Head
-
తలకు మర్దనా చేస్తున్నారా..?
తలకు మర్దనా చేస్తున్నారా ..?. అయితే ఈ కొద్దిపాటి చిట్కాలు ఫాలోకండి. కేశ సౌందర్యానికే కాదు మన ఆరోగ్యానికి మంచిదట. ఇలా మర్దన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవుతాయంటున్నారు నిపుణులు. పైగా మనసుకు తేలిగ్గా అనిపించడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవట. మరీ అనుసరించాల్సిన చిట్కాలేంటో చూద్దామా..!.తలకు మసాజ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తంగా వలయాకారంగా మర్దన చేసిన తర్వాత క్రాస్స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి బొటన వేలు – చూపుడు వేలిని మాత్రమే వాడాలి. రెండు వేళ్లలో ఇమిడేటంత జుట్టును కుదుళ్లకు దగ్గరగా పట్టుకుని ఇంగ్లిష్ అక్షరం ఆకారంలో అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా నుదుటి దగ్గర నేరుగా పాపిడి తీసే దగ్గర మొదలు పెట్టి తల వెనుక వరకు వెళ్లి తర్వాత పక్కనే మరొక వరుస... ఇలా తలంతా చేయాలి.ఇక పించింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి అన్నివేళ్లనూ వాడాలి. రెండు వేళ్లతో గిచ్చడం కాకుండా అన్నివేళ్లతో పుర్రెను గిచ్చుతున్నట్లు (గోళ్లు తగలకూడదు) ఒత్తిడి కలిగించాలి. చివరగా మరొకసారి తలంతా వలయాకారంగా మర్దన చేయాలి. ఇంతటితో తలకు మసాజ్ పూర్తవుతుంది. మసాజ్ పూర్తయిన తర్వాత పది నిమిషాలకు తలస్నానం చేస్తే ఆహాయి రెండు– మూడు రోజులు ఉంటుంది. ఈ మసాజ్ కేశ సౌందర్యానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని రకాల తలనొప్పులు, ఒత్తిడి కారణంగా వచ్చే చికాకులు మాయమవుతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.క్రమం తప్పకుండా జుట్టుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే జుట్టు రాలడం, చిట్లిపోవడం, చుండ్రు మొదలైన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు. వంశపారంపర్యంగా కాక పోషకాహార లోపం వల్ల, సంరక్షణలోపం వల్ల చిన్న వయసులోనే తెల్లబడడాన్ని సమర్థంగా నివారించవచ్చు. టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నాబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి, మెల్లగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. (చదవండి: పారిపోవాలని అనిపిస్తోంది..! ఈ సమస్య నుంచి బయటపడేదెలా..?) -
Mahakumbh Mela 2025: పర్యావరణం బాబా..ఏకంగా తల పైనే పంటలు పండిస్తున్నాడు..!
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ మహా కుంభమేళ(Mahakumbh Mela 2025)లో రకరకాల బాబాలు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. పావురం బాబా నుంచి, ఇంజనీర్ బాబాల వరకు అందరిది ఒక్కో నేపథ్యం కానీ వాందర్నీ ఒకచోట చేర్చింది ఈ ఆధ్యాత్మికతే. ఈ కుంభమేళాలో కొందరి బాబాల బ్యాగ్రౌండ్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంకొందరూ అందరి హితం కోరేలా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన మరో బాబా ఈ మహాకుంభమేళలో హైలెట్గా నిలిచాడు. పర్యావరణ స్ప్రుహ కలిగించేలా అతడి ఆహార్యం ఎలా ఉందే చూస్తే కంగుతింటారు.ఈ పర్యావరణ బాబా పేరు అనాజ్ వాలే బాబా(Anaaj Wale Baba). ఈయన ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన బాబా. పర్యావరణం కోసం ఎంతమంది పాటుపడ్డారు. కానీ ఈ బాబా అత్యంత విభిన్నమైన శైలిలో పాటుపడుతూ..అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పంటలనే(crops) ఏకంగా తన తల(Head)పై పండిస్తున్నాడు. మిల్లెట్లు, గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీల(wheat, millet, gram, and peas)తో సహా చాలా రకాల పంటలను తలపై పండించాడట. ఈ అసాధారణ ప్రయత్నాన్ని గత ఐదేళ్లు నుంచి చేస్తున్నట్లు తెలిపాడు ఆ బాబా. కేవలం అటవీ నిర్మూలనపై అవగాహన పెంచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే తన అసాధారణ ప్రయత్నం వెనుకున్న లక్ష్యమని అన్నారు అనాజ్ వాలే బాబా. చెట్లు నరకడం వల్ల యావత్తు ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం చూపుతుందో తెలియడంతో ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన అసాధారణ విధానమైన పనితో ప్రజలు ప్రభావితమై మరిన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చేస్తారనేది తన ఆశ అని అన్నారు. ఈ కారణాల రీత్యా మహా కుంభమేళా కోసం కిలా ఘాట్ సమీపంలో ఉంటున్న ఈ అనాబ్ వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షించేలా హైలెట్గా నిలిచారు. ఈ కుంభమేళాకి వచ్చే సందర్శకులు అతడి అసాధారణమైన ప్రయత్నానికి ఫిదా అవ్వడమే గాక ఆశ్చర్యపోతున్నారు. అంకితభావంతో తలపై మొక్కలను పెంచుతున్నారు. క్రమతప్పకుండా వాటికి నీళ్లు పోసి వాటి బాగోగులు చూస్తుంటారా బాబా. ఆయన దీన్ని హఠ యోగతో మిళితమైన పర్యావరణ కార్యకర్తగా చెబుతుంటాడు. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక, పర్యావరణ బాధ్యతల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మేళా ముగినిస తర్వాత కూడా ఈ అనాజ్ వాలే బాబా సోన్భద్రకు తిరిగి వచ్చి అటవీకరణ, పర్యావరణంతో ఈ పుడమి కళకళలాడేలా ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, ఈ మహా కుంభమేళాలో సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించేలా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా, ఫిబ్రబరి 26,2025తో పూర్తవనుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో సాన్నాలు చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!
కొంతమందికి తలనొప్పి తరచు వేధిస్తు ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. ఎందుకు వస్తుందో తెలియదు సడెన్గా వచ్చి ఏ పని చెయ్యనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నివారించాలంటే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో వారి మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.కంప్యూటర్పై పనిచేసేవారు కంటిపై ఒత్తిడి పడకుండా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించవచ్చు. అలాగే ప్రతి గంట తర్వాత కంప్యూటర్ తెరపై నుంచి చూపు తప్పించి కాసేపు రిలాక్స్ అవాలి కంప్యూటర్పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన సంక్లిష్టమైన (ఇంట్రికేట్) డిజైన్లు అల్లే సమయంలో అదేపనిగా పనిచేయకుండా తరచూ బ్రేక్ తీసుకుంటుండటం మంచిది తమకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతలపానియాలకు దూరంగా ఉండాలి ఫలానా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అ΄ోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసకోవడం సరికాదు రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల తలనొప్పులు రాకుండా నివారించవచ్చురోజూ కనీసం ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. కొన్నిసార్లు నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి తమ సౌకర్యం మేరకు నిద్రపోవడం మంచిది. ఒకవేళ ఈ సూచనల తర్వాత కూడా తలనొప్పి వస్తుంటే డాక్టర్ను సంప్రదించాలి. (చదవండి: గాంధీ జయంతి 2024: భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!) -
తల మసాజ్ వల్ల పక్షవాతం
బనశంకరి: కటింగ్ షాపులో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్కీపింగ్ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు. ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు. వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు. -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్లోని బ్రెయిన్బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
మా నాయినే! కొబ్బరికాయను తలకేసి కొట్టుకున్నాడు
కొబ్బరికాయను రాయిపై కొడితే పగులుతుంది. నుదుటిపై కొడితే? వైరల్ అవుతుంది! విషయంలోకి వస్తే... తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కొబ్బరికాయ పట్టుకొని పూజాపీఠం దగ్గర శ్లోకాన్ని జపించాడు. ఆ తరువాత తల పైకి లేపి కొబ్బరికాయను నుదుటి మీద కొట్టుకున్నాడు. ‘యాక్షన్కు రియాక్షన్’ అనేది ప్రకృతి ధర్మం కదా! సదరు వ్యక్తి వెంటనే కుప్పకూలి΄ోయాడు. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా వ్యక్తి చర్యను నెటిజనులు ఖండించారు. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్’, ‘గాయపడింది నువ్వు కాదు... కొబ్బరికాయ’లాంటి సరదా కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
ఈ హెడ్బ్యాండ్తో అల్జీమర్స్కు చెక్!
గాగుల్స్, హెడ్ఫోన్స్తో కూడిన ఈ హెడ్బ్యాండ్ అల్జీమర్స్కు చెక్పెడుతుంది. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ ఇటీవల ఈ హెడ్బ్యాండ్ను రూపొందించింది. దీనిని తలకు పెట్టుకుంటే, ఇది విడుదల చేసే కాంతి, ధ్వని తరంగాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ బాధితుల్లో మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరు బాగా నెమ్మదిస్తుంది. వారు ఈ హెడ్బ్యాండ్ను ధరించినట్లయితే, స్వల్పకాలంలోనే మెరుగైన ఫలితాలను పొందగలరని ‘కాగ్నిటో’ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరానికి అమెరికా జాతీయ ‘ఆహార ఔషధ సంస్థ’ (ఎఫ్డీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ హెడ్బ్యాండ్ తయారీ బృందానికి ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ వ్యవస్థపాకులు, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) న్యూరోసైంటిస్టులు లీ హ్యూయెయి సాయి, ఎడ్ బోడెన్ నేతృత్వం వహించారు. అల్జీమర్స్ ప్రారంభ దశ నుంచి నడి దశ వరకు గల రోగులకు ఈ పరికరం చక్కగా పనిచేస్తుందని వారు తెలిపారు. దీనిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి ‘కాగ్నిటో’ నిధులు సమకూర్చుకుంటోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 'అరుధంతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
విన్ఫాస్ట్ ఆసియా హెడ్గా జాక్ హోలిస్
స్కోడా ఆటో ఇండియా మాజీ బ్రాండ్ డైరెక్టర్ 'జాక్ హోలిస్' (Zac Hollis) వియత్నామీస్ ఈవీ మేజర్ విన్ఫాస్ట్లో ఆసియా హెడ్గా చేరారు. స్కోడా కోసం ఇండియా 2.0 వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హోలిస్, ఇప్పుడు విన్ఫాస్ట్ ఇండియా రోల్ అవుట్ ప్లాన్ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే వియత్నామీస్ ఈవీ నిపుణులు దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,600 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే హోలిస్ దీని బాధ్యతలు స్వీకరించారు. జరిగిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని తూత్తుకుడిలో విన్ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 3,000 నుంచి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ సదుపాయంలో వార్షిక తయారీ సామర్థ్యం 1,50,000 యూనిట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి స్కోడా ఇండియాలో జాక్ హోలిస్ 2018లో స్కోడా ఆటోకు సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్గా నియమితులైన హోలిస్.. భారతదేశంలో కంపెనీ వృద్ధికి నాలుగు సంవత్సరాలు కృషి చేశారు. ఆ తరువాత స్కోడా నుంచి హోలిస్ వెళ్లిపోవడంతో స్కోడా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోయింది. 2018 కంటే ముందు ఈయన చైనాలో స్కోడా చైనా విక్రయాలను వృద్ధి చేయడంలో ఒకరుగా ఉన్నారు. -
మీ తలలో 'గుయ్య్య్' మంటూ సన్నని శబ్దమా.. అయితే జాగ్రత్త!
'చెవి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్య్య్ మంటూ హోరు. ఇలా గుయ్మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.' టినైటస్తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది. ఎందుకిలా జరుగుతుందంటే.. ఈ కింది అంశాలు టినైటస్కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి.. చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు ముప్పుగా పరిణమించే అంశాలు.. సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే.. నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం. వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. నిర్ధారణ.. దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని.. బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు. వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు. ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం. చికిత్స / మేనేజ్మెంట్.. అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి. ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి. కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు. డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! -
ఆదిత్య బిర్లా గ్రూప్నకు కొత్త హెచ్ఆర్ హెడ్
భారతీయ ప్రముఖ వ్యాపార సమ్మేళనం ఆదిత్య బిర్లా గ్రూప్ తమ కొత్త హెచ్ఆర్ హెడ్ను ప్రకటించింది. ముందస్తు పదవీ విరమణ తీసుకుంటున్న సంతృప్త్ మిశ్రా స్థానంలో అశోక్ రామ్చంద్రన్ను డైరెక్టర్ (హెచ్ఆర్) గా నియమించింది. నియామక మార్పులు 2024 జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయి. అశోక్ రామ్చంద్రన్ ప్రస్తుతం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2015 నుంచి ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్లో కొనసాగుతున్నారు. గ్రూప్లో చేరడానికి ముందు వోడాఫోన్ ఇండియాలో హెచ్ఆర్ డైరెక్టర్గా పనిచేశారు. హెచ్ఆర్ విభాగంలో అశోక్ రామచంద్రన్కు 34 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక డాక్టర్ సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్లో 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హెచ్ఆర్ గ్లోబల్ డైరెక్టర్, అలాగే బిర్లా కార్బన్ గ్రూప్ డైరెక్టర్, కెమికల్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మిశ్రా 1996లో హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్గా గ్రూప్లో చేరారు. -
18 ఏళ్లుగా తలలో బుల్లెట్తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..
ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట దిగింది? ఎవరా వ్యక్తి అంటే..! యోమెన్కి చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్తోనే జీవించాడు. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్ కారణంగా చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది. ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్ కరెక్ట్గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్రే సాయంతో బుల్లెట్ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్ యెమెన్కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. (చదవండి: ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..) -
కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్ చేయడం నిషేధం..కానీ..!
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ డివైసెస్ ద్వారా అభ్యర్థుల మాల్ప్రాక్టీస్లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు,మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్లో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 2023 అక్టోబర్లో KEA నిర్వహించిన పరీక్షల్లో కల్బుర్గి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ ఉపయోగించారన్న ఆరోపణలపై ప్రభుత్వం నవంబర్ 11న CID విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్ను నిషేధించడంపెద్ద దుమారాన్ని రేపింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. -
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
ఒత్తిడితో బాధపడుతున్నారా? దీన్ని తలకు ధరించండి చాలు
మనసు ఆహ్లాదంగా ఉంటేనే మొహం మెరుస్తుంది. అలసట లేని అందం కావాలంటే.. హ్యాండ్స్–ఫ్రీ హెడ్ మసాజర్ మీ ఇంట్లో ఉండాల్సిందే. ఈ ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్.. మొత్తం నాలుగు వైబ్రేషన్ మోడ్స్తో పనిచేస్తుంది. దీన్ని తలకు పెట్టుకుంటే.. రక్త ప్రసరణ పెరుగుతుంది. నిద్రలేమి దూరమై.. హాయిగా నిద్రపడుతుంది. అలసట మాయమవుతుంది.ఉద్యోగులు, డ్రైవర్లు, క్రీడాకారులు, వృద్ధులు, అలసటతో ఉన్న వారు, కార్మికులు, తలనొప్పి లేదా ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. యాక్టివ్ మోడ్, రిలాక్స్ మోడ్, బ్యూటీ మోడ్, స్లీప్ మోడ్ ఇలా.. ప్రతి మోడ్ భిన్నంగా ఉంటుంది. కావల్సిన ఆప్షన్ను ఈజీగా ఎంచుకోవచ్చు. చూడటానికి సాలెపురుగులా ఉన్న ఈ మసాజర్ పొడవాటి పది ఫ్లెక్సిబుల్ టూల్స్.. చేతి వేళ్ల మాదిరిగా తలను పట్టి ఉంచుతాయి. లోపలి భాగంలో బాల్స్ లాంటి మెత్తటి నాలుగు టూల్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి తలకు మృదువైన వైబ్రేషన్ లభిస్తుంది. సుమారు 15 నిమిషాలు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అన్ని తెలిసిన స్టార్టర్స్కైనా.. ఆప్షన్స్ పెద్దగా తెలియని పెద్దవాళ్లకైనా దీని వాడడం సులభం. మెషీన్ను స్టార్ట్ చేయడానికి లేదా షట్ డౌన్ చేయడానికి పవర్ బటన్ ను 3 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. మోడ్ మారడానికి అదే బటన్ ఉపయోగపడుతుంది. హైక్వాలిటీ సిలికాన్తో రూపొందిన ఈ డివైజ్ చాలా తేలికగా.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది. డిజైన్ను బట్టి దీని దీని ధర ఉంటుంది. -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్పుత్లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్పుత్ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్పుత్లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. భర్త నోట్ బుక్లో ఏముంది?
