Bihar Assembly Election 2020
-
చెక్కు చెదరని మోదీ ఇమేజ్..
ఇది కోవిడ్ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్గా నిలిచింది. చెక్కు చెదరని మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్ఎస్–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల్లో.. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్కి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్ బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. పొలిటికల్ బాషా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్ తాను చెప్పినట్టుగానే డిసెంబర్ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒరిగిన రాజకీయ శిఖరాలు ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్కు ఆగస్టులో కరోనా పాజి టివ్గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్ 1న ప్రణబ్ మరణించారు. కాంగ్రెస్లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ నవంబర్ 23న కన్ను మూశారు. నమస్తే ట్రంప్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్లోని అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది. -
తొలి అసెంబ్లీ: తేజస్వీపై నితీష్ ఆగ్రహం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయేపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను టార్గెట్గా చేసుకున్న ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.. విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తమకంటే కేవలం 12,270 ఓట్లు, 16 సీట్లు మాత్రమే సాధించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తేజస్వీ విమర్శలకు సీఎం నితీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. తొలిసారి సభలో ఎన్నడూ లేని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే ముందు ప్రవర్తన మార్చుకోవాలని, గౌరవాన్ని కాపాడుకోవాలని చురకలు అంటించారు. ఒక ఓటు తేడా కూడా విజయాన్ని నిర్ణయిస్తుందని బదులిచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా అనుకుంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చు సూచించారు. 122 సీట్లు సాధించిన ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చుని పేర్కొన్నారు. కాగా ఉత్కంఠ బరితంగా సారిగి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74, 115 స్థానాల్లో పోటీ చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) 43 సీట్లలో గెలిచి అధికారాన్ని అందుకున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో 110 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాత్రమే ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ చేసిన పేలవమైన ప్రదర్శన కారణంగా మహాకూటమి అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న జేడీయు కూడా పేలవమైన ప్రదర్శనతో మూడవ స్థానం సరిపెట్టుకుంది. -
బిహార్ స్పీకర్గా ఎన్డీయే అభ్యర్థి విజయ్ సిన్హా
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో విజయ్ సిన్హాకు 126 ఓట్లు రాగా మహా కూటమి తరపున పోటీ చేసిన అవద్ బిహార్ చౌదరికి 114 ఓట్లు దక్కాయి. కాగా బిహార్లో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న స్పీకర్ పదవికి ఎన్డీయే కూటమి తరపున విజయ్ కుమార్ సిన్హా, మహా కూటమి తరపున అవద్ బిహారీ చౌదరి పోటీలో నిలిచారు. వీరిద్దరూ మంగళవారం పట్నా నుంచి అసెంబ్లీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో భారీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: బిహార్లో లాలూ ఆడియో టేపుల కలకలం అసెంబ్లీలోకి ఎమ్మెల్సీలు రావడంతో స్పీకర్ ఎన్నికల్లో వాయిస్ ఓట్లను ఆర్జేడీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్, అశోక్ చౌదరి సభలో ఉండటాన్ని తప్పుబడుతూ.. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నిక సమయంలో నియమాలను పాటించాలని చెబుతూ.. రూల్బుక్ను ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంజీకి అందించారు. దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్.. ‘అసెంబ్లీ పక్షనేతగా సీఎం సభలో ఉండటం తప్పేం కాదు. అది చట్టబద్దమైనది. ఇతర సభ నుంచి వచ్చిన వారు స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయడంలేదు. అసెంబ్లీలో వారు ఉండటంలో ఎలాంటి సమస్య లేదు" అని ఆయన అన్నారు. అదే విధంగా గతంలో లాలూ యాదవ్ లోక్సభ సభ్యుడిగా.. రబ్రీదేవి సీఎంగా ఉన్నప్పుడు వారు కూడా ప్రొసిడింగ్స్కు హాజరయ్యారని తేజస్వీ యాదవ్ తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. అప్పుడు రహస్య ఓటింగ్ లేదని గుర్తు చేశారు. అనంతరం స్పీకర్గా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హాను సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లు కలిసి స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. ఇక ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించడంతో వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 243 అసెంబ్లీ స్థానాల్లో 126 ఎన్డీయే దక్కించుకోగా ఇందులో బీజేపీ 74, జనతాదళ్(యు) 43 మరో ఎనిమిది సీట్లను ఎన్డీయే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ 75 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిహార్ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్ -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
నితీష్ కుమార్కు ఆర్జేడీ ఆఫర్
పట్నా : బీజేపీ నామినేటెడ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ సీనియర్ నేత అమర్నాథ్ గమీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సీఎం పీఠంలో నితీష్ కుమార్కు కూర్చోబెట్టడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న కొద్దికాలంలోనే నితీష్ ప్రభుత్వం కూలిపోతుందని తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బందన్ బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్నాలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీదే విజయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నికైనప్పటికీ అధికారమంతా బీజేపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎలాంటి అధికారాలు లేని సీఎం పీఠంలో నితీష్ ఉండి ఉపయోగంలేదన్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తమతో చేతులు కలపాలని కోరారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించాలని అమర్నాథ్ సూచించారు. కాగా ఇటీవల వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. దీనిపై జాతీయ స్థాయిలో వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీష్ను సీఎంగా ఎన్నుకున్నామని బీజేపీ చెబుతోంది. -
బిహార్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా మాంజీ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్రామ్ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఫగుచౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు బిహార్కు చెందిన 76 ఏళ్ల జితన్ రామ్ బిహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్ రామ్.. చంద్రశేఖర్ సింగ్, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. -
జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి
పట్నా: బిహార్ నూతన విద్యాశాఖ మంత్రిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. బడికి పోయావా లేదా సామి అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టి పట్టుమని వారం రోజులు కూడా కావడం లేదు.. ఇన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడంటే.. అయ్యగారు ఇంతలోనే ఏం ఘనకార్యం వెలగబెట్టారో అనుకుంటున్నారా. నిజమే మంత్రిగారు చేసింది మాములు తప్పు కాదు. భారతీయుడు అయ్యి ఉండి.. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఏకంగా జాతీయ గీతాన్ని మర్చిపోయాడంటే మామూలు తప్పిదం కాదు కదా. అందుకే నెటిజనులు సదరు మినిస్టర్ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. వివరాలు.. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్ జనగణమణ పాడుతూ.. మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) ఇందుకు సంబంధించిన వీడియో ఆర్జేడీ నాయకులకు చిక్కింది. "అనేక అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుంది? మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 2.2 లక్షల మంది వీక్షించారు. ఇక దీనిపై నెటిజనులు ‘ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి’.. ‘ఇది 2020 సంవత్సరం.. ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు’.. ‘స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం.. అసలు మీరు బడికి వెళ్లారా లేదా’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) ఇక మేవలాల్ చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ స్కామ్లో మేవలాలక్కు భాగం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ కుమార్ ద్వంద్వ వైఖరికి సిగ్గుపడుతున్నాం. 60 స్కాముల్లో మేవలాల్కు భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించి ఆ పదవిని కించపరిచారు అంటూ ఆర్జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!
పట్నా: బిహార్ అసెంబ్లీ విజేతల సామాజిక నేపథ్యాలను విశ్లేషించగా, గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ధనవంతులు, నేర చరితులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఆర్జేడీ నాయకత్వంలో మహా కూటమితోపాటు ఏఐఎంఐఎం పార్టీలు కలిసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం టిక్కెట్లను క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఇవ్వగా, 58.2 శాతం మంది విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అవే పార్టీలు 61.7 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 66.8 శాతం ఎమ్మెల్యేలు గెలిచారని ‘అసొసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్’ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. 2015 ఎన్నికల్లో 25 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు దాటిన ధనవంతులు కాగా, 2020 ఎన్నికల్లో వారి సంఖ్య 33 శాతానికి చేరుకుంది. వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున 86 శాతం మంది ధనవంతులు పోటీ చేయగా, 78 శాతం మంది విజయం సాధించారు. సీపీఐ నుంచి గెలిచిన రామ్ రతన్ సింగ్ బహుళ కోటీశ్వరుడు. లోక్జన శక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రాజ్ కుమార్ సింగ్ 1.9 కోట్ల అధిపతి. ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. ఆయనపై అత్యధికంగా 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 11 హత్యాయత్నం కేసులు, నాలుగు కిడ్నాపింగ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఆస్తిపరులు, నేరస్థులు గణనీయంగా పెరిగారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) -
నితీష్పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పట్నా : దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన బిహార్లో నేడు (సోమవారం) కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన నితీష్.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీఎంగా ఎన్నికైన నితీష్కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. (సోదరుడికి చెక్.. బీజేపీతో పొత్తుకు సై!) ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సైతం నితీష్కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఎన్నికై నితీష్ను అభినందిస్తూనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ‘బీజేపీ నామినేటేడ్ ముఖ్యమంత్రి నితీష్కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్) పాలనను భరించేందుకు బిహార్ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. (నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?) కాగా గతంలో నితీష్ కుమార్కు మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ఆయనతో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి ప్రశాంత్ను తొలగిస్తూ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసి పోటీచేయాలన్న నితీష్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్న ప్రశాంత్.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల అనంతరం తొలిసారి నితీష్పై స్పందించారు. -
బీజేపీ బలవంతం మేరకే సీఎం..
పట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్పై ప్రతిపక్ష ఆర్జేడీ మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఆర్జేడీ, బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుచుకుని సీఎం పీఠంలో కూర్చోడానికి నితీష్ సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనకు ఏమాత్రం ఇష్టంలేకున్నా బీజేపీ నేతల బలవంతం మేరకే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు నితీష్ కుమార్ ఇదివరకే చెప్పారని ఆర్జేడీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన ఆర్జేడీ ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన ఫలితాలే తమ నిర్ణయానికి కారణమని పార్టీ పేర్కొంది. (కాషాయ గూటికి మాజీ సీఎం కుమారుడు!) ‘నిజానికి మరోసారి సీఎంగా పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. జేడీయూ మూడవ స్థానంలో నిలవడం ఊహించలేనిది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే ఓపిక ఇక నాకు లేదు.’ అంటూ ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశంలో బీజేపీ నేతలతో నితీష్ కుమార్ చెప్పినట్లు ఆర్జేడీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. తానే సీఎంగా ఉండాలని బీజేపీ నేతలు ఏడ్చి పట్టుబట్టారని.. వారి అభిప్రాయాన్ని కాదనలేకే సీఎంగా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నానని నితీష్ చెప్పినట్లు ఆర్జేడీ వ్యంగంగా ట్వీట్ చేసింది. నవంబర్ 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి 125 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. 74 స్థానాలతో కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 43 స్థానాలతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ రెండవ స్థానంలో ఉండగా వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ), హిందుస్తాన్ ఆవాస్ మోర్చా చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో 75 సీట్లను కైవసం చేసుకుని ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆరోపిస్తున్నారు. -
కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (69)ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ఘనతను నితీష్ దక్కించుకున్నారు. సోమవారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఉత్కంఠ పోరులో విజయాన్ని చేజిక్కించుకున్న ఎన్డీఏ కొత్త సర్కార్ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్లో చోటు దక్కగా, ఉప ముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకోవడం విశేషం. 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్కిషోర్ ప్రసాద్ రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం సమావేశమైన ఎన్డీఏ శాసనసభ పార్టీ నాయకులు నితీష్ కుమార్ను నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసినవారు: కొత్త మంత్రివర్గంలో చేరిన 12 మంది మంత్రులలో బీజేపీ నుంచి మంగల్ పాండే , అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు చెందిన సంతోష్ మాంజి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి, వికా షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కు చెందిన ముఖేష్ మల్లా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. -
నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?
సాక్షి, న్యూఢిల్లీ : నితీష్ కుమార్ ఈ రోజు (సోమవారం) సాయంత్రం బిహార్ ముఖ్యమంత్రిగా ఏడవ సారి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగినట్లయితే బిహార్ రాష్ట్రానికి అత్యధిక కాలంపాటు కొనసాగిన ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను సష్టిస్తారు. ఓ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు. అందున అగ్రవర్ణ కులం నుంచో లేదా రాష్ట్రంలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న యాదవ కుటుంబం నుంచి కాకుండా ఓ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం మామూలు విషయం కాదు. బిహార్ రాష్ట్ర జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న కుర్మీ కమ్యూనిటీ నుంచి ఈ స్థాయికి నితీష్ ఎదగడమే ఓ గొప్ప విషయం. నితీష్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న జేడీయూ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నడూ కూడా తనంతట తాను మెజారిటీ సీట్లను సాధించలేదు. ఈసారి సీట్లు, ఓట్ల శాతం మరింత తగ్గిపోయింది. ఆ పార్టీకి ఈసారి 15.4 శాతం ఓట్లతో కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల్లో 71 సీట్లను సాధించింది. ఈసారి జనతాదళ్కంటే బీజేపీకి అదనంగా 30 సీట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ కుమార్ తప్పించి ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకులకు ప్రాతినిథ్యం కల్పిస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా ఆ ప్రచారానికి తోడ్పడగా, అందుకనుగుణంగా నితీష్ కుమార్ శకం ముగిసట్లేనంటూ బీజేపీ సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. అందుకు భయపడో, మరెందుకోగానీ ఇదే తన చివరి ఎన్నికలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతిని పొందేందుకు నితీష్ ప్రయత్నించారు. ఏదయితేనేం, అతిపెద్ద పార్టీలుగా బిహార్లో ఆవిర్భవించిన బీజేపీ, ఆర్జేడీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేటన్ని సీట్లు సాధించలేక పోయాయి. మిత్రపక్షాలతో కలసి బీజీపీకి ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజీపీ తాను సొంతంగా కాకుండా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే తెలివైన నిర్ణయం తీసుకుంది. నితీష్ కాదంటే ఆయన ఆర్జేడీ–కాంగ్రెస్ కూటిమికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వంలో చేరే అవకాశం స్పష్టంగా ఉండింది. దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే బీజేపీకి నితీష్ను సీఎంగా చేయక తప్పలేదు. అయినంత మాత్రాన ఐదేళ్లపాటు నితీష్ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించే ఉద్దేశం బీజేపీ అధిష్టానంకు లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. నితీష్ను సీఎం పదవి నుంచి తప్పించినా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి ముప్పు ఉండకుండా ఉండేందుకు ఆ పార్టీల నుంచే కాకుండా, నితీష్ పార్టీ నుంచి సభ్యుల వలసను బీజేపీ స్వీకరిస్తుందని, తద్వారా తానే అధికార పగ్గాలు స్వయంగా స్వీకరించే పరిస్థితిని సష్టించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక నితీష్ పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగరన్నది వారి వాదన. -
35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ముందుగా ఇచ్చిన హామీకి కట్టుబడి నితీష్కే సీఎం పీఠం కట్టబెట్టేందుకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. గత 35 ఏళ్లుగా అసెంబ్లీ పోటీగా దూరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. మూడు దశాబ్ధాలకు పైగా శాసనమండలికి ఎన్నికవుతూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. పట్నా : నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 (8 రోజులు), మరోసారి 11 రోజులు, 2005, 2010, 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2000లో బిహార్ సీఎంగా ఎన్నికయినప్పటికీ ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005లో మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం రావడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై.. బిహార్ను శాసిస్తున్నారు. తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. 2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. 2005 నవంబర్ నుంచి ఇప్పటి వరకు (2020) బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏర్పడిన రాజకీయ విభేదాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నద్దతలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎస్సీ నేత జీతాన్రాం మాంజీ బిహార్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా నితీష్ కుమార్ 2015 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిష్టించారు. ఈ సారి ఎన్నికల్లో లాలూప్రసాద్తో పొత్తు పెట్టుకుని పూర్తిస్థాయి మెజార్టీ సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మరోసారి 2017 లో ఎన్డీయేతో మరోసారి జట్టుకట్టారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. 2005 నవంబర్లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాతి ఏడాది ప్రారంభంలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగియడంతో.. ఆయనను తిరిగి ఎగువ సభకు ఎన్నుకున్నారు. ‘తనకు ఎగువసభ అంటే అమితమైన గౌరవం, అందుకే ఎమ్మెల్సీగా ఉండటానికి ఇష్టపడతాను అంటూ నితీష్ పలు సందర్భల్లో చెప్పుకొచ్చారు. ఒక నియోజకవర్గంపై తన మొత్తం దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటునానని, అందకే తాను అసెంబ్లీకి పోటీ చేయను అంటూ అని 2012 జనవరిలో శాసనమండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నితీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాను అని నవ్వుతూ చెప్పారు. నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. సీఎం పీఠాన్ని మార్చాలని బీజేపీ అనుకోకుంటే అప్పటి వరకు నితీష్ సీఎంగా కొనసాగనున్నారు. బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి. నితీష్ దారిలో ఠాక్రే, యోగీ.. కాగా నితీష్తో పాటు మరో రెండు రాష్ట్రాలకు సైతం ఇద్దరు సీఎంలు మండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు లోక్సభ ఎన్నికలలో గెలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎప్పుడూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, ఠాక్రే, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ఎగువసభ ద్వారా మొదటిసారి ముఖ్యమంత్రి కావడం విశేషం. -
మోదీ భక్తుడిపై నీలి నీడలు
పట్నా : బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముప్పేట దాడి చేసిన లోక్జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లో నితీష్ డిమాండ్ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్) ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’) చిరాగ్ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ? ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్ పాశ్వాన్ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్
పాట్నా : బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మొదటిసారి విలేకరులతో పాట్నాలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు తమ కూటమికే అవకాశం ఇచ్చారని అన్నారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఈ ఎన్నిక తనకు చివరిది కాదని స్పష్టం చేశారు. తాను గత సమావేశంలో పదవీ విరమణ గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. ‘‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది’ (అంత్ బలా తో సబ్ బలా) అనే మాటతో ముగిస్తాను. దీనిని అస్పష్టంగా అర్థం చేసుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా అంకితభావంతో పరిపాలన కొనసాగిస్తాన’’ని అన్నారు. కాగా, నితీష్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే ముందు రాజీనామా లేఖను గవర్నర్కు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం తాజాగా ఎన్డీయే కూటమి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 125 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. (ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్) -
‘ఉప’ ఫలితాలతో ఉత్సాహం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఫలితాలు బీజేపీని బాగా సంతోషపరిచాయి. మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను చేజిక్కించుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలనిచ్చింది. ఆ పార్టీ బలం ఒక్కసారిగా 126కి పెరిగింది. కరోనా వైరస్ దేశమంతా అలుముకున్న తొలి దినాల్లో... అంటే మొన్న మార్చిలో అక్కడ రాజకీయ సంక్షోభం రాజుకుని జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్నుంచి బయటికొచ్చారు. దాంతో అప్పటికి 15 నెలలుగా అధికారంలో కమల్నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనడానికి ముందే రాజీనామా చేసింది. బీజేపీ సీనియర్ నేత శివ్రాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 107మంది సభ్యుల బలంతో అప్పటినుంచీ అది నెట్టుకొస్తోంది. రాజీనామాలవల్ల, ఇతరత్రా కారణాలతో మొత్తం 28 స్థానాలు ఖాళీ కాగా వాటికి గత నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. తగినంత బలం లేకున్నా పాలన సాగించవలసి వస్తోంది గనుక శివరాజ్ సింగ్ చౌహాన్ తరచు తనను తాను ‘తాత్కాలిక సీఎం’గా చెప్పుకునేవారు. 2005 నుంచి 2018 వరకూ పాలించిన చౌహాన్కు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే నెగ్గినవారిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన జ్యోతిరా దిత్య సింథియా అనుయాయులు. వారు పార్టీ కన్నా జ్యోతిరాదిత్యకే విశ్వాసపాత్రులుగా వుంటారు. కనుక చౌహాన్పై మున్ముందు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. గతంలో ఆయనది ఏకచ్ఛత్రాధిపత్యం. ఈ ఉప ఎన్నికలు ఇటు జ్యోతిరాదిత్యకూ, అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్కూ పెద్ద పరీక్షగా మారాయి. తన అనుచర గణాన్ని గెలిపించుకోలేకపోతే బీజేపీలో జ్యోతిరాదిత్య స్థానం బలపడదు. అలాగే ఇన్నాళ్లూ జ్యోతిరాది త్యకు పార్టీ బలమే తప్ప సొంత బలమేమీ లేదని చెబుతూ వస్తున్న కమల్నాథ్పై దాన్ని నిరూపించ వలసిన భారం పడింది. అందువల్లే ఉప ఎన్నికల ఫలితాలతో ఆయన డీలా పడ్డారు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో తనకు రాజకీయంగా పట్టుందని జ్యోతిరాదిత్య రుజువు చేసుకున్నారు. మరో 9 స్థానాల్లో ఫిరాయింపుదార్లను ఓడించి, విజయం సాధించడమే కాంగ్రెస్కు ఉన్నంతలో ఓదార్పు. అచ్చం మధ్యప్రదేశ్ తరహాలోనే గుజరాత్లో కూడా 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఫిరాయించారు. వారిలో అయిదుగురికి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు లభించాయి. తాజాగా ఈ ఎనిమిదిచోట్లా కాంగ్రెస్ ఓడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్తెసరు మెజారిటీయే లభించింది. 182మంది సభ్యుల అసెంబ్లీలో 1995 తర్వాత తొలిసారి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన బీజేపీకి ఇది భంగ పాటే. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెల్చుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి సీఎం విజయ్ రూపానీని మార్చే అవకాశం వుందన్న కథనాలు వెలువడుతున్న దశలో అన్ని స్థానా లనూ పార్టీ గెల్చుకోవడం రూపానీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. మణిపూర్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ నాలుగు గెల్చుకోగా, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఆరింటిని బీజేపీ గెల్చుకుంది. ఒక చోట సమాజ్వాదీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో సీటు నిలబెట్టుకుంది. అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష అను భవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ నేతృత్వంవహించిన బంగార్మవ్ నియోజక వర్గంలో సైతం బీజేపీ అభ్యర్థే విజయం సాధించారు. హథ్రాస్లో యువతిపై అత్యాచారం, ఆమె భౌతి కకాయానికి అర్థరాత్రి పోలీసులే అంత్యక్రియలు జరపడం వంటి ఘటనల ప్రభావం ఉప ఎన్నికలపై కనబడకపోవడం గమనించదగ్గది. ఉత్తరప్రదేశ్ ఫలితాలకు విపక్షాల బాధ్యత కూడా వుంది. ఈ ఏడు చోట్లా నేరుగా యోగి ఆదిత్యనాథ్ సభలూ, సమావేశాలూ నిర్వహించారు. మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియింకగాంధీ ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక స్థానాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఉన్నంతలో ఛత్తీస్గఢ్, హరియాణాల్లో రెండు స్థానాలు, జార్ఖండ్లో జేఎంఎంతో కలిసి రెండు స్థానాలు గెల్చుకోవడం మాత్రమే కాంగ్రెస్కు ఊరట. అయితే జార్ఖండ్లో అటు జేఎంఎంకూ, ఇటు కాంగ్రెస్కూ గతంలోకన్నా మెజారిటీ బాగా తగ్గడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సాగు బిల్లులపై ఆందోళన జరుగుతున్న హరియాణాలో బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ–జేజేపీ ఉమ్మడి అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన రెండు ఉప ఎన్ని కల్లోనూ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలకూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ చాలా వ్యత్యాసం వుంటుంది. సాధా రణంగా ఉప ఎన్నికలు వాటికవే ఒక ధోరణిని ప్రతిబింబించవు. ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వుండే అధికార పక్షాలకు అనుకూలంగా వుండే అవకాశం వున్నా అభ్యర్థి ఎంపిక మొదలుకొని అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలతో మొదలుపెట్టి కుల సమీకరణాల వరకూ ఎన్నెన్నో అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాల్లో ఎక్కడ లెక్క తప్పినా పార్టీలకు సమస్యలెదురవుతాయి. అధికారంలో వున్న పక్షం నగుబాటుపాలవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్ని కలో, మరో ఎన్నికలో వచ్చే అవకాశం వుంటే ఈ ఫలితాలను చూపి భవిష్యత్తు తమదేనని శ్రేణులకు చెప్పుకోవడానికి ఏ పార్టీకైనా అవకాశం వుంటుంది. అందుకే అధికారంలో వున్న పార్టీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ కేంద్రీకరిస్తుంది. మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు నిరాశ మిగల్చగా, బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి. -
బిహార్ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ఆఘాడీ ప్రభుత్వం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ ఆత్మహత్య కేసులో నవంబర్ 4న అర్నబ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ అర్నబ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ నవంబర్ 18 వరకు జ్యూడీషియల్ రిమాండ్కు అనుమతించింది. అయితే హైకోర్టులో అర్నబ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను బెంచీ కొట్టివేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. (‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!) అయితే అర్నబ్ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టారు. అర్నబ్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. శివసేన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వ స్థానాన్ని సుప్రీం చూపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకోకుండా, మూసివేసిన కేసును తిరిగి తెరిచి, అర్నబ్ను వీధి నేరస్థుడిలా చూసిందని మండిపడ్డారు. అతన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని, అతన్ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజల గొంతును అణిచివేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇష్టపడుతోందని ఫడ్నవీస్ ఆరోపించారు. ఇది రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని అన్నారు. శివసేనకు ఎదురుదెబ్బే.. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సరిగా లేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. బిహార్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంపై ఆయన స్పందించారు. ఫడ్నవిస్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఫలితం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు. బిహార్లో ప్రధాని మోదీ ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. గ్రామగ్రామానికి బీజేపీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని, వారి వరకు తీసుకెళ్లగలిగామన్నారు. కాంగ్రెస్ చర్యలు భవిష్యత్తులో మహా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ ప్రభావం శివసేనపై పడుతుందని, ఇపుడు సేనకు అర్థం కాబోదని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తగలబోయే ఎదురుదెబ్బతో తెలుస్తుందని ఫడ్నవిస్ జోస్యం చెప్పారు. బాధితులకూ న్యాయం జరగాలి: మంత్రి మలిక్ వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉంటుందని అదే సమయంలో బాధితులకూ న్యాయం జరగాలని ఎన్సీపీ నేత, మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి నవాబ్ మలిక్ వ్యాఖ్యానించారు. కాగా, అర్నబ్ అరెస్టు గురించి కోర్టు వ్యాఖ్యానిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సబబు కాదని, అది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనంది. భావజాలం, అభిప్రాయ భేదాల నడుమ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకోవడం పట్ల కూడా సుప్రీం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా మంత్రి మలిక్ మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థను గౌరవించడం అందరి బాధ్యత అని వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడారని, అదే సమయంలో బాధితుడికి న్యాయం కూడా జరగాలని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. -
‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘడీ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమిలోని మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయిని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కవ కాలం పరిపాలన కొనసాగించలేదని పేర్కొన్నారు. శివసేన సర్కార్ పడిపోయిన వెంటనే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామమని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’ ) గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని’ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ ఎన్నికల ఇంఛార్జ్గా ఫడ్నవిస్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు బీజేపీకి ఓటేశారని, నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసొచ్చిందని అన్నారు. బిహార్లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే 125 సాధించింది. అందులో బీజేపీకి 74, జేడీయూకు 43, వికాశిల్ ఇసాన్ పార్టీకి 4, హిందుస్తానీ అవాం మోర్చాకి 4 సీట్లు వచ్చాయి. ప్రత్యర్ధి మహాఘట్ బంధన్ కి 110 సీట్లు రాగా, వీటిలో ఆర్జేడీ 75 , కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు సాధించాయి. ( చదవండి: ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు ) -
బిహార్ ఫలితాలు; ఎన్డీఏ విజయం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకున్న అంశాలు అనూహ్యంగా మరుగున పడి పోయి కొత్త అంశాలు ముందుకు వచ్చి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని 40 లోక్సభ సీట్లకుగాను 39 సీట్లను బీజేపీ కూటమి గెలుచుకోవడంతో వాటి ఫలితాల ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని తొలుత రాజకీయ విశ్లేషకులు భావించారు. జాతీయ అంశాలైన పుల్వామా–బాలాకోట్ అంశాల కారణంగా నాడు అన్ని లోక్సభ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. (చదవండి.. బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బిహార్ను 2020లో కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేసింది. దాంతో దేశవ్యాప్తంగా వలసలు పోయిన బిహారీలో ఆకలిదప్పులతో అలమటిస్తూ, అష్టకష్టాలు పడుతూ సొంతూళ్లకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో బిహార్లో పాలకపక్ష మనుగడ ఈసారి ఎన్నికల్లో ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ ఎన్నిలకపై ప్రధానంగా అభివృద్ధి అంశం ప్రభావితం చేస్తుందని 42 శాతం మంది అభిప్రాయపడగా, నిరుద్యోగం ప్రభావితం చేస్తుందని 30 శాతం మంది, ద్రవ్యోల్బణం ప్రభావం చూపిస్తుందని 11 శాతం మంది ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలేవి నిజం కాలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్షలాది బిహారి పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందజేయడం ఎన్నికల ఫలితాలను ఎంతో ప్రభావితం చేసింది. తమను వాస్తవంగా గెలిపించిందీ సైలెంట్ ఓటర్లయిన మహిళలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంలో పూర్తి వాస్తవం ఉంది. మగవారికన్నా ఐదుశాతం ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళల కోసం మోదీ చేపట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఎంతోకొంత మహిళలను ప్రభావితం చేయగా, స్థానిక సంఘాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను నితీష్ ప్రభుత్వం కల్పించడం, పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం పాలకపక్షానికి కలసి వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ హయాం నుంచి పురుషాధిపత్య రాజకీయాలను చూస్తూ వస్తోన్న బిహార్ మహిళకు నితీష్ పట్ల గౌరవం పెరుగుతూ వచ్చింది. ‘రోజ్గార్’ నినాదానికి ఎక్కువగా ఆకర్షితులైన యువత మాత్రం తేజస్వీ యాదవ్ వైపు వెళ్లింది. ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ నితీష్ కుమార్ చెప్పడం కూడా బిహార్ ఆఖరి విడత ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. మహిళలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ఆ మాటలకు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. నితీష్–మోదీ అనే డబుల్ ఇంజన్ ప్రచారం కూడా కలిసొచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడం, యాదవ్ సోదరులకు ఒకరంటే ఒకరికి పడక పోవడం, తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో కాకుండా ఎక్కువ కాలం ఢిల్లీలో గడపడం కూడా బిహార్ పాలకపక్షానికి కలిసొచ్చింది. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వివాదాస్పదమైన పౌరసత్వ బిల్లు లాంటి అంశాలపై తేజస్వీ యాదవ్ పూర్తిగా మౌనం వహించడం 28 శాతం –30 శాతం కలిగిన ముస్లింలు–యాదవ్ల బంధాన్ని బలహీనపర్చింది. 2015 ఎన్నికల సందర్భంగా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోకి అడుగుపెట్టిన అసుదుద్దీన్ ఓవైసీ తన పార్టీ ఏఐఎంఐఎంను విస్తరించడంలో విజయం సాధించడం కూడా పాలకపక్ష కూటమికి కలిసొచ్చిన మరో అంశం. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్తో పొత్తు మహా కూటమికి కలసిరాని మరో అంశం. (చదవండి: ఎన్నికల ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) -
హైదరాబాద్కు బిహార్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం చేరుకున్నారు. బుధవారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వద్ద బిహార్ ఎమ్మెల్యేలు అఖ్తరుల్ ఇమాన్, మహ్మద్ ఇజాహర్ ఆసీఫ్, షాహనవాజ్ ఆలం, సయ్యద్ రుకునుద్దీన్, అజహర్ నయీమీలకు హైదరాబాద్కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా దారుస్సలాం చేరుకొని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం విడుదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 74, జేడీయూ 44 స్థానాల్లో గెలుపొందాయి. ఇక తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అత్యధికంగా 76 స్థానాల్లో విజయం సాధించింది. -
నితీష్కు చిరాగ్ చికాకు!
