-
ఇంగ్లండ్ను చూస్తుంటే దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ వరల్డ్కప్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోన్న గంభీర్కు.. ఇంగ్లండ్ ఓటములకు బ్యాటింగ్ కారణమా? బౌలింగ్ కారణమన్న ప్రశ్న ఎదురైంది. "ఈ టోర్నీలో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిల్లోనూ నిరాశపరిచింది. వరల్డ్కప్ తొలి మ్యాచ్ నుంచే ఇంగ్లండ్ జట్టు చాలా నిరూత్సహంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ తీరు అయితే మరి దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్లో ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో ఆడినట్లు కన్పించడం లేదు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారు తప్ప దేశం కోసం కాదు. శ్రీలంకపై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుంది అనుకున్నాను. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్ను పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసింది. అందుకే వారు విజయం సాధించారు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! -
మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో మరో ఘోర ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను శ్రీలంక చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో నిస్సాంక(77 నాటౌట్), సమరవిక్రమ(65 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఇక లంక చేతిలో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు తమ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. రషీద్ చెత్త రనౌట్.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు అదిల్ రషీద్ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 32 ఓవర్లో ఆఖరి బంతిని మహేష్ థీక్షణ వైడ్గా సంధించాడు. అయితే వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో నాన్స్ట్రైక్లో ఉన్న అదిల్ రషీద్ కాస్త క్రీజును వదిలి బయటకు వచ్చాడు. సరిగ్గా ఇక్కడే మెండీస్ తన తెలివితేటలను ఉపయోగించాడు. అదిల్ రషీద్ క్రీజు బయట ఉండడం గమనించిన మెండీస్.. బంతని నాన్స్ట్రైక్ వైపు త్రో చేసి స్టంప్స్ను గిరాటేశాడు. కాగా మెండిస్ తన గ్లోవ్ తీసి మరి త్రో చేశాడు. అంతసమయం ఉన్నప్పటికీ రషీద్ నెమ్మదిగా వెనుక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. బంతి స్టంప్స్ను తాకే సమయానికి రషీద్ క్రీజుకు కాస్త దూరంలో ఉన్నాడు. దీంతో రనౌట్గా వెనుదిరిగాడు. క్రీజులో బద్దకంగా వ్యవహరించిన రషీద్ భారీ మూల్యం చెల్లించకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. అయినా గర్వపడుతున్నాం.. మాది చెత్త టీమ్ కాదు: బట్లర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
SL VS ENG: జయసూర్య రికార్డును సమం చేసిన నిస్సంక
ప్రస్తుత ప్రపంచకప్లో భీకర ఫామ్లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్లు కూడా ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్ 2011లో ఈ ఘనత సాధించారు. గిల్ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక.. నిస్సంక.. ఇంగ్లండ్పై నిన్న సాధించిన హాఫ్ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్తో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు. గిల్, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10, టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్
ICC WC 2023- Jos Buttler Comments On Loss: ‘‘మాకిది కష్టకాలం. కెప్టెన్గా నాతో పాటు మా ఆటగాళ్లంతా పూర్తిగా నిరాశకు లోనయ్యాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. మా జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇపుడిలా జరిగిపోయింది. అయినా ఒక్కరోజులో మాది చెత్త టీమ్గా మారిపోదు కదా! అయితే, బాధ.. మాపై మాకు కోపం.. విసుగు వస్తున్నాయి. మేమిలా విఫలం చెందడానికి ఇదీ కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. సెలక్షన్ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మాకది అసలు సమస్యే కాదు. అయితే, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాం అనేది మాత్రం వాస్తవం. ఆ విషయంలో గర్వపడుతున్నాం ఈరోజు రూట్ రనౌట్ కావడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా మేము ఇలాంటి తప్పులు చేయము. ఈరోజు భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందాం. బ్యాట్, బంతి.. రెండింటితోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాం. ఏదేమైనా పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, మేము నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన మ్యాచ్లలో తిరిగి పుంజుకుని రాణిస్తామనే నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’’అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది. శ్రీలంక చేతిలో మరోసారి చిత్తుగా తాజాగా బెంగళూరులో గురువారం శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లండ్. వరల్డ్కప్ చరిత్రలో ఇంగ్లండ్పై ఏకపక్ష విజయాలతో దూసుకుపోతున్న శ్రీలంక మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడంతో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి ఎదురైంది. దీంతో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బట్లర్ బృందం సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్థాయికి తగ్గట్లు ఆడలేక పరాభవాల పాలవుతున్నామని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు: ►టాస్- ఇంగ్లండ్- బ్యాటింగ్ ►ఇంగ్లంగ్ స్కోరు: 156 (33.2) ►శ్రీలంక స్కోరు: 160/2 (25.4) ►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాహిరు కుమార(మూడు వికెట్లు) ►టాప్ స్కోరర్: పాతుమ్ నిసాంక(77- నాటౌట్) చదవండి: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి అవుట్?