ఒక వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బంధీగా ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు టార్చర్ చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు సెమీన్యూడ్ స్థితిలో శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం జర్మనీలో చోటుచేసుకుంది. ఫోను చేతికి చిక్కడంతో.. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు జర్మనీలోని ఫోర్బ్యాక్ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 2011లో భర్త ఆమెను కిడ్నాప్ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనను గత కొన్నేళ్లుగా హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడని అరెస్టు చేశారు. తరువాత అతనిని.. భార్య తెలిపిన చిరునామాకు తీసుకువచ్చారు. అయితే నిందితుడు తన భార్యను దాచివుంచిన టార్చర్ రూం చూపించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసుల తమదైన శైలిలో అతని చేత టార్చర్ రూమ్ తలుపులు తెరిపించారు. సెమీ న్యూడ్గా బాధితురాలు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది. భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు. టార్చర్ రూమ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. నోట్ బుక్లో టార్చర్ వివరాలు ఆ ఇంటి ఇరుగుపొరుగువారు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. ఫ్రాన్సిసీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం పోలీసులకు ఆ ఫ్లాట్లో ఒక నోట్ బుక్ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం. ఇది కూడా చూడండి: చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు.. ఆ ట్రాప్లో పడితే ... అంతే సంగతులు ! -
ట్రాన్స్జెండర్ల పైశాచికం.. గుండు కొట్టించి.. ఆపై మూత్ర విసర్జన చేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఐదుగురు ట్రాన్స్జండర్లు కలిసి ఓ వ్యక్తికి గుండు కొట్టింటారు. అనంతరం అతనిపై మూత్రం పోశారు. అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. జులై 26న ఈ ఘటన జరిగింది. కాగా.. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాఫికుల్.. నిందితురాలి ఇంట్లో పనిచేసేవాడు. ఇటీవల అక్కడ పని మానేసి మరో ట్రాన్స్జండర్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పుపై కోపాన్ని పెంచుకున్న నిందితురాలు.. రాఫికుల్ని మార్గమధ్యలో పట్టుకుని గుండు కొట్టించింది. అనంతరం అతనిపై మూత్రం పోశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
కాలేజీ విద్యార్థి హత్యలో బిగ్ ట్విస్ట్.. మూడు రోజుల ముందే స్కెచ్ వేసి..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థిని(25)ని ఓ యువకుడు ఇనుప రాడ్డుతో బాది హతమార్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్లో జరిగింది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినినిగా గుర్తించారు. మూడు రోజుల ముందే పథకం ప్రకారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఇర్ఫాన్గా గుర్తించారు. బాధితురాలు ఇర్పాన్ ప్రేమించుకున్నారు. కానీ ఇర్ఫాన్కు సరైన ఉద్యోగం లేని కారణంగా వివాహానికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యువతి ఇర్పాన్తో మాట్లాడటం మానేసింది. స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేసే ఇర్ఫాన్.. తన తమ్ముడికి కూడా వివాహం కుదరడంతో అవమానానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో.. బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనింగ్కు వెళుతుందని ముందే తెలిసి మూడు రోజుల ముందే పథకం పన్నాడు. పార్కుకు పిలిచి ప్రేమ వ్వవహారంపై ప్రశ్నించాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. బాధితురాలిని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్లో స్టెనోగ్రఫీ కోచింగ్కి బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాలవీయ నగర్లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్లో ఓ బాలిక మృతదేహం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. బాధితురాలు తన ఫ్రెండ్తో కలిసి పార్కుకు వచ్చినట్లు తెలుస్తోంది. యువతి తలకు బలమైన గాయం తగిలింది. ఆమె మృతదేహం పక్కనే ఇనుప రాడ్డు పడి ఉంది.' అని ఢిల్లీ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని కొట్టి చంపారు. ఢిల్లీలో రక్షణ కరవైంది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు ఆగడం లేదని ట్వీట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష ఒక్కటే సరైనది.. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి ఏదైనా తక్కువేనని బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఉన్నది ఒక్కతే కూతురని చెప్తూ విలపించారు. #WATCH | Woman murdered in Malviya Nagar | "We need death penalty for the accused, nothing less. I had only one daughter…I won’t leave him”, father of the victim breaks down pic.twitter.com/TEQkhiqRwf — ANI (@ANI) July 28, 2023 ఇదీ చదవండి: ప్రొఫెసర్ ఘాతుకం.. తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు.. -
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
తొమ్మిదేళ్ల చిన్నారి తలలోకి కత్తెర దిగడంతో..
ఇంట్లో చిన్నారులు ఉంటే చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి వారిని. ఎప్పటికప్పుడూ వేయికళ్లతో పర్యవేక్షించాలి. ఏమరుపాటున పదునైన వస్తువులో లేదా ప్రమాదకరమైన పరికరాలో సమీపంలో ఉంచామో ఇక అంతే. ఇక్కడ కూడా ఓ చిన్నారి విషయంలో అలానే జరిగింది. ఆ చిన్నారి తల్లిందండ్రలు కడు పేదవాళ్లు. దీంతో వారి బాధ అంత ఇంత కాదు. ఇంతకీ ఆ చిన్నారికి ఏమైందంటే.. ఈ షాకింగ్ ఘటన ఫిలప్పీన్స్లో చోటు చేసుకుంది. 9 ఏళ్ల పాఠశాల విద్యార్థిని నికోల్ తలలో కత్తెర దిగింది. దీంతో ఆ చిన్నారి బాధ అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..ఆ చిన్నారి తన సోదరుడితో పెన్సిల్ విషయమై గొడవపడింది. దీంతో ఆ బాలుడు కోపంతో కత్తెర తీసుకుని ఆ చిన్నారి తల వెనుక దాడి చేశాడు. అది అనుకోకుండా తలలోకి బలంగా దిగింది. ఈ అనూహ్య ఘటనతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ చిన్నారికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. కడు పేదవాళ్లైనా ఆ తల్లిదండ్రుల ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు తట్టుకునే శక్తి లేక విలవిల్లాడింది. దీంతో ఆ చిన్నారి ఆ కత్తెరతోనే వారం పాటు ఆస్పత్రిలో గడపాల్సి వచ్చింది. ఐతే స్థానికులు అతడి పరిస్థితి చూసి.. సాయం చేసేందుకు ముందకు రావడంతో ఆ చిన్నారికి జులై 9న విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ చిన్నారి తండ్రి తమ కూతురు శస్త్ర చికిత్సకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలంటూ భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి త్వరితగతిన కోలుకుంటుందని, ఆమె మెదడుకు ఎలాంటి నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. అంతేగాదు ఆ చిన్నారి తండ్రి ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు వారి సమీపంలో ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు. (చదవండి: పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది..మళ్లీ భార్యే..) -
ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. మహిళా కమిషన్ సీరియస్
పెళ్లిళ్లలో మోటు హాస్యాలు, స్నేహితుల ప్రాంక్లు శృతి మించుతున్నాయి. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టే సమయంలో వధూవరుల తలలను మెల్లగా తాడించాలనే సంప్రదాయం కేరళలో రభస సృష్టించింది. అల్లరి బంధువొకరు వధూవరుల తలలను పట్టి ‘ఠాప్పు’మనిపించడంతో వధువు బేర్మంది. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి బంధువు పరార్ అయ్యాడు. మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. అత్తగారు కళ్లొత్తుకుంటూ ఇదంతా చూస్తూ కోడలితోపాటు నెత్తి కొట్టుకుంది. మొన్నటి శుక్రవారం సాజిలా అనే అమ్మాయికి, సచిన్ అనే అబ్బాయికి పెళ్లి జరిగింది. ఊరు పాలక్కాడ్లోని పల్లస్సేనా అనే చిన్న పల్లె. ఇక వరుణ్ణి, వధువును ఇంట్లోకి ఆహ్వానించాలి. మన దగ్గర ఆ సమయంలో కొన్ని హాస్యాలు, పరాచికాలు నడిచినట్టే అక్కడ కూడా ఏవో చిన్న చిన్న సరదాలు ఉంటాయి. గుమ్మం ముందు నిలుచున్న వధువు సాజిలా, వరుడు సచిన్ బంధువులకు నమస్కారాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో చిన్న సాంగెం బాకీ ఉండిపోయింది. అదేంటంటే వధువు, వరుడు ఒకరి తలను ఒకరు మెల్లగా తాడించుకోవాలి. కాని దీనికోసమే వారి వెనుక చేరిన ఒక అల్లరి బంధువు ఇద్దరి తలలూ పుచ్చుకుని ఠపీమనిపించాడు. ఇందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని వధువు ఠారెత్తిపోయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించి ఆ తర్వాత కన్నీటి చుక్కలు రాలి పడ్డాయి. శుభమా అంటూ అత్తారింట్లో కాలు పెడుతుంటే ఏమిటిది అని ఆ అమ్మాయి ఆ వీడియోని తన ఇన్స్టాలో పెట్టింది. అంతే. క్షణాల్లో 20 లక్షల వ్యూస్ వచ్చాయి. కేరళ అంతా ఈ వీడియో ప్రచారమయ్యి ‘ఇలాంటి సాంగేలు ఇంకా ఉన్నాయా’ అని కొందరు, ‘కుర్రాళ్ల ప్రాంక్లు శృతి మించుతున్నాయ’ ని ఒకరు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. గగ్గోలు రేగేసరికి ఆ తలలు కొట్టించిన బంధువు ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. జరిగిందేదో జరిగింది అనుకుందామనుకున్నా ఈ లోపు కేరళ మహిళా కమిషన్ రంగంలో దిగి సుమోటోగా ఈ ఉదంతాన్ని తీసుకుంది. ‘వధువుకు ఎవరు ఇలాంటి బాధ కలిగించారో తేల్చండి’ అని తాకీదులిచ్చింది. యూట్యూబ్ చానెళ్లు వధూవరుల వెంట పడ్డాయి. ప్రచారం కోసమో సానుభూతి కోసమో వధువు విపరీతంగా తల పట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇవన్నీ చూస్తూ పాపం పెళ్లికొడుకు, పెళ్లికొడుకు తల్లి తల కొట్టుకుంటున్నారు. ఇదొక్కటే కాదు పెళ్లిళ్లలో పిచ్చిపనులు చేయాలనుకునేవారు బాగా తయారయ్యారు. పర్యవసానాలు అర్థం చేసుకుని నవ వధూవరులను సంతోషంగా సౌకర్యంగా ఉంచడమే అందరూ చేయవలసిన పని. -
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
HYD: మలక్పేట్లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మలక్పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మలక్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్యాడ్తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో హత్య చేసి, ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమీర్పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య -
పాము తల కట్ చేసి..కాసేపు అయ్యాక తాకాడు.. అంతే ఒక్కసారిగా పైకి ఎగిరి
పాములు అంటే చాలామందికి భయం.. కొంతమంది పాము కనపడితే చాలు అరకిలోమీటర్ ఆగకుండా పరుగెత్తుతారు. ఈ విష సర్పాల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా అది మన ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతెందుకు వందల పాములు పట్టిన వ్యక్తులు కూడా చివరికి అదే పాము కాటుకు బలైన ఘటనలు ఇటీవల వింటూనే ఉన్నాం. ఓ పాము శిరచ్చేధనం చేసిన కూడా దాడికి యత్నించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంటర్నట్ వాడకం పెరిగినప్పటి నుంచి ప్రజలకు ఏది కావాలన్నా అన్ని మొబైల్లోనే ప్రత్యక్షమవతున్నాయి. దీంతో ఎక్కడ ఏది జరిగినా వాటిని చిత్రీకరించి నెట్టింట షేర్ చేయడం షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెటిజన్లను నవ్వించగా, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ, ఇంకొన్ని భయపెడుతుంటాయి. తాజాగా ఓ వీడియోలో.. తల లేని పాము పక్కన ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. తీవ్రంగా గాయపడి ఉండడం, తల లేకుండా కదలకుండా ఉండేసరికి అది చనిపోయి ఉందని నిర్థారించుకుంటాడు. ఇంతలో ఆ వ్యక్తి సడన్గా ఆ పాము తోక తాకగానే రెప్పపాటులో అది దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో గతంలో జరిగిన తాజాగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. -
ఎండలకి ఆ మాత్రం ఉండాల్రా భయ్! బిగ్బీని ఆకట్టుకున్న వీడియో
-
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్ను క్యాన్సర్స్ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121 -
వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు
ఇటీవల కాలంలో మనుషులు చాల ఘోరంగా తయారవుతున్నారు. ఏదో వివాదం తలెత్తితే చాలు హత్యలు దాక వెళ్లిపోతున్నారు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వినేందుకే జుగుప్పకరంగా ఉంటున్నాయి ఆ ఘటనలు. అచ్చం అలాంటి ఘటనే జార్ఖండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో 20 ఏళ్ల గిరిజన యువకుడు 24 ఏళ్ల తన బంధువుని అతి కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటన ముర్హు ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల తండ్రి తన కొడుకు కను ముండా డిసెంబర్ 1న ఇంట్లో ఒక్కడే ఉన్నాడనొ, మిగతావాళ్లంతో పొలాలకు వెళ్లారని చెప్పారు. తాము ఇంటికి తిరిగి వచ్చి చూడగా కను కనిపించలేదు. దీంతో మృతుడి తండ్రి కొడుకు కోసం గాలించి విఫలమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో తన మేనల్లుడు సాగర్ ముండా, అతని స్నేహితులే తన కొడుకుని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. విచారణలో... నిందితులు కనుని దారుణంగా నరికి చంపి, తెగిపడిన తలతో నిందితుడు, అతని స్నేహితులు సెల్ఫీలు దిగారని చెప్పారు. మృతుడి మొండం గోప్లా అడవిలోనూ తల 15 కిలో మీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే ఓ భూమి విషయమై మృతుడి కుటుంబానికి, నిందితుల కుటుంబాలకి మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని చెప్పారు. పోలీసులు మృతుడితో సహా నిందితుల దగ్గర ఉన్న ఐదు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, ఎస్యూవీ కారుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల తోపాటు ప్రధాన నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని...) -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
మెటా ఇండియా హెడ్ గా విశాఖకు చెందిన సంధ్య నియామకం
-
మెటా ఇండియా కొత్త బాస్: ఆమె ప్రత్యేకతలివే!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్గా సంధ్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటా వైస్ప్రెసిడెంట్గాకూడా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో మెటా యాజమాన్యం సంధ్యా దేవనాథ్ను నియమించింది. 2023 జనవరి1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించ నున్నారని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ ఒక ప్రకటనలో తెలిపారు. మెటా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన తరువాత సంధ్యా దేవనాథన్ను మెటా ఇండియా కొత్త హెడ్గా నియమించడం విశేషం. 2000లో ఢిల్లీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన సంధ్యా నూతన పదవీ బాధ్యతలను స్వీకరించేందుకు త్వరలోనే ఇండియాకు రానున్నారు. గ్లోబల్ బిజినెస్ లీడర్గా పేరొందిన సంధ్యా దేవనాథన్కు బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతికతలో 22 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది. 2016 నుంచి సంధ్యా దేవనాథన్ మెటాలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) మార్కెట్లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ బోర్డ్లో కూడా పనిచేస్తున్నారు. కాగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇండియా హెడ్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఇటీవల రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించిన కొన్ని రోజులకే వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
కర్కశత్వం: పార్కింగ్ వివాదం...ఇటుకతో కొట్టి చంపేశాడు
న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఘజియాబాద్లో చోటుచేసుకుంది. బాధితుడు వరణ్ రోడ్డు వద్ద ఉండే తినుబండారాలకు సమీపంలో తన కారుని పక్కగా ఆపాడు. ఐతే వరుణ్ పార్కింగ్ వద్ద నిందితుడి కారు కూడా ఉంది. వరుణ్ అక్కడే పార్కింగ్ చేయడం వల్ల కారు డోర్లు ఓపెన్ చేయడం కుదరదు. దీంతో సదరు వ్యక్తి కోపంతో వరుణ్తో పార్కింగ్ విషయమై గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్ణణకు దారితీసింది. దీంతో నిందితుడు కోపంతో ఇటుకతో వరుణ్ తలను పగలుగొట్టి చంపి పారిపోయాడు. అందుకు సంబంధించిన ఘటనను ఒక పాదాచారి రికార్డు చేయడంతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని, వరుణ్ డైరీ బిజినెస్ చేస్తుంటాడని చెబుతున్నారు పోలీసులు. అంతేగాదు అదే సమయంలో బాధితుడి స్నేహితుడు దీపక్ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత దారుణంగా శత్రువులను కూడా హతమార్చరంటూ బాధితుడి స్నేహితుడు దీపక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్, మరోకరు అఘాయిత్యాలు) -
క్లాస్రూమ్లో హఠాత్తుగా ఫ్యాన్ పడటంతో విద్యార్థినికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నాంగ్లోయ్లోని ఒక ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా విద్యార్థిని పై పడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. ప్రస్తుతం సదరు విద్యార్థిని నాంగ్లోయ్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వాస్తవానికి క్లాస్ రూమ్ గదిలో పైన ఉన్న సీలింగ్ తడిగా ఉండి బొట్టుబొట్టుగా నీరు కారుతోందని విద్యార్థిని చెబుతుంది. దీంతో సీలింగ్ తడికి నానిపోయి విరిగి పోవడంతోనే ప్యాన్ పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆగస్టు 27న క్లాస్ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్యాన్ కుప్పకూలిపోయిందని వెల్లడించింది. ఐతే ఈ ఘటనపై ప్రభుత్వం గానీ, స్కూల్ యాజమాన్యంగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిని వాపోయింది. (చదవండి: నకిలీ బంగారం పెట్టి.. కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా) -
భోజనం చేస్తుండగా ప్లేట్లో ‘పాము తల’ ప్రత్యక్షం.. షాకింగ్ దృశ్యాలు వైరల్
Snake Head In Flight Meal, ఇస్తాంబుల్: భోజనం చేస్తున్న సమయంలో అందులో బల్లి బయటపడిన సంఘటనలు చాలానే చూశాం. కానీ, భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్లో పాము తల కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. అలాంటి అనుభవమే టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి ఎదురైంది. విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ సంఘటన జులై 21న జరిగినట్లు ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్డార్ఫ్కు వెళ్తున్న సన్ఎక్స్ప్రెస్ విమానంలో అందులోని సిబ్బందికి ఈ అనుభవం ఎదురైనట్లు పేర్కొంది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించినట్లు చెప్పాడు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనను ఖండించారు ఎయిర్లైన్స్ ప్రతినిధి. ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే తమ లక్ష్యం.’ అని పేర్కొన్నారు. Severed snake head found in a Sunexpress in-flight meal. The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it. Dead snails have previously appeared in the airline’s flight meals. A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK — Handy Joe (@DidThatHurt2) July 26, 2022 మరోవైపు.. భోజనంలో పాము తల తమ ప్రాంతం నుంచే వచ్చిందనే వాదనలను తిరస్కరించింది కాంట్రాక్ట్ సంస్థ. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఒక్క వస్తువును వంటలో వేయలేదని పేర్కొంది. 280 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉడికించిన వంటలో.. తాజాగా ఉన్న పాము తల ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది? వంట వండిన తర్వాత దానిని వేసి ఉంటారని పేర్కొంది. ఇదీ చదవండి: ‘లిక్కర్ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా! -
గొంగళి పురుగుకి త్రిభుజాకారపు తల ఎందుకంటే!
