England vs Srilanka
-
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్కప్ తర్వాత క్రిస్ సిల్వర్వుడ్ తన హెడ్కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్కోచ్గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్గానూ పనిచేశాడు. ఇక ఫుల్టైమ్ హెడ్కోచ్గా వెస్టిండీస్తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆసియాలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు ఊరట విజయం దక్కింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. నామమాత్రపు మూడో టెస్టులో మాత్రం జూలు విధిల్చింది. లండన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను లంక చిత్తు చేసింది. దీంతో వైట్వాష్ నుంచి లంకేయులు తప్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యాన్ని లంక 40.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక(127) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ (39 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (32) రాణించారు.లంక అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్లో విజయం సాధించిన శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక టార్గెట్ను ఛేదించిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2010లో ఆస్ట్రేలియాపై 180 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో పాక్ ఆల్టైమ్ రికార్డును లంక బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాక్ తర్వాత టీమిండియా ఉంది. 1971లో ఇంగ్లండ్పై 173 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.చదవండి: IND vs AUS: ముషీర్ ఖాన్కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు
శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిసాంక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి.. వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే...!!లంక అనూహ్య విజయంప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు గెలుపొంది సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించింది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది.వైట్వాష్ గండం నుంచి తప్పించుకునితద్వారా వైట్వాష్ గండం నుంచి తప్పించుకుని ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. అయితే, ఇంగ్లండ్లో మూడో టెస్టులో శ్రీలంక గెలుపొందడంలో ఓపెనర్ పాతుమ్ నిసాంకదే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్లో 51 బంతుల్లో 64 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 124 బంతుల్లోనే 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.1880 నుంచి ఇదే మొదటిసారిఅయితే, నిసాంక సెంచరీ మార్కు అందుకునే కంటే ముందే అత్యంత అరుదైన ఘనత ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 41 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న నిసాంక.. రెండో ఇన్నింగ్స్లో 42 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా 26 ఏళ్ల నిసాంక చరిత్రకెక్కాడు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వీరులు వీరేకాగా 1880లో ఇంగ్లండ్తో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 559 మ్యాచ్లకు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా నిసాంక మాదిరి ఇలా రెండు ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దాఖలాలు లేవు.ఇదిలా ఉంటే.. టెస్టు రెండు ఇన్నింగ్స్లో అత్యంత వేగంగా యాభై పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్ల జాబితాలో మాత్రం నిసాంక తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది ఎవరంటే..👉మార్క్ గ్రేట్బచ్(న్యూజిలాండ్)- జింబాబ్వే మీద- 1992లో👉నాథన్ ఆస్ట్లే(న్యూజిలాండ్)- వెస్టిండీస్ మీద- 1996లో👉తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- న్యూజిలాండ్ మీద- 2009లో👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- న్యూజిలాండ్ మీద- 2012లో👉జెర్మానే బ్లాక్వుడ్(వెస్టిండీస్)- టీమిండియా మీద- 2916లో👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- పాకిస్తాన్ మీద- 2017లో👉జాక్ క్రాలే(ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద- 2022లో👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- న్యూజిలాండ్ మీద- 2023లో👉పాతుమ్ నిసాంక(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- 2024లోచదవండి: Afg vs NZ: నోయిడాలో తొలి రోజు ఆట రద్దు.. కారణం ఇదే! -
నిసాంక సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్కు షాకిచ్చిన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిసాంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిసాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్లో దిముల్ కరుణరత్నే (8), కుసాల్ మెండిస్ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
శ్రీలంకకు లభించిన మరో ఆణిముత్యం
టెస్ట్ల్లో కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ బ్యాటర్లు రిటైరయ్యాక శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనపడింది. కొందరు ఆటగాళ్లు అడపాదడపా ప్రదర్శనలు చేస్తున్నా అవంత చెప్పుకోదగ్గవేమీ కాదు. ఇటీవలికాలంలో ఆ జట్టులోకి కమిందు మెండిస్ అనే ఓ యువ ఆటగాడు వచ్చాడు. ఇతను ఆడింది ఐదు టెస్ట్ మ్యాచ్లే అయినా దిగ్గజ బ్యాటర్లను మరిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో సెంచరీ, రెండు అర్ద సెంచరీలు చేసిన కమిందు.. తన 10 ఇన్నింగ్స్ల స్వల్ప కెరీర్లో ఏకంగా మూడు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు చేసి ఔరా అనిపించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్న కమిందు.. ఆతర్వాత బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కరను గుర్తు చేశాడు. ఆ మరుసటి టెస్ట్లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఇతను.. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో సెంచరీతో మెరిశాడు. మళ్లీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన కమిందు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించాడు.ఇలా కమిందు తన స్వల్ప కెరీర్లో ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లో అంచనాలకు మించి రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. కమిందు టెస్ట్ల్లో చేసిన పరుగులు దాదాపుగా విదేశాల్లో చేసినవే కావడం విశేషం. అందులోనూ కమిందు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి చాలా కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన కమిందు లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగుతాడు. కమిందు గణాంకాలు.. అతని ఆటతీరు చూసిన వారు శ్రీలంకకు మరో ఆణిముత్యం లభించిందని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇదివరకే (0-2) కోల్పోయిన శ్రీలంక.. మూడో టెస్ట్లో మాత్రం విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరో 125 పరుగులు చేస్తే విజయం సొంతం చేసుకుంటుంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో పాటు శ్రీలంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. నిస్సంక (53), కుసాల్ మెండిస్ (30) క్రీజ్లో ఉన్నారు. -
ఇంగ్లండ్తో మూడో టెస్టు.. విజయం దిశగా శ్రీలంక
లండన్: ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిన శ్రీలంక... మూడో మ్యాచ్లో విజయం దిశగా సాగుతోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో 219 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక... మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నే (8) విఫలం కాగా... నిసాంక (44బంతుల్లో 53 బ్యాటింగ్; 7 ఫోర్లు), కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 30 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. చేతిలో తొమ్మిది వికెట్లున్న శ్రీలంక... విజయానికి మరో 125 పరుగులు చేయాల్సి ఉంది.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓవర్నైట్ స్కోరు 211/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 61.2 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (69), కమిందు మెండిస్ (64) హాఫ్ సెంచరీలు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్, జోష్ హాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ టాపార్డర్ విఫలమవడంతో... ఆ జట్టు 34 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. జేమీ స్మిత్ (50 బంతుల్లో 67; 10 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే ధాటిగా ఆడగా... బెన్ డకెట్ (7), ఓలీ పోప్ (7), జోరూట్ (12), హ్యారీ బ్రూక్ (3), అట్కిన్సన్ (1) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 4, విశ్వ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ -
ఇంగ్లండ్తో మూడో టెస్ట్.. 263 పరుగులకు ఆలౌటైన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్నైట్ స్కోర్కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్లు ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన మిలన్రత్నాయకే 7, విశ్వ ఫెర్నాండో 0, అశిత ఫెర్నాండో 11 పరుగులు చేశారు. లంక ఇన్నింగ్స్లో ఓవరల్గా ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. రెండో రోజు ఆటలో పథుమ్ నిస్సంక 64 పరుగులు చేశాడు. వీరు మినహా కుసల్ మెండిస్ (14), అశిత ఫెర్నాండో మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ జోష్ హల్, ఓల్లీ స్టోన్ తలో 3, క్రిస్ వోక్స్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 62 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్ (13), హ్యారీ బ్రూక్ (19), జేమీ స్మిత్ (16), ఓల్లీ స్టోన్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లంక ఇన్నింగ్స్లో మిలన్ రత్నాయకే 3, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు.కాగా, శ్రీలంక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. -
పోప్ భారీ శతకం.. 325 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. 221/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. ఓవర్నైట్ స్కోర్కు మరో 104 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ చేసిన ఓలీ పోప్ 154 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓవర్నైట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్కు 40 పరుగులు జోడించాక బ్రూక్ ఐదో వికెట్గా వెనుదిరగగా.. ఓలీ పోప్ ఎనిమిదో వికెట్గా పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 86, డాన్ లారెన్స్ 5, జో రూట్ 13, జేమీ స్మిత్ 16, క్రిస్ వోక్స్ 2, గస్ అట్కిన్సన్ 5, ఓల్లీ స్టోన్ 15 (నాటౌట్), జోష్ హల్ 2, షోయబ్ బషీర్ ఒక్క పరుగు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిలన్ రత్నాయకే 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. 147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ తాత్కాలిక టెస్టు సారథి ఓలీ పోప్ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను పోప్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. జో రూట్(13) విఫలమైనప్పటకి పోప్ మాత్రం దంచి కొట్టాడు. 103 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు క్రీజులో హ్యారీ బ్రూక్(8) ఉన్నాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కాగా పోప్కు ఇది 7వ టెస్టు సెంచరీ.సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన పోప్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి 7 సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్గా పోప్ రికార్డులకెక్కాడు. పోప్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు సాధించిన ప్రతి సెంచరీ ఆరు వేర్వేరు మైదానాల్లో వచ్చినివే కావడం విశేషం. 2020లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు సెంచరీ చేసిన పోప్.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, భారత్, వెస్టిండీస్, శ్రీలంకపై శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. -
ఒలీ పోప్ అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
లండన్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకతో మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్... శుక్రవారం వర్షం అంతరాయం మధ్య ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్ (103 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... ఓపెనర్ బెన్ డకెట్ (79 బంతుల్లో 86; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.వీరిద్దరూ వన్డే తరహా ఆటతీరుతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్కు పలుమార్లు అంతరాయం ఏర్పడగా... ఆఖర్లో వెలుతురు లేమితో ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపివేశారు. గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ జో రూట్ (13) తో పాటు డాన్ లారెన్స్ (5) విఫలమయ్యారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2 వికెట్లు పడగొట్టాడు. పోప్తో పాటు హ్యారీ బ్రూక్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: Fab Four: ‘అతడే నంబర్ వన్.. కోహ్లికి ఆఖరి స్థానం’ -
ఇంగ్లండ్తో మూడో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
రేపటి నుంచి (సెప్టెంబర్ 6) కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే మూడో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. రెండో టెస్ట్ ఆడిన నిషన్ మధుష్క, ప్రభాత్ జయసూర్య స్థానాల్లో కుసల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చారు. మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తి కాగా.. రెండు మ్యాచ్ల్లో ఆతిథ్య జట్టే ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.మూడో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టు: దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వికెట్కీపర్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కమిందు మెండిస్, మిలన్ రత్నాయకే, లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అశిత ఫెర్నాండోఇంగ్లండ్ తుది జట్టు: డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, జోష్ హల్, షోయబ్ బషీర్ -
శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 190 పరుగుల తేడాతో భారీ విజయం
లార్డ్స్ వేదికగా శ్రీలకంతో జరిగిన రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 483 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 292 పరుగులకు ఆలౌటైంది.లంక బ్యాటర్లలో కరుణ్రత్నే(55), చందీమాల్(58), దనుజంయ డి సిల్వా(50) హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో గౌస్ అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా.. క్రిస్ వోక్స్, స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 251 పరుగులకే ఆలౌటైంది. కానీ తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు 231 పరుగుల భారీ లీడ్ లభించింది. ఈ ఆధిక్యాన్ని కలుపునకుని 483 పరుగుల భారీ టార్గెట్ను లంకేయులు ముందు ఇంగ్లీష్ జట్టు ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక విఫలమైంది. కాగా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 427 పరుగులు చేయగా.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లలోనూ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులు చేసిన జో.. రెండో ఇన్నింగ్స్లో 103 రన్స్తో సత్తాచాటాడు. అదేవిధంగా ఇంగ్లీష్ పేస్ బౌలర్ అట్కిన్సన్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎనిమిదో స్ధానంలో వచ్చి సెంచరీతో చెలరేగిన అట్కిన్సన్.. బౌలింగ్లోనూ అదరగొట్టాడు. ఓవరాల్గా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్టైం రికార్డులు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులతో సత్తాచాటిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో శతకంతో చెలరేగాడు. 121 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రూట్కు ఇది 34వ టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..→టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్గా రూట్ అవతరించాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక శతకాల (33) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కుక్ రికార్డును సమం చేసిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ సెంచరీతో అతడిని అధిగమించాడు.→ఈ సెంచరీతో అతడు మరో ముగ్గురు క్రికెటర్ల అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. యూనిస్ ఖాన్, జయవర్దనే, సునీల్ గవాస్కర్, లారా రికార్డును సమం చేశాడు. వీరిందరూ టెస్టుల్లో 34 సెంచరీలు చేశారు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ఈజాబితాలో ఆరో స్ధానంలో ఎగబాకుతాడు. ఇక టెస్టు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు.→ఒకే వేదికలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్గా రూట్ నిలిచాడు. రూట్ లార్డ్స్లో ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉండేది. గూచ్ లార్డ్స్లో 6 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్తో గూచ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.→50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు చేసిన 9వ క్రికెటర్గా రూట్ నిలిచాడు. రూట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.డేంజర్లో సచిన్ రికార్డు.. కాగా రూట్ జోరును చూస్తుంటే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 15,921 రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో రూట్ 12377 పరుగులతో 7వ స్ధానంలో కొనసాగుతున్నాడు. కాగా రూట్ సచిన్కు కేవలం 3,544 పరుగుల దూరంలోనే ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడి తన కెరీర్ను ముగించగా.. రూట్ ఇప్పటివరకు 145 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే 33 ఏళ్ల రూట్ ఫిట్నెస్ పరంగా కూడా మెరుగ్గా ఉండడంతో సచిన్ ఆల్టైమ్ టెస్టు రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. -
శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్
England vs Sri Lanka, 2nd Test Day 2 Report: ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ అట్కిన్సన్ (115 బంతుల్లో 118;14 ఫోర్లు, 4 సిక్సర్లు) లార్డ్స్ ఆనర్ బోర్డ్లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్న అట్కిన్సన్ ధనాధన్ ఇన్నింగ్స్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల అట్కిన్సన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.లార్డ్స్ ఆనర్ బోర్డులో అట్కిన్సన్ పేరుగత నెలలో వెస్టిండీస్ సిరీస్ ద్వారా లార్డ్స్లోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అట్కిన్సన్ ఆడిన మొదటి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మొత్తం 12 వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్ బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అందులో చోటు దక్కించుకున్నాడు.శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్కాగా అట్కిన్సన్ దూకుడుతో ఓవర్నైట్ స్కోరు 358/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 5, మిలాన్ రత్నాయకే, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 55.3 ఓవర్లలో 196 పరుగులు చేసి ఆలౌటైంది.256 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్కమిందు మెండిస్ (120 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒలీ స్టోన్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 231 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ ఓలీ పోప్ (2 బ్యాటింగ్), బెన్ డకెట్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓవరాల్గా 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి -
లార్డ్స్లో ఊచకోత.. 8వ స్ధానంలో వచ్చి విధ్వంసకర సెంచరీ
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్, యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన బౌలింగ్ స్కిల్స్ను ప్రదర్శించిన అట్కిన్సన్.. ఈ మ్యాచ్లో బ్యాట్తో మెరుపులు మెరిపించాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అట్కిన్సన్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 103 బంతుల్లోనే అట్కిన్సన్ తన తొలి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 115 బంతులు ఎదుర్కొన్న అట్కిన్సన్.. 14 ఫోర్లు, 6 సిక్స్లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ సెంచరీతో అతడు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించుకున్నాడు. అదే విధంగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్లో 8వ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా అట్కిన్సన్ నిలిచాడు. లార్డ్స్లో 8వ స్ధానంలో వచ్చి సెంచరీలు చేసిన వారు వీరేస్టువర్ట్ బ్రాడ్(169, ఇంగ్లండ్)గుబ్బి అలెన్(122, ఇంగ్లండ్ )బెర్నార్డ్ జూలియన్( 121, వెస్టిండీస్)గస్ అట్కిన్సన్( 118, ఇంగ్లండ్)రే ఇల్లింగ్ వర్త్(113, ఇంగ్లండ్)అజిత్ అగార్కర్(109, భారత్)అదే విధంగా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ, 10 వికెట్ల ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కూడా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అట్కిన్సన్తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ ఉన్నారు. He's done it! 💪Enjoy the moment Gus Atkinson reaches his first Test match century 👏 pic.twitter.com/lUZ8ECp7G2— Sky Sports Cricket (@SkyCricket) August 30, 2024 -
తనవల్లే ఈ స్ధాయిలో ఉన్నా.. ఆయనకే ఈ సెంచరీ అంకితం: రూట్
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో 206 బంతులు ఎదుర్కొన్న రూట్.. 18 ఫోర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన అలస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఆయనకే సెంచరీ అంకితం...ఇక జో రూట్ తన 33వ టెస్ట్ సెంచరీని ఇంగ్లండ్ దివంగత మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్కు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మెంటార్ థోర్ప్కు నివాళులర్పించాడు. తన సెంచరీ మార్క్ను అందుకున్న వెంటనే రూట్ ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణాన ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు."నా కెరీర్లో ఇప్పటివరకు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు, కోచ్లు, మెంటార్లతో కలిసి పనిచేశాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా కెరీర్ను తీర్చిదిద్దిన వారిలో గ్రాహం థోర్ప్ ఒకరు. ఈ క్షణంలో థోర్ప్ను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఆయనను చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్పటికి థోర్ప్కు రుణపడి ఉంటాను. నా ఆట, నా కెరీర్ ఎదుగుదలలో ఆయనది కీలక పాత్ర. ఈ స్ధాయిలో నేను ఉన్న అంటే కారణం థోర్ప్ అని గర్వంగా చెబుతున్నాను.బ్యాటింగ్ టెక్నిక్, స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు నాకు చాలా సహాయం చేశాడరు. ఈ రోజు నేను స్వీప్ షాట్లను సులభంగా ఆడుతున్న అంటే కారణం ఆయనే. నా సెంచరీని థోర్పీకి అంకితమివ్వాలనకుంటున్నాను అని తొలి రోజు ఆట అనంతరం రూట్ పేర్కొన్నాడు. కాగా థోర్ప్ ఈ నెల ఆరంభంలో అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్గా థోర్ప్ తప్పుకున్నాడు. -
రోహిత్ శర్మను అధిగమించిన జో రూట్.. 44 నెలల్లో 16 సెంచరీలు
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీ రూట్కు 33వ టెస్ట్ సెంచరీ. మూడు ఫార్మాట్లలో కలిపితే 49వది. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో రూట్ రెండో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. తాజా సెంచరీ చేసే క్రమంలో రూట్ రోహిత్ శర్మను (48 సెంచరీలు) అధిగమించాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీల రికార్డు విరాట్ కోహ్లి (80) పేరిట ఉంది. రూట్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రూట్ (33), కుక్ (33), కెవిన్ పీటర్సన్ (23) టాప్-3లో ఉన్నారు. 2020లో కేవలం 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. 44 నెలల వ్యవధిలో ఏకంగా 16 సెంచరీలు బాదాడు. ఫాబ్ ఫోర్గా పిలువబడే రూట్, స్మిత్, విరాట్, కేన్లలో రూట్ అత్యధికంగా 33 సెంచరీలు కలిగి ఉన్నాడు. కేన్, స్మిత్ చెరో 32 సెంచరీలు చేయగా.. విరాట్ 29 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రూట్ 143 పరుగులు చేసి ఔట్ కాగా.. గస్ అట్కిన్సన్ (74), మాథ్యూ పాట్స్ (20) క్రీజ్లో ఉన్నారు. బెన్ డకెట్ (40), హ్యారీ బ్రూక్ (33), జేమీ స్మిత్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, లహీరు కుమార తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
జో రూట్ సూపర్ సెంచరీ.. కుక్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన సూపర్ ఫామ్ను కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ తన అద్బుత సెంచరీతో ఆదుకున్నాడు.162 బంతుల్లో 13 ఫోర్లతో రూట్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తన సొంత గడ్డపై 20వ టెస్టు సెంచరీ కాగా.. లార్డ్స్లో ఆరో శతకం. ఇక సెంచరీతో మెరిసిన రూట్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే...టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ క్రికెటర్ అలెస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. అతడు మరో సెంచరీ సాధిస్తే కుక్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.అదే విధంగా ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 11వ స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) ఆగ్రస్ధానంలో ఉన్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. రూట్ ఇప్పటివరకు తన సొంతగడ్డపై 6569* పరుగులు చేశాడు. ఇంతకుముందు రికార్డు కుక్(6568) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కుక్ ఆల్టైమ్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. చంద్రపాల్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రూట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు తన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 84 బంతుల్లో 6 ఫోర్లతో రూట్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ సిరీస్లో ఇది రూట్ రెండో హాఫ్ సెంచరీ. అంతకుముందు తొలి టెస్టులో కూడా ఆర్ధశతకంతో జో మెరిశాడు.రూట్ అరుదైన ఘనత.. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఐదో క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 147 మ్యాచ్ల్లో 97*సార్లు ఏభై పైగా రూట్ పరుగులు సాధించాడు.ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ క్రికెట్ దిగ్గజం శివనారాయణ చందర్పాల్ పేరిట ఉండేది. చందర్పాల్ తన కెరీర్లో 164 టెస్టుల్లో 96 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. అయితే తాజా మ్యాచ్తో చందర్పాల్ను రూట్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(119 ఫిప్టీ ప్లస్ స్కోర్లు) ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా కల్లిస్(103), పాంటింగ్(103), ద్రవిడ్(99) ఉన్నారు. కాగా రూట్ కెరీర్లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి.చదవండి: 'బాబర్, అఫ్రిది కాదు.. పాక్లో ఆ భారత క్రికెటర్కే ఫ్యాన్స్ ఎక్కువ' -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 29) ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన కుసాల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో స్థానాల్లో పతుమ్ నిస్సంక, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో ఓలీ స్టోన్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఈ ఒక్క మార్పు మాత్రమే చేసింది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 236 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 326 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన జేమీ స్మిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తుది జట్లు..శ్రీలంక: దిముత్ కరుణరత్నే, నిషన్ మదుష్క, పతుమ్ నిస్సంక, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, మిలన్ రత్నాయకేఇంగ్లండ్: బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్ -
Eng vs SL: మూడేళ్ల తర్వాత.. తుదిజట్టులో తొలిసారి
శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.లంకతో తొలి టెస్టులో మార్క్వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్ను బెంచ్కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్కు ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం కల్పించింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇరు జట్ల మధ్య లండన్లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టులారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్. -
మార్క్ వుడ్కు గాయం.. ఇంగ్లండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్