ICC WC 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు మరో ఘోర పరాభవం! గత మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్ బృందాన్ని.. గురువారం నాటి మ్యాచ్లో శ్రీలంక మట్టికరిపించింది. వరల్డ్కప్లో ఇంగ్లండ్పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదో విజయం నమోదు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో లంక పేసర్లు లాహిరు కుమార, కసున రజిత, ఏంజెలో మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. అదరగొట్టిన లంక పేసర్లు ఓపెనర్ డేవిడ్ మలన్(28)తో పాటు మొయిన్ అలీ వికెట్ను ఏంజెలో మాథ్యూస్ పడగొట్టగా.. బెన్ స్టోక్స్(43), కెప్టెన్ జోస్ బట్లర్(8), లియామ్ లివింగ్స్టోన్(1) రూపంలో కుమార మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక కసున్ రజిత.. మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో(30)తో పాటు క్రిస్ వోక్స్(0)ను అవుట్ చేశాడు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ మార్క్ వుడ్ను పెవిలియన్కు పంపి తానూ ఓ వికెట్ తీశాడు. ఈ క్రమంలో 33.2 ఓవర్లలో 156 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) నిసాంక సూపర్ ఇన్నింగ్స్.. సమర విక్రమ హిట్టింగ్ ఇక శ్రీలంక లక్ష్య ఛేదనలో డేవిడ్ విల్లే ఆరంభంలోనే ఓపెనర్ కుశాల్ పెరీరా(4) వికెట్ తీశాడు. అదే విధంగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్ను కూడా 11 పరుగులకే పెవిలియన్కు పంపాడు. అయితే, ఓపెనర్ పాతుమ్ నిసాంక(77- నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ(65- నాటౌట్) చక్కటి సమన్వయంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. View this post on Instagram A post shared by ICC (@icc) సిక్సర్తో గెలుపు ఖరారు చేసిన నిసాంక ఆఖరి వరకు అజేయంగా నిలిచి అద్బుత అర్ధ శతకాలతో శ్రీలంకను గెలుపుతీరాలకు చేర్చారు. 25.4 ఓవర్లలోనే మ్యాచ్ను ఫినిష్ చేశారు. పాతుమ్ ఆఖరి సిక్సర్తో లంక ఖాతాలో రెండో విజయం నమోదు కాగా..ఇంగ్లండ్కు వరుసగా మరోసారి ఓటమే ఎదురైంది. లాహిరు కుమార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ సెమీస్ చేరుతుందా? అంతేకాదు.. శ్రీలంకతో మ్యాచ్లో పరాజయం నేపథ్యంలో ఇంగ్లండ్ సెమీస్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. గత ఎడిషన్లో సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి కనీసం టాప్-4లో కూడా చేరకుండా నిష్క్రమించే దుస్థితికి చేరువైంది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో ఇంగ్లండ్ నాలుగు ఓడిపోయింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఒకవేళ మిగిలిన మ్యాచ్లలో గెలిచినా. .ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి! -
పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా! లంక దెబ్బకు..
WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టోక్స్ 43 పరుగులతో వన్డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్లు కూడా లంకతో మ్యాచ్లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్తో మ్యాచ్కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. స్టార్ పేసర్కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
మరో రసవత్తర సమరం.. సెమీస్కు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాకు శృంగభంగం
టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తొలి జట్టుగా సెమీస్కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్ 5) జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలిస్తే సెమీస్కు చేరాలని భావించిన ఆసీస్.. ఇంగ్లండ్ గెలవడంతో సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఆసీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్), అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
SL Vs ENG: ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం.. సెమీస్కు
ICC Mens T20 World Cup 2022- England vs Sri Lanka Updates: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. కీలక మ్యాచ్లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్-1 నుంచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ 47 పరుగులతో రాణించగా.. బెన్ స్టోక్స్ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో బట్లర్ బృందం టీ20 ప్రపంచకప్-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్కు చేరుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు: టాస్: శ్రీలంక శ్రీలంక: 141/8 (20) ఇంగ్లండ్: 144/6 (19.4) మొయిన్ అలీ ఔట్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ధనంజయ బౌలింగ్లో షనకకు క్యాచ్ ఇచ్చి మొయిన్ అలీ (1) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 113. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో లభించిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 14వ ఓవర్ తొలి బంతికి కుమార బౌలింగ్లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ (4) ఔటయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రూక్ అవుట్ డిసిల్వ బౌలింగ్లో బ్రూక్(4) మూడో వికెట్గా వెనుదిరిగాడు. స్టోక్స్, లివింగ్స్టోన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 93/3 (11.1) రెండో వికెట్ డౌన్ అర్ధ శతకానికి చేరువగా ఉన్న హేల్స్(47)ను హసరంగ బౌల్డ్ చేశాడు. పదో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు: 82/2 (9.1). బ్రూక్, స్టోక్స్ క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనర్ హసరంగ బౌలింగ్లో కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరెంతంటే! స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. లంక బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బంతికి బౌండరీకి తరలిస్తూ పరుగులు పిండుకుంటున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 70/0 (6). బట్లర్ 25, అలెక్స్ హేల్స్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెమీస్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగంది ఇంగ్లండ్. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్ పాతుమ్ నిసాంక 67 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో చివరి ఓవర్లోనే లంక రాజపక్స, హసరంగ, కరుణరత్నె వికెట్లు కోల్పోయింది. రాజపక్స అవుట్ రాజపక్స(22) రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. హసరంగ, కరుణరత్నె క్రీజులో ఉన్నారు. నిరాశ పరిచిన కెప్టెన్ లంక కెప్టెన్ దసున్ షనక మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో అతడు వెనుదిరగడంతో లంక ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 128/5 (18). హసరంగ, రాజపక్స క్రీజులో ఉన్నారు. నిసాంక ఇన్నింగ్స్కు బ్రేక్ వేసిన రషీద్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో నిసాంక(67) అవుటయ్యాడు. దీంతో లంక నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు- 118/4 (15.3). రాజపక్స, దసున్ షనక క్రీజులో ఉన్నారు. అర్ధ శతకంతో జోరు మీదున్న నిసాంక 14 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 104/3. భనుక రాజపక్స 7, పాతుమ్ నిసాంక 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన లంక స్టోక్స్ బౌలింగ్లో మలన్కు క్యాచ్ ఇచ్చిన అసలంక(8) మూడో వికెట్గా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో స్కోరు: 80-2 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) రెండో వికెట్ కోల్పోయిన లంక డిసిల్వ(9) రూపంలో లంక రెండో వికెట్ కోల్పోయింది. అసలంక క్రీజులోకి వచ్చాడు. దంచి కొడుతున్న నిసాంక 8 ఓవర్లలో లంక స్కోరు: 71-1. నిసాంక 42, డిసిల్వ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి లంక స్కోరు: 54/1 (6) తొలి వికెట్ కోల్పోయిన లంక లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(18).. క్రిస్ వోక్స్ బౌలింగ్లో లివింగ్స్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 39-1. పాతుమ్ నిసాంక 19, ధనుంజ డి సిల్వా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్కు చావో రేవో టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 గ్రూప్-1లో శ్రీలంకతో మ్యాచ్ ఇంగ్లండ్కు చావో రేవోలా తయారైంది. లంకపై గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్కు.. ఇంగ్లండ్ ఇంటికి వెళ్లనుంది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్లో కచ్చితంగా ఇంగ్లండ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. వర్షం అంతరాయం వల్ల ఐర్లాండ్తో మ్యాచ్లో ఓడిన ఇంగ్లండ్.. నాలుగు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో ఉంది. అయితే నెట్ రన్రేట్ ప్లస్లో ఉండడం ఇంగ్లండ్కు సానుకూలాంశం. లంకపై సాధారణ విజయం నమోదు చేసినా ఇంగ్లీష్ జట్టు సెమీస్కు చేరుకుంటుంది. అంతిమంగా ఇంగ్లండ్కు కావాల్సింది విజయం. ఇంగ్లండ్: జోస్ బట్లర్(వికెట్ కీపర్, కెప్టెన్), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత ఇక ఇంగ్లండ్ జట్టులో హిట్టర్లకు కొదువ లేదు. బ్యాటింగ్లో తొలి స్థానం నుంచి 10వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు జట్టులో ఉన్నారు. బట్లర్, స్టోక్స్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్లతో టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తుండగా.. మిడిలార్డర్లో లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీలు ఉన్నారు. ఇక బౌలింగ్లో మార్క్వుడ్, క్రిస్ వోక్స్, సామ్ కరన్లు తమ పేస్ పదును చూపిస్తుండగా.. ఆదిల్ రషీద్ స్పిన్తో అదరగొడుతున్నాడు. అటు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ను తమతో పాటు ఇంటికి తీసుకుపోవాలని భావిస్తుంది. అయితే లంక జట్టు ప్రస్తుతం అనుకున్న రీతిలో ఆడడం లేదు. ఆటగాళ్ల గాయాలు జట్టును బాగా దెబ్బతీశాయి. విజయంతో టోర్నీని ముగించాలని లంక ఆశిస్తుంది. ► ఇరుజట్ల రికార్డులు పరిశీలిస్తే.. ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 13 సార్లు తలపడగా ఇంగ్లండ్ 9సార్లు.. శ్రీలంక నాలుగుసార్లు నెగ్గాయి. -
53 ఏళ్ల వయసులో అదరగొట్టాడు.. లంక లెజెండ్స్ ఘన విజయం
రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్పై శ్రీలంక లెజెండ్స్ ఘన విజయం సాధించింది. 53 ఏళ్ల వయసులోనూ సనత్ జయసూర్య(4-2-3-4) తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన జయసూర్య రెండు మెయిడెన్లు సహా కేవలం మూడు పరుగుల్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.అతని స్పిన్ ధాటికి ఇంగ్లండ్ లెజెండ్స్ 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ లెజెండ్స్ బ్యాటర్స్లో ఇయాన్ బెల్ 15 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మస్టర్డ్ 14 పరుగులు చేశాడు. లంక బౌలింగ్లో సనత్ జయసూర్య 4 వికెట్లతో చెలరేగగా.. చమర డిసిల్వా, కులశేఖర చెరో రెండు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, జీవన్ మెండిస్ తలా ఒక వికెట్ తీశారు. కాగా లంక జట్టులో ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి లంక లెజెండ్స్ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దిల్షాన్ మునవీరా 24, ఉపుల్ తరంగ 23, తిలకరత్నే దిల్షాన్ 15 పరుగులు చేశారు. చివర్లో జీవన్ మెండిస్ 8 పరుగులు నాటౌట్ చేసి జట్టును గెలిపించాడు. కాగా స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసిన జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. Sri Lanka Legends continue their good run as they defeat the England Legends by 7 wickets! The bowling attack led by Sanath Jayasuriya was too good for the England Legends as they were bundled out for a paltry 78.#ENGLvsSLL #RoadSafetyWorldSeries #RSWS #YehJungHaiLegendary pic.twitter.com/hmOaFLvfma — Road Safety World Series (@RSWorldSeries) September 13, 2022 -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్..