పట్నా : గత ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో దిగిన సీనియర్ నేత సరయూ రాయ్ ఏకంగా సీఎం రఘువర్దాస్పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్ తరహాలో బిహార్లో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్కు చుక్కలు చూపారు. చిరాగ్ పాశ్వాన్ కారణంగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్దాస్తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్ కుమార్కు ఊరట ఇస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ ఛీప్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. బిహార్ ఓటర్లు మహా ఘట్బందన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మకై ఫలితాలను తారుమారు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం పట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. పోల్ ప్యానల్పై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఫలితాలను రీకౌంటింగ్ జరపించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫలితాలపై ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమి గెలిచిన స్థానాల్లో చాలావరకు వెయ్యిలోపు మెజార్టీ ఉండటంతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. (బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) కాగా మంగళవారం విడదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి విజయ సాధించింది. ఆర్జేడీకి 76, బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 74 స్థానాను సొంతం చేసుకుంది. అయితే ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో ఆ ప్రభావం తేజస్వీపై పడింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మరోసారి బిహార్ సీఎం పగ్గాలను అందుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. మంత్రివర్గ సంప్రదింపుల అనంతరం దిపావళి తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్లో కీలక శాఖలు తమకే దక్కాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తేజస్వీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. -
బిహార్ ఎన్నికలు : 10 మంది మంత్రుల ఓటమి
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినెట్లో 24 మంది మంత్రుల్లో పది మంది ఓటమి పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది జేడీయూకు చెందిన వారు కాగా, ఇద్దరు బీజేపీ మంత్రులున్నారు. నితీష్ కేబినెట్లో మొత్తం 29 మంత్రులున్నా వారిలో 5గురు ఎమ్మెల్సీలు కావడంతో ఎన్నికల బరిలో నిలవలేదు. 23 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో పోటీ చేయగా, 2015లో ఘోసి నుంచి పోటీ చేసిన విద్యా మంత్రి కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ తాజాగా జెహనాబాద్ నుంచి బరిలో దిగారు. ఇక బీజేపీ కోటా నుంచి నితీష్ కేబినెట్లో చేరిన పట్టణాభివృద్ధి మంత్రి సురేష్ కుమార్ శర్మ, గనుల మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్లు వరుసగా ముజఫర్పూర్, చైన్పూర్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు వర్మతో పాటు జేడీయూ మంత్రులు శైలేష్ కుమార్, సంతోష్ కుమార్ నిరాల, జైకుమార్ సింగ్, రాం సేవక్ సింగ్, రమేష్ రిషిదేవ్, ఖర్షీద్, లక్ష్మేశ్వర్ రాయ్లు ఓటమి చవిచూశారు. ఎల్జేపీ అభ్యర్ధులు పలు నియోజకవర్గాల్లో సంప్రదాయ ఎన్డీయే ఓట్లను చీల్చడంతో తమ మంత్రులు ఓడిపోయారని ఎల్జేపీ తమ విజయావకాశాలను దెబ్బతీయకుంటే జేడీయూ 80 స్ధానాల్లో విజయం సాధించేందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ అభ్యర్ధుల ఓటమిపై ఎన్డీయే నేతలు సమీక్షిస్తారని చెప్పారు. -
సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఎన్డీయే
పట్నా: 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఇటీవల వేరుపడిన మిత్రపక్షం ఎల్జేపీ శత్రుత్వాన్ని, ఆర్జేడీ యువనేత సారధ్యంలోని విపక్షాన్ని విజయవంతంగా ఎదుర్కొని బిహార్లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుంది. 243 సీట్ల అసెంబ్లీలో, మెజారిటీ మార్క్ 122 కన్నా కేవలం 3 స్థానాలు అధికంగా సాధించి, మరోసారి బిహార్ గద్దెనెక్కనుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో వరుసగా నాలుగోసారి జేడీయూ నేత నితీశ్కుమార్ సీఎం కానున్నారు. 2015 ఎన్నికల్లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 2015లో నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశారు. మిత్రపక్షం జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో(74) గెలిచినా.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీశ్కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ ఆశించినన్ని స్థానాలను గెలవలేకపోవడం వెనుక మాజీ మిత్రపక్షం ఎల్జేపీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ను అంగీకరించినప్పటికీ.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీల ‘మహా ప్రజాస్వామ్య, లౌకిక కూటమి’ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా కూటమి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని, ముఖ్యంగా ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
బిహార్లో సరికొత్త అడుగులు!
భారత రాజకీయాల్లో ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భావానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజíస్వీ యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపదికన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వీ యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వీ.. యాదవ రాజకీయాల బరువునుంచి పూర్తిగా తప్పుకుని కొత్త పంథాలో నడిచి అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. తన వంటి అతి పిన్నవయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలను ప్రతిబింబిస్తున్న సరికొత్త హీరో తేజస్వీ యాదవ్. చిట్టచివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించింది.. 243 మంది సభ్యులు కల రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెల్చుకుని సరిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి సరిపోయేటన్ని సీట్లను సాధించి బతుకుజీవుడా అని బయటపడింది. బీజేపీ నాయకత్వం దేన్నయితే ఆశించిందో సరిగ్గా అలాగే పోలింగ్ సరళి సాగిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా 74 స్థానాలు గెల్చుకుని 70 శాతం విజయశాతాన్ని సాధించింది. బిహార్ ఎన్నికల్లో అది సాధించిన ఉత్తమ ఫలితాలు ఇవే మరి. నితీశ్ కుమార్ని ఆయన జేడీయూని ఈ ఎన్నికల్లో ఒక జూనియర్ భాగస్వామి పాత్రకు కుదించాలని బీజేపీ పన్నిన పథకం బ్రహ్మాండంగా ఫలించింది. ప్రతిపక్ష శ్రేణులను ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టడమే కాదు.. విజయానికి దాదాపు దగ్గరగా వచ్చేలా ప్రతిపక్షాల ఓట్లను కూడా శాసించి బ్రాండ్ మోడీ ప్రభావం వల్లే ఈ గెలుపు సాధ్యం చేశానని బీజేపీ ఇరుపక్షాల శ్రేణుల ముందు ఘనంగా ప్రదర్శించింది. అయితే అదే సమయంలో భారత రాజకీయాల్లోకి ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భవానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజస్వి యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపది కన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలు సాధించి బిహార్లో అతిపెద్ద పార్టీగా కొనసాగింది. దాదాపు 30 లక్షల ఓట్లను లేదా 40 శాతాన్ని దక్కించుకున్న ఆర్జేడీకి, 2015 నాటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. ముస్లింలు, యాదవుల ఓటు పునాది కలిగిన పరిమితిని దాటి ఆర్జేడీ తన పలుకుబడిని విస్తృతస్థాయిలో విస్తరించిందని తేటతెల్లమైంది. గుర్తించదగిన విషయం ఏమిటంటే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తన ఓటు షేరును 18.3 శాతం నుంచి 23.1 శాతానికి పెంచుకునే క్రమంలో జేడీయూ పార్టీకి చెందిన ఓట్ల కంటే బీజేపీ కోటాను కొల్లగొట్టడమే. ఈ దెబ్బకు బీజేపీ ఓటు షేర్ గతంలోని 24.4 శాతం నుంచి 19.5 శాతానికి పడిపోయింది. 2015తో పోలిస్తే బీజేపీకి ప్రస్తుతం 10 లక్షల పదివేల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. అయితే కూట మిలో భాగంగా తక్కువ స్థానాలకు కట్టుబడినందువల్ల కూడా బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చి ఉండవచ్చు. జేడీయు ఓటు షేర్ను దెబ్బకొట్టడంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. బీజేపీ ఇలా దెబ్బ కొట్టినా ఈదఫా ఎన్నికల్లో జేడీయూకు ఓటు శాతం 16.8 నుంచి 15.8 శాతం మాత్రమే తగ్గింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థులు జేడీయూ ఓటర్లను పొందగలిగారు తప్పితే బీజేపీకి చెందిన అగ్రకులాల ఓటర్లు జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో తమ ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. జేడీయూకు బదులుగా వీరు అటు ఎల్జేపీనుంచి లేదా ఆర్జేడీనుంచి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులకు, తమ ఓటు గుద్దేశారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు, ప్లూరల్స్ పార్టీ వంటి అతి చిన్న పార్టీల ఖాతాలోకి కూడా వెళ్లిపోయాయి. ముందుండి నడిపించిన సమర యోధుడు గతంలో 2015లో జరిగిన ఎన్నికల్లో మహాగట్ బంధన్ ప్రధాన వ్యూహకర్తగా తలపండిన రాజకీయనేత లాలూ ప్రసాద్ యాదవ్ సర్వం తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ఈ ప్రచార ముఖ చిత్రంగా నితీశ్ కుమార్ నిలిచి తన పార్టీనీ, పొత్తు పార్టీలను ఒంటిచేత్తో విజయం వైపు తీసుకుపోయారు. పైగా ఆనాడు బిహార్లో ప్రతిపక్షం ఎన్నికలకు కొద్ది నెలల ముందువరకు చెల్లాచెదురై ఉండేది. అందుకనే 2015లో సాధించిన 80 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 75 స్థానాలు చేజిక్కించుకుని గణనీయమైన విజయం సాధించిన ఘనత పూర్తిగా యువ తేజస్వీ యాదవ్కే దక్కుతుంది. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఛాయ నుంచి పూర్తిగా బయటపడిన 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వి యాదవ్ అతి తక్కువ సమయంలో సాధించిన విజయం సాధారణమైనది కాదు. యాదవ రాజకీయాల బరువునుంచి తప్పుకుని కొత్త పంథాలోసాగిన తేజస్వి బిహార్లోని అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. అంతకంటే ముఖ్యంగా ఇటీవలి కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బిహార్లో సాగిన ఎన్నికల ప్రచారం సాపేక్షికంగా శాంతియుతంగా, విద్వేష రహితంగా సాగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ గొప్ప మార్పునకు పూర్తి ఘనత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్కే దక్కాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కూడా ఈ విషయంలో తేజస్వి విశిష్టతను స్పష్టంగా గుర్తించి ప్రశంసించింది. 2020లో సాగిన ఎన్నికల్లో కూడా బీజేపీ య«థాప్రకారంగా కశ్మీర్, సీఏఏ, రామ్ మందిర్ వంటి అంశాలను పదేపదే ప్రస్తావించి విభజన రాజకీయాలను ప్రేరేపించా లని ప్రయత్నించింది. కానీ దానివల్ల అది సాధించింది పెద్దగా ఏమీలేదు. చివరకు బాలీవుడ్లో కొనసాగుతున్న సాంస్కృతిక తప్పిదాల వల్లే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడంటూ చెలరేగిన తీవ్రవివాదాస్పద అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిం చింది. ఇక నితీశ్ తనవంతుగా జంగిల్ రాజ్ అనే పాత ముద్రను ఆర్జేడీపై పదేపదే సంధిస్తూ తేజస్విపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నించినా, అవేవీ పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ మొత్తం వ్యతిరేక ప్రచారంలో కూడా తేజస్వి అత్యంత పరిణతిని ప్రదర్శించారు. తన వంటి అతి పిన్న వయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. తనపై సాగుతున్న దాడిలో పొరపాటున కూడా ప్రవేశించకుండా తేజస్వి యాదవ్ మొదటినుంచి చివరివరకూ తాను విశ్వసించినటువంటి.. బిహార్ యువతకు విద్య, ఉద్యోగాలు అనే అంశాలపైన మాత్రమే దృష్టి సారించి ప్రచారం సాగిం చాడు. మహాగట్ బంధన్ బలమైన అధికార కూటమిని ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టిందంటే తేజస్వి అత్యంత ప్రతిభావంతంగా అల్లిన ప్రచార ఎజెండానే కారణమని చెప్పక తప్పదు. ఈ ప్రయాణ క్రమంలో తేజస్వి ఈ దఫా ఎన్నికలకు మాత్రమే కాకుండా, దేశంలో కోవిడ్–19 అనంతర రాజకీయాలకు కూడా అజెండాను నిర్దేశించడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బిహార్ యువతీయువకులకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజస్వి ఇచ్చిన ఎన్నికల హామీ బీజేపీని ఎంతగా భీతిల్లజేసిందంటే తమ కూటమిని గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని ఎదురు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా కోవిడ్–19 వ్యాక్సిన్ని ఉచితంగా అందిస్తానని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మధ్యేవాద వామపక్ష రాజకీయ ఆర్థిక విధానాన్ని ఒక మితవాద పార్టీ ప్రకటించవలసి రావడంగా తప్ప మరోలా దీన్ని చూడలేం. మరోవిధంగా బిహార్లో వామపక్షాలు సాగించిన గొప్ప విజ యంలో కూడా ఇది ప్రతిఫలించింది. పోటీ చేసింది 29 స్థానాల్లోనే అయినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో వామపక్షాలు 16 సీట్లు కొల్లగొట్టి షాక్ తెప్పించాయి. గతంతో పోలిస్తే 50 శాతం విజయాల రేటును పెంచుకున్న వామపక్షాలు ఆర్జేడీతో సమానంగా విజయాలు సాధించడమే కాకుండా కాంగ్రెస్ (30 శాతం), జేడీయూ (40శాతం) కంటే మంచి స్థానంలో నిలబడటం చెప్పుకోదగిన విషయం. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ–జేడీయు కూటమి అత్తెసరి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతదేశంలో మధ్యేవాద–వామపక్ష రాజకీయాలకు ఏకకాలలో బిహార్ పైకెత్తి నిలిపింది. వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సామ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు కూడా బిహార్ అనుభవాన్ని ప్రతిబింబించినట్లయితే, అప్పడు బిహార్ ప్రజలు అలాంటి మార్గాన్ని చూపించింది మేమే కదా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలకు సంబంధించిన సరికొత్త హీరో తేజస్వి యాదవ్. వ్యాసకర్త రాజేష్ మహాపాత్ర స్వతంత్ర జర్నలిస్టు -
బీజేపీ జైత్రయాత్ర
ఐపీఎల్ స్కోర్ మాదిరే క్షణక్షణానికీ మారుతూ దేశ ప్రజలందరిలోనూ ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరకు ఎన్డీఏకే విజయం ఖాయం చేశాయి. మంగళవారం రోజంతా టీవీల ముందు కూర్చున్నవారిని నిరాశ పరుస్తూ ఎంతకూ తేలని అంతిమ ఫలితాలు... ఎట్టకేలకు బుధవారం వేకువజామున వెలువడ్డాయి. 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎప్పటిలాగే ఎన్డీఏ ఈసారి కూడా ఆధిక్యత సాధించింది. అయితే దాని మెజారిటీ 125కి పడిపోయింది. ఎన్డీఏలో ఇంతవరకూ ప్రధాన పక్షంగా వుంటున్న ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యూ) కేవలం 43 స్థానాలతో ద్వితీయ స్థానంలోకి వెళ్లగా, ఆ చోటును 74 స్థానాలతో బీజేపీ చేజిక్కించుకుంది. కూట మిలోని చిన్న పార్టీలైన వికాస్శీల్ పార్టీ, హిందూస్తాన్ అవామీ పార్టీ చెరో నాలుగూ గెల్చుకున్నాయి. నితీశ్పై అలిగి కూటమినుంచి బయటికెళ్లి ఒంటరిగా బరిలో నిలిచిన లోక్జనశక్తికి ఒక్క స్థానం దక్కింది. నితీశ్ను 71 స్థానాల నుంచి 43కి తగ్గించి ఎన్డీఏలో జూనియర్ పార్టనర్గా మార్చిన తృప్తి మాత్రం మిగిలింది. ఎల్జేపీ వల్ల 59 స్థానాల్లో ఎన్డీఏకు విజయం చేజారిందని లెక్కలు చెబు తున్నాయి. ఎన్డీఏకు చివరివరకూ చుక్కలు చూపించిన మహాకూటమిలో ఆర్జేడీ ఒకటే సత్తాగల పార్టీ. అందులోని కాంగ్రెస్, వామపక్షాలు చిన్న పార్టీలే. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీచేసి 75 స్థానాలు గెల్చుకోగా...ఆ కూటమిలోని కాంగ్రెస్ దురాశకు పోయి 70 స్థానాలు తీసుకుని కేవలం 19 చోట్ల మాత్రమే నెగ్గింది. రద్దయిన అసెంబ్లీలో ఆ పార్టీ స్థానాలు 27. కాంగ్రెస్కన్నా వామపక్షాలు ఎంతో నయం. సీపీఐ 6చోట్లా, సీపీఎం 4 చోట్లా పోటీచేసి చెరో రెండూ గెల్చుకున్నాయి. రద్దయిన అసెంబ్లీలో ఈ రెండు పార్టీలకూ ప్రాతినిధ్యం లేదు. కూటమిలోని మరో వామపక్షం సీపీఐ ఎంఎల్ 19 స్థానాలు తీసుకుని 12చోట్ల విజయం పొందింది. విడిగా పోటీచేసిన ఎంఐఎం అయిదు స్థానాలు గెల్చుకుని ఔరా అనిపించుకుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో నిజమైన యోధుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి ఎవరూ ఆయన్ను గట్టి పోటీదారుగా పరిగణించలేదు. బిహార్లో ఎన్డీఏ పాలనపై తీవ్రమైన అసంతృప్తివున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ అదే అధికారంలో కొస్తుం దని అందరూ అంచనా వేశారు. అపార అనుభవమున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుపాలు కావడం, తేజస్వికి ఎన్నికల సారథ్య అనుభవం పెద్దగా లేకపోవడంవల్ల ఆ పార్టీ నాయ కత్వంలోని మహాకూటమి కనీసం గట్టి పోటీ ఇస్తుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేకపో యింది. పైగా అటు పదిహేనేళ్లుగా అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతూవస్తున్న నితీశ్ నాయ కత్వం లోని ఎన్డీఏ కూటమి. కేంద్రంలో ప్రధానితో మొదలుపెట్టి అతిరథులు, మహారథులు, అర్థ రథులు... అందరూ ఆ కూటమిలోనే వున్నారు. బీజేపీకి సుశిక్షితులైన కార్యకర్తల సైన్యం వుంది. నెల రోజుల ముందు తేజస్వి ఈ అంచనాలను తారుమారు చేశారు. ఎన్నికల ఎజెండాను తానే నిర్ణయిం చారు. ఆయన సవాళ్లకు జవాబివ్వడంతోనే అవతలివారికి సరిపోయింది. ఎక్కడా మాట తూలలేదు. ఎవరినీ కించపరచలేదు. తనను ప్రధాని మోదీ ‘జంగిల్ రాజ్ కీ యువరాజ్’ అన్నా ఆయన్ను పల్లెత్తు మాట అనలేదు. తమను గెలిపిస్తే యువతకు 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన ఇచ్చిన హామీ అత్యధిక వలసలుండే బిహార్లో మంత్రంలా పనిచేసింది. మొదట్లో ఆచరణ సాధ్యంకానిదని తేల్చే సిన బీజేపీ చివరకు ఆ ఉద్యోగాల సంఖ్యను 19 లక్షలకు పెంచి, కేంద్రంలో అధికారంలో వున్నందున తాము మాత్రమే ఆ పని చేయగలమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తేజస్వికి కాంగ్రెస్ శిరోభారమైంది. స్థోమత లేకున్నా తగుదునమ్మా అంటూ 75 సీట్ల జాబితాను ఆయన ముందు పెట్టింది. ఇస్తే సరేసరి... లేకుంటే ప్లాన్ బీ వుందని హెచ్చరించింది. లాలూ రంగంలో వుంటే వేరుగా వుండేది. చివరకు ఆ పార్టీకి 70 స్థానాలివ్వక తప్పలేదు. ఎక్కువచోట్ల పోటీచేస్తేనే భవిష్యత్తులో పార్టీ విస్తరిస్తుందన్న మతిలేని తర్కంతో అది పట్టుదలకు పోయింది. స్వస్వరూప జ్ఞానంతో కాంగ్రెస్ 35 లేదా 40సీట్లకు సరిపెట్టుకుంటే ఆర్జేడీ మరో 25 స్థానాలు సునాయాసంగా చేజిక్కించుకునేది. కూటమికి పీఠం అందేది. బిహార్ రాజకీయ రంగం ప్రత్యేకతేమంటే... అక్కడ కూటమిగా వచ్చే పార్టీలకే ఆదరణ వుంటుంది. కనుకనే ఈ పొత్తు తప్పలేదు. వామపక్షాలకు, ముఖ్యంగా సీపీఐ ఎంఎల్కు మంచి ప్రజా పునాది వుందని గ్రహించిన తేజస్వి వారిని కూటమిలోకి తీసుకురాగలిగారు. మండల్ రాజకీయాలకు ఆర్థిక ఎజెండాను కూడా జోడించి మధ్యతరగతి విద్యావంతుల్ని ఆకర్షించారు. అయితే కరోనాను ఎదుర్కొనడంలో వైఫల్యం, లాక్డౌన్, వలసజీవుల వెతలు వగైరాలతో సతమతమైన బిహార్లో ఇవేమీ చర్చకు రాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని, కూటమిలో ప్రధాన పక్షంగా అవతరించిన బీజేపీ... దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. 59 స్థానాల్లో 41 రాబట్టుకుంది. కాంగ్రెస్ను 31 చోట్ల ఓడించి దాన్ని మరింత కుదించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్లలో బీజేపీ ఎన్నదగిన విజయాలు సాధించింది. తెలంగాణలోని దుబ్బాక స్థానంలో ఆ పార్టీ గెలుపు కూడా ఎన్న దగింది. అచ్చం బిహార్ ఫలితాల మాదిరే అక్కడా విజయం దోబూచులాడింది. చివరంటా గెలు పెవరిదో చెప్పలేని ఉత్కంఠ ఏర్పడింది. బీజేపీ యువత అటు సోషల్ మీడియాలో, ఇటు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా పనిచేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంవల్ల వచ్చిన సాను భూతి పవనాలనూ, అడుగడుగునా ఎదురైన అడ్డంకులనూ వారు అధిగమించారు. ఏదేమైనా ఈ విజయాలన్నీ పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సా హంగా పోరాడేందుకు బీజేపీ శ్రేణులకు స్ఫూర్తినిస్తాయి. -
నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే
బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(73) కంటే జేడీ(యూ) (43) తక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే ఊహగానాలకు తెరపడింది. బిహార్ పగ్గాలు మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమారే చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీపావళి తరువాత నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జేడీయూ ఎంపీ కెసి త్యాగి తెలిపారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. నితీష్ కుమార్ను జాతీయ రాజకీయాల వైపు రావాలని సెక్యులర్ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా పని చెయ్యాలని, బీహార్ నితీష్ స్థాయికి చిన్నదైపోయిందంటూ ట్వీట్ చేశారు. (చదవండి : నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ బీజేపీ నాయకుడని, గెలుపోటములు ఆయన స్థాయిని దిగజార్చవని, ఆయనపై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ను ప్రజలు తిరస్కరించారని, దిగ్విజయ్ తన రాష్ట్రంలో తన పార్టీ రాజకీయాలను చూసుకోవాలని విమర్శించారు. ఇదే అంశంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్మోదీ మాట్లాడుతూ.. బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, ఇది ఏ ఒక్క పార్టీ గెలుపు కాదని, సమిష్టి విజయమన్నారు. బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమిపై నమ్మకముంచి పట్టం కట్టారన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. -
‘తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటాం’
-
‘తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటాం’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిన బీజేపీ ప్రభావం లేదనేవారికి తాజా ఎన్నికలు షాక్ ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటామని చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. చదవండి : బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!? ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూసిందని, కరోనా సమయంలో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామని అన్నారు. ఫలితాల నేపథ్యంలో ప్రజలంతా టీవీలు, ట్విటర్, ఫేస్బుక్లకు అతుక్కుపోయారని చెప్పారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే మీడియాలో బూత్ల రిగ్గింగ్, ఓట్ల గల్లంతుకు సంబంధించిన కథనాలు వచ్చేవని, ఇప్పుడు పోలింగ్ శాతం ఎంత పెరిగిందనే పతాక శీర్షికలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. బిహార్లో అద్భుత విజయం అందించారని, తాజా ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పనిచేస్తూ ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారని అన్నారు. విజయోత్సవ సభలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ అగ్రనేతలు, పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ నితీష కుమార్ నేతృత్వలోని పాలక ఏన్డీఏకు గట్టి పోటీ ఇచ్చారని శివసేన ప్రశంసించింది. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మరోసారి సీఎం అయితే ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని పేర్కొంది. జేడియూకి సీట్లు తక్కువ వచ్చినా ముఖ్యమంత్రి పీఠం నితీష్ కుమార్దేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన తెలిపింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి హామీయే శివసేనకు ఇచ్చి కాషాయ పార్టీ నిలబెట్టుకోలేదని దీంతో మహారాష్ట్రలో రాజకీయ మహాభారతం జరిగిందని తెలిపింది. ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య సీఎం పదవిపై అవగాహన కుదిరిందని పేర్కొంది. ఎన్నికల తర్వాత శివసేనకు 56 సీట్లు రావడంతో బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడంతో కూటమి విడిపోయిందని గుర్తుచేసింది. బిహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా పనిచేయడంతో తేజశ్వికి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు పోటీలో లేని మహాకూటమి యువ నేత ప్రతిష్టతోనే విజయానికి దగ్గరగా వచ్చిందని తెలిపింది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకపోవడం మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని విమర్శించింది. ‘జంగిల్రాజ్ కా యువరాజ్’ అంటూ తేజశ్విని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారని.. ముఖ్యమంత్రి నితీష్ ఇదే తనకు చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించింది. తేజశ్వి మాత్రం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారని పేర్కొంది. దేశ రాజకీయాలకు బిహార్ ఎన్నికలు కొత్త తేజశ్విని పరిచయం చేశాయని సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. (చదవండి: వారి స్వరం వినిపిస్తా: ఓవైసీ) -
వారి స్వరం వినిపిస్తా: ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్ధానాలు గెలుపొంది సత్తా చాటిన ఏఐఎంఐఎం బలహీనుల గొంతుకగా మారుతుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము బెంగాల్, యూపీ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి పార్టీని విస్తరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ పోటీచేసి ఎంఐఎంను జాతీయ పార్టీగా మలిచే ప్రణాళికలు తమ ముందున్నాయనే సంకేతాలు పంపారు. బెంగాల్లోనూ విజయాలను నమోదు చేస్తామని 2021లో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతామని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చిందని తమను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రలో శివసేనతో చేతులు కలిపిన కాంగ్రెస్తో తాము ఎలా జతకడతామని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు తమకు ఉందని, దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. బిహార్లో దీటైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్జేడీకి మద్దతుపై పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బిహార్లో తమ పార్టీ విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, తాను హాజరైన పలు సభలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి ఎంఐఎంను నిందిచడం తగదని అన్నారు. చదవండి : ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’ -
బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజంభణను అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత మార్చి నెలలో విధించిన లాక్డౌన్ వల్ల దేశంలో పౌర జీవనం పూర్తిగా స్తంభించి పోవడం, ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు కట్టుబట్టలతో కాలినడకన, సైకిళ్లు, దొరికిన వాహనాలపై ఇళ్లకు బయల్దేరి అష్టకష్టాలు పడిన విషయం తెల్సిందే. ఎర్రటి ఎండలను లెక్క చేయకుండా పిల్లా పాపలతో సొంతూళ్లకు బయల్దేరిన బడుగు జీవుల కష్టాలు నేటికి మన కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో దాదాపు వెయ్యి మంది ప్రజలు మరణించారు. (బీజేపీదే బిహార్) దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా బిహార్ నుంచే ప్రజలు ఎక్కువగా వలసలు పోవడం, తిరుగు టపాలో వారే ఎక్కువగా కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. మరి అలాంటి రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఏమిటా? అన్న ఆశ్చర్యం నేడు మేథావుల మెదళ్లను కూడా తొలుస్తోంది. బిహార్లో కాషాయ పార్టీకి 74 సీట్లు రావడం అంటే ఓటింగ్లో 20 శాతం వాటా వచ్చినట్లే. 243 స్థానాలు కలిగిన ఆ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లతో అధికార పీఠాన్ని అప్పగించడమంటే మామూలు విషయం కాదు. అలాగే 11 రాష్ట్రాల పరిధిలోని 58 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ఊహించిన వారూ తక్కువే. మధ్యప్రదేశ్లో 28కిగాను 19 సీట్లు, గుజరాత్లో ఎనిమిదికి ఎనిమిది, యూపీలో ఏడింట ఆరు, కర్ణాటకలో రెండింటికి రెండు సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ, తెలంగాణలోని దుబ్బాక స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా భౌగోళికంగా కూడా విస్తరించింది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) ఎన్నికల్లో బిహార్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ విజయఢంకా మోగించిందంటే లాక్డౌన్ సందర్భంగా ప్రజలు తాము అనుభవించిన అసాధారణ కష్టాలకు అటు ప్రధాని నరేంద్ర మోదీనికానీ, బీజేపీగానీ బాధ్యులను చేయదల్చుకోలేదన్న విషయం స్పష్టం అవుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మైనస్ 23.9 శాతానికి (ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి) పడిపోయినప్పటి వారు పార్టీనిగానీ, ప్రధానినిగానీ నిందించదల్చుకోలేదు. లాక్డౌన్ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన భావాలను పరిగణలోకి తీసుకున్నా మనకు కాస్త వాస్తవ చిత్రం మననంలోకి వస్తుంది. లాక్డౌన్ చాలా కఠినంగా ఉందని, అసలు విధించాల్సిందికాదని లోక్నీతి–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వేలో 43.7 శాతం మంది అభిప్రాయపడగా, లాక్డౌన్ కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని, కరోనాను అరికట్టేందుకు మరింత కఠినంగా అమలుచేసి ఉండాల్సిందని 49.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. (బిహార్లో విజయం సాధించిన ప్రముఖులు) లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం ఏదోరకంగా, ఎంతోకొంత ఇబ్బందులు పడ్డామని 90 శాతం మంది ప్రజలు చెప్పగా, తమకు ఎదురైన ఆర్థిక కష్టాల ముందు కరోనా మహమ్మారిని అంతగా పట్టించుకోలేదని, బతికుంటే బలిసాకు తిని బతకవచ్చనే ఆశతోనే సొంతూళ్లకు బయల్దేరి వచ్చామని 44.9 శాతం మంది వలస కార్మికులు తెలియజేశారు. వలస కార్మికుల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని 72.8 శాతం మంది సమర్థించగా, వివిధ రాష్ట్రాలు అనుసరించిన వైఖరిని 76 శాతం మంది సమర్థించారు. అలాగే కరోనా కట్టడికి మోదీ తీసుకున్న చర్యలను 74.7 శాతం మంది ప్రజలు, రాష్ట్రాలు తీసుకున్న చర్యలను 77.7 శాతం మంది ప్రజలు సమర్థించారు. అంటే ‘కరోనా’కు సంబంధించిన ఏ అంశం కూడా ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని అర్థం అవుతోంది. (ఎకానమీ కోలుకుంటోంది కానీ..) గతంలోకన్నా ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం పెరగడానికి కారణం ఏమిటీ? ‘పాలిటిక్స్ ఆఫ్ విశ్వాస్’ అని, నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల ప్రజలకున్న నమ్మకమే ఎన్నికల్లో ప్రభావం చూపిందని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త నీలాంజన్ సర్కార్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎన్నో ఇక్కట్ల పాలైనప్పటికీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చినప్పటికీ 2019 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడానికి ప్రజల విశ్వాసమే కారణమని ఆయన అన్నారు. హిందూ జాతీయవాదం పట్ల ఉన్న విశ్వాసం కూడా విజయానికి దోహదపడగా, మీడియా పట్ల బీజేపీకి ఉన్న పట్టు, సంస్థగతంగా ఆ పార్టీకున్న బలమైన యంత్రాంగం కూడా ఫలితాలను ప్రభావితం చేసిందని సర్కార్ చెప్పారు. -
బిహార్లో విజయం సాధించిన ప్రముఖులు
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు: తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బిహార్లో పెద్దగా మార్పేమీ ఉండదు.. కానీ: పవార్
పుణె: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిదాయకమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మంగళవారం నాటి ఫలితాల వల్ల రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాకపోయినప్పటికీ, సమీప భవిష్యత్తును ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రౌండ్ రౌండ్కు ఫలితాలు తారుమారు అవుతుండటంతో ఎన్డీయే, మహాగట్ బంధన్(ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి) మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ విషయంపై స్పందించిన శరద్ పవార్ పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ- జేడీయూ కూటమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (చదవండి: రానున్న ఎన్నికలకు ట్రైలర్ వంటిది: సీఎం ) ‘‘ఎన్నికల ప్రచారాన్ని గమనించినట్లయితే ఓ వైపు.. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్లు గుజరాత్ను పాలించిన, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. ఆయనతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తే.. మరోవైపు.. ఏమాత్రం అనుభవం లేని తేజస్వి యాదవ్ వంటి యువకుడు సొంతంగా పోరాడాడు. అతడు ప్రదర్శించిన ధైర్యం యువతకు స్ఫూర్తిదాయకం. ఈనాటి ఫలితాలు పెద్దగా మార్పు తీసుకురానప్పటికీ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని ఆశించవచ్చు’’అని పేర్కొన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్పుర్ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గెలుపొందారు.(చదవండి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) -
‘మోదీ విజన్తోనే మెరుగైన ఫలితాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కాషాయ పార్టీ బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ బిహార్లో ఘన విజయం సాధించిందని అన్నారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిపై విస్పష్ట ఆధిక్యం కనబరిచిందని చెప్పారు. చదవండి : కోవిడ్-19 : ప్రపంచానికి భారత్ బాసట ఇక 243 స్ధానాలు కలిగిన బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 123 స్ధానాల్లో ఆధిక్యంతో మేజిక్ మార్క్కు చేరువ కాగా, మహాకూటమి 112 స్ధానాల్లో ముందంజలో ఉండగా ఇతరులు 8 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు యూపీలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆరు స్ధానాల్లో బీజేపీ విజయదుంధుభి మోగించడం పట్ల పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యానాథ్ అభినందించారు. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. -
బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇక బిహార్లో ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్ధానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. మరోవైపు బిహార్లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. -
విపక్షాలు చిత్తు.. బీజేపీ క్లీన్స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఉప ఎన్నికలు జరగుతున్న మొత్తం 8 స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా దూసుకెళుతోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే సిట్టింగ్ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది. ఇక కర్ణాటకలోనూ అధికార బీజేపీ అనుహ్య ఫలితాలను సాధించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆర్ఆర్ నగర్, శిర అసెంబ్లీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఈ రెండు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మరింత పెరుగనుంది. (సీఎం పీఠం నితీష్కు దక్కుతుందా?) దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన మధ్య ప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 6, బీఎస్పీ 1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. బిహార్లోని అధికార ఎన్డీయే కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. జేడీయూ-బీజేపీ నేతృత్వంలోనే కూటమి 130 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమైంది. ఉప ఎన్నికల ఫలితాలు.. యూపీ (7): బీజేపీ 6, ఎస్పీ 1 ఒడిశా (2): బీజేడీ ఆధిక్యం హర్యానా (1): కాంగ్రెస్ ఆధిక్యం జార్ఖండ్ (2): బీజేపీ 1, కాంగ్రెస్ 1 మణిపూర్ (5): బీజేపీ 4, ఇతరులు 1 ఛత్తీస్గఢ్ (1): కాంగ్రెస్ ఆధిక్యం నాగాలాండ్ (2): రెండు స్థానాల్లోనూ ఇతరుల ఆధిక్యం -
బీజేపీ వ్యూహం: సీఎం పీఠం నితీష్కేనా?