గొంగళిపురుగు సీతాకోక చిలుకలా మారుతుందని తెలుసు కానీ.. పాముగా మారుతుందని మీకు తెలుసా? అవును.. ఈ గొంగళి పురుగు పాములా మారుతుంది. ఇది ఆ ప్రకృతి దానికి ఇచ్చిన వరం. అదేమిటబ్బా అనుకుంటున్నారా? అవును.. ఈ గొంగళి పురుగు కథ చాలా ప్రత్యేకం. హెమెరోప్లేన్స్ ట్రిప్టోలెమస్ అనే శాస్త్రీయనామం కలిగిన ఈ పురుగులు.. అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దక్షిణ అమెరికా... ఈక్వెడార్లోని ప్యూయోలో ఇవి చెట్లపై పాకుతుంటాయి. మామూలుగా చూస్తే... ఇది సాధారణ గొంగళి పురుగు లాగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి డిస్టర్బ్ చేశామంటే మాత్రం విశ్వరూపం చూపిస్తుంది. ఒక్కసారిగా తన రూపాన్ని మార్చేసుకుంటుంది. ఏ పక్షో వాటిని చూసి.. ‘చిన్న పురుగే కదా’ అనుకుని.. లటుక్కున తీసుకుని, చటుక్కున నోట్లో వేసేసుకోకుండా ఉండేందుకు ఈ మాయాజాలాన్ని ప్రదర్శిస్తాయి ఈ గొంగళి పురుగులు. తమని తాము రక్షించుకునేందుకు తలను, త్రిభుజాకారపు పాము తలలా మార్చేసుకుంటాయి. అప్పుడు వాటిని తినడానికి వచ్చిన శత్రువులకు అవి పాముల్లా కనిపించి భయపడి పారిపోతాయి. తల గుండ్రంగా ఉండే పాముల్లో విషం తక్కువగా ఉంటుంది. అదే తల త్రిభుజాకారంలో ఉండే పాములకు విషమెక్కువ ఉంటుంది. అందుకే ఈ పురుగుకి త్రిభుజాకారపు తలను వరంగా ఇచ్చి.. ప్రకృతి గొప్ప మేలే చేసింది. మార్పు మంచికే మరి. -
వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సహారా మొదటి గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం ఉదయం మృత శిశువు తలను కుక్కలు తీసుకువచ్చాయి. దీనిని గుర్తించిన స్థానిక పాలబూత్ యజమాని కుక్కను తరిమి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మొండెం కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రసవం కోసం భార్య పుట్టింటికి.. భర్త తల నరికి గుడి ముందు ఉంచి..
హోసూరు: పెయింటర్ తలను నరికి మారియమ్మ ఆలయం ముందు ఉంచిన ఘటన కలకలం రేపింది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కొడుకు ప్రదీప్ (25). ఇతనికి చంద్రిక అనే యువతితో పెళ్లయింది, ఇద్దరు పిల్లలున్నారు. ప్రసవం కోసం భార్య పుట్టింటికెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రదీప్ తలను నరికి అదే ప్రాంతంలోని మారియమ్మ ఆలయం ముందు ఉంచి వెళ్లారు. బాగలూరు పోలీసులు పరిశీలించగా దేహం కొంచెం దూరంలో కనిపించింది. ఎస్పీ సాయ్చరణ్ తేజస్వి, హోసూరు డీఎస్పీ శివలింగం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన బంధువులు సంతోష్, మురళితో ప్రదీప్కు గత 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని, వారే హత్య చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు... వీటిని మనుషులు తింటే భయంకరమైన వ్యాధులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు జిల్లా మంచిర్యాలలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ‘సాక్షి’ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్లో మాఫియా దందా బయటపడింది. నమ్మలేని నిజాలు అనేకం వెలుగు చూశాయి. ఈ మాఫియా దందా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న యువకులు మాఫియాకు చికెన్ మార్కెట్ల అడ్డా... రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, ఎఫ్సీఐ తదితర ప్రాంతాల్లోని చికెన్ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. పక్క జిల్లాకు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు బల్దియా అధికారులతోపాటు చికెన్ మార్కెట్ వ్యాపారులు సహకరిస్తున్నారు. చికెన్ వ్యర్థాల సేకరణే టార్గెట్.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. పక్కా రూట్ మ్యాప్ ద్వారా సేకరణ చికెన్ వ్యర్థాలను సేకరించడానికి ఈ మాఫియా పక్కా రూట్ మ్యాప్ అమలు చేస్తోంది. ముందుగా గోదావరిఖని చికెన్మార్కెట్కు చేరుకుని హోల్సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున వ్యర్థాలను సేకరించిన అనంతరం ఎల్బీనగర్, తిలక్నగర్, మార్కండేయకాలనీ, ఫైవింక్లయిన్ మీదుగా యైటింక్లయిన్కాలనీ చేరుకుంటుంది. ఈరూట్ మ్యాప్లోని అన్ని చికెన్సెంటర్ల నుంచి వ్యర్థాలను ముఠా సేకరిస్తుంది. మాఫియాకు సహకరిస్తున్న వ్యాపారులు చికెన్ వ్యర్థాలను సేకరించే మాఫియాకు పారిశ్రామిక ప్రాంతంలోని చికెన్ సెంటర్ల వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్ఫిష్ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా బడా వ్యాపారులు, నాయకులు, అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి రామగుండం నగరపాలక సంస్థకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ.వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేసి వరంగల్కు చెందిన ఓ కాంట్రాక్టర్కు చికెన్ వ్యర్థాలను సేకరించే పనిని అప్పగించారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ రూ.5వేలు బల్దియాకు ఫీజు రూపంలో చెల్లించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను సదరు కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లాలోని ఓ కంపెనీకి తరలిస్తామనేది ఒప్పందం. ఇలా కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2 మెట్రిక్ టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలు వెలువడుతాయి. ఈలెక్కన బల్దియాకు రోజుకు రూ.2వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సదరు కాంట్రాక్టర్కు వ్యర్థాలను మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను కాంట్రాక్టర్కు కాకుండా అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలించడం వివాదాస్పదంగా మారుతోంది. -
ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి..
కాబుల్: అఫ్గనిస్తాన్లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిపాలన పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. ఆ ఇంటర్యూలో.. కోచ్ అఫ్జలీ అక్టోబర్లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది. ( చదవండి: VIDEO: బాబోయ్ అంత పెద్ద కొండచిలువనా? ఈ వైరల్ వీడియో వెనుక కథేంటంటే.. ) ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్గ్రౌండ్లో కూడా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత వారం, ఫిఫా, ఖతర్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు. మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. బాలికల్లోనూ అత్యధికులు సెకండరీ స్కూలుకు వెళ్లడం కూడా మానేశారు. భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. Mahjabin Hakimi, a member of the Afghan women's national volleyball team who played in the youth age group, was slaughtered by the Taliban in Kabul. She was beheaded. @EUinAfghanistan @unwomenafghan https://t.co/wit0XFoUaQ — Sahraa Karimi/ صحرا كريمي (@sahraakarimi) October 19, 2021 చదవండి: Woman Eats Her Dead Husband Ashes: భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మం కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ.. -
తల లేని మేక.. చూసేందుకు ఎగబడుతన్న జనం.. ఎక్కడంటే !
క్రిష్ణగిరి( బెంగళూరు ): సూళగిరి సమీపంలోని గంగసంద్రం గ్రామానికి చెందిన నరసింహన్ మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను పెంచుతున్న ఓ మేక తలలేని మేకపిల్లకు జన్మనిచ్చింది. రెండు చెవులు మాత్రమే బయటకు ఉన్నాయి. తల లేని మేక పుట్టిందని ప్రచారం కావడంతో జనం గుంపులు గుంపులుగా వచ్చి చూశారు. ఆ వింత మేకపిల్ల కొంతసేపు మాత్రమే బతికి ఉంది. మరో ఘటన.. విద్యుత్ కోతల బెడద యశవంతపుర: బొగ్గు కొరత విద్యుత్ కోతలకు దారితీస్తోంది. బెంగళూరు నగరంలో ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున లోడ్ షెడ్డింగ్ (కోత)ను విధిస్తున్నారు. రాత్రిపూట కూడా అప్పుడప్పుడు కరెంట్ను తీసేస్తున్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరగకుండా కరెంట్ కట్చేస్తారు. అయితే అనేక ప్రాంతాల్లో వానలు లేకపోయినా కరెంటు పోతోంది. కొన్నిచోట్ల రెండు గంటలకు పైగా కోత పడుతోంది. గురువారం ఆయుధ పూజ పండుగ రోజున విద్యుత్లో పదేపదే అంతరాయం కలగటంపై ప్రజలు అసమాధానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంధన మంత్రి సునీల్ కుమార్ ఆకస్మికంగా బెంగళూరులోని బెస్కాం సహాయవాణి ఆఫీసును తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎలా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. చదవండి: చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే.. -
కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!
ఆగ్రా: పొరపాటున చిన్నారి తల ప్రెజర్ కుక్కర్లో ఇరుక్కుపోయింది. తల ఇరకడంతో ఆ చిన్నారి గిలగిలకొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తల బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇలా కాదని వెంటనే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. వైద్యులు మొదట ఆశ్చర్యానికి గురయి అనంతరం అత్యంత జాగ్రత్తతో కుక్కర్ను తొలగించి చిన్నారి తలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తమ కుమారుడిని కాపాడడంతో ఆ కుటుంబసభ్యులు వైద్యుల కాళ్లపై పడి ‘మీరు దేవుళ్లు’ అని కీర్తించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. (చదవండి: ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్స్టేషన్కే నిప్పు) ఆగ్రా లోహమండి ప్రాంతంలోని ఖటిపరాలో ఉన్న మేనమామ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చారు. తమతోపాటు 18 నెలల చిన్నారిని వెంట తీసుకున్నారు. ఇంట్లో అందరూ తమ పనుల్లో మునిగి ఉండగా ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రెజర్ కుక్కర్తో ఆడుకుంటుండగా పొరపాటున తల కుక్కర్లో ఇరుక్కుపోయింది. బాలుడు ఎందుకు రోదిస్తున్నాడో చూసిన కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. కుక్కర్ నుంచి తలను బయటకు తీసేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించారు. చివరకు ఫలితం లేకపోవడంతో వెంటనే ఎస్ఎం ఛారిటబుల్ ఆస్పత్రికి తరలించారు. కుక్కర్ను తొలగిస్తున్న ఎస్ఎం ఛారిటబుల్ ఆస్పత్రి వైద్యులు (ఫొటో: IndiaToday) అక్కడ వైద్యులు మొదట పరిశీలించి అత్యంత క్లిష్టమైన కేసుగా భావించారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా బాలుడి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉండడంతో వైద్యులు చాలా జాగ్రత్తతో తీసేందుకు ప్రయత్నించారు. అతికష్టమ్మీద దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి విజయవంతంగా చిన్నారి తలను బయటకు తీశారు. డాక్టర్ ఫర్హాత్ ఖాన్ నేతృత్వంలో వైద్య బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా చేశారు. కుక్కర్ను అత్యాధునిక యంత్రంతో కట్ చేయడంతో చిన్నారి తల క్షేమంగా బయటకు వచ్చింది. అయితే ఈ చికిత్సకు వైద్యులు ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం విశేషం. బాధితులు పేదలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డాక్టర్ ఫర్హాత్ఖాన్ తెలిపారు. చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి -
5 ఏళ్ల బాలుడికి రోజురోజుకూ పెరుగుతున్న 'తల'
ఇందూరు: నిరుపేద కుటుంబంతో విధి ఆటలాడుతోంది. ఐదేళ్ల బాలుడికి ‘తల’కు మించిన భారం తెచ్చి పెట్టింది. అనుకోని వ్యాధి అతడ్ని రాకాసిలా పట్టి పీడిస్తోంది. తమకు కలిగిన సంతాన్ని చూసి ఆనందించాల్సిన తల్లిదండ్రులకు అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. పిల్లాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ కుటుంబం పడరాని పాట్లు పడుతోంది. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీకాంత్, హారిక 2016 మార్చి 1న ఇద్దరు కవల పిల్లలు జని్మంచారు. అయితే, నెలలు నిండక ముందే జని్మంచిన ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక 41 రోజులకు కన్నుమూశాడు. మిగిలిన ఒక్క బాబునైనా ప్రేమగా చూసుకోవాలని తపించిన తల్లిదండ్రులకు అనుకోని ఆపద వచ్చి పడింది. ముద్దుగా శివయ్య (శివ) అని పేరు పెట్టుకున్న బాలుడికి ఐదో నెల నుంచే తల భాగం అనూహ్యంగా పెరగడం మొదలైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. వైద్యం చేయడానికి ఏ డాక్టరూ ముందుకు రాలేదు. కొన్ని చోట్ల స్కానింగ్లు తీయించారు. ఏవో రాసిచ్చిన కొన్ని మందులు కూడా వాడారు. అయినా ఫలితం కనిపించ లేదు. రోజు రోజుకు నీరు చేరి తల భాగం మాత్రం పెరుగుతోంది. తల భారంగా మారడంతో బాలుడికి అవస్థ కూడా ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. చివరికి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. పిల్లాడ్ని కాపాడాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయడం వీలు కాదని, చేసినా ప్రయోజనం ఉండదని, ఉన్నన్ని రోజులు బాగా చూసు కోండని చెప్పి పంపించి వేశారు. ఏం జరిగినా ఫర్వాలేదని, ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా వైద్యులు ఒప్పుకోలేదు. శివయ్యకు ఎన్ని సమస్యలో.. ఐదేళ్ల బాలుడు శివయ్యకు తల భారంతో పాటు కళ్లు సరిగ్గా కనిపించవు. కాళ్లు, చేతులు కూడా సక్రమంగా పని చేయవు. నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బాబుని ఎత్తుకోవడం, పడుకోబెట్టడం చేస్తున్నారు. ఆహారం కూడా ఏదీ తినడు. ద్రవ రూపంలో ఆహారం అందిస్తేనే జీర్ణం అవుతోంది. ఇందుకు కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతాన్ని తినిపిస్తున్నారు. ఇదే ప్రతి రోజూ ఆహారంగా మారింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ఏ డాక్టరు వైద్యం అందించడం లేదని, కనీసం మందులు కూడా రాసివ్వడం లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటి వరకు రూ.8 లక్షల పైనే ఖర్చు.. బాలుడి పరిస్థితిని చూసి అమ్మమ్మ అతడికి సపర్యలు చేస్తోంది. శ్రీకాంత్, హారిక దంపతులకు మరో సంతానం కలిగింది. మూడేళ్ల ఆ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే, శివయ్యకు వచ్చిన వ్యాధిని నయం చేయించడానికి అప్పులు చేసి, బంగారం అమ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. రూ.8 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆదుకోవాలని దాతలను కోరుతున్నారు. సదరం సరి్టఫికెట్ కోసం వచ్చి... శివయ్యకు ప్రభుత్వం అందించే దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని తండ్రి శ్రీకాంత్తో పాటు అమ్మమ్మ లక్ష్మి ఇటీవల కలెక్టరేట్కు వచ్చారు. వీరిని ‘సాక్షి’ కదిలించగా తమ గోడు వెల్లబోసుకున్నారు. సదరం సరి్టఫికెట్ కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న సదరం సెక్షన్ అధికారిని కలిశామని, సరి్టఫికెట్ ఇప్పించి పింఛన్ మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన అధికారులు సదరం సరి్టఫికెట్ ఇప్పించడానికి చర్యలు తీసుకున్నారు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 75691 44233 చదవండి : (ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు) (భూకంపం అనుకొని.. రోడ్లపైకి పరుగులు) -
కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్
మధుర: రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, గురువారం కోవిడ్-19 నిర్ధారణ అయింది. కృష్ణ జన్మాష్టమి వేడుకల నిమిత్తం మధుర వెళ్లిన ప్రస్తుతం ఆయనకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహంత్ ను మెరుగైన చికిత్స కోసం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించనున్నామని మధుర జిల్లా మేజిస్ట్రేట్ రామ్ మిశ్రా వెల్లడించారు. గతవారం (ఆగస్టు 5న) ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వేదికను పంచుకున్న ఈయన తాజాగా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేపింది. ఇదే వేదికపై యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఉండటం గమనార్హం. కాగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు కొన్ని రోజుల ముందు, పూజారి ప్రదీప్ దాస్ సహా మరో 14 మంది పోలీసులకుకూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. -
గూగుల్ సెర్చ్ హెడ్గా ప్రభాకర్ రాఘవన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థలో మరో భారతీయుడు కీలక పదవిని అలంకరించారు. భారతీయ అమెరికన్ అయిన ప్రభాకర్ రాఘవన్ గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల హెడ్గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న బెన్గోమ్ నూతన బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. ప్రభాకర్ ఐఐటీ మద్రాస్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేయగా, యూసీ బెర్క్లే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ అందుకున్నారు. ప్రభాకర్ రాఘవన్ గూగుల్లో 2012లో చేరగా, 2018లో గూగుల్ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగ హెడ్గా ఎంపికయ్యారు. అంతకుముందు గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్కు వైస్ ప్రెసిడెంట్గానూ పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వృద్ధిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది. ‘మన ఉత్పత్తుల విభాగాల్లో చాలా వాటిల్లో ఆయన పనిచేయడం వల్ల వాటి మధ్య అంతరాలను కచ్చితంగా గుర్తించగలరు. గూగుల్తో ఆయన అనుబంధం గూగుల్ను ముందుంచుతుంది’ అంటూ ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో గూగుల్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. -
బిందెలో చిన్నారి తల
చెన్నై,అన్నానగర్: మూడేళ్ల బిడ్డ ఆడుకుంటూ బిందె వద్దకెళ్లి తలదూర్చింది. ఇంకేముంది తల బిందెలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఆవడి సమీపంలో గురువారం కలకలం సృష్టించింది. ఆవడి సమీపంలోని కోవిల్పదాగై అశోక్ నగర్కు చెందిన శ్రీనివాసన్ చెన్నై పాడిలో ఉన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు దివ్యన్ (3). గురువారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్నదివ్యన్ తల బిందెలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సిల్వర్ బిందెలో నుంచి దివ్యన్ తలను బయటకు తీశారు. -
మనిషి తలతో వచ్చిన రైలు ఇంజిన్
చెన్నై,తిరువొత్తియూరు: ఈరోడ్లో ఓ రైలు ఇంజిన్ మనిషి తలతో వచ్చింది. వివరాలు..మైసూర్ నుంచి మైలాడుదురై వెళ్లే రైలు ఇంజన్ ఈరోడ్ నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. ఇందుకోసం రైలు ఇంజిన్ ఈరోడ్ డీజిల్ లోకో షెడ్కు వెళ్లింది. ఆ సమయంలో రైలు ఇంజిన్ ముందు భాగంలో మనిషి తల చిక్కుకొని వేలాడుతూ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న ఈరోడ్ రైల్వేస్టేషన్ సహాయ మేనేజర్ కలుశేఖరన్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. తరువాత మనిషి తలను బయటకు తీసి ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో తల ఖండించబడి ఇంజిన్కు చిక్కుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రైలు ఇంజిన్ వచ్చే మార్గంలో అన్ని రైల్వేస్టేషన్లకు దీని గురించి సమాచారం అందించారు. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో పసికందు తల భాగం
-
పట్టు ...విడుపు!
టాపార్డర్ను కూల్చినా... మిడిలార్డర్ను దెబ్బతీసినా... టీమిండియాకు తోక దెబ్బ మాత్రం తప్పలేదు. చిక్కిన పట్టును విడిచిపెట్టి... ప్రత్యర్థికి కోలుకునే అవకాశమిచ్చే బలహీనతను కోహ్లి సేన వీడలేదు. దీంతో ఆతిథ్య ఆస్ట్రేలియా... భారత్ ఆధిక్యానికి గండికొట్టింది. అజేయ అర్ధశతకం చేయడంతో పాటు... కీలక సమయంలో అర్ధశతక భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ట్రావిస్ హెడ్ జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. మన బౌలర్లు మరోసారి విజృంభించి... కంగారూల తొలి ఇన్నింగ్స్ను ఎంత త్వరగా ముగిస్తే అంత మేలు! అడిలైడ్: బ్యాటింగ్లో బలహీనంగా ఉన్నా, సొంతగడ్డపై అంత తేలిగ్గా ఏమీ తలొగ్గమని చాటుతోంది ఆస్ట్రేలియా. లోయరార్డర్ కథ ముగించలేని భారత్ బలహీనతే తమ బలంగా పోరాడుతూ, ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది ఆ జట్టు. ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ట్రావిస్ హెడ్ (149 బంతుల్లో 61 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆపద్బాంధవుడిగా నిలవడంతో టీమిండియా స్కోరుకు మరో 59 పరుగుల దూరంలో ఉంది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/50) మాయాజాలం, పేసర్లు ఇషాంత్ శర్మ (2/31), జస్ప్రీత్ బుమ్రా (2/34) దెబ్బకు తడబడినా... హ్యాండ్స్కోంబ్ (93 బంతుల్లో 34; 5 ఫోర్లు), కమిన్స్ (10)తో కలిసి హెడ్ నెలకొల్పిన భాగస్వామ్యాలతో కంగారూలు కోలుకున్నారు. అంతకుముందు ఓవర్నైట్ బ్యాట్స్మన్ షమీ (6)ని హాజల్వుడ్ (3/52) శుక్రవారం తొలి బంతికే ఔట్ చేయడంతో 250 వద్దే భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. దాదాపు అదే తీరుగా... ఒక్క బంతి మినహా రెండో రోజంతా సాగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్... అచ్చం మొదటి రోజు భారత బ్యాటింగ్ సాగిన తీరును తలపించింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతృప్తితో బరిలో దిగిన ఆసీస్ను మొదటి ఓవర్లోనే ఇషాంత్ దెబ్బతీశాడు. ఎదుర్కొన్న మూడో బంతినే డ్రైవ్ చేయబోయిన ఓపెనర్ అరోన్ ఫించ్ (0) బౌల్డయ్యాడు. అయితే, అరంగేట్ర ఓపెనర్ మార్కస్ హారిస్ (57 బంతుల్లో 26; 3 ఫోర్లు) వన్డౌన్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖాజా (125 బంతుల్లో 28; 1 ఫోర్) కొంతసేపు ప్రతిఘటించారు. రెండో వికెట్కు 45 పరుగులు జోడించారు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్కు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తొలుత అతడి ఫ్లయిటెడ్ డెలివరీని ఎదుర్కొనడంలో విఫలమైన హారిస్... సిల్లీ మిడాఫ్లో విజయ్కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. 57/2తో లంచ్కు వెళ్లిన ఆసీస్ను... విరామం అనంతరం తొలి ఓవర్లోనే రవిచంద్రన్ అశ్విన్ మరో దెబ్బకొట్టాడు. అతడి బౌలింగ్లో దూరంగా వెళ్తున్న బంతిని షాన్ మార్‡్ష (2) వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఓవైపు హ్యాండ్స్కోంబ్ పరుగులు రాబడుతున్నా, మరో ఎండ్లో క్రీజులో పాతుకుపోవడమే ఉద్దేశంగా కనిపించిన ఖాజాను అశ్విన్ చక్కటి బంతితో పెవిలియన్ చేర్చాడు. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా, భారత్ సమీక్షకు వెళ్లి సఫలమైంది. 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో వచ్చిన హెడ్కు హ్యాండ్స్కోంబ్ సహకారం అందించాడు. ఈ దశలో కోహ్లి టీ అనంతరం బుమ్రాను రంగంలోకి దించడం సత్ఫలితాన్నిచ్చింది. అతడి బౌలింగ్లో హ్యాండ్స్కోంబ్... కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు. ఉన్నంతసేపు ఇబ్బంది పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ (5)ను ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. వీరూ ‘ఏడు’పించారు... 127/6... పైన్ వెనుదిరిగేటప్పటికి ఆసీస్ స్కోరిది. హెడ్ మినహా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఔటవ్వగా ఆసీస్ సగం పరుగులు వెనుకబడే ఉంది. 150లోపే వారి ఇన్నింగ్స్ను ముగిస్తే భారత్కు మంచి ఆధిక్యం దక్కేది. కానీ, హెడ్ అడ్డుపడ్డాడు. బుమ్రా, ఇషాంత్, అశ్విన్లను దీటుగా ఎదుర్కొన్నాడు. వీలు చూసుకుని బౌండరీలు బాదాడు. 103 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. పరుగులు చేయకున్నా అవతలి ఎండ్లో కమిన్స్ పూర్తి సహకారం అందించాడు. వీరు ఏడో వికెట్కు 50 పరుగులు జోడించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. భారత ఇన్నింగ్స్లోనూ పెద్ద భాగస్వామ్యం (పుజారా–అశ్విన్ 62 పరుగులు) ఏడో వికెట్కే నమోదవడం విశేషం. అయితే, ప్రమాదకరంగా మారుతున్న హెడ్–కమిన్స్ జోడీని 81వ ఓవర్లో కొత్త బంతి అందుకున్న బుమ్రా విడదీశాడు. కమిన్స్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బ్యాట్స్మన్ సమీక్ష కోరినా ఔటనే తేలింది. మిగతా ఓవర్లను హెడ్, స్టార్క్ (8 బ్యాటింగ్) జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ఆట ముగించారు. సొంతగడ్డపై ఆసీస్ రోజంతా ఆడినా 2.17 రన్రేట్తోనే పరుగులు చేయగలిగింది. బౌలర్లూ భేష్... షమీ మినహా! షమీ మినహా శుక్రవారం టీమిండియా బౌలర్లంతా చక్కటి లయలో కనిపించారు. హెడ్–కమిన్స్ జోడీని విడదీయడంలో ఆలస్యం చేయడం కొంత దెబ్బకొట్టినా, మొత్తమ్మీద వారి శ్రమను తక్కువ చేయలేం. ముఖ్యంగా ఇటీవలి విదేశీ వైఫల్యాల నుంచి అశ్విన్ బయటపడ్డాడు. కోహ్లి మొదట్లోనే తనకు బంతి ఇచ్చినందుకు న్యాయం చేశాడు. అతడు వరుసగా 22 ఓవర్లు వేయడం విశేషం. అనుభవం లేని ఆసీస్ బ్యాట్స్మెన్కు ఇషాంత్, బుమ్రాలను కాచుకోవడం పెద్ద పనే అయింది. ఓ దశలో బుమ్రా 10 ఓవర్లు వేసి ఐదే పరుగులివ్వడం గమనార్హం. షమీ మాత్రమే తేలిపోయాడు. తొలి మూడు ఓవర్లను మెయిడెన్గా వేసిన అతడు తర్వాత గాడితప్పాడు. కొన్ని మంచి బంతులేసినా అవి వికెట్ ఇవ్వకపోగా, తన ప్రధాన బలహీనత అయిన పరుగులివ్వడాన్ని నిరోధించలేకపోయాడు. బ్యాటింగ్ సందర్భంగా కుడి భుజానికి బంతి తగలడం కూడా ప్రభావం చూపినట్లుంది. మూడో రోజు కీలకం... మ్యాచ్లో ప్రస్తుతం అటు ఆసీస్ ఇటు భారత్ సమఉజ్జీగా ఉన్నాయి. మిగిలిన మూడు వికెట్లకు జోడించే పరుగులు ఆతిథ్య జట్టుకు కీలకం కానుండగా, వారిని సాధ్యమైనంత త్వరగా ఔట్ చేసి రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు ద్వారా ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు టీమిండియా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఆట కీలకం కానుంది. తొలి టెస్టును గెలిచి, ఆసీస్ పర్యటనను అద్భుతంగా ప్రారంభించే అవకాశం ఇప్పుడు భారత బౌలర్లు, బ్యాట్స్మెన్పై సమంగా ఉంది. మ్యాచ్ పోటాపోటీగా ఉంది. బౌలింగ్లో సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని రెండు వైపుల నుంచి ఒత్తిడికి గురిచేశాం. పిచ్ క్రమంగా నెమ్మదిస్తోంది. రాబోయే రెండు రోజులు ప్రతి పరుగూ కీలకమే. అవకాశాలను అందిపుచ్చుకున్నవారి వైపే ఫలితం మొగ్గుతుంది. పిచ్ నుంచి అందిన సహకారంతో బ్యాట్స్మెన్ను ఆత్మరక్షణలోకి నెట్టగలిగాను. దాని ఫలితంగానే ఖాజా, మార్‡్ష వికెట్లు దక్కాయి. – భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇదో కఠినమైన రోజు. పరుగులు కష్టంగా వచ్చాయి. భారత్ బౌలింగ్ బాగుంది. హెడ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేం పోరాడుతున్నాం. పోటీలో ఉన్నాం. బౌలర్లపై ఒత్తిడి పెంచాలంటే వేగంగా పరుగులు సాధించాలి. కానీ, పిచ్ అలా లేదు. వేగాన్ని మారుస్తూ అశ్విన్ వైవిధ్యంగా బంతులేశాడు. మిగతా రెండు రోజుల్లో పిచ్ స్పిన్కు అనుకూలించవచ్చు. మా స్పిన్నర్ లయన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. – హారిస్, ఆసీస్ ఓపెనర్ -
‘నా తల బెలూన్లా ఉబ్బిపోయింది’
పారిస్ : బ్యూటి ఉత్పత్తులు వాడే ముందు వాటి మీద ఒక హెచ్చరిక తప్పక కనిపిస్తుంది. ‘ఈ ఉత్పత్తులను వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ (డైరెక్ట్గా వాడకుండా.. చేతి మీద లేదా చెవి వెనక వైపున రాసి చూడండి) చేయండి. 24 గంటల్లోపు ఏలాంటి చెడు ప్రభావం లేకపోతే అప్పుడు పూర్తిగా వాడండి’ అని ఉంటుంది. ఎందుకంటే సదరు ఉత్పత్తుల్లో వాడిన రసాయనాలు మన శరీరానికి సరిపోకపోతే దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఈ ప్యాచ్ టెస్ట్ ఓ మహిళ పాలిట శాపంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తలకు రంగేద్దామనుకుని హెయిర్ డైని ప్రయత్నిస్తే.. ఏకంగా తల ఆకారమే మారిపోయింది. వివరాలు.. పారిస్కు చెందిన ఓ పంతొమ్మిదేల్ల పడుచు తలకు కలర్ చేసుకుందామని సూపర్ మార్కెట్ నుంచి ఓ ప్రముఖ హెయిర్ డైని తీసుకొచ్చింది. ప్యాకెట్ మీద సూచించిన విధంగా ప్యాచ్ టెస్ట్ చేయడం కోసం కొద్దిగా రంగును తల మీద అప్లై చేసింది. కొద్ది సేపటికే తలలో విపరీతమైన దురద రావడంతో డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని మందులు, ఓ క్రీమ్ ఇచ్చారు. వాటిని వాడింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి సదరు యువతి తల అనూహ్యమైన రీతిలో ఉబ్బి పోయి కనిపించింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాక నాలుక కూడా ఉబ్బటంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె వాడిన హెయిర్ డైలో పారాఫినైలినిడయమినే(పీపీడీ) అనే రసాయనం ఎక్కువగా ఉందని తేల్చారు. ఈ రసాయనం వల్ల 56 సెంటీమీటర్లు ఉన్న యువతి తల ఏకంగా 63 సెంటీమీటర్లకు పెరిగింది. దీని గురించి సదరు యువతి ‘పొద్దున లేచే సరికే నా తల సైజు పెరిగి.. ఒక లైట్ బల్బ్గా మారింది’ అని తెలిపింది. యువతిని ఓ రోజంతా అబ్జర్వేన్లలో ఉంచిన డాక్టర్లు చివరకు ఆమె తలను పూర్వ స్థితికి తీసుకువచ్చారు. ముఖ్యండా హెయిర్ డైలో ఉండే ఈ పీపీడి రసాయనం వల్ల మూత్రపిండాలు పని చేయకపోవడం.. కండరాలు దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు కల్గుతాయంటున్నారు వైద్యులు. అందంగా తయారు కావడం కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. కాబట్టి మనం వాడే ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. -
హాహా హూహూ
‘‘మిత్రమా నీకో బ్రేకింగ్ న్యూస్ చెబుతాను’’ అంటూ ఇలా మొదలు పెట్టాడు భేతాళుడు...ఒకరోజున ఉదయం లండన్లో ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద జనం గుంపులు గుంపులుగా మూగియున్నారు. వారొక విచిత్రమైన జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారినన్ని విధాల ఆకర్షిస్తుంది. ఆ జంతువు దేహప్రమాణం చాలా పెద్దది. చచ్చిపోయినదో, మూర్ఛలో ఉన్నదో తెలియదు. ఇది జంతువా? మనుష్యుడో తెలియదు... ‘‘బ్రేకింగ్ న్యూస్ చెబుతానంటూ విశ్వనాథ వారి హాహా హూహూ నవల స్టార్టింగ్ పార్ట్ చెబుతున్నావేమిటయ్యా బాబూ’’ అని విసుక్కుంటూ ఆ భుజం మీద ఉన్న శవాన్ని ఈ భుజం వైపుకి మార్చుకున్నాడు విక్రమార్కుడు. ‘‘పుస్తకంలో రాసినది బయట జరగకూడదని ఎక్కడైనా ఉన్నదా?’’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు భేతాళుడు.... మెడవరకు మనిషి...తల మాత్రం నక్క తల. చేతి పదివేళ్లకూ పది రత్నపుటుంగరాలు ఉన్నాయి. భుజాల మీద భుజకీర్తులున్నాయి. శిరస్సున మెరిసే కిరీటం ఉన్నది. ఇది జంతువా? మనిషా? తెలియడం లేదు. ట్రాఫిక్ జామ్ అయినది. ఆఫీసులకు వెళ్లే వారు ఆఫీసుమానుకుని అక్కడే నిల్చొని చూస్తున్నారు. ఫంక్షన్లకు వెళ్లే వాళ్లు ఫంక్షన్లు మానుకొని అక్కడే నిల్చొని చూస్తున్నారు. కడుపు చెదిరి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసే వాళ్లు...ఆ పరుగాపి, తాము ఎందుకు పరుగెడుతున్నది కూడా మరిచి నిమ్మకు నీరెత్తినట్లు అక్కడ నిలబడి ఆ విచిత్ర జంతువును చూస్తున్నారు. ‘ఇది జంతువు అయినా దీనికి బట్టలెక్కడి నుంచి వచ్చినవి? నగలెక్కడివి?’ అని ఒకరు అన్నారు.‘ఎందుకైనా మంచిది’ అనే కాన్సెప్ట్లో భాగంగా ఆ జంతువు చుట్టూ ముళ్ల కంచె నిర్మించారు.విషయం తెలిసి ప్రపంచ ప్రసిద్ధ జంతుశాస్త్రవేత్తలందరూ ఈ కంచె దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. తాళపత్ర గ్రంథాల నుంచి డిజిటల్ గ్రం«థాల వరకు ఒకటే తిరిగేస్తున్నారు. ఏవో రాసుకుంటున్నారు. తమలో తామేమాట్లాడుకుంటున్నారు. చేతివేళ్లతో తలను సాలోచనగా కొట్టుకుంటున్నారు.‘‘ఎన్ని రోజులని ఇలా రోడ్డు మీద వదిలేస్తారు? జూకో పోలీస్స్టేషన్కో తరలించండి’’ అన్నాడు ఒక పెద్దమనిషి.‘‘అది మనిషి అయితే పోలిస్టేషన్కు తరలించవచ్చు. జంతువును ఎలా తరలిస్తామండీ’’ జారుతున్న ప్యాంట్ సర్దుకుంటూ పాయింట్ లేవదీశాడు పోలీసాయన.‘‘నేను మనిషిని కాదు జంతువును అని అదేమైనా మీ చెవిలో చెప్పిందా? జంతువని మీరెలా డిసైడ్ చేస్తారు? జూకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు. ఉన్న జంతువులకే దిక్కులేదు. ఇదొకటా మా ప్రాణానికి!’’ అని శాంతస్వరంతో అరిచాడు జూఆయన.ఒకరినొకరు భీకరంగా తిట్టుకున్న తరువాత కేసు కోర్టుకెక్కింది. ఆరోజు కోర్టులో...‘‘నా కెరీర్లో ఎన్నో జటిలమైన కేసులు చూశానుగాని ఇంత జటిలమైన కేసును ఎప్పుడూ చూడలేదు...అని నేనంటాననిమీరు అనుకుంటున్నారేమో...’’ కళ్లద్దాలను పైకి సవరిస్తూ అన్నాడు ఫేమస్ జడ్జి ఆండ్రూ లాంగ్మోర్.‘‘మేమేమీ అనుకోవడం లేదండి. ఉత్తపుణ్యానికి మీరే అనుకుంటున్నారు’’ అని పళ్లికిలించాడు కొత్త న్యాయవాది.‘షటప్’ అని ఆ న్యాయవాదిపై కళ్లెర్ర చేసి టేబుల్పై సుత్తితో రెండు సార్లు బాది ఇలా అన్నాడు జడ్జి...‘‘జడ్జి అంటే సినిమాల్లో చూపినట్లు, తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట... అని డైలాగు చెప్పేవాడు మాత్రమే కాదు.... క్లూ అందించే వాడు... సమస్యను పరిష్కరించేవాడు కూడా. ఆ విచిత్ర జంతువు లేదా విచిత్ర మనిషిని జూకు తరలించాలా? పోలీస్స్టేషన్కు తరిలించాలా? అనే తీర్పు ఇచ్చేముందు అసలు అదేమిటో తెలుసుకోవాలి. దీనికి జుట్టు పీక్కోనక్కర్లేదు. సింపుల్...ఆ విచిత్రజీవికి ఒకవైపు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల పులుసు,రొయ్యల ఫ్రై మరోవైపు పచ్చగడ్డి, చొప్ప, చెట్ల ఆకులు, జొన్నలు పెట్టండి. ఆకలితో ఉన్న ఈ జీవి ఏది ముడుతుందో చూసి అప్పుడు తీర్పు చెబుతాను’’ అన్నాడు జడ్జి. జడ్జిగారి తెలివికి ముచ్చటపడుతూ ఆయన చెప్పినట్లే చేశారు. ‘‘ఏది ముడతాడు?’’ అనే ఆసక్తి ఆకాశాన్ని అంటింది. ఆ విచిత్రజీవి మాత్రం అటు నాన్వెజ్ ఐటమ్లు ఇటు గడ్డిగాదం ఐటమ్స్ సుష్ఠుగా లాగించేసి బ్రే...వ్ అన్నాడు!! సమస్య మళ్లీ మొదటికొచ్చింది.దీంతో ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది...‘మా దేశంలో ఒక విచిత్రమైన జీవి కనిపించింది. ఇది మనిషా, జంతువా? అని చెప్పిన వాళ్లకు బకింగ్హామ్ ప్యాలెస్ బహుమతిగా ఇవ్వబడుతుంది’‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అని...అమెరికా నుంచి ‘నాసా’ వాళ్లు, చైనా నుంచి సీయన్యస్ఏ శాస్త్రవేత్తలు,రష్యా నుంచి జూనియర్లు మొదలు సీనియర్ శాస్త్రవేత్తల వరకు వచ్చారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు వెనక్కి వెళ్లిపోయారు. ప్రపంచం నలుమూలాల నుంచి ‘నేను పక్షి శాస్త్రవేత్తను’ ‘నేను జంతు శాస్త్రవేత్తను’ అనో ఇంకేదో అనో ఎవరో ఒకరు లండన్కు వస్తూనే ఉన్నారు. ఏదీ తేల్చకుండా జుట్టు పీక్కుంటూ వచ్చిన దారినే వెనక్కి వెళుతూనే ఉన్నారు. ఈలోపు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్కు ఒక డౌటు వచ్చింది.‘‘పెద్ద దేశం అమెరికా నుంచి చిన్న దేశం మాల్టా వరకు రోజూ ఎవరో ఒకరొస్తూనే ఉన్నారు. ఇండియాలాంటి పెద్ద దేశం నుంచి ఎవరూ రాకపోవడం విచిత్రంగా ఉంది’’ అని చార్లెస్ అంటున్నాడో లేదో...‘‘ఎక్స్క్యూజ్మీ సార్... ఐయామ్ ఫ్రమ్ ఇండియా’’ అని ఒక గొంతు వినిపించింది.‘‘మీరేం చేస్తుంటారు?’’ జుట్టు సవరించుకుంటూ అడిగింది బ్రిటన్ ప్రధాని.‘‘నేను ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తుంటాను’’ అన్నాడు ఆ వ్యక్తి.‘‘ఇది మనిషా జంతువా? అనేది పెద్ద పెద్ద సైంటిస్టులే చెప్పలేకపోతున్నారు. ఎకనామిక్స్ తప్పా ఏమీ తెలియని మీరెలా చెప్పగలరు?’’ అడిగాడు లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్.‘‘ఈ జీవి గురించి చెప్పడానికి సైన్స్ తెలియనక్కర్లేదు. ఆర్బీఐ గవర్నర్ అయితే చాలు’’ అన్నాడు ఆయన చిన్నగా నవ్వుతూ.‘‘భలే చిత్రంగా మాట్లాడుతున్నావే...ఇంతకీ ఈ జీవి మనిషా? జంతువా?’’ అడిగాడు చార్లెస్.‘‘ఏదీ కాదు’’ అన్నాడు ఆయన నిమ్మళంగా.‘‘మరేమిటి?’’ అని కళ్లు పెద్దవి చేస్తూ అడిగారు అక్కడున్నవాళ్లు.‘‘ఈ జీవి పేరు విజయ్మాల్యా’’ అసలు విషయం చెప్పాడు ఆర్బీఐ గవర్నర్. – యాకుబ్ పాషా -
ఒబీస్
‘ఈ ఒక్క ముక్కతోనే ఒళ్ళు పెరిగిపోతుందా ఏం? ‘వొద్దనుకుంటూనే కళ్ళు మరల్చలేకపోతున్నాను. మరోవైపు చూస్తే, నేహ ఇంత లావు పేస్ట్రీముక్క ప్లేట్లో పెట్టుకుని సుతారంగా దానిమీద ఐసింగ్ నాకుతూ కన్నుగీటిందిఒక ప్లాస్టిక్ నవ్వు పడేసి చూపులు ముందుకు తిప్పాను.లేత క్రీమ్ రంగూ, తెలుపూ కలిసిన పొరలతో దట్టమైన తెల్లని ఐసింగ్తో మాక్రోషాట్లో తీసిన ఫొటోలాగా స్పష్టంగా కళ్ళెదురుగా ..పైనాపిల్ పేస్ట్రీ.... చెమ్మ తాలూకు అతిపల్చని పొర... నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిస్తూ.. ఫోన్ మోగింది.‘ఎక్కడున్నావ్?’‘ఆఫీసులో’‘మరి పక్కన ఆ కేకలూ హడావుడీ ఏంటి? ఆఫీసేనా?’‘అవును, ఇవాళ రాహుల్ బర్త్డే. కెఫెటేరియాలో కేక్ కట్ చేశాడిప్పుడే’‘రాహులెవడు?’‘ఎవడేంటి ఎవడు? మొన్న మాల్లో కనిపిస్తే పరిచయం చేశాగా? అతనే’‘చేరి నెలైనా కాలేదు, అప్పుడే బర్త్డే ఇంత హంగామాగా చేస్తున్నారా?’‘ఫ్రెండ్స్ ఉండరా ఏంటి? సరదాగా’‘మరే, సరదా! ఇందాక ఫోన్ చేశాను, ఏం చేస్తున్నావ్? తీయవేంటి‘కట్ చేశాను విసుగ్గా. మళ్ళీ రింగ్ అవుతోంది. తీయబుద్ధి కాలేదు . ప్చ్... అసలు మనుషులు ఎందుకిలాగ ఉంటారో!ఇందాక పేస్ట్రీ వైపు సాగుతూ టేబుల్ మీద ఆగిపోయిన చేయి ముందుకు నిస్సంకోచంగా కదిలి ప్లేటు అందుకుంది. స్పూను పక్కన పడేసి చేత్తో అందుకునిమొత్తం ముక్కని నోట్లో పెట్టుకున్నాను. హాయిగా తీయగా చల్లగా కమ్మని క్రీమ్ రుచితో.. వేడెక్కిన మెదడుని మనసుని చల్లబరుస్తూ... మెత్తగా పళ్ళ కింద నలుగుతూ కమ్మగా గొంతులోకి జారుతోంది.హెవెన్... దేవుడా! ఎన్నెన్ని రుచులు సృష్టించావయ్యా స్వామీ... నీ దుంపతెగా!జతిన్ మరో ప్లేట్లో చాక్లెట్ కేకు ముక్కలుపెట్టుకుని వస్తూ ‘కావాలా?’ అన్నాడు.‘అర్జెంట్గా..’ దాదాపు లాక్కున్నంత పనిచేసి చాక్లెట్ కేకుని మళ్ళీ మాక్రోషాట్ లెవెల్లో మొహానికి దగ్గరగా పెట్టుకుని చూశాను. అందంగా కనపడింది నాలాగే!బాగా బొద్దుగా ఉంది, నాలాగే! బొద్దుగా..... ఒక్కక్షణం ఆగాను.ఉహూ. గబగబా చాక్లెట్ రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నానులేచి ఫస్ట్ఫ్లోర్కేసి నడుస్తుంటే వెనక నుంచి వినపడింది‘నార్త్ పిల్లలు అంత సన్నగా ఎలా ఉంటార్రా‘‘మనలాగా పప్పూ నెయ్యీ పోసుకొని తినరువాళ్ళు.. ’ ఇంకెవడో జవాబు చెప్పాడు.‘వాళ్ళూ తింటారు. కాస్త ఒళ్ళొంచి వర్కౌట్లు చేస్తారు. మనోళ్ళు పెళ్ళయితేటేకిట్ ఫర్ గ్రాంటెడ్ రకాలు. చేసుకున్నాక చస్తాడా ఏంటి భరించక‘‘అలా ఏంలేదురా! వాళ్ళూ అంతే! పంజాబీలు చూడు, మెక్సికన్ గాల్స్ టైపు. పెళ్ళి కాకముందు మెరుపుతీగలే! పెళ్ళయ్యాక ఆలూబస్తాలే‘ ఓహో వీడు ఆన్సైట్కి వెళ్ళొచ్చాడన్నమాట. అక్కడికేదో మెక్సిక¯Œ ఆడపిల్లలని బాగా చదివేసినట్టే.. సొల్లుకబుర్లు. వీడి నాలెడ్జ్ అంతా పంచాలి మనకి!వాళ్ళు మాట్లాడుకుంటున్నది నా గురించి కాదేమో గాని నాకు మాత్రం నన్నుద్దేశించే అనిపిస్తుంది ప్రతిసారీ. ఏడిశార్లే, ఐడోంట్ కేర్ !‘లవీ... అమ్మా, మెరుపుతీగా ఆగు’ మోహిత్‘ప్రొడక్ట్ రిలీజ్ ఎప్పుడు?’‘ట్వెల్త్‘ పాలిష్ చేసిన గోళ్ళకేసి చూసుకున్నా. నిండు ఆరెంజ్ రంగు, ఎంత బావుందో! షాపర్స్ స్టాప్లో వచ్చేస్తున్నపుడు చివర్లో దొరికింది.‘మీ టీమ్లో ఎవరో గుర్గావ్ నుంచి వచ్చిందట వడోదరా అమ్మాయి, పరిచయం చెయ్యొచ్చుగా కొంచెం.అంత కుళ్ళుండగూడదు‘ఇదీ వీడిక్కావలసింది. ప్రొడక్ట్ రిలీజ్ కాదు. ఇద్దరు పిల్లల తండ్రి, బెల్టుకి ససేమిరా లొంగనని తోసుకొస్తున్న పొట్ట, ఎంత ముందుకు దువ్వినా, మొదలైపోయిన బట్టతల.అయినా సరే కొత్త పిల్లలు ఎవరైనా రాగానే పరిచయం చేసేస్కోవాలని తాపత్రయం. ఆ పిల్లలకు తను తన నాలెడ్జ్ నచ్చేస్తాయని బోల్డు కాన్ఫిడెన్స్. కాంపిటీషన్ ఉంటుందని భయమైనా లేదు. ముందు నుంచి ఒక ఆడపిల్ల పోతుందంటే చాలు ఏదో ఒక పాయింట్ మీద కామెంట్ చేయకుండా ఉండడు. లావనో, పొట్టనో, నలుపనో, డంబ్ అనో, ఈజీ ఫాలింగ్ అనో..!‘నీకు ఒకళ్ళు పరిచయం చేసేదేముంది’ అటుగా వెళ్తున్న ఎవరి ప్లేట్లోంచో పేస్ట్రీ ముక్క తీసుకున్నాను. ఇవాళ చాలా క్రేవింగ్గా ఉంది. వారం నుంచి నోరు కట్టేసుకునే ఉన్నాను. రోజూ ఆ రుచీ పచీలేని పుల్కాలతో సరిపెట్టుకుంటున్నాను. అంతకంటే నీచమైన ఆ బీరకాయ, సొరకాయ కూరలతో! ప్రపంచమంతా నిస్సారంగా కనిపిస్తున్నా సరేకె ఫెటేరియాలో రకరకాల ఐటెంలు .కార్పొరేట్ లంచ్. అటుగా వెళ్తే ఏదో ఒకటి తినేస్తానని భయం.ఇవాళ తప్పింది కాదు. నా బాక్స్లో పుల్కాలు నీరసంగా నిద్రపోతున్నాయేమో! అందరితో కలిసి నూడుల్స్, పూరీకూర తినేశాను. ఎంత హాయిగా ఉందో! కడుపునిండా ఎంత తిన్నా ఒళ్ళు రాకుండా లావు కాకుండా ఉండే వరమేదైనా దేవుడివ్వాలంటే ఎన్నేళ్ళు తపస్సు చేయాలో! ఆ చేసినన్నాళ్ళూ నిరాహారంగా చేయాలా? ఇహ అప్పుడు ఆశలన్నీ చచ్చాక ఇక స్లిమ్ ఉండి ఏంలాభం? ఇష్టమైంది కడుపునిండా తినేశాక వచ్చే నిద్ర ఎంతందం? నెమ్మదిగా రెప్పల మీదికి బరువుగా తోసుకొస్తూ, సోఫా, కుర్చీ, మంచంలాంటì æతేడాలేవీ లేకుండా పక్కన కూచున్న మనిషి ఎవరైనా సరే, వాళ్ల భుజం మీద వాలి, హాయిగా !అసలు మధ్యాహ్నం నిద్రల్ని ఆఫీసుల్లో కంపల్సరీ చేయాలి. కనీసం గంట! అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మరో పది నిమిషాల్లో నాకు మీటింగ్ లేకపోయుంటే ఎంత హాయిగా డెస్క్ మీద తలవాల్చి నిద్రపోదును? మధ్యాహ్నాలు నిద్రపోతే ఒళ్ళొస్తుందని ఎవరోచెప్పారు. అయినాసరే తెగించి శనాదివారాలు ఒక్క గంటైనా పడుకుందామనుకుంటే ఏదో ఒక పని పని పని!అసలందుకే కడుపునిండా తినకూడదు. గాలి పీల్చినా వెధవది ఒళ్ళొచ్చేలా ఉందే దీన.... ‘ఆ అమ్మాయిపేరు రిచా అటగా, మొన్న దూరం నుంచి చూశాం! ఏం తింటారబ్బా గుజ్జూలు, ఎంత స్లిమ్గా ఉందో!‘వీడి నోరుపడ, అనేశాడు మళ్ళీ!‘మరి అంత స్లిమ్గా ఉన్న పిల్లతో నీకెందుకు చెప్పు పరిచయం? గణపతి బప్పాలా ఆ బొజ్జ చూసుకో ముందు!’అయినా ఆ పిల్లకు పెళ్ళి కుదిరింది‘ వాడి మొహం ఎలా ఉందో చూడకుండా ముందుకు నడిచాను. సీట్లో కూలబడ్డాను. మీటింగ్ క్యాన్సిల్. ఖాళీతెరెసా వస్తోంది గునగునా! తెరెసానో, చంద్రకళనో చూసినపుడు కాస్త హుషారు వస్తుంది. నాకంటే లావు కాబట్టి ఫీలింగ్ బెటర్ అనిపిస్తుందివస్తూనే బాక్స్తీసి,‘అత్తమ్మ పంపింది పొద్దున! ‘ అని బొబ్బట్టు తీసి పేపర్ ప్లేట్లో పెట్టింది.‘ఓయ్! ఇప్పుడే కేకు తిని వస్తున్నా. ఇంక చాలివాల్టికి‘ అన్నానుగొల్లున నవ్వింది. ‘చల్తీ! ఎంత చేసినా ఇంతేలే మనం. ఒక్కదానికేంగాదు. తినాలె‘ అని ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ‘‘మనం’’అట.. నన్ను కూడా కలుపుకుంది బండది.‘తెరెసా, ప్లీజ్ ’అంటున్నా వినిపించుకోలేదు. నిజానికి మొదటి ముక్క తిన్నందుకే పశ్చాత్తాపంగా ఉంది. దానిపైన ఇంకో రెండు పట్టించాను. ఇప్పుడీ బొబ్బట్టు.నో, వద్దు! జాగ్రత్తగా పేపర్లో చుట్టి డస్ట్బిన్లో అడుగున పడేశాను.‘ఒక గ్రీన్ టీ తీసుకురా, తేనె వెయ్యొద్దని చెప్పు రామూకి. లతా మేడంకంటే ఎలా చేయాలో తెలుస్తుంది’ లక్ష్మణ్కి చెప్పాను?పేస్ట్రీలు, కేకులు తిన్నందుకు పశ్చాత్తాపం మొదలై క్షణక్షణానికి ఇంతింతై మర్రిచెట్టులా ఊడలు దిగుతూ పెరగడం ప్రారంభమైంది.‘ఛ, ఎలాటి ఫ్రస్ట్రేషన్ వచ్చినపుడల్లా దాన్ని అణచడానికి స్వీట్లు తినడం ఎలా అలవాటైంది నాకు? హాస్టల్లో ఉండి చదివేటపుడు ఎగ్జామ్ టెన్షనూ, చదువు టెన్షనూ చాక్లెట్లు తింటే తగ్గుతుందని ఒక పిచ్చినమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి పనికిమాలిన సలహాలు భలే ఆకట్టుకుంటాయి అందులో నిజముందాలేదా అనే సంగతి తర్వాత. ముందు చాక్లెట్ తినాలి. అలాగే పట్టుకుని ఉంటుంది వెధవ అలవాటునాలుగవుతుండగానే లేచి బయటపడ్డాను. లక్ష్మణ్ని పిలిచి, సాయంత్రం బండి ఇంటికి తీసుకు రమ్మన్నాను. నడిచివెళ్తా ఇవాళ. ఇందాక తిన్నది కొంతైనా కరిగించాలి.మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడిచి వెళ్ళాను. శరీరానికి కాస్త కష్టమైనా మనసు తేలిగ్గా అనిపించింది.పిండికలిపి, నాకోసం కీరాలూ, టమాటాలు కట్చేసి పెట్టుకున్నాను.‘పుల్కాలా మళ్ళీ? నీడైటింగ్తో మా ప్రాణాలు తీస్తున్నావ్. ఆ సొరకాయ కూర కాకుండా ఇంకేదైనా చెయ్యి. ఆలూకూర ‡చెయ్యి ఇవాళ. కొంచెం రైస్ కూడా ఒండు! అసలు నీ డైటింగ్ వంటలు నువ్వు చేసుకో. మాకెందుకు ఈ బలాత్కారం? ‘ఒక్కొక్కరికీ ఒక్కోరకం వండాలంటే ఎంతశ్రమో కనీసం ఊహలోనైనా తెలీదేమో!చపాతీలు చేసి నూనెవేసి కాల్చాను స్నానం, వంట అయ్యాక ఏవిటో కేకుకి ప్రాయశ్చిత్తం చేసుకున్న ఫీలింగ్ వచ్చి, బరువు తగ్గినంత ఆనందం వచ్చిపడింది.నాలుగు కీరా ముక్కలూ, ఒకకప్పు టమాటా జ్యూసూ తాగి పడుకున్నాను. అర్ధరాత్రయ్యే సరికి ఆకలితో నిద్రపట్టలేదు. చాలాసేపు దొర్లానుగాని నిద్రలేకపోతే రేపు ఆఫీసులో పని చేయలేననిపించిందిలేచిచూస్తే డబ్బానిండా చాక్లెట్లూ, టేబుల్ మీద అరటిపళ్ళూ!వంటింట్లో హాట్ ప్యాక్లో చపాతీలూ, ఆలూకూర.అమ్మో ఆలూ ఒద్దు. దానికంటే æచాక్లెట్లు నయం. కానీ కడుపునిండదు.పెరుగన్నం తిని, బౌల్ సింక్లో పడేసి వస్తూవస్తూ నాలుగుచాక్లెట్లు నోట్లో పడేసుకున్నాక, హాయిగా నిద్రపట్టింది. ప్రాణం ఎటుపోయిందో తెలీదు రాత్రి అనుకున్న ప్రకారం పొద్దున్నే ఐదున్నరకి లేచి అన్నం కుక్కర్లో పడేసి, జిమ్కి పరిగెత్తాను. నేను వెళ్ళేసరికే మూడు ట్రెడ్మిల్స్ మీదా ముగ్గురమ్మలు కనిపించారుగుంజన్, గీత, మన్ప్రీత్ రాజహంసల్లాగా రెండుస్పీడులో నడుస్తూ కబుర్లుచెప్పుకుంటున్నారు‘రారా, చాలా రోజులైంది కనపడి జిమ్లో?‘ ‘సాయంత్రాలు వస్తున్నాను‘ అబద్ధం అలవోగ్గా ఆడాను.‘సాయంత్రం నేనూ వస్తున్నానే? ‘గుంజన్ . నేను రావట్లేదని ప్రూవ్ చెయ్యాలి. అదీ దీని పట్టుదల.‘ఇంట్లో పనీ అదీ అయ్యేసరికి ఎనిమిదవుతుంది అప్పుడు వస్తున్నాను‘ తగ్గదల్చుకోలేదు‘కాస్త వెయిట్ పెరిగినట్టు అనిపించట్లా లావణ్య? ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకో, ఎందుకైనా మంచిది. దాని సింప్టమ్స్ మిగతావి ఎలా ఉన్నా ముందు వెయిట్ పెరిగి తీరతాం‘ మరికొంచెం లావయ్యాన నీ మనసులో అనుమానం ఉన్నా, వెయింగ్ మెషీన్ జోలికి వెళ్ళకుండా తగ్గే ప్రయత్నాలు చేస్తూ సమాధాన పడుతున్నాను. చాలా నీరసం వచ్చింది మన్ప్రీత్ మాటలతో!అయినా వీళ్ళుమాత్రం తక్కువున్నారా ఏంటి? ఇంకోళ్ళని నువ్వు లావయ్యావని అంటేతప్ప కడుపునిండదేమో!సైక్లింగ్ చేయాలనుకున్నాగాని ఆ మాటలతో గొప్ప నిరాశ వచ్చిపడింది.గుంజన్ అంటోంది ‘నైరే! గార్లిక్ బటర్ పొటాటోస్కా రెసిపీ హై మేరే పాస్. హోలీకే దిన్ బనాయా, స్వీట్కే సాథ్. బటర్ జ్యాదా లగ్తా హై లేకిన్, టేస్ట్కీ బాత్ కరో! హెవన్ యార్, మెరా సిగ్నేచర్ రెసిపీ!’ఇంట్లో బటర్ పొటాటోస్ కానిచ్చి ఇక్కడికొచ్చి ఒక అరగంట కబుర్లు నంజుకుంటూటైమ్ పాస్ చేయడమే కానీ అసలు సీరియస్నెస్సేదీ? ‘నువ్వో‘ ఎవరో అడిగారు నా లోపల్నుంచి. ‘నేనేంకాదు‘ మొహంపగిలేలా జవాబుచెప్పి పెడలింగ్చేయడం మొదలుపెట్టాను. ‘వెయిట్ పుటాన్ చేసినట్టులేదూ లావణ్య? ‘పదేపదే గుంజన్ మాటలు వినపడుతున్నాయిపదినిమిషాలు చేసేసరికి ఉత్సాహం పూర్తిగా చచ్చింది. అయినా ఇవాళ ఆఫీసుకు పెందలాడే వెళ్ళకపోతే కష్టం. లక్ష్మణ్ బండి తీసుకు రాలేదు రాత్రి.ఆమాట గుర్తొచ్చేసరికి గుండెగుభేలుమంది. నడిచెళ్లాలా? అమ్మో నావల్లకాదు. గబగబా సైకిల్ దిగాను.‘నైరే! జలేబీమే జిత్నా భీ రెహెనేదో! కెలొరీస్? ఆనేదో? వెయిట్లాస్ కేలియే జాయేంగే ఫైనల్లీ‘ మన్ప్రీత్ మాటలు వినపడుతున్నాయి.హాయిగా అనిపించింది. అంతే! కెలొరీలు వస్తేరానీ! కడుపు మాడ్చుకుని ఏమిసాధిస్తాం? నేను ఏమీ తినకుండానే బరువు పెరిగిపోతున్నా, ప్చ్నిజంగానే థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకుంటే? జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటారేమో?వెయిట్లాస్ ట్రీట్మెంట్కి బరువు గ్యారంటీగా తగ్గుతారంటే ఈ కష్టాలుపడలేక అదీ ట్రైచేశానాయెఏవిటో వేడివేడి హాట్ ప్యాచ్లుఒళ్ళంతా చుట్టి పడుకోబెడతారు ఒకగంట. అదొక్కటీ ఐతే బానేఉండును. రోజుకు గంట బ్రిస్క్వాక్ చేయాలి, నిమ్మకాయనీళ్ళు తాగాలి, మధ్యాహ్నం అరకప్పు అన్నమే తినాలి. రాత్రి ఒకపుల్కా మాత్రమే తినాలి‘ అని చెప్పి 30 వేలు కట్టమన్నారు.అవన్నీ చేస్తే ఎలాగూ తగ్గుతాను, బోడి ..వీళ్ళు తగ్గించేదేంటి ? టీవీలో గంటలతరబడి సెలబ్రిటీస్ చేత చెప్పిస్తారు ‘అక్కడికెళ్ళి స్లిమ్గా తయారైపోయాను. నా లైఫ్ మారిపోయింది’ అని గబగబా తయారైపోయాను. బాక్స్లో రెండు పుల్కాలు, మరో బాక్స్లో ఆకుకూర, బుల్లి బుల్లి టప్పర్వేర్ డబ్బాలో కీరాముక్కలు. నడవాలంటే నావల్ల అయ్యేలాలేదు. మూడ్ కూడా లేదు.కారు డ్రైవ్ చేసే సహనం ఈ ట్రాఫిక్లో నాకు లేదు. నిరుత్సాహంగా ఆటో పిలిచానుప్రతిరోజూ ఇలాగే గడిచిపోతోంది .ఉదయాన్నే గ్రీన్టీతో మొదలుపెట్టాలని, బ్రిస్క్వాక్కో, జిమ్కో వెళ్లాలని, బ్రౌన్ బ్రెడ్డూ లేదా ఓట్స్ తినాలని, వారానికి రెండుసార్లయినా యోగా క్లాసుకో, జుంబాకో వెళ్లాలని . జుంబాకి డబ్బుకట్టి కూడా మానేశాను రెండుసార్లు .ఉదయం టైముండదు, సాయంత్రం ఓపికుండదు. అందరూ ఎలా వెళ్తారో మరి. వాళ్లంతా ఇంటిపట్టునుండే గృహిణులా ? గృహిణులైతే మాత్రం పన్లుండవా?పేపర్, ఫేస్బుక్ చూస్తేనే చాలు బోల్డు ఈవెంట్స్ కనిపిస్తాయి. 3కే రన్, 5కే రన్, నెక్లెస్ రోడ్లో నడక, ఎక్కడెక్కడో సినిమా క్లబ్స్, ఫొటో వాక్స్ .. వాటికి వెళ్లేవాళ్లంతా ఔన్సు కూడా కొవ్వు లేకుండా స్లిమ్గాకనిపిస్తుంటారు. బోల్డు డబ్బుండి, పనేమీ ఉండి ఉండదా వాళ్ళకి? ఇదిగో ఇలాటి తొక్కలో తీర్పులే మానెయ్యాలి. ఉత్సాహం ఉండాలిగాని ప్రతి ఈవెంట్కీ వెళ్లొచ్చు.మరే, ఉత్సాహం నీకొక్కదానికే ఉంటే చాలా? నువ్వు తిరిగొచ్చే సరికి ఎవరి కాఫీ వాళ్ళు కలుపుకుని తాగేవాళ్లున్నారా కొంపలో? అలాటి ఈవెంట్స్కి పోయి తిరిగొచ్చాక, ‘ఎలాజరిగింది ? నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? కాస్త ఏదైనా తిని రెస్ట్ తీసుకో ఇవాళ్టికి. అన్నీ రెడీగా ఉన్నాయి. స్నానం చేసొచ్చి తింటూ ఈవెంట్ కబుర్లు చెప్పు‘ అనేమాట ఎప్పటికైనా వినపడుతుందా? పనిమనిషి ఉన్నాసరే, బోల్డు పని! టిఫిన్లు, లంచ్బాక్సులు సర్దటం నుంచి సాయంత్రం కావలసినవి రెడీగా పెట్టుకోడం వరకూ! సరుకులు, కూరగాయలు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే.. ఆఫీసు పని , ట్రాఫిక్లో పడి ఇల్లు చేరేలోపు ప్లాన్లు అన్నీ అట్టర్ఫ్లాప్ అయిపోతాయి. సెల్ఫ్పిటీలో భలేహాయి ఉంది. కళ్ళెమ్మట నీళ్ళొచ్చేలా ఉంటుంది. ‘నేనెంత కష్టపడుతున్నానో‘ అనుకోడంలో ఒక త్యాగం ఉందసలు.టీవీ యాడ్స్లో భలే చూపిస్తారు. ఆవిడ ఇంటికెళ్ళాక కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండి, మావగారికి మందులిచ్చి, అత్తగారికి కాళ్ళునొక్కి... అబ్బా ఆ దేవతా స్త్రీలు ఎక్కడుంటారో? ఆఫీసుకు వెళ్తూనేతెరెసా కనపడింది. దుశ్శకునం! ఇదేమి స్వీట్లూ ఫ్యాట్లూ తెచ్చిందో తినడానికి... లంచ్లో టప్పర్వేర్ డబ్బా తీసి టేబుల్ మీద పెట్టింది. ‘సున్నుండలు చేసిందమ్మ. నీకిష్టమని తెచ్చా’ అంది.దీనికెవరు చెప్పారో నాకిష్టమని. ప్రతిదీ నాకిష్టమని తెచ్చేస్తుంది. నామీద ఇష్టానికి సంతోషించాలో, కొంచెం కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వనందుకు విసుక్కోవాలో తెలీదు.నా బాక్స్లో పుల్కాలు, సొరకాయ కూర తింటూ నీరసంగా సున్నుండల వైపు చూశాను.‘ఒద్దులేవే, ఏమనుకోకు. బరువు తగ్గాలి. బీఎంఐ 32 ఉంది. కనీసం 26కి దిగాలి. వెయిట్ తగ్గాలి. కాస్త సీరియస్నెస్ మెయింటైన్ చెయ్యాలి. చూడు నడుం దగ్గర ఎలా ఫ్యాట్ వచ్చేసిందో?అసలు రుజుతాదివేకర్ ‘అదేప్రాబ్లెమ్ మీతో...’ వెనక నుంచి వినిపించింది.ఉలిక్కిపడి వెనక్కుచూశాం. నిహాల్ !‘మీకింకా నడుం దగ్గర టైర్లు రాలేదు. చీర కట్టుకున్నా పర్ఫెక్ట్గానే ఉంది. మొన్న చూశాగా, అంత ఫ్యాట్ ఏమీ లేదులే.’ మండిపోయింది .‘సిగ్గుందా? ఏం వాగుతున్నావ్ ?’ అన్నాను.నిహాల్ స్పూన్తో స్ప్రౌట్స్ తింటూ ‘సరిగ్గనే వాగుతున్న! ఎంతసేపూ రుజుతాదివేకర్ నెయ్యి తినమంది, ఫ్రూట్స్ తినమంది, ఫ్యాట్స్ తినమంది అనేదే చూస్తారుగాని ఆవిడ ఎట్ల తినమందో చూడరు. అసలు మీ లేడీస్కి హెల్త్ కాన్షస్నెస్ కంటే బ్యూటీ కాన్షస్నెస్ ఎక్కువుంటది. ముప్ఫైఅయిదు దాటినంక కూడా ఇరవైల్లో ఉన్నట్టు ఉంటరా? ఎట్లయితది? ఐడియా మంచిదే! కానీ అందుకు సిచుయేషన్ మీకు కోపరేట్ చేస్తదా లేదా చూసుకోరేంది? పెళ్లి, డెలివరీలు, ఫ్యామిలీ, చాకిరీ ఇవన్నీ మీ బాడీని పెళ్లికి ముందులాగే ఉంచుతయా? ఉంచవు. అందుకే హెల్త్ చూసుకోవాలి. అయినా ముప్పయి దాటాక మరీ సన్నగుంటే బాగోదు. కొంచెం బొద్దుగుంటేనే మంచిగుంటది. ఎక్కణ్ణో ఏదో ఏ మాల్యాగాడి కాలెండరో జూస్తరు. ఆ లెక్కనే ఉండాలంటరు. ఏదైనా డ్రెస్జూస్తే, అది మనకు నప్పుతదా లేదా..అహా ఏంలేదు. పొయ్యి కొనుడు ఏసుకునుడు. ఆమెవరో కొన్నది గాబట్టి మనమూ కొనాలె, అంతే! ఎప్పుడూ ఎవరి లెక్కనో ఉండాలె.