Bihar Assembly Election 2020
-
చెక్కు చెదరని మోదీ ఇమేజ్..
ఇది కోవిడ్ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్గా నిలిచింది. చెక్కు చెదరని మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్ఎస్–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల్లో.. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్కి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్ బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. పొలిటికల్ బాషా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్ తాను చెప్పినట్టుగానే డిసెంబర్ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒరిగిన రాజకీయ శిఖరాలు ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్కు ఆగస్టులో కరోనా పాజి టివ్గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్ 1న ప్రణబ్ మరణించారు. కాంగ్రెస్లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ నవంబర్ 23న కన్ను మూశారు. నమస్తే ట్రంప్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్లోని అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది. -
తొలి అసెంబ్లీ: తేజస్వీపై నితీష్ ఆగ్రహం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయేపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను టార్గెట్గా చేసుకున్న ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.. విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తమకంటే కేవలం 12,270 ఓట్లు, 16 సీట్లు మాత్రమే సాధించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తేజస్వీ విమర్శలకు సీఎం నితీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. తొలిసారి సభలో ఎన్నడూ లేని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే ముందు ప్రవర్తన మార్చుకోవాలని, గౌరవాన్ని కాపాడుకోవాలని చురకలు అంటించారు. ఒక ఓటు తేడా కూడా విజయాన్ని నిర్ణయిస్తుందని బదులిచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా అనుకుంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చు సూచించారు. 122 సీట్లు సాధించిన ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చుని పేర్కొన్నారు. కాగా ఉత్కంఠ బరితంగా సారిగి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74, 115 స్థానాల్లో పోటీ చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) 43 సీట్లలో గెలిచి అధికారాన్ని అందుకున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో 110 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాత్రమే ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ చేసిన పేలవమైన ప్రదర్శన కారణంగా మహాకూటమి అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న జేడీయు కూడా పేలవమైన ప్రదర్శనతో మూడవ స్థానం సరిపెట్టుకుంది. -
బిహార్ స్పీకర్గా ఎన్డీయే అభ్యర్థి విజయ్ సిన్హా
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో విజయ్ సిన్హాకు 126 ఓట్లు రాగా మహా కూటమి తరపున పోటీ చేసిన అవద్ బిహార్ చౌదరికి 114 ఓట్లు దక్కాయి. కాగా బిహార్లో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న స్పీకర్ పదవికి ఎన్డీయే కూటమి తరపున విజయ్ కుమార్ సిన్హా, మహా కూటమి తరపున అవద్ బిహారీ చౌదరి పోటీలో నిలిచారు. వీరిద్దరూ మంగళవారం పట్నా నుంచి అసెంబ్లీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో భారీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: బిహార్లో లాలూ ఆడియో టేపుల కలకలం అసెంబ్లీలోకి ఎమ్మెల్సీలు రావడంతో స్పీకర్ ఎన్నికల్లో వాయిస్ ఓట్లను ఆర్జేడీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్, అశోక్ చౌదరి సభలో ఉండటాన్ని తప్పుబడుతూ.. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నిక సమయంలో నియమాలను పాటించాలని చెబుతూ.. రూల్బుక్ను ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంజీకి అందించారు. దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్.. ‘అసెంబ్లీ పక్షనేతగా సీఎం సభలో ఉండటం తప్పేం కాదు. అది చట్టబద్దమైనది. ఇతర సభ నుంచి వచ్చిన వారు స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయడంలేదు. అసెంబ్లీలో వారు ఉండటంలో ఎలాంటి సమస్య లేదు" అని ఆయన అన్నారు. అదే విధంగా గతంలో లాలూ యాదవ్ లోక్సభ సభ్యుడిగా.. రబ్రీదేవి సీఎంగా ఉన్నప్పుడు వారు కూడా ప్రొసిడింగ్స్కు హాజరయ్యారని తేజస్వీ యాదవ్ తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. అప్పుడు రహస్య ఓటింగ్ లేదని గుర్తు చేశారు. అనంతరం స్పీకర్గా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హాను సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లు కలిసి స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. ఇక ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించడంతో వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 243 అసెంబ్లీ స్థానాల్లో 126 ఎన్డీయే దక్కించుకోగా ఇందులో బీజేపీ 74, జనతాదళ్(యు) 43 మరో ఎనిమిది సీట్లను ఎన్డీయే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ 75 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిహార్ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్ -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
నితీష్ కుమార్కు ఆర్జేడీ ఆఫర్
పట్నా : బీజేపీ నామినేటెడ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ సీనియర్ నేత అమర్నాథ్ గమీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సీఎం పీఠంలో నితీష్ కుమార్కు కూర్చోబెట్టడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న కొద్దికాలంలోనే నితీష్ ప్రభుత్వం కూలిపోతుందని తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బందన్ బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్నాలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీదే విజయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నికైనప్పటికీ అధికారమంతా బీజేపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎలాంటి అధికారాలు లేని సీఎం పీఠంలో నితీష్ ఉండి ఉపయోగంలేదన్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తమతో చేతులు కలపాలని కోరారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించాలని అమర్నాథ్ సూచించారు. కాగా ఇటీవల వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. దీనిపై జాతీయ స్థాయిలో వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీష్ను సీఎంగా ఎన్నుకున్నామని బీజేపీ చెబుతోంది. -
బిహార్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా మాంజీ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్రామ్ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఫగుచౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు బిహార్కు చెందిన 76 ఏళ్ల జితన్ రామ్ బిహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్ రామ్.. చంద్రశేఖర్ సింగ్, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. -
జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి
పట్నా: బిహార్ నూతన విద్యాశాఖ మంత్రిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. బడికి పోయావా లేదా సామి అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టి పట్టుమని వారం రోజులు కూడా కావడం లేదు.. ఇన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడంటే.. అయ్యగారు ఇంతలోనే ఏం ఘనకార్యం వెలగబెట్టారో అనుకుంటున్నారా. నిజమే మంత్రిగారు చేసింది మాములు తప్పు కాదు. భారతీయుడు అయ్యి ఉండి.. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఏకంగా జాతీయ గీతాన్ని మర్చిపోయాడంటే మామూలు తప్పిదం కాదు కదా. అందుకే నెటిజనులు సదరు మినిస్టర్ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. వివరాలు.. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్ జనగణమణ పాడుతూ.. మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) ఇందుకు సంబంధించిన వీడియో ఆర్జేడీ నాయకులకు చిక్కింది. "అనేక అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుంది? మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 2.2 లక్షల మంది వీక్షించారు. ఇక దీనిపై నెటిజనులు ‘ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి’.. ‘ఇది 2020 సంవత్సరం.. ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు’.. ‘స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం.. అసలు మీరు బడికి వెళ్లారా లేదా’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) ఇక మేవలాల్ చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ స్కామ్లో మేవలాలక్కు భాగం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ కుమార్ ద్వంద్వ వైఖరికి సిగ్గుపడుతున్నాం. 60 స్కాముల్లో మేవలాల్కు భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించి ఆ పదవిని కించపరిచారు అంటూ ఆర్జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!
పట్నా: బిహార్ అసెంబ్లీ విజేతల సామాజిక నేపథ్యాలను విశ్లేషించగా, గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ధనవంతులు, నేర చరితులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఆర్జేడీ నాయకత్వంలో మహా కూటమితోపాటు ఏఐఎంఐఎం పార్టీలు కలిసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం టిక్కెట్లను క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఇవ్వగా, 58.2 శాతం మంది విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అవే పార్టీలు 61.7 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 66.8 శాతం ఎమ్మెల్యేలు గెలిచారని ‘అసొసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్’ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. 2015 ఎన్నికల్లో 25 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు దాటిన ధనవంతులు కాగా, 2020 ఎన్నికల్లో వారి సంఖ్య 33 శాతానికి చేరుకుంది. వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున 86 శాతం మంది ధనవంతులు పోటీ చేయగా, 78 శాతం మంది విజయం సాధించారు. సీపీఐ నుంచి గెలిచిన రామ్ రతన్ సింగ్ బహుళ కోటీశ్వరుడు. లోక్జన శక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రాజ్ కుమార్ సింగ్ 1.9 కోట్ల అధిపతి. ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. ఆయనపై అత్యధికంగా 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 11 హత్యాయత్నం కేసులు, నాలుగు కిడ్నాపింగ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఆస్తిపరులు, నేరస్థులు గణనీయంగా పెరిగారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) -
నితీష్పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పట్నా : దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన బిహార్లో నేడు (సోమవారం) కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన నితీష్.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీఎంగా ఎన్నికైన నితీష్కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. (సోదరుడికి చెక్.. బీజేపీతో పొత్తుకు సై!) ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సైతం నితీష్కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఎన్నికై నితీష్ను అభినందిస్తూనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ‘బీజేపీ నామినేటేడ్ ముఖ్యమంత్రి నితీష్కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్) పాలనను భరించేందుకు బిహార్ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. (నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?) కాగా గతంలో నితీష్ కుమార్కు మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ఆయనతో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి ప్రశాంత్ను తొలగిస్తూ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసి పోటీచేయాలన్న నితీష్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్న ప్రశాంత్.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల అనంతరం తొలిసారి నితీష్పై స్పందించారు. -
బీజేపీ బలవంతం మేరకే సీఎం..
పట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్పై ప్రతిపక్ష ఆర్జేడీ మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఆర్జేడీ, బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుచుకుని సీఎం పీఠంలో కూర్చోడానికి నితీష్ సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనకు ఏమాత్రం ఇష్టంలేకున్నా బీజేపీ నేతల బలవంతం మేరకే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు నితీష్ కుమార్ ఇదివరకే చెప్పారని ఆర్జేడీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన ఆర్జేడీ ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన ఫలితాలే తమ నిర్ణయానికి కారణమని పార్టీ పేర్కొంది. (కాషాయ గూటికి మాజీ సీఎం కుమారుడు!) ‘నిజానికి మరోసారి సీఎంగా పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. జేడీయూ మూడవ స్థానంలో నిలవడం ఊహించలేనిది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే ఓపిక ఇక నాకు లేదు.’ అంటూ ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశంలో బీజేపీ నేతలతో నితీష్ కుమార్ చెప్పినట్లు ఆర్జేడీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. తానే సీఎంగా ఉండాలని బీజేపీ నేతలు ఏడ్చి పట్టుబట్టారని.. వారి అభిప్రాయాన్ని కాదనలేకే సీఎంగా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నానని నితీష్ చెప్పినట్లు ఆర్జేడీ వ్యంగంగా ట్వీట్ చేసింది. నవంబర్ 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి 125 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. 74 స్థానాలతో కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 43 స్థానాలతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ రెండవ స్థానంలో ఉండగా వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ), హిందుస్తాన్ ఆవాస్ మోర్చా చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో 75 సీట్లను కైవసం చేసుకుని ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆరోపిస్తున్నారు. -
కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (69)ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ఘనతను నితీష్ దక్కించుకున్నారు. సోమవారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఉత్కంఠ పోరులో విజయాన్ని చేజిక్కించుకున్న ఎన్డీఏ కొత్త సర్కార్ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్లో చోటు దక్కగా, ఉప ముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకోవడం విశేషం. 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్కిషోర్ ప్రసాద్ రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం సమావేశమైన ఎన్డీఏ శాసనసభ పార్టీ నాయకులు నితీష్ కుమార్ను నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసినవారు: కొత్త మంత్రివర్గంలో చేరిన 12 మంది మంత్రులలో బీజేపీ నుంచి మంగల్ పాండే , అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు చెందిన సంతోష్ మాంజి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి, వికా షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కు చెందిన ముఖేష్ మల్లా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. -
నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?