పట్నా : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇక అధికారంపై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ పలు చోట్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కోలేకపోయింది. మొత్తానికి పట్నా పోరులో మరోసారి బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఎన్డీయే కూటమి ఊహించని విధంగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే జేడీయూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. (బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) చాణిక్యుడిగా పేరొందిన నితీష్కు ఈసారి బిహార్ ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అర్థమవుతోంది. అయితే కేంద్రంలోని బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానియా బాగానే పనిచేసింది. అంచనాలకు అందకుండా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అనుహ్యమైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం వెల్లడైన ఫలితాల ప్రకారం.. బిహార్ అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం.. ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉండగా.. వాటిల్లో బీజేపీ 75కు పైగా సీట్లులో ఆధిక్యంలో ఉంది. జేడీయూ 50 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే అనుహ్య రీతిలో బీజేపీ పుంజుకోవడం బిహార్ ఎన్నికల్లో ఎవరూ ఊహించలేనిది. అయితే ఫలితాల అనంతరం ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్గా ఎన్నికయ్యారు. అయితే ఫలితాలు తారుమారు కావడంతో పాటు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద పార్టీ అయిన తమకే సీఎం పీఠం దక్కాలని కాషాయ నేతలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. దీనిపై జేడీయూ నేతలు మాట్లాడుతూ... ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా.. నితీష్ కుమార్నే సీఎంగా ఎన్నుకుంటామని తెలిపారు. అయితే ఫలితాల అనంతరం జరిగే పరిణామాలు బట్టి బీజేపీ వ్యూహం మార్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. -
ఎన్డీఏ ముందంజ
-
‘తేజస్వీ బర్త్డే గిఫ్ట్గా సీఎం పీఠం’
పట్నా: బిహార్ రాజకీయాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మరో సారి నితీష్ సర్కార్ అని ఎన్డీఏ కూటమి భావిస్తుండగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు అధికారం ఖాయమని అంచాన వేస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి పీఠం బర్త్డే గిఫ్ట్గా దక్కనుంది అని తెలిపారు. నవంబర్ 9న తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ ఎంతో ఘనంగా తేజస్వీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్ను తిరస్కరించారు. ఉపాధి కల్పన వంటి అంశాల్లో జేడీయూ ప్రభుత్వం ఘోరంగా పరాజయం అయ్యింది. అంతేకాక నితీష్ పాలనలో ఎన్నో స్కాములు జరిగాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఈ సారి మహాఘట్ బంధన్కు ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పక్కన పెట్టండి. మాకు బిహారీల పట్ల నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని మాకు ఇస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. (చదవండి: ఆర్జేడీ కూటమికే జై) కాంగ్రెస్ నాయకుడు కృతి జా అజాద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టిన రోజు కానుకగా ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోబోతున్న తేజస్వీ యాదవ్కు అభినందనలు. ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు జా. ఒకవేళ తేజస్వీ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం ఓ రికార్డు సృష్టిస్తుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు సీఎంలు అయ్యారనే ఘనత దక్కుతుంది. తేజస్వీ కుటుంబంలో ఇప్పటికే ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లీ రబ్రీదేవిలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్ప్ మహాఘట్బంధన్ భారీ విజయం సాధించబోతుందని అంచాన వేశాయి. ఇక ఇప్పటికే 38 జిల్లాలోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మరి కొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్తు ఏంటనే విషయం బయటపడనుంది. -
బిహార్ పీఠం కొత్త తరానిదేనా?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీగా బందోబస్తు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్లోని వాల్మీకినగర్ లోక్సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
ఉత్కంఠ: బీజేపీ వ్యూహం మారుస్తుందా?
పట్నా : ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉన్నా.. విజయంపై ఎవరి ధీమా వారికే ఉంది. కేంద్రంలోని అధికార బీజేపీ ఆశలన్నీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పైనే ఉండగా.. జేడీయూ నేతలు మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ మానియాతో మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. బీజేపీ-జేడీయూ కూటమికి అధికారం దూరం కానుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేతృత్వంలోనే మహాఘట్బంద్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి 125-130 స్థానాలు, బీజేపీ-జేడీయూ 90-100 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గత అనుభవాల దృష్ట్యా బిహార్ ఎగ్జిట్ పోల్స్లో స్వల్ప మార్పులు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాక హంగ్ ఏర్పడే అవకాశం సైతం ఉందన్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ-ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అవకాశవాద రాజకీయ నాయకుడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్కు గుడ్బై చెప్పి.. యువనేతగా బలమైన పార్టీ పునాదులు కలిగిన తేజస్వీ యాదవ్ను తమవైపుకు తిప్పికునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంటూ రోజురోజుకూ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉండలేమన భావన ఆర్జేడీ నేతల్లోనూ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీకే ఎక్కువ సీట్లు ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ మధ్య జరిగిన ఈ పోరులో తాజా ఎగ్జిట్ ఫలితాల ప్రకారం పార్టీల వారిగా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. జేడీయూ గతంలో వచ్చిన సీట్ల కంటే మరింత తక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుంది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీజేపీ-ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బిహార్ కురువృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య, రాజకీయ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంతో పాటు తన తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తేజస్వీ రచించిన వ్యూహంలో భాగంగా ఫలితాల అనంతరం బీజేపీతో జట్టుకట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తేజస్వీతో జట్టుకు బీజేపీ.. గత ఎన్నికల సమయంలో తొలుత బీజేపీకి గుడ్ బై చెప్పి.. ఆ తరువాత లాలూతో కలిసి కొన్ని రోజుల తరువాత వారికీ షాకిచ్చి.. అధికారం కోసం రంగుల మార్చిన నితీష్ను దెబ్బ తీయాలని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు నితీష్పై వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్న క్రమంలోనే మరో దారి చేసుకునేందుకు బీజేపీ నేతలు సైతం సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే తేజస్వీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ను పురిగొల్పి.. జేడీయూ అభ్యర్థులపై పోటీకి నిలిపినట్లు వార్తలు విస్తున్నాయి. ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం బీజేపీ-జేడీయూ కూటమికి ఎంత నష్టమో.. ఆర్జేడీకి అంత లాభం చేకూర్చింది. అయితే మహాఘట్బందన్కు సంపూర్ణ మెజార్టీ లభిస్తే తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా రేకిత్తిస్తున్న బిహార్ తుది తీర్పు కోసం మరికొన్ని గంటలపాటు ఎదురు చూడాల్సిందే. -
ట్రంప్ ఓటమి భారత్కు మంచిదేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడన్ విజయం సాధించడానికి బిహార్ ఎన్నికల ఫలితాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుండగానే బిహార్లో ఆఖరి విడత పోలింగ్ జరిగింది. ఆ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలిందంటే అమెరికా ఎన్నికల ప్రభావం ఉన్నట్లేగదా! అని కొంతమంది ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. (టార్గెట్ బైడెన్ వయా చైనా!) బిహార్ ఆఖరి విడత పోలింగ్ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉందని, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య ‘నువ్వా, నేనా’ అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తోంది. అలాంటప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు బిహార్ పోలింగ్పై ఉండే ఆస్కారమే లేదు. కాకపోతే అమెరికాలోని భారతీయుల్లో మోదీ అభిమానులు, విధేయులు ఎక్కువ మంది ఉన్నందున వారి ఓటు బ్యాంక్ను కొల్లగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ఆశించి ట్రంప్ బోల్తా పడ్డారు. (వైట్హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్తో భార్య మెలానియా) అమెరికాలో ‘హౌడీ మోడీ, భారత్లో నమస్తే ట్రంప్’ పేరిట ఇరువు దేశాధినేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడడం వెనక ఎన్నికల వ్యూహం ఉందనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందర, నవంబర్ 3వ తేదీన అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రలు అనూహ్యంగా భారత్కు వచ్చి ‘2ప్లస్2’ చర్చల్లో భారత్తో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. ప్రవాస భారతీయ ఓట్లను ఆకర్షించడం కోసం ట్రంప్ చేసిన ఆఖరి ప్రయత్నంగా దాన్ని పేర్కొనవచ్చు. బైడన్, కమలా హ్యారిస్లకు ఓటేసిన ప్రవాస భారతీయులందరిని భారత వ్యతిరేకులుగా మోదీ విధేయులు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. వాస్తవానికి మోదీ విధేయులైన భారతీయులు కూడా అమెరికా ఎన్నికల్లో విడిపోయినట్లు, వారిలో ఎక్కువ మంది బైడెన్కు ఓటేయగా, తక్కువ మంది ట్రంప్కు వేసినట్లు అమెరికా ముందస్తు ఎన్నికల సందర్భంగా పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్ సర్వేల్లో చెప్పారు. వచ్చే తరం ప్రవాస భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు రాకపోయినా, వచ్చినా తమకు సంబంధం లేదని, తమకు పన్నులు తగ్గితే చాలనుకున్న మోదీ విధేయుల్లో ఓ వర్గం ట్రంప్కు ఓటేయగా, బైడెన్ అధికారంలోకి వస్తే భారతీయులపై శ్వేత జాతీయులు దాడులు తగ్గుతాయని, పైగా ప్రవాస భారతీయులుకు హెచ్ 1 బీ వీసాలు పెరగుతాయని భావించిన మోదీ విధేయుల్లో మరో వర్గం బైడెన్కు ఓటేశారు. బైడెన్ వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ను కాకుండా పాకిస్థాన్కు మద్దతు ఇస్తారంటూ మత విద్వేషకుల్లో ఓ వర్గం చేసిన ప్రచారం కూడా వారి ముందు పనిచేయలేదు. బైడెన్ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్కు మద్దతిస్తానని చెప్పలేదు. కశ్మీర్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సి వచ్చినప్పుడు తాను కశ్మీరీల పక్షమని బైడెన్ తెలిపారు. అంతమాత్రాన అది పాకిస్థాన్కు మద్దతివ్వడం ఎంతమాత్రం కాదు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం వల్ల భారతీయులుగానీ, ప్రవాస భారతీయులు బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రవాస భారతీయులకుగానీ, భారతీయులకుగానీ జో బైడెన్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, ఆయన ప్రవాస భారతీయులకిచ్చిన హామీలను మరచిపోరాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అమెరికాలోని కొన్ని చట్టాలను సవరించాలి. అందుకు అవసరమైన బలం సెనేట్లో బైడెన్కు లేదు. అలాంటప్పుడు అయన తన హామీలను ఎల నెరవేరుస్తారన్నది మరికొందరి విశ్లేషకుల అనుమానం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. (ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్) -
కార్యకర్తలను హెచ్చరించిన తేజస్వీ యాదవ్
పట్నా: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టిన వేళ తేజస్వి యాదవ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఓట్ల కౌంటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, క్రమ శిక్షణగా మెలగాలని చెప్పారు. తుది ఫలితాలు ఎలా ఉన్నా సహనం పాటించాలని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. బాణాసంచా కాల్చడం, రంగులు పూసుకోవడం, ప్రతిపక్ష పార్టీ వారితో రౌడీ చేష్టలు పనికిరావని అన్నారు. ఇక ఫలితాలు ఎలా ఉన్నా సంయమనం పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పూనుకోవద్దని ఆర్జేడీ ట్విటర్ వేదికగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్- రబ్రీ దేవి పాలనలో బిహార్లో రౌడీ రాజ్యం నడిచిందనే అవపవాదు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తేజస్వీ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ హెచ్చరికలు చేశారు. కాగా, బిహార్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. మంగళవారం (నవంబర్ 10) ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి (మహా ఘటన్ బంధన్) విజయం సాధిస్తే తేజస్వి యాదవ్ బిహార్ సీఎం పదవి చేపట్టనునన్నారు. ఇక బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు గాను మహా ఘటన్ బంధన్ 128 సీట్లు, ఎన్డీఏ కూటమి 99 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 6 స్థానాలు గెలవొచ్చని తెలిపాయి. బిహార్లో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. మరోవైపు క్షేత్ర స్థాయిలో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువగానే సీట్లు సాధిస్తామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి చెప్తున్నారు. -
ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు. చివరి దశకు క్యూ2 ఫలితాలు.... మూడు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, ఐడీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు...! ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్కు ప్రతికూలాంశమని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హేమాంగ్ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్ఎస్సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. అక్టోబర్లో ఈక్విటీల నుంచి ఫండ్స్ భారీ ఉపసంహరణలు... వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) భారీ మొత్తాన్ని విత్డ్రా చేశాయి. అక్టోబర్ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్ నుంచి ఎంఎఫ్లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్ను విక్రయించడమే విత్డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్లు స్టాక్ మార్కెట్లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది. అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారుతుండటంతో ఇన్ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రూ.7,200 కోట్ల ఔట్ఫ్లో ఉందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నుంచి ఔట్ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘ ‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్ ఈవెన్కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ హర్‡్ష జైన్ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్లు విత్డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్ పతనం తర్వాత ఎంఎఫ్ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి తెలిపారు. -
చివరి దశ ఎన్నికల్లో 57.92% పోలింగ్
బిహార్ శాసనసభకు జరిగిన మూడో దశ(చివరి దశ) ఎన్నికల్లో 57.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి రెండు దశల కంటే మూడో దశలో అధికంగా పోలింగ్ జరిగిందని తెలిపింది. చెదురుమదురు సంఘటనలు మినహా శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి దశలో ఉత్తర బిహార్లో 15 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 78 నియోజకవర్గాల్లో 2.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 33,782 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్ణియాలో ఓటింగ్ కేంద్రం వద్ద ఉన్న గుమికూడిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కతిహర్లో రైల్వే క్రాసింగ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేయనందుకు నిరసనగా 12 బూత్లతో జనం ఓటింగ్ను బహిష్కరించారు. జోకిహత్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలామ్ తన చొక్కాకు పార్టీ బ్యాడ్జీని ధరించి ఓటు వేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరగనుంది. శనివారం జరిగిన పోలింగ్తోపాటు తొలి రెండు పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 56.43 శాతం పోలింగ్ నమోదైంది. -
ఆర్జేడీ కూటమికే జై
సాక్షి, న్యూఢిల్లీ/పటా్న: బిహార్లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగuŠ‡బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా.. ఏడాదిన్నర కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహాగuŠ‡బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపించినప్పటికీ హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశాలున్నట్టుగా వివిధ సర్వేలు చూస్తే వెల్లడవుతుంది. నితీశ్కుమార్ వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడుతూ ఉంటే, తన తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఆర్జేడీని బలోపేతం చేశారని, యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై గత ఏడెనిమిది నెలలుగా నితీశ్ సరిగ్గా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆర్థిక అంశాలు, నిరుద్యోగితపై ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో సఫలీకృతుడయ్యారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ సహా ఆరు పార్టీల కూటమి అయిన గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్(జీడీఎస్ఎఫ్) ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేకపోయిందన్నాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలి ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ప్రశ్నకు 44 శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని స్పష్టంగా చెప్పారు. నితీశ్కుమార్ సీఎం కావాలని 35% మంది కోరుకుంటే, దివంగత నాయకుడు రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 7% మంది, ఉపేంద్ర కుష్వా ముఖ్యమంత్రి కావాలని 4% మంది ఆశించారు. బిహార్లో తన తండ్రి మాదిరిగా కులాల చట్రంలో పడి కొట్టుకుపోకుండా కొత్త తరహా రాజకీయాలకు తేజస్వీ యాదవ్ తెరతీశారని ఇండియా టుడే విశ్లేíÙంచింది. మధ్యప్రదేశ్లో చౌహాన్ సర్కార్ సురక్షితం! మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు శివరాజ్సింగ్ సర్కార్పై ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 16–18, కాంగ్రెస్కి 10–12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్తక్ సర్వే కాంగ్రెస్కు 16–18, బీజేపీకి 10–12స్థానాలు వెల్లడించింది. యువతరం ప్రతినిధి తేజస్వి 30 ఏళ్ల వయసున్న తేజస్వి తనని తాను యువతరానికి ప్రతినిధిగా ఒక ఇమేజ్ సంపాదించడమే కాకుండా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారానికి కొత్త రూపు కలి్పంచారని ఇండియా టుడే అభిప్రాయపడింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ హామీ ఇవ్వడమే కాకుండా, లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కారి్మకుల కష్టాలపైనే ఆయన ఎన్నికల ప్రచారంలో దృష్టి సారించారు. అధికార నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలను పట్టుకొని వాటినే పదే పదే ప్రస్తావిస్తూ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వలస కారి్మకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుపేద మధ్య తరగతి వర్గాలన్నీ ఈసారి తేజస్వీ యాదవ్ వైపే ఉన్నట్టుగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ముస్లిం, యాదవ్లు అంటూ కులాల వారీగా మద్దతు కూడగట్టుకోకుండా కష్టాల్లో ఉన్న వారి అండని సంపాదించడానికి తేజస్వి ప్రయత్నించారు. తేజస్వి ప్రచార సభలకి జనం వెల్లువెత్తడం, ఆవేశపూరితంగా ఆయన చేసే ప్రసంగాలు ఎన్నికల ఫలితాల్ని మార్చబోతున్నాయని ఇండియా టుడే విశ్లేíÙంచింది. -
బిహార్లో ముగిసిన 3వదశ పోలింగ్
-
బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బిహార్లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది. కాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. పట్నా,నలందాతోపాటు వాయువ్య భోజ్పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో వెల్లడైంది. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇక బిహార్ లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఖ్య 25 శాతం. లింగ నిష్పత్తితోపాటు కుల,మత, వయస్సుల వారీ సమాన ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది.(చదవండి: జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు) పీపుల్స్ పల్స్- పీఎస్జీ సర్వే: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020 ముఖ్యాంశాలు బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యలు నిరుద్యోగం (31%), ధరల పెరుగుదల (28%), వలసలు (19%), వరదలు (12%), ఎంఎస్పీ (9%) మరియు ఇతర సమస్యలు (1%) తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. 10 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను ఆకట్టుకుంది. ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపారు. భూమిహార్ల సామాజికవర్గంసహా ఉన్నత కులాల ఓటర్లు సైతం గణనీయమైన సంఖ్యలో జేడీ (యూ)కి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో పెద్దగా పని చేయని దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ప్రభావం. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించింది. పాట్నా, నలందాతోపాటు వాయువ్య భోజ్పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం. పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు గండి కొట్టిన తిరుగుబాటు, స్వతంత్ర్య అభ్యర్ధులు. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పీపుల్స్ పల్స్: మహాగట్ బంధన్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం పీపుల్స్ పల్స్: జేడీయూ+ 90-110 ఆర్జేడీ+ 100-115 ఎల్జేపీ 3-5 ఇతరులు 8-18 టైమ్స్ నౌ - సీ ఓటర్ : ఆర్జేడీ కూటమికే మొగ్గు ఎన్డీఏ 116 మహాకూటమి 120 ఎల్జేపీ 1 ఇతరులు 0 ఇండియా టుడే సర్వే: మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు మధ్యప్రదేశ్: బీజేపీ 16-18, కాంగ్రెస్ 10-12, బీఎస్పీ 0-1 మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం సీట్లు కాంగ్రెస్కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం సీట్లు ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో 7 స్థానాలకు- బీజేపీ 5-6, ఎస్పీ 0-1, బీఎస్పీ 0-1 బిహార్ 2015 ఫలితాలు ఆర్జేడీ- 80, జేడీయూ- 71, బీజేపీ- 53 2015లో అధికారంలోకి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమి ఏడాదిన్నర తర్వాత కూటమి నుంచి బయటికొచ్చిన నితీష్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరదశ పోలింగ్ నేడు జరుగుతుంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. జేడీయూకి ఓటు వేసినందుకుగాను ఆర్జేడీ కార్యకర్తలు ఓ మధ్యవయసు వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి జేడీయూకు ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన మాధేపూరలో చోటు చేసుకుంది. వీడియోలోని పెద్దాయన తాను బాణం గుర్తుకు ఓటు వేశానని చెప్పడంతో ఆర్జేడీ కార్యకర్తలు తనని చితకబాదారని తెలిపాడు. ‘ఆర్జేడీ అంటే బిహార్లో గూండారాజ్యం అని అర్థం’ అంటూ వీడియోని ట్వీట్ చేశారు అమిత్ మాల్వియా. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆర్జేడీ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ ఓటర్లకు డబ్బు పంచుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘బిహార్లో ఓడిపోతానని బీజేపీకి అర్థమయ్యింది. అందుకే డబ్బులు పంచుతుంది. కానీ ఇది బిహార్ సార్. మీరు డబ్బుతో బిహారీలను కొనలేరు’ అంటూ వీడియోని ట్వీట్ చేసింది. (చదవండి: ‘నితీష్కు ముందే ఆ విషయం అర్థమైంది’) ఇక బిహార్లో నేడు చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు 2.35 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
నితీష్ కుమార్ ఇక ఇంటికే :పాశ్వాన్
పట్నా : మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ సిద్ధమైంది. చివరి దశలో మొత్తం 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ ప్రారంభమైంది. తుది దశలో మెత్తం 2కోట్ల 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ఘాటు వ్యాక్యాలు చేశారు. మరోసారి నితీష్ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. తాను సాధారణ స్థాయి నుంచి వచ్చి పనిచేశానని, పార్టీ కోసం ఒంటరిగా కృషి చేస్తున్నానని అన్నారు. గడిచిన రెండు దశల ఎన్నికలను పరిశీలిస్తే నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి కారని అన్నారు. రాబోయే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుందని, ప్రతి ఒక్కరికీ దీని గూర్చి తేలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. ఓటర్లు అంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని నేను కోరారు. గత 15 సంవత్సరాల కంటే బిహార్ రాబోయే ఐదేళ్ళు మెరుగ్గా ఉండటానికి ఇదే అవకాశమని ఆయన అన్నారు . -
బిహార్లో ముగిసిన 3వదశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 5 గంటల వరకూ 53.24 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. 78 నియోజకవర్గాల్లో 1,204 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు సిద్ధమయ్యారు. ఇక నేడు బరిలో దిగిన వారిలో అసెంబ్లీ స్పీకర్తో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. ఈనెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగతుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఉదయం 9 గంటల వరకు 7.6 శాతం పోలింగ్ నమోదు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్ పూర్తి మొత్తం 1,23,799 మంది పురుషులు, 12,06,378 మంది మహిళల ఓటర్లు నువ్వా నేనా అన్న రీతిలో ఎన్డీఏ- మహాకూటమి మధ్య కొనసాగుతున్న బీహార్ ఎన్నికల సమరం తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం నితీష్ కుమార్ ఎన్నికల బరిలో జేడీయూ తరఫున అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌధరీ, పన్నెండు మంది మూడో దశలో మజ్లిస్ ప్రభావం కోసి-సీమాంచల్ ప్రాంతంలో భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు పలువురు అభ్యర్థులను నిలిపిన మజ్లిస్ పార్టీ -
నేడే బిహార్లో తుది విడత పోలింగ్
పట్నా: బిహార్లో తుది విడత ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, దాదాపుగా 2.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మూడో విడత కీలకంగా ఒవైసీ ఈ విడత జరిగే ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఎన్డీయే, మహాఘట్బంధన్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో పాటుగా అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం, మాయావతికి చెందిన బీఎస్పీ, ఉపేంద్ర కుష్వా ఆర్ఎల్ఎస్పీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తమ పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కోసి–సీమాంచల్ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోనే తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ ఏడాది వరదలతో అతలాకుతలమవుతూ సారో ఆఫ్ బిహార్గా పేరు పడిన కోసి ప్రాంతంలో ముస్లింలు, యాదవులు, అత్యంత వెనుకబడిన వర్గాల కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో 30% జనాభా ముస్లింలే. దీంతో ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ చాలా సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన ఉధృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అత్యధిక నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో ఎలాగైనా పట్టు సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ర్యాలీలోనూ బిహార్ అభివృద్ధి చెందాలంటే నితీశ్ కుమార్ సీఎం కావాలని ఆయన పేరే జపించారు. బిహార్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు.. విషమం
పట్నా : మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిహార్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హయ్గ్ఘ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రవీంద్రనాథ్ అలియాస్ చింటూ సింగ్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున దర్భంగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తుపాకీ తుటాలకు గురైన అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దర్భాంగా మెడికల్ కాలేజీల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. ఘటనపై దర్యాప్తుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాయని.. విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. (మోదీలా ట్రంప్ చేయలేకపోయారు) గతంలో జేడీయూలో కొనసాగిన రవీంద్ర ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన ప్రత్యర్థులు ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా బిహార్లోశనివారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. దీంతో నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ట్రంప్ ఘోర వైఫల్యం : జేపీ నడ్డా
పట్నా : ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ మేజిక్ మార్క్ సమీపానికి చేరుకున్నారు. విజయానికి మరో ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. తాజా ఫలితాలపై రిపబ్లిక్ పార్టీ అభిమానులతో పాటు డొనాల్డ్ ట్రంప్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్రంప్ వైఫల్యాల కారణంగానే తాజా ఫలితాల్లో రిపబ్లికన్లు వెనుకబడ్డారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా సమయంలో ఆయన అనుసరించి విధానాలు అమెరికన్లు విశ్వాసాన్ని కోల్పోయారని చెబుతున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై భారత్లోనూ ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తోందోనని ఆసక్తికరంగా ఎదురుచుస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజా ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ‘కరోనా సమయంలో భారత్లో నరేంద్ర మోదీ చేయగలిగిన పనిని అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేయలేకపోయారు. మోదీ ఎంతో ప్రణాళికా బద్ధంగా కోవిడ్ను ఎదురుర్కొన్నారు. ప్రజలను, దేశాలన్ని సురక్షితంగా కాపాడారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా విపత్తును ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమైంది. ఆ దేశంలో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలను కోల్పోయారు. దాని ప్రభావం తాజా ఎన్నికలపై చూపింది. అంతిమంగా ట్రంప్ వెనుకంజకు దారితీసింది’ అని అన్నారు. బిహార్ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశంలోని 130 కోట్ల జనాభా భద్రత మోదీ చేతిలో క్షేమంగా ఉందన్నారు. బీజేపీ-జేడీయూ విజయం బిహార్ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. -
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్
పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్లో ముస్లిం మైనార్టీలు నితీశ్ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది. బిహార్ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ బిహార్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. -
‘నితీష్కు ముందే ఆ విషయం అర్థమైంది’
పట్నా : తనకు ఇవే చివరి ఎన్నికలు అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. బీహార్ రాష్ట్రాన్ని సీఎం నితీష్ అభివృద్ధిపథంలో నడపలేరని ముందు నుంచే తాము చెబుతున్నామని, ఇనాళ్లకు ఆయనే ఆ నిజాన్ని ఒప్పకున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామనే విషయం ముందే గ్రహించి సీఎం నితీష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు. (చదవండి : పూర్ణియా సభలో నితీష్ సంచలన ప్రకటన) కాగా, గురువారం పూర్ణియా జిల్లా దాందహా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం నితీష్ మాట్లాడుతూ..బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. బిహార్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్( అక్టోబర్ 28, నవంబర్ 3) ముగియగా, చివరి దశ పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. (చదవండి : ‘నితీశ్ తలవంచక తప్పదు’) -
ఇవే నా చివరి ఎన్నికలు : నితీష్ కుమార్
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం కీలక ప్రకటన చేశారు.బిహార్ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు నితీష్ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!) 'బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. ఇప్పటికే బిహార్లో రెండు దశల పోలింగ్ ముగియగా.. ఆఖరిదైన మూడో దశ నవంబర్ 7న జరగనుంది. కాగా బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. (చదవండి : నితీష్ పాలనను వ్యతిరేకిస్తున్నారు : చిరాగ్) -