శ్రీలంకతో తాజాగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వుడ్ మూడో రోజు నుంచి బౌలింగ్ చేయలేదు. వుడ్ స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు 20 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ను ఎంపిక చేశాడు. హల్.. శ్రీలంకతో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్లకు ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉంటాడు. Josh Hull - the 6'7 left arm pacer has been added to England's squad for Test series Sri Lanka. pic.twitter.com/FVdogR3toZ— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2024కౌంటీల్లో లీసెస్టర్షైర్కు ఆడే హల్కు భీకరమైన ఫాస్ట్ బౌలర్గా పేరుంది. 6 అడుగుల 7 అంగుళాలు ఉండే హల్కు అతని ఫైట్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో రెండో టెస్ట్ ఆగస్ట్ 29 నుంచి మొదలవుతుంది. మూడో టెస్ట్ సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగనుంది.కాగా, ఓల్డ్ ట్రఫర్డ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో శ్రీలంకపై ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయం డిసిల్వ (74), మిలన్ రత్నాయకే (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. జేమీ స్మిత్ (111) సెంచరీతో కదంతొక్కడంతో 358 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. కమిందు మెండిస్ (113) సెంచరీతో రాణించడంతో 326 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
చరిత్ర సృష్టించిన మెండిస్.. తొలి శ్రీలంక క్రికెటర్గా
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో లంక పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు ఆల్రౌండర్ కమిందు మెండిస్ తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా సంచలన సెంచరీతో మెండిస్ మెరిశాడు. అది కూడా ఏడో స్ధానంలో వచ్చి శతకం బాదడం గమనార్హం. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్లో 183 బంతులు ఎదుర్కొన మెండిస్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 113 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన మెండిస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.మెండిస్ సాధించిన రికార్డులు ఇవే..ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్గా కమిందు నిలిచాడు. ఇప్పటివరకు ఈ లంక బ్యాటర్ కూడా ఏడో స్ధానంలో వచ్చి సెంచరీ సాధించలేకపోయాడు. గతంలో 1984లో లార్డ్స్లో దులీప్ మెండిస్ చేసిన 94 పరుగులే అత్యధికం.ఇంగ్లండ్ గడ్డపై ఏడో లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేసిన ఏడో ఆసియా బ్యాటర్గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత క్రికెటర్లు సందీప్ పాటిల్, రిషబ్ పంత్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, అజిత్ అగార్కర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. -
జో రూట్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు! సచిన్కు చేరువలో
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులు రాణించిన రూట్.. రెండో ఇన్నింగ్స్లో ఆజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.128 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో అతడు 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంలో ఈ వెటరన్ తన వంతు పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఇంగ్లండ్ చిత్తుచేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్ వెళ్లింది.జో రూట్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 144 టెస్టులు ఆడిన రూట్.. 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలాన్ బోర్డర్(63), భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(63)ల పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్తో వీరిద్దరని అధిగమించి మూడో స్ధానానికి రూట్ చేరుకున్నాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(68) అగ్రస్ధానంలో ఉండగా.. విండీస్ లెజెండ్ చంద్రపాల్(66) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రూట్ కెరీర్లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి. -
తొలి టెస్టు.. శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 204/6తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. 326 పరుగులకు ఆలౌటైంది. కమిందు మెండిస్ (183 బంతుల్లో 113; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో రాణించి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 57.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (128 బంతుల్లో 62 నాటౌట్; 2 ఫోర్లు), జేమీ స్మిత్ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్సర్), డాన్ లారెన్స్ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు, ఒక సిక్సర్), హ్యారీ బ్రూక్ (68 బంతుల్లో 32; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. స్కోర్లుశ్రీలంక తొలి ఇన్నింగ్స్: 236/10ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:358/10శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్:326/10ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్:205/5 -
చరిత్ర సృష్టించిన స్మిత్.. 94 ఏళ్ల రికార్డు బద్దలు
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 148 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 111 పరుగులు చేశాడు.జీమీ స్మిత్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన స్మిత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సెంచరీ నమోదు చేసిన యంగెస్ట్ ఇంగ్లండ్ వికెట్ కీపర్గా స్మిత్ రికార్డులకెక్కాడు. ఈ ఘనతను స్మిత్ 24 సంవత్సరాల 42 రోజుల వయస్సులో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీపర్ లెస్ అమెస్ పేరిట ఉండేది. అమెస్ 24 సంవత్సరాల 63 రోజుల వయస్సులో ఈ రికార్డును నమోదు చేశాడు. 1930లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అమెస్ ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్తో 94 ఏళ్ల అమెస్ అల్టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. -
ఓ చేతిలో బీర్.. మరో చేతితో స్టన్నింగ్ క్యాచ్! ఇంగ్లండ్ కోచ్ ఫిదా
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆట సందర్భంగా ఓ అభిమాని ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఓ చేతిలో బీర్.. మరో చేతితో క్యాచ్ పట్టి అందరని సదరు ఫ్యాన్ ఆకట్టున్నాడు. అతడి క్యాచ్కు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్వుడ్ ఫిదా అయిపోయాడు.అసలేం జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 82 ఓవర్లో అసిత్ ఫెర్నాండో తొలి బంతిని మార్క్వుడ్కు షార్ట్ బాల్గా సందించాడు. ఆ బంతిని వుడ్ డీప్ మిడ్వికెట్ దిశగా భారీ సిక్స్గా మలిచాడు. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న ఓ వ్యక్తి సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఓ చేతిలో బీర్ పట్టుకుని మరి ఈ క్యాచ్ను అతడు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి క్యాచ్ను చూసి పాల్ కాలింగ్వుడ్ ఆశ్చర్యపోయాడు. కాలింగ్వుడ్తో తన సహచర కోచింగ్ స్టాప్తో కలిసి నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జామీ స్మిత్(111) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది. YES, SIR! 🫡Take incredible catch ✅Don't spill a drop ✅Impress the coaches ✅ pic.twitter.com/IamoUULjmb— England Cricket (@englandcricket) August 23, 2024 -
ఇంగ్లండ్ బ్యాటర్ల మతి పోగొట్టిన లంక స్పిన్నర్.. వైరల్ వీడియో
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ప్రభాత్ ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లను మతి పోగొట్టే బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ ప్రభాత్ మాయాజాలం ధాటికి నోరెళ్లబెట్టారు. ఊహించని విధంగా బంతి స్పిన్ కావడంతో ఆ ఇద్దరు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రభాత్ ఇంగ్లండ్ బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.Prabhat Jayasuriya with two absolute jaffas. 🤯pic.twitter.com/oeyooLHWPP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఇంగ్లండ్ జట్టులో ఆర్పీ సింగ్ కొడుకు.. ఎవరంటే?
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో ఇంగ్లండ్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ తరపున భారత మాజీ క్రికెటర్ కుమారుడు బరిలోకి దిగాడు. సబ్స్ట్యూట్గా ఫీల్డింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు.అతడే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తనయుడు, లంకాషైర్ క్రికెట్ క్లబ్ యంగ్ బ్యాటర్ హ్యారీ సింగ్. శ్రీలంకతో టెస్టు సిరీస్కు లంకాషైర్ క్రికెట్ క్లబ్ నుంచి చార్లీ బర్నార్డ్, కేష్ ఫోన్సెకాలో పాటు టువెల్త్(12th) మ్యాన్గా హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో మూడో ఓవర్లో సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తూ హ్యారీ మైదానంలో కనిపించాడు. లంచ్ సెషన్ తర్వాత హ్యారీ సింగ్ మళ్లీ ఫీల్డ్లో అడుగుపెట్టాడు. హ్యారీ బ్రూక్కు సబ్స్ట్యూట్గా అతడు ఫీల్డ్లోకి వచ్చాడు.ఎవరీ హ్యారీ సింగ్?అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ హ్యారీ సింగ్.. 2007 టీ20 వరల్డ్కప్ విన్నింగ్ జట్టులో భాగమైన ఆర్పీ సింగ్ తనయుడు కాదు. అతడు 1980లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ సీనియర్ కుమారుడు. ఆర్పీ సింగ్ సీనియర్ భారత జట్టుకు కేవలం రెండే రెండు మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు.1986లో ఆస్ట్రేలియాతో రాజ్కోట్, హైదరాబాద్లో రెండు వన్డేలు ఆడాడు.కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 59 మ్యాచ్లు ఆడిన సీనియర్ ఆర్పీ సింగ్.. 1413 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ కోచ్గా అతడు పనిచేశాడు. ఇక పూర్తిగా 1990ల చివరలో ఇంగ్లండ్కు మకాం మార్చాడు. లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోచ్గా కూడా పనిచేశాడు. ఇక హ్యారీ సింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది జులైలో వన్డే కప్లో హ్యారీ సింగ్ లంకాషైర్ తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు. 2022లో అతడు శ్రీలంకతో సిరీస్ కోసం ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. అతడికి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆటగాడు.. 41 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక అరంగేట్ర ఆటగాడు మిలన్ రత్నాయకే సత్తాచాటాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన అద్భుత ఇన్నింగ్స్తో అదుకున్నాడు.ఈ మ్యాచ్లో 135 బంతులు ఎదుర్కొన్న రత్నాయకే .. 6 ఫోర్లు, 2 సిక్స్లతో 72 పరుగులు సాధించాడు. ఇక తన అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టిన రత్నాయకే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే డెబ్యూ మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక స్కోరుపరుగులు చేసిన ఆటగాడిగా రత్నాయకే రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ బల్వీందర్ సంధు పేరిట ఉండేది. బల్వీందర్ 1983లో పాకిస్థాన్పై 71 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో 41 ఏళ్ల బల్వీందర్ సంధు రికార్డును రత్నాయకే బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 236 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో రత్నాయకే(72)తో పాటు కెప్టెన్ దనుంజయ డిసిల్వా(74) పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ డకెట్ (13), డేనియల్ లారెన్స్ (9) ఉన్నారు. -
ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (74), అరంగేట్రం బౌలర్ మిలన్ రత్నాయకే (72) రాణించకపోతే శ్రీలంక ఈ పాటి స్కోర్ కూడా చేయలేకపోయేది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి శ్రీలంకను దెబ్బకొట్టారు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేసి ఔటయ్యారు. లంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. బెన్ డకెట్ 13, డేనియల్ లారెన్స్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 214 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్తో టెస్టు.. ఎట్టకేలకు లంక పేసర్ అరంగేట్రం!
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. పేసర్ మిలన్ రత్నాయకేకు ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. మిలన్ ఆగమనం మినహా.. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్తో తలపడ్డ జట్టుతోనే ఇంగ్లండ్తో టెస్టులోనూ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.కాగా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆగష్టు 21న మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించగా.. మంగళవారం శ్రీలంక సైతం తమ ప్లేయింగ్ ఎలెవన్ను వెల్లడించింది.ధనంజయ డి సిల్వ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నె.. యువ క్రికెటర్ నిషాన్ మదుష్కతో కలిపి లంక ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక మిడిలార్డర్లో కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్ ఆడనుండగా.. కెప్టెన్ ధనంజయ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.అతడి తర్వాతి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ రానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండోతో పాటు కొత్తగా రత్నాయకే కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికి రెండు సార్లు జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నా తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. అయితే, ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా ఆ లోటు తీరనుంది.కాగా 28 ఏళ్ల మిలన్ రత్నాయకే ఫస్ట్క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఇందులో మూడు నాలుగు వికెట్ల హాల్స్, ఒక ఐదు వికెట్ల హాల్ ఉంది. ఇక 45 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన మిలన్ రత్నాయకే 47 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20లలో 24 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు మాత్రమే చోటు దక్కింది. ఇక పాతుమ్ నిసాంక, సదీర సమరవిక్రమ, రమేశ్ మెండిస్, నిసాల తారక, లాహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రే వాండర్సె బెంచ్కే పరిమితం కానున్నారు. కాగా 2016లో చివరగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక 0-2తో ఓటమిని చవిచూసింది. గత మూడు సందర్భాల్లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమి(ఎనిమిది టెస్టుల్లో ఏడు పరాజయం, ఒకటి డ్రా) పాలైంది.ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు:తుదిజట్లుఇంగ్లండ్డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.శ్రీలంకదిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే. -
Eng vs SL: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై లంకతో మూడు మ్యాచ్లు ఆడనుంది. మాంచెస్టర్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును సోమవారం ప్రకటించింది. వైస్ కెప్టెన్గా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు అవకాశం ఇచ్చింది. కాగా బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ఓలీ పోప్ సారథిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి డిప్యూటీగా బ్రూక్ను ఎంపిక చేసింది.ఈ జట్టులో నలుగురు పేసర్లు మార్క్ వుడ్, గుస్ అట్కిన్సన్, క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్లకు చోటిచ్చింది. కాగా గతేడాది జూన్లో ఇంగ్లండ్కు చివరగా ఆడిన పాట్స్ ఈ మ్యాచ్తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ జట్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్కు కూడా స్థానం దక్కింది. ఇక డాన్లారెన్స్, బెన్ డకెట్ ఓపెనర్లుగా దిగనుండగా.. మిడిలార్డర్లో ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జామీ స్మిత్ ఆడనున్నారు.మూడు టెస్టులు.. షెడ్యూల్ ఇదేఆగష్టు 21- 25 వరకు మాంచెస్టర్లో తొలి టెస్టు, ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు లండన్(లార్డ్స్)లో రెండో టెస్టు, సెప్టెంబరు 6- సెప్టెంబరు 10 వరకు లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం ఇంగ్లండ్- శ్రీలంక టెస్టులు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆరంభం కానున్నాయి.శ్రీలంకతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుడాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్ కెప్టెన్గా స్టార్ క్రికెటర్
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ది హండ్రడ్ లీగ్లో నార్తర్న్ సూపర్చార్జర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. పేసర్ ఆలీ రాబిన్సన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ తొడ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో పరిగెత్తలేక గ్రౌండ్ లోనే పడిపోయి వైద్య సహాయాన్ని కోరాడు. దీంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతనికి చికిత్స అందించారు.అనంతరం అస్పత్రికి తీసుకువెళ్లి స్కాన్ చేయగా అతడి గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో టెస్టు సిరీస్తో పాటు ఈ వేసవిలో మిగిలిన మ్యాచ్లన్నింటికి ఈ దిగ్గజ ఇంగ్లండ్ ఆల్రౌండర్ దూరమయ్యాడు.ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్..ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్గా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ ఓలీ పోప్ ఎంపికయ్యాడు. స్టోక్సీ డిప్యూటీగా ఉన్న పోప్కు మరోసారి కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. అయితే పోప్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంకా స్టోక్స్ స్ధానాన్ని మాత్రం భర్తీ చేయలేదు. ఇక ఇంగ్లండ్-శ్రీలంక మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. స్టోక్స్ తిరిగి మళ్లీ పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు అందుబాటులో వచ్చే అవకాశముంది.శ్రీలంకతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..ఓలీ పోప్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
ఇంగ్లండ్కు బిగ్ షాక్.. ఆ సిరీస్కు కెప్టెన్ దూరం
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ గాయకారణంగా లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ది హాండ్రడ్ లీగ్లో నార్తర్న్ సూపర్ఛార్జర్స్కు బెన్ స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో స్టోక్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో సింగిల్ కోసం వేగంగా పరిగెత్తడంతో స్టోక్సీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో తీవ్రమైన నొప్పితో అతడు విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఫిజియో సాయంతో స్టోక్స్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయంపై నార్తర్న్ సూపర్ఛార్జర్స్ కెప్టెన్, సహచరుడు హ్యారీ బ్రూక్ అప్డేట్ ఇచ్చాడు."ఈ మ్యాచ్లో దురదృష్టవశాత్తూ స్టోక్సీ గాయపడ్డాడు. అతడిని సోమవారం(ఆగస్టు 12) స్కానింగ్కు తీసుకువెళ్లనున్నాము. ఆ తర్వాత స్టోక్స్ గాయంపై ఓ అంచనా వస్తుంది. అయితే అతడు మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడతున్నాడు. నిజంగా మాకు గట్టి ఎదురు దెబ్బ" అని బ్రూక్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్కు ఇప్పటికే స్టార్ ఓపెన్ జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ స్టోక్స్ కూడా గాయపడటం ఇంగ్లండ్ జట్టు మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. లంక జట్టు ప్రకటన.. 'సిక్సర్' వీరుడికి చోటు
ఆగస్ట్ 21 నుంచి ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వ సారథ్యం వహించనుండగా.. కుసల్ మెండిస్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవల భారత్తో జరిగిన వన్డేలో ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన జెఫ్రీ వాండర్సే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.నిసాల తారక, మిలన్ రత్నాయకే కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి ఘనమైన దేశవాలీ ట్రాక్ రికార్డు ఉంది. తారక 107 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 257 వికెట్లు.. రత్నాయకే 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. తారక, రత్నాయకే.. లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అషిత ఫెర్నాండో, కసున్ రజితలతో కలిసి పేస్ విభాగంలో ఉంటారు.స్పిన్ డిపార్ట్మెంట్లో వాండర్సేతో పాటు ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ ఉన్నారు. దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్లతో లంక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.ఇంగ్లండ్ టెస్టులకు శ్రీలంక జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, అసిత ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లహిరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకేఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- ఆగస్ట్ 21-25 (ఓల్డ్ ట్రాఫోర్డ్)రెండో టెస్ట్- ఆగస్ట్ 29-సెప్టెంబర్ 2 (లార్డ్స్)మూడో టెస్ట్- సెప్టెంబర్ 6-10 (కెన్నింగ్స్టన్ ఓవల్) -
ఇంగ్లండ్ను చూస్తుంటే దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ వరల్డ్కప్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోన్న గంభీర్కు.. ఇంగ్లండ్ ఓటములకు బ్యాటింగ్ కారణమా? బౌలింగ్ కారణమన్న ప్రశ్న ఎదురైంది. "ఈ టోర్నీలో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిల్లోనూ నిరాశపరిచింది. వరల్డ్కప్ తొలి మ్యాచ్ నుంచే ఇంగ్లండ్ జట్టు చాలా నిరూత్సహంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ తీరు అయితే మరి దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్లో ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో ఆడినట్లు కన్పించడం లేదు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారు తప్ప దేశం కోసం కాదు. శ్రీలంకపై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుంది అనుకున్నాను. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్ను పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసింది. అందుకే వారు విజయం సాధించారు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! -
మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో మరో ఘోర ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను శ్రీలంక చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో నిస్సాంక(77 నాటౌట్), సమరవిక్రమ(65 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఇక లంక చేతిలో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు తమ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. రషీద్ చెత్త రనౌట్.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు అదిల్ రషీద్ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 32 ఓవర్లో ఆఖరి బంతిని మహేష్ థీక్షణ వైడ్గా సంధించాడు. అయితే వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో నాన్స్ట్రైక్లో ఉన్న అదిల్ రషీద్ కాస్త క్రీజును వదిలి బయటకు వచ్చాడు. సరిగ్గా ఇక్కడే మెండీస్ తన తెలివితేటలను ఉపయోగించాడు. అదిల్ రషీద్ క్రీజు బయట ఉండడం గమనించిన మెండీస్.. బంతని నాన్స్ట్రైక్ వైపు త్రో చేసి స్టంప్స్ను గిరాటేశాడు. కాగా మెండిస్ తన గ్లోవ్ తీసి మరి త్రో చేశాడు. అంతసమయం ఉన్నప్పటికీ రషీద్ నెమ్మదిగా వెనుక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. బంతి స్టంప్స్ను తాకే సమయానికి రషీద్ క్రీజుకు కాస్త దూరంలో ఉన్నాడు. దీంతో రనౌట్గా వెనుదిరిగాడు. క్రీజులో బద్దకంగా వ్యవహరించిన రషీద్ భారీ మూల్యం చెల్లించకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. అయినా గర్వపడుతున్నాం.. మాది చెత్త టీమ్ కాదు: బట్లర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
SL VS ENG: జయసూర్య రికార్డును సమం చేసిన నిస్సంక
ప్రస్తుత ప్రపంచకప్లో భీకర ఫామ్లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్లు కూడా ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్ 2011లో ఈ ఘనత సాధించారు. గిల్ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక.. నిస్సంక.. ఇంగ్లండ్పై నిన్న సాధించిన హాఫ్ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్తో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు. గిల్, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10, టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్
ICC WC 2023- Jos Buttler Comments On Loss: ‘‘మాకిది కష్టకాలం. కెప్టెన్గా నాతో పాటు మా ఆటగాళ్లంతా పూర్తిగా నిరాశకు లోనయ్యాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. మా జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇపుడిలా జరిగిపోయింది. అయినా ఒక్కరోజులో మాది చెత్త టీమ్గా మారిపోదు కదా! అయితే, బాధ.. మాపై మాకు కోపం.. విసుగు వస్తున్నాయి. మేమిలా విఫలం చెందడానికి ఇదీ కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. సెలక్షన్ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మాకది అసలు సమస్యే కాదు. అయితే, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాం అనేది మాత్రం వాస్తవం. ఆ విషయంలో గర్వపడుతున్నాం ఈరోజు రూట్ రనౌట్ కావడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా మేము ఇలాంటి తప్పులు చేయము. ఈరోజు భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందాం. బ్యాట్, బంతి.. రెండింటితోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాం. ఏదేమైనా పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, మేము నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన మ్యాచ్లలో తిరిగి పుంజుకుని రాణిస్తామనే నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’’అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది. శ్రీలంక చేతిలో మరోసారి చిత్తుగా తాజాగా బెంగళూరులో గురువారం శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లండ్. వరల్డ్కప్ చరిత్రలో ఇంగ్లండ్పై ఏకపక్ష విజయాలతో దూసుకుపోతున్న శ్రీలంక మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడంతో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి ఎదురైంది. దీంతో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బట్లర్ బృందం సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్థాయికి తగ్గట్లు ఆడలేక పరాభవాల పాలవుతున్నామని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు: ►టాస్- ఇంగ్లండ్- బ్యాటింగ్ ►ఇంగ్లంగ్ స్కోరు: 156 (33.2) ►శ్రీలంక స్కోరు: 160/2 (25.4) ►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాహిరు కుమార(మూడు వికెట్లు) ►టాప్ స్కోరర్: పాతుమ్ నిసాంక(77- నాటౌట్) చదవండి: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి అవుట్?
ICC WC 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు మరో ఘోర పరాభవం! గత మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్ బృందాన్ని.. గురువారం నాటి మ్యాచ్లో శ్రీలంక మట్టికరిపించింది. వరల్డ్కప్లో ఇంగ్లండ్పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదో విజయం నమోదు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో లంక పేసర్లు లాహిరు కుమార, కసున రజిత, ఏంజెలో మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. అదరగొట్టిన లంక పేసర్లు ఓపెనర్ డేవిడ్ మలన్(28)తో పాటు మొయిన్ అలీ వికెట్ను ఏంజెలో మాథ్యూస్ పడగొట్టగా.. బెన్ స్టోక్స్(43), కెప్టెన్ జోస్ బట్లర్(8), లియామ్ లివింగ్స్టోన్(1) రూపంలో కుమార మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక కసున్ రజిత.. మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో(30)తో పాటు క్రిస్ వోక్స్(0)ను అవుట్ చేశాడు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ మార్క్ వుడ్ను పెవిలియన్కు పంపి తానూ ఓ వికెట్ తీశాడు. ఈ క్రమంలో 33.2 ఓవర్లలో 156 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) నిసాంక సూపర్ ఇన్నింగ్స్.. సమర విక్రమ హిట్టింగ్ ఇక శ్రీలంక లక్ష్య ఛేదనలో డేవిడ్ విల్లే ఆరంభంలోనే ఓపెనర్ కుశాల్ పెరీరా(4) వికెట్ తీశాడు. అదే విధంగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్ను కూడా 11 పరుగులకే పెవిలియన్కు పంపాడు. అయితే, ఓపెనర్ పాతుమ్ నిసాంక(77- నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ(65- నాటౌట్) చక్కటి సమన్వయంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. View this post on Instagram A post shared by ICC (@icc) సిక్సర్తో గెలుపు ఖరారు చేసిన నిసాంక ఆఖరి వరకు అజేయంగా నిలిచి అద్బుత అర్ధ శతకాలతో శ్రీలంకను గెలుపుతీరాలకు చేర్చారు. 25.4 ఓవర్లలోనే మ్యాచ్ను ఫినిష్ చేశారు. పాతుమ్ ఆఖరి సిక్సర్తో లంక ఖాతాలో రెండో విజయం నమోదు కాగా..ఇంగ్లండ్కు వరుసగా మరోసారి ఓటమే ఎదురైంది. లాహిరు కుమార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ సెమీస్ చేరుతుందా? అంతేకాదు.. శ్రీలంకతో మ్యాచ్లో పరాజయం నేపథ్యంలో ఇంగ్లండ్ సెమీస్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. గత ఎడిషన్లో సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి కనీసం టాప్-4లో కూడా చేరకుండా నిష్క్రమించే దుస్థితికి చేరువైంది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో ఇంగ్లండ్ నాలుగు ఓడిపోయింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఒకవేళ మిగిలిన మ్యాచ్లలో గెలిచినా. .ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి! -
పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా! లంక దెబ్బకు..
WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టోక్స్ 43 పరుగులతో వన్డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్లు కూడా లంకతో మ్యాచ్లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్తో మ్యాచ్కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. స్టార్ పేసర్కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
మరో రసవత్తర సమరం.. సెమీస్కు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాకు శృంగభంగం
టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తొలి జట్టుగా సెమీస్కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్ 5) జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలిస్తే సెమీస్కు చేరాలని భావించిన ఆసీస్.. ఇంగ్లండ్ గెలవడంతో సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఆసీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్), అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
SL Vs ENG: ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం.. సెమీస్కు
ICC Mens T20 World Cup 2022- England vs Sri Lanka Updates: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. కీలక మ్యాచ్లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్-1 నుంచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ 47 పరుగులతో రాణించగా.. బెన్ స్టోక్స్ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో బట్లర్ బృందం టీ20 ప్రపంచకప్-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్కు చేరుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు: టాస్: శ్రీలంక శ్రీలంక: 141/8 (20) ఇంగ్లండ్: 144/6 (19.4) మొయిన్ అలీ ఔట్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ధనంజయ బౌలింగ్లో షనకకు క్యాచ్ ఇచ్చి మొయిన్ అలీ (1) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 113. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో లభించిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 14వ ఓవర్ తొలి బంతికి కుమార బౌలింగ్లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ (4) ఔటయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రూక్ అవుట్ డిసిల్వ బౌలింగ్లో బ్రూక్(4) మూడో వికెట్గా వెనుదిరిగాడు. స్టోక్స్, లివింగ్స్టోన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 93/3 (11.1) రెండో వికెట్ డౌన్ అర్ధ శతకానికి చేరువగా ఉన్న హేల్స్(47)ను హసరంగ బౌల్డ్ చేశాడు. పదో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు: 82/2 (9.1). బ్రూక్, స్టోక్స్ క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనర్ హసరంగ బౌలింగ్లో కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరెంతంటే! స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. లంక బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బంతికి బౌండరీకి తరలిస్తూ పరుగులు పిండుకుంటున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 70/0 (6). బట్లర్ 25, అలెక్స్ హేల్స్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెమీస్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగంది ఇంగ్లండ్. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్ పాతుమ్ నిసాంక 67 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో చివరి ఓవర్లోనే లంక రాజపక్స, హసరంగ, కరుణరత్నె వికెట్లు కోల్పోయింది. రాజపక్స అవుట్ రాజపక్స(22) రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. హసరంగ, కరుణరత్నె క్రీజులో ఉన్నారు. నిరాశ పరిచిన కెప్టెన్ లంక కెప్టెన్ దసున్ షనక మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో అతడు వెనుదిరగడంతో లంక ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 128/5 (18). హసరంగ, రాజపక్స క్రీజులో ఉన్నారు. నిసాంక ఇన్నింగ్స్కు బ్రేక్ వేసిన రషీద్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో నిసాంక(67) అవుటయ్యాడు. దీంతో లంక నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు- 118/4 (15.3). రాజపక్స, దసున్ షనక క్రీజులో ఉన్నారు. అర్ధ శతకంతో జోరు మీదున్న నిసాంక 14 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 104/3. భనుక రాజపక్స 7, పాతుమ్ నిసాంక 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన లంక స్టోక్స్ బౌలింగ్లో మలన్కు క్యాచ్ ఇచ్చిన అసలంక(8) మూడో వికెట్గా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో స్కోరు: 80-2 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) రెండో వికెట్ కోల్పోయిన లంక డిసిల్వ(9) రూపంలో లంక రెండో వికెట్ కోల్పోయింది. అసలంక క్రీజులోకి వచ్చాడు. దంచి కొడుతున్న నిసాంక 8 ఓవర్లలో లంక స్కోరు: 71-1. నిసాంక 42, డిసిల్వ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి లంక స్కోరు: 54/1 (6) తొలి వికెట్ కోల్పోయిన లంక లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(18).. క్రిస్ వోక్స్ బౌలింగ్లో లివింగ్స్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 39-1. పాతుమ్ నిసాంక 19, ధనుంజ డి సిల్వా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్కు చావో రేవో టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 గ్రూప్-1లో శ్రీలంకతో మ్యాచ్ ఇంగ్లండ్కు చావో రేవోలా తయారైంది. లంకపై గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్కు.. ఇంగ్లండ్ ఇంటికి వెళ్లనుంది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్లో కచ్చితంగా ఇంగ్లండ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. వర్షం అంతరాయం వల్ల ఐర్లాండ్తో మ్యాచ్లో ఓడిన ఇంగ్లండ్.. నాలుగు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో ఉంది. అయితే నెట్ రన్రేట్ ప్లస్లో ఉండడం ఇంగ్లండ్కు సానుకూలాంశం. లంకపై సాధారణ విజయం నమోదు చేసినా ఇంగ్లీష్ జట్టు సెమీస్కు చేరుకుంటుంది. అంతిమంగా ఇంగ్లండ్కు కావాల్సింది విజయం. ఇంగ్లండ్: జోస్ బట్లర్(వికెట్ కీపర్, కెప్టెన్), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత ఇక ఇంగ్లండ్ జట్టులో హిట్టర్లకు కొదువ లేదు. బ్యాటింగ్లో తొలి స్థానం నుంచి 10వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు జట్టులో ఉన్నారు. బట్లర్, స్టోక్స్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్లతో టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తుండగా.. మిడిలార్డర్లో లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీలు ఉన్నారు. ఇక బౌలింగ్లో మార్క్వుడ్, క్రిస్ వోక్స్, సామ్ కరన్లు తమ పేస్ పదును చూపిస్తుండగా.. ఆదిల్ రషీద్ స్పిన్తో అదరగొడుతున్నాడు. అటు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ను తమతో పాటు ఇంటికి తీసుకుపోవాలని భావిస్తుంది. అయితే లంక జట్టు ప్రస్తుతం అనుకున్న రీతిలో ఆడడం లేదు. ఆటగాళ్ల గాయాలు జట్టును బాగా దెబ్బతీశాయి. విజయంతో టోర్నీని ముగించాలని లంక ఆశిస్తుంది. ► ఇరుజట్ల రికార్డులు పరిశీలిస్తే.. ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 13 సార్లు తలపడగా ఇంగ్లండ్ 9సార్లు.. శ్రీలంక నాలుగుసార్లు నెగ్గాయి. -
53 ఏళ్ల వయసులో అదరగొట్టాడు.. లంక లెజెండ్స్ ఘన విజయం
రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్పై శ్రీలంక లెజెండ్స్ ఘన విజయం సాధించింది. 53 ఏళ్ల వయసులోనూ సనత్ జయసూర్య(4-2-3-4) తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన జయసూర్య రెండు మెయిడెన్లు సహా కేవలం మూడు పరుగుల్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.అతని స్పిన్ ధాటికి ఇంగ్లండ్ లెజెండ్స్ 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ లెజెండ్స్ బ్యాటర్స్లో ఇయాన్ బెల్ 15 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మస్టర్డ్ 14 పరుగులు చేశాడు. లంక బౌలింగ్లో సనత్ జయసూర్య 4 వికెట్లతో చెలరేగగా.. చమర డిసిల్వా, కులశేఖర చెరో రెండు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, జీవన్ మెండిస్ తలా ఒక వికెట్ తీశారు. కాగా లంక జట్టులో ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి లంక లెజెండ్స్ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దిల్షాన్ మునవీరా 24, ఉపుల్ తరంగ 23, తిలకరత్నే దిల్షాన్ 15 పరుగులు చేశారు. చివర్లో జీవన్ మెండిస్ 8 పరుగులు నాటౌట్ చేసి జట్టును గెలిపించాడు. కాగా స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసిన జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. Sri Lanka Legends continue their good run as they defeat the England Legends by 7 wickets! The bowling attack led by Sanath Jayasuriya was too good for the England Legends as they were bundled out for a paltry 78.#ENGLvsSLL #RoadSafetyWorldSeries #RSWS #YehJungHaiLegendary pic.twitter.com/hmOaFLvfma — Road Safety World Series (@RSWorldSeries) September 13, 2022 -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్..
Eoin Morgan Becomes The Most Successful T20I Captain Of All Time: అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్గా (43 విజయాలు) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకపై గెలుపుతో మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. మోర్గాన్కు ముందు ఈ రికార్డు(42 విజయాలు) అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎంఎస్ ధోని (భారత్)ల పేరిట సంయుక్తంగా ఉండేది. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపుతో మోర్గాన్ వారి రికార్డును బద్దలు కొట్టాడు. మోర్గాన్ ఈ ఘనతను సాధించేందుక 69 మ్యాచ్లు తీసుకోగా.. ధోని 72, అస్గర్ అఫ్గాన్ 52 మ్యాచ్ల్లో సాధించారు. ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్గా కొనసాగుతున్న మోర్గాన్.. ఇంగ్లండ్ జట్టును 2019 వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
మ్యాచ్ గెలవడంతో పాటు రికార్డుల మోత మోగించింది
England Breaks Records Vs SL Match T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటవడంతో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టింది. జాస్ బట్లర్ సెంచరీతో మొదలుకొని.. విజయం సాధించడం వరకు ఇంగ్లండ్ సాధించిన రికార్డులు పరిశీలిద్దాం. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ (43 విజయాలు) రికార్డు నెలకొల్పాడు. 42 విజయాలతో అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎమ్మెస్ ధోని (భారత్) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. ►టి20 ప్రపంచకప్లలో ఇది 9వ సెంచరీ. బట్లర్కు ముందు గేల్ (2 సార్లు), మెకల్లమ్, అహ్మద్ షహజాద్, రైనా, హేల్స్, తమీమ్, జయవర్ధనే ఈ ఘనత సాధించారు. ►అంతర్జాతీయ పురుషుల క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో గత ఏడాది హీథెర్ నైట్ ఇంగ్లండ్ తరఫున ఈ ఘనత సాధించింది. ►అంతర్జాతీయ టి20ల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో అలెక్స్ హేల్స్ (116 నాటౌట్; శ్రీలంకపై 2014లో), డేవిడ్ మలాన్ (103 నాటౌట్; న్యూజిలాండ్పై 2019లో), లివింగ్స్టోన్ (103; పాకిస్తాన్పై 2021లో) ఈ ఘనత సాధించారు. ►టి20 ప్రపంచకప్లోని ఓ మ్యాచ్లో అత్యధిక బంతులు ఆడిన బ్యాటర్గా జోస్ బట్లర్ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్లో బట్లర్ 67 బంతులు ఎదుర్కొన్నాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (66 బంతులు; భారత్పై 2010లో), మర్లోన్ సామ్యూల్స్ (66 బంతులు; ఇంగ్లండ్పై 2016లో) పేరిట సంయుక్తంగా ఉంది. చదవండి: T20 World Cup 2021 IND Vs NZ: కోహ్లి వ్యూహాలను ఏకి పారేసిన గంభీర్ -
T20 WC 2021: బట్లర్ ఊచకోత.. ఇంగ్లండ్ దర్జాగా సెమీస్కు
England Beat Sri Lanka By 26 Runs Enter Semifinal T20 WC 2021.. నాలుగు మ్యాచ్లలో నాలుగు విజయాలు... ఎదురులేని ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్ మరో గెలుపుతో అధికారికంగా టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బట్లర్ మెరుపు శతకంతో ఇంగ్లండ్కు మంచి స్కోరు అందించగా... అనంతరం బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సమష్టిగా సఫలమయ్యారు. సోమవారం జరిగిన గ్రూప్–1 సూపర్–12 మ్యాచ్లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఈ టోర్నీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలవగా... కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (36 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం లంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. హసరంగ (21 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, జోర్డాన్ రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ రాణించిన మోర్గాన్... పవర్ప్లేలో 36 పరుగులు... సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 47 పరుగులే... తర్వాతి 4 ఓవర్లలో 36 పరుగులు రాబట్టి కొంత ఊపు... ఆపై చివరి 6 ఓవర్లలో ఏకంగా 83 పరుగులు! ఇంగ్లండ్ బ్యాటింగ్ ఇలా వేర్వేరు దశలుగా సాగింది. ఆరు ఓవర్లలోపే ఆ జట్టు జేసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్స్టో (0) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బట్లర్, మోర్గాన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టంగా మారిపోగా, ఇద్దరు బ్యాటర్లు కూడా అనవసరపు దూకుడు ప్రదర్శించకుండా సంయమనంతో ఇన్నింగ్స్ను నడిపించారు. సుదీర్ఘ కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మోర్గాన్ కూడా తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఒకదశలో 21 బంతుల్లో అతను 10 పరుగులే చేశాడు. ఎట్టకేలకు తాను ఎదుర్కొన్న 22వ బంతికి తొలి ఫోర్ కొట్టిన కెప్టెన్... ఆ తర్వాత కాస్త ధాటిని ప్రదర్శించి బంతులు, పరుగుల లెక్కను సమం చేశాడు. బట్లర్ సూపర్... గత మ్యాచ్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 71 పరుగులు చేసిన బట్లర్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. పరిస్థితిని బట్టి అతను కూడా ఆరంభంలో నెమ్మదిగా ఆడినా చివర్లో చెలరేగిపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో జాగ్రత్తపడి పేసర్లపై సత్తా చాటాడు. కరుణరత్నే ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి హాఫ్ సెంచరీకి అతనికి కేవలం 22 బంతులే సరిపోయాయి. కుమార ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన బట్లర్, ఆపై షనక ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఇన్నింగ్స్ చివరి బంతి వేయడానికి ముందు 95 వద్ద నిలిచిన అతను... ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ బాది టి20 కెరీర్లో తొలి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ బౌలింగ్లో 24 బంతులు ఆడి 12 పరుగులే చేసిన బట్లర్, పేసర్ల బౌలింగ్లో 43 బంతుల్లో 89 పరుగులు బాదాడంటే అతని వ్యూహం ఎలాంటిదో అర్థమవుతుంది. చదవండి: T20 WC 2021: కోహ్లికి జట్టు నుంచి సపోర్ట్ లేదా?! కీలక భాగస్వామ్యం... ఛేదనలో లంక కూడా తడబడింది. పవర్ప్లేలోనే ఆ జట్టు నిసాంక (1), అసలంక (21), కుశాల్ పెరీరా (7) వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఆపై అవిష్క (13), రాజపక్స (26) కూడా అవుట్ కావడంతో 76 వద్దే సగం జట్టు పెవిలియన్ చేరింది. భారీ ఓటమి ఖాయమనుకున్న ఈ దశలో హసరంగ, షనక (26; 2 ఫోర్లు, సిక్స్) పోరాడారు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే 53 పరుగులు జోడించడంతో లంక విజయంపై ఆశలు రేగాయి. అయితే రాయ్, బిల్లింగ్స్ ‘ర్యాలీ’ క్యాచ్తో హసరంగ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 14 బంతుల వ్యవధిలో 8 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయి లంక పరాజయంపాలైంది. -
టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్
Jos Buttler Maiden T20I Century.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ మెరుపు శతకంతో మెరిశాడు. 67 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో లంక బౌలర్లను ఊచకోత కోసిన బట్లర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా బట్లర్కు టి20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేగాక ఈ ప్రపంచకప్లో బట్లర్దే తొలి సెంచరీ. అంతకముందు బట్లర్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇక ఇప్పటివరకు టి20 ప్రపంచకప్ల్లో 8 సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా బట్లర్ సెంచరీతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ జాబితాలో క్రిస్ గేల్(2007, 2016 టి20 ప్రపంచకప్లు), సురేశ్ రైనా(2010 టి20 ప్రపంచకప్), మహేళ జయవర్దనే(2010 టి20 ప్రపంచకప్), బ్రెండన్ మెక్కల్లమ్(2012 టి20 ప్రపంచకప్), అలెక్స్ హేల్స్(2014 టి20 ప్రపంచకప్), అహ్మద్ షెహజాద్(2014 టి20 ప్రపంచకప్), తమీబ్ ఇక్బాల్(2016 టి20 ప్రపంచకప్) ఉన్నారు. తాజాగా జాస్ బట్లర్ వారి సరసన చేరాడు. -
ENG Vs SL: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఖాతాలో మరో విజయం
బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఖాతాలో మరో విజయం సమయం 23: 14.. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 137 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్ 26 పరగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. లంక జట్టులో హసరంగ(34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, లివింగ్స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు జోస్ బట్లర్ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. షనక(26) రనౌట్ సమయం 23:00.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు తడబడుతుంది. 17.2వ ఓవర్లో షనక(25 బంతుల్లో 26: 2 ఫోర్లు, సిక్స్) రనౌటయ్యాడు. దీంతో 130 పరుగుల వద్ద లంక జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో చమీరా, కరుణరత్నే ఉన్నారు. బిల్లింగ్స్ అద్భుత క్యాచ్.. హసరంగ(34) ఔట్ సమయం 22:55.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సామ్ బిలింగ్స్ అద్భుత క్యాచ్లో భాగస్తుడుకావడంతో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. లివింగ్స్టోన్ వేసిన 16.5వ ఓవర్లో హసరంగ(21 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ బాట పట్టాడు.17 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 130/6. క్రీజ్లో షనక(26), కరుణరత్నే ఉన్నారు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. రాజపక్స(26) ఔట్ సమయం 22:19.. ధాటిగా ఆడుతున్న రాజపక్స(18 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో జేసన్ రాయ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 77/5. క్రీజ్లో షనక(7), హసరంగ ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. ఫెర్నాండో(13) ఔట్ సమయం 22:04.. ఇన్నింగ్స్ 8.3వ ఓవర్లో శ్రీలంకకు మరో షాక్ తగిలింది. క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో ఆవిష్క ఫెర్నాండో(13 బంతుల్లో 14; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 58/34. క్రీజ్లో రాజపక్స(15), షనక(1) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(7) ఔట్ సమయం 21:48.. ఆదిల్ రషీద్ వేసిన ఇన్నింగ్స్ 5.1వ ఓవర్లో మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి కుశాల్ పెరీరా(9 బంతుల్లో 7) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 40/3. క్రీజ్లో అవిష్క ఫెర్నాండో(6), రాజపక్స ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(21) ఔట్ సమయం 21:38.. ధాటిగా ఆడుతున్న అసలంక(16 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్) ఆదిల్ రషీద్ బౌలింగ్లో అనవసర షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. 3.3 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 24/2. క్రీజ్లో కుశాల్ పెరీరా(2), అవిష్క ఫెర్నాండో ఉన్నారు. టార్గెట్ 164.. మూడో బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక సమయం 21:27.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మోర్గాన్ అద్భుతమైన త్రో చేయడంతో పథుమ్ నిస్సంక(1) రనౌటయ్యాడు. దీంతో లంకేయులు 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయారు. తొలి ఓవర్ తర్వాత శ్రీలంక స్కోర్ 2/1. క్రీజ్లో కుశాల్ పెరీరా, అసలంక(1) ఉన్నారు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ 163/4; శ్రీలంక టార్గెట్ 164 సమయం: 21:18.. ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్(101, 67 బంతులు, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన బట్లర్ టి20ల్లో మెయిడెన్ సెంచరీ నమోదు చేశాడు. కాగా ఇంగ్లండ్ చేసిన 163 పరుగుల్లో 101 పరుగులు బట్లర్ నుంచి వచ్చినవే. మిగతావారిలో మోర్గాన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ 3, దుశ్మంత చమీరా ఒక వికెట్ తీశారు. మోర్గాన్(40) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 21:10.. బట్లర్తో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40) హసరంగ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 87 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఉతికి ఆరేస్తున్న బట్లర్.. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ 105/3 సమయం 20:48.. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన బట్లర్ మధ్య ఓవర్లలో జూలు విదిల్చాడు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. టోర్నీలో మరో అర్ధశతకం నమోదు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ 15 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్లో బట్లర్(49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్(26 బంతుల్లో 22; ఫోర్, సిక్స్) ఉన్నారు. ఇంగ్లండ్ భరతం పడుతున్న హసరంగ.. మూడో వికెట్ డౌన్ సమయం 20:00.. లంక స్పిన్నర్ హసరంగ ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పడుతున్నాడు. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ను పెవిలియన్కు పంపిన అతను.. 5వ ఓవర్ రెండో బంతికి బెయిర్స్టో(0)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 35 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్లో జోస్ బట్లర్(17 బంతుల్లో 18), మోర్గాన్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం 19:55.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్ డేవిడ్ మలాన్(8 బంతుల్లో 6; ఫోర్) చమీరా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో జోస్ బట్లర్(16 బంతుల్లో 17), బెయిర్స్టో ఉన్నారు. రెండో ఓవర్లోనే ఇంగ్లండ్కు షాక్ సమయం 19:35.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. లంక సూపర్ స్పిన్నర్ హసరంగ బౌలింగ్లో జేసన్ రాయ్(6 బంతుల్లో 9; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 15/1. క్రీజ్లో జోస్ బట్లర్(4 బంతుల్లో 5), డేవిడ్ మలాన్(2 బంతుల్లో 1) ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా సోమవారం(నవంబర్ 1) రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్లో ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకోగా.. శ్రీలంక 3 మ్యాచ్ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించి సెమీస్ చేరేందుకు పోరాటం సాగిస్తోంది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఓవరాల్గా ఇరు జట్లు 12 సందర్భాల్లో తలపడగా.. ఇంగ్లండ్ 8, శ్రీలంక 4 సార్లు విజయాలు సాధించాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు తలపడిన మ్యాచ్ల్లో సైతం ఇంగ్లండ్(3-1)దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో ఇంగ్లండ్(5-0) తిరుగులేని ఆధిక్యం కనబర్చింది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇంగ్లండ్ కంటే శ్రీలంకకే మెరుగైన రికార్డు ఉంది. పొట్టి ప్రపంచకప్లో లంకేయులు ఓసారి ఛాంపియన్గా(2014), మరో రెండుసార్లు(2009, 2012) రన్నరప్గా నిలిచారు. మరోవైపు ఇంగ్లండ్ ఓ సారి ఛాంపియన్గా(2010) అవతరించి.. మరోసారి రన్నరప్గా(2016) నిలిచింది. తుది జట్లు: ఇంగ్లండ్ : జేసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలాన్, జానీ బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, తైమల్ మిల్స్ శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్కీపర్), పథుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లహీరు కుమార -
వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన ఇంగ్లండ్ ప్లేయర్..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్.. కెరీర్ అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్లో 6 వికెట్లు పడగొట్టిన వోక్స్(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(737 పాయింట్లు) నంబర్వన్గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్కు దిగజారాడు. 📈 @ChrisWoakes makes a charge in the latest @MRFWorldwide ICC Men’s ODI Bowling Rankings, with the @EnglandCricket quick jumping to No.3. Full rankings ➡️ https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/LazEtSmQHB — ICC (@ICC) July 7, 2021 ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్లో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్కు చేరుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మర్క్రమ్లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో ప్రొటీస్.. ఆతిధ్య జట్టుపై 3-2తో గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్కు చేరుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలాన్, ఆసీస్ ఆరోన్ ఫించ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు. 🔺 After entering the top 10 last week, @windiescricket opener Evin Lewis moves up a spot on the @MRFWorldwide ICC Men's T20I Batting Rankings. pic.twitter.com/TugCjFugmb — ICC (@ICC) July 7, 2021 -
తీవ్ర దుమారం.. క్షమాపణలు చెప్పిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన సెక్సియెస్ట్ కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు. లంక, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే సందర్భంగా.. కామెంటేటర్గా వ్యవహరించిన దినేశ్ చేసిన ‘బ్యాట్లు- పక్కవాళ్ల భార్య’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. తప్పుడు ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయలేదు. కావాలని చేసిన కామెంట్లు ఎంతమాత్రం కావు. కానీ, తప్పు జరిగిపోయింది. అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఈ విషయంపై నా తల్లి, భార్య కూడా నన్ను తిట్టారు. సారీ.. ఇంకోసారి తప్పు జరగదు’ అంటూ ఆదివారం ఒక సందేశం విడుదల చేశాడు దినేశ్ కార్తీక్. కాగా, 36 ఏళ్ల ఈ బ్యాట్స్మన్ కమ్ వికెటకీపర్ భారత్ తరపున 94 వన్డేలు, 32 టీ20లు, 26 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్గా మారిన దినేశ్.. అందులోనూ అదరగొడుతుండడం విశేషం. ‘ప్లేయర్స్ తమ బ్యాట్స్ కంటే అవతలి వాళ్ల బ్యాట్స్ను ఎక్కువగా ఇష్టపడతారని, అవి పక్కవాళ్ల భార్యల్లాంటివేనని. ఆకర్షణనీయంగా ఉంటాయని, అందుకే ఆకర్షితులు అవుతార’ని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దినేశ్ కార్తీక్. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 -
సిరీస్ కైవసం: ‘వరల్డ్ కప్నకు ముందే ఆ లోపాలు సవరించుకోవాలి’
బ్రిస్టల్/ఇంగ్లండ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డే వర్షంతో రద్దయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 2–0తోనే సిరీస్ను సరిపెట్టుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 41.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. షనక (48 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ టామ్ కరన్ (4/35) రాణించాడు. ఇన్నింగ్స్ విరామంలో మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... ‘‘ఈరోజు కూడా మేమే పైచేయి సాధించాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉండే మజాను ఆస్వాదించాం. మా ఆటగాళ్లంతా ఎంతో పట్టుదలగా నిలబడ్డారు. సమిష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. విల్లీ అద్భుతంగా రాణించాడు. వరల్డ్ కప్-2019లో అతడు భాగస్వామ్యం కాలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇక టామ్ కరన్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో తను విఫలమైనా.. నేడు 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, మేం డెత్ ఓవర్ల బౌలింగ్పై మరింత దృష్టి సారించాల్సి ఉంది. మిడిల్ ఓవర్స్లో కూడా నిలకడగా ఆడాల్సి ఉంది. ప్రపంచకప్నకు ముందే ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. పాకిస్తాన్తో ప్రారంభం కాబోయే సిరీస్ కోసం సన్నద్ధమవుతాం’’ అని చెప్పుకొచ్చాడు. Oh @jbairstow21! 😱 Scorecard/clips: https://t.co/litP0weU1U 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/AS1y93rmpM — England Cricket (@englandcricket) July 4, 2021 We need 167 to win 🏏 Scorecard/clips: https://t.co/litP0vXjam 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/QGFTHIJHTa — England Cricket (@englandcricket) July 4, 2021 -
'ఇతరుల బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి..' డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
లండన్: బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివని, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని టీమిండియా మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ అన్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా క్రికెట్ వ్యాఖ్యాతగా మారిన డీకే.. బ్యాట్స్మెన్, బ్యాట్ల మధ్య రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ రకంగా స్పందించాడు. బ్యాట్స్మెన్కు తమ బ్యాట్లు నచ్చకపోవడం అనేది చాలా కామన్ విషయమని, ఇతర బ్యాట్స్మెన్లు వాడే బ్యాట్లపై వారికి విపరీతమైన మోజు ఉంటుందని, ఓ విధంగా చెప్పాలంటే ఇతరుల బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని కార్తీక్ సరదాగా అన్నాడు. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 కార్తీక్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలు గుర్తుకువచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమోనని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా హర్షా భోగ్లే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తమ కామెంటరీలో ఇలాంటి సరదా విషయాలను ప్రస్తావించి ప్రేక్షకులను నవ్విస్తుంటారు. ఇదిలా ఉంటే, వ్యాఖ్యాతగా సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టడానికి గల కారణాలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించాడు. 'వ్యాఖ్యాతగా మారడం అనేది మాటల్లో వర్ణించలేనని, క్రికెట్లోని మరో కోణాన్ని చూడటానికే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానని పేర్కొన్నాడు. భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకుండానే వ్యాఖ్యత అవతారమెత్తాడు. 2019 వన్డే ప్రపంచకప్లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన ఆయన.. జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ అతన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