సాక్షి, న్యూఢిల్లీ : నితీష్ కుమార్ ఈ రోజు (సోమవారం) సాయంత్రం బిహార్ ముఖ్యమంత్రిగా ఏడవ సారి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగినట్లయితే బిహార్ రాష్ట్రానికి అత్యధిక కాలంపాటు కొనసాగిన ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను సష్టిస్తారు. ఓ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు. అందున అగ్రవర్ణ కులం నుంచో లేదా రాష్ట్రంలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న యాదవ కుటుంబం నుంచి కాకుండా ఓ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం మామూలు విషయం కాదు. బిహార్ రాష్ట్ర జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న కుర్మీ కమ్యూనిటీ నుంచి ఈ స్థాయికి నితీష్ ఎదగడమే ఓ గొప్ప విషయం. నితీష్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న జేడీయూ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నడూ కూడా తనంతట తాను మెజారిటీ సీట్లను సాధించలేదు. ఈసారి సీట్లు, ఓట్ల శాతం మరింత తగ్గిపోయింది. ఆ పార్టీకి ఈసారి 15.4 శాతం ఓట్లతో కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల్లో 71 సీట్లను సాధించింది. ఈసారి జనతాదళ్కంటే బీజేపీకి అదనంగా 30 సీట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ కుమార్ తప్పించి ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకులకు ప్రాతినిథ్యం కల్పిస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా ఆ ప్రచారానికి తోడ్పడగా, అందుకనుగుణంగా నితీష్ కుమార్ శకం ముగిసట్లేనంటూ బీజేపీ సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. అందుకు భయపడో, మరెందుకోగానీ ఇదే తన చివరి ఎన్నికలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతిని పొందేందుకు నితీష్ ప్రయత్నించారు. ఏదయితేనేం, అతిపెద్ద పార్టీలుగా బిహార్లో ఆవిర్భవించిన బీజేపీ, ఆర్జేడీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేటన్ని సీట్లు సాధించలేక పోయాయి. మిత్రపక్షాలతో కలసి బీజీపీకి ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజీపీ తాను సొంతంగా కాకుండా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే తెలివైన నిర్ణయం తీసుకుంది. నితీష్ కాదంటే ఆయన ఆర్జేడీ–కాంగ్రెస్ కూటిమికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వంలో చేరే అవకాశం స్పష్టంగా ఉండింది. దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే బీజేపీకి నితీష్ను సీఎంగా చేయక తప్పలేదు. అయినంత మాత్రాన ఐదేళ్లపాటు నితీష్ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించే ఉద్దేశం బీజేపీ అధిష్టానంకు లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. నితీష్ను సీఎం పదవి నుంచి తప్పించినా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి ముప్పు ఉండకుండా ఉండేందుకు ఆ పార్టీల నుంచే కాకుండా, నితీష్ పార్టీ నుంచి సభ్యుల వలసను బీజేపీ స్వీకరిస్తుందని, తద్వారా తానే అధికార పగ్గాలు స్వయంగా స్వీకరించే పరిస్థితిని సష్టించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక నితీష్ పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగరన్నది వారి వాదన. -
35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ముందుగా ఇచ్చిన హామీకి కట్టుబడి నితీష్కే సీఎం పీఠం కట్టబెట్టేందుకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. గత 35 ఏళ్లుగా అసెంబ్లీ పోటీగా దూరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. మూడు దశాబ్ధాలకు పైగా శాసనమండలికి ఎన్నికవుతూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. పట్నా : నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 (8 రోజులు), మరోసారి 11 రోజులు, 2005, 2010, 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2000లో బిహార్ సీఎంగా ఎన్నికయినప్పటికీ ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005లో మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం రావడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై.. బిహార్ను శాసిస్తున్నారు. తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. 2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. 2005 నవంబర్ నుంచి ఇప్పటి వరకు (2020) బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏర్పడిన రాజకీయ విభేదాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నద్దతలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎస్సీ నేత జీతాన్రాం మాంజీ బిహార్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా నితీష్ కుమార్ 2015 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిష్టించారు. ఈ సారి ఎన్నికల్లో లాలూప్రసాద్తో పొత్తు పెట్టుకుని పూర్తిస్థాయి మెజార్టీ సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మరోసారి 2017 లో ఎన్డీయేతో మరోసారి జట్టుకట్టారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. 2005 నవంబర్లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాతి ఏడాది ప్రారంభంలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగియడంతో.. ఆయనను తిరిగి ఎగువ సభకు ఎన్నుకున్నారు. ‘తనకు ఎగువసభ అంటే అమితమైన గౌరవం, అందుకే ఎమ్మెల్సీగా ఉండటానికి ఇష్టపడతాను అంటూ నితీష్ పలు సందర్భల్లో చెప్పుకొచ్చారు. ఒక నియోజకవర్గంపై తన మొత్తం దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటునానని, అందకే తాను అసెంబ్లీకి పోటీ చేయను అంటూ అని 2012 జనవరిలో శాసనమండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నితీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాను అని నవ్వుతూ చెప్పారు. నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. సీఎం పీఠాన్ని మార్చాలని బీజేపీ అనుకోకుంటే అప్పటి వరకు నితీష్ సీఎంగా కొనసాగనున్నారు. బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి. నితీష్ దారిలో ఠాక్రే, యోగీ.. కాగా నితీష్తో పాటు మరో రెండు రాష్ట్రాలకు సైతం ఇద్దరు సీఎంలు మండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు లోక్సభ ఎన్నికలలో గెలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎప్పుడూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, ఠాక్రే, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ఎగువసభ ద్వారా మొదటిసారి ముఖ్యమంత్రి కావడం విశేషం. -
మోదీ భక్తుడిపై నీలి నీడలు
పట్నా : బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముప్పేట దాడి చేసిన లోక్జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లో నితీష్ డిమాండ్ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్) ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’) చిరాగ్ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ? ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్ పాశ్వాన్ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్
పాట్నా : బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మొదటిసారి విలేకరులతో పాట్నాలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు తమ కూటమికే అవకాశం ఇచ్చారని అన్నారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఈ ఎన్నిక తనకు చివరిది కాదని స్పష్టం చేశారు. తాను గత సమావేశంలో పదవీ విరమణ గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. ‘‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది’ (అంత్ బలా తో సబ్ బలా) అనే మాటతో ముగిస్తాను. దీనిని అస్పష్టంగా అర్థం చేసుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా అంకితభావంతో పరిపాలన కొనసాగిస్తాన’’ని అన్నారు. కాగా, నితీష్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే ముందు రాజీనామా లేఖను గవర్నర్కు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం తాజాగా ఎన్డీయే కూటమి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 125 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. (ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్) -
‘ఉప’ ఫలితాలతో ఉత్సాహం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఫలితాలు బీజేపీని బాగా సంతోషపరిచాయి. మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను చేజిక్కించుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలనిచ్చింది. ఆ పార్టీ బలం ఒక్కసారిగా 126కి పెరిగింది. కరోనా వైరస్ దేశమంతా అలుముకున్న తొలి దినాల్లో... అంటే మొన్న మార్చిలో అక్కడ రాజకీయ సంక్షోభం రాజుకుని జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్నుంచి బయటికొచ్చారు. దాంతో అప్పటికి 15 నెలలుగా అధికారంలో కమల్నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనడానికి ముందే రాజీనామా చేసింది. బీజేపీ సీనియర్ నేత శివ్రాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 107మంది సభ్యుల బలంతో అప్పటినుంచీ అది నెట్టుకొస్తోంది. రాజీనామాలవల్ల, ఇతరత్రా కారణాలతో మొత్తం 28 స్థానాలు ఖాళీ కాగా వాటికి గత నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. తగినంత బలం లేకున్నా పాలన సాగించవలసి వస్తోంది గనుక శివరాజ్ సింగ్ చౌహాన్ తరచు తనను తాను ‘తాత్కాలిక సీఎం’గా చెప్పుకునేవారు. 2005 నుంచి 2018 వరకూ పాలించిన చౌహాన్కు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే నెగ్గినవారిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన జ్యోతిరా దిత్య సింథియా అనుయాయులు. వారు పార్టీ కన్నా జ్యోతిరాదిత్యకే విశ్వాసపాత్రులుగా వుంటారు. కనుక చౌహాన్పై మున్ముందు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. గతంలో ఆయనది ఏకచ్ఛత్రాధిపత్యం. ఈ ఉప ఎన్నికలు ఇటు జ్యోతిరాదిత్యకూ, అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్కూ పెద్ద పరీక్షగా మారాయి. తన అనుచర గణాన్ని గెలిపించుకోలేకపోతే బీజేపీలో జ్యోతిరాదిత్య స్థానం బలపడదు. అలాగే ఇన్నాళ్లూ జ్యోతిరాది త్యకు పార్టీ బలమే తప్ప సొంత బలమేమీ లేదని చెబుతూ వస్తున్న కమల్నాథ్పై దాన్ని నిరూపించ వలసిన భారం పడింది. అందువల్లే ఉప ఎన్నికల ఫలితాలతో ఆయన డీలా పడ్డారు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో తనకు రాజకీయంగా పట్టుందని జ్యోతిరాదిత్య రుజువు చేసుకున్నారు. మరో 9 స్థానాల్లో ఫిరాయింపుదార్లను ఓడించి, విజయం సాధించడమే కాంగ్రెస్కు ఉన్నంతలో ఓదార్పు. అచ్చం మధ్యప్రదేశ్ తరహాలోనే గుజరాత్లో కూడా 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఫిరాయించారు. వారిలో అయిదుగురికి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు లభించాయి. తాజాగా ఈ ఎనిమిదిచోట్లా కాంగ్రెస్ ఓడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్తెసరు మెజారిటీయే లభించింది. 182మంది సభ్యుల అసెంబ్లీలో 1995 తర్వాత తొలిసారి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన బీజేపీకి ఇది భంగ పాటే. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెల్చుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి సీఎం విజయ్ రూపానీని మార్చే అవకాశం వుందన్న కథనాలు వెలువడుతున్న దశలో అన్ని స్థానా లనూ పార్టీ గెల్చుకోవడం రూపానీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. మణిపూర్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ నాలుగు గెల్చుకోగా, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఆరింటిని బీజేపీ గెల్చుకుంది. ఒక చోట సమాజ్వాదీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో సీటు నిలబెట్టుకుంది. అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష అను భవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ నేతృత్వంవహించిన బంగార్మవ్ నియోజక వర్గంలో సైతం బీజేపీ అభ్యర్థే విజయం సాధించారు. హథ్రాస్లో యువతిపై అత్యాచారం, ఆమె భౌతి కకాయానికి అర్థరాత్రి పోలీసులే అంత్యక్రియలు జరపడం వంటి ఘటనల ప్రభావం ఉప ఎన్నికలపై కనబడకపోవడం గమనించదగ్గది. ఉత్తరప్రదేశ్ ఫలితాలకు విపక్షాల బాధ్యత కూడా వుంది. ఈ ఏడు చోట్లా నేరుగా యోగి ఆదిత్యనాథ్ సభలూ, సమావేశాలూ నిర్వహించారు. మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియింకగాంధీ ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక స్థానాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఉన్నంతలో ఛత్తీస్గఢ్, హరియాణాల్లో రెండు స్థానాలు, జార్ఖండ్లో జేఎంఎంతో కలిసి రెండు స్థానాలు గెల్చుకోవడం మాత్రమే కాంగ్రెస్కు ఊరట. అయితే జార్ఖండ్లో అటు జేఎంఎంకూ, ఇటు కాంగ్రెస్కూ గతంలోకన్నా మెజారిటీ బాగా తగ్గడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సాగు బిల్లులపై ఆందోళన జరుగుతున్న హరియాణాలో బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ–జేజేపీ ఉమ్మడి అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన రెండు ఉప ఎన్ని కల్లోనూ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలకూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ చాలా వ్యత్యాసం వుంటుంది. సాధా రణంగా ఉప ఎన్నికలు వాటికవే ఒక ధోరణిని ప్రతిబింబించవు. ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వుండే అధికార పక్షాలకు అనుకూలంగా వుండే అవకాశం వున్నా అభ్యర్థి ఎంపిక మొదలుకొని అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలతో మొదలుపెట్టి కుల సమీకరణాల వరకూ ఎన్నెన్నో అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాల్లో ఎక్కడ లెక్క తప్పినా పార్టీలకు సమస్యలెదురవుతాయి. అధికారంలో వున్న పక్షం నగుబాటుపాలవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్ని కలో, మరో ఎన్నికలో వచ్చే అవకాశం వుంటే ఈ ఫలితాలను చూపి భవిష్యత్తు తమదేనని శ్రేణులకు చెప్పుకోవడానికి ఏ పార్టీకైనా అవకాశం వుంటుంది. అందుకే అధికారంలో వున్న పార్టీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ కేంద్రీకరిస్తుంది. మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు నిరాశ మిగల్చగా, బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి. -
బిహార్ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ఆఘాడీ ప్రభుత్వం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ ఆత్మహత్య కేసులో నవంబర్ 4న అర్నబ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ అర్నబ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ నవంబర్ 18 వరకు జ్యూడీషియల్ రిమాండ్కు అనుమతించింది. అయితే హైకోర్టులో అర్నబ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను బెంచీ కొట్టివేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. (‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!) అయితే అర్నబ్ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టారు. అర్నబ్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. శివసేన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వ స్థానాన్ని సుప్రీం చూపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకోకుండా, మూసివేసిన కేసును తిరిగి తెరిచి, అర్నబ్ను వీధి నేరస్థుడిలా చూసిందని మండిపడ్డారు. అతన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని, అతన్ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజల గొంతును అణిచివేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇష్టపడుతోందని ఫడ్నవీస్ ఆరోపించారు. ఇది రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని అన్నారు. శివసేనకు ఎదురుదెబ్బే.. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సరిగా లేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. బిహార్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంపై ఆయన స్పందించారు. ఫడ్నవిస్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఫలితం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు. బిహార్లో ప్రధాని మోదీ ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. గ్రామగ్రామానికి బీజేపీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని, వారి వరకు తీసుకెళ్లగలిగామన్నారు. కాంగ్రెస్ చర్యలు భవిష్యత్తులో మహా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ ప్రభావం శివసేనపై పడుతుందని, ఇపుడు సేనకు అర్థం కాబోదని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తగలబోయే ఎదురుదెబ్బతో తెలుస్తుందని ఫడ్నవిస్ జోస్యం చెప్పారు. బాధితులకూ న్యాయం జరగాలి: మంత్రి మలిక్ వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉంటుందని అదే సమయంలో బాధితులకూ న్యాయం జరగాలని ఎన్సీపీ నేత, మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి నవాబ్ మలిక్ వ్యాఖ్యానించారు. కాగా, అర్నబ్ అరెస్టు గురించి కోర్టు వ్యాఖ్యానిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సబబు కాదని, అది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనంది. భావజాలం, అభిప్రాయ భేదాల నడుమ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకోవడం పట్ల కూడా సుప్రీం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా మంత్రి మలిక్ మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థను గౌరవించడం అందరి బాధ్యత అని వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడారని, అదే సమయంలో బాధితుడికి న్యాయం కూడా జరగాలని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. -
‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘడీ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమిలోని మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయిని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కవ కాలం పరిపాలన కొనసాగించలేదని పేర్కొన్నారు. శివసేన సర్కార్ పడిపోయిన వెంటనే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామమని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’ ) గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని’ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ ఎన్నికల ఇంఛార్జ్గా ఫడ్నవిస్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు బీజేపీకి ఓటేశారని, నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసొచ్చిందని అన్నారు. బిహార్లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే 125 సాధించింది. అందులో బీజేపీకి 74, జేడీయూకు 43, వికాశిల్ ఇసాన్ పార్టీకి 4, హిందుస్తానీ అవాం మోర్చాకి 4 సీట్లు వచ్చాయి. ప్రత్యర్ధి మహాఘట్ బంధన్ కి 110 సీట్లు రాగా, వీటిలో ఆర్జేడీ 75 , కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు సాధించాయి. ( చదవండి: ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు ) -
బిహార్ ఫలితాలు; ఎన్డీఏ విజయం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకున్న అంశాలు అనూహ్యంగా మరుగున పడి పోయి కొత్త అంశాలు ముందుకు వచ్చి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని 40 లోక్సభ సీట్లకుగాను 39 సీట్లను బీజేపీ కూటమి గెలుచుకోవడంతో వాటి ఫలితాల ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని తొలుత రాజకీయ విశ్లేషకులు భావించారు. జాతీయ అంశాలైన పుల్వామా–బాలాకోట్ అంశాల కారణంగా నాడు అన్ని లోక్సభ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. (చదవండి.. బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బిహార్ను 2020లో కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేసింది. దాంతో దేశవ్యాప్తంగా వలసలు పోయిన బిహారీలో ఆకలిదప్పులతో అలమటిస్తూ, అష్టకష్టాలు పడుతూ సొంతూళ్లకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో బిహార్లో పాలకపక్ష మనుగడ ఈసారి ఎన్నికల్లో ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ ఎన్నిలకపై ప్రధానంగా అభివృద్ధి అంశం ప్రభావితం చేస్తుందని 42 శాతం మంది అభిప్రాయపడగా, నిరుద్యోగం ప్రభావితం చేస్తుందని 30 శాతం మంది, ద్రవ్యోల్బణం ప్రభావం చూపిస్తుందని 11 శాతం మంది ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలేవి నిజం కాలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్షలాది బిహారి పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందజేయడం ఎన్నికల ఫలితాలను ఎంతో ప్రభావితం చేసింది. తమను వాస్తవంగా గెలిపించిందీ సైలెంట్ ఓటర్లయిన మహిళలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంలో పూర్తి వాస్తవం ఉంది. మగవారికన్నా ఐదుశాతం ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళల కోసం మోదీ చేపట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఎంతోకొంత మహిళలను ప్రభావితం చేయగా, స్థానిక సంఘాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను నితీష్ ప్రభుత్వం కల్పించడం, పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం పాలకపక్షానికి కలసి వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ హయాం నుంచి పురుషాధిపత్య రాజకీయాలను చూస్తూ వస్తోన్న బిహార్ మహిళకు నితీష్ పట్ల గౌరవం పెరుగుతూ వచ్చింది. ‘రోజ్గార్’ నినాదానికి ఎక్కువగా ఆకర్షితులైన యువత మాత్రం తేజస్వీ యాదవ్ వైపు వెళ్లింది. ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ నితీష్ కుమార్ చెప్పడం కూడా బిహార్ ఆఖరి విడత ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. మహిళలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ఆ మాటలకు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. నితీష్–మోదీ అనే డబుల్ ఇంజన్ ప్రచారం కూడా కలిసొచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడం, యాదవ్ సోదరులకు ఒకరంటే ఒకరికి పడక పోవడం, తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో కాకుండా ఎక్కువ కాలం ఢిల్లీలో గడపడం కూడా బిహార్ పాలకపక్షానికి కలిసొచ్చింది. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వివాదాస్పదమైన పౌరసత్వ బిల్లు లాంటి అంశాలపై తేజస్వీ యాదవ్ పూర్తిగా మౌనం వహించడం 28 శాతం –30 శాతం కలిగిన ముస్లింలు–యాదవ్ల బంధాన్ని బలహీనపర్చింది. 2015 ఎన్నికల సందర్భంగా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోకి అడుగుపెట్టిన అసుదుద్దీన్ ఓవైసీ తన పార్టీ ఏఐఎంఐఎంను విస్తరించడంలో విజయం సాధించడం కూడా పాలకపక్ష కూటమికి కలిసొచ్చిన మరో అంశం. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్తో పొత్తు మహా కూటమికి కలసిరాని మరో అంశం. (చదవండి: ఎన్నికల ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) -
హైదరాబాద్కు బిహార్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం చేరుకున్నారు. బుధవారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వద్ద బిహార్ ఎమ్మెల్యేలు అఖ్తరుల్ ఇమాన్, మహ్మద్ ఇజాహర్ ఆసీఫ్, షాహనవాజ్ ఆలం, సయ్యద్ రుకునుద్దీన్, అజహర్ నయీమీలకు హైదరాబాద్కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా దారుస్సలాం చేరుకొని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం విడుదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 74, జేడీయూ 44 స్థానాల్లో గెలుపొందాయి. ఇక తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అత్యధికంగా 76 స్థానాల్లో విజయం సాధించింది. -
నితీష్కు చిరాగ్ చికాకు!