‘నితీశ్ తలవంచక తప్పదు’
పాట్నా: ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నితీశ్కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందు తలవంచకతప్పదు అని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వన్ అన్నారు. గురువారం చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ, నువ్వు( సీఎం నితీశ్ కుమార్) ఏ ప్రధానితో అయితే ఎప్పుడు గొడవపడుతూ, విమర్శిస్తూ ఉంటావో ఇప్పుడు నీ కోసం ఓట్లు అడగమని అతని ముందే తల దించావు. దీన్ని బట్టే నీకు ముఖ్యమంత్రి పదవి అన్న, ఆ అధికారం అన్న ఎంత ఆశ ఉందో అర్ధం అవుతోంది. నవంబర్ 10 తరువాత నువ్వు తేజస్వీ యాదవ్ ముందు తలవంచక తప్పదు’ అని అన్నారు. ఇప్పటికే బిహార్లో మూడవదశ పోలింగ్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షంపై తూటాలు ఎక్కు పెట్టింది. ఫైనల్ దశ పోలింగ్ శనివారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో పరాగ్ కేంద్రప్రభుత్వంతో నితీశ్ వ్యతిరేకించిన విషయాలను చర్చించారు. ఆర్టికల్ 370, సీఏఏ విషయంలో నితీశ్ విబేధించారని అయితే ఇప్పుడు ఎన్నకల సమయంలో మద్దతు కోసం నితీశ్ కేంద్రప్రభుత్వంతో ఉన్న విబేధాలను మర్చిపోయారని మండిపడ్డారు. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా నితీశ్ బిహార్ను అభివృద్ధి పరచలేదని విమర్శించారు. నితీశ్ కుమార్ ఇప్పటి వరకు ఐదు సార్లు బిహార్కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. చదవండి: సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ.. -
కాంగ్రెస్కు 100 మంది ఎంపీలైనా లేరు
ఫోర్బ్స్గంజ్/సహస్ర: పార్లమెంటులోని ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీకి వంద మంది కూడా సభ్యులు లేరని ప్రధాని మోదీ హేళన చేశారు. ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం మోదీ ప్రచారసభల్లో మాట్లాడారు. బిహార్లో నితీశ్ సీఎం అయ్యాక అభద్రతా భావం మచ్చుకైనా కనిపించడం లేదని కితాబునిచ్చారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని వారికి అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీని శిక్షిస్తున్నారని మోదీ చెప్పారు. ప్రజాగ్రహం కారణంగానే పార్లమెంటు ఉభయ సభల్లో వారి ఎంపీల సంఖ్య 100 కంటే తక్కువకి పడిపోయిందని అన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని, రైతులు రుణ మాఫీ చేస్తామని, రిటైర్డ్ సర్వీస్మెన్కు వన్ ర్యాంకు, వన్ పెన్షన్ వంటి అమలు చేయని హామీల కారణంగా ఆ పార్టీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోందని అన్నారు. సోమవారం వెలువడిన రాజ్యసభ ఫలితాల్లో 11 స్థానాలకు గాను బీజేపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి ఎగువ సభలో తన బలాన్ని 92కి పెంచుకుంటే, కాంగ్రెస్ బలం 38కి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా రెండు సభల్లోనూ కలిపి కేవలం 89 మంది సభ్యులు ఉండడంతో మోదీ కాంగ్రెస్ని హేళన చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. -
బిహార్లో 54.64% పోలింగ్
పట్నా/భోపాల్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో 54.64 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. రెండు దశల్లో కలిపి 53.79 ఓటింగ్ శాతానికి పైగా నమోదైనట్లు తెలిపింది. మంగళవారం జరిగిన ఈ పోలింగ్లో దాదాపు 2.85 కోట్ల ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ ఫగు చౌహాన్, సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 జిల్లాల్లో 94 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఓటర్ టర్నౌట్ యాప్లో పేర్కొన్న వివరాల ప్రకారం ముజఫర్çపూర్లో అత్యధికంగా 54.89 శాతం ఓట్లు పోలయ్యాయి. నితీశ్పై ఉల్లిపాయలు.. హార్లఖి నియోజకవర్గంలో ప్రచారసభలో సీఎం నితీశ్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు పెరిగిన ఉల్లి ధరలపై నిరసనగా ఆయనపై ఉల్లిపాయలు విసిరారు. అయితే అవి నితీశ్పైకి రాకముందే నేలపై పడ్డాయి. భద్రతా బలగాలు వారిని పట్టుకోబోతుండగా నితీశ్ వారించారు. మధ్యప్రదేశ్లో 69.93 శాతం పోలింగ్.. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్లో పలు ఉద్రిక్తత ఘటనల నడుమ కొనసాగిన∙అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్లో 69.93 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 28 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో కొందరు తుపాకులను ఉపయోగించడంతో, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్ నియోజకవర్గంలో అత్యధికంగా 81.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లో 77, గుజరాత్లో 58.58, హరియాణాలో 69.43, జార్ఖండ్లో 62.51, ఒడిశాలో 70, నాగాలాండ్లో 84.41, ఉత్తరప్రదేశ్లో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. -
సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ..
-
సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ..
పాట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. మధుబన్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం నితీష్కుమార్పై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరి యువకులు నిరసన వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ ఫెయిల్యూర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ బిహార్కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉద్యోగాల విషయం గురించి మాట్లాడగానే ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో స్టేజ్ మీద ఉన్నప్పుడే నితీశ్కు కోపం వచ్చింది. ఇంకా విసరండి అంటూ పదే పదే అన్నారు. ఇంతలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాళ్లు తగలకుండా అడ్డుగా నిలిచారు. రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని ఏం చేయొద్దని క్షమించి వదిలేయాలని నితీశ్ అన్నారు. ఇక నితీశ్పై దాడి చేయడం ఇదేమీ తొలిసారి కాదు 2018లో నందన్ అనే గ్రామంలో దళితులు, మహిళలపై దాడుల నేపథ్యంలో నితీశ్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగిన ఈ దాడి ఎన్నికల ఫలితాలపై ఏవిధంగా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది. బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10వ తేదీన విడుదల కానున్నాయి. చదవండి: నితీష్కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్ -
నితీష్ ఇంకెప్పుడూ సీఎం కాలేరు : చిరాగ్
పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్కు ఇదే చివరి ఎన్నికలని లోక్జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. బిహార్లో నేడు (మంగళవారం) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తన ట్వీట్లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత నితీష్జీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారని అర్థమైందని అన్నారు. ‘నితీష్ ఫ్రీ బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు. బిహార్లో మొత్తం 243 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 27న మొదటి దశ ఎనికలు పూర్తి కాగా, నవంబర్ 3న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. -
తొలిసారి ఓటు వేయడం కోసం..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశ పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. 17 జిల్లాలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ యువతి పలువురు దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం కోసం సదరు యువతి సైకిల్ మీద తన బామ్మతో కలిసి పట్నా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు వచ్చిన తర్వాత మొదటిసారి దాన్ని వినియోగించుకున్నాను. మా బామ్మతో కలిసి ఓటు వేయడానికి వచ్చాను. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది. (చదవండి: నితీష్కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్) బిహార్ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేటి పోలింగ్లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. -
నితీష్కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్
పట్నా : బిహార్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరిగింది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్ ముగిసింది. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు. నేటి పోలింగ్లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్డేట్స్ గుజరాత్లో 8 స్థానాలకు కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్ ఉదయం 10గంటల వరకు 11.52 శాతం పోలింగ్ నమోదు ఎల్జేపీ చీఫ్ చిగార్ పాశ్వాన్ తన ఓటు హక్కును వినిమోగించుకున్నారు నితీష్కు ఇదే చివరి ఎన్నిక, మరోసారి ఆయన సీఎం కాలేరు : చిరాగ్ పాట్నా రాజేంద్రనగర్లో ఓటేసిన డిప్యూటీ సీఎం సుశీల్కుమార్ మోదీ పాట్నాలో ఓటుహక్కు వినియోగించుకున్న తేజస్వీ యాదవ్, రబ్రీదేవి మధ్యప్రదేశ్లో ఉదయం 9 గంటల వరకు 10.81 శాతం పోలింగ్ నమోదు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిఘాలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజధాని పట్నాలో ఉదయం 9.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రోసిరా పరిధిలోని 133,134 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా నేతలు పట్టించుకోవడంలేదని ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బిహార్తో పాటు 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ -28 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ -8, ఉత్తరప్రదేశ్ -7 స్థానాలకు ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశా, నాగాలాండ్, కర్ణాటక, జార్ఖండ్లో రెండేసి స్థానాలకు, ఛత్తీస్గఢ్, తెలంగాణ (దుబ్బాక), హర్యానాలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. -
నేడు బిహార్లో రెండో దశ ఎన్నికలు
పట్నా: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహామహులు బరిలో నిలిచిన ఈ రెండో దశను బిహార్ ఎన్నికల్లో కీలక దశగా భావిస్తున్నారు. అధికార ఎన్డీయే అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, సీఎం నితీశ్సహా కీలక నేతలు, విపక్ష మహా కూటమి కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీ, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వీ సహా ముఖ్యమైన నాయకులు ప్రచారం నిర్వహించారు. 17 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 94 అసెంబ్లీ స్థానాలకు నేడు(మంగళవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1.35 కోట్ల మహిళా ఓటర్లు సహా మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు సుమారు 1500 అభ్యర్థుల భవితను నిర్దేశించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా కాంగ్రెస్ తరఫున బంకీపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జిల్లా నలందలోని ఏడు స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నలంద జిల్లాలో జేడీయూ బలంగా ఉంది. రెండోదశ ఎన్నికలు జరుగుతున్న 94 సీట్లలో విపక్ష కూటమి తరఫున 56 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్ మరికొన్ని స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అధికార ఎన్డీయే నుంచి బీజేపీ 46 స్థానాల్లో, జేడీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎల్జేపీ 52 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు కీలకం నేడు 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. సీఎం చౌహాన్కు సవాలుగా మారిన ఎన్నికలివి. కాంగ్రెస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కమల్ సర్కారు కూలడం తెల్సిందే. ఆ 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గుజరాత్(8), కర్నాటక(2), చత్తీస్గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ(1)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!
సాక్షి, న్యూఢిల్లీ : సుదీర్ఘ కాలం పాటు దేశంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారికి గత కొన్ని సంవత్సరాలుగా కలసి రావడం లేదు. 24 సంవత్సరాల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగిన పవన్ కుమార్ చామ్లింగ్ 2019 అధికారం నుంచి దిగిపోయారు. అంతకంటే ఏడాది ముందు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ గద్దె దిగారు. 2018, డిసెంబర్లో కూడా చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులయిన రామన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2020 సంవత్సరంలో చౌహాన్ మళ్లీ పదవిలోకి వచ్చారు. అది వేరే విషయం. (డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి) 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (2014లో కొన్ని నెలలు మినహా) ఎదురు లేకుండా అధికారంలో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నారు. నవీన్ పట్నాయక్ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్న బిహార్లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ? అన్న విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. (నితీష్ స్కాం 30 వేలకోట్లు : మోదీ) ఈ ఏడాది మొదట్లో కూడా ఎన్నికల సందడి కనిపించలేదు. బీజేపీ మద్దతుతో జేడీయూ గెలుస్తుందని, మళ్లీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారులే అన్న మాటలే చప్పగా వినిపించాయి. నితీష్ కుమార్ పార్టీని విమర్శిస్తూ వచ్చిన లోక్జనశక్తి పార్టీ, బీజేపీతో చేతులు కలపడంతో ముఖ్యమంత్రిగా నితీష్ ఈసారి తప్పుకోవడం తప్పనిసరని అందరూ భావించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని నితీష్ కుమార్కు మద్దతు ప్రకటించడంతో రాజీ కుదిరిందనుకున్నారు. కానీ నితీష్ ఫొటోలు లేకుండా బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండడం, ప్రధాని మోదీ పోస్టర్లతో హోర్డింగ్లు ఏర్పాటు చేయడం, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ను బీజేపీ నాయకులు ఇప్పటికీ ప్రశంసించడం చూస్తుంటే నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. (తొలి దశ ఓటింగ్ 54.26%!) మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్తో కలసి పోటీ చేస్తోన్న ఆర్జేడీ కూడా నితీష్ కుమార్ లక్ష్యంగాన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్, మోదీకి బదులు నితీష్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఆయన విస్తృత ఎన్నికల ప్రచారానికి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడం కూడా నితీష్ భవితవ్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ సారి బిహార్ ఎన్నికలు నితీష్ పనితీరుకు రిఫరెండమ్ అని చెబుతున్నారు. (నితీష్ని ఇరకాటంలో పడేసిన మోదీ) -
డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి
సమస్థిపూర్/చప్రా/మోతీహరి/బగహ: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచార గడవు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్య్టటన చేశారు. నాలుగు వరుస బహిరంగ సభల్లో విపక్ష నేతలపై వాడి విమర్శలతో దండెత్తారు. పశ్చిమ చెంపారన్ జిల్లాలోని బగహలో రెండో దశ ఎన్నికల ప్రచార చివరి సభలో ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రచార సభల్లో మాదిరిగానే ఆదివారం నాటి ప్రచారంలోనూ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు. ఈ సారి తేజస్వీయాదవ్తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిపి.. ‘వారిద్దరూ జంగిల్ రాజ్ కోసం కృషి చేస్తున్న డబుల్ యువరాజులు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజులు రాష్ట్రాన్ని లాంతర్ల కాలం నుంచి విద్యుత్ వెలుగుల వైపు తీసుకువచ్చిన ఎన్డీయే డబుల్ ఇంజిన్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ‘ఇద్దరు యువరాజుల్లో ఒకరు కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లో ఒక కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతా తిరిగారు. ఆ కూటమి అక్కడ మట్టికరిచింది. జాగ్రత్త.. ఆ యువరాజు ఇప్పుడు బిహార్కు వచ్చాడు. ఇక్కడి ఆటవిక రాజ్య యువరాజుకు మద్దతిస్తున్నాడు. వీరికి వ్యతిరేకంగా డబుల్ ఇంజిన్ అభివృద్ధితో దూసుకుపోతున్న ఎన్డీయే మరోవైపుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఆ డబుల్ యువరాజుల ఏకైక లక్ష్యం వారి రాచరికాలను కాపాడుకోవడమే’నన్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజా ప్రచారంలో వివాదాస్పద అంశాలైన అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం .. మొదలైన వాటిని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూకశ్మీర్ ఆందోళనలతో అట్టుడుకిపోతుందని, అక్కడి నదుల్లో రక్తం పారుతుందని కొందరు అమాయక ముఖాలతో భయపెట్టారు. కానీ ఆ ఆర్టికల్ను రద్దు చేస్తూ మేం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుని అవినీతి రహిత పాలనతో అభివృద్ధి వైపు దూసుకువెళ్తున్నారు’ అన్నారు. బిహార్ విపక్ష మహా కూటమిలో సీపీఐఎంఎల్ భాగస్వామి కావటాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఆటవిక పాలనకు కారణమైన వారు ఇప్పుడు నక్సలిజం మద్దతుదారులతో, తుక్డే తుక్డే గ్యాంగ్తో చేతులు కలుపుతున్నారు’ అని పేర్కొన్నారు. ముగిసిన ప్రచారం బిహార్లోని 17 జిల్లాల్లో విస్తరించిన 94 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ఆదివారంతో ముగిసింది. వీటిలో మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ముఖ్యమైనవి. జ్యోతిరాదిత్య సింధియా అనుచరులైన ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు పాల్పడటంతో అక్కడ కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, శివరాజ్సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ సర్కారు ఏర్పాటైన విషయం తెలిసిందే. మెజారిటీ సాధించేందుకు ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 9 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ(7), గుజరాత్(8), ఛత్తీస్గఢ్(1), హరియాణా(1), జార్ఖండ్(2), కర్ణాటక(2), ఒడిశా(2), నాగాలాండ్(2), తెలంగాణ(1) ఉన్నాయి. -
ఉచిత వ్యాక్సిన్ హామీ కోడ్ ఉల్లంఘన కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఉచిత వ్యాక్సిన్ వాగ్దానం వివక్షా పూరితమైనదనీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తేల్చింది. పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను చేపట్టవచ్చునని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెపుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ప్రజాసంక్షేమం కోసం ఇలాంటి వాగ్దానాలు చేయడంలో అభ్యంతరం ఉండదని ఈసీ పేర్కొంది. ఆచరణాత్మకమైన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో తప్పు లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రణాళికలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్దిష్ట ఎన్నికల సందర్భాల్లో విడుదల చేస్తుంటారని ఈసీ తెలిపింది. అయితే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉచిత వ్యాక్సిన్ వాగ్దానాన్ని ఒక్క బిహార్ రాష్ట్ర ప్రజలకే ఇస్తానని పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ విస్మరించడం ఆశ్చర్యంగా ఉందని గోఖలే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర మంత్రి నిర్మల విడుదల చేశారు. వ్యాక్సిన్ని బిహార్ ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉన్న విషయమని, ఇది కేవలం బిహార్కే పరిమితమని, దేశం మొత్తానికి వర్తించదని బీజేపీ తెలిపింది. ప్రధాని బయోపిక్ విడుదల ఉల్లంఘన కాదు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ను విడుదల చేయడం నిబంధనావళి ఉల్లంఘనగా పరిగణించలేమని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సెప్టెంబర్ 25వ తేదీన ప్రకటించగా బయోపిక్ను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారని అందులో పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ఈ సినిమా గత ఏడాది మేలోనే రిలీజ్ అయినందున ఉల్లంఘన కిందకు రాదంటూ స్పష్టత ఇచ్చింది. -
కరోనా వ్యాక్సిన్ ఉచితం : ఈసీ క్లీన్ చిట్
-
కరోనా వ్యాక్సిన్ ఉచితం : ఈసీ క్లీన్ చిట్
సాక్షి, పట్నా: ఎక్కడ చూసినా ప్రస్తుత ఎన్నికల పోరులో కరోనా వ్యాక్సిన్ ఉచితం అనేది ఓటర్లకు బంపర్ ఆపర్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడటంతో వివాదం రాజుకుంది. దీనిపై సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త ఈసీని ఆశ్రయించారు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచిత హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టం చేసింది. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఉల్లంఘన కిందకు రాదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. టీకా విధానం ఇంకా నిర్ణయించబని క్రమంలో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని ఆరోపిస్తూగోఖలే ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. అక్టోబర్ 28 న గోఖలేకు కమిషన్ ఇచ్చిన సమాధానంలో మూడు విషయాలను ప్రస్తావించింది. రాజ్యాంగానికి, విరుద్దంగా, కించపర్చేదిగా, ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీసేలా, విఘాం కలిగించేలా లేదా ఓటరుపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలు ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఆర్జేడీ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్ను ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించాయి. కరోనా మహమ్మారిని బీజేపీ రాజకీయం చేస్తోందని, ప్రజల భయాలతో ఆడకుంటోందని మండిపడ్డాయి. అలాగే మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా అని దుయ్యబట్టాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన ముగిసింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, చివరి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 10 వెలువడనున్నాయి. -
‘ఎన్నికల కమిషన్ బీజేపీలో ఓ శాఖ’
ముంబై: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఎన్నికల కమిషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆర్జేడీ చీఫ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అన్నారు. (చదవండి: కాంగ్రెస్కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్) అంతేకాక ఎన్నికల వేళ బిహార్లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్ రౌత్. ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు పంకజా ముండే శివసేనలో చేరారనే పుకార్లపై సంజయ్ రౌత్ తనకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. బిహార్ మొదటి దవ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30 న 71 స్థానాలకు ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 55.69 శాతం ఓటర్లు నమోదయ్యాయి. రెండవ దశ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరగనుంది. -
నితీష్ స్కాం 30 వేలకోట్లు : మోదీ
పట్నా : తొలి విడత పోలింగ్ ముగియడంతో రెండో విడత సమరానికి బిహార్ రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. శనివారం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జేడీయూ ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. కేవలం అధికారం కోసమే ఇరు పార్టీలు జట్టుకట్టాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికలో సమయంలో నితీష్పై మోదీ ఆరోపణలు చేసిన ఓ వీడియోను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. నితీష్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘నితీష్ హాయంలో బిహార్ మరింత వెనుకబడుతోంది. జేడీయూ పాలనలో అవినీతి తారా స్థాయికి పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఐదేళ్ల పాలనలో నితీష్ కుమార్ 60 స్కాములకు పాల్పడ్డారు. వాటి విలువ దాదాపు 30 వేలకోట్లు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటిపై విచారణకు ఆదేశిస్తాం’ అంటూ మోదీ ఆరోపించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ,ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. (ఆటవిక రాజ్య యువరాజు) బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్.. వారితో బంధానికి ముగింపు పలికి మహా కూటమితో చేతులు కలిపారు. అనంతం కొంత కాలనికే కూటమితో తెగదెంపులు చేసుకుని మరోసారి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే నితీష్ను ఇరుకున పెట్టేందుకు తేజస్వీ గత వీడియోను బయటపెట్టారు. ఇదీ నితీష్ స్వరూపం అంటూ ఆర్జేడీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. -
మళ్లీ సహనం కోల్పోయిన నితీష్
పట్నా: ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. తన ప్రత్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై మరోసారి పదునైన బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. మహాకూటమి తరపున ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. తేజస్వియాదవ్ 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట కేవలం బోగస్ అని నితీశ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం పర్భట్టాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 15 ఏళ్లపాటు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ముఖ్యమంత్రులుగా పనిచేశారని, అప్పుడు బిహార్ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని నితీష్ కుమార్ విమర్శలు కురిపించారు. వారి హయాంలో కేవలం 95,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ఆర్జేడీ చెప్పేదంతా బోగస్ మాటలేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి కూడా నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు, 15లక్షల ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చింది. ఈ విషయాన్ని ఐదోసారి బిహార్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న నితీశ్ కుమార్ మర్చిపోయారేమో అని కొంత మంది రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో ఉద్యోగ ప్రకటన కీలక పాత్ర పోషించనుంది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు నవంబర్10వ తేదీన వెలువడనున్నాయి. చదవండి: ప్రచార పర్వం : వేదిక కూలడంతో కిందపడిన కాంగ్రెస్ అభ్యర్థి -
ప్రచార పర్వం : వేదిక కూలడంతో కిందపడిన కాంగ్రెస్ అభ్యర్థి
పట్నా : బిహార్లోని దర్బంగాలో ప్రచార వేదిక కూలిపోవడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న జేల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మాని కిందపడిపోయారు. ఉస్మాని సహా వేదికపైన ఉన్నవారంతా స్టేజ్ కూలిపోవడంతో కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైన సమాచారం వెల్లడికాలేదు. ఈ ఘటనకు సంబంధించి బయటకువచ్చిన వీడియోలో ఉస్మాని మాస్క్ లేకుండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కనిపించారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ ఎంఎల్, సీపీఎం, సీపీఐలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాకూటమిగా జట్టు కట్టి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తలపడుతోంది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ ఇప్పటికే ముగియగా, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో మలి, తుది విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి : ఆటవిక రాజ్య యువరాజు -
ఆటవిక రాజ్య యువరాజు
దర్భంగ/ముజఫర్పూర్/పట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ను ‘ఆటవిక రాజ్య యువరాజు(జంగిల్రాజ్ కే యువరాజ్)’ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. బిహార్ బీమారు రాష్ట్రంగా మారడానికి కారణమైన ఆర్జేడీకి మళ్లీ అధికారమిస్తే కరోనాతో పాటు మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ప్రధాని హెచ్చరించారు. ఆర్జేడీ చేసిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఎద్దేవా చేస్తూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల విషయం మర్చిపోండి. వాళ్లు గెలిస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. బలవంతపు వసూళ్లకు భయపడి కంపెనీలను మూసేసుకుంటారు. ఆ పార్టీకి ఇక్కడ కిడ్నాప్లపై కాపీరైట్ ఉంది’ అన్నారు. బిహార్ను దుష్పరిపాలన నుంచి సుపరిపాలన వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడిపించారని ప్రశంసించారు. జేడీయూ నేత నితీశ్ను ‘ప్రస్తుత, భవిష్యత్ ముఖ్యమంత్రి’ అంటూ సంబోధించారు. నితీశ్ పాలనలో బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దర్భంగ సభలో మాట్లాడుతూ సీతామాత జన్మించిన మిథిలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ రామాలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విమర్శించిన వారంతా.. ఇప్పుడు తప్పని సరై మా నిర్ణయానికి చప్పట్లు కొడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిహార్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధుల వైపు రాష్ట్రాభివృద్ధిని కోరుకోని దురాశాపూరిత శక్తులు ఆశగా చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్, రబ్రీదేవీల ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్న కుల ఘర్షణలను ప్రధాని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసం, గందరగోళంతో కూడిన విధానాలు వారివని ఆరోపించారు. ప్రతీ ప్రసంగం ప్రారంభంలో ప్రధాని స్థానిక మాండలికంలో మాట్లాడి, స్థానికులైన మహనీయులను గుర్తు చేసి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్భంగలో మైథిలి కవి విద్యాపతిని గుర్తు చేశారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం బాధాకరం: రాహుల్ గాంధీ
పట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై దాడిని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొనసాగించారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి ప్రధాని ఎక్కడా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వలస కూలీల వెతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి ముఖ్యమంత్రి నితీశ్ పాలనే కారణమని మండిపడ్డారు. రాహుల్ ప్రసంగిస్తుండగా.. ‘మోదీ మమ్మల్ని పకోడీలు అమ్ముకోమన్నారు’ అంటూ ఒక వ్యక్తి గట్టిగా అరిచారు. దాంతో, ‘ఈ సారి మోదీజీ, నితీశ్జీ మీ వద్దకు వచ్చినప్పుడు వారికి పకోడీలు చేసిపెట్టండి’ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. కేంద్రం తీసుకువచ్చి న వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాహుల్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దసరా సందర్భంగా పంజాబ్లోని రైతులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయడం తనను బాధించిందన్నారు. ‘సాధార ణంగా దసరా రోజు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. కానీ ఈ సారి, బహుశా తొలిసారి ఒక ప్రధాని దిష్టిబొమ్మను తగలపెట్టారు’ అన్నారు. ‘ఈ వార్త మీ వరకువచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మోదీజీ, నితీశ్జీ మీడియాను నియంత్రిస్తుంటారు’ అని విమర్శించారు. రాహుల్పై ఈసీకి ఫిర్యాదు బిహార్లో తొలి దశ పోలింగ్ జరుగుతున్న రోజు కాంగ్రెస్కు ఓటేయాలని ట్వీట్ చేయడం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని కోరుతూ బిహార్ లీగల్ సెల్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. -
తొలి దశ ఓటింగ్ 54.26%!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ముగిసింది. మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 54.26% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అన్ని కేంద్రాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తరువాతే కచ్చితమైన ఓటింగ్ శాతం వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఈ జిల్లాల్లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54.75% పోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో మొత్తంగా ఓటర్ల సంఖ్య సుమారు 2.15 కోట్లు కాగా, అభ్యర్థులు 1000కి పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ.. సమయం గడుస్తున్న కొద్దీ పెరిగింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ మాజీ సీఎం, హెచ్ఏఎం అధ్యక్షుడు జితన్ రామ్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలి దశ ఎన్నికలు జరిగిన 71 స్థానాల్లో 35 స్థానాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు. ఈ స్థానాల్లో పోలింగ్ను మధ్యాహ్నం 3 గంటలకే ముగించారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు సంతృప్తికరంగా ఉందని, అత్యంత స్వల్ప స్థాయిలో ఇబ్బందులు తలెత్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. 2015లో ఐదు దశల్లో.. ప్రాథమిక సమాచారం మేరకు.. తొలిదశలో అత్యధిక ఓట్లు బంకా జిల్లాలో పోలయ్యాయి. అక్కడ 59.57% పోలింగ్ నమోదైంది. 2015లో ఈ జిల్లాలో నమోదైన ఓటింగ్ శాతం 56.43. అలాగే, ముంగర్ జిల్లాలో అత్యల్పంగా 47.36% మాత్రమే ఓటింగ్ జరిగింది. 2015లో ఇక్కడ 52.24% ఓటింగ్ నమోదైంది. 2015లో మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగగా, ఈ సారి 3 దశల్లోనే ఎన్నికలు ముగుస్తున్నాయి. 2015లో తొలి దశలో 10 జిల్లాల్లో విస్తరించిన 49 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 2015 నాటి తొలి దశ ఎన్నికల్లో 54.94% పోలింగ్ జరిగినట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. కాల్పులపై తీవ్ర నిరసన ముంగర్ కాల్పుల ఘటనపై విపక్షాలు బిహార్లో నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నితీశ్ పాలను బ్రిటిష్ రాజ్ తరహాలో ఉందని విమర్శిస్తూ, ముంగర్ కాల్పుల ఘటనను జలియన్వాలా బాగ్ కాల్పులతో పోల్చాయి. ముంగర్లో సోమవారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు సందర్బంగా ఘర్షణలు జరగడంతో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ లిపి సింగ్ ముఖ్యమంత్రి నితీశ్కు సన్నిహితుడైన ఆర్సీపీ సింగ్ కూతురు కావడంతో విపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెంచాయి. -
