకు ముందు స్టీవ్ వా 2554 పరుగులు (53.30 సగటున) చేశాడు.35 అంతకంటే ఎక్కువ వయసులో ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..- ఉస్మాన్ ఖ్వాజా-3016 (51.11)- స్టీవ్ వా-2554 (53.30)- అలెన్ బోర్డర్-2473 (42.63)- మైక్ హస్సీ-2323 (50.50)- క్రిస్ రోజర్స్-1996 (44.35)- డాన్ బ్రాడ్మన్-1903 (105.72)శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఖ్వాజా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఖ్వాజా 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన అనంతరం లయోన్ ఎవరికీ సాధ్యంకాని ఓ ఘనతను సాధించాడు. ఆసియా గడ్డపై టెస్ట్ల్లో 150 వికెట్లు తీసిన నాన్ ఏషియన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.శ్రీలంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (36), ట్రవిస్ హెడ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి ఔట్ కాగా.. లబూషేన్ నాలుగు పరుగులకే పెవిలియన్కు చేరాడు. తొలి టెస్ట్లో సెంచరీతో కదంతొక్కిన స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్లోనూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. స్మిత్ 69 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అలెక్స్ క్యారీ (39) క్రీజ్లో ఉన్నాడు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు.తొలి టెస్ట్లో డబుల్ సెంచరీఉస్మాన్ ఖ్వాజా తొలి టెస్ట్లో డబుల్ సెంచరీతో (232) కదంతొక్కాడు. తద్వారా ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్మన్ తర్వాత అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్లో ఖ్వాజా డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా శ్రీలంకపై భారీ విజయం సాధించింది. -
SL vs Aus: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియాలో టెస్టు ఫార్మాట్లో 150కి పైగా వికెట్లు తీసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంక(Sri Lanka vs Australia)లో పర్యటిస్తోంది.తొలిరోజే తొమ్మిది వికెట్లుఇందులో భాగంగా తొలుత గాలె(Galle) వేదికగా టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్లో లంకను ఆసీస్ మట్టికరిపించింది. ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అనంతరం ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (163 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (107 బంతుల్లో 59 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (83 బంతుల్లో 36; 3 ఫోర్లు) కాసేపు పోరాడినా... భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇతరులలో పతుమ్ నిశాంక (11), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (0) దారుణంగా విఫలమయ్యారు. చండిమాల్, కుశాల్ మెండిస్ కాస్త పోరాడటంతో లంక జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది.నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్రఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్తో కలిసి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా ఖండంలో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆసియాలో 127 వికెట్లు తీయగా.. న్యూజిలాండ్ మాజీ స్టార్ డేనియల్ వెటోరి 98, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 92 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు👉నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150👉షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127👉డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98👉జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు స్టార్క్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కూహ్నెమన్ రెండు, ట్రవిస్ హెడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 229/9 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 257 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు సమం
ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కమిందు మెండిస్ క్యాచ్ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాంటింగ్ 287 ఇన్నింగ్స్లలో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ కేవలం 205 ఇన్నింగ్స్లలో సరిగ్గా 196 క్యాచ్లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్లలో ద్రవిడ్.. 210 క్యాచ్లను తీసుకున్నాడు. స్మిత్ 14 క్యాచ్లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో కాస్త తడబడుతోంది. 71 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్(35), రమేష్ మెండిస్(20) ఆచితూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఇప్పటివరకు నాథన్ లియోన్ మూడు వికెట్లు పడగొట్టగా..మిచెల్ స్టార్క్, మథ్యూ కుహ్నమెన్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి టెస్టులో లంకను మట్టికర్పించింది.ఈ మ్యాచ్ను డ్రా ముగించినా చాలు సిరీస్ ఆసీస్ 1-0 సొంతం చేసుకుంటుంది. శ్రీలంక టూర్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆసీస్ జట్టును స్మిత్ ముందుండి నడ్పిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను స్మిత్ చేపట్టే అవకాశముంది.ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కమ్మిన్స్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోష్ హెజిల్వుడ్, మిచిల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ పూర్తిగా వన్డే క్రికెట్కే విడ్కోలు పలికాడు.196TH TEST CATCH STEVE SMITH. 😱Steve Smith is on the verge of creating another record. This batter is top-class, and he is also a Superman in fielding. He has taken 196 catches so far, and with one more catch, he will break Ponting's record.Most Test catches for Australia by… pic.twitter.com/fKtqYvYEVs— All Cricket Records (@Cric_records45) February 6, 2025 -
రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్టార్ క్రికెటర్
శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అని వెల్లడించాడు. 36 ఏళ్ల కరుణరత్నేకు టెస్ట్ల్లో ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన కరుణరత్నే 2012లో తన టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. 13 ఏళ్ల జర్నీలో కరుణరత్నే ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. కెప్టెన్గా శ్రీలంకకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. 2019లో శ్రీలంక జట్టు కరుణరత్నే సారథ్యంలో సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో (టెస్ట్ల్లో) ఓడించింది. సౌతాఫ్రికాను వారి స్వదేశంలో 2-0 తేడాతో ఓడించిన ఏకైక ఆసియా కెప్టెన్ కరుణరత్నేనే.టెస్ట్లకు ముందే (2011, జులైలో) వన్డే అరంగేట్రం చేసిన కరుణరత్నే ఈ ఫార్మాట్లో అశించినంతగా రాణించలేకపోయాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అతను 50 మ్యాచ్లు ఆడి 31.3 సగటున 1316 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు, సెంచరీ ఉంది. కరుణరత్నే తన చివరి వన్డే మ్యాచ్ను భారత్లో జరిగిన 2023 ప్రపంచకప్లో ఆడాడు. వన్డేలతో పోలిస్తే కరుణరత్నే టెస్ట్ గణాంకాలు చాలా బాగున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో అతను 99 మ్యాచ్లు ఆడి 39.4 సగటున 7172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కరుణరత్నే శ్రీలంక తరఫున అత్యధిక టెస్ట్లు ఆడిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. లంక తరఫున మహేళ జయవర్దనే అత్యధికంగా 149 టెస్ట్లు ఆడాడు. కాగా, ఆసీస్తో రెండో టెస్ట్ గాలే వేదికగా ఫిబ్రవరి 6న మొదలవుతుంది. ఈ మ్యాచ్తోనే కరుణరత్నే ఆటకు వీడ్కోలు పలుకనున్నాడు.తొలి టెస్ట్లో దారుణ పరాజయంఆసీస్తో జరిగిన తొలి టెస్ట్లో శ్రీలంక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉస్మాన్ ఖ్వాజా డబుల్ సెంచరీ (232), స్టీవ్ స్మిత్ (141), జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీలు చేసి ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (654/6) అందించారు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లోనూ లంక ఫేట్ మారలేదు. ఈసారి ఆ జట్టు 247 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో కరుణరత్నే రెండో ఇన్నింగ్స్ల్లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టారు. -
శ్రీలంకను మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. లంకేయుల రికార్డు ఓటమి
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, ఈ ఎడిషన్లో ఆఖరిగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు. స్మిత్, ఇంగ్లిస్ శతకాలుమిగతా వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలుఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కాయి.ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమిఅయితే, తమ తొలి ఇన్నింగ్స్లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు. చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిఅయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
వావ్ వాట్ ఏ క్యాచ్.. సింగల్ హ్యాండ్తో అద్బుతం! వీడియో వైరల్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఒషాడో ఫెర్నాండో (7), దిముత్ కరుణరత్నె (7), ఏంజెలో మాథ్యూస్ (7) అవుట్ కాగా... దినేశ్ చండీమల్ (9 బ్యాటింగ్), కమిందు మెండిస్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 610 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఆ్రస్టేలియా 154 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (352 బంతుల్లో 232; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకోగా... అరంగ్రేట ఆటగాడు జోస్ ఇంగ్లిస్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (251 బంతుల్లో 141; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో మెరిశారు.హెడ్ సూపర్ క్యాచ్..కాగా రెండో రోజు ఆటలో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. స్టన్నింగ్ క్యాచ్తో శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్ను హెడ్ పెవిలియన్కు పంపాడు. లంక ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. మూడో బంతిని మాథ్యూస్కు ఆఫ్బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ లూపీ డెలివరీని మాథ్యూస్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు.కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్-లెగ్ ఫీల్డర్ కుడివైపునకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న హెడ్ తన కుడివైపునకు లాంగ్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాథ్యూస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేదేమి లేక మాథ్యూస్(7) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్లో హెడ్ బ్యాట్తో కూడా సత్తాచాటాడు. ఓపెనర్గా వచ్చిన హెడ్ 40 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్లతో హాఫ్ సెంచరీ! వీడియో Travis Head flies at bat pad! ✈️Nathan Lyon gets Australia's THIRD #SLvAUS pic.twitter.com/Nx4KxB0bwy— 7Cricket (@7Cricket) January 30, 2025 -
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్నరైన్ చందర్పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన స్మిత్, ఖావాజా.. తొలి ఆసీస్ జోడీగా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో లంక బౌలర్ల భరతం పట్టిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో రోజు ఆటలో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా కంగారూ జట్టు సాగుతోంది. 117 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా డబుల్ సెంచరీతో మెరిశాడు. . 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు ఆసీస్ సూపర్ స్టార్ స్మివ్ స్మిత్ కూడా సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 251 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో స్మిత్ 141 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో స్పిన్నర్ వాండర్సే బౌలింగ్లో ఎల్బీగా స్మిత్ వెనుదిరిగాడు.అరుదైన రికార్డు..కాగా మూడో వికెట్కు ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మిత్ మూడో వికెట్కు 266 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని వీరిద్దరూ నెలకొల్పారు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఈ వెటరన్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్ట్రేలియన్ జోడీగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజాలు ఆడమ్ గిల్క్రిస్ట్, డామియన్ మార్టిన్ పేరిట ఉండేది. 2004లో కాండే వేదికగా జరిగిన లంకతో జరిగిన టెస్టులో గిల్లీ, మార్టిన్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో గిల్లీ-డామియన్ ఆల్టైమ్ రికార్డును ఖావాజా-స్మిత్ బ్రేక్ చేశారు.కాగా ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాకు ఇదే ఆఖరి సిరీస్. ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఆడుతోంది.చదవండి: RT 2025: హ్యాట్రిక్తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
డబుల్ సెంచరీతో మెరిసిన ఖావాజా.. తొలి ఆసీస్ క్రికెటర్గా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) అద్బుతమైన ద్విశకతంతో చెలరేగాడు. 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అచితూచి ఆడుతూ శ్రీలంకకు కొరకరాని కొయ్యగా ఈ ఆసీస్ వెటరన్ మారాడు.తొలి రోజు ఆటలో ట్రావిస్ హెడ్,స్టీవ్ స్మిత్తో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పిన ఖావాజా.. రెండో రోజు ఆటలో జోష్ ఇంగ్లీష్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు. ఇదే అతడికి మొట్టమొదటి అంతర్జాతీయ డబుల్ సెంచరీ. ఇప్పటివరకు 79 టెస్టు మ్యాచ్లు ఆడిన ఖావాజా.. 45.26 సగటుతో 5839 పరుగులు చేశాడు.అతడి టెస్టు కెరీర్లో 16 సెంచరీలతో పాటు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే భారత్తో జరిగిన సిరీస్లో మాత్రం ఖావాజా తీవ్ర నిరాశపరిచాడు. కానీ అతడిపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు శ్రీలంక పర్యటకు ఎంపిక చేశారు. సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయని ఖావాజా తొలి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు,.భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో ఖావాజా(204 నాటౌట్), జోష్ ఇంగ్లీష్(44 నాటౌట్) ఉన్నారు. 330/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్(141) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.తొలి ఆసీస్ క్రికెటర్గా..ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఖావాజా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై టెస్టు డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆసీస్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.ఖావాజా కంటే ముందు శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు రికార్డు జస్టిన్ లాంగర్ పేరిట ఉండేది. 2004 కొలంబో వేదికగా లంకతో జరిగిన టెస్టులో లాంగర్ 295 బంతుల్లో 166 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో లాంగర్ ఆల్టైమ్ రికార్డును ఖావాజా బ్రేక్ చేశాడు. కాగా ఆస్ట్రేలియాకు ఇదే నామమాత్రపు టెస్టు సిరీస్ మాత్రమే. కంగారులు ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ఆర్హత సాధించింది.చదవండి:జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
శ్రీలంకతో తొలి టెస్టు: టీ20 తరహాలో ట్రవిస్ హెడ్ బాదుడు
శ్రీలంకతో తొలి టెస్టు(Sri Lanka Vs Australia)లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్(Travis Head) ధనాధన్ దంచికొట్టాడు. తనను ఓపెనర్గా పంపినందుకు... అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకుని జట్టుకు శుభారంభం అందించాడు. మెరుపు అర్ధశతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో జూన్లో తలపడనుంది. అంతకంటే ముందు ఈ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఓపెనింగ్ జోడీగా ప్రమోట్ అయిన టీ20 వీరుడు ట్రవిస్ హెడ్ ఆది నుంచే లంక బౌలర్లపై అటాక్ చేశాడు.తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు.. మెరుపు ఫిఫ్టీఇన్నింగ్స్ ఆరంభంలోనే తన మార్కు చూపించిన హెడ్.. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదాడు. లంక పేసర్ అసిత ఫెర్నాండో బౌలింగ్లో మూడు, ఐదు, ఆరో బంతికి ఫోర్లు బాదాడు. అదే జోరులో వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్న ట్రవిస్ హెడ్.. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్లో చండీమాల్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక హెడ్ ఇన్నింగ్స్లో పది ఫోర్లతో పాటు.. ఒక సిక్సర్ కూడా ఉంది.టీ20 తరహా వీరబాదుడుఈ నేపథ్యంలో తనను టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ చేసినందుకు హెడ్.. మేనేజ్మెంట్కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహా వీరబాదుడు బాదడం అతడికి మాత్రమే చెల్లుతుందంటూ కొనియాడుతున్నారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే.. హెడ్ ఇప్పటి నుంచే ఐపీఎల్ మోడ్లోకి వెళ్లిపోయాడంటూ ఆకాశానికెత్తుతున్నారు.స్టీవ్ స్మిత్ సారథ్యంలోకాగా శ్రీలంకతో టెస్టులకు ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఈ సిరీస్లో కంగారూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తాజా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులతో పాటు.. కొలంబో వేదికగా రెండు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. ఫిబ్రవరి 14న రెండో వన్డేతో ఆసీస్ లంక టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో హెడ్తో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. లంకతో తొలి రోజు ఆటలో భాగంగా 29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది.శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టుతుదిజట్లుశ్రీలంకదిముత్ కరుణరత్నే, ఓషద ఫెర్నాండో, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్), ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ.చదవండి: Suryakumar Yadav: అతడొక వరల్డ్క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదేA Travis Head half century inside the first hour of Day 1 👀#SLvAUS pic.twitter.com/e5QNF4FaK3— 7Cricket (@7Cricket) January 29, 2025 -
ట్రావిస్ హెడ్కు ప్రమోషన్..