Eoin Morgan Becomes The Most Successful T20I Captain Of All Time: అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్గా (43 విజయాలు) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకపై గెలుపుతో మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. మోర్గాన్కు ముందు ఈ రికార్డు(42 విజయాలు) అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎంఎస్ ధోని (భారత్)ల పేరిట సంయుక్తంగా ఉండేది. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపుతో మోర్గాన్ వారి రికార్డును బద్దలు కొట్టాడు. మోర్గాన్ ఈ ఘనతను సాధించేందుక 69 మ్యాచ్లు తీసుకోగా.. ధోని 72, అస్గర్ అఫ్గాన్ 52 మ్యాచ్ల్లో సాధించారు. ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్గా కొనసాగుతున్న మోర్గాన్.. ఇంగ్లండ్ జట్టును 2019 వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
మ్యాచ్ గెలవడంతో పాటు రికార్డుల మోత మోగించింది
England Breaks Records Vs SL Match T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటవడంతో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టింది. జాస్ బట్లర్ సెంచరీతో మొదలుకొని.. విజయం సాధించడం వరకు ఇంగ్లండ్ సాధించిన రికార్డులు పరిశీలిద్దాం. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ (43 విజయాలు) రికార్డు నెలకొల్పాడు. 42 విజయాలతో అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎమ్మెస్ ధోని (భారత్) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. ►టి20 ప్రపంచకప్లలో ఇది 9వ సెంచరీ. బట్లర్కు ముందు గేల్ (2 సార్లు), మెకల్లమ్, అహ్మద్ షహజాద్, రైనా, హేల్స్, తమీమ్, జయవర్ధనే ఈ ఘనత సాధించారు. ►అంతర్జాతీయ పురుషుల క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో గత ఏడాది హీథెర్ నైట్ ఇంగ్లండ్ తరఫున ఈ ఘనత సాధించింది. ►అంతర్జాతీయ టి20ల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో అలెక్స్ హేల్స్ (116 నాటౌట్; శ్రీలంకపై 2014లో), డేవిడ్ మలాన్ (103 నాటౌట్; న్యూజిలాండ్పై 2019లో), లివింగ్స్టోన్ (103; పాకిస్తాన్పై 2021లో) ఈ ఘనత సాధించారు. ►టి20 ప్రపంచకప్లోని ఓ మ్యాచ్లో అత్యధిక బంతులు ఆడిన బ్యాటర్గా జోస్ బట్లర్ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్లో బట్లర్ 67 బంతులు ఎదుర్కొన్నాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (66 బంతులు; భారత్పై 2010లో), మర్లోన్ సామ్యూల్స్ (66 బంతులు; ఇంగ్లండ్పై 2016లో) పేరిట సంయుక్తంగా ఉంది. చదవండి: T20 World Cup 2021 IND Vs NZ: కోహ్లి వ్యూహాలను ఏకి పారేసిన గంభీర్ -
T20 WC 2021: బట్లర్ ఊచకోత.. ఇంగ్లండ్ దర్జాగా సెమీస్కు
England Beat Sri Lanka By 26 Runs Enter Semifinal T20 WC 2021.. నాలుగు మ్యాచ్లలో నాలుగు విజయాలు... ఎదురులేని ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్ మరో గెలుపుతో అధికారికంగా టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బట్లర్ మెరుపు శతకంతో ఇంగ్లండ్కు మంచి స్కోరు అందించగా... అనంతరం బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సమష్టిగా సఫలమయ్యారు. సోమవారం జరిగిన గ్రూప్–1 సూపర్–12 మ్యాచ్లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఈ టోర్నీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలవగా... కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (36 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం లంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. హసరంగ (21 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, జోర్డాన్ రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ రాణించిన మోర్గాన్... పవర్ప్లేలో 36 పరుగులు... సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 47 పరుగులే... తర్వాతి 4 ఓవర్లలో 36 పరుగులు రాబట్టి కొంత ఊపు... ఆపై చివరి 6 ఓవర్లలో ఏకంగా 83 పరుగులు! ఇంగ్లండ్ బ్యాటింగ్ ఇలా వేర్వేరు దశలుగా సాగింది. ఆరు ఓవర్లలోపే ఆ జట్టు జేసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్స్టో (0) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బట్లర్, మోర్గాన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టంగా మారిపోగా, ఇద్దరు బ్యాటర్లు కూడా అనవసరపు దూకుడు ప్రదర్శించకుండా సంయమనంతో ఇన్నింగ్స్ను నడిపించారు. సుదీర్ఘ కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మోర్గాన్ కూడా తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఒకదశలో 21 బంతుల్లో అతను 10 పరుగులే చేశాడు. ఎట్టకేలకు తాను ఎదుర్కొన్న 22వ బంతికి తొలి ఫోర్ కొట్టిన కెప్టెన్... ఆ తర్వాత కాస్త ధాటిని ప్రదర్శించి బంతులు, పరుగుల లెక్కను సమం చేశాడు. బట్లర్ సూపర్... గత మ్యాచ్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 71 పరుగులు చేసిన బట్లర్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. పరిస్థితిని బట్టి అతను కూడా ఆరంభంలో నెమ్మదిగా ఆడినా చివర్లో చెలరేగిపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో జాగ్రత్తపడి పేసర్లపై సత్తా చాటాడు. కరుణరత్నే ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి హాఫ్ సెంచరీకి అతనికి కేవలం 22 బంతులే సరిపోయాయి. కుమార ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన బట్లర్, ఆపై షనక ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఇన్నింగ్స్ చివరి బంతి వేయడానికి ముందు 95 వద్ద నిలిచిన అతను... ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ బాది టి20 కెరీర్లో తొలి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ బౌలింగ్లో 24 బంతులు ఆడి 12 పరుగులే చేసిన బట్లర్, పేసర్ల బౌలింగ్లో 43 బంతుల్లో 89 పరుగులు బాదాడంటే అతని వ్యూహం ఎలాంటిదో అర్థమవుతుంది. చదవండి: T20 WC 2021: కోహ్లికి జట్టు నుంచి సపోర్ట్ లేదా?! కీలక భాగస్వామ్యం... ఛేదనలో లంక కూడా తడబడింది. పవర్ప్లేలోనే ఆ జట్టు నిసాంక (1), అసలంక (21), కుశాల్ పెరీరా (7) వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఆపై అవిష్క (13), రాజపక్స (26) కూడా అవుట్ కావడంతో 76 వద్దే సగం జట్టు పెవిలియన్ చేరింది. భారీ ఓటమి ఖాయమనుకున్న ఈ దశలో హసరంగ, షనక (26; 2 ఫోర్లు, సిక్స్) పోరాడారు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే 53 పరుగులు జోడించడంతో లంక విజయంపై ఆశలు రేగాయి. అయితే రాయ్, బిల్లింగ్స్ ‘ర్యాలీ’ క్యాచ్తో హసరంగ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 14 బంతుల వ్యవధిలో 8 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయి లంక పరాజయంపాలైంది. -
టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్
Jos Buttler Maiden T20I Century.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ మెరుపు శతకంతో మెరిశాడు. 67 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో లంక బౌలర్లను ఊచకోత కోసిన బట్లర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా బట్లర్కు టి20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేగాక ఈ ప్రపంచకప్లో బట్లర్దే తొలి సెంచరీ. అంతకముందు బట్లర్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇక ఇప్పటివరకు టి20 ప్రపంచకప్ల్లో 8 సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా బట్లర్ సెంచరీతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ జాబితాలో క్రిస్ గేల్(2007, 2016 టి20 ప్రపంచకప్లు), సురేశ్ రైనా(2010 టి20 ప్రపంచకప్), మహేళ జయవర్దనే(2010 టి20 ప్రపంచకప్), బ్రెండన్ మెక్కల్లమ్(2012 టి20 ప్రపంచకప్), అలెక్స్ హేల్స్(2014 టి20 ప్రపంచకప్), అహ్మద్ షెహజాద్(2014 టి20 ప్రపంచకప్), తమీబ్ ఇక్బాల్(2016 టి20 ప్రపంచకప్) ఉన్నారు. తాజాగా జాస్ బట్లర్ వారి సరసన చేరాడు. -
ENG Vs SL: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఖాతాలో మరో విజయం
బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఖాతాలో మరో విజయం సమయం 23: 14.. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 137 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్ 26 పరగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. లంక జట్టులో హసరంగ(34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, లివింగ్స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు జోస్ బట్లర్ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. షనక(26) రనౌట్ సమయం 23:00.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు తడబడుతుంది. 17.2వ ఓవర్లో షనక(25 బంతుల్లో 26: 2 ఫోర్లు, సిక్స్) రనౌటయ్యాడు. దీంతో 130 పరుగుల వద్ద లంక జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో చమీరా, కరుణరత్నే ఉన్నారు. బిల్లింగ్స్ అద్భుత క్యాచ్.. హసరంగ(34) ఔట్ సమయం 22:55.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సామ్ బిలింగ్స్ అద్భుత క్యాచ్లో భాగస్తుడుకావడంతో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. లివింగ్స్టోన్ వేసిన 16.5వ ఓవర్లో హసరంగ(21 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ బాట పట్టాడు.17 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 130/6. క్రీజ్లో షనక(26), కరుణరత్నే ఉన్నారు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. రాజపక్స(26) ఔట్ సమయం 22:19.. ధాటిగా ఆడుతున్న రాజపక్స(18 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో జేసన్ రాయ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 77/5. క్రీజ్లో షనక(7), హసరంగ ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. ఫెర్నాండో(13) ఔట్ సమయం 22:04.. ఇన్నింగ్స్ 8.3వ ఓవర్లో శ్రీలంకకు మరో షాక్ తగిలింది. క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో ఆవిష్క ఫెర్నాండో(13 బంతుల్లో 14; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 58/34. క్రీజ్లో రాజపక్స(15), షనక(1) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(7) ఔట్ సమయం 21:48.. ఆదిల్ రషీద్ వేసిన ఇన్నింగ్స్ 5.1వ ఓవర్లో మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి కుశాల్ పెరీరా(9 బంతుల్లో 7) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 40/3. క్రీజ్లో అవిష్క ఫెర్నాండో(6), రాజపక్స ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(21) ఔట్ సమయం 21:38.. ధాటిగా ఆడుతున్న అసలంక(16 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్) ఆదిల్ రషీద్ బౌలింగ్లో అనవసర షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. 3.3 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 24/2. క్రీజ్లో కుశాల్ పెరీరా(2), అవిష్క ఫెర్నాండో ఉన్నారు. టార్గెట్ 164.. మూడో బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక సమయం 21:27.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మోర్గాన్ అద్భుతమైన త్రో చేయడంతో పథుమ్ నిస్సంక(1) రనౌటయ్యాడు. దీంతో లంకేయులు 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయారు. తొలి ఓవర్ తర్వాత శ్రీలంక స్కోర్ 2/1. క్రీజ్లో కుశాల్ పెరీరా, అసలంక(1) ఉన్నారు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ 163/4; శ్రీలంక టార్గెట్ 164 సమయం: 21:18.. ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్(101, 67 బంతులు, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన బట్లర్ టి20ల్లో మెయిడెన్ సెంచరీ నమోదు చేశాడు. కాగా ఇంగ్లండ్ చేసిన 163 పరుగుల్లో 101 పరుగులు బట్లర్ నుంచి వచ్చినవే. మిగతావారిలో మోర్గాన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ 3, దుశ్మంత చమీరా ఒక వికెట్ తీశారు. మోర్గాన్(40) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 21:10.. బట్లర్తో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40) హసరంగ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 87 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఉతికి ఆరేస్తున్న బట్లర్.. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ 105/3 సమయం 20:48.. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన బట్లర్ మధ్య ఓవర్లలో జూలు విదిల్చాడు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. టోర్నీలో మరో అర్ధశతకం నమోదు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ 15 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్లో బట్లర్(49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్(26 బంతుల్లో 22; ఫోర్, సిక్స్) ఉన్నారు. ఇంగ్లండ్ భరతం పడుతున్న హసరంగ.. మూడో వికెట్ డౌన్ సమయం 20:00.. లంక స్పిన్నర్ హసరంగ ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పడుతున్నాడు. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ను పెవిలియన్కు పంపిన అతను.. 5వ ఓవర్ రెండో బంతికి బెయిర్స్టో(0)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 35 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్లో జోస్ బట్లర్(17 బంతుల్లో 18), మోర్గాన్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం 19:55.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్ డేవిడ్ మలాన్(8 బంతుల్లో 6; ఫోర్) చమీరా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో జోస్ బట్లర్(16 బంతుల్లో 17), బెయిర్స్టో ఉన్నారు. రెండో ఓవర్లోనే ఇంగ్లండ్కు షాక్ సమయం 19:35.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. లంక సూపర్ స్పిన్నర్ హసరంగ బౌలింగ్లో జేసన్ రాయ్(6 బంతుల్లో 9; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 15/1. క్రీజ్లో జోస్ బట్లర్(4 బంతుల్లో 5), డేవిడ్ మలాన్(2 బంతుల్లో 1) ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా సోమవారం(నవంబర్ 1) రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్లో ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకోగా.. శ్రీలంక 3 మ్యాచ్ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించి సెమీస్ చేరేందుకు పోరాటం సాగిస్తోంది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఓవరాల్గా ఇరు జట్లు 12 సందర్భాల్లో తలపడగా.. ఇంగ్లండ్ 8, శ్రీలంక 4 సార్లు విజయాలు సాధించాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు తలపడిన మ్యాచ్ల్లో సైతం ఇంగ్లండ్(3-1)దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో ఇంగ్లండ్(5-0) తిరుగులేని ఆధిక్యం కనబర్చింది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇంగ్లండ్ కంటే శ్రీలంకకే మెరుగైన రికార్డు ఉంది. పొట్టి ప్రపంచకప్లో లంకేయులు ఓసారి ఛాంపియన్గా(2014), మరో రెండుసార్లు(2009, 2012) రన్నరప్గా నిలిచారు. మరోవైపు ఇంగ్లండ్ ఓ సారి ఛాంపియన్గా(2010) అవతరించి.. మరోసారి రన్నరప్గా(2016) నిలిచింది. తుది జట్లు: ఇంగ్లండ్ : జేసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలాన్, జానీ బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, తైమల్ మిల్స్ శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్కీపర్), పథుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లహీరు కుమార -
వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన ఇంగ్లండ్ ప్లేయర్..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్.. కెరీర్ అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్లో 6 వికెట్లు పడగొట్టిన వోక్స్(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(737 పాయింట్లు) నంబర్వన్గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్కు దిగజారాడు. 📈 @ChrisWoakes makes a charge in the latest @MRFWorldwide ICC Men’s ODI Bowling Rankings, with the @EnglandCricket quick jumping to No.3. Full rankings ➡️ https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/LazEtSmQHB — ICC (@ICC) July 7, 2021 ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్లో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్కు చేరుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మర్క్రమ్లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో ప్రొటీస్.. ఆతిధ్య జట్టుపై 3-2తో గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్కు చేరుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలాన్, ఆసీస్ ఆరోన్ ఫించ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు. 🔺 After entering the top 10 last week, @windiescricket opener Evin Lewis moves up a spot on the @MRFWorldwide ICC Men's T20I Batting Rankings. pic.twitter.com/TugCjFugmb — ICC (@ICC) July 7, 2021 -
తీవ్ర దుమారం.. క్షమాపణలు చెప్పిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన సెక్సియెస్ట్ కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు. లంక, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే సందర్భంగా.. కామెంటేటర్గా వ్యవహరించిన దినేశ్ చేసిన ‘బ్యాట్లు- పక్కవాళ్ల భార్య’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. తప్పుడు ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయలేదు. కావాలని చేసిన కామెంట్లు ఎంతమాత్రం కావు. కానీ, తప్పు జరిగిపోయింది. అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఈ విషయంపై నా తల్లి, భార్య కూడా నన్ను తిట్టారు. సారీ.. ఇంకోసారి తప్పు జరగదు’ అంటూ ఆదివారం ఒక సందేశం విడుదల చేశాడు దినేశ్ కార్తీక్. కాగా, 36 ఏళ్ల ఈ బ్యాట్స్మన్ కమ్ వికెటకీపర్ భారత్ తరపున 94 వన్డేలు, 32 టీ20లు, 26 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్గా మారిన దినేశ్.. అందులోనూ అదరగొడుతుండడం విశేషం. ‘ప్లేయర్స్ తమ బ్యాట్స్ కంటే అవతలి వాళ్ల బ్యాట్స్ను ఎక్కువగా ఇష్టపడతారని, అవి పక్కవాళ్ల భార్యల్లాంటివేనని. ఆకర్షణనీయంగా ఉంటాయని, అందుకే ఆకర్షితులు అవుతార’ని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దినేశ్ కార్తీక్. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 -
సిరీస్ కైవసం: ‘వరల్డ్ కప్నకు ముందే ఆ లోపాలు సవరించుకోవాలి’