స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్మతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. "ఓ ప్రకటన చేసే క్రమంలో నేను పదాల కోసం వెతకడం చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. It is rare for me to search for words while making an announcement; hence here’s me keeping it simple — I’ve tested positive for #COVID and would request those who came in contact with me to get themselves tested at the earliest 🙏 — Smriti Z Irani (@smritiirani) October 28, 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్మృతి ఇరానీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. గత వారం ఆమె బిహార్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. గోపాల్గంజ్, ముంజర్, బోధ గయా, దిఘా వంటి ప్రాంతాల్లో దాదాపు 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్మృతికి కరోనా పాజిటివ్గా తేలడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఆందోళనకు గురవుతున్నారు. -
బిహార్లో ముగిసిన తొలి దశ పోలింగ్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత 71 స్ధానాలకు పోలింగ్ బుధవారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 52.24 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ జరిగిన 71 స్ధానాల్లో ఆర్జేడీ 42 మంది అభ్యర్ధులను బరిలో దింపగా, జేడీయూ తరపున 35, బీజేపీ 29, కాంగ్రెస్ 21, సీపీఐ-ఎంఎల్ 8, హెచ్ఏఎం ఆరుగురు అభ్యర్ధులను బరిలో నిలిపాయి. ఇక ఇతర పార్టీల తరపున ఆర్ఎల్ఎస్పీ నుంచి 43, ఎల్జేపీ 41, బీఎస్పీ నుంచి 27 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. సోమవారంతో ముగిసిన తొలి విడత పోలింగ్ ప్రచారంలో పలు పార్టీల తరపున అగ్రనేతలు, సీనియర్ నేతలు ప్రచార పర్వాన్ని వేడెక్కించారు. ఇక జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాలుగోసారి అధికార పీఠంపై కన్నేశారు. బీజేపీతో కలిసి ముందుకు సాగుతుండగా ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి మహాకూటమిగా జట్టుకట్టాయి. నితీష్ సర్కార్పై నెలకొన్న అసంతృప్తి తమకు అనుకూలిస్తుందని మహాకూటమి ఆశలు పెట్టుకుంది. ఇక కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేశారు. మరోవైపు కోవిడ్ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది గూమిగూడకుండా ఒక్కో పోలింగ్బూత్కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించారు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేశారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. చదవండి : బిహార్ ఎన్నికలు: ‘అత్యాచారం చేసి చంపేసేవారు’ -
అత్యాచారం చేసి చంపేసేవాడు: అమీషా పటేల్
ముంబై: బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఒకానొక సమయంలో తనపై అత్యాచారం చేసి చంపేస్తారేమో అని భయపడ్డానని తెలిపారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ జన్శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరఫున బిహార్లోని దౌద్నగర్లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవటానికి.. క్షేమంగా బయటపడటానికి వారు చెప్పినట్లు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ని విడుదల చేశారు. తనకు ఎదురయిన భయానక అనుభావాలను ఓ పీడకలగా వర్ణించారు అమీషా పటేల్. (చదవండి: ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!) ఈ సందర్భంగా అమీషా మాట్లాడుతూ.. ‘దౌద్ నగర్లో ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతడు నన్ను బెదిరించాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. నిన్న సాయంత్రం ముంబై వచ్చాక కూడా అతడు బెదిరింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేశాడు. తన గురించి గొప్పగా మాట్లాడాలని కోరాడు. అతని వల్ల నిన్న సాయంత్రం నాకు ఫ్టైట్ మిస్ అయ్యింది. దాంతో అతడు నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. తను చెప్పినట్లు వినకపోతే అక్కడే వదిలేసి వెళ్తానని బెదిరించాడు. ఆ సమయంలో అతడు చెప్పినట్లు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడు.. చంపేసేవాడు. నా కారును అతడి మద్దతుదారులు అడ్డగించేవారు. అతడి మాట వినేంతవరకు నా కారును కదలనిచ్చేవారు కాదు. అతడు నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు ఇది అతడి ఆపరేటింగ్ సిస్టం’ అంటూ అమీషా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) అయితే ఈ వ్యాఖ్యలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె కార్ షో కోసం అన్ని రకాల భద్రతా నిబంధనలు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నేను గెలవాలనుకున్నాను. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్ ర్యాలీ నిర్వహించారు. దౌద్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అమీషా పటేల్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించిన సంఘటనలు ఏవి జరగలేదు. బిహార్లో ఆర్టిస్టులు లేరా.. సోనాక్షి సిన్హా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్ను కలిశారు. వారు 15 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు” అని తెలిపాడు. అంతేకాక తనకు అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్ ఎక్కువ డబ్బు కోరినట్లు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ‘నా డ్రైవర్ ఈ రోజు అమీషా పటేల్ పీఏతో మాట్లాడాడు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం ఆమె 10 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఆమెకు ఇక్కడ పూర్తి రక్షణ లభించింది. అమీషా ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి’ అన్నారాయన. -
బిహార్లో ముగిసిన తొలి దశ పోలింగ్
-
పొగుడుతూనే చురకలంటించిన ప్రధాని
-
నితీష్ని ఇరకాటంలో పడేసిన మోదీ
పట్నా: బిహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మిథిలా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ ప్రస్తావన తీసుకువచ్చి.. నితీష్ కుమార్పై పరోక్ష విమర్శలు చేశారు. వెంటనే ఆయన పాలనలో బిహార్ బాగా అభివృద్ధి చెందింది అంటూ పొగిడారు. వివరాలు.. బిహార్లో రెండో రోజు ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి నితీష్తో కలిసి హజరయ్యారు మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శతాబ్దాల తపస్సు తర్వాత చివరకు అయోధ్యలో ఒక గొప్ప రామ మందిరం నిర్మిస్తున్నాం. గతంలో ప్రతిపక్షాలు ఈ విషయంలో మమ్మల్ని ‘మందిర నిర్మాణం ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. తేదీ చెప్పండి’ అంటూ ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు వారు కూడా ప్రశంసించవలసిన పరిస్థితి. బీజేపీ-ఎన్డీఏ కూటమి గుర్తింపు ఇదే. చెప్పింది చేయగల సత్త మాకు ఉంది. ఈ రోజు మాత సీత తన జన్మస్థలం మిథిలాతో పాటు అయోధ్య వైపు కూడా ఆనందంగా చూస్తుంది’ అన్నారు మోదీ. (చదవండి: తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం) అయితే మందిర నిర్మాణం గురించి మోదీ చేసిన వ్యాఖ్యలు నితీష్ కుమార్ని ఉద్దేశించే చేశారని భావిస్తున్నారు. ఎందుకంటే 2015 ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్తో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలో మందిర నిర్మణాన్ని ఉద్దేశిస్తూ.. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రామ్ లల్లా మేం అధికారంలోకి వస్తాం.. మందిరాన్ని నిర్మిస్తాం.. కానీ ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేము అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అంటూ నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నేడు మోదీ ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం నితీష్ కుమార్పై కూడా విమర్శలు చేశారు. (చదవండి: బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం!) ఆ తర్వాత వెంటనే నితీష్పై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. గత 15 సంవత్సరాలలో నితీష్ జీ నాయకత్వంలో బిహార్ ఎంతో అభివృద్ధి సాధించింది అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నితీష్ జీ ఎంతో కృషి చేశారని తెలిపారు. అలానే భావి ముఖ్యమంత్రి అంటూ నితీష్ను పిలిచారు. గత వారం మరో ఉమ్మడి ర్యాలీలో, ఆర్టికల్ 370 పై నితీష్ కుమార్ ప్రత్యర్థులు తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్లు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మోదీ. "ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. కానీ (తేజస్వీ యాదవ్)వారు అధికారంలోకి వస్తే తిరిగి తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేసిన తరువాత వారు బిహార్ నుంచి ఓట్లు అడగడానికి ధైర్యం చేస్తున్నారు. దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దులకు పంపే రాష్ట్రానికి ఇది అవమానం కాదా" అని మోదీ ప్రశ్నించారు. (చదవండి: లాలూకి బెయిల్.. నితీష్కు ఫేర్వల్) ఈ రోజు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభం అయ్యింది. 71 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తదుపరి రెండు రౌండ్లు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. నవంబర్ 10 న ఫలితాలు వెలువడతాయి. -
బిహార్ తొలిదశ పోలింగ్ ప్రారంభం
-
కరోనా కాలంలో తొలి అసెంబ్లీ ఎన్నికలు
పట్నా: కరోనా కాలంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు బిహారీలు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. చిన్నచిన్న అపశ్రతులు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 33.10 శాతం పోలింగ్ నమోదయినట్టు సమాచారం. కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేశారు. కోవిడ్ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది గూమిగూడకుండా ఒక్కో పోలింగ్బూత్కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించారు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేస్తున్నారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. 71 అసెంబ్లీ స్థానాల్లో 33 స్థానాలను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, పోటీలో నిలిచిన అభ్యర్థులతో పాటు ప్రముఖ నాయకులు అందరూ ఆలయాలను, ప్రార్థనాలయాలను దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. లఖిసరాయ్లోని బారాహియాలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామంలో ఎన్నికలు అనేవి పండుగ లాంటివనిపేర్కొన్నారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాంకేతిక లోపాల కారణంగా షికాపురాలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ గయాలో ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ జరుగుతున్న 71 స్థానాల్లో ఎన్డీఏ 50 చోట్ల గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కోవిడ్ నిబంధనలు మరవొద్దు: ప్రధాని ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బిహారీలకు ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓటర్లు పరస్పరం రెండు గజాల భౌతిక దూరం పాటించాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. -
నేడు బిహార్లో మొదటి దశ పోలింగ్
పట్నా: నేడు బిహార్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఒక్కో పోలింగ్బూత్కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించింది. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేయనుంది. ఓటర్లు, సిబ్బందికి మాసు్కల ధారణ తప్పనిసరి చేసింది. అభ్యర్థుల్లో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. వీరిలో జేడీయూ తరఫున 35 మంది, బీజేపీ తరఫున 29 మంది పోటీ చేయనున్నారు. ఆర్జేడీ తరఫున 42 మంది, కాంగ్రెస్ తరఫున 20 మంది బరిలో దిగనున్నారు. ఎల్జేపీ 41 చోట్ల పోటీ చేస్తుండగా, జేడీయూ పోటీ చేస్తున్న 35 చోట్లా అభ్యర్థులను నిలిపింది. కేబినెట్ మంత్రుల్లో 6 మంది ఈ దశలో బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న, ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. -
‘పది లక్షల ఉద్యోగాల కల్పనపైనే తొలి సంతకం’
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే తన ప్రాధాన్యతా కార్యక్రమమని స్పష్టం చేశారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాలను కల్పించే ఫైల్పై తొలి సంతకం చేస్తామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగిస్తూ తమ ప్రభుత్వం బిహార్ అసెంబ్లీలో తీర్మానం చేపడుతుందని చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంశాలవారీగా ప్రచారపర్వంలో ముందుకెళతామని మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తెలిపారు. పలు నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కవని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. నవంబర్ 10న బిహార్లో నూతన చరిత్ర ఆవిష్కృతమవుతుందన్నారు. నితీష్ కుమార్ 15 ఏళ్ల పాలనలో ఉపాధి, విద్య, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ రంగాలను తాము పునరుద్ధరిస్తామని అన్నారు. ఇక అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బిహార్ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా? -
బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28వ తేదీన మొదటి విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 3, ఏడవ తేదీల పోలింగ్తో ఈ ఎన్నికలు ముగుస్తాయి. నవంబర్ పదవ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 2005 నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న జేడీయూ నాయకుడు నితీష్ కుమార్కు ఈసారి ప్రజా వ్యతిరేకత పెరిగింది. మద్య నిషేధ చట్టం (బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం –2016)ను ప్రవేశ పెట్టడం కూడా ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అక్రమంగా రాష్ట్రంలోకి మద్యాన్ని తీసుకొస్తున్న స్మగ్లర్లకన్నా మద్యం సేవించిన వారిని, మద్యం కలిగి ఉన్న ప్రజలను అరెస్ట్ చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2020, ఆగస్టు నెల వరకు 1580 రోజుల్లో రోజుకు సగటున 190 మంది చొప్పున 3,06 ,000లక్షల మంది మద్యం ప్రియులను రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. వారిలో 66, 657 మంది ఎక్సైజ్ సిబ్బంది కూడా ఉన్నారు. (లాలూకి బెయిల్.. నితీష్కు ఫేర్వల్ ) మద్య నిషేధ చట్టం కింద అరెస్టయిన 3,06 లక్షల మందిలో 90 శాతం మంది దళితులు, మహా దళితులే ఉన్నారు. రాష్ట్రంలోకి ఏరులై పారుతున్న అక్రమ మద్యాన్ని అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్న బిహార్ అధికారులు అన్యాయంగా వాటిని మూడింతలు ఎక్కువ ధరలకు మద్యం కొంటున్న వినియోగ దారులను అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా పాశవికమైన ఈ మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఆరేజేడీ, మూడు వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేస్తోంది. నితీష్ కుమార్ జేడీయూతో కలసి బీజేపీ పోటీ చేస్తోంది. మద్యం ప్రియులు బాహాటంగా నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని నితీష్ విమర్శలు గుప్పిస్తున్నారు. (ఉల్లి ధరలపై వినూత్న నిరసన ) -
ఉల్లి ధరలపై వినూత్న నిరసన
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు రెండు రోజుల ముందు రాష్ట్రంలో ఉల్లి ధరలపై రాజకీయాలు ఘాటెక్కాయి. ఉల్లి ధరల పెరుగుదలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఉల్లిగడ్డలతో తయారుచేసిన దండను చేపట్టి తేజస్వి యాదవ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగ సమస్యలతో సామాన్యుడు సతమతమవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, యువత, వ్యాపారులు ఆహారంపై ఖర్చును భరించే స్థితిలో లేరని, చిరు వ్యాపారులను బీజేపీ దెబ్బతీసిందని తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. ఉల్లి దండలతో నిరసన తెలుపుతున్న ఫోటోలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఉల్లి ధర 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉండగా ఉల్లి గురించి మాట్లాడిన వారంతా ఇప్పుడు కిలో 80 రూపాయలు దాటడంతో మౌనం దాల్చారని అన్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలను యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చిన తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఉపాథి కల్పన కీలక అంశమని పునరుద్ఘాటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : ఉచితంగా కోవిడ్ టీకా -
వ్యాక్సిన్: దేశం మొత్తానికి సమాన హక్కులు!
ముంబై: బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడంపై బీజేపీ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వ్యాక్సిన్పై బీజేపీ చేస్తున్న రాజకీయాలను గురించి శివసేన అనుబంధ పత్రిక సామ్నాలో ప్రస్తావిస్తూ.. బిహార్లో బీజేపీ గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటున్నారు. మరి మిగిలిన రాష్ట్రాలు భారత్లో కాకుండా పాకిస్తాన్లో ఏమైనా ఉన్నాయా..?. బిహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. దేశం మొత్తం వైరస్ బారిన పడుతున్నప్పుడు కేవలం అక్కడకు వెళ్లి వ్యాక్సిన్ కోసం బీజేపీని గెలిపించండి అని కరోనా వ్యాక్సిన్పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి' అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్) గతంలో ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో దేశం మొత్తంగా అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని.. దీనికి కులం, మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదు అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకొని బిహార్ ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా మరో రకంగా వ్యాఖ్యానించడం విచిత్రమైన విషయం. బీజేపీకి ఈ విషయంలో ఎవరు మార్గనిర్దేశం చేస్తున్నారు' అంటూ సామ్నా సందపాదకీయంలో విమర్శించింది. ('అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్లా పరిగెడుతోంది') కాగా, శుక్రవారం రోజున ఇదే విషయంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. 'మేం స్కూల్లో చదువుకునే రోజుల్లో 'మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను' అనే నినాదాన్ని వినేవాళ్లం. ఇప్పుడు 'మీరు మాకు ఓటేయండి, మేం మీకు వ్యాక్సిన్ ఇస్తాం' అనే నినాదాన్ని వింటున్నాం. ఆ ప్రకారంగా ఎవరైతే బీజేపీకి ఓట్లు వేస్తారో వాళ్లకే వ్యాక్సిన్ అందుతుంది. ఇది ఆ పార్టీ వివక్షతకు అద్దం పడుతోంది అని సంజయ్రౌత్ పేర్కొన్నారు. -
లాలూకి బెయిల్.. నితీష్కు ఫేర్వల్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. తొలి విడత పోలింగ్కి సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ రణరంగంలో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో పట్నా రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నితీష్ హయాంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని, పేదరికం తాండవిస్తోందని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించి ఓ భారీ బహిరంగ సభలో తేజస్వీ ప్రసంగించారు. (మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) లాలూకి బెయిల్ తన తండ్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, నవంబర్ 9న జైలు నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి బయటకు వచ్చిన వెంటనే నితీష్ పదవి నుంచి దిగిపోక తప్పదని జోస్యం చెప్పారు. సీఎంకు ఇక ఫేర్వల్ ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పశుదాణా కుంభకోణంలో అరెస్ట్ అయిన లాలూ ప్రసాద్.. ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఓ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ.. మరో కేసులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులోనూ బెయిల్ మంజూరు కావడంతో విడుదలకు సిద్ధమయ్యారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరగబోతుంది. నవంబర్ 3న రెండో, 7న చివరి విడత పోలింగ్.. 10న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 17 అంశాలతో మేనిఫెస్టో ఇక తొలి విడత పోలింగ్కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో తేజస్వీ మరింత దూకుడు పెంచారు. ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టోని విడుదల చేశారు. మొత్తం 17 అంశాలతో కూడని మేనిఫెస్టోని విడుదల చేశారు. యువత, నిరుద్యోగులను ఆకర్శించే విధంగా వారిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. మెరుగైన ఆరోగ్య భీమాతో పాటు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నితీష్ కుమార్ తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మరోసారి ప్రజలు మోసం చేయడానికి బీజేపీ-జేడీయూ నేతలు ఉచిత హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు. కూటమికే మెజారిటీ మరోవైపు ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్కుమారే ఇప్పటికీ మెరుగైన సీఎంగా జనం భావిస్తున్నారని చెబుతున్నాయి. ఆయన ప్రభ కాస్త తగ్గినా, కేంద్రంలో నరేంద్ర మోదీ సమర్థపాలన దానికి జవజీవాలు కల్పించిం దని, పర్యవసానంగా ఆ రెండు పార్టీల కూటమి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అంటున్నాయి. నవంబర్ 10న వెలువడే ఫలితాల్లో బిహారీలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కరోనా అనంతరం తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి ఎన్నికలు గనుక దేశ వ్యాప్తంగా వీటిపై సహజంగానే ఆసక్తి నెలకొంది. -
తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం
డెహ్రీ/గయ/భగల్పూర్: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్తస్, గయ, భగల్పూర్ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ వేదికను పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు. గల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు. విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్ సహచరుడు రామ్విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్లకు నివాళులర్పిస్తూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో ఆ చీకటి పాలనను బిహార్ ప్రజలు మర్చిపోలేరన్నారు. సైనికులను ప్రధాని అవమానించారు తూర్పు లద్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో బిహార్కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. -
మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు
ఎన్నికల మేనిఫెస్టో ఒక పార్టీ రాజకీయ దృక్పథానికి, అది అనుసరించే విలువలకు, దాని దూర దృష్టికి ప్రతీకగా వుండాలి. కానీ ఇటీవలకాలంలో అది ఆచరణసాధ్యం కాని ఫక్తు వాగ్దానాల చిట్టాగా మిగిలిపోతోంది. సాధారణ సమయాల్లో ఎన్ని సంక్షోభాలు తలెత్తినా, జనం ఏమైపోయినా ధీర గంభీర మౌనాన్ని ఆశ్రయించే నాయకులు ఎన్నికలు ప్రకటించగానే వాగ్దానకర్ణులుగా మారిపోతారు. మేనిఫెస్టో రాసినప్పుడు వారి చేతికి ఎముక వుండదేమో... అందులో ఎక్కడలేని వాగ్దానాలూ వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఇవి కరోనా అనంతరం తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి ఎన్నికలు గనుక... లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నెన్నో కడగండ్లు చవిచూసిన వలసజీవుల్లో అధికశాతంమంది ఆ రాష్ట్రవాసులే గనుక అందరి దృష్టీ సహజంగానే బిహార్పై పడింది. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్కుమారే ఇప్పటికీ మెరుగైన సీఎంగా జనం భావిస్తున్నారని చెబుతున్నాయి. ఆయన ప్రభ కాస్త తగ్గినా, కేంద్రంలో నరేంద్ర మోదీ సమర్థపాలన దానికి జవజీవాలు కల్పించిం దని, పర్యవసానంగా ఆ రెండు పార్టీల కూటమి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అంటు న్నాయి. మేనిఫెస్టోలు చూస్తే మాత్రం ఆ అభిప్రాయం కలగదు. అవి సమ్మోహనాస్త్రాలను తలపిస్తు న్నాయి. ఎలాగైనా ఓటర్లను లోబర్చుకోవాలన్న తృష్ణ కనబడుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా వాటినిండా లక్షలాది ఉద్యోగాలు సునామీలా తోసుకొస్తున్నాయి. తాము ఎన్నికైతే పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఒకరంటే...19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మరొకరు పోటాపోటీగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తాము అధికారంలో వున్నామన్న స్పృహ కూడా వుండటం లేదు. మరి ఇన్నేళ్లూ ఏం చేశారని ఓటర్లు నిలదీస్తారన్న భయాందోళనలు లేవు. బీజేపీ మేనిఫెస్టో మరొక అడుగు ముందుకేసింది. ‘మేం గెలిస్తే కరోనా టీకా ఉచితమ’ని బిహార్ వాసులను ఊరిస్తోంది. టీకాకు అను మతి రావడమే తరువాయి... దాన్ని ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. కాబట్టి అది ఎప్పుడు వస్తుం దన్న సంగతలా వుంచితే... ఆ వాగ్దానం తీర్చడానికయ్యే వ్యయమెంతో కూడా ఆమెకు తెలిసే మాట్లాడారనుకోవాలి. అందుకు బదులు బిహార్తో సహా దేశమంతా ఆ టీకా ఉచితంగా ప్రజలకు అందించబోతున్నామని చెప్తే ఆచరణ మాటెలావున్నా కనీసం వినడానికి బాగుండేది. కేవలం బిహా ర్కు మాత్రమే అనడం వల్ల అది అనైతికమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఉచితం మాటెలావున్నా నిపుణులు చెబుతున్న ప్రకారం టీకా రావడానికి ఇంకా చాన్నాళ్లు పట్టేలా వుంది. ఈలోగా సభలకొచ్చే జనాన్ని భౌతిక దూరం పాటించేలా చేయడంలో కూడా పార్టీలు విఫలమవుతున్నాయి. ఏ సభ చూసినా ఈ ఎన్నికల హోరుకు జడిసి కరోనా మాయమైందా అన్న సంశయం కలుగుతోంది. ఏడెనిమిదేళ్లక్రితం పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు విలువైన వ్యాఖ్యానం చేసింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేలా హామీలు గుప్పించడం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తిని దెబ్బతీయడమేనని దాని సారాంశం. 2011లో డీఎంకే, అన్నా డీఎంకేలు పోటాపోటీగా చేసిన వాగ్దానాలు చూసి, రోజురోజుకూ అవి శ్రుతిమించిన వైనం గమనించి చిర్రెత్తుకొచ్చిన తమిళనాడు వాసి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ వ్యాఖ్య చేసింది. కమ్మని వాగ్దానాలను కట్టు దాటించడంలో తెలుగుదేశం అధి నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరారు. 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి ఎన్నిటినో ఉచితంగా ఇస్తానని ఊరించారు. అది ఏ స్థాయికి చేరిందంటే ఆయనకు అప్పట్లో ‘ఆల్ ఫ్రీ బాబు’ అన్న పేరు కూడా వచ్చింది. 2014లో ఆ పార్టీ మేనిఫెస్టో చేసిన వాగ్దానాలకు అంతులేదు. అవి ఏ స్థాయిలో వున్నాయంటే... నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలనాటికి ఆ మేనిఫెస్టో ఆచూకీ లేకుండా పోయింది. ఆన్లైన్లోగానీ, టీడీపీ కార్యాలయాల్లోగానీ అది ఎవరి కంటా పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. మళ్లీ రంగంలోకి కొత్త వాగ్దానాలు గుదిగుచ్చి సరికొత్త మేనిఫెస్టో తీసుకొస్తే 2019లో జనం ఆ పార్టీని తిరస్కరించారు. అది వేరే కథ! మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం కింద 12 రకాల వ్యాక్సిన్లు ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. పోలియో నియంత్రణకిచ్చే టీకా ఉచితంగా లభించకపోతే దేశంనుంచి దాన్ని తరమడం ఇప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆ మాదిరే కరోనా టీకా కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామంటే బిహార్ వాసులు సంతోషించేవారు. దేశవ్యాప్తంగా బిహారీలు పనిచేస్తుంటారు గనుక ఈ దేశంలో తాము విడదీయరాని భాగమన్న స్పృహ వారికి దండిగావుంటుంది. అలాగే ఈ కరోనా మహమ్మారి విజృంభణ పర్యవసానంగా తమ కళ్లముందే అనేకులు రాలిపోతుండటం చూసి కుంగుబాటులోవున్న దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ఎంతో ఊరటనిచ్చేది. రేపో, మాపో అది రాబోతోందన్న భరోసా ఏర్పడేది. వాగ్దానం బిహారీలకు పరిమితమై వుండటం వల్ల ఇతరులకు అది ఉచితంగా లభించదేమోనన్న సంశయం కలుగుతుంది. కనీసం నితీష్కుమార్ ఆ వాగ్దానం చేసివుంటే ముఖ్యమంత్రిగా ఆయన బిహారీల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోదల్చుకున్నా రన్న అభిప్రాయం కలిగేది. ఎటూ నితీష్ ఎన్డీఏ భాగస్వామి గనుక ఆయన గెలుపు బీజేపీకి, నరేంద్రమోదీకి కూడా గెలుపే అవుతుంది. అలాగని ఉచిత వాగ్దానాలన్నిటినీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు. సంక్షేమ రాజ్యం ఇరుసుగా పనిచేసే ప్రజాస్వామ్యంలో పేద వర్గాలకు ఉచితంగానో, సబ్సిడీతోనో అందుబాటులోకి తీసుకురావాల్సిందే. కానీ చేసే ఎలాంటి వాగ్దానమైనా బాధ్యతాయు తమైనదిగా వుండాలి. తాము ఇస్తున్న హామీలు ప్రజలకు ఎలాంటి సందేశం మోసుకెళ్తాయో గ్రహిం చాలి. అవి వారి ఉన్నతాశయానికి అద్దంపట్టాలి. వారి దూరదృష్టికి సంకేతంగా నిలవాలి. -
'అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్లా పరిగెడుతోంది'
పట్నా: ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే కూటమి తరపున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం నాడు సాసరమ్లో జరిగిన తొలి ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచింది. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించే ఉంటే అనూహ్యమైన కల్లోలం జరిగుండేది. అయితే నేడు బీహార్ ప్రజలు కోవిడ్పై పోరాడి, ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నారు. (ఉచితంగా కోవిడ్ టీకా) 2014 తర్వాత బిహార్లో అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్లా పరిగెడుతోంది. కరోనా కాలంలో పేదల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేశాం. ఈ మధ్య కాలంలో మరణించిన బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్విలాస్ పాశ్వాన్, రఘువంశ్ ప్రసాద్ సింగ్కు నివాళులర్పించారు. గాల్వన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పాదాభివందనం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి మొత్తం 12 సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 -
ఉచితంగా కోవిడ్ టీకా
పట్నా: బిహార్లో ప్రజలకు ఉచితంగా కోవిడ్–19 వ్యాక్సిన్ను అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం లభించగానే కోవిడ్–19 వ్యాక్సిన్ను ఒకసారి ఉచితంగా అందిస్తామన్నారు. ‘‘కరోనాపై పోరాటంలో బిహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. ఐసీఎంఆర్ వ్యాక్సిన్కి అనుమతినివ్వగానే ప్రజలకు ఉచితంగా అందిస్తాం’’అని నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. భారత్లో మూడు టీకాలు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయని, అవి విజయవంతమైతే భారీగా టీకా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి భారత్ సన్నద్ధంగా ఉందని అన్నారు. వ్యాక్సినేషన్కు అనుమతిరాగానే బిహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. యువతకు 19 లక్షల ఉద్యోగాలు బీజేపీతోనే భరోసా అన్న ట్యాగ్లైన్తో రూపొందించిన ఎన్నికల హామీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న ఇమేజ్ను పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేశారు. వచ్చే అయిదేళ్లలో యువతకి 19 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విపక్షాల దాడి కరోనా మహమ్మారిని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ అంశంలో ఎన్నికల సంఘం పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూడాలా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలన్నీ కోవిడ్ వ్యాధిని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఉచిత వ్యాక్సిన్ హామీపై భగ్గుమన్న విపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అజెండా కోసం వ్యాక్సిన్ను వాడుకుంటారా అని రాజకీయ ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి..? బీజేపీకి ఓటు వేయని భారతీయులకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా లభించదా అంటూ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. కాగా కోవిడ్-19 వ్యాక్సిన్ విస్తృత స్ధాయిలో అందుబాటులోకి రాగానే బిహార్లోని ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రకటించారు. చదవండి : బిహార్ ఎన్నికలు: ఇదే బీజేపీ మొదటి హామీ సోషల్ మీడియాలోనూ బీజేపీ వ్యాక్సిన్ హామీపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ వ్యాక్సిన్ హామీని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. బీజేపీ తన పార్టీ నిధులతో ఈ వ్యాక్సిన్లు అందిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నుంచి వీటిని అందచేస్తే బిహార్ ప్రజలకే ఉచితంగా అందించి మిగిలిన దేశ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ సైతం ఉచిత వ్యాక్సిన్ హామీని ఎద్దేవా చేశారు. మాకు ఓట్లు వేస్తే మీకు వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, విపక్షాల విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశమని వివరణ ఇచ్చింది. -
ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!
పట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 1064 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 16 జిల్లాల్లోని 71 శాసన సభ స్థానాలకు జరుగుతున్న మొదటి దశ పోలింగ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) సంపన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ 1064 మందిలో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ. కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: బిహార్ 2020: ప్రధాన మహిళా అభ్యర్థులు) అత్యధికంగా ఆర్జేడీ నుంచి ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆర్జేడీ నుంచి పోటీపడుతున్న 41 మంది అభ్యర్థులో 39 మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, ఎల్జేపీ 30(41), బీఎస్పీ 12(26), 14(21) మంది అభ్యర్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. అదే విధంగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్లో బరిలోకి దిగిన ఒక్కో అభ్యర్థి సగటున 1.99 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది. (తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్) ఆయనే సంపన్న అభ్యర్థి ఇక వీరందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ 68 కోట్ల రూపాయల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచినట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడిన ఆయన, ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ గుర్తు మీద రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన గజానంద్ షాహి(షేక్పురా) రూ. 61 కోట్ల ఆస్తి కలిగి ఉండి రెండోస్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరి తర్వాత మనోరమా దేవి(జేడీయూ) రూ. 50 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. -
బిహార్ ఎన్నికలు: ఇదే బీజేపీ మొదటి హామీ
పాట్నా : ‘ పాంచ్ సూత్ర, ఏక్ లక్ష్య, 11 సంకల్ప’ పేరిట బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్లో కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ పూర్తయి, పెద్ద మొత్తంలో ఉత్పత్తి మొదలవగానే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ను అందిస్తామని చెప్పారు. ఇదే తమ మొదటి ఎన్నికల హామీగా ఆమె పేర్కొన్నారు. బిహార్ ప్రజలకు రాజకీయ విషయాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందని, పార్టీలు ఇచ్చే హామీలను వారు అర్థం చేసుకోగలరన్నారు. ఎవరైనా తమ పార్టీ మేనిఫెస్టోపై ప్రశ్నలు సంధిస్తే ఆత్మవిశ్వాసంతో బదులివ్వగలమని, అదే విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగలమని స్పష్టం చేశారు. ( అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే ) బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని మరికొన్ని కీలక హమీలు : 1) రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు. 2) మూడు లక్షల ఉపాద్యాయ ఉద్యోగాలు. 3) ఆరోగ్య రంగంలో లక్ష ఉద్యోగాలు. 4) ఐటీ హబ్గా బిహార్ అభివృద్ధి . 5) తొమ్మిది, పై తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు. 6) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి ఉచిత ఇళ్లు. 7) ఇతర రాష్ట్రాలలో మృత్యువాత పడ్డ వలస కూలీ కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా. 8) దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం. -
తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్
పట్నా: లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బుధవారం పార్టీ ప్రణాళికను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ పక్కన లేకుండా విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అడవిని చీల్చుకుంటూ పులి పిల్ల నెమ్మదిగా బయటకు వస్తుందని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నేడు నేను అదే పని చేశాను. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనేదే మా సిద్ధాంతం. 4 లక్షల మంది ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని రూపొందించిన మేనిఫెస్టో ఇది. విద్య, ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున యువత రాష్ట్రాన్ని వీడి వెళ్తున్నారు. రాష్ట్రంలో అభవృద్ధి కార్యక్రమాలు కుంటుపడిన కారణంగా వలసలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నివారించి స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పలు అంశాలు రూపొందించాం’’ అని పేర్కొన్నారు.(చదవండి: నా చెల్లెలు వంటిది, గెలిపించండి: చిరాగ్) అదే విధంగా, ఉద్యోగార్థులు- సంస్థల మధ్య అనుసంధానం కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పారద్రోలుతామని హామి ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కరువుకాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడే విధంగా, కెనాళ్ల ద్వారా నదుల అనుసంధాన ప్రక్రియ చేపడాతమని చిరాగ్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత రాజస్తాన్లోని కోటా, ఢిల్లీలోని ముఖర్జీ నగర్, ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వంటి కోచింగ్ సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. (చదవండి: ‘పాదాలకు నమస్కరించినా పట్టించుకోలేదు’) వీటితో పాటు లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా గ్రామ పంచాయతి ప్రధాన కేంద్రాలు, మార్కెట్లతో పాటు ఇతరత్రా ప్రధాన బ్లాకులన్నింటిలో వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా ఈనెల 28న బిహార్లో తొలి విడత అసెంబ్లీ పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ నేడు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. -
సీఎం అభ్యర్థిపై చెప్పులు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్ని జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలతో నాయకులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆగంతకులు ఆయన మీదకు చెప్పులు విసిరారు. వివరాలు.. ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చారు తేజస్వీ. సభా వేదికపై కూర్చుని ఉండగా.. ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి మాత్రం తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే తేజస్వీపైకి చెప్పులు ఎవరు విసిరారో.. ఎందుకు వేశారో మాత్రం తెలియలేదు. (చదవండి: హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ) ఈ ఘటన అనంతరం తన ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే ఈ ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్ తివారీ ఖండించారు. ఎన్నికల ప్రచార సమయంలో నేతలకు సరైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ కూటమి తలపడుతుంది. మొత్తం 243 స్థానాలకు గాను 144 చోట్ల ఆర్జేడీ తన అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
మళ్లీ ఎన్డీయేకే అధికారం
న్యూఢిల్లీ: బిహార్లో మరోసారి నితీశ్ సారథ్యంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని లోక్నీతి–సీఎస్డీఎస్ చేపట్టిన ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. అక్టోబర్ 10–17 తేదీల మధ్య జరిపిన ఈ ప్రీ–పోల్ సర్వే బిహార్లోని 7 కోట్ల ఓటర్ల నాడిని కనిపెట్టే ప్రయత్నం చేసింది. సీఎం పీఠంపై నితీశ్కుమార్నే ఉంటారని ఈ సర్వే అంచనా వేసింది. అదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పారీ్టల మహాఘఠ్బంధన్కు మెజారిటీకి తక్కువగా సీట్లు దక్కుతాయని వెల్లడైంది. దివంగత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ సారథ్యంలోని ఎల్జేపీకి 2 నుంచి 6 వరకు సీట్లు వస్తాయని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పాలన సంతృప్తి వ్యక్తం చేయగా, 61 శాతం మంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. నితీశ్కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు 31 శాతం మంది అభిప్రాయపడగా 34 శాతం మంది కొత్త నేత కావాలని కోరుకుంటున్నట్లు తేలింది. అక్టోబర్ 28 మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశలుగా బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 10వ తేదీన వెల్లడి కానున్నాయి. -
ఎన్నికల వ్యయం 10 శాతం పెంపు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘంతో విస్తృతంగా చర్చించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో వ్యయ పరిమితిని మరో 10శాతం పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇన్నాళ్లూ రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.77 లక్షలు చేశారు. అదే చిన్న రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఖర్చుని రూ.54 లక్షల నుంచి రూ. 59 లక్షలకి పెంచారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకి పెంచారు. చిన్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉన్న రూ.20 లక్షల వ్యయం పరిమితిని రూ.22 లక్షలకి పెంచారు. కరోనా సంక్షోభం నేపథ్యంలోనే ఎన్నికల వ్యయ పరిమితిని పెంచినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 10శాతం వరకు ఎన్నికల వ్యయాన్ని పెంచుకోవడానికి సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. పోలింగ్ ముందు రోజు నుంచే రాజకీయ ప్రకటనలపై నిషేధం బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, వాల్మీకి లోక్సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు అభ్యర్థులు ఎటువంటి రాజకీయ పరమైన ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. 2015 బిహార్ ఎన్నికల సందర్భంగా ఈసీ తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు, దానికి ముందు రోజు ప్రకటనల్ని శాశ్వతంగా నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి న్యాయమంత్రిత్వ శాఖ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
‘నా ఐదేళ్ల అనుభవం 50 ఏళ్లతో సమానం’
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పాలక, విపక్ష కూటముల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తాను అనుభవం లేని నేతనే అయితే తనకు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తోందని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ నైరాశ్యంలో ఉందని దాని తీరుతెన్నులే తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. నితీష్ కుమార్ ప్రతిష్ట మసకబారిందా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి సీఎం అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. చదవండి : నితీష్కు డబుల్ ట్రబుల్..! తనకు అనుభవం లేదని బీజేపీ చెబుతోందని, తాను ఎమ్మెల్యేగా విపక్ష నేతగా వ్యవహరించడంతో పాటు ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశానని చెప్పారు. తన అయిదేళ్ల అనుభవం 50 సంవత్సరాల అనుభవంతో సమానమని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం తనకు ఎలాంటి సవాల్ విసరబోదని స్పష్టం చేశారు. బిహార్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని జేడీయూ, బీజేపీకి అర్థమవడంతో వారు నిరాశలో కూరుకుపోయారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
నా చెల్లెలు వంటిది, గెలిపించండి: చిరాగ్
పట్నా: విమర్శలు, ప్రతివిమర్శల దాడితో బిహార్లో రాజకీయం మరింతగా వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, ఆర్జేడీ కీలక నాయకుడైన తేజస్వీ యాదవ్ వంటి యువ నేతలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలో మొత్తంగా వెయ్యి మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 113 మంది మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం. ఇక ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మొదటి దశ పోలింగ్లో(71 సీట్లు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారి సంఖ్య 27. (చదవండి: నా గుండె చీల్చి చూడండి: చిరాగ్ పాశ్వాన్) తొలి దశలో.. అధికార ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలైన బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేస్తుండగా, జేడీయూ 122 సీట్లలో పోటీ చేసేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ హామీతో మహిళా ఓటర్ల అభిమానం చూరగొన్న జనతాదళ్(జేడీ(యూ)) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఈసారి మొత్తంగా 22 మంది మహిళా అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు. మరే ఇతర పార్టీ ఈస్థాయిలో స్త్రీలకు సీట్లు కేటాయించలేదు. రాష్ట్రీయ జనతాదళ్ నుంచి మొదటి దశలో 10 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ తొలి దశలో ఐదుగురు చొప్పున మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ పార్టీ, హెచ్ఏఎమ్-ఎస్ ఒక్కో మహిళకు అవకాశమిచ్చాయి. వీరిలో కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం. డైనమిక్ ప్రియ బిహార్ రాజకీయాల్లోకి మెరుపువేగంతో దూసుకువచ్చింది పుష్పం ప్రియా చౌదరి. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది.‘ప్లూరల్స్’ అనే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగింది. అంతేకాదు తానే సీఎం అభ్యర్థిని అని కూడా ప్రకటించుకుంది. అధికార జెడీ(యు) నాయకుడు వినోద్ చౌదరి కూతురు ఆమె. తండ్రి అండతో ఆ పార్టీలో పైకి ఎదిగే అవకాశాలు ఉన్నా.. సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో.. ‘లవ్ బిహార్, హేట్ పాలిటిక్స్’ అనే నినాదంతో తొలుత సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. బిహార్లోని దర్భంగాలో జన్మించిన ప్రియా, ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లింది. డెవలప్మెంట్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. బిస్ఫీ, బంకీపూర్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచింది. శ్రేయాసి సింగ్ ప్రముఖ షూటర్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్మెడలిస్ట్, అర్జున అవార్డు గ్రహీత శ్రేయాసి సింగ్ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ మాజీ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన ఆమె, జమాయ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక ఇప్పటికే బీజేపీకి మద్దతుగా పలుచోట్ల పోటీని విరమించుకున్న చిరాగ్ పాశ్వాన్, శ్రేయాసీ సింగ్ తరఫున ప్రచారం చేయడం గమనార్హం. జమాయ్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన, శ్రేయాసీ తన చెల్లెలు వంటిదని, ఆమెకు ఓటు వేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మంజు వర్మ నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్పూర్ షెల్టర్ హోం లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడితో, తన భర్తకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నేపథ్యంలో మంజు వర్మ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు అక్రమంగా మందు గుండు సామాగ్రిని ఇంట్లో నిల్వ చేసిన కారణంగా సీబీఐ ఆమె ఇంటిపై దాడి చేసి, భార్యాభర్తలపై కేసు నమోదు చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ జేడీయూ మరోసారి ఆమెకు టికెట్ ఇవ్వడం విశేషం. బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్పూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మనోరమా దేవి గయా జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె భర్త, దివంగత బిందేశ్వరి ప్రసాద్ యాదవ్ కండలవీరుడిగా గుర్తింపు పొందారు. తన కుమారుడు సృష్టించిన ఓ వివాదం కారణంగా మనోరమా దేవిని జేడీయూ నుంచి బహిష్కరించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఆట్రీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. అంజుమ్ అరా బక్సర్ జిల్లాలోని దుమరాన్ నుంచి పోటీకి దిగుతున్నారు. జేడీయూ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమెకు ఈసారి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ను ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దదాన్ సింగ్ పెహల్వాన్ను కాదని, క్లీన్ ఇమేజ్ ఉన్న మహిళా యువనేతకే పెద్దపీట వేసింది. సుషుమాలత కుశ్వాహ జేడీయూ తరఫున భోజ్పూర్ జిల్లాలోని జగదీష్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యువ నేత. ఇటీవలే ఆమె రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అయిన వెంటనే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా, ఎన్నికల ప్రచారంలోదిగి తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి ర్యాలీలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆడబిడ్డ రాక ఎంతో శుభప్రదమని, ఎన్నికల్లో విజయం మీదేనంటూ విశ్వాసం నింపారు. ప్రస్తుతం ఆమె భోజ్పూర్ గ్రామ పంచాయతి పెద్దగా ఉన్నారు. ఇక వీరితో పాటు మరికొంత మహిళా అభ్యర్థులు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అప్పటితో పోలిస్తే తక్కువే 243 సీట్లు ఉన్న బిహార్ అసెంబ్లీకి 2010లో ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 34. అయితే ఐదేళ్ల తర్వాత అంటే 2015లో ఈ సంఖ్య 28కి పడిపోయింది. వీరిలో 10 మంది ఆర్జేడీకి చెందినవారు కాగా, 9 మంది జేడీయూ నుంచి గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకరు స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించారు. -
నితీష్కు డబుల్ ట్రబుల్..!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీలన్ని దూకుడు పెంచాయి. అయితే ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రతిపక్షాలతో పాటు విపక్షంగా మారిన మిత్రపక్షం లోక్ జన్శక్తి పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన బీజేపీ మిత్ర పక్షంగా కొనసాగుతానని తెలిపారు. ఎన్నికల్లో నితీష్ కుమార్కు వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమస్యను రెట్టింపు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్కి మద్దతు తెలిపారు. రామ్ విలాస్ పాశ్వాన్ లేని సమయంలో నితీష్ కుమార్ వారికి అండగా ఉండాల్సింది పోయి చిరాగ్ పాశ్వాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘చిరాగ్ పాశ్వాన్ విషయంలో నితీష్ కుమార్ వైఖరి సరైంది కాదు. ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్కి ఆయన తండ్రి అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ మన మధ్యలో లేరు. నిజంగా ఇది శోచనీయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిరాగ్ పాశ్వాన్ పట్ల నితీష్ కుమార్ వైఖరి పూర్తిగా అన్యాయంగా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నేను మోదీ హనుమాన్ని!) అయితే తేజస్వీ ఇలా చిరాగ్ పాశ్వాన్కు మద్దతివ్వడం వెనక గల కారణాలను విశ్లేషిస్తే.. ఇద్దరి తండ్రులు మధ్య గల స్నేహం ఒక కారణమైతే సోషలిస్ట్ ఉద్యమంలో భాగంగా ఇరు యువ నాయకులు తండ్రులు నితీష్ కుమారతో కలిసి పని చేశారు. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పుడు తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇద్దరీకి ఉమ్మడి శత్రువుగా మారడంతో తేజస్వీ, చిరాగ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానిలో భాగంగానే రాఘోపూర్ నియోజకవర్గంలో తేజస్వీకి సహాకరించేందుకుగాను చిరాగ్ రాజ్పుత్ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల బీజేపీ ఉన్నత కుల ఓటు బ్యాంకు చీలిపోయి తేజస్వీకి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నాయి. -
ప్రతిపక్షంలోనే కూర్చుంటా: చిరాగ్ పాశ్వాన్
పట్నా : లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ సీఎం సీటే లక్ష్యంగా పనిచేస్తున్న నితీశ్.. జేడీయూ నిర్వహించబోయే అన్ని ప్రచార ర్యాలీలకు రావాల్సిందిగా ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపించారు. అంతేకాకుండా జేడీయూ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపేలా తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ ఐసీయూలో ఉండగా కేవలం మద్దతు కోరేందుకే మోదీ తనకు ఫోన్ చేశారన్నారు. అందుకే తనకు మోదీ పట్ల గౌరవం తగ్గిపోయినట్టు తెలిపారు. తమ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోదని, ప్రతిపక్షంలోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. కాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా నితీష్ కుమార్పై మండిపడ్డారు. సీఎం మొదటి, చివరి ప్రేమ సీఎం కుర్చీపైనే ఉంటుందని ఎద్దేవా చేశారు. -
10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్
సాక్షి, పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)నేత, బిహార్ ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేంద్రం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి రావాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలను గుప్పించారు. ముఖ్యంగా తమ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను స్వచ్ఛమైన బిహారీని అని తన డీఎన్ఏ స్వచ్ఛమైందని తేజస్వీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల గ్రాండ్ అలయన్స్ మ్యానిఫెస్టోను తేజస్వీ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితీష్ ప్రభుత్వంపై తన దాడిని ఎక్కుపెట్టారు. నితీశ్ ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, గత15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ప్రయోజనమేమీలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫారాలు ఉచితం చేస్తా మన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు. మోతియారి షుగర్ మిల్లులో కప్పు టీ తాగుతానని చెప్పిన ప్రధాని, రాష్ట్రంలో వరుసగా చక్కెర మిల్లులు, జనపనార మిల్లులు, పేపర్మిల్లులు, రైస్ మిల్లులను మూసివేసారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 60 స్కాంలు జరిగాయని, నేరాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో అతి ముఖ్యమైన అంశం నిరుద్యోగమని పేర్కొన్న తేజస్వి ఉపాధి,ఉద్యోగాలు కోల్పోయిలన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వ్యాపారాలు నాశనమై పోయినా, వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతింటే, ఇప్పటి వరకూ కేంద్రం పర్యటించిన పాపాన పోలేదని తేజస్వీ మండి పడ్డారు. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, మాధ్యమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారని ప్రకటించారు. దీంతోపాటు, ‘స్మార్ట్ గ్రామ యోజన’ కింద ప్రతి పంచాయతీలో డాక్టర్, నర్సులతో క్లినిక్స్, దీంతోపాటు ప్రాన్ హమారా, సంకల్ప్ బద్లావ్ కా లాంటి పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు రణదీప్ సురేజ్వాలా, శక్తిసింహ్ గోహిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా 243 సీట్ల రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నిలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ
పట్నా: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ మంత్రి సురేష్ కుమార్ శర్మ నవ్వులపాలయ్యారు. అర్బన్ డెవలప్మెంట్, హౌజింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ముజఫర్పూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముజఫర్పూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాని చెబుతూ సురేష్ చేసిన ట్వీట్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ముజఫరాపూర్ లైట్ యోజనా’ అంటూ ఓ ఫొటో షేర్ చేసిన ఆయన.. భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై 17,554 వీధి దీపాలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఉన్న పోస్టర్ తయారు చేయించి ట్విటర్లో పోస్టు చేశారు. అయితే, మంత్రి షేర్ చేసిన రోడ్డు, స్ట్రీట్ లైట్ల ఫొటో ఫేక్ అని తేలింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా విషయం బయటపడటంతో నెటిజన్లు మంత్రిని ఏకి పారేస్తున్నారు. ఆయన షేర్ చేసింది హైదరాబాద్లోని బైరామల్గూడ ఫ్లైఓవర్ అని పేర్కొంటూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ను సురేష్కు ట్యాగ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఫ్లైఓవర్ ఫొటోలతో మస్కా కొట్టిస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, బైరామల్గూడ జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ఆగస్టు 9న ప్రారంభించారు. 780 మీటర్ల వెడల్పైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం 26.5 కోట్లు. Happy to be throwing open yet another flyover in #Hyderabad tomorrow that has been completed as part of #SRDP (Strategic Road Development Plan) RHS flyover at Bairamalguda junction, 780 mt long coating 26.5Cr@bonthurammohan @CommissionrGHMC pic.twitter.com/nb0OLqRYvC — KTR (@KTRTRS) August 9, 2020 -
‘ప్రధాని మోదీపై నితీష్ ఒత్తిడి ఉంది’
పట్నా: అధికార జేడీయూని వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతు పలుకుతున్న ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మరోసారి విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒత్తిడి మేరకే ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో 12 ర్యాలీలకు ఓకే చెప్పారని అన్నారు. నితీష్ ఒత్తిడి కనుక లేకుంటే ప్రధాని మోదీ అన్నేసి ర్యాలీలకు పచ్చజెండా ఊపేవారు కాదని చెప్పారు. ఇక ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన చిరాగ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. జేడీయూ ఉండగా ఎన్డీఏలో భాగయ్యేది లేదని స్పష్టం చేసిన ఆయన సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి బీజేపీతో కలిసి అధికారాన్ని చేపడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాకాని కాకుండా నితీష్ మరోసారి సీఎం అయితే ఎన్డీఏలో కలవకుండా ప్రతిపక్షంలో కూర్చుంటామని అన్నారు. 15 ఏళ్లుగా పాలన సాగిస్తున్న జేయూడీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని చిరాగ్ విమర్శించారు. ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఫొటోలు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారనే బీజేపీ నేతల విమర్శలపై చిరాగ్ శుక్రవారం స్పందించిన సంగతి తెలిసిందే. తన గుండెల్లో మోదీ ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చిరాగ్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, ఓట్లు చీల్చేందుకు అతను ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే, తన తండ్రి స్థాపించిన ఎల్జేపీ ఓట్లు చీల్చే పార్టీ అయితే, 2014, 2015, 2019 ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీ నేతలను చిరాగ్ సూటిగా ప్రశ్నించాడు. కాగా, అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7.. మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. -
నేను మోదీ హనుమాన్ని!