శ్రీలంకతో చివరి వన్డే: హార్డ్ హిట్టర్ వచ్చేస్తున్నాడు
లండన్: శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్పై కూడా కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి వన్డేలో లంకపై ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరగనున్న చివరి వన్డేకు ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ టామ్ బాంటన్ను ఈసీబీ జట్టులోకి తీసుకొచ్చింది. డేవిడ్ మలన్కు బ్యాకప్గా టామ్ బాంటన్ను తీసుకున్నట్లు తెలిపింది. కాగా డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బ్రిస్టల్ వేదికగా జూలై 4న జరగనుంది. టామ్ బాంటన్ ఇటీవలే టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున 47 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ఆధారంగా టామ్ బాంటన్ను మరోసారి జట్టులోకి పిలిచినట్లు తెలుస్తుంది. ఇక టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున ఆడుతున్న బాంటన్ ఈరోజే జట్టుతో కలవనుండడంతో డెర్బిస్తో జరగనున్న మ్యాచ్కు దూరం కానున్నాడు. ఇక బాంటన్ చివరిసారిగా ఇంగ్లండ్ తరపున ఆగస్టు 2020లో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఆడాడు. -
Sri Lanka Vs England: ఇంగ్లండ్దే తొలి వన్డే
చెస్టర్–లీ–స్ట్రీట్: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక 42.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (73; 7 ఫోర్లు), హసరంగ (54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మరో బౌలర్ విల్లే 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. జో రూట్ (79 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్ బెయిర్స్టో (43; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. దుశ్మంత చమీరకు 3 వికెట్లు దక్కాయి. చదవండి: సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు -
సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు
డర్హమ్: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ కెమెరా కంటికి చిక్కిన లంక స్టార్ ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలను తక్షణమే స్వదేశానికి పయనమవ్వాలని లంక బోర్డు ఆదేశించింది. లంక తుది జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఇంగ్లండ్తో చివరి టీ20 అనంతరం బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించి హోటల్ పరిధి దాటి వెలుపలికి వచ్చారు. అంతటితో ఆటగకుండా రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ.. తమ దేశ అభిమాని కంట బడ్డారు. Familiar faces in Durham tonight, enjoying their tour! Obviously not here to play cricket, this video was taken at 23.28 Sunday. Disappointing performance by these cricket players but not forgetting to enjoy their night at Durham. RIP #SrilankaCricket #KusalMendis #ENGvSL pic.twitter.com/eR15CWHMQx — Nazeer Nisthar (@NazeerNisthar) June 28, 2021 వీరి నిర్వాకాన్ని ఆ అభిమాని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లంక క్రికెట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అంశాన్ని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్గా పరిగణించి, విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ ముగ్గరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించారని రుజువు కావడంతో వారిపై తక్షణ వేటు వేశారు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు
సౌతాంఫ్టన్: ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ సిరీస్కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న ఫిల్ విట్టికేస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టీ20 సందర్భంగా పలుపురు అధికారులతో పాటు కొందరు క్రికెటర్లు రిఫరితో సన్నిహితంగా మెలిగారు. రిఫరికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అందరూ సహజంగానే తమ విధులు నిర్వహించారు. అయితే, రోజు వారి పరీక్షల్లో భాగంగా రిఫరికి కరోనా టెస్ట్ నిర్వహించడంతో అసలు విషయం వెలుగుచూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు(ఆదివారం) ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయనను కాంటాక్ట్ అయిన వారందరూ సురక్షితంగానే ఉన్నప్పటికీ.. సిరీస్ సజావుగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిఫరితో సన్నిహితంగా ఉన్నవారంతా 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండనున్నారు. దీంతో జూన్ 29న ఇరు జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్ అనంతరం శ్రీలంక జట్టు స్వదేశంలో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: సచిన్ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్ -
సొంత జట్టుకు వ్యతిరేకంగా లంక అభిమానుల ప్రచారం..
కొలొంబో: ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో దారుణంగా విఫలమై 0-3తేడాతో సిరీస్ను కోల్పోయిన శ్రీలంక జట్టుపై ఆ దేశ అభిమానులు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన చివరి మ్యాచ్లో లంక జట్టు 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో అ దేశ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ జట్టును టార్గెట్ చేశారు. వరుస ఓటములతో విసిగిపోయిన వారు తమ జట్టు ఆటగాళ్లకు వ్యతిరేకంగా (#unfollowcricketers) అనే హ్యాష్ట్యాగ్తో ప్రచారం ప్రారంభించారు. ఫేస్బుక్లో శనివారం నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్బుక్ పేజీలను వేలాదిమంది అభిమానులు బాయ్కాట్ చేశారు. శ్రీలంక ఆడే మ్యాచ్లను టీవీలలో వీక్షించవద్దంటూ అభిమానులు మీమ్స్ షేర్ చేసుకున్నారు. గత 30 ఏళ్లలో శ్రీలంక ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని అభిమానులు మండిపడుతున్నారు. లంక క్రికెటర్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను అన్ఫాలో చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగింది. ప్రస్తుతం నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది.కాగా, సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ప్రచారంపై లంక బోర్డు సభ్యులు ఎవరూ స్పందించకపోవడం విశేషం. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఒక్కడు ఈ విషయమై మాట్లాడాడు. లంక క్రికెట్ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని దేశంలో క్రికెట్ను కాపాడాలని బోర్డు సభ్యులను అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, టీ20ల్లో శ్రీలంకకు ఇది వరుసగా ఐదో సిరీస్ ఓటమి. అంతకుముందు కూడా లంక జట్టు భారీ ఓటములను మూటగట్టుకుంది. ఒక్క సిరీస్లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. కాగా, శనివారం రాత్రి ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 181 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తొలి టీ20లో 129/7 స్కోర్ చేసిన లంక.. రెండో టీ20లో 111/7, మూడో మ్యాచ్లో 91 పరుగులకు ఆలౌటైంది. లంక దారుణ ప్రదర్శనను సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: మాట మార్చిన ద్రవిడ్.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..! -
పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు
కార్డిఫ్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ అద్భుత రనౌట్తో మెరిశాడు. ఫుట్బాల్ టెక్నిక్ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్మన్ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్గా మారింది. టాస్ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సామ్ కరన్ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్కు తగిలి పిచ్పైనే ఉండిపోయింది. సింగిల్కు అవకాశం ఉండడంతో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్బాల్ టెక్నిక్ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్కు చేరాడు. సామ్ కరన్ రనౌట్ వీడియో ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇట్స్ కమింగ్ హోమ్.. సామ్ బ్యాక్ ఆన్ ది నెట్ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: ఆల్రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్దే టి20 సిరీస్ Great. Let's win this @englandcricket ....@daniel86cricket bro r u watching ur team s worst performance vs ENG — RahulVaidya_fanclub (@vaidyaFan_rahul) June 24, 2021 -
ఆల్రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్దే టి20 సిరీస్
కార్డిఫ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు -
బెయిర్ స్టో ప్రతీకారం.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: క్రికెట్ను జెంటిల్మెన్ గేమ్గా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆటలో వివాదాలు.. స్లెడ్జింగ్లు సాధారణంగా మారిపోయాయి. ఆటలో సందర్భంగా ఒక్కోసారి జరిగే సంఘటనలు ఫన్నీగా ఉంటూనే సిరీయస్గా కనిపిస్తాయి. తాజాగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మ్యాచ్లో తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. తాను అవుటవ్వడానికి కారణమైన ఆటగాడిని వదిలేసి మరొక ఆటగాడిపై స్లెడ్జింగ్కు దిగి అతని ఔట్కు కారణమయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టెస్టులో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో జానీ బెయిర్ స్టోపై లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా స్లెడ్జింగ్కు దిగాడు. 'ఇండియా టూర్కు ఎంపిక కాలేకపోయావు.. కానీ ఐపీఎల్ ఆడేందుకు మాత్రం వెళ్తావు.. కేవలం డబ్బుల కోసమే ఆడతావా అంటూ' ట్రోల్ చేశాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన బెయిర్ స్టో 28 పరుగుల వద్ద క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. స్లెడ్జింగ్కు దిగి తనను అవుట్ చేశారన్న కోపంతో ఉన్న బెయిర్ స్టో అనువైన సమయం కోసం వేచి చూశాడు. చదవండి: 'గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది' Bairstow: Come on Chandi, throw your wicket away! Chandimal: Say less ❤️#SLvENG pic.twitter.com/znPUZrkWBA — sonali (@samtanisonali1) January 25, 2021 ఈ దశలో లంక రెండో ఇన్నింగ్స్లో భాగంగా 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ దినేష్ చండిమల్ను టార్గెట్ చేస్తూ బెయిర్ స్టో స్లెడ్జింగ్కు దిగాడు. 'కమాన్ చండీ.. నీ వికెట్ను త్వరగా పోగొట్టుకొని పెవిలియన్కు వెళ్లిపో అంటూ' పేర్కొన్నాడు. అండర్సన్ వేసిన బంతిని చండిమల్ గాల్లోకి లేపగా.. లాంగాఫ్లో ఉన్న జాక్ లీచ్ వెనుకకు పరిగెడుతూ అద్భుతక్యాచ్ అందుకున్నాడు. దీంతో చండిమల్ నిరాశగా క్రీజను వదిలిపెట్టి పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేయగా.. వైరల్గా మారాయి. చదవండి: మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే 'బెయిర్ స్టో ప్రతీకారం బాగానే ఉంది.. కానీ వేరొక క్రికెటర్ బలి కావడం బాధగా అనిపించిందని కొందరు పేర్కొంటే.. దెబ్బకు దెబ్బ తీయడం అంటే ఇదే అంటూ' మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో వైట్వాష్ చేసింది. Dickwella’s sledge work against bairstow 😂😂 “ Dropped from the India tour, but going to play the ipl, playing for cash only “ 😂😂 pic.twitter.com/d5zw36ij3h — rizwan (@rizwan68301915) January 24, 2021 -
రాబర్ట్.. నీ అభిమానానికి థ్యాంక్స్ : రూట్
గాలే: ఇంగ్లండ్- శ్రీలంకల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో సోమవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అంటే పడిచచ్చే ఒక అభిమానికి ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఈసీబీ ఇంగ్లండ్ క్రికెట్ డై హార్డ్ ఫ్యాన్కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చదవండి: వీరాభిమాని నం.1 వివరాలు.. రాబర్ట్ లుయీస్ అనే వ్యక్తి క్రికెట్ అంటే అమితమై ప్రేమ.. అందునా ఇంగ్లండ్ జట్టు అంటే విపరీతమైన ప్రేమను చూపించేవాడు. కరోనాకు ముందు ఇంగ్లండ్ జట్టు ఎక్కడా పర్యటించినా రాబర్ట్ అక్కడికి వెళ్లి లైవ్లో మ్యాచ్లను ఆస్వాధించేవాడు.. అంతేగాక వీలు చిక్కినప్పుడల్లా క్రికెటర్లను కలిసేవాడు. కానీ కరోనా సంక్షోభంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. లాక్డౌన్ తర్వాత క్రికెట్ ప్రారంభమైనా.. మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇంగ్లండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలుసుకున్న రాబర్ట్ లుయీస్ 10 నెలల ముందే శ్రీలంక చేరుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్- శ్రీలంక టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. అయితే మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో అతన్ని అనుమతించలేదు. ఎలాగైనా మ్యాచ్ను చూడాలని భావించిన రాబర్డ్ ఈసీబీ అధికారులతో మాట్లాడి ఒప్పించాడు. గాలే మైదానానికి ఆనుకొని ఉన్న ఒక కోటపై కూర్చొని టెస్టు మ్యాచ్ను చూశాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్లో లంకపై విజయం సాధించిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఇంగ్లండ్ జట్టును కోటపై నుంచే చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇది గమనించిన ఈసీబీ అధికారులు రాబర్ట్కు ఒక సువర్ణవకాశం కల్పించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి రాబర్ట్తో మాట్లాడాడు. 'హాయ్ రాబర్ట్.. 10 నెలల విరామం తర్వాత నిన్ను ఈ కోటపై చూడడం ఆనందంగా ఉంది. ఇంతకాలం మేం ఎక్కడ పర్యటించినా మా వెంటే ఉండి ప్రోత్సహించావు. మీ అభిమానానికి థ్యాంక్స్ రాబర్ట్. ఇంగ్లండ్ జట్టుతో ఇంతకాలం నువ్వు సాగించిన జర్నీ మాకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలోనూ ఇంత కష్టపడి మా ఆటను చూడడానికి వచ్చిన నీకు కృతజ్ఞతలు తప్ప ఇంకేమి ఇవ్వలేము. బయో బబూల్ వాతావరణం నేపథ్యంలో నిన్ను మా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం లేదు. అందుకే ఈరోజును రాండీ కాడిక్ డ్రింక్తో ఎంజాయ్ చేయ్.. మిస్ యూ లాట్.. రాబర్డ్ లుయీస్ అంటూ రూట్ ఫోన్కాల్ ముగించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది.చదవండి: 'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 421 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో లంక జట్టు 359 పరుగులకు ఆలౌట్ కావడంతో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. We massively missed @TheBarmyArmy here and thank you for all your support back home. But a special thanks to @elitebandwagon up on the Fort! Incredible effort and the whole team really appreciated it 👏 https://t.co/5XAVTVGIWn — Joe Root (@root66) January 18, 2021 -
‘లక్కీ’ జెర్సీతో మిగతా మ్యాచ్లు!
లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పసుపు-నీలి రంగు జెర్సీలతో బరిలో దిగి విజయం సాధించడంతో అవి అదృష్ట జెర్సీలని శ్రీలంక నమ్ముతోంది. అందుకే వాటినే ధరించి మిగిలిన మ్యాచ్ల్లో ఆడాలని ఆ జట్టు నిర్ణయించింది. ఇందుకోసం ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తికి ఐసీసీ ఆమోదం తెలిపింది. సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలను ధరించే శ్రీలంక ఆటగాళ్లు తర్వాత ఆడే మూడు వరల్డ్కప్ మ్యాచ్ల్లో పసుపు, నీలి రంగు కలిసిన దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రత్యేక విజ్ఞప్తి వల్ల శ్రీలంక ఈ జెర్సీలను ధరించేందుకు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ పేర్కొంది. ఈ పోటీల్లో ప్రతీ జట్టుకు రెండో చాయిస్ జెర్సీలను వేసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ రెండో చాయిస్ జెర్సీగా ఆరెంజ్ రంగు జెర్సీలను ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లో భారత జట్టు ఆరెంజ్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. -
ఇంగ్లండ్పై ఎలా గెలిచామంటే..
లీడ్స్: ప్రపంచకప్లో భాగంగా బలమైన ఇంగ్లండ్ను ఓడించి శ్రీలంక అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మ్యాచ్లో యార్కర్ల కింగ్ లసిత్ మలింగ వీరంగంతో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ తోకముడిచారు. గత కొన్నాళ్లుగా 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్ 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఇంగ్లండ్ టాపార్డర్ను మలింగ కూల్చగా.. స్పిన్నర్ ధనుంజయ్ డిసిల్వా లోయార్డర్ పనిపట్టాడు. దీంతో విజయం లంక వాకిట నిలిచింది. మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మలింగ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ను కట్టడి చేయడానికి పక్కా వ్యూహాలు రచించి అమలుచేశామని తెలిపాడు. ‘గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ అవలీలగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ విజయాలను నమోదు చేస్తున్నారు. అయితే మేం నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడు కోవాలంటే బౌలింగ్లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని నిశ్చయించుకున్నాం. లైన్ అండ్ లెంగ్త్ తప్పకూడదు.. అదే విధంగా చెత్త బంతులు వేయకూడదనే బేసిక్ ప్రణాళికను అమలు చేశాం. అంతేకాకుండా బౌన్సర్లను కూడా వివిధ వేరియేషన్స్తో వేయాలనుకున్నాం. స్టోక్స్ ఓ ఎండ్లో రెచ్చిపోతుండటంతో స్టాక్ బాల్స్తో అతడిని బోల్తా కొట్టించాలనుకున్నాం. కానీ స్టోక్స్ అద్బుతంగా ఆడాడు. ఇక బట్లర్ను ఆరంభంలోనే ఔట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే కుదురుకుంటే రెచ్చిపోతాడు. అందుకే అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాం. అన్ని పక్కాగా అమలు చేయడంతో ఇంగ్లండ్పై విజయం సాధించాం’అంటూ మలింగ వివరించాడు. ఇక ఈ మ్యాచ్లో మలింగ నాలుగు వికెట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
ఆ ఓటమి గాయం బాధిస్తోంది: బట్లర్
లీడ్స్: వన్డే వరల్డ్కప్లో భాగంగా శుక్రవారం శ్రీలంక చేతిలో పరాజయం చెందడం పట్ల ఇంగ్లండ్ బ్యాట్సమన్ జోస్ బట్లర్ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీలంకపై ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలచి వేసిందన్నాడు. బ్యాటింగ్లో వైఫల్యం చెందడం వల్లే మ్యాచ్ను చేజార్చుకున్నామన్నాడు. ఆ ఓటమి గాయం తమ జట్టును బాధిస్తోందన్నాడు.‘ మేము బ్యాటింగ్లో చెత్త ప్రదర్శన చేశాం. మా పూర్తి స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాం. ఏ దశలోనూ బౌలర్లపై ఒత్తిడి తీసుకు రాలేకపోయాం. ప్రధానంగా స్టైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాం. ఇక్కడ నా ఉద్దేశం ఫోర్లు, సిక్సర్లు కొట్టమని కాదు. సమిష్టిగా రాణించడంలో వైఫల్యం కనబడింది. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన ఎంతమాత్రం కాదు. జేసన్ రాయ్ లేకపోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపింది. (ఇక్కడ చదవండి: లంక వీరంగం) ఈ ఓటమి ప్రభావం కొన్ని రోజుల వరకూ ఉంటుంది. కాకపోతే తదుపరి మ్యాచ్లకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడమే మా లక్ష్యం. శ్రీలంక విజయం క్రెడిట్ అంతా లసిత్ మలింగాదే. అతనొక నాణ్యమైన బౌలర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. అతనొక అసాధారణ బౌలర్. బ్యాట్స్మెన్ ప్యాడ్లే లక్ష్యంగా మలింగా బంతులు వేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. అతన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయాం’ అని బట్లర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక 233 పరుగుల సాధారణ టార్గెట్ను కాపాడుకుని ఇంగ్లండ్పై సూపర్ విక్టరీ సాధించింది. -
ఇంగ్లండ్ పై శ్రీలంక విజయం
-
20 పరుగుల తేడాతో లంక ఘన విజయం
-
ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాక్
లీడ్స్ : ఆతిథ్య ఇంగ్లండ్కు శ్రీలంక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు బ్యాటింగ్లో పరుగుల ప్రవాహం సృష్టించిన మోర్గాన్ సేన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లంక 20 పరుగులు తేడాతో అధ్బుతమైన విజయాన్ని సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక ఆల్రౌండ్ షోతో ఆతిథ్య జట్టును కంగుతినిపించింది. ఈ మ్యాచ్లో యార్కర్ల కింగ్ లసిత్ మలింగ(4/43) ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. మలింగకు తోడు డిసిల్వా(3/32), ఉదానా(2/41)లు రాణించారు. లంక విజయంలో కీలకపాత్ర పోషించిన మలింగక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లంక నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47 ఓవర్లకు 212 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(82 నాటౌట్; 89బంతుల్లో 7ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జో రూట్(57) అర్దసెంచరీతో రాణించినప్పటికీ కీలక సమయంలో ఔటయ్యాడు. ఇక బెయిర్ స్టో(0), మోర్గాన్(21), బట్లర్(10), విన్సే(14)లు పూర్తిగా నిరాశపరిచారు. స్టోక్స్కు అండగా ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది. మలింగ మొదలెట్టాడు.. డిసిల్వా కొనసాగించాడు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు మలింగ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోను గోల్డెన్ డక్గా వెనక్కి పంపిస్తాడు. అనంతరం విన్సేను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువనియ్యలేదు. ఈ క్రమంలో రూట్, మోర్గాన్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే మోర్గాన్ను ఉదానా బోల్తాకొట్టించి పెవిలియన్కు పంపించాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ రూట్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించిన అనంతరం రూట్ను మలింగ ఔట్ చేసి ఇంగ్లండ్కు మరోసారి షాక్ ఇస్తాడు. ఇక స్పిన్నర్ డిసిల్వా కూడా కీలక సమయంలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, రషీద్లను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. మాథ్యూస్ మెరిశాడు.. అంతకుముందు మ్యాథ్యూస్ (85 నాటౌట్: 115 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకోవడంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. 3 పరుగులకే ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అవిష్కా ఫెర్నాండో(49: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్(46: 68 బంతుల్లో 2 ఫోర్లు) మూడో వికెట్కు 59 పరుగులు జోడించారు. ఫెర్నాండో అవుటయ్యాక కుశాల్ మెండిస్– మాథ్యూస్ జోడీ 71 పరుగులు జోడించింది. అనంతరం కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. మిగిలిన వారిలో ధనంజయ డిసిల్వా (29) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ చెరో మూడు వికెట్లు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించారు. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
బెయిర్ స్టో గోల్డెన్ డక్
లీడ్స్: వన్డే వరల్డ్కప్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బెయిర్ స్టో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను బెయిర్ స్టో, జేమ్స్ విన్సేలు ఆరంభించారు. అయితే లంక సీనియర్ పేసర్ లసిత్ మలింగా వేసిన తొలి ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో ఎల్బీగా ఔటయ్యాడు. దీనిపై స్టో రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురు కావడంతో అతను భారంగా పెవిలియన్ వీడాడు. దాంతో పరుగు వద్దే ఇంగ్లండ్ తొలి వికెట్ను నష్టపోయింది. వరల్డ్కప్లో రెండుసార్లు గోల్డెన్ డక్గా ఔటైన నాల్గో ఇంగ్లండ్ ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడుఈ వరల్డ్కప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బెయిర్ స్టో గోల్డెన్ డక్గా ఔటైన సంగతి తెలిసిందే. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్(85 నాటౌట్)కు జతగా అవిష్కా ఫెర్నాండో(49), కుశాల్ మెండిస్(46)లు మాత్రమే మెరవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ తలో మూడు వికెట్లు సాధించగా, ఆదిల్ రషీద్కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
మాథ్యూస్ మెరిసినా..
లీడ్స్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 233 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్(85 నాటౌట్)కు జతగా అవిష్కా ఫెర్నాండో(49), కుశాల్ మెండిస్(46)లు మాత్రమే మెరవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మూడో వికెట్గా ఔటయ్యాడు. ఆ తరుణంలో కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశారు. కాగా, కుశాల్ మెండిస్(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్గా పెవిలియన్ చేరగా, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. ధనంజయ డిసిల్వా(29) ఫర్వాలేదనిపించగా, మాథ్యూస్ మాత్రమే కడవరకూ క్రీజ్లో ఉండటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ తలో మూడు వికెట్లు సాధించగా, ఆదిల్ రషీద్కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
ఇంగ్లండ్తో మ్యాచ్: కష్టాల్లో శ్రీలంక
లీడ్స్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు 133 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి ఎదురీదుతున్నారు. లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మూడో వికెట్గా ఔటయ్యాడు. ఆ తరుణంలో కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశారు. కాగా, కుశాల్ మెండిస్(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్గా పెవిలియన్ చేరగా, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ వేసిన బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. -
ఇంగ్లండ్కు ఎదురుందా?
లీడ్స్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫామ్ను చూస్తే ఆ జట్టును ఓడించడం శ్రీలంకకు కష్టమే. లంకేయులు సమిష్టగా రాణిస్తే తప్ప ఇంగ్లండ్ను నిలువరించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. ఒకవైపు భారీ స్కోరు సాధిస్తునే ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే తీరు అద్భుతంగా ఉంది. దాంతో తాజా మ్యాచ్లో ఇంగ్లండ్నే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నీలో లంక జట్టు మొత్తం ఐదు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి.. రెండింటిలో ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దు కావడంతో లంక 4 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే లంకేయులు తమ చివరి నాలుగు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్పై నెగ్గి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం లంకను వేధిస్తోంది. ఇంగ్లండ్తో మ్యాచ్లోనైనా బ్యాటింగ్లో మెరుగుపడి భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉంది. కాగా, ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్ల్లో తలపడగా లంక 35 మ్యాచ్ల్లో గెలిచింది. ఇంగ్లండ్ 36 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్లో 10 మ్యాచ్లకుగాను నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. తుది జట్లు శ్రీలంక దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుశాల్ పెరీరా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, తిషారా పెరీరా, జీవన్ మెండిస్, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేమ్స్ విన్సే, జోనీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్