పట్నా : గత ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో దిగిన సీనియర్ నేత సరయూ రాయ్ ఏకంగా సీఎం రఘువర్దాస్పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్ తరహాలో బిహార్లో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్కు చుక్కలు చూపారు. చిరాగ్ పాశ్వాన్ కారణంగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్దాస్తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్ కుమార్కు ఊరట ఇస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ ఛీప్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. బిహార్ ఓటర్లు మహా ఘట్బందన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మకై ఫలితాలను తారుమారు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం పట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. పోల్ ప్యానల్పై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఫలితాలను రీకౌంటింగ్ జరపించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫలితాలపై ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమి గెలిచిన స్థానాల్లో చాలావరకు వెయ్యిలోపు మెజార్టీ ఉండటంతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. (బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) కాగా మంగళవారం విడదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి విజయ సాధించింది. ఆర్జేడీకి 76, బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 74 స్థానాను సొంతం చేసుకుంది. అయితే ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో ఆ ప్రభావం తేజస్వీపై పడింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మరోసారి బిహార్ సీఎం పగ్గాలను అందుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. మంత్రివర్గ సంప్రదింపుల అనంతరం దిపావళి తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్లో కీలక శాఖలు తమకే దక్కాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తేజస్వీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. -
బిహార్ ఎన్నికలు : 10 మంది మంత్రుల ఓటమి
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినెట్లో 24 మంది మంత్రుల్లో పది మంది ఓటమి పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది జేడీయూకు చెందిన వారు కాగా, ఇద్దరు బీజేపీ మంత్రులున్నారు. నితీష్ కేబినెట్లో మొత్తం 29 మంత్రులున్నా వారిలో 5గురు ఎమ్మెల్సీలు కావడంతో ఎన్నికల బరిలో నిలవలేదు. 23 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో పోటీ చేయగా, 2015లో ఘోసి నుంచి పోటీ చేసిన విద్యా మంత్రి కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ తాజాగా జెహనాబాద్ నుంచి బరిలో దిగారు. ఇక బీజేపీ కోటా నుంచి నితీష్ కేబినెట్లో చేరిన పట్టణాభివృద్ధి మంత్రి సురేష్ కుమార్ శర్మ, గనుల మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్లు వరుసగా ముజఫర్పూర్, చైన్పూర్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు వర్మతో పాటు జేడీయూ మంత్రులు శైలేష్ కుమార్, సంతోష్ కుమార్ నిరాల, జైకుమార్ సింగ్, రాం సేవక్ సింగ్, రమేష్ రిషిదేవ్, ఖర్షీద్, లక్ష్మేశ్వర్ రాయ్లు ఓటమి చవిచూశారు. ఎల్జేపీ అభ్యర్ధులు పలు నియోజకవర్గాల్లో సంప్రదాయ ఎన్డీయే ఓట్లను చీల్చడంతో తమ మంత్రులు ఓడిపోయారని ఎల్జేపీ తమ విజయావకాశాలను దెబ్బతీయకుంటే జేడీయూ 80 స్ధానాల్లో విజయం సాధించేందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ అభ్యర్ధుల ఓటమిపై ఎన్డీయే నేతలు సమీక్షిస్తారని చెప్పారు. -
సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఎన్డీయే
పట్నా: 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఇటీవల వేరుపడిన మిత్రపక్షం ఎల్జేపీ శత్రుత్వాన్ని, ఆర్జేడీ యువనేత సారధ్యంలోని విపక్షాన్ని విజయవంతంగా ఎదుర్కొని బిహార్లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుంది. 243 సీట్ల అసెంబ్లీలో, మెజారిటీ మార్క్ 122 కన్నా కేవలం 3 స్థానాలు అధికంగా సాధించి, మరోసారి బిహార్ గద్దెనెక్కనుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో వరుసగా నాలుగోసారి జేడీయూ నేత నితీశ్కుమార్ సీఎం కానున్నారు. 2015 ఎన్నికల్లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 2015లో నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశారు. మిత్రపక్షం జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో(74) గెలిచినా.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీశ్కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ ఆశించినన్ని స్థానాలను గెలవలేకపోవడం వెనుక మాజీ మిత్రపక్షం ఎల్జేపీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ను అంగీకరించినప్పటికీ.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీల ‘మహా ప్రజాస్వామ్య, లౌకిక కూటమి’ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా కూటమి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని, ముఖ్యంగా ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
బిహార్లో సరికొత్త అడుగులు!
భారత రాజకీయాల్లో ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భావానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజíస్వీ యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపదికన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వీ యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వీ.. యాదవ రాజకీయాల బరువునుంచి పూర్తిగా తప్పుకుని కొత్త పంథాలో నడిచి అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. తన వంటి అతి పిన్నవయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలను ప్రతిబింబిస్తున్న సరికొత్త హీరో తేజస్వీ యాదవ్. చిట్టచివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించింది.. 243 మంది సభ్యులు కల రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెల్చుకుని సరిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి సరిపోయేటన్ని సీట్లను సాధించి బతుకుజీవుడా అని బయటపడింది. బీజేపీ నాయకత్వం దేన్నయితే ఆశించిందో సరిగ్గా అలాగే పోలింగ్ సరళి సాగిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా 74 స్థానాలు గెల్చుకుని 70 శాతం విజయశాతాన్ని సాధించింది. బిహార్ ఎన్నికల్లో అది సాధించిన ఉత్తమ ఫలితాలు ఇవే మరి. నితీశ్ కుమార్ని ఆయన జేడీయూని ఈ ఎన్నికల్లో ఒక జూనియర్ భాగస్వామి పాత్రకు కుదించాలని బీజేపీ పన్నిన పథకం బ్రహ్మాండంగా ఫలించింది. ప్రతిపక్ష శ్రేణులను ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టడమే కాదు.. విజయానికి దాదాపు దగ్గరగా వచ్చేలా ప్రతిపక్షాల ఓట్లను కూడా శాసించి బ్రాండ్ మోడీ ప్రభావం వల్లే ఈ గెలుపు సాధ్యం చేశానని బీజేపీ ఇరుపక్షాల శ్రేణుల ముందు ఘనంగా ప్రదర్శించింది. అయితే అదే సమయంలో భారత రాజకీయాల్లోకి ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భవానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజస్వి యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపది కన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలు సాధించి బిహార్లో అతిపెద్ద పార్టీగా కొనసాగింది. దాదాపు 30 లక్షల ఓట్లను లేదా 40 శాతాన్ని దక్కించుకున్న ఆర్జేడీకి, 2015 నాటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. ముస్లింలు, యాదవుల ఓటు పునాది కలిగిన పరిమితిని దాటి ఆర్జేడీ తన పలుకుబడిని విస్తృతస్థాయిలో విస్తరించిందని తేటతెల్లమైంది. గుర్తించదగిన విషయం ఏమిటంటే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తన ఓటు షేరును 18.3 శాతం నుంచి 23.1 శాతానికి పెంచుకునే క్రమంలో జేడీయూ పార్టీకి చెందిన ఓట్ల కంటే బీజేపీ కోటాను కొల్లగొట్టడమే. ఈ దెబ్బకు బీజేపీ ఓటు షేర్ గతంలోని 24.4 శాతం నుంచి 19.5 శాతానికి పడిపోయింది. 2015తో పోలిస్తే బీజేపీకి ప్రస్తుతం 10 లక్షల పదివేల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. అయితే కూట మిలో భాగంగా తక్కువ స్థానాలకు కట్టుబడినందువల్ల కూడా బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చి ఉండవచ్చు. జేడీయు ఓటు షేర్ను దెబ్బకొట్టడంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. బీజేపీ ఇలా దెబ్బ కొట్టినా ఈదఫా ఎన్నికల్లో జేడీయూకు ఓటు శాతం 16.8 నుంచి 15.8 శాతం మాత్రమే తగ్గింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థులు జేడీయూ ఓటర్లను పొందగలిగారు తప్పితే బీజేపీకి చెందిన అగ్రకులాల ఓటర్లు జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో తమ ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. జేడీయూకు బదులుగా వీరు అటు ఎల్జేపీనుంచి లేదా ఆర్జేడీనుంచి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులకు, తమ ఓటు గుద్దేశారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు, ప్లూరల్స్ పార్టీ వంటి అతి చిన్న పార్టీల ఖాతాలోకి కూడా వెళ్లిపోయాయి. ముందుండి నడిపించిన సమర యోధుడు గతంలో 2015లో జరిగిన ఎన్నికల్లో మహాగట్ బంధన్ ప్రధాన వ్యూహకర్తగా తలపండిన రాజకీయనేత లాలూ ప్రసాద్ యాదవ్ సర్వం తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ఈ ప్రచార ముఖ చిత్రంగా నితీశ్ కుమార్ నిలిచి తన పార్టీనీ, పొత్తు పార్టీలను ఒంటిచేత్తో విజయం వైపు తీసుకుపోయారు. పైగా ఆనాడు బిహార్లో ప్రతిపక్షం ఎన్నికలకు కొద్ది నెలల ముందువరకు చెల్లాచెదురై ఉండేది. అందుకనే 2015లో సాధించిన 80 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 75 స్థానాలు చేజిక్కించుకుని గణనీయమైన విజయం సాధించిన ఘనత పూర్తిగా యువ తేజస్వీ యాదవ్కే దక్కుతుంది. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఛాయ నుంచి పూర్తిగా బయటపడిన 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వి యాదవ్ అతి తక్కువ సమయంలో సాధించిన విజయం సాధారణమైనది కాదు. యాదవ రాజకీయాల బరువునుంచి తప్పుకుని కొత్త పంథాలోసాగిన తేజస్వి బిహార్లోని అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. అంతకంటే ముఖ్యంగా ఇటీవలి కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బిహార్లో సాగిన ఎన్నికల ప్రచారం సాపేక్షికంగా శాంతియుతంగా, విద్వేష రహితంగా సాగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ గొప్ప మార్పునకు పూర్తి ఘనత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్కే దక్కాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కూడా ఈ విషయంలో తేజస్వి విశిష్టతను స్పష్టంగా గుర్తించి ప్రశంసించింది. 2020లో సాగిన ఎన్నికల్లో కూడా బీజేపీ య«థాప్రకారంగా కశ్మీర్, సీఏఏ, రామ్ మందిర్ వంటి అంశాలను పదేపదే ప్రస్తావించి విభజన రాజకీయాలను ప్రేరేపించా లని ప్రయత్నించింది. కానీ దానివల్ల అది సాధించింది పెద్దగా ఏమీలేదు. చివరకు బాలీవుడ్లో కొనసాగుతున్న సాంస్కృతిక తప్పిదాల వల్లే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడంటూ చెలరేగిన తీవ్రవివాదాస్పద అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిం చింది. ఇక నితీశ్ తనవంతుగా జంగిల్ రాజ్ అనే పాత ముద్రను ఆర్జేడీపై పదేపదే సంధిస్తూ తేజస్విపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నించినా, అవేవీ పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ మొత్తం వ్యతిరేక ప్రచారంలో కూడా తేజస్వి అత్యంత పరిణతిని ప్రదర్శించారు. తన వంటి అతి పిన్న వయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. తనపై సాగుతున్న దాడిలో పొరపాటున కూడా ప్రవేశించకుండా తేజస్వి యాదవ్ మొదటినుంచి చివరివరకూ తాను విశ్వసించినటువంటి.. బిహార్ యువతకు విద్య, ఉద్యోగాలు అనే అంశాలపైన మాత్రమే దృష్టి సారించి ప్రచారం సాగిం చాడు. మహాగట్ బంధన్ బలమైన అధికార కూటమిని ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టిందంటే తేజస్వి అత్యంత ప్రతిభావంతంగా అల్లిన ప్రచార ఎజెండానే కారణమని చెప్పక తప్పదు. ఈ ప్రయాణ క్రమంలో తేజస్వి ఈ దఫా ఎన్నికలకు మాత్రమే కాకుండా, దేశంలో కోవిడ్–19 అనంతర రాజకీయాలకు కూడా అజెండాను నిర్దేశించడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బిహార్ యువతీయువకులకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజస్వి ఇచ్చిన ఎన్నికల హామీ బీజేపీని ఎంతగా భీతిల్లజేసిందంటే తమ కూటమిని గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని ఎదురు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా కోవిడ్–19 వ్యాక్సిన్ని ఉచితంగా అందిస్తానని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మధ్యేవాద వామపక్ష రాజకీయ ఆర్థిక విధానాన్ని ఒక మితవాద పార్టీ ప్రకటించవలసి రావడంగా తప్ప మరోలా దీన్ని చూడలేం. మరోవిధంగా బిహార్లో వామపక్షాలు సాగించిన గొప్ప విజ యంలో కూడా ఇది ప్రతిఫలించింది. పోటీ చేసింది 29 స్థానాల్లోనే అయినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో వామపక్షాలు 16 సీట్లు కొల్లగొట్టి షాక్ తెప్పించాయి. గతంతో పోలిస్తే 50 శాతం విజయాల రేటును పెంచుకున్న వామపక్షాలు ఆర్జేడీతో సమానంగా విజయాలు సాధించడమే కాకుండా కాంగ్రెస్ (30 శాతం), జేడీయూ (40శాతం) కంటే మంచి స్థానంలో నిలబడటం చెప్పుకోదగిన విషయం. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ–జేడీయు కూటమి అత్తెసరి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతదేశంలో మధ్యేవాద–వామపక్ష రాజకీయాలకు ఏకకాలలో బిహార్ పైకెత్తి నిలిపింది. వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సామ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు కూడా బిహార్ అనుభవాన్ని ప్రతిబింబించినట్లయితే, అప్పడు బిహార్ ప్రజలు అలాంటి మార్గాన్ని చూపించింది మేమే కదా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలకు సంబంధించిన సరికొత్త హీరో తేజస్వి యాదవ్. వ్యాసకర్త రాజేష్ మహాపాత్ర స్వతంత్ర జర్నలిస్టు -
బీజేపీ జైత్రయాత్ర
ఐపీఎల్ స్కోర్ మాదిరే క్షణక్షణానికీ మారుతూ దేశ ప్రజలందరిలోనూ ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరకు ఎన్డీఏకే విజయం ఖాయం చేశాయి. మంగళవారం రోజంతా టీవీల ముందు కూర్చున్నవారిని నిరాశ పరుస్తూ ఎంతకూ తేలని అంతిమ ఫలితాలు... ఎట్టకేలకు బుధవారం వేకువజామున వెలువడ్డాయి. 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎప్పటిలాగే ఎన్డీఏ ఈసారి కూడా ఆధిక్యత సాధించింది. అయితే దాని మెజారిటీ 125కి పడిపోయింది. ఎన్డీఏలో ఇంతవరకూ ప్రధాన పక్షంగా వుంటున్న ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యూ) కేవలం 43 స్థానాలతో ద్వితీయ స్థానంలోకి వెళ్లగా, ఆ చోటును 74 స్థానాలతో బీజేపీ చేజిక్కించుకుంది. కూట మిలోని చిన్న పార్టీలైన వికాస్శీల్ పార్టీ, హిందూస్తాన్ అవామీ పార్టీ చెరో నాలుగూ గెల్చుకున్నాయి. నితీశ్పై అలిగి కూటమినుంచి బయటికెళ్లి ఒంటరిగా బరిలో నిలిచిన లోక్జనశక్తికి ఒక్క స్థానం దక్కింది. నితీశ్ను 71 స్థానాల నుంచి 43కి తగ్గించి ఎన్డీఏలో జూనియర్ పార్టనర్గా మార్చిన తృప్తి మాత్రం మిగిలింది. ఎల్జేపీ వల్ల 59 స్థానాల్లో ఎన్డీఏకు విజయం చేజారిందని లెక్కలు చెబు తున్నాయి. ఎన్డీఏకు చివరివరకూ చుక్కలు చూపించిన మహాకూటమిలో ఆర్జేడీ ఒకటే సత్తాగల పార్టీ. అందులోని కాంగ్రెస్, వామపక్షాలు చిన్న పార్టీలే. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీచేసి 75 స్థానాలు గెల్చుకోగా...ఆ కూటమిలోని కాంగ్రెస్ దురాశకు పోయి 70 స్థానాలు తీసుకుని కేవలం 19 చోట్ల మాత్రమే నెగ్గింది. రద్దయిన అసెంబ్లీలో ఆ పార్టీ స్థానాలు 27. కాంగ్రెస్కన్నా వామపక్షాలు ఎంతో నయం. సీపీఐ 6చోట్లా, సీపీఎం 4 చోట్లా పోటీచేసి చెరో రెండూ గెల్చుకున్నాయి. రద్దయిన అసెంబ్లీలో ఈ రెండు పార్టీలకూ ప్రాతినిధ్యం లేదు. కూటమిలోని మరో వామపక్షం సీపీఐ ఎంఎల్ 19 స్థానాలు తీసుకుని 12చోట్ల విజయం పొందింది. విడిగా పోటీచేసిన ఎంఐఎం అయిదు స్థానాలు గెల్చుకుని ఔరా అనిపించుకుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో నిజమైన యోధుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి ఎవరూ ఆయన్ను గట్టి పోటీదారుగా పరిగణించలేదు. బిహార్లో ఎన్డీఏ పాలనపై తీవ్రమైన అసంతృప్తివున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ అదే అధికారంలో కొస్తుం దని అందరూ అంచనా వేశారు. అపార అనుభవమున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుపాలు కావడం, తేజస్వికి ఎన్నికల సారథ్య అనుభవం పెద్దగా లేకపోవడంవల్ల ఆ పార్టీ నాయ కత్వంలోని మహాకూటమి కనీసం గట్టి పోటీ ఇస్తుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేకపో యింది. పైగా అటు పదిహేనేళ్లుగా అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతూవస్తున్న నితీశ్ నాయ కత్వం లోని ఎన్డీఏ కూటమి. కేంద్రంలో ప్రధానితో మొదలుపెట్టి అతిరథులు, మహారథులు, అర్థ రథులు... అందరూ ఆ కూటమిలోనే వున్నారు. బీజేపీకి సుశిక్షితులైన కార్యకర్తల సైన్యం వుంది. నెల రోజుల ముందు తేజస్వి ఈ అంచనాలను తారుమారు చేశారు. ఎన్నికల ఎజెండాను తానే నిర్ణయిం చారు. ఆయన సవాళ్లకు జవాబివ్వడంతోనే అవతలివారికి సరిపోయింది. ఎక్కడా మాట తూలలేదు. ఎవరినీ కించపరచలేదు. తనను ప్రధాని మోదీ ‘జంగిల్ రాజ్ కీ యువరాజ్’ అన్నా ఆయన్ను పల్లెత్తు మాట అనలేదు. తమను గెలిపిస్తే యువతకు 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన ఇచ్చిన హామీ అత్యధిక వలసలుండే బిహార్లో మంత్రంలా పనిచేసింది. మొదట్లో ఆచరణ సాధ్యంకానిదని తేల్చే సిన బీజేపీ చివరకు ఆ ఉద్యోగాల సంఖ్యను 19 లక్షలకు పెంచి, కేంద్రంలో అధికారంలో వున్నందున తాము మాత్రమే ఆ పని చేయగలమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తేజస్వికి కాంగ్రెస్ శిరోభారమైంది. స్థోమత లేకున్నా తగుదునమ్మా అంటూ 75 సీట్ల జాబితాను ఆయన ముందు పెట్టింది. ఇస్తే సరేసరి... లేకుంటే ప్లాన్ బీ వుందని హెచ్చరించింది. లాలూ రంగంలో వుంటే వేరుగా వుండేది. చివరకు ఆ పార్టీకి 70 స్థానాలివ్వక తప్పలేదు. ఎక్కువచోట్ల పోటీచేస్తేనే భవిష్యత్తులో పార్టీ విస్తరిస్తుందన్న మతిలేని తర్కంతో అది పట్టుదలకు పోయింది. స్వస్వరూప జ్ఞానంతో కాంగ్రెస్ 35 లేదా 40సీట్లకు సరిపెట్టుకుంటే ఆర్జేడీ మరో 25 స్థానాలు సునాయాసంగా చేజిక్కించుకునేది. కూటమికి పీఠం అందేది. బిహార్ రాజకీయ రంగం ప్రత్యేకతేమంటే... అక్కడ కూటమిగా వచ్చే పార్టీలకే ఆదరణ వుంటుంది. కనుకనే ఈ పొత్తు తప్పలేదు. వామపక్షాలకు, ముఖ్యంగా సీపీఐ ఎంఎల్కు మంచి ప్రజా పునాది వుందని గ్రహించిన తేజస్వి వారిని కూటమిలోకి తీసుకురాగలిగారు. మండల్ రాజకీయాలకు ఆర్థిక ఎజెండాను కూడా జోడించి మధ్యతరగతి విద్యావంతుల్ని ఆకర్షించారు. అయితే కరోనాను ఎదుర్కొనడంలో వైఫల్యం, లాక్డౌన్, వలసజీవుల వెతలు వగైరాలతో సతమతమైన బిహార్లో ఇవేమీ చర్చకు రాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని, కూటమిలో ప్రధాన పక్షంగా అవతరించిన బీజేపీ... దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. 59 స్థానాల్లో 41 రాబట్టుకుంది. కాంగ్రెస్ను 31 చోట్ల ఓడించి దాన్ని మరింత కుదించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్లలో బీజేపీ ఎన్నదగిన విజయాలు సాధించింది. తెలంగాణలోని దుబ్బాక స్థానంలో ఆ పార్టీ గెలుపు కూడా ఎన్న దగింది. అచ్చం బిహార్ ఫలితాల మాదిరే అక్కడా విజయం దోబూచులాడింది. చివరంటా గెలు పెవరిదో చెప్పలేని ఉత్కంఠ ఏర్పడింది. బీజేపీ యువత అటు సోషల్ మీడియాలో, ఇటు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా పనిచేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంవల్ల వచ్చిన సాను భూతి పవనాలనూ, అడుగడుగునా ఎదురైన అడ్డంకులనూ వారు అధిగమించారు. ఏదేమైనా ఈ విజయాలన్నీ పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సా హంగా పోరాడేందుకు బీజేపీ శ్రేణులకు స్ఫూర్తినిస్తాయి. -
నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే
బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(73) కంటే జేడీ(యూ) (43) తక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే ఊహగానాలకు తెరపడింది. బిహార్ పగ్గాలు మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమారే చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీపావళి తరువాత నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జేడీయూ ఎంపీ కెసి త్యాగి తెలిపారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. నితీష్ కుమార్ను జాతీయ రాజకీయాల వైపు రావాలని సెక్యులర్ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా పని చెయ్యాలని, బీహార్ నితీష్ స్థాయికి చిన్నదైపోయిందంటూ ట్వీట్ చేశారు. (చదవండి : నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ బీజేపీ నాయకుడని, గెలుపోటములు ఆయన స్థాయిని దిగజార్చవని, ఆయనపై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ను ప్రజలు తిరస్కరించారని, దిగ్విజయ్ తన రాష్ట్రంలో తన పార్టీ రాజకీయాలను చూసుకోవాలని విమర్శించారు. ఇదే అంశంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్మోదీ మాట్లాడుతూ.. బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, ఇది ఏ ఒక్క పార్టీ గెలుపు కాదని, సమిష్టి విజయమన్నారు. బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమిపై నమ్మకముంచి పట్టం కట్టారన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. -
‘తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటాం’
-
‘తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటాం’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిన బీజేపీ ప్రభావం లేదనేవారికి తాజా ఎన్నికలు షాక్ ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటామని చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. చదవండి : బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!? ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూసిందని, కరోనా సమయంలో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామని అన్నారు. ఫలితాల నేపథ్యంలో ప్రజలంతా టీవీలు, ట్విటర్, ఫేస్బుక్లకు అతుక్కుపోయారని చెప్పారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే మీడియాలో బూత్ల రిగ్గింగ్, ఓట్ల గల్లంతుకు సంబంధించిన కథనాలు వచ్చేవని, ఇప్పుడు పోలింగ్ శాతం ఎంత పెరిగిందనే పతాక శీర్షికలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. బిహార్లో అద్భుత విజయం అందించారని, తాజా ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పనిచేస్తూ ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారని అన్నారు. విజయోత్సవ సభలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ అగ్రనేతలు, పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ నితీష కుమార్ నేతృత్వలోని పాలక ఏన్డీఏకు గట్టి పోటీ ఇచ్చారని శివసేన ప్రశంసించింది. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మరోసారి సీఎం అయితే ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని పేర్కొంది. జేడియూకి సీట్లు తక్కువ వచ్చినా ముఖ్యమంత్రి పీఠం నితీష్ కుమార్దేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన తెలిపింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి హామీయే శివసేనకు ఇచ్చి కాషాయ పార్టీ నిలబెట్టుకోలేదని దీంతో మహారాష్ట్రలో రాజకీయ మహాభారతం జరిగిందని తెలిపింది. ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య సీఎం పదవిపై అవగాహన కుదిరిందని పేర్కొంది. ఎన్నికల తర్వాత శివసేనకు 56 సీట్లు రావడంతో బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడంతో కూటమి విడిపోయిందని గుర్తుచేసింది. బిహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా పనిచేయడంతో తేజశ్వికి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు పోటీలో లేని మహాకూటమి యువ నేత ప్రతిష్టతోనే విజయానికి దగ్గరగా వచ్చిందని తెలిపింది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకపోవడం మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని విమర్శించింది. ‘జంగిల్రాజ్ కా యువరాజ్’ అంటూ తేజశ్విని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారని.. ముఖ్యమంత్రి నితీష్ ఇదే తనకు చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించింది. తేజశ్వి మాత్రం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారని పేర్కొంది. దేశ రాజకీయాలకు బిహార్ ఎన్నికలు కొత్త తేజశ్విని పరిచయం చేశాయని సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. (చదవండి: వారి స్వరం వినిపిస్తా: ఓవైసీ) -
వారి స్వరం వినిపిస్తా: ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్ధానాలు గెలుపొంది సత్తా చాటిన ఏఐఎంఐఎం బలహీనుల గొంతుకగా మారుతుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము బెంగాల్, యూపీ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి పార్టీని విస్తరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ పోటీచేసి ఎంఐఎంను జాతీయ పార్టీగా మలిచే ప్రణాళికలు తమ ముందున్నాయనే సంకేతాలు పంపారు. బెంగాల్లోనూ విజయాలను నమోదు చేస్తామని 2021లో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతామని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చిందని తమను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రలో శివసేనతో చేతులు కలిపిన కాంగ్రెస్తో తాము ఎలా జతకడతామని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు తమకు ఉందని, దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. బిహార్లో దీటైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్జేడీకి మద్దతుపై పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బిహార్లో తమ పార్టీ విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, తాను హాజరైన పలు సభలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి ఎంఐఎంను నిందిచడం తగదని అన్నారు. చదవండి : ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’ -
బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజంభణను అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత మార్చి నెలలో విధించిన లాక్డౌన్ వల్ల దేశంలో పౌర జీవనం పూర్తిగా స్తంభించి పోవడం, ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు కట్టుబట్టలతో కాలినడకన, సైకిళ్లు, దొరికిన వాహనాలపై ఇళ్లకు బయల్దేరి అష్టకష్టాలు పడిన విషయం తెల్సిందే. ఎర్రటి ఎండలను లెక్క చేయకుండా పిల్లా పాపలతో సొంతూళ్లకు బయల్దేరిన బడుగు జీవుల కష్టాలు నేటికి మన కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో దాదాపు వెయ్యి మంది ప్రజలు మరణించారు. (బీజేపీదే బిహార్) దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా బిహార్ నుంచే ప్రజలు ఎక్కువగా వలసలు పోవడం, తిరుగు టపాలో వారే ఎక్కువగా కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. మరి అలాంటి రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఏమిటా? అన్న ఆశ్చర్యం నేడు మేథావుల మెదళ్లను కూడా తొలుస్తోంది. బిహార్లో కాషాయ పార్టీకి 74 సీట్లు రావడం అంటే ఓటింగ్లో 20 శాతం వాటా వచ్చినట్లే. 243 స్థానాలు కలిగిన ఆ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లతో అధికార పీఠాన్ని అప్పగించడమంటే మామూలు విషయం కాదు. అలాగే 11 రాష్ట్రాల పరిధిలోని 58 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ఊహించిన వారూ తక్కువే. మధ్యప్రదేశ్లో 28కిగాను 19 సీట్లు, గుజరాత్లో ఎనిమిదికి ఎనిమిది, యూపీలో ఏడింట ఆరు, కర్ణాటకలో రెండింటికి రెండు సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ, తెలంగాణలోని దుబ్బాక స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా భౌగోళికంగా కూడా విస్తరించింది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) ఎన్నికల్లో బిహార్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ విజయఢంకా మోగించిందంటే లాక్డౌన్ సందర్భంగా ప్రజలు తాము అనుభవించిన అసాధారణ కష్టాలకు అటు ప్రధాని నరేంద్ర మోదీనికానీ, బీజేపీగానీ బాధ్యులను చేయదల్చుకోలేదన్న విషయం స్పష్టం అవుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మైనస్ 23.9 శాతానికి (ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి) పడిపోయినప్పటి వారు పార్టీనిగానీ, ప్రధానినిగానీ నిందించదల్చుకోలేదు. లాక్డౌన్ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన భావాలను పరిగణలోకి తీసుకున్నా మనకు కాస్త వాస్తవ చిత్రం మననంలోకి వస్తుంది. లాక్డౌన్ చాలా కఠినంగా ఉందని, అసలు విధించాల్సిందికాదని లోక్నీతి–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వేలో 43.7 శాతం మంది అభిప్రాయపడగా, లాక్డౌన్ కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని, కరోనాను అరికట్టేందుకు మరింత కఠినంగా అమలుచేసి ఉండాల్సిందని 49.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. (బిహార్లో విజయం సాధించిన ప్రముఖులు) లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం ఏదోరకంగా, ఎంతోకొంత ఇబ్బందులు పడ్డామని 90 శాతం మంది ప్రజలు చెప్పగా, తమకు ఎదురైన ఆర్థిక కష్టాల ముందు కరోనా మహమ్మారిని అంతగా పట్టించుకోలేదని, బతికుంటే బలిసాకు తిని బతకవచ్చనే ఆశతోనే సొంతూళ్లకు బయల్దేరి వచ్చామని 44.9 శాతం మంది వలస కార్మికులు తెలియజేశారు. వలస కార్మికుల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని 72.8 శాతం మంది సమర్థించగా, వివిధ రాష్ట్రాలు అనుసరించిన వైఖరిని 76 శాతం మంది సమర్థించారు. అలాగే కరోనా కట్టడికి మోదీ తీసుకున్న చర్యలను 74.7 శాతం మంది ప్రజలు, రాష్ట్రాలు తీసుకున్న చర్యలను 77.7 శాతం మంది ప్రజలు సమర్థించారు. అంటే ‘కరోనా’కు సంబంధించిన ఏ అంశం కూడా ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని అర్థం అవుతోంది. (ఎకానమీ కోలుకుంటోంది కానీ..) గతంలోకన్నా ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం పెరగడానికి కారణం ఏమిటీ? ‘పాలిటిక్స్ ఆఫ్ విశ్వాస్’ అని, నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల ప్రజలకున్న నమ్మకమే ఎన్నికల్లో ప్రభావం చూపిందని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త నీలాంజన్ సర్కార్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎన్నో ఇక్కట్ల పాలైనప్పటికీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చినప్పటికీ 2019 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడానికి ప్రజల విశ్వాసమే కారణమని ఆయన అన్నారు. హిందూ జాతీయవాదం పట్ల ఉన్న విశ్వాసం కూడా విజయానికి దోహదపడగా, మీడియా పట్ల బీజేపీకి ఉన్న పట్టు, సంస్థగతంగా ఆ పార్టీకున్న బలమైన యంత్రాంగం కూడా ఫలితాలను ప్రభావితం చేసిందని సర్కార్ చెప్పారు. -
బిహార్లో విజయం సాధించిన ప్రముఖులు
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు: తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బిహార్లో పెద్దగా మార్పేమీ ఉండదు.. కానీ: పవార్
పుణె: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిదాయకమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మంగళవారం నాటి ఫలితాల వల్ల రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాకపోయినప్పటికీ, సమీప భవిష్యత్తును ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రౌండ్ రౌండ్కు ఫలితాలు తారుమారు అవుతుండటంతో ఎన్డీయే, మహాగట్ బంధన్(ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి) మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ విషయంపై స్పందించిన శరద్ పవార్ పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ- జేడీయూ కూటమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (చదవండి: రానున్న ఎన్నికలకు ట్రైలర్ వంటిది: సీఎం ) ‘‘ఎన్నికల ప్రచారాన్ని గమనించినట్లయితే ఓ వైపు.. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్లు గుజరాత్ను పాలించిన, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. ఆయనతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తే.. మరోవైపు.. ఏమాత్రం అనుభవం లేని తేజస్వి యాదవ్ వంటి యువకుడు సొంతంగా పోరాడాడు. అతడు ప్రదర్శించిన ధైర్యం యువతకు స్ఫూర్తిదాయకం. ఈనాటి ఫలితాలు పెద్దగా మార్పు తీసుకురానప్పటికీ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని ఆశించవచ్చు’’అని పేర్కొన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్పుర్ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గెలుపొందారు.(చదవండి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) -