బ్రిస్టల్/ఇంగ్లండ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డే వర్షంతో రద్దయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 2–0తోనే సిరీస్ను సరిపెట్టుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 41.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. షనక (48 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ టామ్ కరన్ (4/35) రాణించాడు. ఇన్నింగ్స్ విరామంలో మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... ‘‘ఈరోజు కూడా మేమే పైచేయి సాధించాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉండే మజాను ఆస్వాదించాం. మా ఆటగాళ్లంతా ఎంతో పట్టుదలగా నిలబడ్డారు. సమిష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. విల్లీ అద్భుతంగా రాణించాడు. వరల్డ్ కప్-2019లో అతడు భాగస్వామ్యం కాలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇక టామ్ కరన్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో తను విఫలమైనా.. నేడు 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, మేం డెత్ ఓవర్ల బౌలింగ్పై మరింత దృష్టి సారించాల్సి ఉంది. మిడిల్ ఓవర్స్లో కూడా నిలకడగా ఆడాల్సి ఉంది. ప్రపంచకప్నకు ముందే ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. పాకిస్తాన్తో ప్రారంభం కాబోయే సిరీస్ కోసం సన్నద్ధమవుతాం’’ అని చెప్పుకొచ్చాడు. Oh @jbairstow21! 😱 Scorecard/clips: https://t.co/litP0weU1U 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/AS1y93rmpM — England Cricket (@englandcricket) July 4, 2021 We need 167 to win 🏏 Scorecard/clips: https://t.co/litP0vXjam 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/QGFTHIJHTa — England Cricket (@englandcricket) July 4, 2021 -
'ఇతరుల బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి..' డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
లండన్: బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివని, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని టీమిండియా మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ అన్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా క్రికెట్ వ్యాఖ్యాతగా మారిన డీకే.. బ్యాట్స్మెన్, బ్యాట్ల మధ్య రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ రకంగా స్పందించాడు. బ్యాట్స్మెన్కు తమ బ్యాట్లు నచ్చకపోవడం అనేది చాలా కామన్ విషయమని, ఇతర బ్యాట్స్మెన్లు వాడే బ్యాట్లపై వారికి విపరీతమైన మోజు ఉంటుందని, ఓ విధంగా చెప్పాలంటే ఇతరుల బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని కార్తీక్ సరదాగా అన్నాడు. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 కార్తీక్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలు గుర్తుకువచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమోనని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా హర్షా భోగ్లే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తమ కామెంటరీలో ఇలాంటి సరదా విషయాలను ప్రస్తావించి ప్రేక్షకులను నవ్విస్తుంటారు. ఇదిలా ఉంటే, వ్యాఖ్యాతగా సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టడానికి గల కారణాలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించాడు. 'వ్యాఖ్యాతగా మారడం అనేది మాటల్లో వర్ణించలేనని, క్రికెట్లోని మరో కోణాన్ని చూడటానికే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానని పేర్కొన్నాడు. భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకుండానే వ్యాఖ్యత అవతారమెత్తాడు. 2019 వన్డే ప్రపంచకప్లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన ఆయన.. జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ అతన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
శ్రీలంకతో చివరి వన్డే: హార్డ్ హిట్టర్ వచ్చేస్తున్నాడు
లండన్: శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్పై కూడా కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి వన్డేలో లంకపై ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరగనున్న చివరి వన్డేకు ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ టామ్ బాంటన్ను ఈసీబీ జట్టులోకి తీసుకొచ్చింది. డేవిడ్ మలన్కు బ్యాకప్గా టామ్ బాంటన్ను తీసుకున్నట్లు తెలిపింది. కాగా డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బ్రిస్టల్ వేదికగా జూలై 4న జరగనుంది. టామ్ బాంటన్ ఇటీవలే టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున 47 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ఆధారంగా టామ్ బాంటన్ను మరోసారి జట్టులోకి పిలిచినట్లు తెలుస్తుంది. ఇక టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున ఆడుతున్న బాంటన్ ఈరోజే జట్టుతో కలవనుండడంతో డెర్బిస్తో జరగనున్న మ్యాచ్కు దూరం కానున్నాడు. ఇక బాంటన్ చివరిసారిగా ఇంగ్లండ్ తరపున ఆగస్టు 2020లో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఆడాడు. -
Sri Lanka Vs England: ఇంగ్లండ్దే తొలి వన్డే
చెస్టర్–లీ–స్ట్రీట్: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక 42.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (73; 7 ఫోర్లు), హసరంగ (54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మరో బౌలర్ విల్లే 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. జో రూట్ (79 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్ బెయిర్స్టో (43; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. దుశ్మంత చమీరకు 3 వికెట్లు దక్కాయి. చదవండి: సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు -
సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు
డర్హమ్: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ కెమెరా కంటికి చిక్కిన లంక స్టార్ ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలను తక్షణమే స్వదేశానికి పయనమవ్వాలని లంక బోర్డు ఆదేశించింది. లంక తుది జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఇంగ్లండ్తో చివరి టీ20 అనంతరం బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించి హోటల్ పరిధి దాటి వెలుపలికి వచ్చారు. అంతటితో ఆటగకుండా రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ.. తమ దేశ అభిమాని కంట బడ్డారు. Familiar faces in Durham tonight, enjoying their tour! Obviously not here to play cricket, this video was taken at 23.28 Sunday. Disappointing performance by these cricket players but not forgetting to enjoy their night at Durham. RIP #SrilankaCricket #KusalMendis #ENGvSL pic.twitter.com/eR15CWHMQx — Nazeer Nisthar (@NazeerNisthar) June 28, 2021 వీరి నిర్వాకాన్ని ఆ అభిమాని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లంక క్రికెట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అంశాన్ని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్గా పరిగణించి, విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ ముగ్గరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించారని రుజువు కావడంతో వారిపై తక్షణ వేటు వేశారు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు
సౌతాంఫ్టన్: ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ సిరీస్కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న ఫిల్ విట్టికేస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టీ20 సందర్భంగా పలుపురు అధికారులతో పాటు కొందరు క్రికెటర్లు రిఫరితో సన్నిహితంగా మెలిగారు. రిఫరికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అందరూ సహజంగానే తమ విధులు నిర్వహించారు. అయితే, రోజు వారి పరీక్షల్లో భాగంగా రిఫరికి కరోనా టెస్ట్ నిర్వహించడంతో అసలు విషయం వెలుగుచూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు(ఆదివారం) ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయనను కాంటాక్ట్ అయిన వారందరూ సురక్షితంగానే ఉన్నప్పటికీ.. సిరీస్ సజావుగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిఫరితో సన్నిహితంగా ఉన్నవారంతా 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండనున్నారు. దీంతో జూన్ 29న ఇరు జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్ అనంతరం శ్రీలంక జట్టు స్వదేశంలో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: సచిన్ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్ -
సొంత జట్టుకు వ్యతిరేకంగా లంక అభిమానుల ప్రచారం..
కొలొంబో: ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో దారుణంగా విఫలమై 0-3తేడాతో సిరీస్ను కోల్పోయిన శ్రీలంక జట్టుపై ఆ దేశ అభిమానులు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన చివరి మ్యాచ్లో లంక జట్టు 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో అ దేశ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ జట్టును టార్గెట్ చేశారు. వరుస ఓటములతో విసిగిపోయిన వారు తమ జట్టు ఆటగాళ్లకు వ్యతిరేకంగా (#unfollowcricketers) అనే హ్యాష్ట్యాగ్తో ప్రచారం ప్రారంభించారు. ఫేస్బుక్లో శనివారం నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్బుక్ పేజీలను వేలాదిమంది అభిమానులు బాయ్కాట్ చేశారు. శ్రీలంక ఆడే మ్యాచ్లను టీవీలలో వీక్షించవద్దంటూ అభిమానులు మీమ్స్ షేర్ చేసుకున్నారు. గత 30 ఏళ్లలో శ్రీలంక ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని అభిమానులు మండిపడుతున్నారు. లంక క్రికెటర్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను అన్ఫాలో చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగింది. ప్రస్తుతం నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది.కాగా, సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ప్రచారంపై లంక బోర్డు సభ్యులు ఎవరూ స్పందించకపోవడం విశేషం. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఒక్కడు ఈ విషయమై మాట్లాడాడు. లంక క్రికెట్ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని దేశంలో క్రికెట్ను కాపాడాలని బోర్డు సభ్యులను అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, టీ20ల్లో శ్రీలంకకు ఇది వరుసగా ఐదో సిరీస్ ఓటమి. అంతకుముందు కూడా లంక జట్టు భారీ ఓటములను మూటగట్టుకుంది. ఒక్క సిరీస్లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. కాగా, శనివారం రాత్రి ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 181 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తొలి టీ20లో 129/7 స్కోర్ చేసిన లంక.. రెండో టీ20లో 111/7, మూడో మ్యాచ్లో 91 పరుగులకు ఆలౌటైంది. లంక దారుణ ప్రదర్శనను సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: మాట మార్చిన ద్రవిడ్.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..! -
పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు
కార్డిఫ్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ అద్భుత రనౌట్తో మెరిశాడు. ఫుట్బాల్ టెక్నిక్ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్మన్ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్గా మారింది. టాస్ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సామ్ కరన్ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్కు తగిలి పిచ్పైనే ఉండిపోయింది. సింగిల్కు అవకాశం ఉండడంతో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్బాల్ టెక్నిక్ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్కు చేరాడు. సామ్ కరన్ రనౌట్ వీడియో ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇట్స్ కమింగ్ హోమ్.. సామ్ బ్యాక్ ఆన్ ది నెట్ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: ఆల్రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్దే టి20 సిరీస్ Great. Let's win this @englandcricket ....@daniel86cricket bro r u watching ur team s worst performance vs ENG — RahulVaidya_fanclub (@vaidyaFan_rahul) June 24, 2021
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement