families
-
కష్టం.. అయినా ‘సాగు’ ఇష్టం!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా కొనసాగుతోంది. 2016–17 సంవత్సరంలో నిర్వహించిన నాబార్డు రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవపసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా, 2021–22లో అది 57 శాతానికి పెరిగింది. అంటే దేశం మొత్తం మీద వ్యవసాయ కుటుంబాలు 9 శాతం మేర పెరిగినట్లు సర్వే స్పష్టం చేసింది.ఏపీతో సహా 20 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కుటుంబాలు(farming families) 34 శాతం ఉంటే, 2021–22లో 53 శాతానికి పెరిగాయి.అంటే రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం మేర పెరిగినట్లు స్పష్టం అవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో అత్యధిక కుటుంబాలు వ్యవసాయేతర కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్నట్లు సర్వే పేర్కొంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో అత్యధికంగా 82 శాతం వ్యవసాయేతర కుటుంబాలే ఉన్నాయి. కేవలం 18 శాతం కుటుంబాలే ఈ రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలున్నట్లు సర్వే వెల్లడించింది. -
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్క మీద ప్రేమ.. పీఎస్కు పంచాయతీ
బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది. తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
జనగాంలో భారీ అగ్ని ప్రమాదం.. 20 కోట్ల ఆస్తి నష్టం (ఫొటోలు)
-
ఎక్కువ పొదుపు చేస్తుంది.. వ్యవసాయ కుటుంబాలే
దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. భారత్లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి -
లక్షల మందిని తరలించలేం
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్నగర్లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారు. సీనియర్ ఐఏఎస్లను విజయవాడకు రప్పించాప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్నగర్ 16 డివిజన్లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇంత వర్షం.. అసాధారణంరాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
ఉత్తరం కలిపింది వారిని...!
బ్రిటన్లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్లో కలుసుకున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారంటే..? ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు. తాత ఇంటి నుంచి లేఖ.. ‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆశ్చర్యపోయా.. ‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది. బంధువులను కలవడం బాగుంది... ‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సినిమాను తలపించేలా.. చిన్న ‘పార్కింగ్’ గొడవ.. పెద్ద రచ్చ.. వీడియో వైరల్
ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UPpic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 -
వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!
వర్ణవివక్షపై పోరాడిన దక్షిణాఫ్రికా నేలపై.. లింగ వివక్ష ఇంకా వేళ్లూనుకుని ఉంది. శ్వేతజాతి పాలన అంతమైన 30 ఏళ్ల తరువాత కూడా మహిళలకు సర్వ హక్కులు రాలేదు. జాతి రక్షణ కోసం చేసిన భూ చట్టం నల్లజాతి మహిళలకు మాత్రం అభద్రతను మిగులుస్తోంది. భర్త చనిపోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు తమ సొంత ఇంటినుంచే గెంటివేతకు గురవుతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా పట్టణాల్లోని టౌన్షిప్లలో లక్షలాది నల్లజాతి కుటుంబాలు ఇదే అభద్రతలో జీవిస్తున్నాయి. శాశ్వతమైన వివక్ష.. జొహన్నెస్బర్గ్లోని 74 ఏళ్ల వృద్ధురాలు జొహనా మోత్లమ్మ. 1977లో ఆమెకు 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సొవెటోలో ఒక చిన్న ఇంటికి మారారు. 1991లో విడాకులు తీసుకునే వరకు ఇక్కడి టౌన్íÙప్లోని ఇంట్లో నివసించారు. 2000 సంవత్సరంలో ఆమె మాజీ భర్త ఆ ఇంటిని రిజిస్టర్ చేసినప్పుడు, పూర్తి యాజమాన్యం అతనికే వెళ్లింది. మూడేళ్ళ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటి యాజమాన్య హక్కుల గురించి అతడిని ఆమె ఎప్పుడూ అడగలేదు. 2013లో అతను చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది. అతని రెండో భార్య ఆ ఇంటిని అమ్మేసింది. ఎందుకంటే ఇంటిలో మోత్లమ్మకు 50 శాతం హక్కున్నా... అప్గ్రేడ్ అయిన చట్టం విడాకుల తరువాత ఆమెకు ఆస్తి హక్కును అనుమతించలేదు. ఆస్తికి ఆమె కూడా యజమానిగా భర్త రికార్డుల్లో పేర్కొనలేదు. దీంతో ఇంటి అమ్మకాన్ని ఆమె ఆపలేకపోయింది. అప్గ్రేడింగ్ చట్టం మహిళల పట్ల వివక్షను శాశ్వతం చేసింది. కోర్టుల చుట్టూ తిరిగి, విసిగి.. 39 తొమ్మిదేళ్ల లెబో బలోయి కూడా దశాబ్దం కిందట తన ఇంటిని కోల్పోయింది. సోవెటోలో ప్రభుత్వం జారీ చేసిన రెండు పడక గదుల ఇల్లు ఆమె తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ తరువాత తనకు, తన తల్లికి ఆ ఇంటి వారసత్వం వస్తుందని బలోయి ఆశించింది. అందుకే ఆమె, ఆమె భర్త పాల్ కలిసి ఇంటిని పునరుద్ధరించారు. ఇంటికి మరో రెండు గదులు అదనంగా కట్టారు. 2009లో ఆమె తల్లి చనిపోయిన తరువాత ఆ ఇంటిపై హక్కు తన సవతి తల్లి కూతురుకు వెళ్లిపోయింది. చట్టబద్ధంగా ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. కోర్టుకు తిరిగి తిరిగి విసిగిపోయిన ఆమె.. తన సవతి సోదరితో పోరాడటానికి బదులుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలోని జొహన్నెస్బర్గ్ శివారు మెలి్వల్లేలో నివసిస్తోంది.మోత్లమ్మ, బలోయిలే కాదు.. సొవెటోలో లక్షలాది మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంటి గురించి కుటుంబ సభ్యులు గొడవపడానికి ఈ వ్యవస్థ కారణమైందని వారు వాపోతున్నారు. 1994లో ప్రభుత్వం భూమి హక్కుల పునరుద్ధరణ చట్టం–1994 ప్రవేశపెట్టింది. 1991 యొక్క భూ కాలపరిమితి హక్కుల చట్టంలోని నల్లజాతి దీర్ఘకాలిక లీజుదారుల ఆస్తి హక్కులను అప్ గ్రేడ్ చేసింది. చివరికి వారి ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. కానీ ఇందులో ఒక చిక్కుముడి ఉంది. చట్ట నిబంధనల ప్రకారం, కుటుంబ పెద్దగా పరిగణించబడే వ్యక్తి మాత్రమే ఆస్తిపై హక్కును కలిగి ఉంటాడు. అతను బతికున్న కాలంలో విల్లు రాస్తే ఆ జాబితాలో ఉన్నవారికి చెందుతుంది. పితృస్వామ్య సంప్రదాయ వారసత్వ నిబంధనల్లో పాతుకుపోయిన ఈ కొత్త చట్టం భార్యలు, సోదరీమణులు, తల్లులు, కూతుళ్లను వారసత్వానికి దూరం చేస్తోంది. సవరణలకు సుప్రీం ఆదేశం... ఇది మహిళలను చట్టానికి దూరంగా ఉంచడమేనని 2018లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు పేర్కొంది. టౌన్íÙప్లో మహిళల భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేక కేసుపై తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లింగ, ఆస్తి వారసత్వానికి సంబంధించిన అప్ గ్రేడింగ్ చట్టంలోని సెక్షన్ 2(1) రాజ్యాంగపరంగా చెల్లదని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది మహిళల హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. ప్రాపర్టీ పర్మిట్ లేదా టైటిల్ డీడ్లో పేర్లు లేకపోయినా బాధిత మహిళలు లేదా ఇప్పటికే ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమరి్పస్తే హక్కులు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు పార్లమెంటును ఆదేశించింది. ఫలితంగా ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రభుత్వం భూమి హక్కుల సవరణ చట్టం–2021ను గెజిట్ చేసింది. ఇది ఎన్నికలు ముగిసిన వారం తర్వాత అమల్లోకి వచి్చంది. దీంతో ఇళ్లు కోల్పోయిన ప్రజలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘’నాట్ ఫర్ సేల్’... దీంతో ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలతో జొహన్నెస్బర్గ్లోని స్వచ్ఛంద సంస్థలు కిటకిటలాడుతున్నాయి. ఈ వివాదాలు సర్వసాధారణమయ్యాయని, మహిళలు కోర్టు ల్లో దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని విట్వాటర్స్ ర్యాండ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డీన్ బుసిసివే ఎన్కాలా డ్లామిని చెప్పారు. ఇలాంటి చట్టం ఒకటుందని, జీవితకాలం వారు నివసించిన ఇంటిపై హక్కు లేదని... సడన్గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచి్చనప్పుడే మహిళలకు తెలుస్తోందని హక్కుల సంఘాలు వాపోతున్నాయి. ఈ చట్టం వల్ల మహిళలు, పిల్లలు తమ జీవితకాల భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ‘ఎ జెండర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యామిలీ హోమ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా’ అధ్యయనం వెల్లడించింది. పట్టాల సమస్యల కారణంగా ‘నాట్ ఫర్ సేల్’ అని రాసిన ఇళ్లు సోవెటోలో అనేకం కనిపిస్తాయి. ’మాకు మా చిన్ననాటి ఇల్లు కావాలి’ చర్చలతో ప్రభుత్వం, కోర్టులు చేస్తున్న జాప్యానికి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు అసహనానికి గురవుతున్నాయి. తమ ఇంటిపై యాజమాన్యం విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మోత్లమ్మ కొడుకు మైమానే కోర్టును కోరుతున్నాడు. ‘మా నాన్నకు అన్ని అనుమతులు ఇచ్చి, మా అమ్మను మినహాయించిన ఈ వ్యవస్థ సరైంది కాదు’ అంటున్నాడు. ఇద్దరికీ సమానహక్కులుంటే ఈ సమస్య ఉండేది కాదని, తమ చిన్ననాటి ఇంటిని తిరిగి పొందాలనుకుంటున్నామని చెబుతున్నాడు. -
అచ్యుతాపురం ఘటన: మళ్లీ మొదటికొచ్చిన రూ.కోటి పరిహారం వ్యవహారం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్నుసూపరింటెండెంట్ మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాలను తీసుకువెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరీ వీడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇదిలా ఉంటే.. కోటి రూపాయల పరిహారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే రూ. కోటి చెక్కు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు వెళ్లిన తర్వాత అధికారులు మాట మర్చారు. డెడ్బాడీలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దారి ఖర్చులకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు అంటున్నారు. రూ కోటి పరిహారం ఇస్తేనేగాని ఇంటికి తీసుకెళ్లమంటున్న బంధువులు.. రూ.10 వేల కోసం కుక్కర్తి పడేవాళ్లలా కనిపిస్తున్నామా అంటూ నిలదీశారు.మరీ ఇంత నిర్లక్ష్యమా!?కాగా, ఎక్కడో మదనపల్లిలో ఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఫైళ్లు దగ్ధమైతేనే ఏదో భారీ ఉపద్రవం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి, ఆగమేఘాల మీద హెలికాఫ్టర్లో డీజీపీని పంపి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. విశాఖలో ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తే, ఇంత మంది ప్రాణాలు పోతే స్పందించకుండా తాపీగా ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేస్తూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, తనను మించిన విజనరీ, సమర్థుడు ఈ దేశంలోనే లేడని తనకు తానే డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రియాక్టర్ ప్రమాద ఘటనలో మాత్రం చతికిలబడ్డారు. చంద్రబాబు పరిపాలనలో బేలతనం ఈ దుర్ఘటనతో స్పష్టంగా బయటపడింది.మధ్యాహ్నం 2 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా సహాయక చర్యలపై వారితో సీఎం చంద్రబాబు సమీక్షించలేదని తెలిసింది. చంద్రబాబు సీఎం సమీక్ష అనంతరం కూడా సచివాలయంలోనే ఉన్న హోం మంత్రి అనిత.. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు.అచ్యుతాపురం ఘటనపై ఆమె కనీసం స్పందించ లేదు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదంలో మృతుల వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అంతెందుకు రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి కలెక్టర్తో సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. సచివాలయంలోనే ఉన్నా, హోం మంత్రి, డీజీపీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అర్ధరాత్రయినా ప్రమాద స్థలానికి మంత్రులుగానీ, ఉన్నతాధికారులుగానీ చేరుకోలేదు. ప్రెస్ నోట్లు, మీడియాలో దిగ్భ్రాంతులకే పాలనా యంత్రాంగం పరిమితమైంది. -
కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్.. చేనేత కుటుంబాలకు సాయం
సాక్షి,హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గడిచిన ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు స్టేట్ హోమ్లో ఉన్న వందమంది అనాథ విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు. కేటీఆర్ బుధవారం(జులై 24) తన పుట్టినరోజు జరుపుకున్నారు. -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్? (ఫోటోలు)
-
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కార్ల్మార్క్స్ చాలాకాలం క్రితమే తేల్చేశాడు కానీ.. ఈ సూత్రానికి మినహాయింపులూ చాలానే ఉన్నాయి. సమాజం మాట కాకపోయినా.. తల్లిదండ్రులు.. దగ్గరి బంధువులతో సంబంధాలను, డబ్బుతో ముడి పెట్టకుండా చూసుకునేవారు చాలామందే కనిపిస్తారిప్పుడు. అయితే.. కెనెడాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. దహన సంస్కారాలకు ఎక్కువ ఖర్చు అవుతోందన్న కారణంగా చాలామంది శవాలను మార్చురీల్లో కుళ్లిపోయేలా చేస్తున్నారని చెబుతున్న ఈ వార్తలు అయ్యో అనిపించేవి.అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం.ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న దుఃఖం, మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలకుపై మాటే.. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 3 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి. -
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
-
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్ చేశారు. ఈ థీమ్ ఉద్దేశ్యం..వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది. ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ముఖ్యోద్దేశం. అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేగాదు ఈ రోజు కుటుంబ (చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్గా తొలి భారతీయ యువతి!) -
గుంటూరు పర్యటనలో గొప్పమనసు చాటుకున్న సీఎం జగన్
-
పార్లమెంట్లో నెతన్యాహుకి చేదు అనుభవం!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూకి పార్లమెంట్ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహూ ప్రసంగిస్తున్న వేళ.. గాజాలో హమాస్ బందీలుగా ఉన్న వాళ్ల కుటుంబీకులు తమ నిరసన గళాలతో పార్లమెంట్ను హోరెత్తించారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు వాళ్లు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని నెతన్యాహు ప్రసంగం జరుగుతున్న టైంలో.. కుటుంబ సభ్యులు ఫ్లకార్డులపై బందీల ఫొటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహూ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. నెతన్యాహు ప్రసంగిస్తూ సమయంలో నెస్సెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేని నిలబడ్డారు .. ‘‘ సమయం లేదు.. ఇప్పుడే, ఇప్పుడే.. అంటూ గట్టిగా గట్టిగా నినాదాలు చేశారు. అయితే నెతన్యాహూ వాళ్లకు సున్నితంగా సర్దిచెప్పే యత్నం చేశారు. మన బిడ్డలు ఊరికనే చనిపోవడం లేదు. మన దేశ నాశనం కోరుకుంటున్న శత్రువులపై విజయం సాధించేంతవరకు ఈ ప్రయత్నం ఆపకూడదంటూ వ్యాఖ్యానించారు. الأمور مولعة خالص داخل كيان العدو الصهيوني.. - عائلات الأسرى الإسرائيليين تقاطع نتنياهو خلال جلسة الكنيست صارخة "لا وقت.. الآن الآن" - إقالة قائد الكتيبة 51 من لواء غولاني بعد تعريضه جنودا للخطر في الشجاعية. - وأخر شي وأسخن شي.. نتنياهو يمنع غالانت من إجراء مباحثات فردية مع… pic.twitter.com/MeQoH3d8Xt — أجيج (@1b2_r) December 25, 2023 అయితే అప్పటికీ బందీల కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. మా వాళ్లను సురక్షితంగా వెనక్కి మీరు తీసుకొస్తారని నమ్మాం. 80 రోజులు.. ప్రతీ క్షణం నరకంగా గడిపాం. ఇదే మీ కూతురో, కొడుకుకో అయి ఉంటే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ.. బందీల విడుదల కోసమంటూ చేయని ప్రయత్నమేదీ లేదని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడనంటూ గుర్తు చేశారాయన. అందరినీ సురక్షితంగా విడిపించేంతవరకు సంయమనం పాటించాలని కోరారాయన. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాజాలో హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇందులో 22 మంది మరణించగా.. వాళ్ల మృతదేహాలు కూడా బంధువుల్ని చేరలేదు. అక్టోబర్ 7వ తేదీన ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. వేల మందిని బలి తీసుకుంది. ఇజ్రాయెల్ తరఫున 1,200 మంది మరణించగా, హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలో 20 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది. -
కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు
ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి 1989-90లలోనే ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది. 2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది. కశ్మీర్లోయ ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు 60,000 వేల కుటుంబాలు కశ్మీర్లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
నిరుపేద కుటుంబాలకు సీఎం ఆపన్న హస్తం
కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నిరుపేదలు పడుతోన్న కష్టాలను విని స్పందించి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం సీఎంను హెలిప్యాడ్ వద్ద పలువురు కలిసి తమ గోడు విన్నవించారు. వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్లో 17 మంది బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలిచ్చారన్నారు. శస్త్ర చికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని సీఎంను అడగ్గా ఆ వెంటనే తదనుగుణంగా సీఎం ఆదేశాలిచ్చారని, దీంతో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్కు లబి్ధదారులు ధన్యవాదాలు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఆర్థిక సహాయం పొందిన వారిలో ఈ సత్య సుబ్రహ్మణ్యం (పెద్దాపురం), టీ.ఆనంద్కుమార్ (కిర్లంపూడి), కృష్ణకాంత్ (పెద్దాపురం), బుర్రా రాజు (పెద్దాపురం), లక్ష్మి ఆకాంక్ష (పెద్దాపురం), సింగం శ్యామల భాను (కాకినాడ), ఐ సాయి వెంకట్ (పెద్దాపురం), డి నవీన్ (పెద్దాపురం) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి.మాధురి నవ్య, ఐ.నైనిక, జె.వీరవెంకట సాయి, సిహెచ్ హర్షిత, వి.శశిశ్రీనేత్ర, జి.సుజాత, ఎన్.సతీష్, పి.ప్రేమ్ చంద్, కె.మార్తమ్మ (నంద్యాల)ఉన్నారు. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
వరద బాధితులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
-
వరద మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.లక్ష అదనంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాలపై శాసనసభలో గురువారం జరిగిన లఘు చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బదులిచ్చారు. మృతుల్లో రైతులు ఉంటే రూ.4 లక్షల పరిహారంతో పాటు, తక్షణమే రూ.5 లక్షల రైతు బీమా అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 139 గ్రామాల్లో వర్షాల వల్ల నష్టం జరిగిందని మంత్రి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 7,870 ఇళ్లకు చెందిన 27 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు తెలిపారు. 419 ఇళ్లు కూలిపోయాయని, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో చేర్చి కట్టించాలని సీఎం కేసీ ఆర్ ఆదేశించినట్టు చెప్పారు. పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని, వివరాలు వచ్చాక ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వేముల హామీనిచ్చారు. వరద సాయం చేయమని కోరితే కేంద్రం ప్రతిసారీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల వాకౌట్ వరదల నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్చలో పాల్గొన్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము లేవనెత్తిన సందేహాలకు, ప్రజలను ఆదుకోమని చేసిన విజ్ఞప్తికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం.ఈ సందర్భంగా ఎన్నో జంటలను వేధించే వంధ్యత్వ సమస్య గురించి తెలుసుకుందాం. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది. దీని నుంచి ఎలా బయపడొచ్చో చూద్దాం. నిజానికి నూటికి 50 శాతం జంటలు ఈ సమస్యను అనుభవిస్తున్నావారే. దీనికి ఇద్దరిలో ఒకరి వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు. ముందుగా మగవారిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో చూద్దాం. మగవారిలో ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే.. వారిలో స్పెర్మ కౌంట్ సరిగా లేకపోవడం. వృషణాలలో సమస్య గవదబిళ్లలు వంటి ఇన్ఫెక్షన్లు అకాల స్ఖలనం సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన రుగ్మత పునరుత్పత్త అవయవాలకుగాయలు ఎక్కువగా ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానాలు కారణంగా స్పెర్మ్ కౌంట్పై ప్రభావం ఏర్పడుతుంది స్మోకింగ్, మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడినా క్యాన్సర్కి సంబంధించిన చికిత్స రేడియోషన్ లేదా కీమోథెరఫీ వంటి వాటివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీలలో ఎలా ఎదురవుతందంటే.. పీసీఓఎస్, హైపర్ప్రోలాక్టినిమియా లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత గర్భాశయ అసాధారణతలు, గర్భాశయ పాలిప్స్, ఫైబ్రాయిడ్లు తదితర కారణాలు ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం, అండాలు ప్రయాణానికి ఆటంకం కలిగంచే సంశ్లేషణలు ఎండోమెట్రియోసిస్, టర్నర్ సిండ్రోమ్, పెల్విక్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు సంతానోత్సత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇగ మగవారిలోనూ, స్త్రీలలోనూ కామన్గా ఎదురయ్యే సమస్యలు ⇒30వ దశకం దాటిని స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది ⇒అలాగే పురుషులలో 40 ఏళ్లు పైబడిన వారికి సంతాన సామర్థ్యం తగ్గుతుంది ⇒పురుషులకు మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉంటే గర్భస్రావం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది. ⇒ఇద్దరిలో ఎవరు అధిక బరువు ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు దీనిపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే దీన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ్ల ఇరువురికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గంలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా జంటలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుంది. ఇక చక్కటి కుటుంబం కోసం ఆరాటపడే జంటలు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
కుటుంబాలు కూలిపోయి.. బంధాలు కాలిపోయి! అమ్మా నాన్న మీకోసం.......
నేను బాగుంటే చాలు అనుకోవడంతోనే రోజు మొదలవుతోంది. తోడబుట్టిన వాళ్లు.. బంధువులు కూడా డబ్బు ముందు కానివారవుతున్నారు. ఆస్తులు అంతస్తులు.. పిల్లలు సాధించిన విజయాలు.. గడుపుతున్న విలాసవంతమైన జీవితం.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. వ్యక్తిత్వం ఎక్కడో ఒక మూలన మాత్రమే కనిపిస్తుంది. ఆప్యాయత కరువవుతోంది. బంధాలు పలుచన కాగా.. అసూయ పెరిగిపోతుంది. తనకు కష్టం వచ్చినా, ఇతరులు బాధపడినా కన్నీళ్లే వస్తాయనే విషయం బోధపడితే కానీ తెలియని పరిస్థితి. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. అప్పట్లో ఉమ్మడి కుటుంబం కష్టసుఖాల్లో తోడు నిలిచింది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండటం.. అరమరికలు లేని జీవనం ఉన్నంతలో సంతృప్తి నిచ్చింది. కానీ ఆధునిక ప్రపంచం గుండెలో గోడలు కట్టుకోవడం బంధాలను పలుచన చేస్తోంది. – సాక్షి, కర్నూలు డెస్క్ 29.05.2023 మెడికల్ షాపు నిర్వహణతో భార్యాభర్తలు ఏ లోటు లేకుండా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాగా చదివించారు.. ఉద్యోగం రావడం.. పెళ్లి చేయడంతో రెక్కలొచ్చి ఎవరి దారిని వాళ్లు ఎగిరిపోయారు. కుటుంబ యజమాని మంచం పట్టడంతో ఆయన బాగోగులు చూసుకోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. చివరకు భర్త మరణం ఆమెను కలచివేసింది. ఇంట్లో ఓదార్చే దిక్కులోదు.. ధైర్యం చెప్పే మనుషుల్లేరు. కొడుకులు వస్తారంటే ఒకరు సప్త సముద్రాల ఆవల.. మరొకరు వందల కిలోమీటర్ల దూరం.. ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసింది. .. పత్తికొండలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న బంధాలకు అద్దం పట్టింది. చిన్నటేకూరుకు చెందిన రంగయ్య విశ్రాంత ఆర్టీసీ మెకానిక్. భార్య, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా అనాథాశ్రమంలో కడుపు నింపుకుంటున్నాడు. చివరకు తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేందుకు ఆరోగ్యం కూడా సహకరించక నీరసించాడు. కర్నూలులోని అశోక్నగర్కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి ఆస్తిని దాన విక్రయంగా పొంది తల్లి, సోదరిని ఇంటి నుంచి గెంటేశాడు. కనీసం చట్ట ప్రకారం ఆస్తి ఇవ్వాలని కోరినా దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. కోర్టును ఆశ్రయించినా న్యాయం జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో బతికేందుకు ఆర్థిక వనరులు లేక దిక్కులు చూస్తున్నారు. ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుండటంతో ఎవరికి వారు జీవితంలో స్థిరపడాలనే ఉరుకులు పరుగుల జీవనానికి అలవాటుపడ్డారు. చదువు.. ఉద్యోగం.. ఈ రెండింటికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు, పిల్లలు వీటితోనే జీవితం గడిచిపోతుంది. డబ్బు.. డబ్బు.. ఈ కరెన్సీ నోట్ల మధ్య సమయం నలిగిపోతుంది. మానవత్వం ఎప్పుడో కానీ ఉనికి చాటుకోలేకపోతుంది. సౌకర్యాలు.. విలాసాలు పెరిగిపోవడంతో వీటి ముందు వ్యక్తిత్వం చిన్నబోతుంది. కుటుంబం అన్న మాటే కానీ.. ఎవరికి వారుగా జీవిస్తున్నారు. చాలా కుటుంబాలు ఇప్పటికే బాగా పలుచబడ్డాయి. విద్య.. ఉద్యోగం.. ఉపాధి.. కారణం ఏదైనా ఇంటికి దూరంగా బతకడం అలవాటైపోయింది. ఇక అక్కడో ఇక్కడో కొంతమంది కలసిమెలసి ఉంటున్నా.. అరమరికలతో తుమ్మితే ఊడిపోయే బంధంగా మారుతోంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుండటంతో ఒకే ఇంట్లో జీవిస్తున్నా ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. రాక, పోక ఇష్టానుసారం కాగా.. విలువలు గాలికి కొట్టుకుపోయి బంధాలు ఒంటరిగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎవరికి వారే భోజనం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో అందరూ కలసి భోజనం చేయడం పరిపాటి. ఆ తర్వాత సంఖ్య కాస్త పలుచబడినా రోజులో ఏదో ఒక పూట భోజనం చేయనిదే తృప్తి కలగని పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ సమయంలో తింటారో తెలియదు, ఏం తింటున్నారో కూడా అడిగేందుకు సమయం ఉండకపోవడం కుటుంబంలో అనారోగ్య వాతావరణానికి కారణమవుతోంది. అందరూ కలసి కూర్చొని భోజనం చేయడం ద్వారా కష్టసుఖాలు పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం మారిపోయి.. ఆకలి అయినప్పుడు తింటామనో, బయట తిని వచ్చామనే మాటలు వినిపించడం సర్వసాధారణమైంది. హాస్టళ్లలో చదువు ఇది పోటీ ప్రపంచం. మా పిల్లాడు అందరికంటే ముందుండాలనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రిలో కనిపిస్తుంది. ఈ కారణంగా పిల్లలను ఇంట్లో ఉంచుకోకుండా కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచి చదివించడం ఫ్యాషన్ అయిపోయింది. అగ్గి పెట్టెల్లాంటి రూముల్లో.. మంచీచెడు తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. అమ్మానాన్నల ఆప్యాయతకు దూరమవుతూ.. బంధాల విలువ తెలియకుండా ర్యాంకుల వెంట పరుగులు తీయడంతోనే బాల్యం దాటిపోతుంది, యవ్వనం చేజారిపోతుంది. ఆ తర్వాత కూడా ఇంటికి చుట్టపుచూపుగానే వస్తుండటంతో విలువలు వీధిపాలవుతున్నాయి. పండగలూ పబ్బాలకే.. గతంలో శుభకార్యమైనా, చావుకైనా పది మంది కలిసేవాళ్లు. మంచీచెడు చెప్పి వెళ్లేవాళ్లు. రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకొని పొద్దుపోయే దాకా కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనీసం ఖర్మకాండలు ఎలా చేయాలనే విషయం కూడా తెలియక తికమకపడుతున్నారు. పెళ్లిళ్లు.. శుభకార్యాలంటే ప్రతి ఒక్కరి అడుగు ‘బ్రాహ్మణుల’ ఇంటి వైపునకే పడుతోంది తప్పితే ఒక్కటంటే ఒక్కటీ సొంతంగా చేసుకోలేకపోవడం ఆధునికత ఏ పరిస్థితికి దారితీస్తుందో అర్థమవుతోంది. ఆహా్వనాలు, హాజరు కూడా మొక్కుబడిగానే ఉండటం చూస్తే మనిషికి, బంధాలకు మధ్య దూరం ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. సెల్ఫోన్లతో సరి.. సర్దుబాటు ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు. పక్కోడి నీడను కూడా సహించలేని పరిస్థితి. వయస్సు పెరిగే కొద్దీ సహనం, ఓర్పు కనిపించాల్సి ఉండగా.. అసూయ ద్వేషాలకు పెద్దపీట వేస్తున్నారు. చిన్న చిన్న మాటలకు పట్టింపులకు పోయి బంధాలనే వదులుకోవడం, అసలు వాళ్లతో ఏమి అవసరం ఉందనే భావన అధికమైంది. ఇందుకు సెల్ఫోన్లతో కాలం గడపటం, గంటల కొద్దీ వాటితోనే సావాసం చేయడం ప్రధాన కారణం. ఇంట్లోనే ఉంటున్నా ఎవరూ మాట్లాడుకోకుండా సెల్ఫోన్పై చేతులు కదుపుతున్నారు. ఫ్రెండ్స్ కలిశామన్న మాటే కానీ చూపంతా సెల్ఫోన్ పైనే ఉంటోంది. ఒక్కరు మరణించినా.. పిల్లలు మంచి హోదాలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తున్నారు. ఇందుకోసం తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. పైసాపైసా కూడబెట్టి మరీ భవితకు బాటలు వేస్తున్నారు. తీరా లక్ష్యం చేరుకోగానే.. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. పిల్లోడు బాగుపడితే చాలనుకొని కొంత కాలం దంపతులు ఇద్దరూ నెట్టుకొస్తున్నా.. వృద్ధాప్యంలో మనోవేదనతో మంచం పడుతున్నారు. ఈ సమయంలో ఇద్దరిలో ఒకరు మరణించిన మరొకరి జీవనం దుర్భరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా భార్య మరణిస్తే.. ఆ వెంటనే భర్త కన్నుమూయడం చూస్తే.. పిల్లలు దూరమైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. పిల్లలకు సమయం కేటాయించాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి. మరీ ముఖ్యంగా వారితో గడిపేందుకు సమయం కేటాయించాలి. ప్రతి ఒక్కరూ ఐదు టీలు(టైం, టాక్, ట్రీట్, టచ్, ట్రస్ట్) పాటించాలి. అప్పుడే పిల్లలతో బంధం బలపడుతుంది. తల్లిదండ్రుల స్పర్శ పిల్లలకు సరికొత్త అనుభూతితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. నమ్మకం పెంపొందింనప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. – సి.జ్యోతిర్మయి, ఫ్యామిలీ కౌన్సిలర్, బిహేవియర్ థెరపిస్ట్, కర్నూలు -
పిల్లనిచ్చి వరకట్నంగా కుక్కలు..
సిరిసిల్ల: శునకాలను కొందరు అభిరుచికొద్దీ, ఇంకొందరు ఇంటికి రక్షణ కోసం పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ.. శునకరాజాలను ఆస్తిగా భావిస్తూ.. ఆడపిల్లలకు కట్నంగా కూడా ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్లెవరూ, వారి జీవనశైలి ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా..! రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. కోనరావుపేట మండలం కొండాపూర్, బావుసాయిపేట, చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ మూడు పల్లెలకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు జిల్లావ్యాప్తంగా భిక్షాటన చేస్తారు. ఆహారాన్ని సేకరించి కుక్కలను పోషిస్తారు. ఈ కుక్కలను వేటకు, వారు నివాసం ఉండే గుడారాల రక్షణకు ఉపయోగిస్తారు. ఒక్కో కుటుంబంలో ఐదు నుంచి పది, పదిహేను, ఇరవై.. శునకాలను పెంచుతుంటారు. అయితే శునకాలనే ఆస్తిలా భావించే ఈ ఆచారం గంగిరెద్దుల కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతోంది. ఎన్ని ఎక్కువ శునకాలను పెంచితే అంత ఆస్తిపరులన్న మాట. వారు పోషిస్తున్న శునకాల సంఖ్యను బట్టే ఆ కుటుంబపెద్దకు వారి కులంలో గౌరవం లభిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆడ పిల్లలకు పెళ్లిలో కట్నంగా శునకాలను ఇచ్చే సంప్రదాయం ఈ కుటుంబాల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబాల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం చేస్తూ కొందరు.. చిన్న చిన్న బుట్టల్లో ప్లాస్టిక్ సామగ్రి అమ్ముతూ, కొబ్బరి కుడుకలకు బదులు చక్కెర ఇçస్తూ కొందరు జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి.. మాకు కుక్కలను పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటి ముందు ఎన్ని ఎక్కువ కుక్కలుంటే అంత విలువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ తక్కువ. కాలం మారినా.. మాకు కుక్కలు ఉండాల్సిందే. మేం ఏం తింటే అదే వాటికి పెడతాం. మాతోనే ఉంటాయి. మేం ఏ ఊరికి వెళ్తే.. ఆ ఊరికి మా వెంట వస్తాయి. – టేకుమల్ల రాజయ్య, సంచార జీవి. శునకాలే మా ఆస్తి.. మునుపు ఎక్కువ కుక్కలను పెంచేటోళ్లం. షికారీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మావోళ్లు సోకులకు వచ్చిండ్రు. కుక్కలను ఎక్కువ సాదుత లేరు. వ్యవసాయం చేస్తుండ్రు. కుడుకలకు చక్కరి అమ్ముతూ.. బతుకుతుండ్రు. బిచ్చం ఎత్తడం లేదు. అయినా మాకు కుక్కలతోనే ధనం. – గంట లచ్చయ్య, బావుసాయిపేట. -
కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ‘మాయమైపోతున్నడమ్మా’
రాయవరం(కోనసీమ జిల్లా): ‘‘మాయమైపోతున్నడమ్మా...మనిషన్న వాడు...మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు’’.. అంటూ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ రాసిన గేయం రాయవరం మండలం మాచవరం సమీపంలో జరిగిన హత్యోదంతాన్ని గుర్తుకు తెస్తోంది. గత నెల 24న కొవ్వూరి సత్యవేణి (54) హత్యకు గురైన విషయం విదితమే. మాచవరం శివారు దేవుడు కాలనీకి చెందిన ఇద్దరు అవివాహిత సోదరులు ఆమెపై తొలుత అత్యాచారం చేసి, ఆనక హత్య చేశారు. ఈ ఘటన హతురాలి కుటుంబాన్నే కాదు హత్యకు పాల్పడిన వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. గతంలో దేవుడు కాలనీకే చెందిన అన్నదమ్ములు నల్లమిల్లి ఉమామహేశ్వరరెడ్డి, నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డిలు సత్యవేణిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టడంతో అన్నదమ్ములు ఆమెపై కక్ష పెంచుకుని, ఈ దురాఘతానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆ సోదరుల తల్లి నల్లమిల్లి పద్మ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల విచారణలో వాస్తవాలు బయట పడడంతో అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు. దాంతో వారి కుటుంబం రోడ్డున పడింది. హతురాలి కుమారుడి మూగ వే(రో)దన.. హతురాలు సత్యవేణి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మూగ, చెవిటి వాడైన చిన్న కుమారుడు ఉమామహేశ్వరరెడ్డిని తల్లి సత్యవేణి కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. తల్లి సత్యవేణి హత్యకు గురైన విషయం ఉమామహేశ్వరరెడ్డికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. 15 రోజులుగా తల్లి కనిపించకపోవడంతో అతడు ఆహారం తీసుకోవడం లేదు. అమ్మ వస్తుందని చెప్పినా వినకుండా ఒంటరిగా గదిలోనే గడుపుతున్నాడు. ఉమామహేశ్వరరెడ్డిని ఎలా ఊరడించాలో తెలియక తాతయ్య ద్వారంపూడి గంగరాజు మదనపడుతున్నాడు. చదవండి: ‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’ కఠినంగా శిక్షించాలి కొవ్వూరు సత్యవేణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ పూర్వపు జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు డిమాండ్ చేశారు. మానవత్వం మరచి అత్యాచారం చేసి మహిళలను హతమార్చిన నిందితులను దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం 21 రోజుల్లో శిక్షించాలని అన్నారు. కొవ్వూరి సత్యవేణి కుటుంబసభ్యులను సిద్ధు పరామర్శించారు. -
హీరోయిన్స్గా రఫ్ఫాడించిన హీరోల కూతుర్లు వీళ్లే.. (ఫొటోలు)
-
విచిత్రమైన ప్రేమ కథ: చనిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!
ఎన్నో విచిత్రమైన ప్రేమ కథలు గురించి విన్నాం. కానీ ఇలాంటి ప్రేమ కథను ఇప్పటి వరకు విని ఉండం. అదీ కూడా బతికుండగా తమ ప్రేమను పండించుకుని పెళ్లి వరకు తీసుకురాలేకపోయారు. కానీ చనిపోయాక తమ కోరికను కుటుంబ సభ్యులతో నెరవేర్చుకోగలిగారు. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గుజరాత్లోని తాపిలో నివశించే గణేష్, రంజనాలు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే వారి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించ లేదు. ఇక తమ కోరిక నెరవేరే అవకాశమే లేదని నిరాశతో ఆ ఇద్దరు ఆగస్టు 2022లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అనుహ్య ఘటనతో కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెందారు. ఎలాగో బతికుండగా వారిక కల నెరవేర్చలేకపోయాం అని చాలా బాధపడ్డారు. అందుకని వారి విగ్రహాలను తయారు చేయించి వాటికే పెళ్లి చేసి ఆ ప్రేమ జంట కోరికను నెరవేర్చారు. సరిగ్గా చనిపోయిన ఆరునెలలకు ఆ ప్రేమికుల విగ్రహాలకు ఘనంగా వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. ఈ మేరకు ఆ అమ్మాయి తాత మాట్లాడుతూ ఆ అబ్బాయి తమ దూరపు బంధువు కుంటుంబానికి చెందిన వాడని వద్దునుకున్నామని చెప్పారు. ఐతే వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానే ఇష్టపడ్డారని, అందుకే ఇరు కుటుంబాలు ఈ ఆలోచనకు వచ్చి ఇలా చేశామని చెప్పుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతోనే ఇలా వారి ప్రతిమలకు ఘనంగా పెళ్లి చేసినట్లు బంధువులు తెలిపారు. (చదవండి: స్టార్ సింగర్ రేంజ్లో పాడాడు..ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్కి మంత్రి ఫిదా!) -
ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?
పెదవాల్తేరు (విశాఖ తూర్పు):విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ జంట కుటుంబాలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వాగ్వాదానికి దిగాయి. వీరికి సర్దిచెప్పడానికి పోలీసులు హైరానా పడాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రేసపువానిపాలెం దరి సిద్ధార్థనగర్కి చెందిన తాటిపూడి సీతారామ్ కుమారుడు ప్రశాంత్కుమార్ ఓ షోరూమ్లో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇతను, కైలాసపురానికి చెందిన మౌనిక గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రేమించుకున్నారు. గత నెలలో మౌనిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 14న వీరిద్దరూ కొత్తవలసలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు ప్రశాంత్కుమార్ ఇంటికి వచ్చారు. వెంటనే అతని తల్లిదండ్రులు వీరిని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మిస్సింగ్ కేసు విరమింపజేశారు. ప్రస్తుతం మౌనిక గర్భిణికాగా తాను భర్త వద్దకు వెళ్లేదిలేదంటూ చెప్పడం గమనార్హం. మహిళా చేతన పద్మను అరెస్టు చేయాలి మహిళా చేతన ప్రతినిధి పద్మ మూడో పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశమని ఆహ్వానం పంపడంతో స్టేషన్కి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఆ సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అక్కడికి చేరుకుని పద్మను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువకుని తండ్రి సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రేమించి పెళ్లిచేసుకున్న కుమారుడు, కోడలు చక్కగానే కాపురం చేసుకుంటున్నారని తెలిపారు. తమ కోడలు తల్లిదండ్రులు ఆమె మనసుని మార్చేశారని ఆరోపించారు. నగరంలో ఎన్నో కాపురాలు కూలిపోవడానికి కారణమైన పద్మ అండ చూసుకుని తన కోడలు కాపురానికి రానంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి అయిన తన కోడలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం పద్మ ఆమెని డిశ్చార్జి చేయించి, స్టేషన్కి తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. కాపురం చేసుకుంటున్న తన కుమారుడు, కోడలు విడిపోవడానికి కారణమవుతున్న పద్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు కుటుంబాలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు. ప్రశాంత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ మహిళా చేతన పద్మ మాటలు విని తన భార్య మౌనిక కాపురానికి రానంటుందని, పోలీసులు స్పందించి తమ కాపురం నెలబెట్టాలని కోరాడు. -
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి
Anil Ravipudi Says I Have 3 Families Comments Viral In F3 Success Meet: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మెహరీన్, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'థంబ్నేయిల్స్ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.' అని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. -
అప్పుకు అనేక అవసరాలు.. ఇదే వారి పెట్టుబడి.. ప్రాణాలు పోయినా సరే!
నిజామాబాద్కు చెందిన సురేష్ తన అవసరాల కోసం జ్ఞానేశ్వర్ దగ్గర రూ.50 లక్షలు, అతని అన్న వద్ద రూ.30 లక్షలు, మరో బంధువు వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. జ్ఞానేశ్వర్కు ఇప్పటికే రూ.32 లక్షలు చెల్లించాడని తెలిసింది. ఇది వడ్డీలకే సరిపోతుందని, అసలు ఎప్పుడు చెల్లిస్తావంటూ అతడు సురేష్ను తీవ్రంగా వేధించాడు. మరోవైపు కరిపె గణేష్ వద్ద రూ.60 లక్షలు తీసుకున్న సురేష్.. రూ.40 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. అయినప్పటికీ అసలు డబ్బులు చెల్లించాలంటూ గణేష్ బెదిరించాడు. మరోవైపు నిర్మల్కు చెందిన చిట్టీల వ్యాపారి వినీత వద్ద తీసుకున్న చిట్టీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె కూడా వేధించసాగింది. ఈ నేపథ్యంలోనే సురేష్ కుటుంబసభ్యులు నాలుగురోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షి, హైదరాబాద్: వడ్డీ వ్యాపారుల ఆగడాలకు, దౌర్జన్యాలు, బెదిరింపులకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతున్నాయి. పంట పెట్టుబడికి అప్పు.. వ్యాపారం కోసం అప్పు.. చిన్న కుటుంబాల్లో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు అప్పు.. ఇలా అప్పుకు అనేక అవసరాలు, కారణాలున్నాయి. అయితే బాధితుడి అవసరాన్ని, పరిస్థితిని ఆసరాగా తీసుకుని వడ్డీ వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరం కొద్దీ అధిక వడ్డీకి తీసుకున్నా ఆ తర్వాత కనీసం వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టలేక, అసలు అప్పు ఎన్నటికీ తీరే మార్గం లేక బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం వడ్డీ వ్యాపారుల దోపిడీకో తాజా ఉదాహరణ. ఒక్క సురేష్ కుటుంబమే కాదు.. మాట పడితే ప్రాణం పోయినట్టుగా భావించే కుటుంబాలు వడ్డీ వ్యాపారుల బెదిరింపులకు భయపడి, ఆస్తుల జప్తుతో అవమానపడుతున్న ఎంతోమంది బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. దారుణ ఘటనలు జరిగినప్పుడు పైపై దాడులు, కేసులతో సరిపెడుతుండటంతో వడ్డీ వ్యాపారుల దందా మూడు లక్షలు.. ఆరు కోట్లు అన్నట్టుగా సాగుతోంది. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారానికి (మనీ లెండింగ్), చిట్టీలు, ఫైనాన్స్ సంస్థలకు అనుమతులు జారీ చేసే అధికారం స్థాయిల వారీగా జిల్లా కలెక్టర్ నుంచి మండల తహసీల్దార్ వరకు కల్పించారు. మొత్తం మీద కలెక్టర్కు దీనిపై అజమాయిషీ అధికారం ఉంటుంది. మనీ లెండింగ్ బిజినెస్కు అవసరమైన అనుమతి కోసం మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ 2017 ప్రకారం అనుమతి ఇస్తారు. కానీ రాష్ట్రంలో డెయిలీ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్న 90 శాతం మందికి ఎలాంటి అనుమతులు లేవు. ఏఎస్ఐ మోహన్రెడ్డి కేసు తర్వాతా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ ఏఎస్ఐ మోహన్రెడ్డి కేసు తర్వాత కూడా వడ్డీ వ్యాపారుల్లో మార్పు రాలేదు. తనఖా పెట్టిన ఆస్తులను కాజేయడం, వడ్డీ పేరుతో తీసుకున్న అసలుకు పది రెట్లు కట్టించుకొని కూడా, ఇంకా అసలే తీరలేదనడం, ఆస్తులను రిజిస్టర్ చేయించుకోవడం వంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. గ్రేటర్లో రూ.1,200 కోట్ల వ్యాపారం! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున ప్రతి నెలా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు జీరో వడ్డీ వ్యాపారం సాగుతోందని అంచనా. రోజువారీ వడ్డీ వ్యాపారం సాగించే వారి సంఖ్య నాలుగైదు వేల మంది వరకు ఉంటుందని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం విలువైన భూములు, స్థలాలు, ప్లాట్స్, ఫ్లాట్స్ను మాత్రమే తనఖా ఉంచుకుని అప్పులివ్వటం వీరి ప్రత్యేకత. కొందరు ఖాళీ చెక్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని అప్పులిస్తున్నారు. వసూళ్ల కోసం రౌడీషీటర్లు, బౌన్సర్లను రంగంలోకి దింపి బాధితులను పీల్చి పిప్పి చేస్తున్నారు. జగిత్యాల మాఫియా రూటే సపరేటు జగిత్యాల పట్టణంలో ప్రారంభంలో తక్కువ వడ్డీ అని ఎరవేసే వ్యాపారులు.. పోనుపోను తమ వికృతరూపాన్ని బయటపెడతారు. ప్రతినెలా 10 శాతం చొప్పున పెంచుకుంటూ.. పోయి వడ్డీకి వడ్డీలు కట్టి, చక్రవడ్డీలు అంటూ ఇచ్చిన వడ్డీ కంటే 20 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. 1980ల్లోనే ఇక్కడ ఈ వ్యాపారం వేళ్లూనుకుపోయింది. 1990 నాటికే ఏటా దాదాపు రూ.1,200 కోట్ల టర్నోవర్కు చేరుకుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. వీరి వ్యాపారం ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ వరకు విస్తరించింది. గిరిగిరి.. నెలవారీ గిరిగిరి, వీక్లీ, ఫైనాన్స్, నెలవారీ వడ్డీ తదితర పేర్లతో వ్యాపారులు డబ్బు అప్పు ఇస్తున్నారు. గిరిగిరిలో రూ.10 వేలు కావాల్సి వస్తే రూ.8 వేలు ఇస్తారు. రోజూ రూ.100 చొప్పున వంద రోజుల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.10 వేలు నేరుగా ఇస్తే రోజుకు రూ.120 చొప్పున వందరోజులు కట్టాలి. నెలవారీ ఫైనాన్స్లో రూ.50 వేలు ఇస్తే రూ. 6,500 చొప్పున 10 నెలలు తిరిగి చెల్లించాలి. కొందరు బడా వ్యాపారులు తమ సహచర వ్యాపారులకు ఉదయం రూ.లక్ష ఇచ్చి, సాయంత్రానికి దానికి అదనంగా రూ.10,000 వసూలు చేస్తున్నారు. -
రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా.. కిటికీలు తెరిచి చూస్తే...
కలికిరి(చిత్తూరు జిల్లా): అప్పుల మోత అధికమై రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా ఇంటి సామాన్లను తీసుకుని పరారయ్యాయి. గురువారం రాత్రి కలికిరిలో ఇది వెలుగులోకి రావడంతో కలకలం రేపింది. బాధితుల కథనం...స్థానికంగా స్వీట్స్ దుకాణం నిర్వహిస్తున్న ఖాదర్ బాషా, ఏ వన్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు కామున్నీషా, కరంతుల్లా పట్టణంలో పలువురి వద్ద అప్పులు చేశారు. గత శుక్రవారం నుంచి ఖాదర్ బాషా, దంపతులైన కామున్నీషా, కరంతుల్లా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో రుణదాతలు అనుమానించారు. చదవండి: కట్నం వేధింపులకు నవ వధువు బలి గురువారం సాయంత్రం వారి ఇళ్ల కిటికీలు తెరచి చూశారు. ఇంట్లో వస్తువులేవీ పోవడంతో రెండు కుటుంబాల వారు పరారైనట్లు గుర్తించి కంగుతిన్నారు. పోలీస్ స్టేషన్కు పరుగులు తీసి లబోదిబోమన్నారు. ఎస్ఐ లోకేష్రెడ్డి దాదాపు 20 మంది బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. రాత్రి వరకు అందిన ఫిర్యాదుల మేరకు నిందితులకు రూ.1.6కోట్ల అప్పులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. కలికిరితో పాటు చింతపర్తి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారి నుంచి సుమారు రూ.3కోట్లకు పైగా నిందితులు అప్పులు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదలా ఉంచితే, కలికిరిలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వరుసగా మోసాలు వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని..
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఓ ఇంట వివాహానికి తమను పిలవలేదన్న ఉక్రోషంలో ఉన్న మరో కుటుంబ యజమాని ఆ ఇరు కుటుంబాల్లోని పిల్లల ఆటను సాకుగా తీసుకుని గొడవకు దిగి గాయాలయ్యే వరకు తెచ్చుకున్నారు. సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని కొంకాపల్లిలో పనసా వెంకటేశ్వరరావు ఇంటిలో శుక్రవారం వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి పొరుగున ఉన్న అల్లాడ బాబులు కుటుంబాన్ని పిలవలేదు. కాగా ఇరు కుటుంబాల చిన్నారులూ పెళ్లింట్లో ఆడుకుంటుంగా ఒకరు అల్లరి చెయ్యకుండా ఆడుకోండని వారించారు. ఈ విషయాన్ని సాకుగా తీసుకుని అల్లాడ బాబు ఘర్షణకు దిగారు. కర్రలతో కొట్టుకున్న ఈ ఘర్షణలో వెంకటేశ్వరరావు, బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం -
రాత్రికి రాత్రే ఊరు ఖాళీ
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింది ముంపు గ్రామం రాంపురం మదిర వడ్డెర కాలనీ వాసులను సోమవారం రాత్రికి రాత్రే అధికారులు ఖాళీ చేయించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో సుమారు 75 కుటుంబాలు నివాసముంటున్నాయి. అందులో మెజార్టీ కుటుంబాలు ఇప్పటికే గ్రామం నుంచి వెళ్లి పోగా సోమవారం రాత్రి 30 డీసీఎంలు తీసుకుని తహసీల్దార్ బాల్రెడ్డి, ఆర్ఐ రవీందర్ కాలనీకి వచ్చారు. కాగా తమకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ నిర్వాసితులు అధికారులతో గొడవకు దిగారు. అర్ధరాత్రి తాము ఎక్కడికి వెళ్లేదంటూ మహిళలు, పురుషులు బోరున విలపించారు. అర్హులైన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లింస్తుందంటూ అధికారులు వారికి నచ్చజెప్పారు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్లోకి నీరు వదిలేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వారికి వివరించారు. ఎట్టకేలకు వడ్డెర కాలనీలోని సుమా రు 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. -
హృదయ విదారకం: ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ..
కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గుర్ని బలి తీసుకుంటోంది. ఒకరు చనిపోయిన వార్త మరొకరికి తెలియకముందే మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు.. ఇలా అనేక కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు అయినవాళ్లు, ఆప్తులు మరణిస్తుండటంతో ఎంతోమంది వృద్ధులు, మరెంతో మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ.. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ మూడురోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వెంపటి వీరాంజనేయులు (64) ఆయన చిన్న కుమారుడు రాంబాబు (36) మూడు రోజుల వ్యవధిలోనే కరోనాతో చనిపోయారు. వీరాంజనేయులు తన ఇద్దరు కుమారులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. తొలుత వీరాంజనేయులు పెద్ద కుమారుడు రాఘవులకు కరోనా రావడంతో చికిత్స తీసుకుం టున్న సమయంలోనే తండ్రి వీరాంజనేయులు, ఆయన చిన్న కుమారుడు రాంబాబు కూడా కరోనా బారినపడ్డారు. రాంబాబు మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 8వ తేదీన మృతి చెందాడు. కాగా అప్పటికే నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరాంజనేయులు మే 11న మృతి చెందడంతో ఉమ్మడి కుటుంబంలో విషాదం అలుముకుంది. రాంబాబుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రాఘవులు కోలుకున్నాడు. కొడుకు లేడన్న బాధతో తండ్రి.. కరోనా కోరలకు చిక్కిన ఓ కుటుంబం చికిత్స కోసం రూ.15 లక్షల పైచిలుకు ఖర్చు చేసినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఆ కుటుంబంలో తండ్రీ తనయులు ఇద్దరినీ కరోనా మింగేసింది. ఇద్దరు మగవాళ్లను కోల్పోయిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు.. తమవారి చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఊళ్లో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మకానికి పెట్టారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన తన్నీరు భిక్షం (55) కుటుంబం దీనావస్థ ఇది. భిక్షం దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్లిళ్లుఅయ్యాయి. వీరిలో చిన్న కుమారుడు తన్నీరు విజయ్ (26) బతుకుదెరువు కోసం కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. గత ఏడాది లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పనులు దొరకక నాగార్జునసాగర్కు మకాం మార్చి.. ఇంటర్నెట్ కేఫ్లో పని చేస్తున్నాడు. ఆయన కరోనా బారిన పడడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 7వ తేదీన మృతి చెందాడు. అప్పటికే విజయ్ తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ రాగా హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందారు. తమ కుమారుడు చనిపోయాడన్న విషయం తెలియగానే హోమ్ క్వారంటైన్లో ఉంటున్న తండ్రి భిక్షం సొమ్మసిల్లి పడిపోయాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీన మృతి చెందాడు. యోగా గురూజీ దంపతులను.. మింగిన కరోనా చిత్తలూరి నర్సయ్య సూర్యాపేట జిల్లాలో యోగా గురూజీగా ప్రజలకు చిరపరిచితుడు. కొన్నేళ్లుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చి అనేక మందికి ఆరోగ్య నియమాలు.. యోగాసనాలు నేర్పించాడు. అలాంటి యోగా గురువును, ఆయన భార్యను కరోనా కాటేసింది. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య (60) రిటైర్డ్ వార్డెన్. భార్య యాదమ్మ(55)తో పాటు కొన్నేళ్లుగా కోదాడ పట్టణంలో ఉంటున్నారు. వీరిద్దరూ మే మొదటి వారంలో కరోనా బారిన పడ్డారు. నాలుగైదు రోజులు ఇంట్లోనే వైద్యం తీసుకున్నారు. అయిదు రోజుల తర్వాత నర్సయ్యకు దగ్గు ఎక్కువ కావడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అప్పటికే కొద్దిపాటి లక్షణాలు ఉన్న భార్య యాదమ్మను కూడా అదే కారులో తీసుకెళ్లారు. దీంతో ఆమెకు కూడా వైరస్ సోకింది. ఇరువురు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతుండగా యాదమ్మకు బ్లాక్ ఫంగస్ సోకడంతో మే 9న చనిపోయింది. భార్య మరణించిన విషయం నర్సయ్యకు తెలియనివ్వలేదు. తర్వాత ఆయనకు కూడా బ్లాక్ ఫంగస్ సోకడంతో శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం దక్కలేదు. కరోనాతో కొడుకు.. మనోవేదనతో తల్లి ఎదిగిన కొడుకు తనకు ఆసరా ఆవుతాడని కలలు కన్న ఆ కన్నతల్లి.. తన కళ్ల ముందే అతను కరోనా బారిన పడి విలవిల్లాడుతుంటే తల్లడిల్లిపోయింది. మంచి ఆస్పత్రిలో చేర్పించి కొడుకును బతికించుకో వాలనుకుంది. కానీ మాయదారి కరోనా అతన్ని కాటేసింది. ఆ మనోవేదనను తట్టుకోలేక పోయిన ఆ తల్లి రెండ్రోజుల క్రితం గుండాగి చనిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్యయ్య, ఎల్లమ్మ(60) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. పిల్లల చిన్నతనంలోనే లక్ష్మయ్య చనిపోవడంతో... ఎల్లమ్మ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేసింది.. ఎల్లమ్మ కొడుకు కోట కుమార్ ఊళ్లోనే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసారాగా నిలిచాడు. గ్రామంలో మేస్త్రీ పనులు చేసుకుంటూనే.. చదువుపై ఆసక్తితో మరో వైపు చదువుకుని డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబ పేదరికాన్ని జయించాలని కలలు కనేవాడు. అయితే, ఏప్రిల్ 19 తేదీన కుమార్ (26)కు కరోనా సోకింది. ఇంట్లో ఉండి వైద్యులు చెప్పిన ప్రకారం మందులు వాడుతుండ గానే 20వ తేదీ సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ తీసుకువెళ్లి పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించడానికి ప్రయత్నం చేసినా.. ఎక్కడా బెడ్లు దొరకలేదు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గాంధీకి తీసుకువెళ్లారు. అంబులెన్స్ నుంచి తీసుకువెళ్లి బెడ్మీద పడుకోబెట్టగానే అతను ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయిన వార్త తెలిసినప్పటి నుండి తల్లి ఎల్లమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధలోనే గుండె ఆగి అదే నెల 23న మృతిచెందింది. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి.. ఒకే ఇంట్లో తొమ్మిది రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లికి చెందిన తండ్రి దుంపల లక్ష్మీనారాయణరెడ్డి (75) మే 17న కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందారు. 24న పెద్ద కుమారుడు గౌతంకుమార్రెడ్డి (40), 25న పెద్దనాన్న, మాజీ సర్పంచ్ సత్యారెడ్డి (80) మృతి చెందారు. సత్యారెడ్డికి రూ.3 లక్షలు, లక్ష్మీనారాయణరెడ్డికి రూ.50 వేలు ఖర్చు పెట్టినా ప్రయోజనం దక్కలేదు. గౌతంకుమార్రెడ్డికి ఏకంగా రూ.11 లక్షలు వెచ్చించినా చివరి చూపు చూసుకోలేని పరిస్థితిలో హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది ఉండగా ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు చనిపోయారు. రోజుల వ్యవధిలోనే తల్లీ కొడుకు.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధి లోని వంగూర్కు చెందిన గంధం సురేష్ 15 సంవత్సరాల క్రితం కల్వకుర్తికి వచ్చి కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. మే మొదటి వారంలో సురేష్తో పాటు ఆయన తల్లి పార్వతమ్మ, భార్య ఇద్దరు కుమారులకు కరోనా సోకింది. అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. పార్వతమ్మ, సురేష్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పార్వతమ్మ మే 24న తుదిశ్వాస విడిచింది. 27వ తేదీన సురేష్ కూడా మరణించాడు. బంధువులు రూ.18 లక్షలు ఖర్చు చేసినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించే సురేష్ అకాల మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. -
శునకం తెచ్చిన తంటా..
బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): ఇంటి ముందు శునకం విసర్జించిన విషయమై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి.. కత్తులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నంద్యాల మండలం కానాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రమేష్, దూదేకుల చిన్నబాబయ్యకు పక్కపక్కనే ఇళ్లు ఉన్నాయి. మురుగు నీరు వెళ్లే విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రమేష్ ఇంటి ముందు ఓ శునకం విసర్జించింది. ఈ విషయంలో చిన్నబాబయ్యకు, రమేష్లకు వాగ్వాదం తలెత్తి, ఘర్షణకు దారితీసింది. ఇరువురు కత్తులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చిన్నబాబయ్య తన చేతిలో ఉన్న కత్తితో రమేష్, ఆయన తండ్రి వెంకటరమణలను పొడిచాడు. రమేష్ తన వద్ద ఉన్న కత్తితో బాబయ్యపై దాడి చేశాడు. గాయపడ్డవారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమేష్, వెంకటరమణల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు) మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు.. -
కలహాల కాపురాలు..చిన్నపాటి విషయాలకే గొడవలు
కుటుంబ కలహాలు సామాజిక సమస్యగా మారుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే గొడవలకు దిగి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నా పట్టింపులకు పోయి దూరమవుతున్నారు. మనస్పర్థలు, అపోహలతో మొదలైన విభేదాలే విడిపోయేంత అగాధాన్ని సృష్టిస్తున్నాయి. మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి: భార్య,భర్తల మధ్య తలెత్తే స్వల్ప విభేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే చాలావరకు గొడవల నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న పాటి లాజిక్ను వదిలేసి చాలా కుటుంబాలు అనవసర తగదాలకు పోయి దూరమవుతున్నారు. చాలా సందర్భాల్లో ఇవే గొడవలు చిలికిచిలికి గాలివానలా మారి హత్యలు, ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్యం జీవితం అన్యోన్యంగా సాగిపోతుందని, కానీ చాలామంది తప్పు తనది కాదంటే తనది కాదంటూ పట్టింపులకు పోతుండడం వివాదాలను పెంచుతోంది. ఎవరూ తగ్గడం లేదు.. జీవితం యాంత్రికంగా మారింది. సమయానికి వంట చేయలేదని భర్త, ఇంటికి కావలసిన సామగ్రి తేవడం లేదని భార్య, తనమాట వినడం లేదని భర్త, మద్యం సేవిస్తున్నాడని భార్య, తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తోందని భర్త, తనను పట్టించుకోవడం లేదని భార్య.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం కుటుంబాల్లో సాదారణంగా మారింది. ఈ సమస్య లన్నీ చిన్నచిన్నవే. వీటిని పరిష్కరించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఎవరూ తగ్గడం లేదు. ఫలితంగా గొడవలు పెంచుకుంటున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఎవరికి వారుగా ఇరుగు పొరుగు వారికి చెప్పుకుని రోడ్డున పడుతున్నారు. చెప్పుడు మాటలతో దూరమై పోలీసుస్టేషన్ గడప తొక్కుతున్నారు. ఒక్కోసారి గృహహింస, వరకట్న వేధింపుల వంటి కేసుల వరకూ వెళ్తున్నాయి. ఇవి వారి మధ్య మరింత దూరగడానికి కారణమవుతున్నాయి. గత ఏడాది జిల్లాలో గృహహింసకు సంబంధించి 136 కేసులు నమోదయ్యాయి. కౌన్సెలింగ్ ద్వారా 110జంటలు ఒక్కటయ్యారు. ఖర్చులూ సమస్యే.. పెరిగిన కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులకు అ య్యే వ్యయం కుటుంబాలకు భారంగా మారింది. ఇలాంటి సమయంలో భార్య, భర్తలిద్దరూ ఒకరికొకరు చర్చించుకుని ఖర్చు పొదుపుగా చేయడానికి ప్రయత్నించాలి. ఒక్కరే సంపాదిస్తున్నపుడు కు టుంబ పోషణకు సరిపడక ఇబ్బందులు తలెత్తడం సహజం. అలాంటి సందర్భాల్లో ఇద్దరూ చెరోపని ఎంచుకుని చేయడం ద్వారా ఆర్థిక కష్టాలను కొంతవరకు అధిగమించవచ్చు. కానీ ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడం మూలంగా ఖర్చు విషయంలో పొదుపు చర్యలు పాటించే ప్రయత్నం చేయడం లేదు. పిల్లల అల్లరి మూలంగా భార్య, భర్తలు గొడవలు పడుతుంటారు. పిల్లలు అల్లరి చేస్తే తల్లిగానీ, తండ్రి గాని వారిని సర్ధిచెప్పే ప్రయత్నం చే యకుండా, రెండు మూడు దెబ్బలు తగిలిస్తున్నా రు. పిల్లల్ని అలా కొడతావా అంటూ గొడవ పడ డం కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలు వా రి మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. అనాథలుగా చిన్నారులు.. కుటుంబ కలహాలు ఒక్కోసారి హత్యలకు దారితీస్తున్నాయి. అలాగే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇరువురి మధ్య విభేదాలు పెరిగి ఆవేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా జైలుపాలై, పిల్లలు అనాథలుగా మారాల్సి వస్తోంది. ఇంట్లో తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా పిల్లలు అనాథలుగా మారాల్సి వస్తోంది. చేయని నేరానికి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలకు కారణమైన వారు పోలీసు కేసుల్లో జైలుపాలై ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నారు. సర్దుకుపోయే తత్వం ఏది..? భార్య, భర్తల మధ్య తలెత్తుతున్న చిన్నచిన్న గొడవలను పరిష్కరించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగవచ్చు. కానీ చాలా మంది పంతాలు, పట్టింపులకు వెళ్లి రోడ్డున పడుతున్నారు. చాలావరకు ఎవరో ఒకరు తగ్గితే సర్దుకుపోయే అవకాశం ఉన్నా ఇద్దరూ తప్పు నీదంటే తప్పు నీదంటూ ఒకరికొకరు గొడవ పడుతున్నారు. ఫలితంగా ఇబ్బందులపాలై సమాజంలోనూ చులకన అవుతున్నారు. అర్థం చేసుకుంటే జీవితం అన్యోన్యంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. -
ఆరడుగుల స్థలం కోసం..
కృష్ణగిరి(కర్నూలు జిల్లా): ఇంటి ముందు ఉన్న ఆరడుగుల స్థలం కోసం రెండు కుటుంబాలు గొడవ పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బోయబొంతిరాళ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జోలాపురం డాక్టర్ హనుమంతు, కొత్తపల్లి రామాంజినేయులు నివాసాలు పక్క పక్కనే ఉన్నాయి. డాక్టర్ హనుమంతు ఇంటి ముందు ఉన్న ఆరడుగుల స్థలం విషయంలో ఇరువురి మధ్య వివాదం సాగుతోంది. ఇదే విషయంపై ఆదివారం ఉదయం ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగి కట్టెలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన డాక్టర్ హనుమంతు రామాంజినేయులు, మురళీమోహన్, కొత్తపల్లి రామాంజినేయులు, హనుమంతు, వీరాంజినేయులుతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాదానికి కారణమైన స్థలాన్ని ఎస్ఐ రామాంజినేయరెడ్డి పరిశీలించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కేరాఫ్ పాలగుట్టపల్లె
పాలగుట్ట పల్లె గురించి వెతికితే ఒకప్పుడు ఎలాంటి సమాచారం తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు పాలగుట్టపల్లెకు కాటన్ బ్యాగ్స్ ఒక ఉనికిని తీసుకువచ్చాయి. చిత్తూరు జిల్లాలోని పాకాల చెంతనే ఉండే ఈ పల్లెకు బ్యాగ్స్ కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఆ పల్లెలో సుమారు అరవై కుటుంబాలు ఉంటాయి. ఆడా,మగ అందరూ వ్యవసాయ కూలీలే. పశువులు, కోడీ, మేకా వారి మరో జీవనాధారం. వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు.. వాటిలో కూలి పనులు. లేదంటే అవీ లేవు. అలాంటి చోట.. ‘మేం ఇటీవల తయారు చేసిన బ్యాగులలో బాగా ప్రాచుర్యం పొందింది చిన్న చిన్న కంపార్ట్మెంట్లతో కూడిన బలమైన కాన్వాస్ వెజిటబుల్ బ్యాగ్. మార్కెట్కు వెళ్లినప్పుడు అన్ని కూరగాయలను ఒక సంచిలో వేయించుకుంటాం. టొమాటోల మీద బంగాళదుంపలు వేశామనుకోండి.. టొమాటోలు ఇక అంతే. అలా కాకుండా దేనికది విడిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పుట్టుకొచ్చిందే కంపార్ట్మెంట్ కాన్వాస్ బ్యాగ్. ఇవే కాదు స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, షాపుల్లోకి బ్యాగులు, పౌచులు.. ఆర్డర్ల మీద తయారుచేసి ఇస్తున్నాం.’ అని ఆనందంగా వివరించారు రూప, అన్నపూర్ణ. మూడేళ్లుగా మొత్తం తొమ్మిది మంది గ్రూప్గా వందలాది బ్యాగుల తయారీలో నిమగ్నమై ఉంటున్నారు. వంద బ్యాగులతో మొదలు ‘కూలిపనులకు వెళ్తే గిట్టుబాటు కూలీ దొరికేది కాదు. మగవాళ్లు కొద్దోగొప్పో సంపాదిస్తే అది తిండికే సరిపోయేది. మా ఊళ్లో నలుగురు ఆడవాళ్లు మాత్రం మిషన్ మీద బ్లౌజులు కుట్టుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడు అపర్ణామేడమ్ వచ్చి ‘మీరు బ్యాగులు కుట్టగలరా..’ అని అడిగింది. సంతోషంగా మూడేళ్ల కిందటి వివరాలు చెప్పుకొచ్చారు రాణి, కళావతి. అపర్ణ కృష్ణన్ కుటుంబం పాతికేళ్ల కిందట సేంద్రీయ వ్యవసాయం చేయడానికి పాలగుట్టపల్లెకు వచ్చారు. వారిది చెన్నై. ‘మేడమ్ చుట్టుపక్కల అంతా చూస్తూ మా వద్దకు వచ్చి, పరిచయం చేసుకున్నారు. మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి గురించి అడుగుతుంటేవారు. మాకు, మా పిల్లలకు ఆయుర్వేద మందులు, పిల్లలకు పాలలో కలపడానికి అశ్వగంధచూర్ణం.. వంటివి ఇచ్చి వెళుతుండేవారు. మూడున్నరేళ్ల క్రితం ‘హైదరాబాద్లో తెలిసినవాళ్లు కాటన్ బ్యాగ్లు కావాలని అడిగారు, కుట్టగలరా?’ అన్నారు. అప్పుడు ఆ మేడమే అడ్వాన్స్గా డబ్బు ఇచ్చింది. కాటన్ క్లాత్ కొనుక్కొచ్చి 100 బ్యాగులు కుట్టి ఇచ్చాం’ అని వివరించింది రూప. ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ పనులు కాస్త ముతకగా ఉండే కాటన్ బ్యాగ్లు అంతటా దొరకవచ్చు. ‘కానీ, మా పల్లెకే ప్రత్యేకమైన బ్యాగులు ఉండాలనుకున్నాం. అప్పుడు అపర్ణామేడమే ఆ బ్యాగుల మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ ఉంటే ఆకట్టుకుంటాయి అని చెప్పారు’ వివరించింది అన్నపూర్ణ. అప్పుడు మేడమ్ సూచనతో మాలో నలుగురం చెన్నైకి వెళ్లి ప్రింట్లు ఎలా చేస్తారు, వాటిని బ్యాగ్ మీద ఎలా వేస్తారో .. వర్క్ నేర్చుకున్నాం. అలా బ్యాగుల మీద నెమలి, గణపతి బొమ్మలు, ఆర్డర్లు ఇచ్చే కంపెనీల లోగోలు.. ప్రింట్లు వేసి, కుట్టి పంపుతున్నాం. దీంతో మా బ్యాగ్స్కు ఇంకా మంచి పేరు వచ్చింది. ముందు ముగ్గురం, నలుగురం ఈ పనిలో ఉండేవాళ్లం. ఉత్తరప్రదేశ్లో ఆర్గానిక్ కాంగ్రెస్కు 2000 బ్యాగులు ఆర్డర్ రావడంతో మరో ఆరుగురం కలిశాం. ఆ తర్వాత ఆరు పాకెట్లతో ఉన్న వెజిటబుల్ బ్యాగులు కుట్టి ఫేస్బుక్, వాట్సప్లో పెట్టాం. వీటికీ బాగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, దుబాయ్, ముంబయ్కి కూడా ఆర్డర్ల మీద మా బ్యాగులు వెళుతున్నాయి. రెండు నెలల నుంచి ఆర్గానిక్ సరుకులు అమ్మే షాప్లకు బ్యాగులు కుట్టి పంపిస్తున్నాం’ అని వివరించింది ఈ తొమ్మిది మంది బృందం. నెలవారీగా ఆర్డర్లు రెండేళ్ల క్రితం పాలగుట్టపల్లె నుంచి బ్యాగులు గోవా ఎగ్జిబిషన్కు వెళ్లాయి. దీనికి అపర్ణతోపాటు లావణ్య, విఘ్నేశ్వరన్లు కూడా సాయం చేస్తున్నారు. మొదట్లో వచ్చిన డబ్బుతోనే ఇప్పటివరకు రొటేషన్ చేస్తూ వచ్చారు. కాటన్ క్లాత్, పెయింటిగ్ మధురై నుంచి తెప్పించుకుంటారు. కుట్టుపని, ప్యాకేజీ పనులన్నీ వాళ్లే చూసుకుంటారు. ఆ ఊరికి బస్సు, ఆటో సౌకర్యం కూడా లేదు. ‘కొంచెం చీకటి పడిందంటే ఆటో ఛార్జీలు పెంచుతారు. అందుకే రేపు బ్యాగులు పోస్టులో వెళ్లాలి అంటే ఈ రోజే ఆటో అతనికి చెబుతాం. ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజులు కూడా కుట్టాలనుకుంటున్నాం. బ్యాగులకు ఎంబ్రాయిడరీ చేస్తున్నాం కాబట్టి బ్లౌజులు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాం..’ అని చెప్పారు లక్ష్మీకాంత, ప్రమీల. సైజ్, మోడల్ను బట్టి ధరలు అప్పటి వరకు వ్యవసాయ పని, పశువులు పెంపకం తప్ప వేరే నైపుణ్యం లేదు వారికి. అలాంటి వారు స్క్రీన్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. కొత్త కొత్త డిజైన్ల కోసం కోలాం నమూనాలను అనుసరించారు. దీంతో అపర్ణా కృష్ణన్ పాలగుట్టపల్లె బ్యాగ్స్ పేరుతో వెబ్సైట్, ఫేస్బుక్ పేజీ ద్వారా ఫైనాన్స్ సోర్స్ను ఏర్పాటు చేసి మార్కెటింగ్ వారితో ఈ బృందానికి ఒక మాధ్యమం ఏర్పడేలా సాయం చేశారు. మిగతావన్నీ .. జాబితాను నిర్వహించడం, క్లాత్ కొనడం, డిజైన్ చేయడం, పాత బియ్యం బిస్తాలలో సంచులను ప్యాక్ చేయడం, పోస్ట్ చేయడం, పనిని విభజించుకోవడం, ఆదాయాలను పంచుకోవడం.. అన్నీ ఇక్కడి మహిళలే చేస్తారు. బ్యాగు సైజ్, డిజైన్ బట్టి ధరలు ఉన్నాయి. – నిర్మలారెడ్డి ఫొటోలు: టి. తులసీరామ్, సాక్షి, పాకాల, చిత్తూరు రెండేళ్ళ కిందట నోయిడాలో జరిగిన ఆర్గానికి వరల్డ్ కాంగ్రెస్కు 2000 బ్యాగులను సప్లయ్ చేశారు. మొదటిసారి పొందిన పెద్ద ఆర్డర్ అది. ఆ తర్వాత ఏడాదికి గోవాలో జరిగిన హ్యాండ్లూమ్ ఎక్స్పో∙ఆర్డర్ వచ్చింది. ఇటీవల అమెరికాకు కూడా ఆర్డర్ ద్వారా వీరి బ్యాగులు వెళ్లాయి. తమిళనాడులోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పాలగుట్టపల్లె బ్యాగులు తెప్పించుకుంటున్నాయి. డిజైన్ బట్టి ఒక్కో బ్యాగ్ ధర రూ.20 నుంచి ఉన్నాయి. ఈ బ్యాగుల కోసం ఆన్లైన్ ద్వారా నేరుగా ఆర్డర్లు ఇవ్వచ్చు. పాలగుట్టపల్లె కాటన్ బ్యాగ్లకు ఇంత పేరు రావడానికి కారణం ఈ మహిళలు ఎంచుకున్న నాణ్యతే ప్రధానం. మొదట కొంత మొత్తం లోన్గా తీసుకున్నారు. ఆ తర్వాత వారి రాబడి పెరుగుతూ ఉండటంతో ఆ మొత్తం తీర్చేశారు. పల్లెటూరి మహిళలు నాణ్యమైన వస్తువులను అందించడంలో ముందుంటారు. వీరికి రూరల్ డెవలప్మెంట్ కింద ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలను చూస్తారు. – అపర్ణాకృష్ణన్ -
‘బీమా’ బాసట
సాక్షి, హైదరాబాద్: వివిధ కారణాలతో అకాల మరణం పొందే రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ పథకం ఇప్పటివరకు పది వేలకు పైగా కుటుంబాలకు భరోసా కల్పించింది. బీమా పథకం కింద లబ్ది పొందిన వారిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 10,012 కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరగా, క్లెయిమ్ల రూపంలో 500.60 కోట్లు నామినీల ఖాతాలకు జమ చేశారు. రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన రైతు కుటుంబాల్లో 91శాతం మేర కేవలం ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం కలిగినవారే ఉండటం గమనార్హం. లబ్ధిపొందిన కుటుంబాల్లో అత్యధికంగా బీసీలు 51శాతం మంది ఉన్నారు. దళారీల ప్రమేయం లేకుండా బీమా పరిహారంకోసం దరఖాస్తు చేయడం మొదలుకుని, బీమా సొమ్మును నేరుగా నామినీ ఖాతాకు ఆన్లైన్ విధానంలో బదిలీ చేస్తున్నారు. రైతు బీమా సొమ్మును బాధిత కుటుంబాలు భవిష్యత్తు అవసరాలు, జీవనోపాధి కోసం వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. 29.58 లక్షల కుటుంబాలకు బీమా రాష్ట్రంలో 90 శాతానికి పైగా రైతులకు ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం ఉండగా, వీరికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో రైతు మరణిస్తే.. అతనిపై ఆధారపడిన కుటుంబం రోజువారీ జీవనానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29.58 లక్షల మంది 18–59 సంవత్సరాల వయసు కలిగిన రైతుల కోసం ప్రభుత్వం ‘రైతు బీమా’ పథకాన్ని 2018 ఆగస్టులో ప్రారంభించింది. ఈ పథకం అమలుకోసం ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున రూ.672 కోట్ల ప్రీమియంను జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని చెల్లిస్తోంది. -
రైతు కుటుంబాల ఆర్థికస్థితిపై సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేస్తోంది. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న దానికి అనుగుణంగా ఈ సర్వే చేస్తున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు ఏమైనా మారాయా.. మారితే ఏ మేరకు మార్పులు వచ్చా యి.. ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే కోణంలో ఈ సర్వే జరుగుతోంది. అర్థగణాంక శాఖ ద్వారా 1958 నుంచి సాంఘిక, ఆర్థిక సర్వేలను జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్వో)తో నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైన సర్వే రాష్ట్రంలో ఈ నెల 21న ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు విడతలవారీగా కొనసాగుతుంది. వాస్తవానికి 2022 లో సర్వే జరగాల్సి ఉండగా మూడేళ్ల ముందుగానే సర్వేకు కేంద్రం ఆదేశించింది. పదేళ్లకోసారి ఈ సర్వే జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా 2020 నాటికి రైతు ల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రాల్లోని రైతుల ఆర్థిక స్థితిగతులపై కేంద్రం ముందస్తు గా అధ్యయనం చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా నమోదు చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని సర్వే చేయనుండగా, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధితో ఎలా జీవిస్తున్నారు.. రుణాల వినియోగం ఎలా ఉందనే కోణంలో వివరాలను ప్రత్యేక నమూనాలో పొందుపరచనున్నా రు. యాసంగి పంటలు చేతికొచ్చాక మళ్లీ రైతుల ఆదాయంపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. కనీసమద్దతు ధర అందిందా? గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు ప్రాముఖ్యతనిస్తుండగా, పట్టణాల్లో అద్దెకుండే ప్రాంతాలను ఎం పిక చేశారు. గ్రామాల్లో రైతు కుటుంబాల ఆర్థిక స్థితి తెలుసుకుంటారు. ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారు? ఏఏ పంటలు వేస్తారు? విత్తనం నుంచి పం ట చేతికందే వరకు ఎంత పెట్టుబడి వచ్చింది? పంట విక్రయం తర్వాత వచ్చిన మొత్తం సొమ్మెంత? కనీసమద్దతు ధర అందిందా, లేదా? పెట్టుబడి, కుటుంబ ఖర్చులు పోను మిగిలిందెంత? వంటి వివరాలు నమోదు చేస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో ఉన్నారా? ఆదాయమెంత? ఖర్చులెంత? వం టి వివరాలను పొందుపరుస్తారు. అప్పుల్లో ఉంటే అప్పుల వివరాలు, ఎందుకు అప్పులయ్యాయి, రుణాలివ్వడం లేదా.. ఇస్తే వినియోగమెలా ఉందనే వివరాలు సేకరించి వారి ఆర్థికస్తోమతను లెక్కిస్తున్నారు. -
హమ్మయ్య.. సమయం దొరికింది!
-
బంధాన్ని బలపరిచే మూడు ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: మీరెప్పుడైనా రిలేషన్షిప్లో చెప్పకూడని విషయం చెప్పి చిక్కుల్లో పడ్డారా ? ఎందుకు ఈ విషయం చెప్పానా అని తర్వాత బాధపడ్డారా ? ఏయే విషయాలు ఎప్పుడెప్పుడు చెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారా ? అయితే ఈ సమస్యకు 'మూడు ప్రశ్నల ట్రిక్' చక్కగా ఉపయోగపడుతుందని, బంధాలను బలపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ట్రిక్ను పరిచయం చేసింది ఎవరు ? ప్రముఖ నటుడు, రచయిత క్రెయిగ్ ఫెర్గూసన్ ఈ 'మూడు ప్రశ్నల ట్రిక్' ను ప్రపంచానికి పరిచయం చేశారు. భాగస్వామితో మాట్లాడే సమయంలో ఈ మూడు ప్రశ్నలను మనసులో స్మరించుకోవడం ద్వారా అనవసరంగా తలెత్తే మనస్పర్థల నుంచి దూరంగా ఉండవచ్చన్నది ఆయన ఆలోచన. ఈ ట్రిక్ను పాటించడం వల్ల మీ ఆత్మీయులతో అర్థవంతమైన సంభాషణ జరపవచ్చని ఆయన అన్నారు. అటువంటి మృదు సంభాషణలు బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయని ఆయన స్పష్టం చేశారు. మొదటి ప్రశ్న... ఈ విషయం చెప్పడం అవసరమా ? అన్న ప్రశ్నను మనసులో వేసుకోవాలి. చాలా సార్లు అసలు సంబంధం లేని విషయాలను చెప్పి మీ ఆత్మీయులను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఆ క్షణంలో అది చాలా సాధారణమైనదిగా కనిపించినప్పటికీ, తర్వాత అది మనస్పర్థలకు దారితీసి ఉండవచ్చు. కాబట్టి ఈసారి మీ ఆత్మీయులతో మాట్లాడేటపుడు ఈ ప్రశ్నను మదిలో వేసుకోండి. రెండవ ప్రశ్న... ఇది నేనే చెప్పాలా ? ఆ విషయాన్ని మీరే కాక ఇతరులూ చేప్పే అవకాశం ఉన్నపుడు మీరు తప్పుకోవడమే మంచిది. నేను తప్ప ఇంకెవరూ చెప్పే అంశం కాదు అన్న సందర్భంలోనే నోరు విప్పండి. మీరే చెప్పాల్సి వస్తే, అవతలి వారి దృష్టికోణం నుంచి కూడా పరిశీలించి చెప్పాలి. లోకంలోని ప్రతీ విషయాన్ని మీరే చెప్పాలన్న నియమమేదీ లేదు. చివరి ప్రశ్న... ఇది నేను ఇప్పుడే చెప్పాలా ? ప్రతీ దానికీ సరైన సమయమంటూ ఒకటి ఉంటుంది. ఓపికతో ఎదురుచూసి సరైన సమయంలో ఆ విషయాన్ని తెలియజేయాలి. ఉదాహరణకు ఏదైనా మనస్ఫర్థతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సమయంలోనే పాత సమస్యలను గుర్తు చేస్తే బంధం మరింత ప్రమాదంలో పడుతుంది. ఇదంత ఈజీ కాదు.. చూడడానికి ఇది ఈజీగానే కనిపిస్తున్నప్పటికీ, ఆచరించేటపుడు కొంచెం ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. తరచుగా ఉపయోగించడం ద్వారా ఈ ట్రిక్పై పట్టు సాధించవచ్చని ఫెర్గూసన్ అంటున్నారు. ముఖ్యమైన విషయాలు చర్చించే సమయంలో దీనిని ఉపయోగిస్తే మనస్పర్థలు తగ్గి బంధం బలపడుతుందని ఆయన అన్నారు. -
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 30 మంది
గ్రేటర్ నోయిడా : నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోమారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని సాహ్ బెరి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనంపై పడింది. దీంతో నాలుగంతస్తుల భవనం కూడా కుప్పకూలి అందులో నివాసముంటున్న18 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. -
కుటుంబాలు సమాజ అభివృద్ధికి సూచికలు
సమాజ మార్పు అభివృద్ధి, పరివర్తనలో కుటుం బాలే కీలకం. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కుటుంబాల విశిష్ఠతను తెలపడానికి అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ప్రతి ఏటా మే 15న జరుపుకుంటారు. 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 20 సెప్టెంబర్ 1993 నాటి 47/237 తీర్మానంలో ఇంటర్నేషనల్ ఫ్యామిలీస్ డేని ప్రకటించింది. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం కుటుంబాల సమస్యల గురించి అవగాహనను, కుటుంబాలను ప్రభావితం చేసే సాంఘిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. 1994లో ఐక్యరాజ్యసమితి కుటుంబాల అంతర్జాతీయ సంవత్సరాన్ని అధికారికంగా ప్రకటించారు. 1994 మే 15న ప్రారంభించిన కుటుం బాల దినోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుం బాలు, ప్రజలు, సమాజాలు, సంస్కృతులను ప్రతి బింబించేలా ఉంటుంది. కుటుంబాలు సమాజానికి కేంద్రం. పైగా అన్ని వయసుల ప్రజలకు స్థిరమైన, సహాయక గృహాన్ని అందిస్తాయి అని ఇది సూచి స్తుంది. మొదటిసారిగా 1996లో ‘ఫ్యామిలీస్: ఫస్ట్ విక్టిమ్స్ ఆఫ్ పావర్టీ అండ్ హోమ్లెస్నెస్’ అనే థీమ్తో జరుపుకోగా 2018లో ‘కుటుంబాలు సంఘటిత సంఘాలు’ థీమ్తో నిర్వహిస్తున్నారు. ప్రతి మనిషి కుటుంబంలో ఒక భాగమే. సమాజంలోని వ్యక్తి సామాజీకరణం ద్వారానే సమాజంలో ఒక మానవత విలువలున్న మనిషిగా మారుతాడు, మనిషిని సమాజంలో ప్రాథమికంగా నియంత్రించేది కుటుం బమే. ఈ నియంత్రణ వల్లే వ్యక్తులు పరిమితులలో ఉంటారు. నేటి ఆధునీకరణ ప్రపంచంలో కుటుంబాలు వ్యక్తులను సామాజికంగా ఎంతవరకు నియంత్రిస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. సమాజంలో మానవత , నైతిక విలువలు క్షీణించినపుడు యువత తప్పుదారిన పడుతుంది. యువతను నియంత్రించవలసిన బాధ్యత కుటుంబాలదే. కుటుంబాల నియంత్రణ సరిగా లేకపోతే సామాజిక నియంత్రణ ఉండదు దాంతో సమాజంలో అనేక వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబాలు బాగుంటే సమాజాలు కూడా బాగుంటాయి. సమాజ అభివృద్ధి కోసం కుటుం బాలు నిరంతరం పాటు పడాలని కోరుకుందాం!. (మే15, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం) – కందగట్ల శ్రవణ్ కుమార్, పీహెచ్డీ స్కాలర్,కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ -
పరారీలో 3 వేల కుటుంబాలు
టీ.నగర్: పిల్లల కిడ్నాపర్ అని వృద్ధురాలి హత్య కేసుకు భయపడి పోలూరు, పరిసర ప్రాంతాల్లో మూడు వేల కుటుంబాలు ఇళ్లను విడిచి పరారయ్యాయి. వీరంతా చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో బసచేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వాట్సాప్లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఉత్తర జిల్లాల నుంచి వచ్చిన ఈ సమాచారం ప్రజల్లో భీతి పుట్టించింది. ఈ క్రమంలో తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపం కిడ్నాప్ ముఠా భీతి కారణంగా రుక్మిణి అమ్మాళ్ అనే 65 ఏళ్ల వృద్ధురాలి హత్యా సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ విషయం తెలియగానే తిరువణ్ణామలై ఎస్పీ సంఘటన స్థలానికి నేరుగా వచ్చి విచారణ జరిపారు. రుక్ష్మిణి అమ్మాళ్పై దాడి దృశ్యాలు సామాజిక మా«ధ్యమాల్లో ప్రసారం కావడంతో సంచలనం ఏర్పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. పిల్లల కిడ్నాప్ భీతి కారణంగా కలియం, ఆత్తిమూరు గ్రామాల్లో ఉదయాన్నే కనిపించే కొబ్బరిబొండాల వ్యాపారులు కనిపించడం లేదు. ఈ ప్రాంతాల్లో పోలీసులు రహస్య పర్యవేక్షణ జరుపుతున్నారు. మానసిక రోగి హత్య కేసులో 15 మంది అరెస్టు: కిడ్నాపర్గా భావించి మానసిక రోగిని హత్య చేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పళవేర్కాడు ప్రాంతంలో పిల్లల కిడ్నాప్ ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి ఒక మానసిక రోగిని ప్రజలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
అమనాంలో అగ్నిప్రమాదం
తగరపువలస(భీమిలి): రెక్కాడితే గానీ డొక్కాడని కూలీల బతుకుల్లో అగ్నిప్రమాదం మంట రేపింది. ఇళ్లు, సామగ్రి, నగదు, బంగారం, సర్టిఫికెట్లతో సహా అగ్నికి ఆహుతి కావడంతో 11 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాలివి.. భీమిలి మండలం అమనాం పంచాయతీ నక్కెళ్లపేటలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మందికి చెందిన 14 పూరిళ్లు, 2 పశువుల పాకలు ఆహుతయ్యాయి. మొత్తం రూ.20లక్షల ఆస్తినష్టం సంభవించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రూ.10లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్టు రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. అంతా కూలీలే.. బాధితులలో నల్ల అప్పలనరసమ్మ, నల్ల నర్సయ్యమ్మ, ఆవాల ఎల్లమ్మ, జోగ లక్ష్మి, జోగ రాములప్పయ్యమ్మ, జోగ రమణమ్మ, ఈగల అప్పలనరసమ్మ, జోగ ఎల్లయ్యమ్మ, నల్ల బంగారప్పడు, నల్ల రామయ్యమ్మ, నల్ల సూరి అప్పయ్యమ్మ ఉన్నారు. వీరంతా ఉదయం కూలిపనులకు వెళితే సాయంత్రానికి గాని తిరిగి ఇంటికి చేరరు. ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా చెరువు పనులకు, కూలిపనులకు వెళ్లిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కాలిపోగా, మూడు గొర్రెపోతులకు కళ్లు కాలిపోయాయి. మంటలను అదుపు చేయడానికి చిట్టివలస, విజయనగరం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చినా అప్పటికే ప్రమాదం తీవ్రరూపం దాల్చింది. ప్రమాదంలో నల్ల అప్పలనరసమ్మ ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పుగా తీసుకువచ్చిన రూ.5.50లక్షలు, నల్ల నరసయ్యమ్మవి రూ.10వేలు, ఈగల అప్పలనరసయ్యమ్మ రూ.60వేలు, జోగ రాములప్పయ్యమ్మ రూ.80వేలు నగదు కాలి బూడిదయ్యాయి. బాధితులకు సర్పంచ్ దంతులూరి ఉమాదేవి, వాసురాజు భోజనాలు, వసతి ఏర్పాటు చేశారు. తహసీల్దార్ పి.వి.ఎల్. గంగాధరరావు, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వో సుబ్రహ్మణ్యం పరామర్శించారు. -
సంసారంలో సంక్షోభం
పంచభూతాల సాక్షిగా ఒక్కటైన జంట... ప్రలోభాలకు గురికావడం, మోసబుద్ధిని చూపడం, అది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. నమ్మిన జీవిత భాగస్వామిని వంచించడం కాపురాలను కకావికలం చేస్తోంది. కర్ణాటక : వరకట్నం, సఖ్యత లేకపోవడం, పరువుప్రతిష్టలకు వెళ్లి దాంపత్యజీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వీటికి తోడు అనైతిక సంబంధాలు కూడా కాపురాలను కూల్చుతున్నాయి. భర్త, లేదా బార్య వివాహానికి ముందు, వివాహమైన తరువాత కూడా సంబంధాలను నెరుపుతూ సమస్యల ఊబిలోకి దిగబడుతున్నారు. ఐటీ రాజధాని బెంగళూరులో గత ఏడాది ఇటువంటివి 236 కేసులు నమోదయ్యాయి. బాధితులు సాయం కోరుతూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని వనితా సహాయవాణి కేంద్రం మెట్లెక్కారు. వేధింపులు, దాడులు, లైంగిక అపసవ్యతలు, చిన్నవిషయాలకే ఘర్షణ, తదితర సమస్యలతో పాటు మూడో వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపిస్తూ పరిష్కారాలకు, విడాకులకోసం వచ్చే భార్యభర్తలు అధికంగా ఉన్నారు. ఎందుకిలా.. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచం కుగ్రామం అయిపోగా ఎక్కడెక్కడి వ్యక్తులు, పాత స్నేహితుల మధ్య ఇట్టే పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొన్ని పరిస్థితుల ప్రాబల్యంతో లైంగిక సంబంధాల వరకూ వెళ్తున్నాయి. నేటి సమాజంలో ఇదొక ప్రధాన సమస్యగా మారిన మాట నిజమని సామాజికవేత్తలు చెబుతున్నారు. సంసారం పాడుచేసుకోవద్దు దంపతులు వివాహేతర సంబంధానికి లోనైతే పిల్లలు ఒడిదుడుకులకు గురి కావడం జరుగుతుంది. క్షణం సుఖానికి సంసారం పాడుచేసుకోవడం సరికాదని కౌన్సిలింగ్ నిపుణురాలు అపర్ణాపూర్ణేశ్ అన్నారు. విడాకులకు ఇదే కారణం విడాకులకు వివాహేతర సంబందాలు ముఖ్యకారణం అవుతున్నాయి. వనితా సహాయవాణిని సందర్శించిన మహిళలకు కౌన్సిలింగ్ అందించి వారి జీవితం నిలబెట్టడం మా ప్రధాన ఉద్దేశమని సహాయవాణి చీఫ్ రాణిశెట్టి తెలిపారు. ఆమె ఘనకార్యం పేరుపొందిన ప్రైవేటు విద్యాసంస్ధ లో టీచరైన మహిళ భర్త సాప్ట్వేర్ ఇంజనీర్. వీరికి ఒక కుమార్తె ఉంది. భర్త నిత్యం విధుల్లో ఉంటూ భార్యను పట్టించుకునేవాడు కాదు. భార్య 2016లో ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో సంబంధం నెలకొల్పుకుంది. భర్తకు అబద్ధం చెప్పి అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేది. 2017 డిసెంబరులో భార్య వాట్సప్ను గమనించగా విషయం గుట్టురట్టైంది. దంపతులిద్దరూ వనితా సహాయవాణిని సంప్రదించగా భార్య తన తప్పు ఒప్పుకుని, ఇక ముందు ఇలా చేయనని హామీనిచ్చింది. మోసకారి భర్త గుట్టురట్టు భార్య ఉన్నత ఉద్యోగంలో ఉండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. భార్య తనకంటే ఎక్కువ వేతనం తీసుకుంటుందని భర్త ఆత్మన్యూనతకు లోనయ్యాడు. వీరికి పదేళ్లు వయసున్న కుమారుడు ఉన్నారు. భార్య వేతనంతోనే నగరంలో స్వంత ఇళ్లు కొనుగోలు చేశారు. భార్యే కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆరునెలల నుంచి ఇంట్లో వంట చేయడానికి ఒక మహిళను నియమించుకున్నారు. ఆమెతో భర్త వివాహేతర సంబంధం ప్రారంభించాడు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఇద్దరి రాసలీలల దృశ్యాలు నిక్షిప్తం కావడంతో భార్య గమనించింది. భర్త వంచనను తట్టుకోలేక భార్య వనితా సహాయవాణిలో ఫిర్యాదు చేసింది. సహాయవాణి అధికారులు ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి సర్దుబాటు చేశారు. పెరుగుతున్న కేసులు వివాహేతర సంబంధాలపై 2014–15లో 196 కేసులు 2015–16 నాటికి ఈ సంఖ్య 164. 2016–17 లో మళ్లీ పెరిగి 180కి చేరాయి. సహాయవాణిలో నమోదైన కేసులు కేసులు 2014–15 2015–16 2016–17 కుటుంబదౌర్జన్యాలు 490 154 332 వివాహానికి ముందు సంబంధం 64 68 56 వివాహానంతర సంబంధం 196 164 180 వరకట్నవేదింపులు 174 162 153 ఇతరత్రా గొడవలు 53 46 24 పెండింగ్ కేసులు 80 80 78 మొత్తం 1140 1192 1252 -
అమ్మో..ఆడపిల్ల.. మాకొద్దు !
ఆడపిల్ల ఉంటే.. ఆ ఇంటికి వెలుగు.. ఈ నినాదం.. ప్రసంగాలకే పరిమితమవుతుందా.. వరుసగా మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే.. ఆమ్మో..ఆడపిల్ల అని బావురుమంటున్నారు.. ఈ ‘బరువు’ మోయలేమని చేతులెత్తేస్తున్నారు.. ఒకవైపు..కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోవైపు అవగాహనలోపం.. కారణం ఏదైనా ఆడపిల్ల అంటే అరిష్టం అనుకుంటున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన తల్లిదండ్రులు మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే తాము సాకలేమని ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తున్నారు..ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. చందంపేట మండలంలో నాలుగు జంటలు తమకు పుట్టిన ఆడపిల్లలను సాకలేమంటూ తెగేసి చెప్పారు. వారికి ఐసీడీఎస్ అధికారులు, జెడ్పీచైర్మన్ స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వగా, రెండు జంటలు తమ పిల్లలను తిరిగి తీసుకోగ, మరో రెండు జంటలు ఆరునెలల వరకు సాకి ఆ తర్వాత శిశుగృహకు అప్పగిస్తామని చెప్పారు. – చందంపేట చందంపేట (దేవరకొండ) : సృష్టికి మూలం అమ్మ... ఆ తల్లిదండ్రులకు జన్మచ్చింది కూడా ఓ మాతృమూర్తే... అలాంటిది నవమాసాలు మోసి కన్నాక ఆడపిల్ల అని తెలియడంతో సాకలేమని సాకులు చెబుతున్నారు.. నన్ను కన్న నా తల్లి కూడా ఆడదే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడ పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ పాఠశాలల నుంచి పాలు, గుడ్డు, పౌష్టికాహారం కూడా అందిస్తోంది. అదే విధంగా ఆడ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కూడా పథకాలు అమలవుతున్నాయి. అయినా చందంపేట మండల ప్రజల ధో రణిలో మార్పు రావడం లేదు. తాజాగా ఒకే రోజు నలు గురు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను సాకలేమని ఐసీ డీఎస్ అధికారులకు అప్పగించేందుకు ముందుకొచ్చారు. ఆడశిశువులు వద్దనుకున్న ఆ నలుగురు.. ♦ నేరెడుగొమ్ము మండలం పీర్లచావిడి గ్రామానికి చెందిన నేనావత్ సరస్వతి, లక్ష్మణ్ దంపతులకు మొదట మగ సంతానం కలుగగా, 2,3,4వ కాన్పుల్లో ఆడ పిల్లలు జన్మించారు. దీంతో 4వ కాన్పులో జన్మించిన ఆడపిల్లను వదిలించుకునేందుకు ఆ తల్లిదండ్రి సిద్ధమయ్యారు. ఇదే విషయమై ఐసీడీఎస్ అధికారులు చందంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ బాలునాయక్ దృష్టికి విషయాన్ని తీసుకురావడంతో స్పందించిన ఆయన దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకునేలా చూస్తానని హామీనిచ్చారు. దీంతో దంపతులు శిశువును సాధుకుంటామని చెప్పడంతో వారిని ‘మన ఇంటి లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ సన్మానించారు. ♦ నేరెడుగొమ్ము మండల పరిధిలోని పందిరిగుండుతండాకు చెందిన జ్యోతి, లాలు దంపతులకు 1,2,3 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించడంతో 3వ సంతానాన్ని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా పీడీ పుష్పలత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించాలని సూచించారు. అనంతరం ఆడ పిల్లను వదులుకోవాలనుకుంటే ముందుకు రావా లని అన్నారు. అప్పటి దాకా శిశువుకు ఎలాంటి హాని తలపెట్టొద్దని రాతపూర్వకంగా పత్రం తీసుకున్నారు. ♦ చందంపేట మండలం తెల్దేవర్పల్లి పరిధిలోని బాపన్మోట్తండాకు చెందిన నేనావత్ సుశీల, గోపాల్ దంపతులకు 1,2 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 2వ కాన్పులో పుట్టిన ఆడ శిశువును శిశుగృహకు అప్పగిస్తామని అనడంతో ఐసీడీఎస్ అధికారులు కౌన్సి లింగ్ నిర్వహించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రుణ సదుపాయం కల్పిస్తే తమ శిశువును కాపాడుకుంటామని పేర్కొన్నారు. పీడీ పుష్పలత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయానికి హామీఇవ్వడంతో వారు శిశువును వదులకునే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ♦ చందంపేట మండలం యల్మలమంద గ్రామపంచాయతీ బిచ్చితండాకు చెందిన బాణావత్ లక్ష్మి, బిచ్చు దంపతులకు వరుసగా మూడు కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 3వ కాన్పులో జన్మించిన ఆడ శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు ఆ పాపకు ఆరు నెలలు తల్లిపాలు అందించాలని సూచించారు. -
పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటాం
కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన కుషాయిగూడ రెడ్డి సంక్షేమ సం ఘం 5వ వార్షికోత్సవం, 2018 క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రెడ్డి కులస్థుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పేద రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతర కులస్తులకు ఇస్తున్నట్లుగానే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నారన్నారు. రెడ్డి సంక్షేమ సంఘాలను బలోపేతం చేసుకొని సామా జిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహి ంచాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, కుషాయిగూడ రెడ్డి సంక్షేమం అధ్యక్షుడు చిటుకుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నరేందర్రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ఎల్లారెడ్డి, వసంతరెడ్డి, సంతోష్రెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, వల్లారెడ్డి, కందాడి హనుమంత్రెడ్డి, శివరాంరెడ్డి, హరిప్రసాద్రెడ్డి, బలవంత్రెడ్డి, గోపాల్రెడ్డి, కొండల్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి, వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో 50 కుటుంబాల చేరిక
జి.సిగడాం: సీతారాంపురం గ్రామానికి చెం దిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నా యకులు వైఎస్ఆర్ సీపీలో చేరారు. జైదం సత్యారావు, ఇజ్జి రమణ, ప లిశెట్టి సూర్యారావు,డి, తారకేశ్వరరావు, శిర్రా లక్షన్న, గొలుశెట్టి ఆశ్వరరావు, పలిశెట్టి అప్పన్న, పలిశెట్టి చెంచయ్య, ఆరెల్ల వెంకన్న, పంది రిపల్లి సత్యారావు, జైదం రామకృష్ణ, సాలిపల్లి సూర్యనారాయణ, ఇజ్జి ముకందరావు, జైదం శ్రీనివాసరావు, సాలిపల్లి సత్యారావు, పి.వెంకన్న బో ల్లిశెట్టి గొవిందరావు, పలిశెట్టి గొవిం దరావు, జైదం అప్పారావు, కేతం పా పారావు, సాలిపల్లి సింహాద్రి, జైదం మంగరావు, జైదం రమణ, జైదం సూర్యనారాయణ, పందిరిపల్లి తవి టయ్య, కేతం శ్రీనివాసరావులతోపా టు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నా యి. వైఎస్ఆర్ సీపీ ఎచ్చెర్ల ని యోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, మండల పార్టీ అ ధ్యక్షులు మీసాల వెంకటరమణ సమక్షంలో వీరు సోమవారం పార్టీలో చే రారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారం దక్కాక మాటలు మర్చిపోయారని, అందుకే ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పం చ్లు బత్తుల సన్యాసిరావు, మండల అధికార ప్రతినిధి అబోతుల జగన్నా థం, ఏర్నేన శ్రీరాములు,బత్తుల చం ద్రశేఖర్, బాలి అప్పలసూరి, నల్లి తవిటినాయుడు,అదినారాయణ, తొత్తడి రామారావు, వడిశ మహేశ్వరరావు పాటు పలువురు పాల్గొన్నారు. -
సైనిక కుటుంబాలకు డబుల్ పెన్షన్
సాక్షి, హైదరాబాద్: మరణించిన సైనిక కుటుంబాలకు డబుల్ పెన్షన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ పొందిన సైనికులకు డబుల్ పెన్షన్ ఇప్పటికే అమల్లో ఉంది. కానీ, మరణించిన సైనికుల కుటుంబాలకు మాత్రం పెన్షన్గా కేవలం మిలిటరీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తున్నారు. కొత్త ఉత్తర్వుల నేç పథ్యంలో మరణించిన సైనిక కుటుంబాలకు సైతం డబుల్ పెన్షన్ అందనుంది. -
పోలీసు కుటుంబాలకు భద్రత చెక్కుల పంపిణీ
కర్నూలు : విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ ఆకే రవికృష్ణ చేతుల మీదుగా భద్రతా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు విందు వడ్డించి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో శనివారం ఉదయం భద్రత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏఆర్పీసీ వై.ఎస్.మహేష్కుమార్, భార్య చందనకి రూ.7,99,580, పీసీ శ్రీనివాసరాజు భార్య అశ్వినికి రూ.4 లక్షలు, ఏఎస్ఐ ఎం.డి.యూసుఫ్ భార్య ముస్తాని బేగంకు రూ.3,98,845, హెడ్ కానిస్టేబుళ్లు రమణమూర్తి భార్య ఈశ్వరికి రూ.3,98,530, ఎ.వి.ఎస్.రఘుకుమార్ భార్య శ్రీలక్ష్మికి రూ.3,91,303, పదవీ విరమణ పొందిన ఎస్ఐ రామకృష్ణయ్యకి రూ.94,407 భద్రతా చెక్కులను ఎస్పీ అందజేశారు. అనంతరం వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ విజయకుమార్, ఓఎస్డీ రవిప్రకాష్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.నారాయణ, భద్రతా క్లర్కు పి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మిలిటెన్సీ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం
-
ఆశల వల
భార్య : ‘ఏమయ్యా.. చంటోడు గుక్క పట్టిండు.. పాల డబ్బా తెస్తనన్నవుగా ఏదయ్యా..’ భర్త : ‘ఊకోవే.. డబ్బులెక్కడున్నయ్.. ఆడికి నువ్వే కాసిని పాలు పట్టు.. కొద్ది రోజుల్లో మనం లచ్చాధికారులం కాబోతున్నం.. ఒక్క లాటరీ తగిలితే చాలే.. ఇక మన కష్టాలన్నీ తుర్రున ఎగిరిపోతయ్..’ భార్య : ‘ఏడాది నుంచి ఇదే చెబుతున్నవు గదయ్యా.. ఆ మాయదారి లాటరీ ఏమో చేసిన కష్టమంతా దానికే దారపోస్తన్నవ్.. పొయ్యిలో కట్టెలు లేవు.. పొయ్యిపై గింజలు లేవు.. నాలుగు మెతుకులు లేక పేగులు మెలిపెడుతున్నాయయ్యా.. ఈ చంటోడ్ని తీసుకో.. పక్కింటికన్నాపోయి నాలుగు గింజలు అడుక్కొస్తా..’ ఇదీ నరసరావుపేట కేంద్రంగా జిల్లాలో సాగుతున్న లాటరీకి గుల్లవుతున్న ఓ కుటుంబం దీనావస్థ నరసరావుపేట టౌన్: సింగిల్ నంబర్ లాటరీ పేద, మధ్య తరగతి కుటుంబాలను సర్వనాశనం చేస్తోంది. నరసరావుపేట కేంద్రంగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా నిషేధిత లాటరీ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. కొందరు దురాశాపరులు లాటరీ అక్రమ వ్యాపారాన్ని ఎంచుకొని పేదల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. పట్టణంలో హోల్సేల్ వ్యాపారులు 20 మంది ఉండగా వారి వద్ద నుంచి లాటరీ నంబర్లను కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించే రిటైల్ వ్యాపారులు 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం సింగిల్ నంబర్ లాటరీని ఎప్పుడో నిషేధించినప్పటికీ అక్రమ వ్యాపారులు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి యథేచ్ఛగా దందాను కొనసాగిస్తున్నారు. పల్నాడు బస్టాండ్, రైల్వేస్టేçÙన్, శివుని బొమ్మ, మార్కెట్ సెంటర్, గుంటూరు రోడ్డు, పనస తోట మీ–సేవ ప్రాంతాల్లో వ్యాపారులు కార్యాలయాలను ప్రారంభించి లాటరీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే వారికి పోలీసుల అండదండలు ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. గత బుధవారం గురజాలలో ఒకే నంబర్ టికెట్ ఇద్దరికి విక్రయించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారణలో వ్యాపారి నరసరావుపేటలో బడా వ్యాపారి వద్ద టికెట్లు కొనుగోలు చేసి కొంతకాలంగా వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఇలా నరసరావుపేట పట్టణంలోని హోల్సేల్ వ్యాపారుల వద్ద నుంచి వినుకొండ, చిలకలూరిపేట, గుంటూరు, పిడుగురాళ్ల, మాచర్ల, సత్తెనపల్లి, నకరికల్లు తదితర ప్రాంతాల రిటైల్ వ్యాపారులు టికెట్లు కొని వారి సొంత పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం ప్రతిరోజూ లక్షల్లో సాగుతుంది. అంతా కాగితపు ముక్కలపైనే... పట్టణంలోని హోల్సేల్ వ్యాపారులు చెన్నైలోని బడా వ్యాపారులకు ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి వారం ముందుగా విడుదలయ్యే లాటరీ నంబర్లను ఆన్లైన్ ద్వారా సేకరించి విక్రయిస్తారు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వారు కోరుకున్న నంబరును వ్యాపారులు స్లిప్లపై రాసి ఇస్తారు. రూ.20 నుంచి మొదలై రూ.500 వరకు లాటరీ టికెట్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కార్మికుడు అత్యాశకు పోయి 4, 5 టికెట్లను కొనుగోలు చేస్తున్నాడు. లాటరీ తగలకపోవడంతో తిరిగి మళ్లీ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అప్పుల పాలవుతున్నాడు. లాటరీలకు విచిత్రమైన పేర్లు... మార్కెట్లో విక్రయించే నిషేధిత లాటరీలకు విచిత్రమైన పేర్లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారులు కోడ్ భాషతో పిలుస్తున్నారు. నల్ల నేరం, కూయల్, రోశ, సంఘం, కుమరన్, విష్ణు తదితర టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఒకవేళ లాటరీ తగిలితే రెండోరోజు వ్యాపారి తమ కమీషన్ను తీసుకొని మిగిలిన నగదు ఇస్తారు. నగదు లావాదేవీలు అంతా బ్యాంక్ ద్వారా జరుగుతున్నట్టు సమాచారం. విజేత నగదు ఎవరు ఇస్తారనేది వ్యాపారికి తప్ప ఎవరికీ తెలీదు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
కొత్తగూడ: తాగుబోతుల వల్ల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ హమీ ఇచ్చారు. గురువారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పండగ రోజు ఇంట్లో కూర్చున్న వారికి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును ఎంపీ సీతారాం నాయక్కు వెల్లబోసుకున్నారు. స్పందించిన ఎంపీ గూడూరు సీఐ రమేష్నాయక్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఎంపీ వెంట టీఆర్ఎస్ నాయకులు సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, దూదిమెట్ల లింగయ్య పాల్గొన్నారు. -
9/11 దావాకు ఒబామా నో
వాషింగ్టన్: అమెరికాలోని ‘9/11’ దాడి బాధిత కుటుంబాలు సౌదీ అరేబియాపై వేయాలనుకున్న దావాను ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీటోతో అడ్డుకున్నారు. సౌదీపై దావా వేసేందుకు ప్రవేశపెట్టిన జస్టిస్ ఎగెనైస్ట్ స్వాన్సర్స్ ఆఫ్ టైజం బిల్లు రిపబ్లికన్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. బాధిత కుటుంబాలపై తనకు సానుభూతి ఉన్నా.. అమెరికా సార్వభౌమత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఒబామా తెలిపారు. శనివారం వాషింగ్టన్లో ‘స్మిత్సోనియన్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ, కల్చర్ నేషనల్ మ్యూజియం’ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. -
బాధిత కుటుంబాలకు సాయమందిస్తాం
గుర్రంపోడు: వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ సాయ చర్యలు చేపట్టిందని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. శనివారం మండలంలోని తుర్కోనిబావిలో వర్షం కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించడం జరిగిందని అన్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు అధికార యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్ , ఎంపీటీసీ ఆవుల వెంకన్న , టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బల్గూరి నగేష్ గౌడ్ ఉన్నారు. -
9/11 దావాకు ఒబామా నో
-
వీధినపడిన పేద కుటుంబాలు
ఇద్దరిని మింగిన విద్యుత్ స్తంభాలు బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు దమ్మపేట : పేదింట పెను విషాదం.. మృత్యువు విద్యుత్ స్తంభాల రూపంలో ఆ కుటుంబాలను ఛిన్నాబిన్నం చేసింది.. దీంతో ఆ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన లకావత్ చిట్టెయ్య, దారావత్ మహేష్ బుధవారం రాత్రి వ్యవసాయ భూమిలో దుక్కి దున్నేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో నాగుపల్లి బంజార కాలనీలో విషాదాన్ని నింపింది. అదే కాలనీకి చెందిన లకావత్ చిట్టెయ్యకు ఎకరం మెరక భూమి ఉంది. అదే అతడి కుటుంబానికి జీవనాధారం. అతడికి పెళ్లీడుకొచ్చిన కూతురు, నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడే కుమారుడున్నాడు. చిట్టెయ్య తనకున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలు సాగు చేసుకుంటూ.. కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిట్టెయ్య సోదరుడు గతేడాది మొండివర్రెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇద్దరు కొడుకుల మరణంతో తండ్రి భద్రు అనాథగా మిగిలాడు. మహేష్ నేపథ్యమిది.. నాగుపల్లికి చెందిన దారావత్ మహేష్ అవివాహితుడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచే స్తూ.. తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి నాగుపల్లిలో జరిగిన దుర్ఘటనలో మహేష్ మృత్యువాతపడ్డాడు. మహేష్ మరణంతో అతడి కుటుంబం ఆధారం కోల్పోయింది. ఊరి జనంతో సరదాగా ఉండే ఇద్దరు ఒకేసారి మరణించడంతో నాగుపల్లి అంతటా విషాదం నెలకొంది. -
అమరుల కుటుంబాలకు నిధులు విడుదల
హన్మకొండ అర్బన్ : తెలంగాణ అమరవీరుల జాబితాలో ఉన్న ఇద్దరు అమరవీరుల కుటంబాలకు ప్రభుత్వపరంగా అందించే రూ.10 లక్షల ఆర్థికసాయం నిధు లు విడుదలకు పరిపాలనాపరమైన అననుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు మండలం ఊరుగొం డకు చెందిన జన్ను సురేష్, బచ్చన్నపేట మండల కేంద్రానికి చెం దిన బాశెట్టి వెంకటేశ్వర్లు కుటుం బాలకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. -
పుష్కరాల మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ
-
ఎరుకల కుటుంబాలకు భూ పంపిణీ చేయాలి
న్యూశాయంపేట : అర్హత గల నిరుపేద ఎరుకల కుటుంబాలకు మూడెకరాల ప్రభుత్వం భూమిని పంపిణీ చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం నేతలు డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యనిర్వాహణ కమిటటీ సమావేశానికి పల్లంకొండ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసి మైదాన ప్రాంత ఎరుకలకు వర్తింప చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 6.5 శాతం రిజర్వేషన్లు అన్ని తెగలకు సమానంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం కేవలం లంబాడ తెగకు అధిక పాధాన్యత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్.పోచయ్య, బి.రఘు, రాజు, వనం రమేష్, తిరుపతి కార్పొరేటర్ ఓని భాస్కర్, పల్లంకొండ సురేష్, వర్థన్నపేట జెడ్పీటీసీ సారంగపాణి, జనగామ కౌన్సిలర్ దేవర ఎల్లయ్య, పి.యాదగిరి, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. -
ధైర్యం చెబుతూ..కన్నీళ్లు తుడుస్తూ..
-
సారా మానండి.. సహకరిస్తాం
తయారీదారులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలుపు ఏలూరు అర్బన్: ‘సారా కేసుల్లో నేరస్తులుగా శిక్షణ అనుభవించి గౌరవం పోగొట్టుకున్నారు. మీ బిడ్డలకైనా సమాజంలో తలెత్తుకు తిరిగే అవకాశం ఇవ్వండి’ అని ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) వై.శ్రీనివాసచౌదరి హితవు పలి కారు. జంగారెడ్డిగూడెం, సిరివారిగూడెం, అంకంపాలెం, కామయ్యపాలెం, బొత్తప్పగూడెం, తాటాకులపాలెం, జీలుగుమిల్లి గ్రామాల్లో సారాబట్టీలపై శుక్రవారం ఆయన సిబ్బందితో దాడులు చేశారు. సారా తయారీ, రవాణా, అమ్మకందారుల కుటుంబ సభ్యుల తో సమావేశమయ్యారు. దాడుల సమయంలో సారా తయారీ దారుల కుటుంబాల్లో చాలా మంది ఉన్నత చదువులు పూర్తిచేసినట్టు గుర్తించామని, వారి తల్లిదండ్రులు జైలు పాలైతే బిడ్డల భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. సారా తయారీని వదిలేస్తే తమ ఉపాధి కోల్పోతుందని కుటుంబాలను ఎలా పోషించుకోవాలని పలువురు ఆయన వద్ద వాపోయారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఏకరువు పెట్టారు. ప్రత్యామ్నాయ ఉపాధిపై ఆలోచన సారా తయారీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకతపై డెప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారని శ్రీనివాస చౌదరి చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాల వారికి వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిం చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తమ వంతుగా ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది విరాళంగా అందజేసిన సొమ్ముతో బాధిత కుటుంబాలకు వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందించామని చెప్పారు. ఇటీవల పాఠశాల విద్యార్థులకు 20 వేల నోటు పుస్తకాలు, 7 వేల పలకలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్, ఆర్.నాగేంద్రరావు ఏలూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, కేవీఎస్, కల్యాణ చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
మాకు దిక్కెవరు బిడ్డా..
♦ కోలుకోని రాంసింగ్ తండా అంతా నిర్మానుష్యం ♦ పెళ్ళయిన ఇంట చావు డప్పులు ♦ బాధిత కుటుంబాల్లో ఆర్తనాదాలు ♦ దేవుడు కనికరం చూపలేదని శాంతిబాయి రోదన ♦ అమ్మేదంటూ అమాయకంగా అడుగుతున్న చిన్నారులు ‘దేవుడా మాకిదే గోస... మాపై కని కరం లేదెందుకు?... మా ఇంట్లోళ్లం దరిని తీసుకుపోయినవు.. ఈ తండా కు మా నాయన పేరే పెట్టుకున్నం... మా కుటుంబానికే ఇంత అన్యాయం చేస్తావా?... అంటూ రాంసింగ్ తండాకు చెందిన దన్జీరాం భార్య శాంతిబాయి రోదించిన తీరు అందరిని కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడడంతో శాంతిబాయి తల్లడిల్లిపోయింది. భర్త,కొడుకు, కూతు రు, ఇద్దరు మరుదులను కోల్పో యి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఘటనను తలచుకుంటూ కన్నీరుమున్నీరైంది. - కంగ్టి కంగ్టి: దెగుల్వాడి దేవ్లా తండా ఘటన నింపిన విషాదం నుంచి ఇంకా రాంసింగ్ తండా కోలుకోలేదు. మూడు రోజులైనా ఇంకా విషాదఛాయలు వీడలేదు. తండా మొత్తం మూగబోయింది. ఆదివారం వివాహ తంతును పూర్తిచేసుకుని ఆనందంతో ఇంటికి బయలు దేరిన పెళ్లి బృందం మరో ఐదు నిమిషాల్లో పచ్చని పందిరికి చేరుకుంటామనేలోపు ఘోరం జరిగిపోయింది. విద్యుత్ వైర్లు లారీని తగలడంతో విద్యుదాఘాతానికి ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన విషయం తెల్సిందే. పెళ్లయిన పది గంటల్లోపే తండాలో పెడబొబ్బలు, చావు డప్పులు మోగడం ప్రతిఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లిబృందం లారీకి విద్యుత్ తీగలు తగలడంతో చోటుచేసుకున్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. అందులో చౌకన్పల్లి రాంసింగ్ తండాకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుండడం అందరిని కలిచివేసింది. తమ తండ్రి పేరుతో ఉన్న రాంసింగ్తండాలో తమ కుటుంబానికే ఇంతటి అన్యాయం ఎందుకు జరిగిందంటూ నూతన వరుడు శివాజీ తల్లి, దన్జీరాం భార్య శాంతిబాయి రోదించింది. భగవాన్ హమాపర్ థోడాభీ ఛాయాభీ రకాడోకోని (దేవుడికైనా మాపై కనికరం ఎందుకు రాలేదు) అంటూ పెడబొబ్బులు పెట్టింది. హమ్కూ జీవా?(తామెలా బతకాలి?), బగర్వాలి వసరేర్ ఛోరి ఛిచాబర్(అనాథలుగా మిగిలిన పిల్లలు), ఏ య్యాడీ కన్నాఅయిచ్చీ(అమ్మా... ఎప్పుడోస్తావూ..) రోదించింది. షాక్ నుంచి తేరుకోని వధూవరులు... దన్జీరాంతోపాటు ఆ కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ఇంటిల్లిపాదిని అనాథలను చేసింది. దన్జీరాంతోపాటు సోదరులు రాములు, వినోద్, కొడుకు శ్రీను, కూతురు కిస్సీబాయి ప్రాణాలు కోల్పోయారు. అదే తండాకు చెందిన రవి అలియాస్ లవ్ మరణించాడు. ఈ ఘటనతో నూతన వధూవరులు అర్చన, శివాజీ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. సోదరుడి పెళ్లికోసం వచ్చి.. కిస్సీబాయి కర్ణాటక నుంచి సోదరుడు శివాజీ పెళ్లి కోసం వచ్చి ఊహించని రీతిలో ప్రాణాలు విడిచింది. పెద్దవడ్గాంకు చెందిన దేవ్యాతో కిస్సీబాయికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వలస జీవులుగా జీవితాన్ని గడుపుతున్న వీరిలో పెను విషాదం చోటుచేసుకొంది. వీరికి అస్సీబాయి(8), సోనాబాయి(6), జగ్రాం(4), రాధా(2) పిల్లలున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో అమాయక కూతురు సోనాబాయి తల్లి శవం ముందు నిలబడి చేతులు చాచి... ‘ఏ య్యాడీ క న్నాఆయిచ్ఛీ’ అంటూ ఏడ్వడంతో అక్కడున్న వారిని కలిచివేసింది. వరుడి బాబాయిల మృత్యువాత... బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టి గప్చుప్లు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్న వరుడు శివాజీ బాబాయిలు రాములు, వినోద్లు కూడా మృత్యువాత పడ్డారు. వీరు పెళ్లికి రెండ్రోజుల ముందే రాంసింగ్ తండాకు చేరుకున్నారు. మూడో రోజే విద్యుదాఘాతానికి బలయ్యారు. రాములుకు భార్య మరోనిబాయి, కూతురు పూజ, కుమారులు యువరాజ్(8వ త రగతి), సచిన్ (ఆరోతరగతి) ఉన్నారు. వినోద్కు భార్య సోనాబాయి, కూతురు పవిత్ర(5 నెలలు), కుమారుడు కార్తీక్(3) ఉన్నారు. భర్త వినోద్ను కోల్పోయిన సోనాబాయి రోదనలు మిన్నంటాయి. దన్జీరాం కుటుంబంలో మిగిలింది వీరే... దన్జీరాంతోపాటు ఆయన కుమారుడు శ్రీను, కూతురు కిస్సీబాయి, ఇద్దరు సోదరులు రాములు, వినోద్ మరణించారు. అయితే ఈ కుటుంబంలో దన్జీరాం భార్య శాంతిబాయి, ముగ్గురు కుమారులు సంతోష్, అశోక్, శివాజీ, కూతురు పూలీబాయి మాత్రమే మిగిలారు. నిశ్చితార్థం రోజే రవి అంత్యక్రియలు.. ఇదే తండాకు చెందిన బాబూసింగ్ కుమారుడు రవి(లవ్)కి నిశ్చితార్థం జరగాల్సిన రోజే అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉన్నందున శివాజీ పెళ్లికి వెళ్లొద్దని వారించినా వినలేదు. సాయంత్రం వరకు వస్తానని రవి తన తండ్రికి నచ్చజెప్పి వెళ్లాడు. అంతలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. రవికి ఐదుగురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో.. ఖేడ్ మండలం హంగిర్గా(కే) శ్యామాతండాకు చెందిన అశోక్ కు ఈ మధ్యే నిశ్చితార్థమైంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు మమ్మల్ని వదిలిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. -
ఎల్లలు దాటిన స్నేహ బంధం!
స్నేహ బంధమూ.. ఎంత మధురమూ... కరిగిపోదు చెరిగి పోదు జీవితాంతమూ అన్నాడో సినీ కవి. నిజంగా ఆ ఇద్దరు స్నేహితుల బంధమూ అలాగే కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువుల బంధాలు తెలియని అనాధలే అయినా.. శరణాలయంలో కలసి మెలసి పెరిగిన వారి స్నేహ బంధం మాత్రం విడిపోలేదు. చిన్నతనంలో ఆఫ్రికాలోని అనాధ శరణాలయంలో ఒకరికి ఒకరై బతికిన జీవితాలు... అమెరికా కు దత్తతకు వెళ్ళినా అనుకోకుండా ఒకే చోటుకి చేరుకున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆఫ్రికాలోని మొజాంబిక్ అనాథాశ్రమంలో పెరిగిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఊహ తెలిసినప్పటి నుంచీ మంచి స్నేహితులు. అయితే ప్రస్తుతం 18 ఏళ్ళ వయసున్న కెల్విన్ లెవిస్, అఫోన్సో స్టేటర్ లను ఎనిమిదేళ్ల క్రితం అరిజోనా గిల్బర్ట్ నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు దత్తతకు స్వీకరించారు. ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతంలో కేవలం రెండు మైళ్ళ దూరంలో ఉండటంతో తిరిగి కెల్విన్, అఫోన్సో లు ఒకే కళాశాలలో చేరడంతో అసలు విషయం తెలిసింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు తెలియదు. దత్తత సమయంలోనూ కలవలేదు. అయితేనేం ఒకే ప్రాంతంలో దత్తతకు రావడంతో ఆశ్చర్యంగా ఇద్దరు స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. చూసేందుకు భిన్నంగా కనిపించినా తమ స్నేహ బంధం ఎంతో ధృఢమైనదని, అందుకే తిరిగి తాము కలవగలిగామని చెప్తున్నారు. ఎక్కడో విడిపోయిన తాము తిరిగి ఒకేచోట కలిసి పెరిగే అవకాశం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ స్నేహితులిద్దరూ చెప్తున్నారు. ఇద్దరూ గిల్బర్ట్ హైస్కూల్లోని సాకర్ టీం లో చేరారు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి... రూమ్మేట్స్ గా ఉండే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో వైద్యుడుగా స్థిరపడి మొజాంబిక్ లో సేవలు అందించాలనుకుంటున్నానని కెల్విన్ చెప్తుంటే... వివిధ దేశాల మధ్య దత్తత స్వీకరణ అభివృద్ధి చేసేందుకు కావలసిన అంతర్జాతీయ అధ్యయనాల్లో డిగ్రీ చదవాలనుకుంటున్నానని అఫోన్సో చెప్తున్నాడు. మేమిద్దరం స్నేహితులేకాదు సోదరులకంటే ఎక్కువ బంధం కలగి ఉన్నామని, భవిష్యత్తులో మా పిల్లలను సైతం మంచి స్నేహితులుగా ఉండేట్టు చూస్తామని ఆ అపూర్వ స్నేహితులు... కాదు సహోదరులు చెప్తున్నారు. -
కుటుంబాలతో వెళ్లేదెవరో?
ఏపీ రాజధానికి వెళ్లాల్సిన ఉద్యోగుల విషయంలో సర్కారు సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి హైదరాబాద్ నుంచి కుటుంబాలతో సహా తరలి వెళ్లే ఉద్యోగులు ఎంతమంది ఉంటారో లెక్క తేల్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల నుంచి లిఖిత పూర్వకంగా పత్రాలను తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే ఏపీ రాజధానికి వెళ్లే వారి పిల్లలు ఎక్కడ ఎంత వరకు చదివారో వివరాలు సేకరించనుంది. ఇదే సమయంలో తమ పిల్లలకు నూతన రాజధానిలో స్థానికత కల్పించాలని కోరుతున్న ఉద్యోగుల్లో కూడా ఎంతమంది కుటుంబాలతో తరలి వెళ్తారో లెక్కించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన రాజధాని అమరావతికి తరలి వెళ్లాల్సిన రాష్ట్ర స్థాయి ఉద్యోగులు 25 వేలమంది వరకు ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఎక్కువమంది ఉద్యోగులు కుటుంబాలతో సహావెళ్లే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా రెండు మూడేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు కుటుంబాలతో వెళ్లకపోవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించి లెక్కలు తేల్చేందుకు ప్రత్యేకంగా నమూ నా పత్రం రూపొందించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. నమూనా పత్రంలో ఏ ఏ అంశాలు ఉండాలో ఏపీ సీఎస్ సమీక్షించారు. ఉద్యోగులు నమూనా పత్రాన్ని పూరిస్తే ఎంతమంది ఉద్యోగుల పిల్లలకు స్థానికత సమస్య ఏర్పడుతుంది, ఎంతమంది ఉద్యోగులు కుటుంబాలతో సహా రాజధానికి తరలి వెళ్తారనే లెక్క తేలుతుందని ఏపీ సీఎస్ చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. భారీగా అద్దెల చెల్లింపుపై విమర్శలు సాధారణ పరిపాలన శాఖలోని ప్రొటోకాల్, కేబినెట్ విభాగాలను వెంటనే విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) చెందిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, నలుగురు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇద్దరు డీఈవోలను ఈ నెల 24వ తేదీలోగా విజయవాడ వెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. వీరి కోసం విజయవాడలో భారీగా అద్దె చెల్లిస్తూ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రెండు అద్దెకు తీసుకున్నారు. 1,200 చదరపు అడుగుల్లో గల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్కు నెలకు రూ. 30 వేలు. 1,500 చదరపు అడుగుల్లో గల ఫ్లాట్కు నెలకు రూ. 40 వేలు అద్దె చెల్లించనున్నారు. ప్రైవేట్ భవనాలకు ఇంత భారీ మొత్తంలో అద్దెలు చెల్లించడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేట్ భవనాలు అద్దెకు తీసుకోవాలంటే చదరపు అడుగుకు నెలకు రూ. 10 మాత్రమే అద్దె చెల్లించాలనే నిబంధన ఉంది. అదే గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చదరపు అడగుకు నెలకు రూ. ఏడు మాత్రమే అద్దె చెల్లించాలనే నిబంధన ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,200 చదరపు అడుగులకు నెలకు రూ. 30 వేల అద్దె అంటే చదరపు అడుగుకు ఏకంగా రూ. 25 చెల్లిస్తోందన్నమాట. -
మగ్గం బ్రాండ్ బీడీ
మగ్గంపై నేసిన చీరతోనే ఉరి వేసుకున్న చేనేత కార్మికుల దీనగాథలు ఎన్నో విన్నాం. మగ్గం నడపలేక పురుగులమందు తాగి బలవన్మరణం పొందిన వారి కథలు చదివాం.మగ్గం నీడలో విరాజిల్లిన ఊళ్లకు ఊళ్లే శ్మశానాలుగా మారడం చూశాం.ఇప్పుడు మగ్గానికి క్యాన్సర్ వచ్చింది! చేనేత... కళాకారులకు బీడీ పని ఇచ్చి వెళ్లింది. ఒకప్పుడు చేనేత కళకు జీవం పోసి ఇప్పుడు చావలేక బతుకుతున్న... మనసు చంపుకుని చావుకట్టలు చుడుతున్న...చేనేత చేతుల బీడు జీవితమే ఈ మగ్గం బ్రాండ్ బీడీ కథనం. 50 ఏళ్ల క్రితం.. హైదరాబాద్కు 120 కిలోమీటర్ల దూరంలో... రంగారెడ్డి జిల్లాలోని యాలాల మండలంలో గోవిందరావు పేట, ముద్దాయిపేట గ్రామాలు. ఒక్కో గ్రామంలో 500 కు పైగా కుటుంబాలు ఉండేవి. ఒక్కో ఇంటికి పదేసి చొప్పున మరమగ్గాలు, గుట్టల కొద్దీ వడకాల్సిన నూలు ఉండేది. తీసిన దారాలు తీసినట్టే అయిపోయేవి. వేసిన రంగులు వేసినట్టే అయిపోయేవి. రేయింబవళ్లు చేసినా తరగనంత పని చేతుల నిండుగా ఉండేది. వేకువజామునుంచి, అర్ధరాత్రి వరకు వస్త్రాలు నేస్తూనే ఉండటంతో మగ్గాల చప్పుళ్లు గ్రామ పొలిమేరల దాకా వినిపించేవి. చుట్టూ ఉన్న 8 తండాలు, 30 గ్రామాల వాళ్లే కాదు, దూరప్రాంతాల వారూ వస్త్రాల కొనుగోళ్లకు గోవిందరావు పేట, ముద్దాయిపేటకే వచ్చేవారు. ఇక్కడి చేనేత యాలాల పేరుమీదగానే ప్రసిద్ధమైంది. రంగురంగుల యాలాల చేనేతలు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతంలో కోటికాంతులు విరబూసేవి. సిరిసంపదలు తులతూగేవి. నేడు మణెమ్మకు 90 ఏళ్లు. నలభై ఏళ్ల క్రితం వరకు... భర్త, కొడుకు, మనవలు, మనవరాళ్లతో ఇల్లు సందడిగా ఉండేది. భర్త అనారోగ్యంతో చనిపోగా, కొడుకు నేతన్నగానే కన్ను మూశాడు. మనవడు దామోదరూ కులవృత్తినే నమ్ముకున్నాడు. కానీ, మగ్గం మూలన పడటంతో పొట్టకూటికోసం కరీంనగర్లోని సిరిసిల్లకు వెళ్లాడు. అక్కడా చుక్కెదురవడంతో ఏడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వలేక పుట్టినగడ్డకు మనవడి శవాన్ని తీసుకురాలేక ఊరికాని ఊళ్లోనే నలుగురి సాయం అడిగి మట్టిచేసొచ్చింది మణెమ్మ. కూలిన ఇంట్లోనే ఓ పూట తిని, ఓ పూట తినక బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కపెట్టుకుటోంది. పగిడాల నర్సవ్వకు 80 ఏళ్లు. ఉన్న ఊళ్లో పని లేకపోవడంతో పదేళ్ల క్రితం కొడుకుతో కలిసి మహారాష్ట్రకు బతుకుతెరువు కోసం వెళ్లింది. అక్కడా పని లేదని అర్ధమై, కొడుకుకు భారంగా ఉండలేక ఉన్న ఊరు చేరుకుంది. ఇల్లు కూలి, కుప్పగా దర్శనమిచ్చింది. దాన్ని బాగు చేసుకునే స్తోమత లేదు. ఊళ్లోనే అయినవాళ్లను బతిమాలుకొని, వారిళ్లలో తలదాచుకుంటోంది. అంజిలమ్మకు 60 ఏళ్లు. పిల్లాపాపలతో కళకళలాడిన ఇంట్లో ఇప్పుడు ఒక్కతే ఉంటోంది. పొట్టకూటి కోసం పిల్లలు పట్నమెళ్లిపోయారు. భర్త పోయాడు. బీడీలు చుట్టుకుంటూ... గతాన్ని తలచుకుంటూ బతుకు భారంగా నెట్టుకొస్తోంది. వైభవోపేతంగా ఒక వెలుగు వెలిగిన ఈ రెండు గ్రామాలలో ఇప్పుడు ఎటుచూసినా శిథిలావస్థకు చేరిన గృహాలు, ఆకలి కేకలకు తాళలేక పొట్ట చేత పట్టుకుని సూరత్, షోలాపూర్, భీమండి, నవసాగర్, ముంబయ్.. వంటి ప్రాంతాలకు వలసపోయిన చేనేతకారులు. కూలిపోయిన ఇళ్లు, మొండిగోడలు.. వాటి మధ్యే జీవచ్ఛవాలుగా మారిన నేతన్నల కుటుంబాల అవశేషాలు. జనసంచారం లేక వెక్కిరిస్తున్న వీధులు. ఎటు చూసినా దయనీయ దృశ్యాలే. ఎక్కడికీ వెళ్లలేక, మరో పని తెలియక ముసలీ ముతక, ఉన్న కొద్దిపాటి మహిళలు బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరితో పాటు ఇంకా అవశేషంగా మిగిలిపోయిన నాటి చీరలు కట్టుకున్న వృద్ధులు అక్కడక్కడా కనిపిస్తారు. 1200 బీడీలకు 100 రూపాయలు! ఏ చేతులతోనైతే మగ్గం పనులు చేశారో.. ఆ చేతులతోనే ఇప్పుడు బీడీలు చుడుతున్నారు గోవిందరావు పేట, ముద్దాయిపేట గ్రామస్థులు. నాడు పెళ్లి చీర అమ్మితే నెలకు సరిపడా గ్రాసం వెళ్లిపోయేది. నేడు ఎన్ని వందల బీడీలు చుట్టినా పూట గడవడమే కష్టంగా మారింది వారికి. చేనేత చివరాఖరి రోజుల్లో నాటి ప్రభుత్వం భాగ్యనగర్ఖాదీని ఏర్పాటు చేసింది. వేతనాలు ఇచ్చింది. ఆడపిల్లలు చెరకలకు దారాలు అల్లేవారు. వాటినే తీసుకెళ్లి మగ్గాల మీద చీరలు నేసేవారు. ఆ సంస్థ 20 ఏళ్లు నడిచి, ఆ తర్వాత మూత పడింది. ‘‘ఇప్పుడు ఆ సంస్థ ఎక్కడపోయిందో... ఎవరూ అడిగింది లేదు. తెలంగాణ ఉద్యమంలో మా చేనేత కార్మికులే ముందున్నారు. కానీ, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు’‘ అని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ముడిసరుకు ఉంటే ఇప్పటికీ చురుగ్గా పనులు అవుతాయి. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. పొరుగూళ్లకు వెళ్లిన కళాకారులూ తిరిగి సొంత ఊళ్లకు చేరుకుంటారు. కానీ, ముడిసరుకు ఇచ్చేవారెవరు... ఆప్కో నుంచి నూలు ఇప్పించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పని కూడా గుర్తింపు కార్డు ఉంటేనే! ప్రస్తుతం ప్రతి చేనేత కుటుంబంలో బీడీల పనే జీవనాధారంగా మారింది. అయితే, బీడీల తయారీకి చేనేతకారుల గుర్తింపు కార్డులు ఉంటేనే ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కార్డులు ఉంటేనే పింఛను మంజూరు, రేషన్ బియ్యం.. వంటి లింకులు ఉన్నాయి. గుర్తింపు కార్డులు లేని, బీడీలు చుట్టే ఓపికా లేని వృద్ధులు ఈ విధానం వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు! ఇక్కడి చేనేత కార్మికుల బంగళాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకనాడు సిరిసంపదలు తులతూగిన ఈ ప్రాంతాల్లో గుప్తనిధులు ఉంటాయని ఈ గ్రామాలలో తవ్వకాలు జరిపిన సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం గోవిందరావు పేటలో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో రాత్రివేళల్లో పాడుబడిన బంగళాలు, శిథిలావస్థలోకి చేరిన ఇళ్లలో గుప్తనిధుల తవ్వకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. యాలాల చేనేతకార్మికుల ప్రస్తుత దుస్థితితో పాటు, ఈ తవ్వకాలను ఆపడం ఎలా అన్నదానిపైనా ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంది. - జావెద్, సాక్షి, యాలాల; ఫొటోలు: నాగరాజు పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదు..! నాడు ఎంతో ఉన్నతంగా బతికాం. నే డు మా పిల్లలు కూడా బీడీల తయారీలో ఉండకపోతే పూట గడవని పరిస్థితి. ప్రస్తుతం యాలాల, గోవిందరావుపేటలలోని చేనేత కుటుంబాల్లో నా దగ్గర మాత్రమే మరమగ్గం ఉంది. అది కూడ వృత్తి మీద మమకారంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మొన్నామధ్య ఒక్క పంచె అయినా నేయాలనే పట్టుదలతో బీడీల ఆదాయంతో ముడిసరుకు కొనుక్కొచ్చాను. ఆ పూటకు తిండిలేకపోతే నేసిన అరమీటర్ గుడ్డను తీసుకెళ్లి అమ్మి, గింజలు తెచ్చుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కష్టాలు తీరుతాయని భావించాం. కానీ పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. - రాంచందర్, చేనేత కార్మికుడు, గోవిందరావుపేట పీఎఫ్ డబ్బుల జాడే లేదు! చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఖాదీ సమితిలో ప్రతినెలా మేమంతా డబ్బులు కట్టేవాళ్లం. వీటితో పాటు చేనేత కార్మికులకు అండగా ఉంటుందనే ధీమాతో గతంలో ఖాదీ సమితిలో డబ్బులు చెల్లించాం. కానీ మా డబ్బులతో పాటు పీఎఫ్ డబ్బుల వివరాలు నేటికీ అంతుచిక్కడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి పత్రాలు, ఇతరత్రా డాక్యుమెంట్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఈ విషయంలో సర్కారు దృష్టి సారించి మాకు న్యాయం చేయాలి. - నల్ల మల్లయ్య, చేనేత కార్మికుడు కార్డు లేదని పింఛను ఇస్తలేరు! నాకు 60 ఏళ్లు పైబడ్డాయి. చేనేత కార్మికురాలిగా నాకు గుర్తింపు కార్డు లేదనే కారణంతో పింఛను మంజూరు కాలేదు. చేనేత కార్మికులుగా బతికిన మాకు న్యాయం జరగాలి. - మెర్గు అంజిలమ్మ, చేనేత కార్మికురాలు, యాలాల -
అంధకారంలో.. ‘ఆది’లాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో 1,01,929 కుటుంబాలు సొంత ఇళ్లలో నివసిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 1,48,175 కుటుంబాలు అద్దె ఇంట్లో ఉంటున్నాయి. 48,300 కుటుంబాలు రేకుల పైకప్పులో ఉంటున్నాయి. 35 వేల మంది తాత్కాలిక నివాసాల్లో జీవనం సాగిస్తుండగా, మరో 35 వేల మంది గుడిసెలు, తాటిపత్రులతో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతిళ్లు నిర్మించుకోవాలనేది సగటు వ్యక్తి కల. ఆ కల ఇంకా నెరవేరడం లేదు. ఒకే గదిలో జీవనం సాగిస్తున్న కుటుంబాలు 4,32,029 ఉండగా, రెండు గదుల్లో నివసించే కుటుంబాలు 2,54,714, మరో 72 వేల కుటుంబాలు మూడు గదుల్లో ఉంటున్నాయి. నాలుగు అంతకంటే ఎక్కువ సంఖ్యలో 35,923 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాష్ట్రంలో రెండో స్థానం.. జనాభా పరంగా జిల్లాలో వెనుకబడిన వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఆదివాసీ జిల్లాగా పేరుగాంచి రాష్ట్రంలోనే ఎస్టీ జనాభాల్లో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాలో మొత్తం జనాభా 28,24,953లో ఎస్టీలు 5,79,842 ఉన్నారు. బీసీ జనాభా 13,60,702 ఉండగా, ఎస్సీలు 5,30,471, ఓసీలు 3,55,695, మైనార్టీలు 3,25,575 ఉన్నారు. బీసీ జనాభా తర్వాత అత్యధికంగా ఎస్టీలే ఉన్నారు. భూమి లేని నిరుపేదలు.. జిల్లాలో మొత్తం 8,16,482 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో 5,13,520 కుటుంబాలకు సొంత భూమి లేదని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. 3,02,962 కుటుంబాలకు సొంత భూమి ఉన్నట్లు నిరూపన అయ్యింది. ఇందులో 81,976 కుటుంబాలకు ఎకరంలోపు భూమి ఉండగా, 48,442 కుటుంబాలకు రెండెకరాలలోపు సాగు భూమి ఉంది. 48,517 కుటుంబాలకు మూడెకరాలలోపు, 35,432 కుటుంబాలకు నాలుగెకరాలలోపు, 33,672 కుటుంబాలకు ఐదెకరాలలోపు సాగు భూమి ఉంది. ఐదుకంటే ఎక్కువగా 95,797 కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. రాష్ట్రంలో నాలుగోస్థానం.. జిల్లాలో 5,17,152 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. స్వచ్ఛభారత్ అంటూ దేశమంత నాయకులు చేస్తున్న హడావుడి అంతాఇంతాకాదు. ప్రతి వ్యక్తి స్వచ్ఛభారత్లో పాల్గొనాలంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ.. జిల్లాలో ఎందరికి మరుగుదొడ్లు ఉన్నాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని కుటుంబాల్లో జిల్లా నాలుగోస్థానంలో నిలిచింది. ఉద్యోగులు.. జిల్లాలో మొత్తం ఉద్యోగులు 1,02,773 ఉన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 28,018 ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8976 మంది ఉన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులు 18,744 ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు 21,692 ఉండగా, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 25,343 మంది ఉన్నారు. తాగునీటి సదుపాయం.. జిల్లాలో అత్యధిక జనాభా ప్రభుత్వ నల్లాలు కలిగిన వారే ఉన్నారు. 2,64,179 మందికి ప్రభుత్వ నల్లాలు ఉండగా, 2,05,164 కుటుంబాలు చేతిపంపుల ద్వారా తాగునీటి పొందుతున్నారు. బోరుబావి ద్వారా 61,486 మంది, 62,306 కుటుంబాలు బోరు మోటర్ల ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నారు. సొంత బోరు కలిగిన వారు 46,285 మంది ఉన్నారు. 1,23,083 కుటుంబాలకు పంచాయతీ నల్ల కనెక్షన్లు ఉన్నాయి. 8,941 కుటుంబాలు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాల జోరు.. జిల్లాలో ఎక్కువగా 1,27,577 కుటుంబాలకు ద్విచక్ర వాహనాలు ఉండగా, 9,899 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. 8,195 కుటుంబాలకు మూడు చక్రాల వాహనాలు ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. 4,741 కుటుంబాలకు ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు ఉన్నాయి. జిల్లాలో 945 కుటుంబాలకు ఏసీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వెల్లడించాయి. -
వాల్మీకులు దగాపడిన తమ్ముళ్లు
కర్నూలు(అర్బన్): ‘‘వాల్మీకులు ఫ్యాక్షనిస్టులు కాదు. వారంతా దగాపడిన తమ్ముళ్లు. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వేలాది కుటుంబాలు దుర్భర జీవనం గడుపుతున్నాయి.’’ అని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్పీఎస్) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధ్యక్షతన వాల్మీకుల శాంతి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి వారసులైన బోయలు ముఠా నాయకులకు దూరంగా ఉండాలన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడే ఫ్యాక్షనిస్టు ముద్రను చెరిపేసుకోవడం సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో వాల్మీకుల జనాభా 12 లక్షలకు పైగా ఉన్నా.. ముఖ్యమైన అధికార హోదాల్లో అతి తక్కువ మంది ఉండటం బాధాకరమన్నారు. బడి బయటి వాల్మీకుల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు పోలీసు శాఖ తరఫున తమ వంతు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు కారణమవుతున్న మద్యానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో దాదాపు 30 ఏళ్లుగా అనేక మంది వాల్మీకులపై రౌడీషీట్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని.. సత్ప్రవర్తన కలిగిన వారిపై వీటిని ఎత్తేసేందుకు డీఎస్పీలచే విచారణ చేయిస్తామన్నారు. ఫ్యాక్షన్ కారణంగా మృతి చెందిన, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారి తల్లుల కన్నీళ్లు చూసైనా మార్పు దిశగా అడుగులు వేయాలన్నారు. కేసుల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేలా పోలీసులకు తగిన ఆదేశాలిస్తామన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లోని యువతలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వీఆర్పీఎస్ ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ దశాబ్ధాల చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఘటనలో హంతకులు, హతులు వాల్మీకులే ఉంటున్నారన్నారు. ఈ సంస్కృతిలో మార్పు అవసరమన్నారు. వాల్మీకులు అన్ని రంగాల్లో రాణించాలంటే ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోవడం ఒక్కటే మార్గమన్నారు. వీఆర్పీఎస్ కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ వెంకన్న మాట్లాడుతు ఫ్యాక్షన్ ఊబి నుంచి వాల్మీకులు బయటకు రావాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యపరంగా వాల్మీకులు వెనకబాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సి.తిక్కన్న, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, వీఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వలసల రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, కార్యదర్శులు జి.రాంభీంనాయుడు, సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎల్.వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షురాలు బీటీ అనురాధ, నాయకులు బేవినహాల్ హనుమంతప్ప, బోయ గోపితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకులు పాల్గొన్నారు. అండగా నిలుస్తాం జిల్లాలో వాల్మీకులకు ఎక్కడ అన్యాయం జరిగినా వీఆర్పీఎస్ అండగా నిలుస్తుంది. హత్యా రాజకీయాలకు వాల్మీకులు దూరంగా ఉండాలి. అనేక గ్రామాల్లో ముఠా, రాజకీయ నాయకులు వాల్మీకులను అణగదొక్కేందుకు సోదరులైన ఎస్సీలతో అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. ఈ కేసుల్లో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి. కుటంబంలో ఒకరు తప్పు చేస్తే ఆ వ్యక్తిపైన మాత్రమే కేసులు నమోదు చేయాలి. అలా కాదని మొత్తం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం తగదు. - ఎం.సుభాష్ చంద్రబోస్, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఆపద్బంధుకు ఆపద
సాక్షి, మహబూబ్నగర్: ఆపద్బంధు పథకానికి ఆపదొచ్చింది. వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆపద్భంధు పథకం ఆగిపోతోంది. ఇంతో ఆర్థికంగా ఆదుకుంటుందని ఆశగా దరఖాస్తు చేసుకుంటే నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి ఒక్క పైసా రావడం లేదు. కుటుంబ సభ్యుడు చనిపోయిన బాధ ఒకవైపు ఉంటే ప్రభుత్వ తీరుతో బాధిత కు టుంబాలు మరింత కుంగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుదాఘాతం, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ మృతులు, ఇతర ప్రమాదాలబారిన పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆపద్బంధు పథకం కింద రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది. నిబంధనల ప్రకారం అయితే మరణించిన వ్యక్తి కుటుంబాలకు తక్షణమే ఈ పథకం కింద ఆర్థికసాయం అందించాలి. కానీ అధికారులు అలసత్వం, రకరకాల కొర్రీల కారణంగా నెలల తరబడి వేచియున్నా ఫలితం కనిపించడం లేదు. తగ్గిన ఆదరణ... ఆపద్బంధు పథకానికి రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతుంది. ప్రభుత్వ వైఖరి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాదీ వీటి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే... అధికారులు సవాలక్ష కొర్రీలు విధిస్తున్నారని బాధిత కుటుంబాలు నిట్టూరుస్తున్నాయి. ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం కాపీ, ఇన్క్వెస్టు రిపోర్టు, చార్జీషీట్, ఎఫ్ఎస్ఎల్, డ్రౌనింగ్ వంటి రిపోర్టులు కావాలని, అవన్నీ నాలుగు సెట్ల కాపీలను జతపర్చాలంటారు. ఒక కాపీ ఎమ్మార్వో, మరో కాపీ ఆర్డీఓ, మరోకటి కలెక్టరేట్, ఇంకొకటి ఇన్సూరెన్స్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులు విసిగి వేసారిపోతున్నారు. దీంతో ప్రతి ఏటా ఆపద్బంధు దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతుంది. 2012లో 341 దరఖాస్తులు రాగా... 2013కు ఆ సంఖ్య 253కు పడిపోయింది. ఇక 2014 నాటికి ఆ సంఖ్య మరీ దారుణంగా 111కు మాత్రమే పరిమితమైంది. చేయూత లేక వలస పాయే దేవరకద్ర రైల్వే స్టేషన్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని వడ్డె మల్లేశ్, దుర్గమ్మలు ఉండేవారు. మూడు నెలల క్రితం గోపన్పల్లి వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మల్లేశ్ మరణించాడు. ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి చేయూత లభించలేదు. ట్రాక్టర్ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పిన రాలేదు. దిక్కులేని పరిస్తితుల్లో దుర్గమ్మ తమ కొడుకులు కృష్ణ(8), పురుషోత్తం(6), మణికంఠ(4), గణేశ్(2)తో వెంటపెట్టుకొని హైదరాబాద్ వలస వెళ్లింది. - వడ్డే దుర్గమ్మ, దేవరకద్ర పోషించే దిక్కు లేక పాయే జీవితాంతం తోడుంటే భర్త రోడ్డు ప్రమాదంలో బలయ్యాడు. మమ్ములను అనాథలను చేశాడు. నాకు, నా కూతురికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. మేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త తిమ్మారెడ్డి మృతిచెందాడు. జూన్లో ఆపద్భందు పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తూ చేసుకున్నా. ఇప్పటి దాకా మాకెలాంటి సాయమూ అందలేదు. దీని గురించి పట్టించుకునే వారే లేరు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పాయిదా లేదు. తిరిగి, తిరిగి వేసారిపోయినం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. - విజయలక్ష్మి, గట్టు -
‘బోగస్’ తేలేదెన్నడు?
- అనర్హుల వద్ద లక్షల్లో రేషన్కార్డులు - ఆధార్ సీడింగ్ 73శాతమే పూర్తి - తేలని రచ్చబండ లబ్ధిదారుల లెక్క - ఆధార్ గడువు మరో వారం పెంపు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,69,451 కుటుంబాలు ఉండగా, రేషన్కార్డులు మాత్రం 11,73,988 ఉన్నాయి. కుటుంబాల సంఖ్యతో పోలిస్తే వివిధ కేటగిరీల్లో ఉన్న రేషన్కార్డుల సంఖ్యను కలుపుకుంటే 3,04,537 కార్డులు అదనంగా ఉన్నాయి. అంటే కుటుంబాల సంఖ్య 35శాతం కన్నా రేషన్కార్డులు అదనంగా ఉన్నాయి. జనాభా సంఖ్యతో పోల్చినా రేషన్కార్డుల్లో యూనిట్ల సంఖ్య కూడా అదనంగానే ఉంది. జనాభా 40,53,028 ఉండగా రేషన్కార్డుల్లో ఉన్న యూనిట్ల సంఖ్య 11,73,988 ఉంది. అంటే జనాభా కంటే ఆరుశాతం మంది రేషన్కార్డుల్లో అదనంగా ఉన్నారు. జిల్లాలో అనర్హుల వద్ద రేషన్కార్డులు ఉన్నాయనేందుకు ఈ గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3,066మంది రేషన్ డీలర్ల వద్ద అదనంగా కార్డులు ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. డీలర్లు, అనర్హుల వద్ద ఉన్న రేషన్కార్డులను స్వచ్ఛందంగా అప్పగించాలని అధికారులు ఆదేశాలు జారీచేయడంతో డీలర్లు 3,066 కార్డులను మాత్రమే అప్పగించారు. ఇంటింటి సర్వే నిర్వహించి మరో 57,385 బోగస్కార్డులు ఉన్నట్లు తేల్చారు. కొన్నిచోట్ల అర్హుల వద్దే రేషన్కార్డులు ఉన్నా వాటిలో కుటుంబ సభ్యుల సంఖ్యను ఎక్కువగా చూపుతున్నట్లు తేలింది. రేషన్కార్డుల్లో వాస్తవసంఖ్య కంటే ఎక్కువగా ఉన్న 5,29,074 మంది పేర్లను కూడా జాబితా నుంచి తొలగించారు. తేలని ‘రచ్చబండ’ లెక్క: రచ్చబండ కార్యక్రమంలో భా గంగా జిల్లాలో1,14,821మందిలబ్ధిదారులకు కూపన్లు జారీ చేశారు. ఇలా కార్డులు పొందిన వారిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు భావించిన అధికారులు వివరాల సేకరణకు శ్రీకారం చుట్టారు. కూపన్లు పొందిన వారు ఆధార్కార్డు నం బరుతో పాటు ఫొటో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి గడువు విధిస్తున్నా ఇప్పటివరకు 35,442 మంది మాత్రమే ఆధార్కార్డు నంబర్, ఫొటో అందజేశారు. వివరాలు ఇవ్వని మరో 79,379 కార్డులకు సంబంధించి న రేషన్పంపిణీని ఆగస్టు నుంచి నిలిపేస్తున్నట్లు ప్రకటించా రు. ఆగస్టు 15లోగా వివరాలు ఇవ్వాలని గడువు విధించినా స్పందించకపోవడంతో సెప్టెంబర్5వ తేదీవరకుగడువు పెం చారు. మరోవైపు ఆధార్తో రేషన్కార్డులను అనుసంధానం చేస్తూ చేపట్టిన సీడింగ్ ప్రక్రియ 73 శాతం మాత్రమే పూర్తయింది. జిల్లాలో420మీ సేవా కేంద్రాలు ఉండగా,62కేంద్రా ల్లో ఆధార్ వివరాల సేకరణకు అనుమతిచ్చారు. బోగస్ ల బ్ధిదారుల ఏరివేతకు చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ చెబుతున్నా చర్యలు నామమ్రాత్రమే. బోగస్ కార్డుల వెనుక రేషన్డీలర్లు, చోటామోటా రాజకీయ నాయకుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకుం టేనే మరింతమంది అనర్హులు బయటపడతారనే భావన వ్యక్తమవుతోంది. -
జనమే జనం
సర్వే చిత్రం శివారుల్లో పెరుగుతున్న జనాభా వలసలతో పెరుగుతున్న కుటుంబాలు విద్యా సంస్థలూ ఓ కారణమే ఉద్యోగం కోసం...ఉపాధి కోసం వలస వచ్చేవారికి మేమున్నానంటూ గ్రేటర్లోని శివారు ప్రాంతాలు ఆశ్రయమిస్తున్నాయి. అక్కునచేర్చుకుంటున్నాయి. గూడు కల్పిస్తున్నాయి... ఫలితంగా ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. అదీ మామూలుగా కాదు... జెట్ స్పీడుతో. ఇదేదో అంచనాతో చెబుతున్న మాట కాదు.. సమగ్ర కుటుంబ సర్వే సాక్షిగా వెల్లడైన వాస్తవం. నగరంలో భారమైన అద్దెలు...పెరుగుతున్న కాలుష్యం...వెరసి జనాలను శివారు బాట పట్టిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లోని శివారు ప్రాంతాల్లో గడచిన మూడేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దాదాపు రెండింతలైంది. కోర్ సిటీ కంటే శివార్లలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఎల్బీనగర్లో మూడేళ్ల క్రితం 1,39,419 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం అవి 2,26,796కు చేరాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లిల్లోనూ గణనీయంగా కుటుంబాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్లో గతంలో 94,875 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షలకు చేరాయి. అంటే సంఖ్య దాదాపు రెట్టిం పైంది. కూకట్పల్లిలో 1,27,655 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 2,10, 343కు పెరిగాయి. సగటున కుటుంబానికి నలుగురిని లెక్కేసుకున్నా నాలుగు లక్షల జనాభా పెరిగింది. ఉప్పల్ సర్కిల్లో మాత్రం పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గతంలో 41,188 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 6,441 కుటుంబాలు పెరిగి, మొత్తం 47,629కు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి-2, మల్కాజిగిరి సర్కిళ్లలో 40 వేలకు పైగా పెరిగాయి. చాలా కుటుంబాల వారు ఉమ్మడిగా ఉంటున్నప్పటికీ.. జనగణనలో విడివిడిగా నమోదు చేయించుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకోని పక్షంలో భవిష్యత్లో గ్యాస్, పాస్పోర్టు వంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోననే తలంపుతో ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. కోర్సిటీలోని ఖైరతాబాద్, అబిడ్స్ వంటి సర్కిళ్లలో పెరుగుదల పెద్దగా లేదు. వలస వచ్చే కుటుంబాలు.. జీవనోపాధి కోసం వచ్చేవారు శివారుల్లోనేఎక్కువగా ఉంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. శివార్లలో లెక్కకు మిక్కిలి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు కూడా అక్కడ జనాభా పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పిల్లల చదువుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కోర్సిటీలో అద్దెల భారంతో పాటు కొత్త నిర్మాణాలు లేనందున అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టం కావడంతో నగరానికి వలస వచ్చేవారు శివార్లకే మొగ్గు చూపుతున్నారు. -
ఆసక్తి రేకెత్తిస్తున్న సర్వే వివరాలు!
హైదరాబాద్: నగరంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరిస్తున్న వివరాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని ఒక పక్కన చెబుతుంటే, సర్వేలో కుటుంబాలు, జనాభా, భవనాలు అన్నీ ఎక్కువగా ఉన్నట్లు తేలుతోంది. ఈ కారణంగా జిహెచ్ఎంసి పరిధిలో ఈరోజు సర్వే పూర్తి అయ్యే అవకాశం లేదు. మరో రెండు రోజులపాటు సర్వే చేయవలసి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల సర్వేను పొడిగించే అవకాశం ఉంది. ఈ విషయం కాసపేట్లో అధికారికంగా ప్రకటిస్తారు. హైదరాబాద్లో జనాభాలెక్క, కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అనుకున్న దానికన్నా 5 లక్షల మేర కుటుంబాల సంఖ్య పెరిగింది. భవనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోని కుటుంబాల సంఖ్యను లెక్కించడానికి సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అర్థరాత్రి వరకూ సర్వే కొనసాగిస్తారు. అప్పటికీ పూర్తి కాకపోతే రేపు కూడా కొనసాగించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో సర్వే ఇంకా మొదలుకాలేదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. కొన్నిచోట్ల చిరునామాలతో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి నంబర్లు సరిగాలేవు. ఎన్యూమరేటర్లు అవస్తలు పడుతున్నారు. ఎన్యూమరేటర్లు రాపోతే ప్రజలు అధికారులకు స్వయంగా ఫోన్లుచేస్తున్నారు. -
పాడి రైతుపై కరువు పోటు
నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో మెట్ట ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పాడి ద్వారానైనా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. చినుకు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా నీటి చుక్క నేల రాకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి పచ్చిగడ్డి, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె, రెండు లీటర్లు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోవడం చూడలేక పలువురు కబేళాలకు తరలిస్తున్నారు. ఉదయగిరి: జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలిలోని మెట్ట మండలాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలోనూ నీరు పూర్తిగా అడుగంటాయి. వాగులు, వంకలు, చెరువులు నెర్రెలు బారాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు కష్టాలు తప్పలేదు. గణనీయంగా తగ్గిన దిగుబడి జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్లు విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచే పాల దిగుబడి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ఏటా వేసవిలో పాల దిగుబడి తగ్గటం సహజమే. కానీ జూన్లో కురిసే తొలకరులతో మళ్లీ పాల దిగుబడి పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలాఖరులోనూ వరుణుడు కరుణించలేదు. దీంతో మేత కొరత తీవ్రమైంది. నీటి ఆధారంగా సాగుచేసే పచ్చిగడ్డి ఎండిపోయింది. ఎండుగడ్డి ధర ఆకాశాన్నంటడంతో కొనే పరిస్థితి లేదు. ఒక్క ట్రాక్టరు గడ్డి ధర రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఇది రెండు గేదెలకు మూడు నెలలు వస్తుంది. ఇంత ధర పెట్టి రైతులు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు పాతిక వేల లీటర్ల పాల సేకరణ కూడా జరగడం లేదు. మార్కెట్లో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియలాంటి ప్రైవేటు డెయిరీలకు కూడా కరువు పోటు తప్పలేదు. ధర పెరిగింది..ఖర్చులు పెరిగాయి ఈ ఏడాది పాల ధర ఆశాజనకంగానే ఉంది. పది శాతం వెన్న ఉంటే లీటరు పాలకు రూ.50 ఇస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.42 ఇచ్చారు. పాల ధర పెరిగినా కరువు పరిస్థితుల్లో దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిం ది. రోజుకు 8 లీటర్లు ఇచ్చే పాడి గేదె ప్రస్తుతం మూడు లీటర్లు కూడా ఇవ్వ డం లేదు. దీనికితోడు దాణా ఖర్చుల తో పాటు ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో పాల ధర పెరి గినా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. పట్టించుకోని ప్రభుత్వం ఒకవైపు కరువుతో పంటలు పండక పల్లె జీవనం పూర్తిగా దెబ్బతింది. పంటల ఆధారంగా జీవనం సాగించే రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక చిక్కుల్లో సతమతమౌతున్నాయి. పాడి ద్వారా అయినా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు ఇక్కడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాలానికి ఎదురీదుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆదుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
శ్రీ జయ నామ సంవత్సరం - శుభముహూర్తాలు 2014 -15
చైత్ర మాసం ఏప్రిల్ 4 శుక్ర, శు.పంచమి, రోహిణి నక్షత్రం, మిథున లగ్నం ప.11.54కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 5 శని, షష్టి తత్కాల సప్తమి, మృగశిర నక్షత్రం మకర లగ్నం రా.2.12కు వివాహాలు. 9 బుధ, దశమి, పుష్యమి నక్షత్రం, వృషభలగ్నం ఉ.8.53కు అన్నప్రాశన, శంకుస్థాపన, ఉపనయన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 10 గురు, దశమి తత్కాల ఏకాదశి, మఖ నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.9.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు, 11 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి మఖ నక్షత్రం, మిథున లగ్నం ప.11.31కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 17 గురు, బ.విదియ తత్కాల తదియ, అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.11.53కు వివాహ, గృహప్రవేశాలు. 20 ఆది, పంచమి తత్కాల షష్టి , మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ప.11.54కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, సాధారణ పనులు. 21 సోమ, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, రా.11.34కు గర్భాదాన, గృహప్రవేశాలు. 22 గురు, దశమి, ధనిష్ట నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.50కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు. తిరిగి రా.11.22కు శతభిషం నక్షత్రం, ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 25 శుక్ర, ఏకాదశి, శతభిషం నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.45కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, దేవతాప్రతిష్ఠలు. వైశాఖ మాసం మే 1 గురు,శు.విదియ తత్కాల తదియ, రోహిణి నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు., రా.12.34కు మకరలగ్నంలో వివాహాలు. 2 శుక్ర, తదియ తత్కాల చవితి, మృగశిర నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.7.40కు వివాహ, గృహప్రవేశాలు, మకర లగ్నం రా.12.21కు వివాహాలు. 5 సోమ, షష్టి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, దేవతాప్రతిష్ట, క్రయవిక్రయాలు. పుష్యమి నక్షత్రం, వృశ్చికలగ్నంలో రా.7.29కు గర్భాదానం. 7 బుధ, అష్టమి తత్కాల నవమి, మఖ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.32కు వివాహ, గర్భాదానాలు. 8 గురు, నవమి, మఖ నక్షత్రం, వృశ్చికలగ్నం రా.7.16కు వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 10 శని, ఏకాదశి, ఉత్తర నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.34కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 12 సోమ, త్రయోదశి, చిత్త నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.36కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 15 గురు, బ.పాడ్యమి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.18కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. రా.9.59కు ధనుస్సు, రా.11.28కు మకరలగ్నాలలో వివాహ, గర్భాదానాలు. 17 శని, తదియ, మూల నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు. రా.11.24కు మకరలగ్నంలో వివాహాలు. 19 సోమ, పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 22 గురు, అష్టమి తత్కాల న వమి, శతభిషం నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు. 23 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం రా.10.58కు వివాహాలు, గర్భాదానాలు. జ్యేష్ఠ మాసం జూన్ 1 ఆది, శు.చవితి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 2 సోమ, పంచమి, పుష్యమి నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.06కు అన్నప్రాశ న, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, దేవతాప్రతిష్ట, ఉపనయనాలు. తిరిగి రా.10.18కు మకరలగ్నంలో గృహప్రవేశాలు. 4 బుధ, షష్టి తత్కాల సప్తమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.52కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహ, ఉపనయనాలు. 12 గురు, చతుర్దశి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.7.29, కర్కాటక లగ్నం 8.26కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 13 శుక్ర, పౌర్ణమి తత్కాల బ.పాడ్యమి, మూల నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.8.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. 14 శని,బ. పాడ్యమి తత్కాల విదియ, మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. 16 సోమ, చవితి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటకలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 20 శుక్ర అష్టమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, సింహలగ్నం ఉ.11.09కు అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, వివాహాలు. తె.4.05కు రేవతి నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, శంకుస్థాపనలు. 21 శని, నవమి, రేవతి నక్షత్రం, సింహలగ్నం ఉ.11.02కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. తె.4.03కు అశ్వని నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు. 22 ఆది, దశమి, అశ్వని నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.7.44కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, దేవతా ప్రతిష్టలు, క్రయవిక్రయాలు. ఆషాఢమాసం జూలై 2 బుధ,శు.పంచమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం, ఉ.7.09కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 4 గురు, సప్తమి, ఉత్తర నక్షత్రం, సింహ లగ్నం ఉ.10.10కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, ప.3.34కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు. 7 సోమ, దశమి, స్వాతి నక్షత్రం, సింహలగ్నం ఉ.9.57కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు. 13 ఆది, బ.పాడ్యమి, ఉత్తరాషాఢ నక్ష త్రం, కర్కాటక లగ్నం ఉ.6.24కు సాధారణ కార్యాలు, ప.2.58కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 14 సోమ, విదియ, శ్రవణం నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.6.19కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 18 శుక్ర, సప్తమి, రేవతి నక్షత్రం, వృశ్చికలగ్నం ప.2.42కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. రిజిస్ట్రేషన్లు. శ్రావణమాసం ఆగస్టు 1 శుక్ర, శు.పంచమి తత్కాల షష్టి, హస్త నక్షత్రం, ధనుస్సు లగ్నం సా.4.56కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 10 ఆది, పౌర్ణమి, శ్రవణం నక్షత్రం, కుంభలగ్నం రా.8.10కు సాధారణ కార్యాలు, శుభకార్యాల ప్రస్తావన. 11 సోమ, బ.పాడ్యమి, ధనిష్ఠ నక్షత్రం, సింహలగ్నం ఉ.7.43కు అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.12.44కు వృషభలగ్నంలో గృహప్రవేశాలు. 13 బుధ, చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. రా.12.32కు వృషభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. 14 గురు, చవితి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు, వృషభలగ్నం రా.12.32కు, మిథున లగ్నం తె.3.21కు వివాహ, గృహప్రవేశాలు, 15 శుక్ర, పంచమి, రేవతి నక్షత్రం ధనుస్సు లగ్నం సా.4.03 క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, సాధారణ కార్యాలు. తె.3.17 మిథునలగ్నం వివాహాలు. 20 బుధ, దశమి, మృగశిర నక్షత్రం, కన్యాలగ్నం ఉ.8.43కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. భాద్రపద మాసం సెప్టెంబర్ 1 సోమ, శు.సప్తమి, అనూరాధ నక్షత్రం, మకరలగ్నం సా.4.24కు వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు. 5 శుక్ర, ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం మకరలగ్నం సా.4.18కు సాధారణ కార్యాలు, వ్యాపారాలు. 6 శని, ద్వాదశి, శ్రవణం నక్షత్రం, వృశ్చికలగ్నం ప.11.23కు అన్నప్రాశన, వ్యాపారాలు, ఆర్ధిక వ్యవహారాలు. 10 బుధ, బ.పాడ్యమి తత్కాల విదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం ప.3.49కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 12 శుక్ర, చవితి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.3.42కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 26 శుక్ర, శు.విదియ తత్కాల తదియ, చిత్త నక్షత్రం, మకరలగ్నం ప.2.47కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 27 శని, తదియ, స్వాతి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.1.12కు వ్యాపార, సాధారణ కార్యాలు. ఆర్థిక లావాదేవీలు. అక్టోబర్ 1 బుధ, ఆశ్వయుజ శు.సప్తమి, మూల నక్షత్రం, మకరలగ్నం ప.2.27కు వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 3 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం సా.4.35కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 ఆది, ద్వాదశి, ధనిష్ఠ నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.12.40కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 8 బుధ, పౌర్ణమి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం సా.4.17కు వ్యాపారాలు, ఆర్థిక లావాదే వీలు. 9 గురు, బ.పాడ్యమి, ఆశ్వని నక్షత్రం, ధనుస్సులగ్నం ప.12.24కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 17 శుక్ర, నవమి, పుష్యమి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.11.54కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 19 ఆది, ఏకాదశి, మఖ నక్షత్రం, మకర లగ్నం ప.1.16కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. కార్తీక మాసం అక్టోబర్ 26 ఆది, శు.తదియ, అనూరాధ నక్షత్రం, మకర లగ్నం ప.12.48కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 30 గురు, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, వృశ్చికలగ్నం ఉ.7.48కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. నవంబర్ 1 శని, కార్తీక శు.నవమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.2.43కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 బుధ, త్రయోదశి, రేవతి నక్షత్రం, మీన లగ్నం ప.3.09కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 6 గురు, పౌర్ణమి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.12.04కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. రిజిస్ట్రేషన్లు. 9 ఆది, బ.తదియ, రోహిణి నక్ష త్రం, మకరలగ్నం ప.11.50కు సాధారణ కార్యాలు, ఆర్థిక, వ్యాపార లావాదేవీలు. 13 గురు, సప్తమి, పుష్యమి నక్షత్రం మకరలగ్నం ప.11.36కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 17 సోమ, దశమి, ఉత్తర నక్షత్రం, మకరలగ్నం ఉ.11.17కు సాధారణ కార్యాలు, అన్నప్రాశనలు, వ్యాపారాలు. మార్గశిర మాసం డిసెంబర్ 3 బుధ, శు.ద్వాదశి, అశ్వని నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 7 ఆది, బ.పాడ్యమి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.32కు అన్నప్రాశన, గృహప్రవేశ, వివాహ, వ్యాపారాలు. సింహలగ్నంలో రా.11.55కు వివాహ, గృహప్రవేశాలు. 10 బుధ, చవితి, పుష్యమి నక్షత్రం ధనుస్సు లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, గృహప్రవేశాలు, వ్యాపార లావాదేవీలు. తులాలగ్నం తె.4.12కు గృహప్రవేశాలు. 12 శుక్ర, షష్టి, మఖ నక్షత్రం, తులాలగ్నం తె.4.07కు వివాహ, గృహప్రవేశాలు. 13 శని, సప్తమి, పుబ్బ నక్షత్రం, కుంభలగ్నం ప.11.54కు సాధారణ కార్యాలు. 14 సోమ, నవమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సులగ్నం ఉ.7.57కు, కుంభలగ్నం ఉ.11.46కు అన్నప్రాశన, గృహప్రవేశాలు,క్రయవిక్రయాలు. 17 బుధ, దశమి, తత్కాల ఏకాదశి, చిత్త నక్షత్రం, మేషలగ్నం ప.2.54కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. పుష్యమాసం డిసెంబర్ 24 బుధ, శు.తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం ప.11.14కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 26 శుక్ర, పంచమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.11.06కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 27 శని, షష్టి, శతభిషం నక్షత్రం, కుంభలగ్నం ప.11.03కు అన్నప్రాశన, వ్యాపార లావాదేవీలు. 28 ఆది, సప్తమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మేషలగ్నం ప.2.10కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. జనవరి - 2015 7 బుధ, బ.విదియ, పుష్యమి నక్షత్రం, మకరలగ్నం ఉ.8.02 అన్నప్రాశన, వ్యాపారాదులు. 11 ఆది, షష్టి, ఉత్తర నక్షత్రం, మీనలగ్నం ఉ.10.44కు సాధారణ కార్యాలు. మాఘమాసం జనవరి 22 గురు, శు.తదియ, ధనిష్ఠ నక్షత్రం,, మిథునలగ్నం సా.4.44కు క్రయవిక్రయాలు, వ్యాపారాదులు. ధనుస్సు లగ్నం తె.5.30గంటలకు వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 24 శని, చవితి తత్కాల పంచమి,ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.1.15 వివాహాలు. 25 ఆది, పంచమి, రేవతి నక్షత్రం తులాలగ్నం రా.1.11 వివాహాలు. 29 గురు, దశమి, రోహిణిన క్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.02 వివాహాలు, గృహప్రవేశాలు. 30 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.01 వివాహాలు, గృహప్రవేశాలు. 31 శని, ద్వాదశి, మృగశిర నక్షత్రం, మేషలగ్నం ఉ.11.53 ఉపనయనం, వివాహ, గృహ ప్రవేశాలు. ఫిబ్రవరి 2 సోమ, చతుర్దశి, పుష్యమి నక్షత్రం, తులాలగ్నం రా.12.41 గృహప్రవేశాలు. 4 బుధ, బ.పాడ్యమి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.12.34 వివాహాలు,ధనుస్సు లగ్నం తె.4.41 వివాహాలు, గృహప్రవేశాలు. 6 శుక్ర, బ.విదియ తత్కాల తదియ, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.32 వివాహాలు, గృహప్రవేశాలు. 9 సోమ, బ.పంచమి, చిత్త నక్షత్రం,, మేషలగ్నం ఉ.11.22 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 11 బుధ, బ.సప్తమి, స్వాతి నక్షత్రం, మేషలగ్నం ఉ.11.11 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. 12 గురు, అష్టమి తత్కాల నవమి అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.09 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 14 శని, దశమి తత్కాల ఏకాదశి, మూల నక్షత్రం, మకర లగ్నం తె.5.31 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 15 ఆది, ఏకాదశి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.10.54 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. ఫాల్గుణమాసం ఫిబ్రవరి 21 శని, శు.తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.11.26 వివాహాలు, ధనుస్సులగ్నం తె.3.33 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 22 ఆది, శు.చవితి, రేవతి నక్షత్రం, తులాలగ్నం రా.11.22 వివాహాలు, గర్భాదానాలు. 25 బుధ, శు.సప్తమి తత్కాల అష్టమి, రోహిణి నక్షత్రం, తులాలగ్నం రా.11.10 వివాహాలు. మార్చి 1 ఆది, శు.ఏకాదశి తత్కాల ద్వాదశి, పునర్వసు నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.49 శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 2 సోమ, ద్వాదశి తత్కాల త్రయోదశి, పుష్యమి నక్షత్రం,, ధనుస్సు లగ్నం రా.2.57 శంకుస్థాపన, గృహప్రవేశాలు. 4 బుధ, చతుర్దశి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.10.41 వివాహాలు, ధనుస్సు లగ్నం రా.2.48 వివాహాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 6 శుక్ర, బహుళ పాడ్యమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.2.39 వివాహాలు,శంకుస్థాపన, గృహప్రవేశాలు. 7 శని, విదియ, ఉత్తర నక్షత్రం మేష లగ్నం ఉ.9.35 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, శంకుస్థాపనలు. ధనుస్సు లగ్నం రా.2.37 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 8 ఆది, తదియ, హస్త నక్షత్రం, మేషలగ్నం ఉ.9.30 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. రా.10.24 చిత్త నక్షత్రం, తులా లగ్నంలో వివాహాలు. 9 సోమ, చవితి, చిత్త నక్షత్రం, మేష లగ్నం ఉ.9.26 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, వ్యాపారాలు. 11 బుధ, పంచమి తత్కాల షష్టి, అనూరాధ నక్షత్రం తులాలగ్నం రా.10.12 వివాహాలు. 12 గురు, షష్టి తత్కాల సప్తమి, అనూరాధ నక్షత్రం మేష లగ్నం ఉ.9.15 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు, ఉపనయనం, శంకుస్థాపనలు. 14 శని, నవమి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.9.07 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు ఉపనయనం శంకుస్థాపనలు. 15 ఆది, దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు లగ్నం రా.2.03 వివాహ, గృహప్రవేశాలు.