పట్నా/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తాను హనుమంతుడి వంటి భక్తుడినని లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. తన గుండెల్లో ఆయనే ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకుంటే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, సుశీల్ కుమార్ మోదీ హెచ్చరించిన నేపథ్యంలో చిరాగ్పాశ్వాన్ స్పందించారు. ‘సీఏఏను, ట్రిపుల్ తలాఖ్ను, ఎన్ఆర్సీని, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన సీఎం నితీశ్కే ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రధానితో ఆయనే వేదికను పంచుకోవాల్సి ఉంటుంది’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో తన అనుబంధం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తరువాత బిహార్లో బీజేపీ– ఎల్జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ ఓట్లను చీల్చే వ్యక్తి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. బీజేపీ సీనియర్నేతలతో సత్సంబంధాలున్నాయని పేర్కొంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్జేపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిహార్లో బీజేపీ జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలతో కలిసి పోటీ చేస్తోందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్లో 12 ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని బిహార్ ఎన్నికల ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. -
నా గుండె చీల్చి చూడండి: చిరాగ్ పాశ్వాన్
పట్నా: బీజేపీతో కలిసి బిహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే తనకున్న ఏకైక లక్ష్యమని లోక్జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆ పార్టీ నాయకుల మాటలు తనను బాధిస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోయినా ఎన్నికల్లో విజయం సాధించగల సత్తా తమకు ఉందని పేర్కొన్నారు. మోదీ రాముడైతే, తాను హనుమంతుడి లాంటివాడినని, ఆయన ఆశీసులు తనకు ఎప్పుడూ ఉంటాయంటూ అభిమానం చాటుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీతో స్నేహం కొనసాగిస్తూనే, జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఢీకొట్టేందుకు ఈ యువనేత సిద్ధమయ్యారు. (చదవండి: పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) తప్పుదోవ పట్టించొద్దు ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్కు చెక్ పెట్టేందుకే, బీజేపీ అతడిని అస్త్రంగా వాడుకుంటోందన్న సందేహాలు తలెత్తాయి. దీంతో జేడీయూ నేతల నుంచి ఇదే తరహా అనుమానాలు వ్యక్తం కావడం సహా, సీఎంపై చిరాగ్ తీవ్ర విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ నేత భూపీందర్ యాదవ్ తదితరులు శుక్రవారం ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఆయన ఓ ప్రత్యేక దారిని ఎంచుకున్నారు. అంతేకాదు బీజేపీ సీనియర్ లీడర్ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు బీ, సీ వంటి టీంలు ఏమీలేవు. ఎన్డీయేకు నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధిస్తుంది. చిరాగ్ పార్టీ కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోతుంది’’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్ పాశ్వన్) నా గుండెను చీల్చి చూడండి ఈ విషయంపై స్పందించిన చిరాగ్..‘‘నాకు ప్రధాని మోదీ ఫొటోలు అక్కర్లేదు. ఆయన నా గుండెల్లో ఉన్నారు. రాముడికి హనుమంతుడు ఎలాగో, ఆయనకు నేనూ.. అలాగే. మీరు గుండెను చీల్చి చేస్తూ అందులో మోదీజీ కనబడతారు’’అని చెప్పుకొచ్చారు. సీఎం నితీశ్ జీకే ఆయన ఫొటోల అవసరం ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇక తన తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాల గురించి చిరాగ్ మాట్లాడుతూ.. ‘‘ నాన్న భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి పట్నాకు తీసుకువచ్చిన సమయంలో నితీశ్ కుమార్, ఎయిర్పోర్టుకు వచ్చి నివాళులు అర్పించారు. అప్పుడు నేను ఆయన పాదాలకు నమస్కరించాను. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు. అక్కడున్న వాళ్లంతా ఈ విషయాన్ని గమనించారు. అంతేకాదు మా అమ్మనుగానీ, నన్ను గానీ కనీసం పరామర్శించలేదు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ఇలా ప్రవర్తిస్తారా? ఆయన ప్రవర్తకు నన్ను షాక్కు గురిచేసింది. కానీ ప్రధాని మోదీ అలా కాదు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను పరామర్శించారు. నా భుజం తట్టి, మేమంతా ఉన్నామనే భరోసా ఇచ్చారు’’అని పేర్కొన్నారు. -
ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్ పాశ్వన్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారులో కీలకంగా వ్యవహరించి రాం విలాస్ పాశ్వాన్ మృతి కూటమికి తీరని లోటనే చెప్పవచ్చు. అయితే నితీష్ కుమార్తో విబేధాల నేపథ్యంలో ఈ సారి రాం విలాస్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తాను ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇది తన తండ్రి కోరిక అన్నారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మా నాన్న భావించారు. అలా అయితేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ నుంచి విడిపోయినా.. బీజేపీతో పొత్తుకు కట్టుబడి ఉన్నాం. నితీష్ కుమార్ ప్రభుత్వంపై పోరాడతాం. ఒంటరిగా బరిలో దిగాలని నాన్న నన్ను ప్రేరేపించారు. ఇది నాన్న గారి అతిపెద్ద కల. 2005లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని గరించి విదేశాంగ శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్, షహనావాజ్ హుస్సేన్ వంటి చాలా మంది బీజేపీ నాయకులకు తెలుసు’ అన్నారు. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) అంతేకాక ‘ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో ఐదేళ్లు కొనసాగితే మీరు మరో 10-15 ఏళ్లు చింతించాల్సి వస్తుంది. మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు బాధపడతారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని నాన్న భావించారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నన్ను ప్రేరేపించారు’ అన్నారు చిరాగ్ పాశ్వాన్. తన తండ్రి మరణం తనను ఎంతో కుంగదీసిందన్నారు. ‘నేను తనని చాలా మిస్ అవుతున్నాను. ఇలాంటి పరిస్థితిని ఎవ్వరు ముందుగా ఊహించలేరు. ఈ బాధ వర్ణణాతీతం. నాన్న లేరు.. మరో వైపు ఎన్నికలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాలే నాకు బలం. ఆయన పాటించిన విలువలను నేను కొనసాగిస్తాను’ అని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ బతికి ఉంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదన్నారు సుశీల్ కుమార్ మోదీ. -
శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్లో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో నూతనోత్తేజం నెలకొంది. లోక్తాంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్రావు బుధవారం ఢిల్లీలో సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఎల్జేపీ నేత, మాజీ ఎంపీ కాళీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. తన తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా బిహార్లో మహాకూటమి తరపున పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను చేపడతానని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సుభాషిణి పేర్కొన్నారు. చదవండి : బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా లేరని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమిని బలోపేతం చేసి బిహార్ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్లో చేరిన సందర్భంగా సుభాషిణి చెప్పుకొచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు -
బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కనీసం 22 మందిపై హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కానీ దీని గురించి పార్టీ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఇక ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఆర్జేడీ తన అభ్యర్థులు ఎదుర్కొంటున్న నేరారోపణలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా, ఇతర పబ్లిక్ ప్లాట్ఫామ్లలో ప్రకటించింది. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అభ్యర్థులలో అనంత్ సింగ్ కూడా ఉన్నారు. అతను 38 తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ అతన్ని మోకామా నుంచి బరిలో నిలుపుతుంది. సోషల్ మీడియాలో ఆర్జేడీ సమర్పించిన అతని నేర చరిత్ర కథనం ప్రకారం, అనంత్ సింగ్పై మొత్తం హత్యా నేరం సహా మొత్తం 38 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసు పెండింగ్లో ఉంది. (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) అయినప్పటికీ, ఆర్జేడీ అనంత్ సింగ్కు టికెట్ ఇచ్చింది. ఇతర అభ్యర్థుల కంటే అనంత్ సింగ్ చాలా ఫేమస్ అని వాదిస్తుంది. పైగా అతను పేద, అణగారిన వర్గాలకు సాయం చేస్తాడు కాబట్టే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని పార్టీ సమర్థించింది. అనంత్ సింగ్ మోకామా నుంచి గెలిచే అవకాశం ఉందని, ఇది అతన్ని ఆదర్శ అభ్యర్థిగా మారుస్తుందని పార్టీ పేర్కొంది. ఇక క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర ఆర్జేడీ అభ్యర్థులు బెలగంజ్ నుంచి పోటీ చేస్తున్న సురేంద్ర యాదవ్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, జాముయి నుంచి విజయ్ ప్రకాష్, నోఖా నుంచి అనితా దేవి, డెహ్రీ నుంచి ఫతే బహదూర్ సింగ్, ఫతుహా నుంచి రామానంద్ యాదవ్, రాజౌలి నుంచి రెజాజుల్, షెర్ఘాటి దినారా నుంచి కుమార్ మండల్, భాబువా నుంచి భరత్ బింద్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, బెల్హార్ నుంచి రామ్దేవ్ యాదవ్, సూర్యగర నుంచి ప్రహ్లాద్ యాదవ్, సందేష్ నుంచి కిరణ్ దేవి, మఖ్దంపూర్ నుంచి సతీష్ కుమార్, జముయి నుంచి విజయ్ ప్రకాష్, ఝాజ నుంచి రాజేంద్ర ప్రసాద్, సీతామార్హి నుండి రఫీగంజ్ మొహమ్మద్ నిహలుద్దీన్, మీనాపూర్ నుంచి సునీల్ కుమార్, మీనాపూర్ నుంచి రాజీవ్ కుమార్, మహువా నుంచి ముఖేష్ కుమార్ రోషన్, దర్భంగా రూరల్ నుంచి లలిత్ కుమార్ యాదవ్, అత్రి నుండి అజయ్ యాదవ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిపై దోపిడీ, మోసం, దాడి మొదలైన నేరారోపణలు ఉన్నాయి. (చదవండి: జేడీ(యు)లో చేరిన ఆర్జేడీ నేత కుమారుడు) ఈ క్రమంలో జనతా దళ్ (యునైటెడ్) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆర్జేడీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ తీరు మారదని దుయ్యబ్టటారు. ‘ఆర్జేడీ ఇచ్చిన సమాచారం చూస్తే.. ఇక అది తన వైఖరిని ఎన్నటికి మార్చుకోదని స్పష్టం అవుతుంది. హత్య, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది, ఎందుకంటే వారు పాపులర్, తప్పక గెలుస్తారని. బిహార్ అభివృద్ధి చెందుతుంది.. కానీ ఆర్జేడీ కాదని ఇప్పుడు స్పష్టమైంది’ అన్నారు. జేడీ (యూ) ఆరోపణలను ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఖండించారు. తన పార్టీని సమర్థిస్తూ.. "మేము బాహుబలి, నేరస్థులకు టికెట్లు ఇచ్చామని మా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒక నాయకుడు బీజేపీ, జేడీ (యూ)లో ఉన్నంత కాలం, అతను ఒక ప్రవక్త, హరిశ్చంద్ర. కానీ అతను ఆర్జేడీలోకి వస్తే అతను క్రిమినల్, రేపిస్ట్, బాహుబలి అవుతాడు. ఆశ్రయం గృహ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంజు వర్మకు టికెట్ ఇచ్చినందున జేడీ (యూ)కు మాపై ఆరోపణలు చేసే హక్కు లేదు" అన్నారు. -
బిహార్: తొమ్మిది మందిపై వేటువేసిన బీజీపీ
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంది. వీరంతా రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను తిరుగుబాటుదారులందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో రాజేంద్ర సింగ్, రామేశ్వర్ చౌరేషియా, ఉషా విద్యార్తి, రవీంద్ర యాదవ్, శ్వేతా సింగ్, ఇందూ కశ్యప్, అనిల్ కుమార్, మృణాల్ శేఖర్, అజయ్ ప్రతాప్ ఉన్నారు. "మీరు ఎన్డీఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇది ఎన్డీఏతో పాటు పార్టీ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది పార్టీ సూత్రాలకు విరుద్ధం. అందువల్ల, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మిమ్మల్ని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నాం" అని రాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ జైస్వాల్ వీరికి నోటీసులు జారీ చేశారు. (చదవండి: బిహార్ పోరు రసవత్తరం) ఈ తొమ్మిది మంది ఈ సారి ఎన్డీఏ తరఫున టికెట్ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో వారు సొంత అభ్యర్థులపైనే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాజేంద్ర సింగ్, ఉషా విద్యార్తి, రామేశ్వర్ చౌరేషియా ఎల్జెపిలో చేరగా, అజయ్ ప్రతాప్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలో చేరారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), హిందూస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) లతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలో దిగింది. సీట్ల భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, బీజేపీ 115 సీట్లలో, జేడీ(యూ) 110 సీట్లలో, వీఐసీ, హెచ్ఏఎమ్ (ఎస్) వరుసగా 11, 7 సీట్లలో పోటీ చేస్తాయి. ముఖ్యంగా, జేడీ(యూ)తో విభేదాల కారణంగా కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి అయిన లోక్ జన్శక్తి పార్టీ ఈ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) బిహార్లో మూడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 28 న, రెండవ దశ నవంబర్ 3 న జరగాల్సి ఉండగా, చివరి దశ నవంబర్ 7 న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. -
బిహార్లో ఎన్డీఏదే విజయం!
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే విజయమని ‘టైమ్స్నౌ–సీ ఓటర్’ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లలో ఈ కూటమి 160 వరకు స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. ఎన్డీఏలోని బీజేపీ 80 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అదేవిధంగా, మరో పెద్ద పార్టీ నితీశ్కుమార్ సారథ్యంలోని జేడీయూ 70 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని తేలింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలతో ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) 76 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 32 శాతం మంది మళ్లీ నితీశ్కుమారే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. సీఎంగా నితీశ్ పనితీరు మంచిగా ఉందని 28.7 శాతం మంది తెలపగా మామూలుగా ఉందని 29.2%, బాగోలేదని 42.0% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 1–10 తేదీల మధ్య 243 నియోజకవర్గాలకు చెందిన 12,843 మంది నుంచి టెలిఫోన్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ జరిపారు. రెబల్ అభ్యర్థులపై బీజేపీ వేటు: పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుగుబాటు అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతలను బీజేపీ బహిష్కరించింది. మొత్తం 9 మందిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. వీరిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటుదారుల్లో చాలామంది బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నారు. -
46 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మరో 46 మంది అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. దీంతో బీజేపీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. ఈ అభ్యర్థులతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న 16 స్థానాల అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. బిహార్ కోసం ప్రకటించిన తాజా లిస్టులో రాష్ట్రమంత్రి నంద కిషోర్ యాదవ్, నితీశ్ మిశ్రా వంటి ప్రముఖులు ఉన్నారు. బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎం పార్టీలు కలసి పొత్తు గా ఏర్పడి, బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తు న్నాయి. మొత్తం 243 స్థానాలకుగానూ బీజేపీ 110, జేడీయూ 115, వీఐపీ 11, హెచ్ఏఎం 7 సీట్లలో పోటీ చేస్తున్నాయి. కాగా మహిళపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అసెంబ్లీ సీట్లు కేటాయించి బరిలో దించవద్దని నిర్భయ జ్యోతి ట్రస్టు బిహార్లోని రాజకీయ పార్టీలను కోరింది. -
బిహార్ పోరు రసవత్తరం
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ.. బిహార్ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్ సీఎం నితీశ్ కుమార్కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్ కుమార్ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్ ప్రభావం నితీశ్ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోదీకే ప్రతిష్టాత్మకం ఈసారి బిహార్ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్ కుమార్ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్డౌన్కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ► బిహార్లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► కోవిడ్ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ► దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. ► బిహార్ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 2015 ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ 80 జేడీ (యూ) 71 బీజేపీ 53 కాంగ్రెస్ 27 ఇతరులు 8 స్వతంత్రులు 4 -
వ్యూహాత్మకంగా జేడియూ అభ్యర్థుల జాబితా
-
అసెంబ్లీ ఎన్నికలు : మోదీ, షా కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. కీలకమైన ఎన్నికలకు ఎన్డీయే కూటమిలోని లోక్జనశక్తి (ఎల్జేపీ) దూరమవ్వడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొదటి నుంచి ఎల్జేపీకి వెన్నుదన్నుగా ఉన్న దళిత సామాజికవర్గం ఈసారి ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోపార్టీ వికాస్షీల్ ఇసాన్ పార్టీ (వీఐపీ)కి తమ కూటమిలో చోటిచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఈబీసీలను కొంతమేర తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇరు పార్టీల అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాలపై కూటమి నేతలు వరుస సమీక్షలు చేపడుతున్నారు. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యతన శనివారం సమావేశమైన వీరు.. బిహార్ ఎన్నికల్లో విజయావకాశాల గురించి చర్చించారు. ఎల్జేపీ దూరంకావడంతో దాని ప్రభావం ఎన్డీయే కూటమిపై ఏ విధంగా పడబోతుందనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థులు పోటీచేసే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే విధంగా అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం కూడా నిర్వహించాలని మోదీ, అమిత్ షా స్థానిక నేతలకు సూచించారు. అయితే కేవలం జేడీయూ అభ్యర్థులున్న చోటనే ఎల్జేపీ అభ్యర్థులను నిలబెట్టడంతో కూటమిలో కొంతమేర విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. తాము నితీష్కు మాత్రమే వ్యతిరేకమని, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించడం ఎన్డీయే కూటమిలో కలకలం రేపుతోంది. ఈ అంశంపై కూడా తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 121, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 122 స్థానాల్లో పోటీచేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఒంటరిగా బరికి దిగుతోంది. -
పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!
పట్నా : కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్జనశక్తి (ఎల్జేపీ) అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్కు కష్టాలు తప్పేలా లేవు. మాయావతి తరువాత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన దళిత నేతగా పేరొందిన రాంవిలాస్ మరణించడం.. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. దళిత ఓట్లను ఆకట్టుకోవడంలో వ్యూహ రచనచేయడంలో ఆయన దిట్టగా పేరొందారు. దశాబ్ధాలుగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు. యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళిత, బహుజనులను రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని చెప్పకతప్పడంలేదు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా పాశ్వాన్ దేశవ్యాప్తంగా పేరుగాంచారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకు దక్కింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. నితీష్కు వ్యతిరేకంగా గళం విప్పాలని దళిత నేత ప్రణాళికలు రచించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించడంతో యువనేత చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలను భుజానకెత్తునే పరిస్థితి నెలకొంది. తండ్రి అంతటి రాజకీయ అనుభవంతో పాటు వ్యహరచనలో మెలుకువులు తెలియకపోవడం చిరాగ్కు పెద్ద సమస్యగా మారింది. పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనప్పటికీ ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఇంకా రాం విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారు. పాశ్వాన్ లేని ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఏ విధంగా ఆదరిస్తారానేది ఆసక్తికరంగా మారింది. (సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ) ఇన్నేళ్లు పార్టీ కార్యక్రమాలను చిరాగ్ పర్యవేక్షిస్తున్నా అంతియ నిర్ణయం తండ్రిదే కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తాజాగా నెలకొన్న విపత్కరమైన పరిస్థితుల్లో ప్రచార బాధ్యతల నుంచి, అభ్యర్థుల ఎంపిక కూడా చిరాగే చూడాల్సి ఉంది. అయితే చిరాగ్ మాటను పార్టీలోని సీనియర్లు ఎంత వరకు గౌరవిస్తారనేది భవిష్యత్లో బయటపడనుంది. మరోవైపు తొలివిడత పోలింగ్లో ఎల్జేపీకి అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. వాటికి దీటుగా అనుభవంలేని చిరాగ్ ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. అయితే యువనేతకు మద్దతుగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు ఉన్నారనేది బిహార్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. -
లాలూకు బెయిల్ ఇచ్చారు కానీ..
-
లాలూకు బెయిల్.. అయినా జైలే
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అవిభాజ్య బిహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి. ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం లాలూప్రసాద్ యాదవ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి. -
ఎన్నికల ప్రచారాలు షురూ
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 11 రాష్ట్రాల్లో 56 స్థానాలకు, బిహార్లోని ఒక పార్లమెంటు సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్లాక్ 5 నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే ఆమల్లోకి వస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 15 వరకు ఎలాంటి ఎన్నికల సభలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన అన్లాక్ 5లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ వాటిని సవరించింది. ఎన్నికల ర్యాలీలో 200 మంది వరకు పాల్గొనవచ్చునని తెలిపింది. ఇక ఏదైనా భవనం లోపల ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తే సగం హాలు వరకు మాత్రమే జనానికి అనుమతినివ్వాలని వెల్లడించింది. ఇక ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. -
30 మందిపై లైంగిక దాడి: ఎమ్మెల్యే టికెట్
పట్నా : బిహార్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. విపక్షాల ఎత్తులను చిత్తుచేసే విధంగా రాజకీయ అండతోపాటు ధనబలమున్న అభ్యర్థుల వైపే అధినేతలు మొగ్గుచూపుతున్నారు. సీట్లపై ఇప్పటికే అన్ని పార్టీలు ఓ అంచనాకు రాగా.. అధికార జేడీయూ ఇప్పటికే రెండోవిడత అభ్యర్థులను సైతం విడుదల చేసింది. 90మందితో కూడా జాబితాను ఆ పార్టీ చీఫ్, సీఎం నితీష్ కుమార్ గురువారం ప్రకటించారు. వీరిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కొత్తవారికి కూడా చోటుదక్కింది. (నితీశ్కు అగ్నిపరీక్ష) ఇదిలావుండగా జేడీయూ విడుదల చేసిన జాబితాలతో అనూహ్యంగా ఓ ఇద్దరు వ్యక్తులు చోటుదక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్పూర్ షెల్టర్ హోం కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మంజూవర్మకు నితీష్ మరోసారి టికెట్ కేటాయించారు. బెగుసరై సమీపంలోని బర్యార్పూర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఆమె బరిలో నిలువనున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారంరేపిన ముజఫర్పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసుకు సంబంధించి మంజు వర్మతో పాటు ఆమె భర్త చంద్రశేఖర్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కోర్టుకు సైతం లొంగిపోయి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. షెల్టర్ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడుల ఆరోపణల రావడంతో మంత్రి పదవి నుంచి తప్పించడంతో పాటు 2018లోనే ఆమెను నితీష్ పార్టీ నుంచి తప్పించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మంజూవర్మతో పాటు ఆమె భర్తతో సహా మరో 11 మందిపై అభియోగాలు దాఖలు చేసింది. మరోవైపు బాలికపై అత్యాచార ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్మకు టికెట్ కేటాయించడం పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మామ చంద్రికా రాయ్కు సైతం జేడీయూ టికెట్ దక్కింది. పర్సా నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలువనున్నారు. ఇక 27 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. -
నితీశ్కు అగ్నిపరీక్ష
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీ(యూ), బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జేడీ(యూ) 122 సీట్లకూ, బీజేపీ 121 సీట్లకూ పోటీ చేస్తాయి. తనకన్నా జేడీ(యూ)కి ఒక స్థానం అదనంగా ఇవ్వడం ద్వారా... ఎన్నికల్లో నెగ్గాక నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించడం ద్వారా లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) తిరుగుబాటు వెనక తమ హస్తం లేదని బీజేపీ చాటింది. జేడీ(యూ) తన వాటాలోని ఏడు సీట్లను జితన్రాం మాంఝీ నాయకత్వంలోని హిందూస్తాన్ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం)కు ఇస్తుండగా... తన స్థానాల్లో ఆరింటిని కొత్తగా ఎన్డీఏలోకొచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్(వీఐపీ) పార్టీకి బీజేపీ కేటాయిస్తోంది. కనుక జేడీ(యూ), బీజేపీలు నికరంగా చెరో 115 స్థానాలకూ పోటీ చేస్తున్నట్టు లెక్క. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని ప్రకటించడానికి నిర్వహించతలపెట్టిన మీడియా సమావేశం ఆలస్యం కావడం, ఆదరా బాదరగా నితీశ్ను బీజేపీ బుజ్జగించడం వంటి పరిణామాలు చూస్తే బిహార్లో ఎన్నికల ఫలితాల తర్వాత అసలు కథ మొదలవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది. ఎల్జేపీ నిలపబోయే అభ్యర్థుల్లో సగంమంది బీజేపీ, ఆరెస్సెస్ నేపథ్యం వున్నవారేనన్న ప్రచారం సంగతి సరేసరి. ఎల్జేపీ ఇప్పటికే తమ తరఫున బీజేపీ నేతలిద్దరు పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వాములం కనుక ప్రధాని నరేంద్ర మోదీ ఛాయాచిత్రం తమ పార్టీ పోస్టర్లలో వుంటుందని తెలిపింది. 143 స్థానాల్లో పోటీ చేస్తామని, జేడీ(యూ)కు వ్యతిరేకంగా తమ అభ్యర్థుల్ని నిలుపుతామని చెప్పింది. ఈ విషయంలో బీజేపీ వివరణ ఇచ్చేలా చేయడంలో నితీశ్ కుమార్ ఇప్పటికైతే విజయం సాధించినట్టే. కానీ ఇదే నితీశ్ ఒకప్పుడు ఇంతకన్నా దూకుడుగా వున్న సంగతి మర్చిపోకూడదు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరేంద్ర మోదీ ప్రచారం చేయనంటేనే ఆ పార్టీతో చెలిమి చేస్తానని 2010లో నితీశ్ కుమార్ పట్టుబట్టారు. దాన్ని సాధించుకున్నారు. కానీ ఆయనకు ఇప్పుడా పరిస్థితి లేదు. జేడీ(యూ)పై ఆగ్రహించి బయటకు వెళ్లిన ఎల్జేపీ వల్ల ఎన్డీఏ ఓట్లు ఏమేరకు తగ్గుతా యన్నది చూడాల్సివుంది. ఆ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు గనుక ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో అనుమానమే. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటనలు దూకుడుగానే వుంటున్నాయి. నితీశ్ ఏలుబడిలో బిహార్ ప్రాభవం అడుగంటిందని, దాన్ని పునరుద్ధరించడమే ధ్యేయమని ఆయన చెబుతున్నారు. నితీశ్ మొదలుకొని మంత్రులు, అధికారులు ఎవరూ బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. నితీశ్ అభివృద్ధి నినాదం ఫలాలు సామాన్యులకు చేరలేదని చెబుతున్నారు. బీజేపీతో తమకు శత్రుత్వం లేదని, నితీశ్కు గుణపాఠం చెప్పడమే ధ్యేయమని పోస్టర్లలో నినాదంగా ముద్రించారు. చిరాగ్కు ఎన్నికల ప్రచార బాధ్యతల్ని భుజస్కంధాలపై మోసిన చరిత్ర లేదు. ఎల్జేపీలో రాంవిలాస్ పాశ్వాన్ మినహా చెప్పుకోదగ్గ నాయకుడెవరూ లేరు. ఆయన కుమారుడన్న ఒకే ఒక్క అనుకూలాంశం మినహా చిరాగ్కు ఇతరత్రా ప్రత్యేక గుర్తింపు లేదు. అయితే తెరవెనక బీజేపీ వుండి ఆయన్ను నడిపిస్తోందన్న సంశయాలు అందరికీ వున్నాయి. ఆ పార్టీ లోపాయికారీ మద్దతుతో చిరాగ్ నితీశ్కు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. సొంతంగా పోటీ చేయడం వల్ల ఎల్జేపీకి రాజకీయంగా పెద్దగా లాభించేది ఏమీ వుండకపోయినా జేడీ(యూ) విజయావకాశాలను అది దెబ్బతీయొచ్చన్నది నిపుణుల అంచనా. ఇప్పటికి జరిగింది సర్దుబాటే. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్న సమస్య వచ్చినప్పుడు సహజంగానే బీజేపీ మెరుగైన స్థానాలను ఎంచు కుంటుంది. గతంలోవలే గట్టిగా పట్టుబట్టి తాను అనుకున్నది సాధించడం జేడీ(యూ)కు అంత సులభం కాదు. ఇన్నిటిని దాటుకుని జేడీ(యూ) అత్యధిక స్థానాలు గెల్చుకోవడం సాధ్యమేనా అన్నది సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం నితీశ్ కుమార్కు ముఖ్యమంత్రి పదవి లభించడం కూడా అనుమానమే. బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ నితీశే మా సీఎం అభ్యర్థి అని ప్రస్తుతం చెబుతున్నా, ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరి సంఖ్యాబలం ఎంతన్న దానిపై ఆధారపడి ముఖ్యమంత్రి పదవి ఏ పార్టీకెళ్తుందన్నది తేలుతుంది. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో నెగ్గితే సీఎం పదవి ముందు చెప్పినట్టు తనకే ఇవ్వాలని నితీశ్ పట్టుబట్టలేరు. మెజారిటీ సీట్లు గెల్చుకున్న పార్టీయే సహజంగా ఆ పదవిని సొంతం చేసుకుంటుంది. అయితే ఎన్నికల ప్రచారపర్వంలో ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు నితీశ్ ముందు చాలానే వున్నాయి. అందులో ముఖ్యమైనవి కరోనా వైరస్, దాని పర్యవసానంగా విధించిన లాక్డౌన్, వరదలు. కరోనా కేసుల్లో బిహార్ దేశంలో అయిదో స్థానంలో వుంది. కానీ కరోనా పరీక్షల్లో అట్టడుగున వుంది. పారిశ్రామికీకరణ పెద్దగా లేనందువల్ల నిరుద్యోగిత ఆ రాష్ట్రంలో మొదటినుంచీ ఎక్కువే. గనులున్న ప్రాంతాలు జార్ఖండ్కు పోయాక ఉపాధి అవకాశాలు మరీ తగ్గాయి. బిహార్లో నిరుద్యోగిత 10.2 శాతమని నిరుడు జూన్లో వెల్లడైన గణాంకాలు చెబుతున్నాయి. కనుకనే ఆ రాష్ట్రం నుంచి వలసలు అధికం. అలా వలసపోయినవారు 30లక్షలమంది వివిధ రాష్ట్రాల్లో ఇబ్బం దులు పడుతుంటే నితీశ్ ప్రభుత్వం నిర్లిప్తంగా వుందని ఆ కుటుంబాలవారు ఆగ్రహిస్తున్నారు. ఈసారి వచ్చిన వరదలు కూడా నితీశ్ ప్రతిష్టను దెబ్బతీశాయి. 16 జిల్లాల్లోని 1,232 గ్రామాలు నీట మునిగాయి. 34 లక్షలమంది ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయచర్యల్లో విఫల మైందన్న విమర్శలొచ్చాయి. వీటన్నిటికీ సంతృప్తికరమైన జవాబులు ఇవ్వడంతోపాటు స్వపక్ష, విపక్షాల శిబిరాలనుంచి ఎదురయ్యే సవాళ్లను ఎంత దీటుగా ఎదుర్కొంటారన్నదాన్ని బట్టి నితీశ్ విజయావకాశాలు ఆధారపడివుంటాయి. -
జేడీయూ 122.. బీజేపీ 121
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూల మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. 243 స్థానాలకుగాను 122 సీట్లలో జేడీయూ, 121 స్థానాల్లో బీజేపీ పోటీ పడనున్నాయి. ఈ సందర్భంగా జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నాయకత్వానికి బీజేపీ మద్దతు తెలిపింది. సీఎం అభ్యర్థి నితీశ్ అని తెలిపింది. జేడీయూ తన వాటాకు వచ్చిన 122 సీట్లలో ఏడు స్థానాలను మాజీ సీఎం జతిన్రామ్ మాంఝీ నాయకత్వంలోని హిందుస్తానీ ఆవామీ మోర్చా(హెచ్ఏఎం)కు కేటాయించింది. బీజేపీకి కేటాయించిన 121 స్థానాల్లో కొత్తగా కూటమిలో చేరిన ముకేశ్సాహ్నికి చెందిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి కొన్ని సీట్లు కేటాయిస్తారని నితీశ్ తెలిపారు. ‘లోక్జనశక్తి పార్టీ(ఎల్జేపీ) కేంద్రంలో మా భాగస్వామి. ఆ పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. బిహార్కు సంబంధించినంత వరకు ఇక్కడ ఎన్డీఏ నాయకుడు నితీశ్ కుమారే. మా బంధం బలంగా ఉంది’ అని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే.. ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తి ఉంటారా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘కాబోయే ముఖ్యమంత్రి నితీశ్ కుమారే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అప్రస్తుతం’ అని ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ తేల్చిచెప్పారు. ఎల్జేపీ నేత చిరాగ్పాశ్వాన్ విమర్శలపై నితీశ్ కుమార్ పరోక్షంగా స్పందించారు. ‘నా పని నేను చేస్తాను. అర్థంలేని విమర్శలతో ఎవరైనా సంతోషం పొందితే.. అది వారిష్టం’ అని వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలతో జేడీయూ సరిగ్గా వ్యవహరించదన్న విమర్శలపై.. ‘జేడీయూ మద్దతు లేకుండానే రామ్విలాస్ పాశ్వాన్ రాజ్యసభకు ఎన్నికయ్యారా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం సీట్ల పంపకంపై బీజేపీ, జేడీయూ నేతలు ఒక అవగాహనకు వచ్చారు. ఆ తరువాత రెండు పార్టీల అగ్రనేతలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున చర్చల్లో పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్ దేవేంద్ర ఫడణవిస్, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, సంజయ్ జైశ్వాల్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ సీనియర్ నేత, సంఘ్పరివార్తో సన్నిహిత సంబంధాలున్న రాజేంద్ర సింగ్ మంగళవారం ఎల్జేపీలో చేరారు. బీజేపీ తొలి జాబితా 27 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆదివారం పార్టీలో చేరిన అంతర్జాతీయ షూటర్ శ్రేయసి సింగ్, మాజీ ఎంపీ హరి మాంఝీ తదితరులు ఆ జాబితాలో ఉన్నారు. -
బీజేపీతో పొత్తుపై నితీష్ కీలక ప్రకటన
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ-జేడీయూల మధ్య సీట్ల పంపకాలను మంగళవారం ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. జేడీయూ 122 స్ధానాల్లో పోటీచేయనుండగా, బీజేపీ 121 స్ధానాల్లో తలపడుతుందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ వెల్లడించారు. జేడీయూ కోటాలో ఏడు స్ధానాలను హెచ్ఏఎంకు అప్పగించామని, బీజేపీ తన కోటాలో కొన్ని స్ధానాలను వికాస్షీల్ ఇన్సాన్ పార్టీకి కేటాయిస్తుందని ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని నితీష్ పేర్కొన్నారు. బిహార్ అభివృద్ధి కోసమే బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, దీనిపై ఎలాంటి అపోహలు లేవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బిహార్ తదుపరి సీఎంగా మళ్లీ నితీష్ కుమార్ పాలనా పగ్గాలు చేపడతారని బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రకటనను సుశీల్ మోదీ తోసిపుచ్చారు. ఆయన తండ్రి, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ క్రియాశీలకంగా ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పుకొచ్చారు. పాశ్వాన్కు ఇటీవల గుండె ఆపరేషన్ జరగడంతో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక బిహార్లో మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమిగా బరిలో దిగిన ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. బిహార్ అసెంబ్లీకి మూడువిడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీట్ల పంపకాలు కొలిక్కిరావడంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు వేడెక్కించనున్నాయి. చదవండి : నితీష్కు చెక్ -
బీజేపీ వ్యూహం : నితీష్కు చెక్..!
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయం వేడెక్కింది. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలు సైతం కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య సీట్ల పంపకం ఇప్పటికే ఓ కొలిక్కి రాగా.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరఫున సీఎం అభ్యర్థిగి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజీస్వీ యాదవ్ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరుకు కూటమిలో సీట్లు సర్థుబాటు కూడా పూర్తయ్యింది. మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ 144, కాంగ్రెస్70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. (వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) బీజేపీ ప్రయోగించిన అస్త్రంగా ఎల్జేపీ ఇదిలావుండగా కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తిపార్టీ (ఎల్జేపీ) నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్న ప్రకటించింది. ఈ మేరకు ఎన్డీయే నుంచి తాము బయటకు వస్తున్నట్లు పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించడం బిహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అయితే తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పార్టీ నాయకత్వానికి విధేయులుగానే కొనసాగుతామని పాశ్వాన్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బిహార్లో సొంతంగా బరిలోకి దిగుతామని ప్రకటించిన ఎల్జేపీ నాయకత్వం తమ పోటీ జేడీయూపైనే అనే స్పష్టం చేసింది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృష్టి చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. బిహార్లో నితీష్కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయోగించిన అస్త్రంగా ఎల్జేపీని విశ్లేషిస్తున్నారు. (ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే) జేడీయూపై ఎల్జేపీ పోటీ.. పాశ్వాన్ నిర్ణయం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని, ఈ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులను ఓడించి అసెంబ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎ పీఠాన్ని అదిష్టించాలన్నదే కమళనాథుల వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్లో ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన పాశ్వాన్ బీజేపీ నాయకత్వానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రకటించడం వెనుక ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నదని వారి అభిప్రాయం. దీనిలో భాగంగానే ఎల్జేపీ అభ్యర్థులను జేడీయూపై పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఎల్జేపీ నేతలు నితీష్ను టార్గెట్గా చేసుకుని విమర్శల దాడికి దిగుతున్నారు. జేడీయే అభ్యర్థుల ఓటమే తమ లక్ష్యమని ఇదివరకే ప్రకటించారు. దీంతో బీజేపీ కావాలనే ఎల్జేపీని తమపై పోటీకి దింపుతోందని పలువురు జేడీయూ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ఈ ఎత్తులను నితీష్ ఏ విధంగా ఎదుర్కొంటారనేది బిహార్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. -
'గత్యంతరం లేకే జేడీయూతో పనిచేశాం'
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్కుమార్పై లోక్ జన శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ నేరుగా విమర్శలు గుప్పించారు. నితీష్పై వ్యక్తిగతంగా తనకు ఎటువంటి వ్యతిరేకత లేదని చెబుతూనే.. ఆయన పాలసీలు, వర్కింగ్ స్టైల్ను తప్పుబట్టారు. ఇన్నాళ్లూ ఆయనతో తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా కలిసి పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. 'గత ఎన్నికల తర్వాత రాత్రికిరాత్రే ఆర్జేడీ-కాంగ్రెస్ల కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీఏలో చేరి నితీష్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన ఎవరి మాటా వినిపించుకోరని, సొంత అజెండాతో ముందుకు వెళ్తారని మాకు ముందే తెలుసు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇనాళ్లూ కలిసి పనిచేశాం' అని చిరాగ్ వ్యాఖ్యానించారు (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) 2013లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచే నితీష్కుమార్ను వ్యతిరేకిస్తున్నానని చిరాగ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పిన చిరాగ్.. ఓటర్లు నితీష్కు కచ్చితంగా బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కొన్ని చోట్ల 'ఫ్రెండ్లీ ఫైట్' ఉంటుందని, కానీ నితీష్కుమార్పై బలమైన అభ్యర్థినే పోటీకి దించుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తాము సహకారం అందిస్తామని, నవంబర్ 10 తర్వాత 'డబుల్ ఇంజిన్ గవర్నమెంట్'ను చూస్తారని చిరాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు), బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహార విషయం కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది. మొత్తం 243 స్థానాలలో సగం సీట్లను బీజేపీకి ఇచ్చేయనుంది. దీంతో జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు(మంగళవారం) వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. జేడీయూ వాటాలో ఉన్న 122 సీట్లలో అయిదు స్థానాలను జితిన్ రాం మాంఝి నేతృత్వంలోని హెచ్ఎమ్కు వెళ్లనుండగా, బీజేపీకి చెందిన 121 సీట్లలో కొన్ని ముఖేష్ నిషాద్కు చెందిన వికాషీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కు ఇవ్వనున్నారు. (ఆర్జేడీ తొలి జాబితా విడుదల.. ఇద్దరికి దక్కని చోటు) రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుని సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తమ పార్టీ జనతాదళ్(యు)పై పోటీ చేస్తామని ప్రకటించింది కానీ బీజేపీ వ్యతిరేకంగా కాదని రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. ఎల్జేపీ 42 సీట్లు కోరితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పడంతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. ఈ మేరకు బిహార్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. (ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
ఆర్జేడీ తొలి జాబితా విడుదల.. ఇద్దరికి దక్కని చోటు
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహా కూటమితో పొత్తు అనంతరం తమ పార్టీ నుంచి మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తొలి దశలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన జాబితాను మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ విడుదల చేసింది. ఈ లిస్టులో అత్యాచార ఆరోపణలు ఎదర్కొంటున్న ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లను ఆర్జేడీ నిరాకరించింది. వారి స్థానంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారి భార్యలను నామినేట్ చేసింది. చదవండి : బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్ మైనర్ బాలికపై అఘాయిత్సానికి పాల్పడిన నేరంలో రాజ్ బల్లాబ్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉండటంతో ఆయన భార్య విభ దేవి.. నావాడా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. మరో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ యాదవ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉండి సంవత్సరం నుంచి పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి కిరణ్ దేవి భోజ్పూర్ జిల్లాలోని సందేశ్ అసెంట్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. మహా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతుంది. చదవండి : సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ -
సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ
పట్నా: బిహార్ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ మార్చుకుంది. అభ్యర్థుల ఎంపికపై మరోసారి కసరత్తు ప్రారంభించింది. జేడీయూతో కూడిన ఎన్డీఏలో తాము చేరబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని లోక్ జన శక్తి పార్టీ(ఎల్జేపీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడింది. దాదాపు 143 స్థానాల్లో ఎల్జేపీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనుంది. ఈక్రమంలో కుల సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే బీజేపీ బిగ్ బాస్ జేపీ నడ్డాతో బిహార్ బీజేపీ ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్మోడీలు ఇవాళ భేటీ కానున్నారు. బీజేపీతో ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ఈ సమావేశం తర్వాతే ఆయన ప్రకటించారు. బీజేపీ 'ప్లాన్ బి'లో భాగంగానే ఎల్జేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీయూ ఉన్న ఎన్డీఏతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని చిరాగ్ ప్రకటించినా ఇప్పటి వరకు బీజేపీ నేతలు స్పందించకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీకి దళిత ఓటర్ల మద్దతుంది. 2005 ఎన్నికల్లోనూ ఇలాంటి ప్లానింగ్తోనే బరిలోకి దిగిన ఎల్జేపీ... ఆర్జేడీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించింది. (చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లపై హత్యకేసు నమోదైంది. వీరితో పాటు ఆర్జేడీ నేతలు అనిల్ కుమార్ సాధు, కలో పాస్వాన్లతో పాటు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీ ముఖ్య నేతలపై హత్యారోపణలు రావడం ఆ పార్టీవర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 4న (నిన్న) బిహార్ లోని పూర్నియా జిల్లాలోని మాలిక్ (37) ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మాలిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం వెనుక కుట్రకోణం దాగుందని, దీన్ని రాజకీయ హత్యగా మాలిక్ భార్య ఆరోపించారు. ఇంతకుముందు ఆర్జేడీ నుంచి మాలిక్ను సస్పెండ్ చేసిన కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. (బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్) పార్టీ టికెట్ కేటాయించడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు కొన్ని రోజులక్రితం మాలిక్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనను కులం పేరిట తేజశ్వి యాదవ్ దూషించినట్లు సైతం మాలిక్ వీడియోలో వెల్లడించారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని అనుకున్న తురణంలోనే ఇలా హత్యకు గురికావడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. మాలిక్ హత్యకేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. మాలిక్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయని, సంఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా బిహార్ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ తన అసలు రంగు బయటపెట్టాడని జేడీ(యు) ఆరోపించింది. (బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్) -
బీహార్ ఎన్డీఏలో చీలిక
-
బిహార్ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు వీరే..
పట్నా: బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీల నేతృత్వంలోని మహాకూటమి జోరు పెంచింది. ఎన్డీఏ కూటమి ఇంకా సీట్ల సర్దుబాటులోనే తలమునకలై ఉండగా మహాకూటమి మాత్రం అభ్యర్థులను ప్రకటించేస్తోంది. మహాకూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, సీపీఐఎంఎల్ 19, సీపీఐ 6, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతోంది. ఈక్రమంలో తమ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న నలుగురు అభ్యర్థుల పేర్లను సీపీఎం ప్రకటించింది. మతిహనీ, పిప్రా, బిభుటిపూర్, మాఝీ స్థానాల నుంచి రాజేంద్రప్రసాద్, రాజ్మంగళ్ప్రసాద్, అజయ్కుమార్, సతేంద్రయాదవ్ల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక.. బాఖ్రీ, తెగ్రా, బచ్వారా, హర్లాఖీ, ఝంఝర్పూర్, రూపౌలీ స్థానాల నుంచి సీపీఐ పోటీ చేస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాండేకి హర్లాఖీ టికెట్ లభించగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అవదేష్కుమార్ రాయ్ మరోసారి బచ్వారా స్థానం నుంచే పోటీకి దిగుతున్నారు. 2015 ఎన్నికల్లో తెగ్రా, బాఖ్రీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్రతన్సింగ్, సూర్యకాంత్ పాశ్వాన్లు మరోసారి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రూపౌలీ నుంచి వికాస్చంద్రమండల్, ఝంఝర్పూర్ నుంచి నారాయణ్యాదవ్ బరిలోకి దిగుతున్నారు. (చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్
న్యూఢిల్లీ: బిహార్లో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) నుంచి ఆదివారం కీలక భాగస్వామ్య పక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వైదొలగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 143 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నది తమ లక్ష్యమని, అందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ భేటీలో నిర్ణయించారు. లక్షలాది బిహారీల అభిప్రాయాలను క్రోడీకరించి తాము రూపొందించిన ‘బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్’ దార్శనిక పత్రం అమలు జేడీయూతో కలిసి కూటమిలో ఉంటే సాధ్యం కాదని స్పష్టమైందని వ్యాఖ్యానించింది. జేడీయూతో సైద్ధాంతిక విభేదాల కారణంగా కూటమికి సంబంధం లేకుండా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలిచిన స్థానాల్లో ఎల్జేపీ తరఫున అభ్యర్థులను నిలపబోమని తెలిపింది. బీజేపీపై వ్యతిరేకత లేదని, ప్రధాని మోదీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొంది. ఎల్జేపీ నిర్ణయంతో.. రానున్న ఎన్నికల్లో జేడీయూ పలు స్థానాల్లో నష్టపోనుందని, కాంగ్రెస్, ఆర్జేడీల విపక్ష కూటమి లాభపడే అవకాశముందని భావిస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: వీఐపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీకి దిగుతామని విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) ప్రకటించింది. రామ్విలాస్ పాశ్వాన్కు శస్త్ర చికిత్స కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్కు ఆదివారం గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతతో గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళిత నేత హత్య బహిష్కృత ఆర్జేడీ నేత శక్తి మాలిక్ ఆదివారం హత్యకు గురయ్యారు. బిహార్లోని పుర్నియా జిల్లాలోని ఆయన నివాసంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఇది రాజకీయ హత్య అని, దళిత నాయకుడైన తన భర్త స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించారు. శక్తి మాలిక్ హత్య అనంతరం ఒక వీడియో వైరల్ అయింది. రాణిగంజ్ టికెట్ కావాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్ శక్తి మాలిక్ను డిమాండ్ చేస్తున్నట్లుగా, అంతు చూస్తానని బెదిరించినట్లు, కులం పేరుతో దూషించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ కేసులో తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
బీజేపీలో చేరిన షూటర్ శ్రేయాసి సింగ్
పట్నా : ప్రముఖ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ బిహార్ శాఖ చీఫ్ భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరారు. జుముయ్ జిల్లా గిధౌర్కు చెందిన శ్రేయాసి సింగ్ను బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమర్పూర్ నుంచి బీజేపీ బరిలో దింపవచ్చని భావిస్తున్నారు. ఆమె 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం, స్కాట్లాండ్లో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకం సాధించారు. 2013లో మెక్సికోలో జరిగిన ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్లోనూ శ్రేయాసి సింగ్ భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. కాగా, 2018లో షూటింగ్ విభాగంలో ఆమె అర్జున అవార్డును పొందారు. శ్రేయాసి గతంలో ఆర్జేడీ సహా పలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినా చివరికి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండగా బీజేపీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. శ్రేయాసి తండ్రి దిగ్విజయ్ సింగ్ గతంలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ కేబినెట్లో పలు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. శ్రేయాసి సింగ్ తల్లి పుతుల్ సింగ్ బిహార్లోని బంకా నుంచి ఎంపీగా పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించారు. చదవండి : బిహార్ ఎన్నికలు : జేడీయూకు షాక్ -
వెనక్కి తగ్గిన నితీష్.. బీజేపీతో డీల్ ఓకే
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాల విషయం కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. జేడీయూ చీఫ్, సీఎం నితీష్కుమార్ ఓ అడుగు వెనక్కి తగ్గి చెరి సగం సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా 122 సీట్లలో అధికార జేడీయూ, 121 సీట్లు బీజేపీ తమ అభ్యర్థులను పోటీకి దింపే దిశగా డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలోస్తున్నాయి. పట్నాలో జేడీయూ, బీజేపీల సీనియర్ నేతలు మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్టు అనధికార వర్గాల సమాచారం. జేడీయూకి కేటాయించిన 122 సీట్లలోని 5 నుంచి 7 చోట్ల హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) అభ్యర్థులు పోటీ చేస్తారని, బీజేపీ వద్దనున్న121 సీట్లలోని కొన్నింటిని లోక్ జన శక్తి (ఎల్జేపీ)కి సర్దుబాటు చేసేలా ఈ చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. తమకు కనీసం 42 సీట్లయినా ఇవ్వాల్సిందేనని ఎల్జేపీ పట్టుబడుతుండుగా 15కు మించి ఇవ్వలేమని బీజేపీ చేతులెత్తేసినట్టు వార్తలొచ్చాయి. తాము కోరినన్ని సీట్లివ్వని పక్షంలో స్వతంత్రంగానే 143 సీట్లలో పోటీకి దిగుతామని కూడా ఎల్జేపీ బాస్ చిరాగ్ పాశ్వాన్ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేఈ-ఎల్జేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికంగా మారింది. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్కు 70 సీట్లు) -
కేంద్ర మంత్రికి సర్జరీ.. చర్చలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై చర్చలు తుది దశకు చేరుకున్నాయనుకున్న తరుణంలో మరోసారి బ్రేక్ పడింది. లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అగ్ర నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్కి అత్యవసరంగా హార్ట్ సర్జరీ నిర్వహించడంతో శనివారం నిర్వహించాల్సిన భేటీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రికి ఇవాళ ఉదయం శస్త్రచికిత్స జరిగిందని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో అవసరమైతే మరో శస్త్ర చికిత్స నిర్వహించే వీలుందని డాక్టర్లు వెల్లడించారని చిరాగ్ చెప్పారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమితో తలపడనుండగా ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్కు 70 సీట్లు) -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
-
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ బిహార్లో ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరించనున్నారు. మహాకూటమిలో చర్చల అనంతరం రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో 243 సీట్లకు గాను 144 సీట్లను ఆర్జేడీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి 70, లెఫ్ట్ పార్టీలకు 29, జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఆర్జేడీ కోటా నుంచి సీట్లు కేటాయించామని కూటమి శనివారం ప్రకటించింది. అయితే ఈ విభజనతో కలత చెందిన చిన్న పార్టీలలో ఒకటైన వీఐపీ పార్టీ కూటమి నుంచి వైదొలింగి. తాము మోసపోయామని ఆ పార్టీ నేతలు విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, ఇది ప్రజలకు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మధ్య పోరాటమని పేర్కొన్నారు. ఇక కరోనా సమయంలో దేశంలో అతి పెద్ద బీహార్ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా అక్టోబర్ 8తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. బీహార్లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీలలో పోలింగ్ జరగనుంది. కాగా ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్కుమార్ ప్రభుత్వం నాలుగవసారి కూడా తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా ఉంది. ఇక వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఆర్జేడీ వ్యూహం రచిస్తోంది. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని కూడా ప్రతిపక్షం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా సమయంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటు వేసే సమయాలను కూడా మార్పు చేసింది. చదవండి: బిహార్లో ఎల్జీపీ దూకుడు.. కీలక భేటీ -
బిహార్లో ఎల్జేపీ దూకుడు.. కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ భేదాలను చక్కదిద్దేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. సీట్ల పంపకాల్లో క్లారిటీ కోరుతున్న జేడీయూ, ఎల్జేపీ నేతలతో కమలం పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్తో బీజేపీ బాస్ జేపీ నడ్డా చర్చలు జరిపి రాజీ ఫార్ములా కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా.. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి ఎన్ని సీట్లివ్వాలనే విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈక్రమంలో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్తో అమిత్ షా, నడ్డాలు చర్చించినా విషయం కొలిక్కిరాలేదు. ఎల్జేపీ కీలక భేటీ.. సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఇవాళ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఏర్పాటు చేసింది. బీజేపీ సీట్ల ఫార్ములా ప్రకారం ముందుకెళ్లాలా లేదా 143 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలా అనే విషయమై ఈ భేటీలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. తాము కోరినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే బీజేపీకి తేల్చిచెప్పిన ఎల్జేపీ.. కమలం అభ్యర్థులు పోటీ చేసే చోట మాత్రం తాము అభ్యర్థులను నిలుపబోమని స్పష్టం చేసింది. 27 సీట్లేనా..? బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. ఇందులో ఏకంగా 143 సీట్లను ఎల్జేపీ కోరుతుండగా 27 మాత్రమే ఇచ్చిందుకు బీజేపీ, జేడీయూ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక.. ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగబోతున్నాయి. అధికారం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అమీతుమీ తేల్చుకోబోతుంది. -
అభ్యర్థుల ఖరారుపై ఎన్డీయే మల్లగుల్లాలు
-
మహాకూటమి : సీట్ల పంపకాలు ఖరారు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల మధ్య సీట్ల సర్ధుబాట్లు కొలిక్కివస్తున్నాయి. మహాకూటమిలో పార్టీల సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. కాంగ్రెస్ 70 స్ధానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు 30 స్ధానాల్లో తలపడనున్నాయని మహాకూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్కు 70 స్ధానాలు ఇచ్చేందుకు అంగీకరించిన ఆర్జేడీ ఆయా స్ధానాల ఎంపికను మాత్రం ఆ పార్టీకి విడిచిపెట్టేందుకు అంగీకరించలేదని తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని పాలక ఎన్డీయే సైతం సీట్ల ఖరారుపై భాగస్వామ్య పక్షాలతో పట్నాలో కీలక భేటీ నిర్వహించింది. ఎన్డీయే తరపున సీట్ల పంపకాలను ఈనెల 4లోగా ఢిల్లీలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక అధికారాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. 2015లో తన విజయానికి బాటలుపరిచిన ఏడు సూత్రాల కార్యక్రమం 2.0ను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగారు. ఓట్ల వేటలో ఈ పథకం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. కాషాయ కూటమితో జతకట్టిన నితీష్ను ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ముందుకొచ్చాయి. ఇక బిహార్లోని 71 స్ధానాలకు తొలి విడత పోలింగ్కు అప్పుడే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్లో 243 అసెంబ్లీ స్ధానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం -
బిహార్ ఎన్నికలు : నితీష్ వ్యూహాత్మక ఎత్తుగత
పట్నా : రాజకీయాల్లో ఏ సమయంలో ఏం చేయాలనేదే కీలకం. ఆ ఒడుపులన్నింటినీ ఒడిసిపట్టడంలో దిట్టగా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల సమయంలో భారీ పథకంతో వేడిని రాజేశారు. సెప్టెంబర్ 25న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మూడు విడతల పోల్ షెడ్యూల్ను ప్రకటించిన మరుక్షణమే నితీష్ ఏడు సూత్రాల కార్యక్రమం -2ను ప్రకటించారు. 2015లో తన విజయానికి దోహదపడిన సాథ్ నిశ్చయ్ (ఏడు అంశాలు)కు కొనసాగింపుగా ఆయన ఈ ప్రకటన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలను సమకూర్చే నైపుణ్య శిక్షణా కార్యక్రమాల నుంచి మహిళలోల వ్యాపార దక్షతను పెంచడం, వ్యవసాయ భూములకు సాగునీరు లభ్యత, ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగపరచడం వంటి పలు అంశాలను ఈ ప్రణాళికలో పొందుపరించారు. వ్యాపారాలను ప్రారంభించే ఆసక్తి కలిగిన మహిళలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దళిత యువతీ, యువకులకూ ఈ తరహా పథకాన్ని నితీష్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. సాథ్ నిశ్చయ్ పథకం ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ను విజయతీరాలకు చేర్చింది. అప్పట్లో బీజేపీతో జట్టు కట్టిన రాం విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వహ, జితిన్ రాం మాంఝీ వంటి హేమాహేమీలను ఎదుర్కొని నితీష్ జయకేతనం ఎగురవేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీల సాయంతో నితీష్ ఆ ఎన్నికల్లో ఎదురీదుతారన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సారథ్యంలోని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన మహాకూటమి విజయం సాధించింది. చదవండి : బిహార్లో మహాకూటమికి షాక్ ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు కల్పించడంతో పాటు మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి గ్రామలో రహదారుల నిర్మాణం చేపడతామని ఆ ఎన్నికల్లో నితీష్ వాగ్ధానం చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. ఆ ఊపుతోనే నితీష్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాథ్ నిశ్చయ్-2ను తెరపైకి తీసుకువచ్చారు. మహాకూటమిని వీడి ఈసారి ఎన్డీయే పక్షాన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతున్న నితీష్ మరోసారి విజయం సాధిస్తే ఆయన రికార్డుస్ధాయిలో ఏడోసారి బిహార్ పాలనా పగ్గాలను చేపడతారు. ఇక ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. -
బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం చేసులో పాలక బీజేపీకి అనుకూలంగా తీర్పు రావడంతో కకమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన మసీదును ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, కరసేవకులు కూల్చివేశారనే ఆరోపణలు తొలినుంచీ వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ తాజాగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెక్పెట్టింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా నిర్దోషులేనని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. దీంతో 28 ఏళ్లుగా నిందను మోస్తున్న బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతీతో పాటు మరికొంత మందికి ఈ కేసు నుంచి ఊరట లభించింది. దేశంలో ఓ వైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ తీర్పు రావడం కమలనాథులకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (తొలగిన మచ్చ.. దక్కిన ఊరట) కీలకమైన బిహార్ అసెంబ్లీతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ను విడుదల చేసింది. వీటిలో మధ్యప్రదేశ్లోని 24 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న ఏడాదిన్నర కాలంలో పంజాబ్తో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బాబ్రీ విధ్వంసానికి బీజేపీ నేతలు పాల్పడలేదని తాజాగా కోర్టు స్పష్టం చేయడంతో ఈ ఎన్నికల్లో వారికి కొంతమేర లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. మసీదు కూల్చివేత అనేది కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం జరగలేదని న్యాయస్థానం ప్రకటించడం బీజేపీ భవిష్యత్కు బాటలు వేయడంలాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజా తీర్పుతో మైనార్టీలో ఉన్న అపనింద కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. (కమలనాథుల్లో కొత్త ఉత్సాహం) ఈ తీర్పుతో రానున్న కాలంలో ఎన్నికలు జరుగనున్న బిహార్, బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా 40.64 శాతం ఓట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను గెలుచుకున్న పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 22 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్, వామపక్షాలు ఘోర పరాజయం చవిచూడక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీని చూసి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు సడలకుండా చూసుకోవడానికి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్నారు. ఈ తరుణంలో బాబ్రీ మసీదు తీర్పు రావడంతో దానిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. ఇక బీజేపీ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని ఎదుర్కొవడం విపక్షాలకు పెను సవాలే.