‘మోదీ విజన్తోనే మెరుగైన ఫలితాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కాషాయ పార్టీ బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ బిహార్లో ఘన విజయం సాధించిందని అన్నారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిపై విస్పష్ట ఆధిక్యం కనబరిచిందని చెప్పారు. చదవండి : కోవిడ్-19 : ప్రపంచానికి భారత్ బాసట ఇక 243 స్ధానాలు కలిగిన బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 123 స్ధానాల్లో ఆధిక్యంతో మేజిక్ మార్క్కు చేరువ కాగా, మహాకూటమి 112 స్ధానాల్లో ముందంజలో ఉండగా ఇతరులు 8 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు యూపీలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆరు స్ధానాల్లో బీజేపీ విజయదుంధుభి మోగించడం పట్ల పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యానాథ్ అభినందించారు. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. -
బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇక బిహార్లో ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్ధానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. మరోవైపు బిహార్లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. -
విపక్షాలు చిత్తు.. బీజేపీ క్లీన్స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఉప ఎన్నికలు జరగుతున్న మొత్తం 8 స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా దూసుకెళుతోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే సిట్టింగ్ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది. ఇక కర్ణాటకలోనూ అధికార బీజేపీ అనుహ్య ఫలితాలను సాధించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆర్ఆర్ నగర్, శిర అసెంబ్లీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఈ రెండు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మరింత పెరుగనుంది. (సీఎం పీఠం నితీష్కు దక్కుతుందా?) దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన మధ్య ప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 6, బీఎస్పీ 1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. బిహార్లోని అధికార ఎన్డీయే కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. జేడీయూ-బీజేపీ నేతృత్వంలోనే కూటమి 130 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమైంది. ఉప ఎన్నికల ఫలితాలు.. యూపీ (7): బీజేపీ 6, ఎస్పీ 1 ఒడిశా (2): బీజేడీ ఆధిక్యం హర్యానా (1): కాంగ్రెస్ ఆధిక్యం జార్ఖండ్ (2): బీజేపీ 1, కాంగ్రెస్ 1 మణిపూర్ (5): బీజేపీ 4, ఇతరులు 1 ఛత్తీస్గఢ్ (1): కాంగ్రెస్ ఆధిక్యం నాగాలాండ్ (2): రెండు స్థానాల్లోనూ ఇతరుల ఆధిక్యం -
బీజేపీ వ్యూహం: సీఎం పీఠం నితీష్కేనా?
పట్నా : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇక అధికారంపై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ పలు చోట్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కోలేకపోయింది. మొత్తానికి పట్నా పోరులో మరోసారి బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఎన్డీయే కూటమి ఊహించని విధంగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే జేడీయూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. (బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) చాణిక్యుడిగా పేరొందిన నితీష్కు ఈసారి బిహార్ ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అర్థమవుతోంది. అయితే కేంద్రంలోని బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానియా బాగానే పనిచేసింది. అంచనాలకు అందకుండా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అనుహ్యమైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం వెల్లడైన ఫలితాల ప్రకారం.. బిహార్ అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం.. ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉండగా.. వాటిల్లో బీజేపీ 75కు పైగా సీట్లులో ఆధిక్యంలో ఉంది. జేడీయూ 50 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే అనుహ్య రీతిలో బీజేపీ పుంజుకోవడం బిహార్ ఎన్నికల్లో ఎవరూ ఊహించలేనిది. అయితే ఫలితాల అనంతరం ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్గా ఎన్నికయ్యారు. అయితే ఫలితాలు తారుమారు కావడంతో పాటు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద పార్టీ అయిన తమకే సీఎం పీఠం దక్కాలని కాషాయ నేతలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. దీనిపై జేడీయూ నేతలు మాట్లాడుతూ... ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా.. నితీష్ కుమార్నే సీఎంగా ఎన్నుకుంటామని తెలిపారు. అయితే ఫలితాల అనంతరం జరిగే పరిణామాలు బట్టి బీజేపీ వ్యూహం మార్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. -
ఎన్డీఏ ముందంజ
-
‘తేజస్వీ బర్త్డే గిఫ్ట్గా సీఎం పీఠం’
పట్నా: బిహార్ రాజకీయాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మరో సారి నితీష్ సర్కార్ అని ఎన్డీఏ కూటమి భావిస్తుండగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు అధికారం ఖాయమని అంచాన వేస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి పీఠం బర్త్డే గిఫ్ట్గా దక్కనుంది అని తెలిపారు. నవంబర్ 9న తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ ఎంతో ఘనంగా తేజస్వీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్ను తిరస్కరించారు. ఉపాధి కల్పన వంటి అంశాల్లో జేడీయూ ప్రభుత్వం ఘోరంగా పరాజయం అయ్యింది. అంతేకాక నితీష్ పాలనలో ఎన్నో స్కాములు జరిగాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఈ సారి మహాఘట్ బంధన్కు ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పక్కన పెట్టండి. మాకు బిహారీల పట్ల నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని మాకు ఇస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. (చదవండి: ఆర్జేడీ కూటమికే జై) కాంగ్రెస్ నాయకుడు కృతి జా అజాద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టిన రోజు కానుకగా ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోబోతున్న తేజస్వీ యాదవ్కు అభినందనలు. ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు జా. ఒకవేళ తేజస్వీ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం ఓ రికార్డు సృష్టిస్తుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు సీఎంలు అయ్యారనే ఘనత దక్కుతుంది. తేజస్వీ కుటుంబంలో ఇప్పటికే ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లీ రబ్రీదేవిలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్ప్ మహాఘట్బంధన్ భారీ విజయం సాధించబోతుందని అంచాన వేశాయి. ఇక ఇప్పటికే 38 జిల్లాలోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మరి కొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్తు ఏంటనే విషయం బయటపడనుంది. -
బిహార్ పీఠం కొత్త తరానిదేనా?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీగా బందోబస్తు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్లోని వాల్మీకినగర్ లోక్సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
ఉత్కంఠ: బీజేపీ వ్యూహం మారుస్తుందా?
పట్నా : ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉన్నా.. విజయంపై ఎవరి ధీమా వారికే ఉంది. కేంద్రంలోని అధికార బీజేపీ ఆశలన్నీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పైనే ఉండగా.. జేడీయూ నేతలు మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ మానియాతో మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. బీజేపీ-జేడీయూ కూటమికి అధికారం దూరం కానుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేతృత్వంలోనే మహాఘట్బంద్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి 125-130 స్థానాలు, బీజేపీ-జేడీయూ 90-100 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గత అనుభవాల దృష్ట్యా బిహార్ ఎగ్జిట్ పోల్స్లో స్వల్ప మార్పులు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాక హంగ్ ఏర్పడే అవకాశం సైతం ఉందన్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ-ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అవకాశవాద రాజకీయ నాయకుడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్కు గుడ్బై చెప్పి.. యువనేతగా బలమైన పార్టీ పునాదులు కలిగిన తేజస్వీ యాదవ్ను తమవైపుకు తిప్పికునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంటూ రోజురోజుకూ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉండలేమన భావన ఆర్జేడీ నేతల్లోనూ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీకే ఎక్కువ సీట్లు ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ మధ్య జరిగిన ఈ పోరులో తాజా ఎగ్జిట్ ఫలితాల ప్రకారం పార్టీల వారిగా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. జేడీయూ గతంలో వచ్చిన సీట్ల కంటే మరింత తక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుంది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీజేపీ-ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బిహార్ కురువృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య, రాజకీయ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంతో పాటు తన తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తేజస్వీ రచించిన వ్యూహంలో భాగంగా ఫలితాల అనంతరం బీజేపీతో జట్టుకట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తేజస్వీతో జట్టుకు బీజేపీ.. గత ఎన్నికల సమయంలో తొలుత బీజేపీకి గుడ్ బై చెప్పి.. ఆ తరువాత లాలూతో కలిసి కొన్ని రోజుల తరువాత వారికీ షాకిచ్చి.. అధికారం కోసం రంగుల మార్చిన నితీష్ను దెబ్బ తీయాలని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు నితీష్పై వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్న క్రమంలోనే మరో దారి చేసుకునేందుకు బీజేపీ నేతలు సైతం సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే తేజస్వీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ను పురిగొల్పి.. జేడీయూ అభ్యర్థులపై పోటీకి నిలిపినట్లు వార్తలు విస్తున్నాయి. ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం బీజేపీ-జేడీయూ కూటమికి ఎంత నష్టమో.. ఆర్జేడీకి అంత లాభం చేకూర్చింది. అయితే మహాఘట్బందన్కు సంపూర్ణ మెజార్టీ లభిస్తే తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా రేకిత్తిస్తున్న బిహార్ తుది తీర్పు కోసం మరికొన్ని గంటలపాటు ఎదురు చూడాల్సిందే. -
ట్రంప్ ఓటమి భారత్కు మంచిదేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడన్ విజయం సాధించడానికి బిహార్ ఎన్నికల ఫలితాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుండగానే బిహార్లో ఆఖరి విడత పోలింగ్ జరిగింది. ఆ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలిందంటే అమెరికా ఎన్నికల ప్రభావం ఉన్నట్లేగదా! అని కొంతమంది ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. (టార్గెట్ బైడెన్ వయా చైనా!) బిహార్ ఆఖరి విడత పోలింగ్ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉందని, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య ‘నువ్వా, నేనా’ అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తోంది. అలాంటప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు బిహార్ పోలింగ్పై ఉండే ఆస్కారమే లేదు. కాకపోతే అమెరికాలోని భారతీయుల్లో మోదీ అభిమానులు, విధేయులు ఎక్కువ మంది ఉన్నందున వారి ఓటు బ్యాంక్ను కొల్లగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ఆశించి ట్రంప్ బోల్తా పడ్డారు. (వైట్హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్తో భార్య మెలానియా) అమెరికాలో ‘హౌడీ మోడీ, భారత్లో నమస్తే ట్రంప్’ పేరిట ఇరువు దేశాధినేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడడం వెనక ఎన్నికల వ్యూహం ఉందనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందర, నవంబర్ 3వ తేదీన అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రలు అనూహ్యంగా భారత్కు వచ్చి ‘2ప్లస్2’ చర్చల్లో భారత్తో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. ప్రవాస భారతీయ ఓట్లను ఆకర్షించడం కోసం ట్రంప్ చేసిన ఆఖరి ప్రయత్నంగా దాన్ని పేర్కొనవచ్చు. బైడన్, కమలా హ్యారిస్లకు ఓటేసిన ప్రవాస భారతీయులందరిని భారత వ్యతిరేకులుగా మోదీ విధేయులు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. వాస్తవానికి మోదీ విధేయులైన భారతీయులు కూడా అమెరికా ఎన్నికల్లో విడిపోయినట్లు, వారిలో ఎక్కువ మంది బైడెన్కు ఓటేయగా, తక్కువ మంది ట్రంప్కు వేసినట్లు అమెరికా ముందస్తు ఎన్నికల సందర్భంగా పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్ సర్వేల్లో చెప్పారు. వచ్చే తరం ప్రవాస భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు రాకపోయినా, వచ్చినా తమకు సంబంధం లేదని, తమకు పన్నులు తగ్గితే చాలనుకున్న మోదీ విధేయుల్లో ఓ వర్గం ట్రంప్కు ఓటేయగా, బైడెన్ అధికారంలోకి వస్తే భారతీయులపై శ్వేత జాతీయులు దాడులు తగ్గుతాయని, పైగా ప్రవాస భారతీయులుకు హెచ్ 1 బీ వీసాలు పెరగుతాయని భావించిన మోదీ విధేయుల్లో మరో వర్గం బైడెన్కు ఓటేశారు. బైడెన్ వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ను కాకుండా పాకిస్థాన్కు మద్దతు ఇస్తారంటూ మత విద్వేషకుల్లో ఓ వర్గం చేసిన ప్రచారం కూడా వారి ముందు పనిచేయలేదు. బైడెన్ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్కు మద్దతిస్తానని చెప్పలేదు. కశ్మీర్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సి వచ్చినప్పుడు తాను కశ్మీరీల పక్షమని బైడెన్ తెలిపారు. అంతమాత్రాన అది పాకిస్థాన్కు మద్దతివ్వడం ఎంతమాత్రం కాదు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం వల్ల భారతీయులుగానీ, ప్రవాస భారతీయులు బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రవాస భారతీయులకుగానీ, భారతీయులకుగానీ జో బైడెన్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, ఆయన ప్రవాస భారతీయులకిచ్చిన హామీలను మరచిపోరాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అమెరికాలోని కొన్ని చట్టాలను సవరించాలి. అందుకు అవసరమైన బలం సెనేట్లో బైడెన్కు లేదు. అలాంటప్పుడు అయన తన హామీలను ఎల నెరవేరుస్తారన్నది మరికొందరి విశ్లేషకుల అనుమానం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. (ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్) -
కార్యకర్తలను హెచ్చరించిన తేజస్వీ యాదవ్
పట్నా: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టిన వేళ తేజస్వి యాదవ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఓట్ల కౌంటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, క్రమ శిక్షణగా మెలగాలని చెప్పారు. తుది ఫలితాలు ఎలా ఉన్నా సహనం పాటించాలని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. బాణాసంచా కాల్చడం, రంగులు పూసుకోవడం, ప్రతిపక్ష పార్టీ వారితో రౌడీ చేష్టలు పనికిరావని అన్నారు. ఇక ఫలితాలు ఎలా ఉన్నా సంయమనం పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పూనుకోవద్దని ఆర్జేడీ ట్విటర్ వేదికగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్- రబ్రీ దేవి పాలనలో బిహార్లో రౌడీ రాజ్యం నడిచిందనే అవపవాదు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తేజస్వీ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ హెచ్చరికలు చేశారు. కాగా, బిహార్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. మంగళవారం (నవంబర్ 10) ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి (మహా ఘటన్ బంధన్) విజయం సాధిస్తే తేజస్వి యాదవ్ బిహార్ సీఎం పదవి చేపట్టనునన్నారు. ఇక బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు గాను మహా ఘటన్ బంధన్ 128 సీట్లు, ఎన్డీఏ కూటమి 99 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 6 స్థానాలు గెలవొచ్చని తెలిపాయి. బిహార్లో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. మరోవైపు క్షేత్ర స్థాయిలో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువగానే సీట్లు సాధిస్తామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి చెప్తున్నారు. -
ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు. చివరి దశకు క్యూ2 ఫలితాలు.... మూడు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, ఐడీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు...! ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్కు ప్రతికూలాంశమని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హేమాంగ్ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్ఎస్సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. అక్టోబర్లో ఈక్విటీల నుంచి ఫండ్స్ భారీ ఉపసంహరణలు... వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) భారీ మొత్తాన్ని విత్డ్రా చేశాయి. అక్టోబర్ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్ నుంచి ఎంఎఫ్లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్ను విక్రయించడమే విత్డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్లు స్టాక్ మార్కెట్లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది. అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారుతుండటంతో ఇన్ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రూ.7,200 కోట్ల ఔట్ఫ్లో ఉందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నుంచి ఔట్ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘ ‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్ ఈవెన్కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ హర్‡్ష జైన్ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్లు విత్డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్ పతనం తర్వాత ఎంఎఫ్ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి తెలిపారు. -
చివరి దశ ఎన్నికల్లో 57.92% పోలింగ్
బిహార్ శాసనసభకు జరిగిన మూడో దశ(చివరి దశ) ఎన్నికల్లో 57.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి రెండు దశల కంటే మూడో దశలో అధికంగా పోలింగ్ జరిగిందని తెలిపింది. చెదురుమదురు సంఘటనలు మినహా శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి దశలో ఉత్తర బిహార్లో 15 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 78 నియోజకవర్గాల్లో 2.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 33,782 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్ణియాలో ఓటింగ్ కేంద్రం వద్ద ఉన్న గుమికూడిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కతిహర్లో రైల్వే క్రాసింగ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేయనందుకు నిరసనగా 12 బూత్లతో జనం ఓటింగ్ను బహిష్కరించారు. జోకిహత్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలామ్ తన చొక్కాకు పార్టీ బ్యాడ్జీని ధరించి ఓటు వేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరగనుంది. శనివారం జరిగిన పోలింగ్తోపాటు తొలి రెండు పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 56.43 శాతం పోలింగ్ నమోదైంది. -
ఆర్జేడీ కూటమికే జై
సాక్షి, న్యూఢిల్లీ/పటా్న: బిహార్లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగuŠ‡బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా.. ఏడాదిన్నర కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహాగuŠ‡బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపించినప్పటికీ హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశాలున్నట్టుగా వివిధ సర్వేలు చూస్తే వెల్లడవుతుంది. నితీశ్కుమార్ వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడుతూ ఉంటే, తన తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఆర్జేడీని బలోపేతం చేశారని, యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై గత ఏడెనిమిది నెలలుగా నితీశ్ సరిగ్గా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆర్థిక అంశాలు, నిరుద్యోగితపై ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో సఫలీకృతుడయ్యారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ సహా ఆరు పార్టీల కూటమి అయిన గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్(జీడీఎస్ఎఫ్) ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేకపోయిందన్నాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలి ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ప్రశ్నకు 44 శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని స్పష్టంగా చెప్పారు. నితీశ్కుమార్ సీఎం కావాలని 35% మంది కోరుకుంటే, దివంగత నాయకుడు రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 7% మంది, ఉపేంద్ర కుష్వా ముఖ్యమంత్రి కావాలని 4% మంది ఆశించారు. బిహార్లో తన తండ్రి మాదిరిగా కులాల చట్రంలో పడి కొట్టుకుపోకుండా కొత్త తరహా రాజకీయాలకు తేజస్వీ యాదవ్ తెరతీశారని ఇండియా టుడే విశ్లేíÙంచింది. మధ్యప్రదేశ్లో చౌహాన్ సర్కార్ సురక్షితం! మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు శివరాజ్సింగ్ సర్కార్పై ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 16–18, కాంగ్రెస్కి 10–12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్తక్ సర్వే కాంగ్రెస్కు 16–18, బీజేపీకి 10–12స్థానాలు వెల్లడించింది. యువతరం ప్రతినిధి తేజస్వి 30 ఏళ్ల వయసున్న తేజస్వి తనని తాను యువతరానికి ప్రతినిధిగా ఒక ఇమేజ్ సంపాదించడమే కాకుండా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారానికి కొత్త రూపు కలి్పంచారని ఇండియా టుడే అభిప్రాయపడింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ హామీ ఇవ్వడమే కాకుండా, లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కారి్మకుల కష్టాలపైనే ఆయన ఎన్నికల ప్రచారంలో దృష్టి సారించారు. అధికార నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలను పట్టుకొని వాటినే పదే పదే ప్రస్తావిస్తూ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వలస కారి్మకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుపేద మధ్య తరగతి వర్గాలన్నీ ఈసారి తేజస్వీ యాదవ్ వైపే ఉన్నట్టుగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ముస్లిం, యాదవ్లు అంటూ కులాల వారీగా మద్దతు కూడగట్టుకోకుండా కష్టాల్లో ఉన్న వారి అండని సంపాదించడానికి తేజస్వి ప్రయత్నించారు. తేజస్వి ప్రచార సభలకి జనం వెల్లువెత్తడం, ఆవేశపూరితంగా ఆయన చేసే ప్రసంగాలు ఎన్నికల ఫలితాల్ని మార్చబోతున్నాయని ఇండియా టుడే విశ్లేíÙంచింది. -
బిహార్లో ముగిసిన 3వదశ పోలింగ్
-
బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బిహార్లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది. కాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. పట్నా,నలందాతోపాటు వాయువ్య భోజ్పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో వెల్లడైంది. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇక బిహార్ లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఖ్య 25 శాతం. లింగ నిష్పత్తితోపాటు కుల,మత, వయస్సుల వారీ సమాన ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది.(చదవండి: జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు) పీపుల్స్ పల్స్- పీఎస్జీ సర్వే: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020 ముఖ్యాంశాలు బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యలు నిరుద్యోగం (31%), ధరల పెరుగుదల (28%), వలసలు (19%), వరదలు (12%), ఎంఎస్పీ (9%) మరియు ఇతర సమస్యలు (1%) తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. 10 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను ఆకట్టుకుంది. ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపారు. భూమిహార్ల సామాజికవర్గంసహా ఉన్నత కులాల ఓటర్లు సైతం గణనీయమైన సంఖ్యలో జేడీ (యూ)కి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో పెద్దగా పని చేయని దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ప్రభావం. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించింది. పాట్నా, నలందాతోపాటు వాయువ్య భోజ్పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం. పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు గండి కొట్టిన తిరుగుబాటు, స్వతంత్ర్య అభ్యర్ధులు. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పీపుల్స్ పల్స్: మహాగట్ బంధన్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం పీపుల్స్ పల్స్: జేడీయూ+ 90-110 ఆర్జేడీ+ 100-115 ఎల్జేపీ 3-5 ఇతరులు 8-18 టైమ్స్ నౌ - సీ ఓటర్ : ఆర్జేడీ కూటమికే మొగ్గు ఎన్డీఏ 116 మహాకూటమి 120 ఎల్జేపీ 1 ఇతరులు 0 ఇండియా టుడే సర్వే: మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు మధ్యప్రదేశ్: బీజేపీ 16-18, కాంగ్రెస్ 10-12, బీఎస్పీ 0-1 మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం సీట్లు కాంగ్రెస్కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం సీట్లు ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో 7 స్థానాలకు- బీజేపీ 5-6, ఎస్పీ 0-1, బీఎస్పీ 0-1 బిహార్ 2015 ఫలితాలు ఆర్జేడీ- 80, జేడీయూ- 71, బీజేపీ- 53 2015లో అధికారంలోకి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమి ఏడాదిన్నర తర్వాత కూటమి నుంచి బయటికొచ్చిన నితీష్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరదశ పోలింగ్ నేడు జరుగుతుంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. జేడీయూకి ఓటు వేసినందుకుగాను ఆర్జేడీ కార్యకర్తలు ఓ మధ్యవయసు వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి జేడీయూకు ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన మాధేపూరలో చోటు చేసుకుంది. వీడియోలోని పెద్దాయన తాను బాణం గుర్తుకు ఓటు వేశానని చెప్పడంతో ఆర్జేడీ కార్యకర్తలు తనని చితకబాదారని తెలిపాడు. ‘ఆర్జేడీ అంటే బిహార్లో గూండారాజ్యం అని అర్థం’ అంటూ వీడియోని ట్వీట్ చేశారు అమిత్ మాల్వియా. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆర్జేడీ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ ఓటర్లకు డబ్బు పంచుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘బిహార్లో ఓడిపోతానని బీజేపీకి అర్థమయ్యింది. అందుకే డబ్బులు పంచుతుంది. కానీ ఇది బిహార్ సార్. మీరు డబ్బుతో బిహారీలను కొనలేరు’ అంటూ వీడియోని ట్వీట్ చేసింది. (చదవండి: ‘నితీష్కు ముందే ఆ విషయం అర్థమైంది’) ఇక బిహార్లో నేడు చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు 2.35 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
నితీష్ కుమార్ ఇక ఇంటికే :పాశ్వాన్
పట్నా : మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ సిద్ధమైంది. చివరి దశలో మొత్తం 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ ప్రారంభమైంది. తుది దశలో మెత్తం 2కోట్ల 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ఘాటు వ్యాక్యాలు చేశారు. మరోసారి నితీష్ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. తాను సాధారణ స్థాయి నుంచి వచ్చి పనిచేశానని, పార్టీ కోసం ఒంటరిగా కృషి చేస్తున్నానని అన్నారు. గడిచిన రెండు దశల ఎన్నికలను పరిశీలిస్తే నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి కారని అన్నారు. రాబోయే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుందని, ప్రతి ఒక్కరికీ దీని గూర్చి తేలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. ఓటర్లు అంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని నేను కోరారు. గత 15 సంవత్సరాల కంటే బిహార్ రాబోయే ఐదేళ్ళు మెరుగ్గా ఉండటానికి ఇదే అవకాశమని ఆయన అన్నారు . -
బిహార్లో ముగిసిన 3వదశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 5 గంటల వరకూ 53.24 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. 78 నియోజకవర్గాల్లో 1,204 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు సిద్ధమయ్యారు. ఇక నేడు బరిలో దిగిన వారిలో అసెంబ్లీ స్పీకర్తో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. ఈనెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగతుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఉదయం 9 గంటల వరకు 7.6 శాతం పోలింగ్ నమోదు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్ పూర్తి మొత్తం 1,23,799 మంది పురుషులు, 12,06,378 మంది మహిళల ఓటర్లు నువ్వా నేనా అన్న రీతిలో ఎన్డీఏ- మహాకూటమి మధ్య కొనసాగుతున్న బీహార్ ఎన్నికల సమరం తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం నితీష్ కుమార్ ఎన్నికల బరిలో జేడీయూ తరఫున అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌధరీ, పన్నెండు మంది మూడో దశలో మజ్లిస్ ప్రభావం కోసి-సీమాంచల్ ప్రాంతంలో భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు పలువురు అభ్యర్థులను నిలిపిన మజ్లిస్ పార్టీ -
నేడే బిహార్లో తుది విడత పోలింగ్
పట్నా: బిహార్లో తుది విడత ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, దాదాపుగా 2.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మూడో విడత కీలకంగా ఒవైసీ ఈ విడత జరిగే ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఎన్డీయే, మహాఘట్బంధన్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో పాటుగా అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం, మాయావతికి చెందిన బీఎస్పీ, ఉపేంద్ర కుష్వా ఆర్ఎల్ఎస్పీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తమ పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కోసి–సీమాంచల్ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోనే తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ ఏడాది వరదలతో అతలాకుతలమవుతూ సారో ఆఫ్ బిహార్గా పేరు పడిన కోసి ప్రాంతంలో ముస్లింలు, యాదవులు, అత్యంత వెనుకబడిన వర్గాల కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో 30% జనాభా ముస్లింలే. దీంతో ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ చాలా సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన ఉధృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అత్యధిక నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో ఎలాగైనా పట్టు సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ర్యాలీలోనూ బిహార్ అభివృద్ధి చెందాలంటే నితీశ్ కుమార్ సీఎం కావాలని ఆయన పేరే జపించారు. బిహార్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు.. విషమం
పట్నా : మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిహార్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హయ్గ్ఘ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రవీంద్రనాథ్ అలియాస్ చింటూ సింగ్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున దర్భంగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తుపాకీ తుటాలకు గురైన అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దర్భాంగా మెడికల్ కాలేజీల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. ఘటనపై దర్యాప్తుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాయని.. విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. (మోదీలా ట్రంప్ చేయలేకపోయారు) గతంలో జేడీయూలో కొనసాగిన రవీంద్ర ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన ప్రత్యర్థులు ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా బిహార్లోశనివారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. దీంతో నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ట్రంప్ ఘోర వైఫల్యం : జేపీ నడ్డా
పట్నా : ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ మేజిక్ మార్క్ సమీపానికి చేరుకున్నారు. విజయానికి మరో ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. తాజా ఫలితాలపై రిపబ్లిక్ పార్టీ అభిమానులతో పాటు డొనాల్డ్ ట్రంప్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్రంప్ వైఫల్యాల కారణంగానే తాజా ఫలితాల్లో రిపబ్లికన్లు వెనుకబడ్డారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా సమయంలో ఆయన అనుసరించి విధానాలు అమెరికన్లు విశ్వాసాన్ని కోల్పోయారని చెబుతున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై భారత్లోనూ ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తోందోనని ఆసక్తికరంగా ఎదురుచుస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజా ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ‘కరోనా సమయంలో భారత్లో నరేంద్ర మోదీ చేయగలిగిన పనిని అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేయలేకపోయారు. మోదీ ఎంతో ప్రణాళికా బద్ధంగా కోవిడ్ను ఎదురుర్కొన్నారు. ప్రజలను, దేశాలన్ని సురక్షితంగా కాపాడారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా విపత్తును ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమైంది. ఆ దేశంలో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలను కోల్పోయారు. దాని ప్రభావం తాజా ఎన్నికలపై చూపింది. అంతిమంగా ట్రంప్ వెనుకంజకు దారితీసింది’ అని అన్నారు. బిహార్ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశంలోని 130 కోట్ల జనాభా భద్రత మోదీ చేతిలో క్షేమంగా ఉందన్నారు. బీజేపీ-జేడీయూ విజయం బిహార్ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. -
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్
పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్లో ముస్లిం మైనార్టీలు నితీశ్ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది. బిహార్ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ బిహార్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. -
‘నితీష్కు ముందే ఆ విషయం అర్థమైంది’
పట్నా : తనకు ఇవే చివరి ఎన్నికలు అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. బీహార్ రాష్ట్రాన్ని సీఎం నితీష్ అభివృద్ధిపథంలో నడపలేరని ముందు నుంచే తాము చెబుతున్నామని, ఇనాళ్లకు ఆయనే ఆ నిజాన్ని ఒప్పకున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామనే విషయం ముందే గ్రహించి సీఎం నితీష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు. (చదవండి : పూర్ణియా సభలో నితీష్ సంచలన ప్రకటన) కాగా, గురువారం పూర్ణియా జిల్లా దాందహా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం నితీష్ మాట్లాడుతూ..బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. బిహార్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్( అక్టోబర్ 28, నవంబర్ 3) ముగియగా, చివరి దశ పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. (చదవండి : ‘నితీశ్ తలవంచక తప్పదు’) -
ఇవే నా చివరి ఎన్నికలు : నితీష్ కుమార్
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం కీలక ప్రకటన చేశారు.బిహార్ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు నితీష్ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!) 'బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. ఇప్పటికే బిహార్లో రెండు దశల పోలింగ్ ముగియగా.. ఆఖరిదైన మూడో దశ నవంబర్ 7న జరగనుంది. కాగా బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. (చదవండి : నితీష్ పాలనను వ్యతిరేకిస్తున్నారు : చిరాగ్) -
‘నితీశ్ తలవంచక తప్పదు’
పాట్నా: ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నితీశ్కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందు తలవంచకతప్పదు అని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వన్ అన్నారు. గురువారం చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ, నువ్వు( సీఎం నితీశ్ కుమార్) ఏ ప్రధానితో అయితే ఎప్పుడు గొడవపడుతూ, విమర్శిస్తూ ఉంటావో ఇప్పుడు నీ కోసం ఓట్లు అడగమని అతని ముందే తల దించావు. దీన్ని బట్టే నీకు ముఖ్యమంత్రి పదవి అన్న, ఆ అధికారం అన్న ఎంత ఆశ ఉందో అర్ధం అవుతోంది. నవంబర్ 10 తరువాత నువ్వు తేజస్వీ యాదవ్ ముందు తలవంచక తప్పదు’ అని అన్నారు. ఇప్పటికే బిహార్లో మూడవదశ పోలింగ్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షంపై తూటాలు ఎక్కు పెట్టింది. ఫైనల్ దశ పోలింగ్ శనివారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో పరాగ్ కేంద్రప్రభుత్వంతో నితీశ్ వ్యతిరేకించిన విషయాలను చర్చించారు. ఆర్టికల్ 370, సీఏఏ విషయంలో నితీశ్ విబేధించారని అయితే ఇప్పుడు ఎన్నకల సమయంలో మద్దతు కోసం నితీశ్ కేంద్రప్రభుత్వంతో ఉన్న విబేధాలను మర్చిపోయారని మండిపడ్డారు. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా నితీశ్ బిహార్ను అభివృద్ధి పరచలేదని విమర్శించారు. నితీశ్ కుమార్ ఇప్పటి వరకు ఐదు సార్లు బిహార్కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. చదవండి: సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ.. -
కాంగ్రెస్కు 100 మంది ఎంపీలైనా లేరు
ఫోర్బ్స్గంజ్/సహస్ర: పార్లమెంటులోని ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీకి వంద మంది కూడా సభ్యులు లేరని ప్రధాని మోదీ హేళన చేశారు. ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం మోదీ ప్రచారసభల్లో మాట్లాడారు. బిహార్లో నితీశ్ సీఎం అయ్యాక అభద్రతా భావం మచ్చుకైనా కనిపించడం లేదని కితాబునిచ్చారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని వారికి అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీని శిక్షిస్తున్నారని మోదీ చెప్పారు. ప్రజాగ్రహం కారణంగానే పార్లమెంటు ఉభయ సభల్లో వారి ఎంపీల సంఖ్య 100 కంటే తక్కువకి పడిపోయిందని అన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని, రైతులు రుణ మాఫీ చేస్తామని, రిటైర్డ్ సర్వీస్మెన్కు వన్ ర్యాంకు, వన్ పెన్షన్ వంటి అమలు చేయని హామీల కారణంగా ఆ పార్టీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోందని అన్నారు. సోమవారం వెలువడిన రాజ్యసభ ఫలితాల్లో 11 స్థానాలకు గాను బీజేపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి ఎగువ సభలో తన బలాన్ని 92కి పెంచుకుంటే, కాంగ్రెస్ బలం 38కి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా రెండు సభల్లోనూ కలిపి కేవలం 89 మంది సభ్యులు ఉండడంతో మోదీ కాంగ్రెస్ని హేళన చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. -
బిహార్లో 54.64% పోలింగ్
పట్నా/భోపాల్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో 54.64 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. రెండు దశల్లో కలిపి 53.79 ఓటింగ్ శాతానికి పైగా నమోదైనట్లు తెలిపింది. మంగళవారం జరిగిన ఈ పోలింగ్లో దాదాపు 2.85 కోట్ల ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ ఫగు చౌహాన్, సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 జిల్లాల్లో 94 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఓటర్ టర్నౌట్ యాప్లో పేర్కొన్న వివరాల ప్రకారం ముజఫర్çపూర్లో అత్యధికంగా 54.89 శాతం ఓట్లు పోలయ్యాయి. నితీశ్పై ఉల్లిపాయలు.. హార్లఖి నియోజకవర్గంలో ప్రచారసభలో సీఎం నితీశ్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు పెరిగిన ఉల్లి ధరలపై నిరసనగా ఆయనపై ఉల్లిపాయలు విసిరారు. అయితే అవి నితీశ్పైకి రాకముందే నేలపై పడ్డాయి. భద్రతా బలగాలు వారిని పట్టుకోబోతుండగా నితీశ్ వారించారు. మధ్యప్రదేశ్లో 69.93 శాతం పోలింగ్.. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్లో పలు ఉద్రిక్తత ఘటనల నడుమ కొనసాగిన∙అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్లో 69.93 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 28 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో కొందరు తుపాకులను ఉపయోగించడంతో, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్ నియోజకవర్గంలో అత్యధికంగా 81.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లో 77, గుజరాత్లో 58.58, హరియాణాలో 69.43, జార్ఖండ్లో 62.51, ఒడిశాలో 70, నాగాలాండ్లో 84.41, ఉత్తరప్రదేశ్లో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. -
సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ..
-
సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ..
పాట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. మధుబన్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం నితీష్కుమార్పై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరి యువకులు నిరసన వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ ఫెయిల్యూర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ బిహార్కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉద్యోగాల విషయం గురించి మాట్లాడగానే ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో స్టేజ్ మీద ఉన్నప్పుడే నితీశ్కు కోపం వచ్చింది. ఇంకా విసరండి అంటూ పదే పదే అన్నారు. ఇంతలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాళ్లు తగలకుండా అడ్డుగా నిలిచారు. రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని ఏం చేయొద్దని క్షమించి వదిలేయాలని నితీశ్ అన్నారు. ఇక నితీశ్పై దాడి చేయడం ఇదేమీ తొలిసారి కాదు 2018లో నందన్ అనే గ్రామంలో దళితులు, మహిళలపై దాడుల నేపథ్యంలో నితీశ్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగిన ఈ దాడి ఎన్నికల ఫలితాలపై ఏవిధంగా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది. బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10వ తేదీన విడుదల కానున్నాయి. చదవండి: నితీష్కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్ -
నితీష్ ఇంకెప్పుడూ సీఎం కాలేరు : చిరాగ్
పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్కు ఇదే చివరి ఎన్నికలని లోక్జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. బిహార్లో నేడు (మంగళవారం) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తన ట్వీట్లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత నితీష్జీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారని అర్థమైందని అన్నారు. ‘నితీష్ ఫ్రీ బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు. బిహార్లో మొత్తం 243 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 27న మొదటి దశ ఎనికలు పూర్తి కాగా, నవంబర్ 3న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. -
తొలిసారి ఓటు వేయడం కోసం..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశ పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. 17 జిల్లాలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ యువతి పలువురు దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం కోసం సదరు యువతి సైకిల్ మీద తన బామ్మతో కలిసి పట్నా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు వచ్చిన తర్వాత మొదటిసారి దాన్ని వినియోగించుకున్నాను. మా బామ్మతో కలిసి ఓటు వేయడానికి వచ్చాను. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది. (చదవండి: నితీష్కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్) బిహార్ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేటి పోలింగ్లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. -
నితీష్కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్
పట్నా : బిహార్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరిగింది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్ ముగిసింది. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు. నేటి పోలింగ్లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్డేట్స్ గుజరాత్లో 8 స్థానాలకు కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్ ఉదయం 10గంటల వరకు 11.52 శాతం పోలింగ్ నమోదు ఎల్జేపీ చీఫ్ చిగార్ పాశ్వాన్ తన ఓటు హక్కును వినిమోగించుకున్నారు నితీష్కు ఇదే చివరి ఎన్నిక, మరోసారి ఆయన సీఎం కాలేరు : చిరాగ్ పాట్నా రాజేంద్రనగర్లో ఓటేసిన డిప్యూటీ సీఎం సుశీల్కుమార్ మోదీ పాట్నాలో ఓటుహక్కు వినియోగించుకున్న తేజస్వీ యాదవ్, రబ్రీదేవి మధ్యప్రదేశ్లో ఉదయం 9 గంటల వరకు 10.81 శాతం పోలింగ్ నమోదు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిఘాలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజధాని పట్నాలో ఉదయం 9.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రోసిరా పరిధిలోని 133,134 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా నేతలు పట్టించుకోవడంలేదని ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బిహార్తో పాటు 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ -28 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ -8, ఉత్తరప్రదేశ్ -7 స్థానాలకు ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశా, నాగాలాండ్, కర్ణాటక, జార్ఖండ్లో రెండేసి స్థానాలకు, ఛత్తీస్గఢ్, తెలంగాణ (దుబ్బాక), హర్యానాలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. -
నేడు బిహార్లో రెండో దశ ఎన్నికలు
పట్నా: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహామహులు బరిలో నిలిచిన ఈ రెండో దశను బిహార్ ఎన్నికల్లో కీలక దశగా భావిస్తున్నారు. అధికార ఎన్డీయే అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, సీఎం నితీశ్సహా కీలక నేతలు, విపక్ష మహా కూటమి కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీ, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వీ సహా ముఖ్యమైన నాయకులు ప్రచారం నిర్వహించారు. 17 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 94 అసెంబ్లీ స్థానాలకు నేడు(మంగళవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1.35 కోట్ల మహిళా ఓటర్లు సహా మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు సుమారు 1500 అభ్యర్థుల భవితను నిర్దేశించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా కాంగ్రెస్ తరఫున బంకీపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జిల్లా నలందలోని ఏడు స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నలంద జిల్లాలో జేడీయూ బలంగా ఉంది. రెండోదశ ఎన్నికలు జరుగుతున్న 94 సీట్లలో విపక్ష కూటమి తరఫున 56 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్ మరికొన్ని స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అధికార ఎన్డీయే నుంచి బీజేపీ 46 స్థానాల్లో, జేడీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎల్జేపీ 52 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు కీలకం నేడు 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. సీఎం చౌహాన్కు సవాలుగా మారిన ఎన్నికలివి. కాంగ్రెస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కమల్ సర్కారు కూలడం తెల్సిందే. ఆ 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గుజరాత్(8), కర్నాటక(2), చత్తీస్గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ(1)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!
సాక్షి, న్యూఢిల్లీ : సుదీర్ఘ కాలం పాటు దేశంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారికి గత కొన్ని సంవత్సరాలుగా కలసి రావడం లేదు. 24 సంవత్సరాల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగిన పవన్ కుమార్ చామ్లింగ్ 2019 అధికారం నుంచి దిగిపోయారు. అంతకంటే ఏడాది ముందు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ గద్దె దిగారు. 2018, డిసెంబర్లో కూడా చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులయిన రామన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2020 సంవత్సరంలో చౌహాన్ మళ్లీ పదవిలోకి వచ్చారు. అది వేరే విషయం. (డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి) 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (2014లో కొన్ని నెలలు మినహా) ఎదురు లేకుండా అధికారంలో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నారు. నవీన్ పట్నాయక్ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్న బిహార్లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ? అన్న విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. (నితీష్ స్కాం 30 వేలకోట్లు : మోదీ) ఈ ఏడాది మొదట్లో కూడా ఎన్నికల సందడి కనిపించలేదు. బీజేపీ మద్దతుతో జేడీయూ గెలుస్తుందని, మళ్లీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారులే అన్న మాటలే చప్పగా వినిపించాయి. నితీష్ కుమార్ పార్టీని విమర్శిస్తూ వచ్చిన లోక్జనశక్తి పార్టీ, బీజేపీతో చేతులు కలపడంతో ముఖ్యమంత్రిగా నితీష్ ఈసారి తప్పుకోవడం తప్పనిసరని అందరూ భావించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని నితీష్ కుమార్కు మద్దతు ప్రకటించడంతో రాజీ కుదిరిందనుకున్నారు. కానీ నితీష్ ఫొటోలు లేకుండా బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండడం, ప్రధాని మోదీ పోస్టర్లతో హోర్డింగ్లు ఏర్పాటు చేయడం, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ను బీజేపీ నాయకులు ఇప్పటికీ ప్రశంసించడం చూస్తుంటే నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. (తొలి దశ ఓటింగ్ 54.26%!) మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్తో కలసి పోటీ చేస్తోన్న ఆర్జేడీ కూడా నితీష్ కుమార్ లక్ష్యంగాన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్, మోదీకి బదులు నితీష్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఆయన విస్తృత ఎన్నికల ప్రచారానికి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడం కూడా నితీష్ భవితవ్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ సారి బిహార్ ఎన్నికలు నితీష్ పనితీరుకు రిఫరెండమ్ అని చెబుతున్నారు. (నితీష్ని ఇరకాటంలో పడేసిన మోదీ) -
డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి
సమస్థిపూర్/చప్రా/మోతీహరి/బగహ: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచార గడవు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్య్టటన చేశారు. నాలుగు వరుస బహిరంగ సభల్లో విపక్ష నేతలపై వాడి విమర్శలతో దండెత్తారు. పశ్చిమ చెంపారన్ జిల్లాలోని బగహలో రెండో దశ ఎన్నికల ప్రచార చివరి సభలో ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రచార సభల్లో మాదిరిగానే ఆదివారం నాటి ప్రచారంలోనూ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు. ఈ సారి తేజస్వీయాదవ్తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిపి.. ‘వారిద్దరూ జంగిల్ రాజ్ కోసం కృషి చేస్తున్న డబుల్ యువరాజులు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజులు రాష్ట్రాన్ని లాంతర్ల కాలం నుంచి విద్యుత్ వెలుగుల వైపు తీసుకువచ్చిన ఎన్డీయే డబుల్ ఇంజిన్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ‘ఇద్దరు యువరాజుల్లో ఒకరు కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లో ఒక కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతా తిరిగారు. ఆ కూటమి అక్కడ మట్టికరిచింది. జాగ్రత్త.. ఆ యువరాజు ఇప్పుడు బిహార్కు వచ్చాడు. ఇక్కడి ఆటవిక రాజ్య యువరాజుకు మద్దతిస్తున్నాడు. వీరికి వ్యతిరేకంగా డబుల్ ఇంజిన్ అభివృద్ధితో దూసుకుపోతున్న ఎన్డీయే మరోవైపుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఆ డబుల్ యువరాజుల ఏకైక లక్ష్యం వారి రాచరికాలను కాపాడుకోవడమే’నన్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజా ప్రచారంలో వివాదాస్పద అంశాలైన అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం .. మొదలైన వాటిని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూకశ్మీర్ ఆందోళనలతో అట్టుడుకిపోతుందని, అక్కడి నదుల్లో రక్తం పారుతుందని కొందరు అమాయక ముఖాలతో భయపెట్టారు. కానీ ఆ ఆర్టికల్ను రద్దు చేస్తూ మేం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుని అవినీతి రహిత పాలనతో అభివృద్ధి వైపు దూసుకువెళ్తున్నారు’ అన్నారు. బిహార్ విపక్ష మహా కూటమిలో సీపీఐఎంఎల్ భాగస్వామి కావటాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఆటవిక పాలనకు కారణమైన వారు ఇప్పుడు నక్సలిజం మద్దతుదారులతో, తుక్డే తుక్డే గ్యాంగ్తో చేతులు కలుపుతున్నారు’ అని పేర్కొన్నారు. ముగిసిన ప్రచారం బిహార్లోని 17 జిల్లాల్లో విస్తరించిన 94 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ఆదివారంతో ముగిసింది. వీటిలో మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ముఖ్యమైనవి. జ్యోతిరాదిత్య సింధియా అనుచరులైన ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు పాల్పడటంతో అక్కడ కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, శివరాజ్సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ సర్కారు ఏర్పాటైన విషయం తెలిసిందే. మెజారిటీ సాధించేందుకు ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 9 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ(7), గుజరాత్(8), ఛత్తీస్గఢ్(1), హరియాణా(1), జార్ఖండ్(2), కర్ణాటక(2), ఒడిశా(2), నాగాలాండ్(2), తెలంగాణ(1) ఉన్నాయి. -
ఉచిత వ్యాక్సిన్ హామీ కోడ్ ఉల్లంఘన కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఉచిత వ్యాక్సిన్ వాగ్దానం వివక్షా పూరితమైనదనీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తేల్చింది. పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను చేపట్టవచ్చునని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెపుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ప్రజాసంక్షేమం కోసం ఇలాంటి వాగ్దానాలు చేయడంలో అభ్యంతరం ఉండదని ఈసీ పేర్కొంది. ఆచరణాత్మకమైన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో తప్పు లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రణాళికలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్దిష్ట ఎన్నికల సందర్భాల్లో విడుదల చేస్తుంటారని ఈసీ తెలిపింది. అయితే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉచిత వ్యాక్సిన్ వాగ్దానాన్ని ఒక్క బిహార్ రాష్ట్ర ప్రజలకే ఇస్తానని పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ విస్మరించడం ఆశ్చర్యంగా ఉందని గోఖలే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర మంత్రి నిర్మల విడుదల చేశారు. వ్యాక్సిన్ని బిహార్ ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉన్న విషయమని, ఇది కేవలం బిహార్కే పరిమితమని, దేశం మొత్తానికి వర్తించదని బీజేపీ తెలిపింది. ప్రధాని బయోపిక్ విడుదల ఉల్లంఘన కాదు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ను విడుదల చేయడం నిబంధనావళి ఉల్లంఘనగా పరిగణించలేమని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సెప్టెంబర్ 25వ తేదీన ప్రకటించగా బయోపిక్ను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారని అందులో పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ఈ సినిమా గత ఏడాది మేలోనే రిలీజ్ అయినందున ఉల్లంఘన కిందకు రాదంటూ స్పష్టత ఇచ్చింది. -
కరోనా వ్యాక్సిన్ ఉచితం : ఈసీ క్లీన్ చిట్
-
కరోనా వ్యాక్సిన్ ఉచితం : ఈసీ క్లీన్ చిట్
సాక్షి, పట్నా: ఎక్కడ చూసినా ప్రస్తుత ఎన్నికల పోరులో కరోనా వ్యాక్సిన్ ఉచితం అనేది ఓటర్లకు బంపర్ ఆపర్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడటంతో వివాదం రాజుకుంది. దీనిపై సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త ఈసీని ఆశ్రయించారు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచిత హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టం చేసింది. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఉల్లంఘన కిందకు రాదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. టీకా విధానం ఇంకా నిర్ణయించబని క్రమంలో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని ఆరోపిస్తూగోఖలే ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. అక్టోబర్ 28 న గోఖలేకు కమిషన్ ఇచ్చిన సమాధానంలో మూడు విషయాలను ప్రస్తావించింది. రాజ్యాంగానికి, విరుద్దంగా, కించపర్చేదిగా, ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీసేలా, విఘాం కలిగించేలా లేదా ఓటరుపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలు ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఆర్జేడీ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్ను ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించాయి. కరోనా మహమ్మారిని బీజేపీ రాజకీయం చేస్తోందని, ప్రజల భయాలతో ఆడకుంటోందని మండిపడ్డాయి. అలాగే మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా అని దుయ్యబట్టాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన ముగిసింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, చివరి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 10 వెలువడనున్నాయి. -
‘ఎన్నికల కమిషన్ బీజేపీలో ఓ శాఖ’
ముంబై: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఎన్నికల కమిషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆర్జేడీ చీఫ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అన్నారు. (చదవండి: కాంగ్రెస్కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్) అంతేకాక ఎన్నికల వేళ బిహార్లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్ రౌత్. ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు పంకజా ముండే శివసేనలో చేరారనే పుకార్లపై సంజయ్ రౌత్ తనకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. బిహార్ మొదటి దవ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30 న 71 స్థానాలకు ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 55.69 శాతం ఓటర్లు నమోదయ్యాయి. రెండవ దశ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరగనుంది. -
నితీష్ స్కాం 30 వేలకోట్లు : మోదీ
పట్నా : తొలి విడత పోలింగ్ ముగియడంతో రెండో విడత సమరానికి బిహార్ రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. శనివారం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జేడీయూ ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. కేవలం అధికారం కోసమే ఇరు పార్టీలు జట్టుకట్టాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికలో సమయంలో నితీష్పై మోదీ ఆరోపణలు చేసిన ఓ వీడియోను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. నితీష్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘నితీష్ హాయంలో బిహార్ మరింత వెనుకబడుతోంది. జేడీయూ పాలనలో అవినీతి తారా స్థాయికి పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఐదేళ్ల పాలనలో నితీష్ కుమార్ 60 స్కాములకు పాల్పడ్డారు. వాటి విలువ దాదాపు 30 వేలకోట్లు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటిపై విచారణకు ఆదేశిస్తాం’ అంటూ మోదీ ఆరోపించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ,ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. (ఆటవిక రాజ్య యువరాజు) బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్.. వారితో బంధానికి ముగింపు పలికి మహా కూటమితో చేతులు కలిపారు. అనంతం కొంత కాలనికే కూటమితో తెగదెంపులు చేసుకుని మరోసారి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే నితీష్ను ఇరుకున పెట్టేందుకు తేజస్వీ గత వీడియోను బయటపెట్టారు. ఇదీ నితీష్ స్వరూపం అంటూ ఆర్జేడీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. -
మళ్లీ సహనం కోల్పోయిన నితీష్
పట్నా: ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. తన ప్రత్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై మరోసారి పదునైన బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. మహాకూటమి తరపున ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. తేజస్వియాదవ్ 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట కేవలం బోగస్ అని నితీశ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం పర్భట్టాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 15 ఏళ్లపాటు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ముఖ్యమంత్రులుగా పనిచేశారని, అప్పుడు బిహార్ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని నితీష్ కుమార్ విమర్శలు కురిపించారు. వారి హయాంలో కేవలం 95,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ఆర్జేడీ చెప్పేదంతా బోగస్ మాటలేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి కూడా నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు, 15లక్షల ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చింది. ఈ విషయాన్ని ఐదోసారి బిహార్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న నితీశ్ కుమార్ మర్చిపోయారేమో అని కొంత మంది రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో ఉద్యోగ ప్రకటన కీలక పాత్ర పోషించనుంది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు నవంబర్10వ తేదీన వెలువడనున్నాయి. చదవండి: ప్రచార పర్వం : వేదిక కూలడంతో కిందపడిన కాంగ్రెస్ అభ్యర్థి -
ప్రచార పర్వం : వేదిక కూలడంతో కిందపడిన కాంగ్రెస్ అభ్యర్థి
పట్నా : బిహార్లోని దర్బంగాలో ప్రచార వేదిక కూలిపోవడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న జేల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మాని కిందపడిపోయారు. ఉస్మాని సహా వేదికపైన ఉన్నవారంతా స్టేజ్ కూలిపోవడంతో కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైన సమాచారం వెల్లడికాలేదు. ఈ ఘటనకు సంబంధించి బయటకువచ్చిన వీడియోలో ఉస్మాని మాస్క్ లేకుండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కనిపించారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ ఎంఎల్, సీపీఎం, సీపీఐలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాకూటమిగా జట్టు కట్టి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తలపడుతోంది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ ఇప్పటికే ముగియగా, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో మలి, తుది విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి : ఆటవిక రాజ్య యువరాజు -
ఆటవిక రాజ్య యువరాజు
దర్భంగ/ముజఫర్పూర్/పట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ను ‘ఆటవిక రాజ్య యువరాజు(జంగిల్రాజ్ కే యువరాజ్)’ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. బిహార్ బీమారు రాష్ట్రంగా మారడానికి కారణమైన ఆర్జేడీకి మళ్లీ అధికారమిస్తే కరోనాతో పాటు మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ప్రధాని హెచ్చరించారు. ఆర్జేడీ చేసిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఎద్దేవా చేస్తూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల విషయం మర్చిపోండి. వాళ్లు గెలిస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. బలవంతపు వసూళ్లకు భయపడి కంపెనీలను మూసేసుకుంటారు. ఆ పార్టీకి ఇక్కడ కిడ్నాప్లపై కాపీరైట్ ఉంది’ అన్నారు. బిహార్ను దుష్పరిపాలన నుంచి సుపరిపాలన వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడిపించారని ప్రశంసించారు. జేడీయూ నేత నితీశ్ను ‘ప్రస్తుత, భవిష్యత్ ముఖ్యమంత్రి’ అంటూ సంబోధించారు. నితీశ్ పాలనలో బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దర్భంగ సభలో మాట్లాడుతూ సీతామాత జన్మించిన మిథిలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ రామాలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విమర్శించిన వారంతా.. ఇప్పుడు తప్పని సరై మా నిర్ణయానికి చప్పట్లు కొడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిహార్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధుల వైపు రాష్ట్రాభివృద్ధిని కోరుకోని దురాశాపూరిత శక్తులు ఆశగా చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్, రబ్రీదేవీల ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్న కుల ఘర్షణలను ప్రధాని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసం, గందరగోళంతో కూడిన విధానాలు వారివని ఆరోపించారు. ప్రతీ ప్రసంగం ప్రారంభంలో ప్రధాని స్థానిక మాండలికంలో మాట్లాడి, స్థానికులైన మహనీయులను గుర్తు చేసి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్భంగలో మైథిలి కవి విద్యాపతిని గుర్తు చేశారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం బాధాకరం: రాహుల్ గాంధీ
పట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై దాడిని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొనసాగించారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి ప్రధాని ఎక్కడా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వలస కూలీల వెతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి ముఖ్యమంత్రి నితీశ్ పాలనే కారణమని మండిపడ్డారు. రాహుల్ ప్రసంగిస్తుండగా.. ‘మోదీ మమ్మల్ని పకోడీలు అమ్ముకోమన్నారు’ అంటూ ఒక వ్యక్తి గట్టిగా అరిచారు. దాంతో, ‘ఈ సారి మోదీజీ, నితీశ్జీ మీ వద్దకు వచ్చినప్పుడు వారికి పకోడీలు చేసిపెట్టండి’ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. కేంద్రం తీసుకువచ్చి న వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాహుల్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దసరా సందర్భంగా పంజాబ్లోని రైతులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయడం తనను బాధించిందన్నారు. ‘సాధార ణంగా దసరా రోజు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. కానీ ఈ సారి, బహుశా తొలిసారి ఒక ప్రధాని దిష్టిబొమ్మను తగలపెట్టారు’ అన్నారు. ‘ఈ వార్త మీ వరకువచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మోదీజీ, నితీశ్జీ మీడియాను నియంత్రిస్తుంటారు’ అని విమర్శించారు. రాహుల్పై ఈసీకి ఫిర్యాదు బిహార్లో తొలి దశ పోలింగ్ జరుగుతున్న రోజు కాంగ్రెస్కు ఓటేయాలని ట్వీట్ చేయడం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని కోరుతూ బిహార్ లీగల్ సెల్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. -
తొలి దశ ఓటింగ్ 54.26%!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ముగిసింది. మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 54.26% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అన్ని కేంద్రాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తరువాతే కచ్చితమైన ఓటింగ్ శాతం వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఈ జిల్లాల్లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54.75% పోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో మొత్తంగా ఓటర్ల సంఖ్య సుమారు 2.15 కోట్లు కాగా, అభ్యర్థులు 1000కి పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ.. సమయం గడుస్తున్న కొద్దీ పెరిగింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ మాజీ సీఎం, హెచ్ఏఎం అధ్యక్షుడు జితన్ రామ్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలి దశ ఎన్నికలు జరిగిన 71 స్థానాల్లో 35 స్థానాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు. ఈ స్థానాల్లో పోలింగ్ను మధ్యాహ్నం 3 గంటలకే ముగించారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు సంతృప్తికరంగా ఉందని, అత్యంత స్వల్ప స్థాయిలో ఇబ్బందులు తలెత్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. 2015లో ఐదు దశల్లో.. ప్రాథమిక సమాచారం మేరకు.. తొలిదశలో అత్యధిక ఓట్లు బంకా జిల్లాలో పోలయ్యాయి. అక్కడ 59.57% పోలింగ్ నమోదైంది. 2015లో ఈ జిల్లాలో నమోదైన ఓటింగ్ శాతం 56.43. అలాగే, ముంగర్ జిల్లాలో అత్యల్పంగా 47.36% మాత్రమే ఓటింగ్ జరిగింది. 2015లో ఇక్కడ 52.24% ఓటింగ్ నమోదైంది. 2015లో మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగగా, ఈ సారి 3 దశల్లోనే ఎన్నికలు ముగుస్తున్నాయి. 2015లో తొలి దశలో 10 జిల్లాల్లో విస్తరించిన 49 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 2015 నాటి తొలి దశ ఎన్నికల్లో 54.94% పోలింగ్ జరిగినట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. కాల్పులపై తీవ్ర నిరసన ముంగర్ కాల్పుల ఘటనపై విపక్షాలు బిహార్లో నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నితీశ్ పాలను బ్రిటిష్ రాజ్ తరహాలో ఉందని విమర్శిస్తూ, ముంగర్ కాల్పుల ఘటనను జలియన్వాలా బాగ్ కాల్పులతో పోల్చాయి. ముంగర్లో సోమవారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు సందర్బంగా ఘర్షణలు జరగడంతో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ లిపి సింగ్ ముఖ్యమంత్రి నితీశ్కు సన్నిహితుడైన ఆర్సీపీ సింగ్ కూతురు కావడంతో విపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెంచాయి. -
స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్మతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. "ఓ ప్రకటన చేసే క్రమంలో నేను పదాల కోసం వెతకడం చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. It is rare for me to search for words while making an announcement; hence here’s me keeping it simple — I’ve tested positive for #COVID and would request those who came in contact with me to get themselves tested at the earliest 🙏 — Smriti Z Irani (@smritiirani) October 28, 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్మృతి ఇరానీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. గత వారం ఆమె బిహార్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. గోపాల్గంజ్, ముంజర్, బోధ గయా, దిఘా వంటి ప్రాంతాల్లో దాదాపు 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్మృతికి కరోనా పాజిటివ్గా తేలడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఆందోళనకు గురవుతున్నారు.