గాలే వేదికగా శ్రీలంకతో బుధవారం(జనవరి29) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అన్ని విధాల సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ కోసం దుబాయ్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో కంగారులు తీవ్రంగా శ్రమించారు.లంక స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా స్పిన్ ట్రాక్లను ఏర్పా టు చేసుకుని మరి ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. ఈ టూర్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టు కెప్టెన్గా వ్యహరించనున్నాడు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023-25లో ఆసీస్కు ఇదే ఆఖరి సిరీస్. కాగా ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్లో కమ్మిన్స్ సేన అడుగుపెట్టింది.ఆసీస్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్..ఇక శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్గా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనున్నాడు. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను హెడ్ ప్రారంభించనున్నాడు. జట్టులో సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ ఉన్నప్పటికి ఆసీస్ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం హెడ్కే ప్రాధాన్యత ఇచ్చింది.హెడ్ సాధరణంగా వైట్ బాల్ ఫార్మాట్లో ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తుంటాడు. టెస్టుల్లో మాత్రం ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తుంటాడు. అయితే రెడ్బాల్ క్రికెట్లో కూడా అతడు ఓపెనింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మరోసారి అతడిని ఓపెనర్గా పంపి పరీక్షించాలని ఆస్ట్రేలియా టీమ్ మెనెజ్మెంట్ మాత్రం భావిస్తుంది.ఈ విషయాన్ని ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధ్రువీకరించాడు. కాగా వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్లగా నాథన్ మెక్స్వీనీ, సామ్ కాన్స్టాస్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. నాథన్ మెక్స్వీనీ విఫలమైనప్పటికి కాన్స్టాస్ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయినప్పటకి లంకతో సిరీస్కు అతడికి ఓపెనర్గా చోటు దక్కలేదు.ట్రావిస్ హెడ్ మా ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. టాపార్డర్డ్లో కూడా అతడు తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తాడని భావిసతున్నాను. అతడు ఏ పొజిషేన్లోనైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు. గతంలో భారత్లో అతడు ఓపెనర్గా వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో సెలక్టర్లు మరోసారి ఛాన్స్ ఇచ్చారు అని ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో స్మిత్ పేర్కొన్నాడు. ఓపెనర్గా మూడు టెస్టులు ఆడిన ట్రావిస్.. 223 పరుగులు చేశాడు.కాగా హెడ్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో 448 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.శ్రీలంకతో టెస్టులకు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టోడ్ మర్ఫీ చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్ -
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్తో పాటు కమిన్స్పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్కప్-2023 చాంపియన్కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్ను చాంపియన్గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో లంకతో సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.స్టార్క్కు నో రెస్ట్..అదే విధంగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు.భారత్తో జరిగిన సిరీస్లో గాయపడిన హాజిల్వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్లైన్ పేసర్లగా ఉన్నారు.యువ సంచలనానికి పిలుపు..ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్బాష్ లీగ్లో పెర్త్స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్తో టెస్టు సిరీస్కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్స్టాస్, వెబ్స్టార్లను శ్రీలంక సిరీస్కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్' -
గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా? -
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్ను గనుక 2-0తో క్లీన్స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై! -
ట్రావిస్ హెడ్కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా కెప్టెన్గా!?
భారత్తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ కెప్టెన్గా ట్రావిస్ హెడ్?ఇక స్వదేశంలో భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్లో మాత్రం సారథిగా హెడ్కు అనుభవం ఉంది. బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్కు కెప్టెన్గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. -
అతడికి జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్సీకి టెస్టు జట్టులో ఉండే అర్హతే లేదన్నాడు. కాగా మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు బరిలో దిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2017లో తన చివరి టెస్టు ఆడాడు.ఏడు టెస్టులుచట్టోగ్రామ్ వేదికగా నాటి మ్యాచ్లో 36 ఏళ్ల మాక్సీ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 28, 25* పరుగులు చేశాడు. ఇక 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటివరకు మొత్తంగా.. తన కెరీర్లో ఏడు టెస్టులు ఆడాడు.టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలనే ఆశఇందులో నాలుగు టీమిండియా, ఒకటి పాకిస్తాన్, రెండు బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లు. వీటన్నింటిలో కలిపి 339 పరుగులు చేసిన మాక్సీ.. ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక వన్డే, టీ20లలో అదరగొడుతున్న ఈ ఆల్రౌండర్.. టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలని ఆశపడుతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ టెస్టు జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని.. ఇటీవల మాక్సీ తన మనసులోని మాట బయటపెట్టాడు.అతడి ఆ అర్హత కూడా లేదుఈ విషయంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘‘నీకు దేశీ టోర్నీ జట్టులోనే చోటు దక్కనపుడు.. జాతీయ జట్టులో స్థానం కావాలని ఆశించడం సరికాదు!.. నిజానికి నీకు టెస్టుల్లో ఆడాలనే కోరిక మాత్రమే ఉంది. ఆ కారణంగా నిన్నెవరూ జట్టుకు ఎంపిక చేయరు.క్లబ్ క్రికెట్ ఆడుతూ.. అక్కడ నిరూపించుకుంటే.. టెస్టు క్రికెట్ జట్టు నుంచి తప్పకుండా పిలుపు వస్తుంది. కానీ.. అతడు అలాంటిదేమీ చేయడం లేదు. కాబట్టి.. నా దృష్టిలో మాక్సీకి టెస్టు జట్టు చోటు కోరుకునే అర్హత కూడా లేదు’’ అని వార్నర్ ఘాటు విమర్శలు చేశాడు.కాగా గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వార్విక్షైర్ తరఫున మాక్స్వెల్ ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో విక్టోరియా తరఫున అతడు బరిలోకి దిగాల్సింది. అయితే, పాకిస్తాన్తో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ సమయంలో మాక్సీకి తొడ కండరాల గాయమైంది. ఫలితంగా అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కోడ్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాతో టెస్టులతో ఆసీస్ బిజీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో ఐదు టెస్టులు ఆడతున్న కంగారూ జట్టు సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్.. అడిలైడ్లో జరిగిన పింక్ టెస్టులో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్లోని ‘ది గాబా’ మైదానం ఇందుకు వేదిక.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ టెస్టు క్రికెట్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్ ద్వారా అతడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.కాగా ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ 2023- 25 ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆసీస్. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ టూర్ ద్వారా సిరీస్ ద్వారా మాక్సీని తిరిగి టెస్టుల్లో ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందుకే టీ20 ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చిన బోర్డు.. టెస్టులకు సన్నద్ధం కావాలని ఆదేశించిందని ఆస్ట్రేలియా మీడియా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. రెడ్బాల్ క్రికెట్లో తక్కువ మ్యాచ్లు మాత్రమే ఆడినా మాక్సీపై మేనేజ్మెంట్కు నమ్మకం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.ఇక మాక్సీతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా టీమిండియాతో సిరీస్లో భాగంగా 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు గ్లెన్ మాక్స్వెల్.ఇప్పటి వరకు కేవలం ఏడు టెస్టులు ఆడిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఓ సెంచరీ సాయంతో 339 పరుగులు చేశాడు. అదే విధంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరిసారిగా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో ఆడిన మాక్సీ.. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాడు.ఈ క్రమంలో 2022లో శ్రీలంక టూర్కు ఎంపికైన మాక్సీ.. టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో వార్విక్షైర్ తరఫున ఆడిన మాక్స్వెల్ 81 పరుగులతో రాణించాడు.ఈ నేపథ్యంలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని ఆడించాలని బోర్డు భావించగా.. రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కాగా మాక్సీ టెస్టు కెరీర్ గొప్పగా లేకపోయినా.. శ్రీలంకలో స్పిన్నర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ బోర్డు అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. -
WC 2023: మీ నాన్న నేర్పించలేదా?: ఆసీస్ క్రికెటర్ను ప్రశ్నించిన గావస్కర్
ICC WC 2023- Aus Vs SL: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా. లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి.. తాజా ఎడిషన్లో తొలి గెలుపు నమోదు చేసింది. కాగా ఆసీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో 209 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా(4 వికెట్లు) దాటికి లంక బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలా క్రీజులోకి వచ్చి.. అలా పెవిలియన్కు వెళ్లిపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్ 40 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ అర్ధ శతకం(58) సాధించగా.. గ్లెన్ మాక్స్వెల్(31- నాటౌట్), మార్కస్ స్టొయినిస్(20-నాటౌట్) విజయలాంఛనం పూర్తి చేశారు. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూ తొలి విజయం అందుకోగా.. ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మీ నాన్న నీకు నేర్పించలేదా? అయితే, ఈ గెలుపుతో జంపాతో పాటు మార్ష్ది కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్ష్ను టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఫన్నీగా ట్రోల్ చేశాడు. ‘‘మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా’’ అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు. ఇందుకు స్పందించిన మార్ష్.. ‘‘మా నాన్న పూర్ స్ట్రైక్రేటును కప్పిపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా’’ అని అంతే సరదాగా బదులిచ్చాడు. జెఫ్ మార్ష్ తనయుడే మిచెల్ కాగా మిచెల్ మార్ష్ మరెవరో కాదు.. ఆసీస్ మాజీ బ్యాటర్ జెఫ్ మార్ష్ కుమారుడు. గావస్కర్కు సమకాలీనుడైన జెఫ్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో 117 మ్యాచ్లాడి.. 55.93 స్ట్రైక్రేటుతో 4357 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు 82 వన్డేల్లో 93.85 స్ట్రైక్రేటుతో 2290 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తండ్రి అలా.. కొడుకు ఇలా ఈ నేపథ్యంలో తండ్రీతనయులు స్ట్రైక్రేటును ఉద్దేశించి గావస్కర్ సరదాగా కామెంట్ చేయగా.. మార్ష్ బదులిచ్చిన తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక లంకపై విజయం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ఇంగ్లిస్ ఓ యోధుడని.. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు మరింత గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షించాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్కు భారీ షాక్! Sunil Gavaskar- "Did your father not teach you to bat like this (gestures playing a defensive shot)?" Mitch Marsh- "I am making up for his poor strike rate." pic.twitter.com/P4GuLGFCa6 — Rohit Yadav (@cricrohit) October 16, 2023 -
AUS VA SL: వెన్నునొప్పితో బాధపడుతూనే బరిలోకి దిగాడు.. తొలి విజయాన్ని అందించాడు
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా (8-1-47-4) ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వెన్ను సమస్యతో బాధపడుతూనే బరిలోకి దిగిన జంపా.. నొప్పిని దిగమింగుతూ బౌలింగ్ చేసి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో జంపా కీలక వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాశించాడు. భీకర ఫామ్లో ఉన్న కుశాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లతో పాటు చమిక కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టాడు. పరుగు వ్యవధిలో గత మ్యాచ్ సెంచరీ హీరోలు కుశాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లు పడగొట్టిన జంపా.. ఆఖర్లో 2 పరుగుల వ్యవధిలో కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టి లంక ఇన్నింగ్స్కు చరమగీతం పాడాడు. నొప్పిని దిగమింగుతూ జంపా చేసిన విన్యాసాలకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, స్పిన్నర్లకు అనుకూలిస్తున్న భారత పిచ్లపై ప్రస్తుత వరల్డ్కప్లో జంపాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఎడిషన్లో ఆసీస్ ఓడిన తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన జంపా.. కీలక సమయంలో ఫామ్లోకి వచ్చి తన జట్టుకు ఎంతో అవసరమైన విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్లో 8 ఓవర్లలో వికెట్ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్న జంపా.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లో 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి జంపా ప్రదర్శన కారణంగా ఆసీస్ ప్రస్తుత ఎడిషన్లో తొలి విజయం సాధించింది. ఆసీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలరల్లో ఆడమ్ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబూషేన్ (40), మ్యాక్స్వెల్ (31 నాటౌట్), స్టోయినిస్ (20 నాటౌట్) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ ఓటమి. -
CWC 2023: ఆసీస్ చేతిలో ఓటమి.. చెత్త రికార్డును సమం చేసిన శ్రీలంక
వన్డే ప్రపంచకప్లో శ్రీలంక చెత్త రికార్డును సమం చేసింది. ఆసీస్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఓటమి చెందడంతో ప్రపంచకప్లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. తాజా ఓటమితో శ్రీలంక.. జింబాబ్వే సరసన చేరింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ప్రపంచకప్లో చెరి 42 అపజయాలతో చెత్త రికార్డును పంచుకున్నాయి. ఆతర్వాతి స్ఠానంలో వెస్టిండీస్ ఉంది. ఈ జట్టు 35 పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. విండీస్ తర్వాత 34 పరాజయాలతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్లో కనీసం రెండంకెల స్కోర్ చేసిన ఆటగాడు కూడా లేడు. ఆసీస్ బౌలరల్లో ఆడమ్ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబూషేన్ (40), మ్యాక్స్వెల్ (31 నాటౌట్), స్టోయినిస్ (20 నాటౌట్) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ ఓటమి. -
World Cup 2023: ఆసీస్ బోణీ
లక్నో: ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఎట్టకేలకు ఈ వన్డే వరల్డ్కప్లో బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన ఆసీస్ మూడో మ్యాచ్లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా స్పిన్, బ్యాటర్ల సమష్టి బాధ్యత ‘కంగారూ’ జట్టును గెలిపించాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (82 బంతుల్లో 78; 12 ఫోర్లు), నిసాంక (67 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జంపా (4/47) తిప్పేయగా, పేసర్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి నెగ్గింది. మిచెల్ మార్‡ ్ష(51బంతుల్లో 52; 9 ఫోర్లు), జోష్ ఇంగ్లిస్ (59 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మదుషంకకు 3 వికెట్లు దక్కాయి. శుభారంభానికి స్పిన్తో చెక్ లంక ఓపెనర్లు ఆడిన ఆట, చేసిన పరుగులు, జతకూడిన భాగస్వామ్యం చూస్తే భారీస్కోరు గ్యారంటీ అనిపించింది! దీంతో ఒకదశలో ఆసీస్కు మళ్లీ ఓటమి కంగారూ తప్పదేమో అనిపించింది. అంతలా నిసాంక, కుశాల్ పెరీరా ఓపెనింగ్ జోడీ 21 ఓవర్లదాకా అర్ధసెంచరీలతో పరుగుల్ని పోగేసింది. అయితే కమిన్స్ పేస్ ఇద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు పంపించింది. దీంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడ్డాక... స్పిన్ వైపు పిచ్ మళ్లింది. ఇదే అదనుగా జంపా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), సమరవిక్రమ (8)లను అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ మ్యాక్స్వెల్ అసలంక (25) వికెట్ తీయగా ఆ తర్వాత ఎవరూ పది పరుగులైనా చేయనీకుండా జంపా స్పిన్ ఉచ్చు, స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ లంకను ఉక్కిరిబిక్కిరి చేసింది. 157 వద్ద రెండో వికెట్ పడిన లంక అనూహ్యంగా 209 పరుగులకే కుప్పకూలింది. కేవలం 52 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయింది. తడబడినా... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ మళ్లీ తడబడింది. వార్నర్ (11; 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (0)లను మదుషంక ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చడంతో కంగారూ శిబిరం ఆత్మరక్షణలో పడినట్లయింది. అయితే మరో ఓపెనర్ మార్‡్ష, లబుõÙన్ (60 బంతుల్లో 40; 2 ఫోర్లు) కుదురుగా ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ధాటిగా ఆడిన మార్‡్ష అర్ధసెంచరీ పూర్తయ్యాక రనౌట్ కాగా... తర్వాత వచి్చన ఇంగ్లిస్, లబుõÙన్ గట్టెక్కించే భాగస్వామ్యం నమోదు చేశారు. నాలుగో వికెట్కు 77 పరుగులు జతయ్యాక లబుõÙన్ పెవిలియన్ చేరాడు. ఫిఫ్టీ అనంతరం జట్టు విజయానికి చేరువ చేసి ఇంగ్లిస్ నిష్క్రమించాడు. మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), స్టొయినిస్ (10 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 61; కుశాల్ పెరీరా (బి) కమిన్స్ 78; మెండిస్ (సి) వార్నర్ (బి) జంపా 9; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 8; అసలంక (సి) లబుషేన్ (బి) మ్యాక్స్వెల్ 25; ధనంజయ (బి) స్టార్క్ 7; వెలలాగె (రనౌట్) 2; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 2; తీక్షణ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; లహిరు (బి) స్టార్క్ 4; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 209. వికెట్ల పతనం: 1–125, 2–157, 3–165, 4–166, 5–178, 6–184, 7–196, 8–199, 9–204, 10–209. బౌలింగ్: స్టార్క్ 10–0–43–2, హాజల్వుడ్ 7–1–36–0, కమిన్స్ 7–0–32–2, మ్యాక్స్వెల్ 9.3–0–36–1, జంపా 8–1–47–4, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్‡్ష (రనౌట్) 52; వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 11; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 0; లబుషేన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 40; ఇంగ్లిస్ (సి) తీక్షణ (బి) వెలలాగె 58; మ్యాక్స్వెల్ (నాటౌట్) 31; స్టొయినిస్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 3; మొత్తం (35.2 ఓవర్లలో 5 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–24, 2–24, 3–81, 4–158, 5–192. బౌలింగ్: లహిరు 4–0–47–0, మదుషంక 9–2–38–3, తీక్షణ 7–0–49–0, వెలలాగె 9.2–0–53–1, కరుణరత్నే 3–0–15–0, ధనంజయ 3–0–13–0. ఈదురు గాలులతో వర్షం, ఊడిపడిన హోర్డింగ్స్ బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. గాలి బలంగా వీయడంతో స్టేడియంలోని కొన్నిచోట్ల హోర్డింగులన్నీ ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రేక్షకుల హాజరు పలుచగా ఉండటం... ఊడిపడిన చోట జనం లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. చదవండి: SMT 2023: నిరాశపరిచిన సంజూ శాంసన్.. కేరళ ఘన విజయం -
డేవిడ్ వార్నర్ మంచి మనసు.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఇన్నింగ్స్ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావడంతో ప్లేయర్స్ అందరూ డగౌట్ వైపు పరుగులు తీశారు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం తన మంచిమనసును చాటుకున్నాడు. కవర్లను మైదానంలోకి తీసుకువచ్చేందుకు లక్నో గ్రౌండ్ స్టాప్కు వార్నర్ సహాయం చేశాడు. బౌండరీ లైన్ దగ్గర నుంచి పిచ్ వరకు గ్రౌండ్ స్టాప్తో పాటు వార్నర్ కవర్లను తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు వార్నర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఆసీస్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(61), కుశాల్ పెరీరా(78) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: WC IND Vs PAK: 'బాబర్ ఆజం చాలా పిరికివాడు.. ఫిప్టి కోసమే ఆడాడు' David Warner leads a helping hand to the ground staff 🤝#CWC23 #AUSvsSL #DavidWarner pic.twitter.com/N6yFIJ5T8d — Malik Farooq (@EngrM_Farooq) October 16, 2023 -
4 వికెట్లతో చెలరేగిన జంపా.. 209 పరుగులకు శ్రీలంక ఆలౌట్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. ఆసీస్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(61), కుశాల్ పెరీరా(78) తొలి వికెట్కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే నిస్సాంక ఔట్ అయిన తర్వాత శ్రీలంక పతనం మొదలైంది. వరుస క్రమంలో లంక వికెట్లు కోల్పోయింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 9వికెట్లను లంక కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆఖరిలో మ్యాక్స్వెల్ ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: SMT 2023: తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన హైదరాబాద్ -
CWC 2023: ఆసీస్తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎఖానా స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) శ్రీలంక-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో కోసం ఆసీస్ ఎలాంటి మార్పులు చేయకపోగా.. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్లో ఆడిన దసున్ షనక, మతీష పతిరణ స్థానాల్లో చమిక కరుణరత్నే, లహీరు కుమార జట్టులోకి వచ్చారు. గాయపడి స్వదేశానికి పయనమైన కెప్టెన్ షనక స్థానంలో కుశాల్ మెండిస్ లంక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తుద జట్లు.. ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక -
బోణీ విజయం కోసం పరితపిస్తున్న ఆసీస్, శ్రీలంక.. పైచేయి ఎవరిదంటే..?
వన్డే వరల్డ్కప్-2023 ప్రారంభమై పది రోజులు పూర్తైనప్పటికీ ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, 1996 వరల్డ్కప్ విన్నర్ శ్రీలంక బోణీ విజయం కోసం పరితపిస్తూనే ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్రస్తుత ఎడిషన్లో చెరో రెండు మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయాయి. ఆస్ట్రేలియా.. భారత్, సౌతాఫ్రికా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొని ఎన్నడూ లేనట్లుగా పాయింట్ల పట్టికలో చివరినుంచి మొదటిస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్ చేతుల్లో ఓటమిపాలైన శ్రీలంక పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) తలపడనున్న ఈ ఇరు జట్లు.. గెలుపుపై గంపెడాశలు పెట్టుకుని బరిలోకి దిగనున్నాయి. ప్రపంచకప్లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రీలంకపై ఆసీస్కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఈ రెండు జట్లు ప్రపంచకప్ టోర్నీల్లో 11 సార్లు ఎదురెదురుపడగా.. 8 మ్యాచ్ల్లో ఆసీస్, 2 సందర్భాల్లో శ్రీలంక విజయం సాధించాయి. 1996 వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన శ్రీలంక.. ఆ ఎడిషన్లోనే రెండుసార్లు ఆసీస్పై గెలుపొందింది. గ్రూప్ మ్యాచ్లో వాకోవర్ లభించడంతో ఒక్క బంతి కూడా పడకుండానే విజేతగా నిలిచిన శ్రీలంక.. ఫైనల్లో ఆసీస్ను మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. ప్రస్తుత వరల్డ్కప్లో ఇరు జట్ల ఫామ్ను పరిశీలిస్తే.. ఆసీస్తో పోలిస్తే శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. లంకేయులు బౌలింగ్ విషయంలో చాలా వీక్గా ఉన్నా.. బ్యాటింగ్లో మాత్రం భీకర ఫామ్లో ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలోనూ (429) ఏమాత్రం తడబడని లంక బ్యాటర్లు గెలవలేమని తెలిసినప్పటికీ చివరి నిమిషం వరకు పోరాడారు. ఈ మ్యాచ్లో లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (76), చరిత్ అసలంక (79), షనక (68) మెరుపు అర్ధశతకాలతో విజృంభించారు. అనంతరం పాక్తో జరిగిన రెండో మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేస్తూ చెలరేగిన లంక బ్యాటర్లు 344 పరుగుల భారీ స్కోర్ను చేశారు. అయితే బౌలర్లు విఫలం కావడంతో ఈ మ్యాచ్లో కూడా ఆ జట్టు ఓడింది. సౌతాఫ్రికాపై చెలరేగిన కుశాల్ మెండిస్ ఈ మ్యాచ్లోనూ (122) పట్టపగ్గాల్లేకుండా విజృంభించాడు. అతనితో పాటు సమరవిక్రమ కూడా శతక్కొట్టాడు. నిస్సంక (51) అర్ధసెంచరీతో రాణించాడు. మరోవైపు ఆసీస్ రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తూ 199 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియన్లు.. ఆతర్వాత చిన్న స్కోర్ను డిఫెండ్ చేసుకోవడంలో కూడా చేతులెత్తేశారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లోనూ ఇదే సీన్ రిపీటైంది.ఈ మ్యాచ్లోనూ ఆస్ట్రేలియన్లు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధిని 311 పరుగులు చేయనిచ్చిన ఆస్ట్రేలియన్లు.. ఆతర్వాత బ్యాటింగ్లో ఘోరంగా విఫలమై 177 పరుగులకే కుప్పకూలారు. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో లంక ఆసీస్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారిస్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిసింది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఎలిస్సే పెర్రీ వేసిన బంతిని చమేరీ ఆటపట్టు లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాలని ప్రయత్నించింది. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్లో ఉన్న గ్రేస్ హారిస్ తన కుడివైపునకు కొన్ని గజాల దూరం పరిగెత్తి డైవ్ చేసి బంతిని అందుకుంది. ఆమె అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా మాత్రం ఉండలేం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక హారిస్ స్టన్నింగ్ క్యాచ్తో మాత్రమే కాదు బౌలింగ్లోనూ అదరగొట్టింది. మూడు ఓవర్లు వేసిన గ్రేస్ హారిస్ ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వుమెన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. మాదవి 34 పరుగులు చేయగా.. విశ్మి గుణరత్నే 24 పరుగులు చేసింది. ఆసీస్ వెటరన్ పేసర్ మేఘన్ స్కాట్ నాలుగు వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 15.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్ను చేధించింది. బెత్ మూనీ 56 నాటౌట్, అలీసా హేలీ 54 నాటౌట్ ఆసీస్ను గెలిపించారు. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. That's unreal from Grace Harris, what a catch #T20WorldCup pic.twitter.com/AkJRxZYzdf — Ricky Mangidis (@rickm18) February 16, 2023 చదవండి: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న! -
స్టొయినిస్ విధ్వంసం.. లంకపై ఆసీస్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీపావళి తర్వాతి రోజు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ రాకెట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్తో పెర్త్ మైదానం దద్దరిల్లింది. స్టొయినిస్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. లంక నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టొయినిస్ మెరుపు హాఫ్ సెంచరీతో (18 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) లంక బౌలర్లను చీల్చిచెండాడు. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు హేజిల్వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్వెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తలో వికెట్ పడగొట్టడంతో శ్రీలంక నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (11), మిచెల్ మార్ష్ (17) వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ.. కెప్టెన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్; సిక్స్), మ్యాక్స్వెల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 13 ఓవర్లో మ్యాక్సీ ఔట్ కావడంతో బరిలోకి దిగిన స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. స్టొయినిస్ విధ్వంసం ధాటికి ఆసీస్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక -
రాణించిన బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
టీ20 వరల్డ్ కప్-2022 సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్ల్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంకేయులు నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వీరు మినహా లంక ఇన్నింగ్స్లో అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్వెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తలో వికెట్ పడగొట్టారు. కాగా, పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆసీస్.. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఘన విజయం సాధించిన శ్రీలంక సైతం ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తుది జట్లు.. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్ష, దసున్ శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహీరు కుమార చదవండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. కరోనాతో స్టార్ బౌలర్ దూరం -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. కరోనాతో స్టార్ బౌలర్ దూరం
టీ20 వరల్డ్ కప్-2022 సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఘన విజయం సాధించిన శ్రీలంక రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుండగా.. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆసీస్ విజయ దాహంతో రంకెలేస్తుంది. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కరోనా బారిన పడిన ఆడమ్ జంపా స్థానంలో ఆస్టన్ అగర్ జట్టులోకి రాగా.. శ్రీలంక గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. తుది జట్లు.. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్ష, దసున్ శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహీరు కుమార -
లంకతో పోరుకు ముందు ఆసీస్కు భారీ షాక్.. కీలక బౌలర్కు అనారోగ్యం
టీ20 వరల్డ్కప్-2022 ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆస్ట్రేలియాకు శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరుగబోయే కీలక పోరుకు ముందు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ధృవీకరించింది. జంపా.. తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని, అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీఏ పేర్కొంది. జంపా కీలక బౌలర్ కావడంతో, కరోనా లక్షణాలు కూడా స్వల్పంగా ఉండటంతో అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సీఏకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ ఆసీస్ యాజమాన్యం జంపాను పక్కకు పెట్టాలని భావిస్తే, అతని స్థానంలో ఆస్టన్ అగర్ జట్టులోకి వస్తాడని అతను తెలిపాడు. కాగా, కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆల్రౌండర్ జార్జ్ డాక్రెల్ కోవిడ్ నిర్ధారణ అయినప్పటికీ బరిలోకి దిగాడు. ఇదిలా ఉంటే, తొలి మ్యాచ్లోనే కివీస్ చేతిలో ఓడి సెమీస్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆస్ట్రేలియా.. లంకతో జరగాల్సిన మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ ఆఫ్ డెత్గా పరిగణించే గ్రూప్-1లో అన్ని జట్లు పటిష్టమైనవే కావడంతో సెమీస్ బెర్తులకు తీవ్ర పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ తొలి మ్యాచ్లో ఓడటంతో తదుపరి జరిగే 4 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. చదవండి: ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా? -
ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా?
టీ20 ప్రపంచకప్-2022లో డిఫిండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. పెర్త్ వేదికగా మంగళవారం(ఆక్టోబర్25) శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా న్యూజిలాండ్తో జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్లో ఆసీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో ఆసీస్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కాన్వే(92) చేలరేగడంతో 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. మ్యాక్స్వెల్ మెరుస్తాడా ఇక శ్రీలంకతో జరగనున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఇప్పటికే అఖరి స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి వరుస మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించకపోతే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టక తప్పదు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసీస్ విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్, మార్ష్, డేవిడ్ చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు. అదే విధంగా బౌలింగ్లో హాజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ ఈ ముగ్గురు పేసర్లు నిప్పులు చేరిగితే లంక బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవు. ఇక ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ ఫామ్ లేమి ఆస్ట్రేలియాను కాస్త కలవరపెడుతోంది. అయితే న్యూజిలాండ్పై మ్యాక్స్వెల్ కాస్త పర్వాలేదనపించాడు. మ్యాక్స్వెల్ తన మునపటి ఫామ్ను తిరిగి పొందితే ఆస్ట్రేలియాకు ఇక తిరుగుండదు. మెండిస్, హాసరంగా మళ్లీ మ్యాజిక్ చేస్తారా రౌండ్-1లో నమీబియా చేతిలో ఆనూహ్యంగా ఓటమి చెందిన శ్రీలంక.. అనంతరం యూఏఈ, నెదర్లాండ్స్ను మట్టి కరిపించి సూపర్-12లో అడుగుపెట్టింది. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్ను చిత్తు చేసి తమ జోరును కొనసాగించింది. శ్రీలంక బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్లో మాత్రం అంత అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరూ కనిపించడం లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ చమీరా, యువ బౌలర్ మధుషాన్ గాయం కారణంగా దూరం కావడంతో లంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్కు దూరమైన మరో ఓపెనర్ నిస్సాంక.. ఆసీస్తో పోరుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్లో మాత్రం లంక పూర్తి స్థాయిలో హాసరంగా, థీక్షణపైనే అధారపడుతోంది. ఈ మ్యాచ్లో హాసరంగా తన స్పిన్ మ్యాజిక్ను మరోసారి రిపేట్ చేస్తే ఆస్ట్రేలియా కష్టాలు తప్పవు. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 25 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 15 మ్యాచ్ల్లో, లంక 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. వరల్డ్కప్లో అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 3 సార్లు, శ్రీలంక 2 సార్లు గెలుపొందాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 World Cup 2022: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్గా -
'లంక దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు. ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు. కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్కున్న ట్యాగ్లైన్ ఉత్తదేనా! Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
'ఇన్నేళ్ల నీ అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్లో తాను చేసిన ఒక పొరపాటు అతని మెడకు చుట్టుకునేలా చేసింది. ఔట్ అని క్లియర్గా తెలుస్తున్నప్పటికి అనవరసంగా రివ్యూకు పోయి చేతులు కాల్చుకోవడమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలను సైతం అందుకున్నాడు. విషయంలోకి వెళితే తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరు చూపించాలనుకున్నాడు. కానీ స్మిత్ రెండో ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. ప్రభాత్ జయసూర్య వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఐదో బంతి నేరుగా స్మిత్ ప్యాడ్లను తాకింది. లంక జట్టు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటిచ్చాడు. బంతి కేవలం ప్యాడ్లను మాత్రమే తాకి లెగ్స్టంప్ను ఎగురగొడతున్నట్లు క్లియర్గా తెలిసిపోయింది. దీనికి తోడూ బ్యాట్కు బంతి తగల్లేదు. అయినా కూడా స్మిత్ రివ్యూకు వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. రిప్లేలో అతను క్లియర్ ఔట్ అని తేలింది. అంతే స్మిత్ రివ్యూపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ''క్లియర్ ఔట్ అని తెలిసినప్పటికి రివ్యూ కోరి చేతులు కాల్చుకున్నాడు.. క్రికెట్ చరిత్రలో స్మిత్ తీసుకున్న రివ్యూ అత్యంత చెత్త నిర్ణయం.. ఇన్నేళ్ల అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 151 పరుగులకే కుప్పకూలడంతో లంక ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. అంతకముందు చండీమల్ డబుల్ సెంచరీతో మెరవడంతో లంక 554 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. Steve Smith should be banned from international cricket for two years after that review, — Jon “Semi-Fungible Airships” Kudelka (@jonkudelka) July 11, 2022 Whether it’s his outburst after his First Test run out or this, I remain of the view is that Steve Smith should do a Joe Root and not have any leadership responsibilities - he’s so self-obsessed about his batting as to be a great batter but also a poor leader. #SLvAUS https://t.co/Ex62fgXmt1 — Kevin Yam 任建峰 (@kevinkfyam) July 11, 2022 చదవండి: David Warner:'ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ' -
'క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. లంక అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స దిగిపోవాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్ భవనాన్ని ముట్టడించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజపక్స అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా రెండు రోజులపాటు లంకలోనే ఉన్న రాజపక్స దుబాయ్కు పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇక జూలై 13న(బుధవారం) రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ లంకతో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ విజయవంతంగా సిరీస్ను ముగించుకుంది. తమ దేశంలో పర్యటించినందుకు లంక అభిమానులు సైతం మ్యాచ్ వేదికగా లవ్ యూ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమ దేశానికి బయలుదేరేముందు ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ‘ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాకు ఆతిథ్యమిచ్చినందుకు థాంక్యూ శ్రీలంక. ఈ పర్యటనకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం. ఇక్కడున్నన్ని రోజులు మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. మాకు ఎల్లవేళలా మద్దతునిచ్చారు. ఈ పర్యటనను మేము ఎప్పటికీ మరిచిపోలేం. మీ దేశంలో నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే.. దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు తలెత్తినా మీ ముఖం నుంచి చిరునవ్వు చెదరలేదు. మేం ఎక్కడికి వెళ్లినా మాకు ఘన స్వాగతం పలికారు. థాంక్యూ. నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడకు హాలీడేకు రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. కాగా వార్నర్ లంక జాతీయ జెండాను షేర్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా లంక పర్యటనకు వెళ్లారు. లంకలో జూన్ 7 న మొదలైన ఆసీస్ పర్యటన సోమవారం గాలేలో ముగిసిన రెండో టెస్టుతో పూర్తైంది. ఈ టూర్ లో ఆసీస్.. టీ20 సిరీస్ ను గెలుచుకుని వన్డే సిరీస్ను కోల్పోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ను మాత్రం ఆస్ట్రేలియా సమం చేసుకుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) చదవండి: ఆసీస్ అగ్రపీఠాన్ని కదిలించి మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక -
కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ అట్టుడుకుతున్న ద్వీప దేశం శ్రీలంకకు భారీ ఊరట లభించే వార్త ఇది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో లంక జట్టు పటిష్టమైన కంగారూలను ఖంగుతినిపించి 2 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. దినేశ్ చండీమాల్ (206) అజేయ ద్విశతకంతో, అరంగేట్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 12 వికెట్లతో (6/118, 6/59) చెలరేగి శ్రీలంకకు చారిత్రక విజయాన్ని అందించారు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరితో పాటు రమేశ్ మెండిస్ (2/47), మహీశ్ తీక్షణ (2/28) కూడా రాణించడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 10 wicket haul on a debut ✔️Best figures by a Sri Lankan on a debut ✔️Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 For his brilliant performance, Dinesh Chandimal has been named the Player of the Series 👏#SLvAUS pic.twitter.com/VZIIFDSNF1— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 జయసూర్య స్పిన్ మాయాజాలం ధాటికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. 431/6 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే, ఆసీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక.. ఆతర్వాత వన్డే సిరీస్ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు! -
SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న రెండో మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండిమాల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారిగా ద్విశతకం నమోదు చేశాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో భాగంగా చండిమాల్ 206 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 326 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో చండిమాల్కు ఇది మొదటి ద్విశతకం. సిక్సర్తో ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇక చండిమాల్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఆతిథ్య శ్రీలంక 554 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఈ నేపథ్యంలో చండిమాల్పై సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి సూర్యకుమార్ యాదవ్.. ఈరోజు చండిమాల్.. వేర్వేరు ఫార్మాట్లు.. వేర్వేరు శైలి.. కానీ ఎంతో ఆసక్తిగా మ్యాచ్ను తిలకించేలా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు’’ అంటూ ఇండియా- ఇంగ్లండ్ మూడో టీ20, ఆసీస్-లంక టెస్టు మ్యాచ్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఇతర ఆటగాళ్లు, నెటిజన్లు సైతం చండిమాల్ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ పర్యాటక ఆసీస్ సొంతం కాగా.. వన్డే సిరీస్ను ఆతిథ్య లంక కైవసం చేసుకుంది. ఇక మొదటి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్లో లంక గట్టిపోటీనిస్తోంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో భాగంగా నాలుగో రోజు ఆటలో లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు: టాస్: ఆస్ట్రేలియా- బ్యాటింగ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 364-10 (110 ఓవర్లు) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 554-10 (181 ఓవర్లు) ఆసీస్ రెండో ఇన్నింగ్స్: ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 151-10 (41 ఓవర్లు) చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... Dinesh Chandimal has torn strips off the Aussie attack, scoring an unbeaten 206* - bringing up his double century with two huge sixes, one of which ended up on the streets of Galle 🇱🇰🏏 LATEST 👉 https://t.co/pOShHsRakQ pic.twitter.com/AuBg6KpuIR — Telegraph Sport (@telegraph_sport) July 11, 2022 Dinesh Chandimal Completed his 200 with a Sixxxx #SLvAUS 🇱🇰#Dineshchandimal #lka #SLC #LKA pic.twitter.com/QXZHncw1fX — Talk True With ME (@TalkTrueWithME) July 11, 2022 -
టెస్ట్ మ్యాచ్ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు
Pathum Nissanka: శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఆతిధ్య శ్రీలంక జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. 🔴 Team Updates: Pathum Nissanka has tested positive for Covid-19. He was found to be positive during an Antigen test conducted on the player yesterday morning, following the player complaining of feeling unwell. #SLvAUS pic.twitter.com/NwTdTLOVFZ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతని స్థానంలో ఒషాడ ఫెర్నాండో కోవిడ్ సబ్స్టిట్యూట్గా జట్టులోకి వచ్చాడు. అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లంక స్టార్ ఆటగాడు ఏంజలో మాథ్యూస్ సైతం ఇలానే మ్యాచ్ మధ్యలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆ తర్వాత జట్టు మొత్తానికి జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరో నలుగురికి (ప్రవీణ్ జయవిక్రమ, ధనంజయ డిసిల్వ, జెఫ్రె వాండర్సే, అషిత ఫెర్నాండో) కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శ్రీలంక జట్టులో వరుసగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే, కోవిడ్ కేసు వెలుగుచూసినా మ్యాచ్ యధాతథంగా కొనసాగుతుంది. నాలుగో రోజు ఆటలో సెంచరీ హీరో దినేశ్ చండీమాల్ మరింత రెచ్చిపోయి డబుల్ బాదడంతో శ్రీలంకకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 431/6 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. చండీమాల్ 206 పరుగులతో అజేయంగా నిలువగా.. కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు లంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4, స్వెప్సన్ 3, లయన్ 2, కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్ను తిప్పేశాడు. చదవండి: WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్ ఘన విజయం -
చండీ'క'మాల్ శతకం.. ఆసీస్పై లంక పైచేయి
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక పైచేయి సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ దినేశ్ చండీమాల్ అజేయ శతకంతో (118) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 67 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. చండీమాల్తో పాటు రమేశ్ మెండిస్ (7) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో చండీమాల్ కాకుండా మరో నలుగురు హాఫ్సెంచరీలు సాధించారు. 💯Dinesh Chandimal brings up his 13th Test hundred, reaching the mark in 195 balls 🙌#SLvAUS pic.twitter.com/zLiBKUylBI— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 10, 2022 కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు శ్రీలంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, మిచెల్ స్వెప్సన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్ను తిప్పేశాడు. చదవండి: టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..! -
ఆసీస్ను 'ఆరే'సిన జయసూర్య.. అరంగేట్రం మ్యాచ్లోనే రెచ్చిపోయిన లంక స్పిన్నర్
Prabath Jayasuriya: గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో లంక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్లోనే ఆరు వికెట్ల ప్రదనర్శనతో రెచ్చిపోయాడు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పర్యాటక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య తన డెబ్యూ ఇన్నింగ్స్లో 36 ఓవర్లలో 118 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. Outstanding debut figures for Prabath Jayasuriya! 🙌#SLvAUS pic.twitter.com/Df4FcVsczk — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2022 ఓవర్నైట్ స్కోర్ 298/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. జయసూర్య మాయాజాలం ధాటికి మరో 66 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ (145 నాటౌట్) ఓవర్నైట్ స్కోర్కు మరో 36 పరుగులు జోడించి అజేయంగా నిలువగా.. మిగిలిన ఆటగాళ్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. లంక రెండో రోజు పడగొట్టిన 5 వికెట్లలో జయసూర్యకు 3 వికెట్లు దక్కాయి. లంక బౌలర్లలో జయసూర్య 6, రజిత 2, ఆర్ మెండిస్, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టు లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. అంతకుముందు తొలి రోజు ఆటలో స్మిత్తో పాటు మార్నస్ లబుషేన్ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు) సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరు మూడో వికెట్కు 134 పరుగులు జోడిండి ఆసీస్ను ఆదుకున్నారు. చదవండి: దినేశ్ కార్తీక్కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్లో ప్లేయర్ ఇప్పుడు..! -
శ్రీలంకపై ప్రకృతి ప్రకోపం.. వర్ష బీభత్సం ధాటికి అతలాకుతలమైన క్రికెట్ స్టేడియం
ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకపై ప్రకృతి సైతం పగబట్టింది. ఇవాళ (జూన్ 30) ఉదయం కురిసిన భారీ వర్షం దెబ్బకు లంకలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సం ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వర్ష ప్రభావం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్పై కూడా చూపింది. There's more cleaning up to do off the field than on it this morning... if anyone can get this ground ready for play it's the Galle team #SLvAUSpic.twitter.com/iklKta7xfM— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) June 30, 2022 వర్షం ధాటికి ఈ మ్యాచ్కు వేదిక అయిన గాలే స్టేడియం అతలాకుతలమైంది. తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రారంభమైన గాలివాన దెబ్బకు ఓ స్టాండ్ రూఫ్ కూలిపోవడంతో పాటు స్టేడియం మొత్తం చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ఫలితంగా రెండో రోజు ఆట దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈదురుగాలుల ధాటికి రూఫ్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే, వర్షం పూర్తిగా ఆగిపోయాక లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. 98/3 ఓవర్నైట్ స్కోర్ వద్ద ప్రారంభమైన రెండు రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి 101 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ఓవర్నైట్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (71), కెమరూన్ గ్రీన్ (77) అర్ధసెంచరీతో రాణించారు. అలెక్స్ క్యారీ (45) పర్వాలేదనిపించాడు. కమిన్స్ (26), లయన్ (8) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లయన్ 5 వికెట్లతో చెలరేగాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో! -
ఐదేసిన లయన్.. లంకను కట్టడి చేసిన ఆసీస్
Nathan Lyon: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 212 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (5/90) లంక పతనాన్ని శాశించగా, స్వెప్సన్ (3/55), స్టార్క్ (1/31), కమిన్స్ (1/25) తలో చేయి వేశారు. లంక ఇన్నింగ్స్లో వికెట్కీపర్ నిరోషన్ డిక్వెల్లా (58) అర్ధసెంచరీతో రాణించగా మిగతా ఆటగాళ్లంతా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు కరుణరత్నే (28), నిస్సంక (23), మాథ్యూస్ (39), ఆర్ మెండిస్ (22), ధనంజయ డిసిల్వా (14) రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు..డేవిడ్ వార్నర్ (25), ఉస్మాన్ ఖ్వాజా (47 నాటౌట్) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 47 పరుగులు జోడించాక వార్నర్ మెండిస్ బౌలింగ్లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. వార్నర్ పెవిలియన్కు చేరాక ఆసీస్ స్వల్ప వ్యవధిలో లబూషేన్ (13), స్టీవ్ స్మిత్ (6)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఖ్వాజా, ట్రవిస్ హెడ్ (6) క్రీజ్లో ఉన్నారు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 2 వికెట్లు పడగొట్టగా, స్టీవ్ స్మిత్ రనౌటయ్యాడు. కాగా, లంక పర్యటనలో ఆసీస్ టీ20 సిరీస్ను (2-1) కైవసం చేసుకుని వన్డే సిరీస్ను (2-3) చేజార్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లండ్తో ఐదో టెస్ట్కు టీమిండియా కెప్టెన్ ఎవరంటే..!? -
SL vs AUS: జోరు మీదున్న శ్రీలంక.. ఆసీస్తో టెస్టు సిరీస్కు జట్టు ఇదే!
Sri Lanka Vs Australia Test Series 2022: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగబోయే టెస్టు సిరీస్కు శ్రీలంక బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆసీస్తో రెండు మ్యాచ్లు ఆడే క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన వివరాలు శనివారం వెల్లడించింది. దిముత్ కరుణ కెప్టెన్సీలోని ఈ జట్టులో స్పిన్నర్ జాఫ్రీ వాండర్సేకు చోటు దక్కింది. వన్డే సిరీస్లో ఆకట్టుకున్న అతడు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాఫ్రీతో పాటు కుశాల్ మెండిస్, పాథుమ్ నిశాంక, చమిక కరుణ రత్నే, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్విల్లా తదితర వన్డే ప్లేయర్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా జూన్ 29 నుంచి గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లంక- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇక మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో టీ20 సిరీస్ను 2-1తేడాతో పర్యాటక కంగారూ జట్టు సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టు ఇదే! దిముత్ కరుణరత్నే(కెప్టెన్), పాథుమ్ నిశాంక, ఒషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, ఆసిత ఫెర్నాండో, దిల్షాన్ ముదుషంక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డెనియా, జాఫ్రీ వాండర్సే. చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! -
చివరి వన్డేలో ఆసీస్ విజయం.. ఆస్ట్రేలియాకు లంక ఫ్యాన్స్ కృతజ్ఞతలు
శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పటికే లంక వరుసగా మూడు వన్డేలు గెలవడంతో సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. 1992 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై శ్రీలంక వన్డే సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు ఆసీస్ క్రికెట్ ఆడేందుకు రావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ క్రికెట్ బోర్డు పెద్ద మనసుతో లంక పర్యటనకు రావడం కాస్త ఆదాయాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పొచ్చు. ఇక లంక జట్టు టి20 సిరీస్ కోల్పోయినప్పటికి.. వన్డే సిరీస్ను మాత్రం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక అభిమానులు కష్టాల్లో ఉన్న తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. చివరి వన్డే సందర్భంగా హాజరైన ప్రేక్షకులు ''లంక పర్యటనకు వచ్చినందుకు థాంక్యూ ఆస్ట్రేలియా'' అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లంక అభిమానులు తమ చర్యతో అందరి హృదయాలను దోచుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఒక దశలో 85 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో చమీర కరుణరత్నే 75 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ప్రమోద్ మధుసూదన్ 15 పరుగులతో సహకరించాడు. కాగా లంక 43.1 ఓవర్లలో 160 పరుగులు చేయగా.. కరుణరత్నేవి 75 పరుగులు ఉండడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా మొదట్లో తడబడింది. డేవిడ్ వార్నర్(10), ఆరోన్ ఫించ్(0), జోష్ ఇంగ్లిష్(5) తొందరగానే వెనుదిరగడంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్ మార్ష్ (24 పరుగులు), మార్నస్ లబుషేన్(31 పరుగులు) ఆదుకున్నారు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ 45 నాటౌట్, కామెరున్ గ్రీన్ 25 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. The sea of blue has turned yellow 💛 A lovely gesture from the Sri Lanka fans for Australia 🤩#SLvAUS pic.twitter.com/zfip5VV7Zf — ICC (@ICC) June 24, 2022 చదవండి: సిక్సర్తో పంత్ అర్థశతకం.. ఫామ్లోకి వచ్చినట్టేనా! Daryl Mitchell: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు -
SL vs AUS: ఇప్పటికే సిరీస్ గోవిందా! ఆసీస్కు మరో ఎదురుదెబ్బ!
Sri Lanka Vs Australia: శ్రీలంక పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ జట్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా నామమాత్రపు ఐదో వన్డేకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఒకవేళ గాయం తీవ్రతరమైతే జూన్ 29 నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు కూడా ట్రవిస్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఆసీస్ జట్టులో కీలక సభ్యుడైన ట్రవిస్ హెడ్ శ్రీలంక పర్యటనలో భాగంగా మూడో వన్డేలో 70 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా 5 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇప్పటికే శ్రీలంక 3-1తో కైవసం చేసుకుంది. తద్వారా సొంతగడ్డపై దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా దసున్ శనక బృందం నిలిచింది. మరోవైపు టీ20 సిరీస్ను 2-1తో గెలిచిన వన్డే సిరీస్లో మాత్రం రాణించలేకపోయింది. ఇరు జట్ల మధ్య కొలంబో వేదికగా ఆఖరి వన్డే జరుగనుంది. చదవండి: USA Swimmer Anita Alvarez: నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు Yashasvi Jaiswal On Jos Buttler: వరుస సెంచరీలు.. నా విజయ రహస్యం అదే! ఆయన వల్లే ఇదంతా! -
99 పరుగుల వద్ద స్టంపౌటైన వార్నర్.. వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు
కొలొంబో: సొంతగడ్డపై శ్రీలంక 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. 1992 తర్వాత తొలిసారి ఆ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను గెలుచుకుంది. మంగళవారం (జూన్ 21) జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ను 4 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 5 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో ఆసీస్ 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. Sri Lanka won a ODI Series against australia for the first time in the last 30 years. What a historic win for Sri Lanka. pic.twitter.com/vT6yMV4rgN — CricketMAN2 (@ImTanujSingh) June 21, 2022 లంక జట్టులో చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా, ధనంజయ డిసిల్వ (61 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, చివర్లో ప్యాట్ కమిన్స్ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు), కునెర్మన్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. Heartbreak for David Warner. He gone for 99 runs. But nevertheless he played a brilliant Innings in this difficult condition in this run chase against Sri Lanka. Well played, David Warner. pic.twitter.com/YBOFSx6sgq — CricketMAN2 (@ImTanujSingh) June 21, 2022 వీవీఎస్ లక్ష్మణ్ సరసన వార్నర్ లంకతో జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాధ్యతాయుతంగా ఆడిన వార్నర్ 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయిన రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. 2002లో నాగ్పూర్ వేదికగా విండీస్తో జరిగిన వన్డేలో టీమిండియా ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇలానే 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. చదవండి: ఆసీస్కు షాకిచ్చిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలుపు -
ఆసీస్కు షాకిచ్చిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలుపు
కొలంబో: సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను గెలుచుకుంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా, ధనంజయ డిసిల్వ (61 బంతుల్లో 60; 7 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, చివర్లో ప్యాట్ కమిన్స్ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు) పోరాడాడు. ఒకదశలో 189/4తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించిన ఆసీస్ వరుస వికెట్లతో ఓటమిని ఆహ్వానించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. షనక వేసిన ఈ ఓవర్లో ఆసీస్ బ్యాటర్ కునెర్మన్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) తొలి బంతిపై పరుగు తీయలేదు. ఆ తర్వాత 4,2,4,4తో 14 పరుగులు సాధించాడు. దాంతో ఆసీస్ గెలుపునకు ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కునెర్మన్ను షనక అవుట్ చేసి ఈ సిరీస్లో లంకకు వరుసగా మూడో విజయాన్ని ఖరారు చేశాడు. లంక తరఫున ఎనిమిది మంది బౌలర్లు బౌలింగ్ వేయగా అందులో ఏడుగురు వికెట్లు తీయడం విశేషం. ధనంజయ డిసిల్వా, వాండర్సె, చమిక కరుణరత్నే రెండేసి వికెట్లు తీయగా... తీక్షణ, హసరంగ, వెల్లలాగె, కెప్టెన్ దసున్ షనక ఒక్కో వికెట్ పడగొట్టారు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్ను లంక 3–1తో గెలుచుకోగా, చివరి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. 2012 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక వరుసగా మూడు వన్డేల్లో గెలుపొందడం విశేషం. -
శతక్కొట్టిన అసలంక.. అయినా తక్కువ స్కోర్కే పరిమితమైన శ్రీలంక
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 3 వన్డేల్లో వరుసగా రెండు వన్డేల్లో గెలుపొంది ఆధిక్యంలో కొనసాగుతున్న (2-1) ఆ జట్టు తాజాగా జరుగుతున్న నాలుగో వన్డేలోనూ మెరుగైన ప్రదర్శన చేసి మరో విజయం దిశగా అడుగులు వేస్తుంది. కొలొంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకంతో రాణించినప్పటికీ 258 పరుగులకే పరిమితమైంది. 𝑾𝑯𝑨𝑻. 𝑨. 𝑲𝑵𝑶𝑪𝑲 🔥 A maiden international century for Charith Asalanka! Well played 👏 Watch the #SLvAUS series on https://t.co/WngPr0Ns1J (in select regions) 📺 📝 Scorecard: https://t.co/KsvSxzgG3U pic.twitter.com/a36jglPTSB — ICC (@ICC) June 21, 2022 Sri Lanka post a total of 258 on the board. Will the bowlers defend this total?#SLvAUS pic.twitter.com/dJDhSlsIjx — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2022 అసలంకకు ధనంజయ డిసిల్వ (60) మినహా ఎవరూ సహకరించకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోర్కే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో కున్హేమన్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో 2 వికెట్లు, మ్యాక్స్వెల్ ఓ వికెట్ పడగొట్టగా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు రనౌటయ్యారు. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (70) ఆసీస్ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో గనుక శ్రీలంక విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుని సంచలనం సృష్టిస్తుంది. కాగా, వన్డే సిరీస్కు ముందు ఆసీస్తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. చదవండి: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
ఆసీస్కు కలిసిరాని వర్షం.. రెండో వన్డేల్లో లంక గెలుపు
పల్లెకెలె: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు 26 పరుగుల తేడాతో డక్వర్త్ లూయిస్(డీఎల్) పద్ధతిలో గెలిచింది. వర్షంతో మొదట 47.4 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్లకు 220 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (36), ధనంజయ (34), కెప్టెన్ షనక (34) మెరుగ్గా ఆడారు. తర్వాత మళ్లీ వర్షం రావడంతో డీఎల్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు 43 ఓవర్లలో 221 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఆసీస్ 37.1 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (37) టాప్ స్కోరర్ కాగా, లంక బౌలర్లలో కరుణరత్నే 3, వెల్లలగే, చమీర, ధనంజయ తలా 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి. -
వర్షం హోరులో మ్యాక్స్వెల్ జోరు.. తొలి వన్డే ఆసీస్దే
శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ సాధించింది. వర్షం హోరులో గ్లెన్ మ్యాక్స్వెల్ జోరు చూపించాడు. అతని మెరుపులకు తోడు జట్టు సమిష్టి ప్రదర్శన తోడవ్వండతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 86 నాటౌట్, పాతుమ్ నిస్సాంక 56, గుణతిలక 55 రాణించారు. చివర్లో హసరంగా 19 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తొలి ఇన్నింగ్స్ అనంతరం ఆటకు 90 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ టార్గెట్ను 44 ఓవర్లలో 282 పరుగులుగా నిర్ణయించారు. డేవిడ్ వార్నర్ డకౌట్గా వెనుదిరిగినప్పటికి కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44, స్టీవ్ స్మిత్ 53 జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత లబుషేన్ 24, మార్కస్ స్టోయినిస్ 44, అలెక్స్ క్యారీ 21 పరుగులు చేశారు. ఇక చివర్లో మ్యాక్స్వెల్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్గా నిలిచి విధ్వంసం సృష్టించి జట్టును విజేతగా నిలిపాడు. చదవండి: బెయిర్స్టో విధ్వంసకర శతకం.. కివీస్పై ఇంగ్లండ్ సంచలన విజయం -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వేళ.. 'ఆ నవ్వు చూసి చాలా కాలమైంది'
శ్రీలంకలో ఎప్పుడో ఆగిపోయిన నవ్వులు శనివారం మళ్లీ పూశాయి. లంకలో ఆ నవ్వులు ఎందుకు ఆగిపోయాయో అందరికి తెలిసిందే. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి.. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం వరుసగా లంకను చుట్టుముట్టాయి. పర్యాటకానికి కేంద్రంగా ఉండే లంకలో ముఖ్యంగా కరోనా తర్వాత తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తినడానికి తిండి లేక విలవిల్లాడారు. ప్రభుత్వాన్ని గద్దె దిగాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో లంకలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఏడాదిగా ప్రభుత్వం చర్యలతో విసిగిపోయిన ప్రజలకు మానసిక సంతోషం చాలా అవసరం అనిపించింది. ఆ సంతోషాన్ని అక్కడి ప్రజలు క్రికెట్ ద్వారా కోరుకున్నారని నిన్నటి మ్యాచ్తో తెలిసింది.. కాదు తెలిసేలా చేశాడు లంక కెప్టెన్ దాసున్ షనక.. లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మొదట ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు వస్తుందా అన్న అనుమానం వచ్చింది. కానీ ఆసీస్ క్రికెట్ బోర్డు ఇవేమి పట్టించుకోలేదు. ఆపదలో ఉన్న లంక బోర్డును ఆదుకునేందుకు ఆసీస్ జట్టు మూడు టి20, ఐదు వన్డేలు, రెండు టెస్టుల ఆడేందుకు ఆ గడ్డపై అడుగుపెట్టింది. తొలి రెండు టి20లను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ను కైవసం చేసుకున్నప్పటికి శనివారం జరిగిన మూడో టి20లో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. లంక కెప్టెన్ దాసున్ షనక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఆఖరి మూడు ఓవర్లలో 59 పరుగులు అవసరమైన దశలో షనక 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అంతే.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో సంతోషం కట్టలు తెచ్చుకుంది. ఏదో సాధించామన్న ఫీలింగ్ అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిలో కనిపించింది. లంక అభిమానుల మొహాల్లో చాలా కాలం తర్వాత నవ్వు మళ్లీ విరిసింది. ఆ నవ్వుకు కారణమయ్యాడు దాసున్ షనక. ముఖ్యంగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన చిన్నపిల్లలు సైతం మ్యాచ్ గెలిచామంటూ ఉద్వేగంతో వారిచ్చిన హావభావాలు అందరిని ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు తినడానికి తిండి లేక అల్లల్లాడిపోయిన అక్కడి పిల్లల్లో ఈ ఆనందం చూసి మనకు కడుపు నిండినట్లయింది. క్రీడలు.. బాధలో ఉన్న వ్యక్తులకు ప్రశాంతత ఇవ్వడంతో పాటు సంతోషాన్ని పంచుతాయని లంక, ఆసీస్ మ్యాచ్ ద్వారా మరోసారి తెలియవచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనూ లంక కెప్టెన్ షనక స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ''మా ప్రజల్లో నవ్వు మళ్లీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి.. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వార్నర్ 39, స్టోయినిస్ 38, స్టీవ్ స్మిత్ 37 నాటౌట్, ఫించ్ 29 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక్.. షనక ఇన్నింగ్స్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇక మూడు టి20ల సిరీస్లో క్లీన్స్వీప్ నుంచి తప్పించుకున్న లంక.. విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని వన్డేలకు సిద్ధమవుతుంది. I’m very happy to see these smiling faces of my people 😇🇱🇰 pic.twitter.com/H4yQDmLpjj — Dasun Shanaka (@dasunshanaka1) June 11, 2022 చదవండి: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం.. థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత తన్నుకున్న భారత్, అఫ్గానిస్తాన్ ప్లేయర్స్ -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు 21 మంది సభ్యలతో కూడిన తమ జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో శ్రీలంక తలపడనుంది. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో అఖరి మ్యాచ్ శనివారం పల్లెకెలె వేదికగా జరగనుంది. శ్రీలంక జట్టు: దసున్ షనక, పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్స, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, అసిత, రమేశ్ తుషార మ, అసిత, రమేశ్ తుషార మ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్ చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం -
SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సిరీస్ ఆస్ట్రేలియాదే!
Australia tour of Sri Lanka, 2022- కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అసలంక (39), కుశాల్ మెండిస్ (36) రాణించారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 26 బంతులు ఎదుర్కొని 26 పరుగులు సాధించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లంక ఆల్రౌండర్ వనిందు హసరంగకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక.. టాపార్డర్ విఫలం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని బౌలర్లను కొనియాడాడు. శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారన్న ఫించ్.. మాథ్యూ వేడ్ అనుభవం జట్టును విజయాలకు చేర్చడంలో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ చేజార్చుకున్న లంక రాత స్వదేశంలోనైనా మారుతుందనుకుంటే అలా జరుగలేదు. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే పర్యాటక ఆసీస్ జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ జూన్ 11న పల్లెకెలెలో జరుగుతుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్గా ఆస్ట్రేలియాకు! -
లంక దారుణ ఆటతీరు.. 28 పరుగుల వ్యవధిలో
ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి టి20లో శ్రీలంక దారుణ ఆటతీరు కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 11.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ దశలో లంక బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా 200 పరుగుల మార్క్ను అందుకుంటుందని భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. 36 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక్కడి నుంచే లంక పతనం ఆరంభమైంది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక 28 పరుగుల వ్యవధిలో 19.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ త్రీ బ్యాటర్స్ మినహా మిగతా ఏడు మందిలో.. ఆరుగురు బ్యాటర్స్ (1,0,0,1,1,1,1) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. వనిందు హసరంగా 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్వుడ్ 4, మిచెల్ స్టార్క్ 3, కేన్ రిచర్డ్సన్ ఒక వికెట్ తీశాడు. చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్ Marcus Stoinis: కెరీర్కు టర్నింగ్ పాయింట్.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ -
SL Vs Aus: ఆసీస్తో టీ20.. శ్రీలంక తుది జట్టు ప్రకటన.. విజయం మాదే!
Sri Lanka Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్కు శ్రీలంక క్రికెట్ జట్టు సిద్ధమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం నాటి(జూన్ 7) మ్యాచ్కు శ్రీలంక తమ తుది జట్టును ప్రకటించింది. కాగా 3 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కోసం కంగారూ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడగా ఆతిథ్య ఆసీస్ జట్టు చేతిలో ఘోర పరాభవం చవిచూసింది. ఆఖరి మ్యాచ్లో మాత్రమే గెలుపొంది ఐదింట నాలుగు మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ను ఫించ్ బృందానికి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో పరాభవానికి బదులు తీర్చుకోవాలని లంక జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-2022లో మా ఆటగాళ్లు భాగస్వామ్యం కావడంతో కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. ఐపీఎల్ అనుభవం మా జట్టుకు ఉపకరిస్తుంది. బలమైన ఆసీస్ జట్టును ఢీకొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్కు శ్రీలంక తుది జట్టు: పాథుమ్ నిసాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, నువాన్ తుషార. శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: MS Dhoni: 'ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా' -
SL Vs AUS T20: తొలి టీ20.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
Australia tour of Sri Lanka, 2022: మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ నిమిత్తం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 7న జరుగనున్న మొదటి టీ20 మ్యాచ్కు తుది జట్టును ప్రకటించింది. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరమైన మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ ఈసారి లంకతో తలపడే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక జట్టు ప్రకటన నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనేలా పిచ్ ఊరించింది. కానీ, గత రెండు రోజులుగా వర్షం కారణంగా పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఫాస్ట్ బౌలర్ల సేవలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. నిజానికి గత రెండేళ్లుగా శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మెరుగ్గా ఉంది. దుష్మంత చమీర నేతృత్వంలో వారి మంచి ఫలితాలు రాబడుతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తొలి టీ20 జరుగనుంది. శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st T20I) ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: Joe Root: వామ్మో.. ఇదేంటి? రూట్ నీకు చేతబడి తెలుసా? అదేం కాదు బ్రో.. వైరల్! Happy Birthday Ajinkya Rahane: తక్కువగా అంచనా వేశారు.. కానీ.. అతడే ‘గెలిపించాడు’! -
శ్రీలంక బౌలింగ్ కోచ్గా మలింగ
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్ వ్యూహాత్మక కోచ్గా ఆ దేశ దిగ్గజ పేస్ బౌలర్ లసిత్ మలింగ వ్యవహరిస్తాడు. ఇటీవల ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మలింగ బౌలింగ్ కోచ్గా పని చేశాడు. లంక, ఆసీస్ జట్ల మధ్య 7, 8, 11 తేదీల్లో 3 టి20లు... 14, 16, 19, 21, 24 తేదీల్లో 5 వన్డేలు ఉన్నాయి. అదే విధంగా జూన్ 29 నుంచి రెండు మ్యాచ్ల రెండు టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులు ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటించనుంది. మొత్తంగా 10 మ్యాచ్లు ఆడనుంది. కొలంబో, పల్లకెలె, గాలే వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ Australia's T20 squad hits the nets in Colombo ahead of the first T20 against Sri Lanka on Tuesday 🇱🇰 🇦🇺 #SLvAUS 📸 @ClancySinnamon pic.twitter.com/zWSaQgg8Qb — cricket.com.au (@cricketcomau) June 3, 2022 WATCH: Australia's first training session ahead of T20I series. 📽️#SLvAUS https://t.co/5i8eGSn4JN — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 3, 2022 -
Glenn Maxwell: ఆ విషయం గురించి అతడు చెప్పేంత వరకు తెలియదు!
Glenn Maxwell Wedding: ఆస్ట్రేలియా ఆల్రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన విని రామన్ను అతడు వివాహమాడనున్నాడు. మెల్బోర్న్లో ఈ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా మాక్సీ- వినీ పెళ్లి కార్డు ఇదేనంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా కార్డు ఆన్లైన్లో లీక్ కావడం పట్ల మాక్స్వెల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వేదిక ఎక్కడో తెలిసిపోవడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాపోయాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 అనంతరం ఫాక్స్ క్రికెట్తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో నాతో పాటు ఆడిన ఓ క్రికెటర్ నా పెళ్లికార్డుకు సంబంధించిన ఫొటో పంపించాడు. తమిళ్లో ఉన్న లేఖను పంపాడు. ఇందులో అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంది. దురదృష్టవశాత్తూ ఇది ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కాబట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే మా వివాహ వేడుకను భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ 11 కోట్లు వెచ్చించి మాక్సీని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి నేపథ్యంలో అతడు పాకిస్తాన్ టూర్కు దూరం కానున్నాడు. అదే విధంగా ఆరంభ ఐపీఎల్ మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. చదవండి: Aus Vs Sl- Mitchell Starc: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి -
చాంపియన్ ఆటతీరు.. సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్
Aus Vs Sl By 6 Wickets 3rd T20I: టి20 చాంపియన్స్ ఆస్ట్రేలియా మరోసారి అదరగొట్టింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో చాంపియన్ ఆటతీరు కనబరిచింది. శ్రీలంకతో జరిగిన మూడో టి20లో ఘన విజయం సాధించిన ఆసీస్ మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదునైన బౌలింగ్ ముందు లంక బ్యాట్స్మెన్ తడబడ్డారు. చదవండి: Mitchell Starc: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ షనక 39 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 25 పరుగులు చేశాడు. 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ షనక, దినేష్ చండిమల్ కాస్త పోరాడడంతో లంక స్కోరు వంద పరుగులు దాటింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మ్యాక్స్వెల్ 39, ఆరోన్ ఫించ్ 35 పరుగులతో రాణించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న జరగనుంది. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతిని వేశాడు. శ్రీలంకతో జరిగిన మూడో టి20లో స్టార్క్ వేసిన ఆ బంతి లంక బ్యాటర్ దాసున్ షనకతో పాటు మిగతా ఆటగాళ్లను.. స్టాండ్స్లో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. స్లో యార్కర్ బాల్ వేయాలని భావించిన స్టార్క్ వ్యూహం విఫలమైంది. చదవండి: Kevin Pietersen: ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్ దీంతో బంతి అతని చేతి నుంచి జారి షనక పక్కనుంచి దాదాపు 3 మీటర్ల ఎత్తులో వెళ్లి పక్కనున్న పిచ్పై పడింది. కీపర్ మాథ్యూ వేడ్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో అది కాస్త బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్ నోబాల్తో పాటు ఫ్రీ హిట్ ఇచ్చాడు. కాగా స్టార్క్ వేసిన నోబాల్.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతిగా పరిగణించారు. ఇంతకముందు ఇలాంటివి జరిగినప్పటికి స్టార్క్ వేసిన బంతి దాదాపు 3 మీటర్ల ఎత్తులో వెళ్లడంతో చెత్త బంతిగా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో టి20లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో ఆసీస్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ షనక 39 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 25 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మ్యాక్స్వెల్ 39, ఆరోన్ ఫించ్ 35 పరుగులతో రాణించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న జరగనుంది. చదవండి: Mitchell Starc: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి "I don't think I've ever seen a ball go that wide!" Matthew Wade had no chance with that one! #AUSvSL pic.twitter.com/MjC8sCvYtk — cricket.com.au (@cricketcomau) February 15, 2022 -
Aus Vs SL: లంకతో ఆసీస్ టీ20 సిరీస్... స్టార్ ప్లేయర్లు, హెడ్కోచ్ దూరం..
Aus Vs SL T20 Series: శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. లంక జట్టుతో స్వదేశంలో తలపడబోయే తమ ఆటగాళ్ల పేర్లను మంగళవారం వెల్లడించింది. స్టార్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్-2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ విజేత డేవిడ్ వార్నర్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడితో పాటు మిచెల్ మార్ష్ కూడా ఈ సిరీస్కు దూరం కానున్నాడు. ఇక స్థానిక బిగ్బాష్ లీగ్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వికెట్కీపర్ బెన్ మెక్డెర్మాట్కు ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా... యాషెస్ హీరో ట్రవిస్ హెడ్, ఆల్రౌండర్ మోజెస్ హెన్రిక్స్ తదితరులు లంకతో తలపడే టీమ్లో ఉన్నారు. ఇక ఆసీస్ హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ లంకతో సిరీస్కు దూరం కానున్నాడు. మార్చిలో కంగారూల పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ విరామాన్ని అతడు ఉపయోగించుకోనున్నాడు. కాగా ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. శ్రీలంకతో టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆష్టన్ ఆగర్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, మోజెస్ హెన్నిక్స్, జోష్ ఇంగ్లిస్, బెన్ మెక్డెర్మాట్, గ్లెన్ మాక్స్వెల్, జై రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: Dinesh Karthik: టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్పై ప్రశంసలు కురిపించిన డీకే -
Mahela Jayawardene: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు..
Mahela Jayawardene Comments On Sri Lanka Defeat: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో జట్ల జయాజయాలపై మంచు ప్రభావం స్పష్టంగా కనబడుతోందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే అన్నాడు. అదే విధంగా టాస్... గెలుపును నిర్దేశించే కీలక అంశంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడే శ్రీలంక వంటి జట్లకు ఇది నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా మెరుగ్గా రాణించిన చోట... శ్రీలంక బౌలర్లు అతడి స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి మంచు కారణమని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయవర్ధనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శ్రీలంక స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ బంతి జారిపోవడం మొదలుపెట్టింది. గ్రిప్ అంతగా దొరకలేదు. ఆడం జంపా ప్రభావం చూపగలిగిన పిచ్పై.. అందుకే వాళ్లు మెరుగ్గా రాణించలేకపోయారు’’ అని జయవర్దనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా... ‘‘దుబాయ్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో టాస్ గెలిచిన కెప్టెన్లనే విజయాలు వరించాయి. రెండో దఫా బౌలింగ్ చేసే జట్లకు.. ముఖ్యంగా స్పిన్నర్లకు పిచ్ ఏమాత్రం సహకరించడం లేదు. టీ20 వరల్డ్కప్ వంటి ప్రధాన టోర్నీల్లో ఇలా జరగడం.. కెప్టెన్లను తప్పక టాస్ గెలవాల్సిన పరిస్థితుల్లోకి నెడుతోంది’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఇక గురువారం నాటి మ్యాచ్లో పవర్ప్లేలో వనిందు హసరంగ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక.. స్కోర్లు శ్రీలంక- 154/6 (20) ఆస్ట్రేలియా-155/3 (17) చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్ -
T20 World Cup Aus Vs SL: గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు
ఆస్ట్రేలియా జోరు పెంచింది... పొట్టి ప్రపంచకప్లో తన స్థాయికి తగిన ప్రదర్శనతో గ్రూప్–1లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. కంగారూ ఓపెనర్లు ఫించ్, వార్నర్ లక్ష్యఛేదనలో చెలరేగిపోగా, అంతకంటే ముందు ఆడమ్ జంపా తన స్పిన్తో లంకను కట్టేశాడు. దీంతో ఆసీస్ అలవోక విజయంతో సెమీస్ బాటలో పడింది. T20 World Cup 2021: Australia Beat Sri Lanka By 7 Wickets: ఆస్ట్రేలియా ఇన్నేళ్లుగా తమకు అందని టి20 ప్రపంచకప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. తమ లక్ష్యాన్ని వరుస విజయాలతో ఘనంగా చాటి చెబుతోంది. దుబాయ్లో గురువారం జరిగిన గ్రూప్–1 లీగ్ మ్యాచ్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై అలవోక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), చరిత్ అసలంక (27 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆస్ట్రేలియా స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (2/12) పొదుపైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తర్వాత ఆసీస్ 17 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్లు), వార్నర్ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) చెలరేగారు. రాణించిన కుశాల్, అసలంక టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్ నిసంక (7) వికెట్ను కోల్పోయింది. తర్వాత వన్డౌన్లో వచి్చన అసలంకతో కలిసి ఓపెనర్ కుశాల్ పెరీరా ఇన్నింగ్స్ను నడిపించాడు. ఇద్దరు కూడా బౌండరీలతో ధాటిగా ఆడారు. దీంతో లంక 5.4 ఓవర్లో 50 పరుగులు చేసింది. అయితే పదో ఓవర్లో ఎట్టకేలకు జంపా... అసలంక ఆట కట్టించాడు. దీంతో 63 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్వల్ప వ్యవధిలో స్టార్క్... పెరిరా, హసరంగ (4)లను పెవిలియన్ చేర్చగా, అవిష్క ఫెర్నాండో (4)ను జంపా బోల్తా కొట్టించాడు. రాజపక్స (26 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అడపాదడపా బౌండరీలు బాదడంతో లంక స్కోరు 150 దాటింది. మెరిపించిన ఫించ్ ఆసీస్ లక్ష్యాన్ని వేగంగా ఛేదించే పనిలో పడింది. కెప్టెన్ ఫించ్ తొలి ఓవర్లో 2 బౌండరీలు బాదాడు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఫించ్, వార్నర్ ఎదురుదాడికి దిగారు. ఫించ్ ఫోర్, సిక్స్ కొట్టగా, వార్నర్ 2 ఫోర్లు బాదాడు. ఈ ఒక్క ఓవర్లోనే 20 పరుగులు వచ్చాయి. ఫించ్ క్రీజులో ఉన్నంతసేపూ ధనాధన్ కొనసాగించడంతో కంగారూ పది పైచిలుకు రన్రేట్తో దూసుకుపోయింది. 4.2 ఓవర్లోనే జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. చమీర వేసిన ఈ ఓవర్లో (5వ) వార్నర్ ఇచ్చిన సులువైన క్యాచ్ను కీపర్ కుశాల్ పెరీరా నేలపాలు చేశాడు. వార్నర్ ఫిఫ్టీ లైఫ్ దొరికిన తర్వాత వార్నర్ బాధ్యతగా ఆడాడు. బౌండరీలతో వేగం పెంచాడు. ఏడో ఓవర్లో ఫించ్ దూకుడుకు హసరంగ కళ్లెం వేశాడు. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని ముగించిన ఈ స్పిన్నర్ తన మరుసటి ఓవర్లో డాషింగ్ బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్ (5)ను బోల్తా కొట్టించాడు. కానీ వార్నర్ క్రీజులో పాతుకుపోవడం, స్మిత్ నిలకడగా ఆడటంతో లంకకు పట్టు బిగించే అవకాశమే చిక్కలేదు. 11వ ఓవర్లో ఆస్ట్రేలియా వంద పరుగులను అధిగమించింది. తర్వాత ఓవర్లోనే వార్నర్ 31 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది. ఈ ఓపెనర్ చూడచక్కని ఫోర్లతో ఆసీస్ లక్ష్యంవైపుగా దూసుకెళ్లింది. ఇదే ఉత్సాహంతో షనక బౌలింగ్లో భారీ సిక్సర్కు ప్రయతి్నంచిన వార్నర్ లాం గాఫ్లో రాజపక్సకు చిక్కా డు. 130 స్కోరు వద్ద నిష్క్రమించాడు. అప్పటికే ఆసీస్ లక్ష్యానికి చేరువైంది. 30 బంతుల్లో 25 పరుగుల లాంఛనాన్ని స్టీవ్ స్మిత్ (26 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్), స్టొయినిస్ (7 బంతు ల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 7; కుశాల్ పెరీరా (బి) స్టార్క్ 35; అసలంక (సి) స్మిత్ (బి) జంపా 35; అవిష్క ఫెర్నాండో (సి) స్మిత్ (బి) జంపా 4; రాజపక్స (నాటౌట్) 33; హసరంగ (సి) వేడ్ (బి) స్టార్క్ 4; షనక (సి) వేడ్ (బి) కమిన్స్ 12; కరుణరత్నే (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–15, 2–78, 3–86, 4–90, 5–94, 6–134. బౌలింగ్: స్టార్క్ 4–0–27–2, హాజల్వుడ్ 4–0–26–0, కమిన్స్ 4–0–34–2, మ్యాక్స్వెల్ 1–0–16–0, స్టొయినిస్ 3–0–35–0, జంపా 4–0–12–2. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాజపక్స (బి) షనక 65; ఫించ్ (బి) హసరంగ 37; మ్యాక్స్వెల్ (సి) ఫెర్నాండో (బి) హసరంగ 5; స్మిత్ (నాటౌట్) 28; స్టొయినిస్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–70, 2–80, 3–130. బౌలింగ్: కరుణరత్నే 2–0–19–0, తీక్షణ 4–0–27–0, చమీర 3–0–33–0, లహిరు కుమార 3–0–48–0, హసరంగ 4–0–22–2, షనక 1–0–6–1. చదవండి: David Warner: టి20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్గా -
David Warner: నేను ఫామ్లోకి వచ్చా.. గుర్తుపెట్టుకోండి
Fans Happy With David Warner Form.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా సూపర్ 12 గ్రూఫ్ 1లో శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. వార్నర్ ఇన్నింగ్స్తో అతని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. వారి సంబరాలకు కారణం ఏంటంటే వార్నర్ ఫామ్లోకి రావడమేనంట. అందుకు తగ్గట్టుగానే వార్నర్ ఫిఫ్టీ సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్వైపు చూస్తూ నేను ఫామ్లోకి వచ్చా.. గుర్తుపెట్టుకోండి అన్నట్లుగా చేతితో విజయం గుర్తును చూపించాడు. ప్రస్తుతం వార్నర్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. చదవండి: AUS Vs SL: టి20 చరిత్రలో రెండో వేగవంతమైన బంతికి ఔటైన లంక క్రికెటర్గా నిజానికి టి20 ప్రపంచకప్ ఆరంభమైన తర్వాత వార్నర్ ఫామ్ ఆ జట్టును ఆందోళన పరిచింది. అయితే (అక్టోబర్ 27) వార్నర్ తన బర్త్డే సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఫామ్లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్ చాలు అన్ని కామెంట్ చేశాడు. కాగా వార్నర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మరునాడే శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్ను చూపించాడు. కాగా టి20 ప్రపంచకప్కు ముందు జరిగిన ఐపీఎల్లో వార్నర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ తరపున ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన వార్నర్ 195 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అనూహ్యంగా వార్నర్ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తూ ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకోవడంతో సెకండ్ఫేజ్ పోటీల్లో వార్నర్ జట్టుకు దాదాపు దూరంగా ఉండడం.. తుది జట్టులో చోటు దక్కకపోవడం.. డ్రింక్స్ మోయడం.. జెండాలు ఊపడం అతని ఫ్యాన్స్కు బాధ కలిగించింది. కానీ తాజాగా వార్నర్ మళ్లీ ఫామ్లోకి రావడంతో అతని అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. చదవండి: David Warner: టి20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్గా -
టి20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్గా
David Warner First Australia Batsman Completes 500 Runs T20 World Cup.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్లు రికార్డులు సాధించారు. ముందుగా 65 పరుగులతో ఫామ్ అందుకున్న వార్నర్ జట్టును గెలిపించడంతో పాటు ఒక టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక మైలురాయిని చేరుకున్నాడు. వార్నర్ 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20 ప్రపంచకప్ల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా వార్నర్ 25 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా తరపున టి20 ప్రపంచకప్లో 500 పరుగుల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్లో 37 పరుగులు చేసిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ 27 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20 క్రికెట్లో 2500 పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఈ పరుగులు అందుకోవడానికి ఫించ్కు 78 మ్యాచ్లు అవసరం అయ్యాయి. -
టి20 చరిత్రలో రెండో వేగవంతమైన బంతికి ఔటైన లంక క్రికెటర్గా
Mitchell Starc Delivers 2nd Fast Ball Dismiss Kusal Perera.. టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్లో కుషాల్ పెరీరా ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత యార్కర్తో మెరిశాడు. కాగా స్టార్క్ యార్కర్ డెలివరీకి కుషాల్ పెరీరా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్ మూడో బంతిని స్టార్క్ యార్కర్ వేయగా.. కుషాల్ పెరీరా ఢిపెన్స్ చేయబోయాడు. చదవండి: IND Vs NZ: కివీస్తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్స్.. టాస్ గెలువు కోహ్లి కానీ వేగంగా వచ్చిన బంతి పెరీరా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేశాడు. దీంతో క్లీన్బౌల్డ్ అయిన కుషాల్ నవ్వుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. కాగా టి20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతికి(గంటకు 144 కిమీ వేగం) ఔటైన లంక క్రికెటర్గా కుషాల్ పెరీరా నిలిచాడు. చదవండి: Chris Morris: దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్ మోరిస్ ఆవేదన Starc finds the faintest of edges https://t.co/BVCfHrA9v3 via @t20wc — Bhavana.Gunda (@GundaBhavana) October 28, 2021 -
AUS Vs SL: వార్నర్ మెరుపులు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం
వార్నర్ మెరుపులు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సమయం: 22:45.. డేవిడ్ వార్నర్(65;42 బంతులు) మెరుపులు మెరిపించడంతో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 18 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. పించ్, వార్నర్లు కలిసి తొలి వికెట్కు 70 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు పునాది వేశారు. ఫించ్, మ్యాక్స్వెల్ ఔటైన తర్వాత వార్నర్ జోరు చూపగా.. స్మిత్ 28 పరగులు నాటౌట్ రాణించాడు. ఇక చివర్లో మార్కస్ స్టోయినిస్ 7 బంతుల్లో 16 పరుగులతో తనదైన స్టైల్లో మ్యాచ్ను ముగించాడు. దీంతో ఆస్ట్రేలియా సూపర్ 12 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు తీశాడు. డేవిడ్ వార్నర్(65) ఔట్.. 16 ఓవర్లలో 140/3 సమయం: 22:36.. డేవిడ్ వార్నర్(65) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. షనక బౌలింగ్లో రాజపక్సకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 15 పరుగుల దూరంలో ఉంది. వార్నర్ హాఫ్ సెంచరీ.. 13 ఓవర్లలో ఆస్ట్రేలియా 112/2 సమయం: 22:20.. 13 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అర్థసెంచరీ మార్క్ను సాధించాడు. కాగా అంతకముందు 5 పరుగులు చేసిన మ్యాక్స్వెల్ హసరంగ బౌలింగ్లో ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్(37) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ వనిందు హసరంగ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. వార్నర్ 36, మ్యాక్స్వెల్ 1 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 5 ఓవర్లలో 56/0 సమయం: 21:48.. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను దాటిగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 36 పరుగులతో, వార్నర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక 154/6.. ఆసీస్ టార్గెట్ 155 సమయం 21:13.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్లో కుషాల్ పెరీరా, చరిత్ అసలంక చెరో 35 పరుగులు చేయగా.. బానుక రాజపక్స 33 పరుగులతో ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో లంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలా రెండు వికెట్లు తీశారు. సమయం: 21:02.. 18 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన దాసున్ షనక కమిన్స్ బౌలింగ్లో వేడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. లంక జట్టును మిచెల్ స్టార్క్ మరో దెబ్బ కొట్టాడు. 12.2వ ఓవర్లో హసరంగ(2 బంతుల్లో 4; ఫోర్)ను ఔట్ చేశాడు. దీంతో ఆ జట్టు 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వికెట్కీపర్ మాథ్యూ వేడ్ క్యాచ్ పటట్డంతో హసరంగ పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్లో రాజపక్స(2), షనక ఉన్నారు. అవిష్క ఫెర్నాండో(4) ఔట్.. లంక నాలుగో వికెట్ డౌన్ 11వ ఓవర్లో మూడో వికెట్ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక జట్టుకు ఆ మరుసటి ఓవర్లో ఆడమ్ జంపా మరో షాకిచ్చాడు. అవిష్క ఫెర్నాండో(7 బంతుల్లో 4)ను పెవిలియన్కు పంపి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. 11.5 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 90/4. క్రీజ్లో రాజపక్స(2), హసరంగ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(35) ఔట్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో సిక్సర్ బాది జోరుమీదున్న కుశాల్ పెరీరా(25 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్)ను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో శ్రీలంక 86 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో అవిష్క ఫెర్నాండో(2), భానుక రాజపక్స ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. 10 ఓవర్లలో 79/2 సమయం: 20:17.. ఇన్ఫామ్ బ్యాటర్ చరిత్ అసలంక(35) రూపంలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతికి స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. పెరీరా 29, అవిష్క ఫెర్నాండో 1 పరుగుతో ఆడుతున్నారు. సమయం: 19:58.. 6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. చరిత అసలంక(26 పరుగులు) దాటిగా ఆడుతుండగా.. పెరీరా 11 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన లంక.. సమయం: 19:43.. ఓపెనర్ పథుమ్ నిస్సాంక(7) రూపంలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి నిస్సాంక పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శ్రీలంక 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అసలంక 20, కుషాల్ పెరీరా 7 పరుగులతో ఆడుతున్నారు. దుబాయ్: టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్ 12 గ్రూఫ్ 1లో నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఇరుజట్లు తమ తొలి మ్యాచ్లో విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక 2010 టి20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియ, శ్రీలంక తలపడడం మళ్లీ ఇదే. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 16 సార్లు తలపడగా.. 8 సార్లు ఆసీస్.. 8 సార్లు లంక విజయాలు అందుకుంది. ఇక టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్లు జరగ్గా.. రెండుసార్లు ఆసీస్.. ఒకసారి లంక విజయం అందుకుంది. శ్రీలంక: దాసున్ షనక(కెప్టెన్), కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, భానుక రాజపక్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్