అయినా ఎవరికో మీరు నచ్చేదేంది? మీకు మీరు ఎలా ఉన్నా నచ్చాలి. లవ్ యువర్ మిర్రర్ అనే కాన్సెప్ట్ తెలుసా? అద్దంలో మీరెలా ఉన్నా, మీకు మీరు నచ్చాలంట తెల్సా? అరె, ఎప్పుడు చూడు, వాడికి నచ్చాలి, ఈమె లెక్కుండాలి, పార్టీలో మెరిసిపోవాలి, ఎవరి పెళ్లిలోనో మనం సెంటరాఫ్ అట్రాక్షన్ కావాలి. ఏందిది? ఎంతసేపూ ఇదేగోలా? హెల్దీగా తినండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే బ్యూటీ ఉంటది తెలుసా మొహంలో?’‘అయిందా నీ బోడి ఉపన్యాసం? ఏదో గీత బోధించినట్టు ఫీలవుతున్నావుగానీ ఇక దయచెయ్యి! చంపుతాను ఇంకొక్క మాటమాట్లాడినా‘ అన్నాను కోపంగా... కిక్కిక్కీ అని నవ్వాడు. ‘నాకుతెలుసులే, నేను చెప్పినవన్నీ నిజాలని మీకు తెలుసనీ! నేను మాట్లాడితే మీకు ఇయ్యన్నీ గిల్లినట్టు ఉంటై‘ ‘పోతావా పోవా నువ్వు?‘ ప్లాస్టిక్ గ్లాసు విసిరేశాను.‘సరేసరే, పోతున్నలే’ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.ఇద్దరం నవ్వుకున్నాం హాయిగా.‘అంటే అన్నాడులే కానీ కరెక్ట్గానే అన్నాడు’ అంది తెరెసా సున్నుండ తీస్తూ! ఇదసలు స్వీట్ల దగ్గర కాంప్రమైజ్ అవ్వనే అవ్వదు.పుల్కాలు తినడం అయిపోవడంతో, చేయిచాచి సున్నుండ తీసుకున్నా!కమ్మని నెయ్యి వాసనతో ...అమ్మ గుర్తొచ్చేస్తోందినిహాల్గాడు అన్న మాటలన్నీ మాకు తెలీనివా?అమ్మ అనదూ?‘ముప్ఫయి నిండగానే ఈ కడుపు మాడ్చుకోడాలేమిటో? హాయిగా తినకుండా అలా నీరసం మొహాలేసుకుని శవాల్లాగా తయారైతే ఏం అందమనో మరీ చచ్చిపోతున్నారు! పిల్లలు పుట్టాక కూడా మెరుపుతీగలల్లే ఉండాలని అంత తాపత్రయం ఉంటే ఎలాగ? ఉజ్జోగంతో పాటు బోల్డు పన్లుంటాయి కదా; సరిగా తినకపోతే ఎలా? హెల్దీగా ఉంటే చాలదూ? ఎవరికో అందంగా కనపడాలా? ఎంతమందిని మెప్పిద్దావనో?’ బస్సుదిగి నడుస్తున్నా! మా ఆఫీసు ముందే స్టార్టింగ్ పాయింట్ కావడంతో సీటు దొరికేసింది. హాయిగా కూచున్నా.ఇంటికెళ్లి కమ్మగా అన్నం తినేయాలి. పొద్దున్న చేసిన పప్పూ, వంకాయకూర, నిన్న చేసిన గోంగూరపచ్చడి! ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి వెళ్ళగానే. మంచినెయ్యి పంపమని అమ్మకి ఫోన్ చేయాలి.ఇంటికెళ్ళగానే పిండి కలపక్కర్లేదని తలచుకుంటేనే బోల్డు హాయిగా ఉంది.అబ్బా, ఈ నార్త్ వాళ్ళు రోజూ చేతులు విరిగేలా పిండి కలపడం, రొట్టెలు ఒత్తడం ఎలా చేస్తారో పాపం! ఇంటి వీధిలోకి తిరగ్గానే ముందు వెళ్తున్న అమ్మాయిలెవరో పెద్దగానే మాట్లాడుకుంటున్నారు‘నీకు ఎంత చెప్పినా బుర్రకి ఎక్కడం లేదు. అన్నం మానేయాలి. అన్నంలో ఎంత షుగర్ ఉంటుందో తెలుసా? రాత్రిపూట రోజూ పప్పు తింటావు. పప్పు ప్రోటీన్, రాత్రి తినకూడదు. పుల్కాలు కాదు, అసలు రాత్రిళ్లు సలాడ్స్ తినాలి. నాల్రోజులు నిద్రపట్టదు. కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది తెలుసా? ఎన్నేళ్లు నీకిప్పుడు?’ ‘ముప్ఫైనాలుగు, అయినా అన్నం ఒక్కపూటయినా తినకపోతే ఎలాగే?’‘అదేమరి! ఈ వయసులో ఫ్యాట్ కూడబెట్టుకుంటే ఇంకా ముందుకు పోయాక అది కరుగుతుందా? ఇప్పుడే జాగ్రత్తపడాలి. ఒక పనిచెయ్యి. కాస్త కష్టపడి కీటో డైట్ ఫాలో అవు. ఈ ఏజ్లో బాడీ మెయింటైన్ చెయ్యకపోతే ముందుముందు ఎంతకష్టం! చీరకట్టుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా చక్కగా ఉండాలి. మొన్న కిట్టీపార్టీలో చూశావుగా, అసలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారని? కాస్త నోరుకట్టేసుకుంటే ఏమీ చావంలే! లేదంటే నలభై రాకముందే అమ్మమ్మల్లా తయారైపోతాం. ఇప్పటికే ప్రతి అడ్డమైన వెధవా అడ్వాంటేజ్ తీసుకుని ఆంటీ అనేస్తున్నాడు. పొద్దున్నే యాపిల్ సైడర్ వెనిగర్ కాస్త నీళ్ళలో కలుపుకు తాగు.బ్యాగులో బాదంపప్పు పడేసుకుని ఉంచు. గ్రీన్టీలో తేనె తగ్గించు. ఏమీ చేయనంటే ఎలా?’ఆటోమేటిగ్గా నా నడక స్లో అయిపోయింది. అడుగులు పడనని మొరాయిస్తున్నాయి. మెదడులో ఆలోచనలు గబగబా చిక్కుముళ్ళు పడిపోతున్నాయి.ఇంటికెళ్లి గబగబా పిండి కలపాలి. కీరాలు ఉన్నాయా ఫ్రిజ్లో? పోనీ ఇవాళ్టి సలాడ్ తినేస్తేనో?\రేపు బద్ధకించకుండా గుంజన్ వాళ్ళు రాకముందే లేచి జిమ్కి వెళ్లిపోవాలి.రైస్ మానేయాలి. అవును మానేయాలి ... గ్రీన్ టీ అయిపోయింది, తెచ్చుకోవాలి. తేనె? ఒద్దు ఒద్దు తేనెవద్దు. ఒట్టి గ్రీన్ టీయే తాగేస్తాను. సుజాత వేల్పూరి -
భారత్ ‘ఎ’ లక్ష్యం 262
బెంగళూరు: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. చేతిలో మరో 8 వికెట్లు ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే చివరి రోజు ఇంకా 199 పరుగులు చేయాలి. మయాంక్ అగర్వాల్ (25 బ్యాటింగ్), అంకిత్ బావ్నే (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవర్నైట్ స్కోరు 42/1తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ 83.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (40; 5 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (87; 13 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ 3, గౌతమ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 243; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 274; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 292 (హెడ్ 87, ఉస్మాన్ ఖాజా 40; మొహమ్మద్ సిరాజ్ 3/77); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 63/2 (20 ఓవర్లలో). -
దారుణం : బిడ్డ తల తెంచేసింది
కరాచీ: ఓ మహిళా డాక్టర్ నిర్లక్ష్యానికి ఓ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. అమ్మ పొత్తిళ్లకు చేరకముందే సుదూర తీరాలకు తరలిపోయింది. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పిన డాక్టర్, ప్రసవం సమయంలో బిడ్డ తలను, మొండాన్ని వేరు చేయడం కలకలం రేపింది. శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం తీసి, మొండెను తల్లి గర్భంలోనే వదిలేసింది. ఊహించుకుంటేనే...గుండెలవిసిపోయే ఈ ఘటన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ , క్వెట్టాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జరిగింది. ట్రిబ్యూన్ పత్రిక అందించిన సమాచారం అబ్దుల్ నాసిర్ తన భార్యను డెలివరీ కోసం ఒక ప్రయివేటు ఆసుపత్రి తీసుకొచ్చాడు. ఎలాంటి సమస్యా లేకుండా, సాధారణ ప్రసవం చేస్తానని డాక్టర్ అలియా నాజ్ నమ్మబలికింది. అందుకు10వేల రూపాయలు డిమాండ్ చేసింది. సరేనన్నాడు కానీ అంతా సవ్యంగా జరుగుతుందని ఆశించిన అబ్దుల్ జీవితంలో మర్చిపోలేని ఘోరమైన ఘటన జరిగింది. డాక్టర్ తన బిడ్డ తల, మొండాన్ని వేరు చేయడమేకాకుండా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చెప్పారని అబ్దుల్ ఆరోపించారు. తన భార్య పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స ద్వారా మిగిలిన భాగాలను తొలగించినట్టుచెప్పారు. అలాగే మెడికల్ రిపోర్టు ఇచ్చేందుకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారని వాపోయారు. ఇది ఇలా ఉంటే ఆరోపణలుఎదుర్కొంటున్న డా.అలియా జిల్లా ఉప ఆరోగ్య అధికారిగా పనిచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్య తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు. -
ట్రక్కు సైలెన్సర్లో యువతి తల..
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) అనే యువతి విన్స్టక్ మ్యూజిక్ ఫెస్టివల్కు వెళ్లి అక్కడ పూటుగా మద్యం సేవించింది. తాగిన మైకంలో ఉన్న ఆమె అక్కడున్న ట్రక్కు సైలెన్సర్ను చూసింది. పెద్దగా ఉన్న ఆ సైలెన్సర్లో తలను దూర్చితే ఎలా ఉంటుందని ఆలోచించి.. అనుకున్నదే తడువుగా అందులోకి తలను దూర్చింది. కొద్దిసేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా కుదరలేదు. ఇది గమనించిన అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆమె తలను సురక్షితంగా బయటకు తీశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది ఆ యువతి పరిస్థితి. ఇది ఇలా ఉంటే చిన్న వయస్సులో మద్యం సేవించినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైలెన్సర్లో తల ఇరుక్కున్నప్పటి దృశ్యాలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో కైట్లీన్ స్ట్రోం స్పందిస్తూ.. తాను చేసిన పనికి ఏమాత్రం బాధపడటం లేదని ట్రక్కు సైలెన్సర్లో తల ఇరుక్కుపోయిన యువతి తానేనంటూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతోంది. -
తల తెంచి.. నోట్లో సిగరెట్ పీకలు
ఉదయాన్నే ఆఫీస్కు వచ్చిన వారికి గేటు దగ్గరే ఒళ్లు గగ్గురుపొడిచే దృశ్యం దర్శనమిచ్చింది. ఓ మూగ జీవిని అతి క్రూరంగా చంపి, దాని తలను గేటును వేలాడదీశారు. సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ కాగా, తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం, వైల్డ్ లైఫ్ విభాగాలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. సిడ్నీ: సౌత్ సిడ్నీకి 100 కిలోమీటర్ల దూరంలోని షెల్ హార్బర్ మెరైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యాలయం. ఆదివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బందికి భయానక దృశ్యం దర్శనమిచ్చింది. కార్యాలయం బయట ఉన్న ఫెన్సింగ్కు ఓ షార్క్ తల గుచ్చి ఉంది. దాని నోట్లో సిగరెట్ పీకలు.. సముద్రంలోని చెత్తను కుక్కారు. దిగ్భ్రాంతికి గురైన సిబ్బంది వెంటనే విషయాన్ని వైల్డ్ లైఫ్ అధికారులకు తెలియజేశారు. సుమారు 70 కేజీల బరువు ఉన్న ఆ జీవిని దుండగులు వేటాడి చంపి ఆపై దానిని తలను వేరు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు రక్తపు మరకల ఆధారంగా ఘటన జరిగి 24 గంటలు కూడా దాటి ఉండకపోవచ్చని, బహుశా శనివారం రాత్రిపూట దానిని వేటాడి ఉంటారని అంచనా వేస్తున్నారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా క్లూస్ సంపాదించే పనిలో అధికారులు ఉన్నారు. జంతు ప్రేమికుల ఆవేదన.. కాగా, ఆ ఫోటోను ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘మనిషి మృగంగా మారి మూగజీవాన్ని పొట్టనబెట్టుకున్నాడు’ అంటూ ఓ సందేశం ఉంచింది. నిందితులెవరైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని, జీవితంలో ఇలాంటి తప్పును మరోసారి చేయకుండా వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సరదా కోసం ఇలాంటి చేష్టలకు దిగుతున్న వారిని.. అదే స్థాయిలో దండిచాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ రాకాసి.. ప్లాస్టిక్ బ్రహ్మ రాక్షసి మూలంగా జల చర జీవులు మృత్యువాత పడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. తాజాగా ఓ తిమింగలం శవ పరీక్షలో భారీ ఎత్తున్న ప్లాసిక్ట్ సంచులు బయటపడ్డ ఘటన థాయ్లాండ్లో చోటు చేసుకుంది.(పూర్తి కథనం)... నిన్నగాక మొన్న అరుదైన తాబేలు కడుపులోనూ భారీ ఎత్తున్న ఫ్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. సముద్ర నీటిని కలుషితం చేయటం మూలంగా జీర్ణ వ్యవస్థ నాశనం అయి జలచరాలు మృత్యువాతపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
తలలో కత్తెర దిగినా.. బస్సెక్కి ఆసుప్రత్రికి..
బీజింగ్ : మనకేమైనా ప్రమాదం ఏర్పడి తృటిలో తప్పిపోతే... హమ్మయ్యా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశామో? అనుకుంటాం. చైనాకు చెందిన ఓ మహిళ కూడా ఇలానే అనుకునే సందర్భం ఎదురైంది. కత్తెరతో చెట్ల ఆకులను కత్తిరిస్తోండగా ప్రమాదవశాత్తు ఆమె తలలోకి కత్తెర దూసుకెళ్లింది. వెంటనే ఆమె అలాగే బస్సు ఎక్కి హాస్పిటల్కు వెళ్లి చికిత్స తీసుకుంది. ఉదయాన్నే ఇంట్లోని మొక్కలకు ఉన్న ఆకులను కత్తిరిస్తూ ఉంది. అక్కడే ఉన్న వెదురు చెట్టుకు ఆ కత్తెరను గుచ్చిపెట్టింది. దురదృష్టవశాత్తు గుచ్చిన కత్తెర జారీ కింద ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు మహిళకు చికిత్స చేసి ఆ కత్తెరను తొలగించారు. తలలో రెండు నుంచి మూడు మిల్లిమీటర్ల దూరం కత్తెర దూసుకెళ్లిందని వైద్యులు పేర్కొన్నారు. కత్తెర నిలువుగా మహిళ తలలోకి దూసుకెళ్లి వుంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయేదని చెప్పారు. ప్రస్తుతం ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. -
బాలుడి తలలో దిగిన కర్ర
అశ్వాపురం: ఓ బాలుడు మిత్రులతో సరదాగా ఆడుకుంటూ చింతకాయల కోసం చెట్టుకు కర్రలు విసురుతుండగా ప్రమాదవశాత్తూ తలలో గుచ్చుకున్న ఘటన అశ్వాపురం మండలం రామచంద్రాపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గూడూరు మధుకర్రెడ్డి(10) పాఠశాల నుంచి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుకుంటూ చింతచెట్టు వద్దకు వెళ్లాడు. స్నేహితుడు వెనుక నుంచి కర్ర విసరగా, మధుకర్ తల కింది భాగంలోకి దిగింది. చిన్న మెదడుకు సమీపంలో గుచ్చుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాలుడు స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. -
ఆ తల ఆడ శిశువుదే!
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ చిలుకానగర్లోని మైసమ్మ దేవాలయం వద్ద నివసించే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించింది ఆడ శిశువు తలేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్థారించారు. ఈ నెల ఒకటిన లభించిన ఈ తలకు సంబంధించిన మొండెం ఆచూకీ లేకపోవడంతో ఆడా, మగా అన్నది ఇప్పటి వరకు తేలలేదు. తలకు ప్రాథమిక పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ వైద్యులు సైతం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు చెందిన నిపుణుల సహాయం కోరారు. ఈ తలకు సంబంధించిన పుర్రె నిర్మాణం తదితరాలను అధ్యయనం చేసిన నిపుణులు.. ఆడ శిశువు తలగా ప్రాథమికంగా నిర్ధారిస్తూ శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న రాజశేఖర్ పోలీసు విచారణలో నోరు విప్పట్లేదు. అదుపులోకి తీసుకుని విచారించిన తొలిరోజు తానే నరబలి ఇచ్చానంటూ చెప్పినా ఆపై మాట మార్చాడు. పోలీసులు పదేపదే ప్రశ్నించినందుకు అలా చెప్పానంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇతడి నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సిటీకి చెందిన ప్రత్యేక క్లూస్ టీమ్ను చిలుకానగర్కు రప్పించారు. ప్రధాన అనుమానితుడు రాజశేఖర్ ఇంటితో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. రాజశేఖర్ ఇంటికి సంబంధించి అతడు నివసించే డాబాతో పాటు పక్కనే ఓ రేకుల షెడ్డు కూడా ఉంది. దీనిపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వెదురు చీపురును అధికారులు గుర్తించారు. దీంతో పాటు లభించిన కొన్ని వస్తువుల్ని అనుమానిత వస్తువుల జాబితాలోకి చేర్చారు. ఇలాంటి వాటిని సాధారణంగా క్షుద్రపూజల కోసం వినియోగిస్తారని అనుమానిస్తున్న అధికారులు.. నిర్థారణ కోసం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఇంటి బెడ్రూమ్లో కొన్ని అనుమానిత మరకల్నీ ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఇవేంటనేవి గుర్తించేందుకు పరీక్షలకు పంపారు. శనివారం ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరోపక్క శవమైన చిన్నారి ఎవరనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కరీంనగర్ జిల్లా తండాల నుంచి తీసుకువచ్చిన శిశువుగా వార్తలు రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆ జిల్లాలో ఆరా తీశాయి. తండాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై కూపీ లాగుతున్నారు. గతేడాది çనవంబర్ నెలలో పాతబస్తీలోని ఓ ప్రాంతం నుంచి శిశువు అదృశ్యమైనట్లు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ శిశువుకు తల్లిదండ్రుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిసింది. ఈ నమానాలకు రాజశేఖర్ ఇంటిపై లభించిన తల నుంచి సేకరించిన నమూనాలతో పోలుస్తూ డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని సమాచారం. మిస్టరీగా మారి, పోలీసులకు సవాల్ విసురుతున్న ఈ కేసుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. -
వీడిన చిన్నారి నరబలి కేసు మిస్టరీ
-
ఉప్పల్లో దారుణం
-
ఉప్పల్లో దారుణం
హైదరాబాద్ : ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మూడు నెలల చిన్నారి చంపి అనంతరం తలను ఓ భవనంపై పడేశారు. హనుమంతు అనే వ్యక్తి తన ఇంటిపై చిన్నారి తలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి అడిషనల్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్ గిరి డీసీపి ఉమామహేశ్వర శర్మ తదితరులు చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ఎవరైందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి హైలెవెల్ ఎంక్వైరీ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
నల్లగొండలో మరో హత్య ; తల నరికి జెండాదిమ్మెపై..
సాక్షి, నల్లగొండ : వరుస దారుణకాండలు నల్లగొండ జిల్లాలో కలకలంరేపుతున్నాయి. కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ కేసు మరువకముందే మరో వ్యక్తి అతిదారుణంగా హత్యకుగురయ్యాడు. సోమవారం ఉదయం నల్లగొండ పట్టణం బొట్టుగూడలోని ఓ జెండాదిమ్మెపై తెగిపడిన తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తల పాలకూరి రమేశ్దిగా పోలీసులు గుర్తించారు. ఎవరు చేశారీ ఘాతుకం?: హతుడు రమేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న అతను.. మందుతు తెచ్చుకుంటానని ఇంట్లోవాళ్లకు చెప్పి ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. గుర్తుతెలియని దుండగులు రమేశ్ను కిరాతకంగా చంపి, తలను, మొండెంను వేరుచేశారు. అనంతరం తలను తీసుకొచ్చి బొట్టుగూడలోని జెండాదిమ్మెపై ఉంచివెళ్లారు. సమాచారం తెలిసన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాడ్స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక్కడి భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద రమేశ్ మొండేన్ని గుర్తించారు. ఈ హత్యచేసింది ఎవరు, ఇందుకు దారితీసిన పరిస్థిలేమిటనే విషయాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధమే రమేశ్ మరణానికి కారణమై ఉంటుందని తెలిసింది. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణకావాల్సిఉంది. కొద్ది రోజుల కిందటే నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురికావడం రాజకీయంగా కలకలంరేపింది. అధికార పార్టీకి చెందిన గుండాలే నిందితులని విపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శ్రీనివాస్ హత్య కేసులో నిదితులను పోలీసులు అరెస్టుచేశారు. ఒకప్పుడు క్రైమ్ డెన్గా ఉన్న నల్లగొండలో కొంతకాలంగా ప్రశాంత నెలకొంది. కానీ వరుస హత్యాకాండలు మళ్లీ పాతరోజులను గుర్తుచేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. -
తల 180 డిగ్రీలు తిరుగుతోంది
-
ఇలా తల తిప్పడం ఎవరికి సాధ్యం?
సాక్షి, కరాచి : ఎవరైనా వెనక్కి తిరిగి చూడాలంటే మనిషే పూర్తిగా వెనక్కి తిరిగి చూస్తారు. అలా మనిషి కాకుండా తలను మాత్రమే తిప్పి చూడాలంటే 90 డిగ్రీల వరకు తలను తిప్పి చూడగలరు. అంతకుమించి తిప్పడం ఎవరికి సాధ్యపడదు. కానీ కరాచీ నగరానికి చెందిన మన 14 ఏళ్ల ముహమ్మద్ సమీర్ తన తలను 180 డిగ్రీలు వెనక్కి తిప్పి చూడగలరు. వెనక్కి తిరక్కుండానే తన తలను భూజాల మీదుగా పూర్తిగా వెనక్కి తిప్పగలరు. ఎలాగంటే గుడ్లగూబ లాగ. కాకపోతే చేతుల ఆసరాతో. ఈ అరుదైన విద్యను సమీర్ చాలా కష్టపడే నేర్చుకున్నారు. తండ్రి జబ్బు పడడంతో సమీర్ తన అరుదైన విద్యను ఆసరాగా చేసుకొని జీవనోపాధి వెతుక్కున్నారు. డ్యాన్స్ కూడా నేర్చుకున్న సమీర్ 8 మంది సభ్యులుగల ‘డేంజరస్ బాయ్స్’ డ్యాన్స్ బృందంలో చేరారు. డ్యాన్స్కు తన తిప్పుడును జోడించడంతో బృందంలో ప్రత్యేకంగా రాణిస్తున్నారు. ‘అమ్మో! సమీర్ వెనక్కి పూర్తిగా తల తిప్పడం చూసి మొదట దిగ్భ్రాంతి చెందాను. నిజంగా అది అద్భుతమే’ అని బృందంలోని లీడింగ్ డ్యాన్సర్ అశర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇదే విషయమై సమీర్ను ప్రశ్నించగా ‘నాకు ఆరేడేళ్లు ఉన్నప్పుడు ఓ హాలీవుడ్ హార్రర్ చిత్రంలో ఓ పాత్ర ఇలా తన తలను 180 డిగ్రీలు వెనక్కి తిప్పడం చూశాను. అది ఎందుకో నాకు బాగా నచ్చింది. అలా తలతిప్పడాన్ని రోజూ ప్రాక్టీసు చేస్తూ వచ్చాను. కొన్ని నెలల్లోనే నేను విజయం సాధించాను. ఒకరోజు అలా ప్రాక్టీసు చేస్తూ మా అమ్మ కంట్లో పడ్డాను. అప్పుడు నెత్తిమీది నుంచి ఒక్కటిచ్చుకున్న మా అమ్మ, ఇంకెప్పుడు అలా చేయవద్దని, మెడ విరుగుతుందని తిట్టారు. అప్పటి నుంచి ఆమెకు తెలియకుండా ప్రాక్టీసు చేస్తూ వచ్చాను. ఆ తర్వాత నా మిత్రులు, ఇరుగుపొరుగువారు నా విద్యను చూసి ప్రశంసిస్తూ వచ్చారు. అదే అతని బతుకుతెరువుకు దారి చూపింది. జౌళీ పరిశ్రమలో పనిచేస్తున్న సమీర్ తండ్రి రెండుసార్లు గుండెపోటు రావడంతో మంచంపట్టారు. అప్పటి నుంచి సమీర్ డ్యాన్స్ బృందంలో చేరి ప్రదర్శనలు ఇస్తున్నారు. రోజుకు ఆరు నుంచి పది పౌండ్ల వరకు, నెలకు వంద నుంచి 120 పౌండ్ల వరకు సంపాదిస్తున్నారు. -
మా ఫీల్డర్లే గెలిపిస్తారు
ఆసీస్ బ్యాట్స్మన్ హెడ్ ధీమా చెన్నై: తమ జట్టులో అత్యంత నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారని, వారే భారత్తో జరిగే వన్డే సిరీస్లో జట్టు విజయానికి కారణమవుతారని ఆసీస్ బ్యాట్స్మన్ ట్రెవిస్ హెడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఓ మ్యాచ్ గెలవాలన్నా.. ఓడాలన్నా ఫీల్డింగే కారణమవుతుంది. అయితే ఈ విషయంలో మా జట్టు గర్వపడాల్సి ఉంది. ఎందుకంటే అద్భుతమైన ఫీల్డింగ్ మా సొంతం. ఈ విషయంలో మేం చాలా కష్టపడ్డాం. తమ ఫీల్డింగ్తో జట్టును గెలిపించే వారు మా జట్టులో ఉన్నారు’ అని హెడ్ అన్నాడు. ఫించ్ అనుమానమే... ఆసీస్ పించ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది. అతడి కాలి పిక్క కండరాల నొప్పి ఎక్కువ కావడమే ఇందుకు కారణం. నెట్ ప్రాక్టీస్ సమయంలో తను గాయపడటంతో సెషన్కు దూరంగా ఉంచి విశ్రాంతి కల్పించారు. ఒకవేళ మ్యాచ్కు అందుబాటులో లేకపోతే హెడ్ లేదా కార్ట్రైట్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. -
అరుదైన ఆపరేషన్:వీణావాణి భవిష్యత్పై ఆశ
న్యూఢిల్లీ: భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అరుదైన శస్త్రచికిత్సను ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన అవిభక్త కవలలు వీణావాణి మాదిరే తలలు అతుక్కుని పుట్టిన కవలలకు ఈ శస్త్రచికిత్సకు వైద్యులు శ్రీకారం చుట్టారు. ఒడిశా కంధమాల్ జిల్లాలో ఓ పేద రైతుకుటుంబంలో పుట్టిన జగన్నాథ్, బలియాలను వేరుచేసే హిస్టారికల్ ఆపరేషన్ను సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వయసు రెండు సంవత్సరాల మూడు నెలలు. చాలా అరుదైన ఈ కవలలిద్దరీ కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామనీ, కనీసం ఒక్కరు బతికినా అది చారిత్రక ఘటనగా నిలిచిపోతుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. మెదడు నుండి గుండెకు రక్తాన్ని పంప్ చేసే సిరలను కవలలిద్దరూ పంచుకుని పుట్టడంతో ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైందని వైద్యులు చెప్పారు. దాదాపు 40మంది స్పెషలిస్టులు ఈ ఆపరేషన్లో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 50 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగనుంది. మొదటి దశలో 6నుంచి 8 గంటలపాటు ఉంటుందని సమాచారం. పీడియాట్రిక్ న్యూరో సర్జన్లు, న్యూరో-అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియోవాస్క్యులర్ సైన్సెస్కు చెందిన నిపుణులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వీరికితోడు ఈ ప్రక్రియలో జపాన్ ఎక్స్పర్ట్ కూడా సహాయపడనున్నారు. పలుమార్లు ఎంఆర్ఐలు, యాంజియోగ్రాములు, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఇటువంటి శస్త్రచికిత్సలపై స్టడీ, అనేకమంది నిపుణులతో సంప్రదింపులు తరువాత కవలలో కనీసం ఒకరినైనా రక్షించాలని ఆశతో ఈ నిర్ణయానికి వచ్చామని ఎయిమ్స్ సర్జన్ ఒకరు చెప్పారు. మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ విజయంతం కావాలని ఆకాక్షించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చగా, కాంధమాల్ ఎడ్మినిస్ట్రేషన్ రూ.లక్ష అందించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కాంధమాల్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వివిధ దశల్లో ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదడునుండి సిర వేరు చేసి, ఒక ప్రత్యామ్నాయ సిర ఛానెల్ ఏర్పాటు చేస్తారు. అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ.. పూర్తిగా మెదడును వేరుచేసి, చర్మాన్ని మూసివేయడంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇది విజయవంతమైతే భవిష్యత్తు వైద్యశాస్త్రవిజ్ఞానానికి ఒక ఆశను ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా మరిన్ని పరిశోధనలకు అవకాశం కలుగుతుందనే ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు. కాగా ఒడిశా కంధమాల్ జిల్లా కు చెందిన భుయాన్, పుష్పాలకు వీరు జన్మించారు. గత నెలలో వీరిని ఎయిమ్స్కు తరలించారు. మరోవైపు పాట్నాకు చెందిన సిస్టర్స్ సబా ,ఫరా 20 ఏళ్ల వయస్సు. ప్రమాదాల కారణంగా వారు ఆపరేట్ చేయలేదు. అయితే ఇటీవలి కాలంలో న్యూయార్క్లోని ని మాంటెఫియోర్ ఆసుపత్రి సర్జన్లు 13 నెలల వయస్సున్న కవలలను విజయవంతమైన వేరు చేయడం విశేషం. తలలు కలిసి పుట్టే కవలలు చాలా అరుదు. 2.5 కోట్లమందిలో ఒక జననం సంభవిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇలాంటి మొత్తం జననాల సుమారు సంఖ్య 10. అటువంటి కవలలలో నాలుగురు పుట్టినప్పుడే చనిపోగా, 24 గంటల్లో ముగ్గురు మరణించారు. 1952 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కవలలను వేరు చేయటానికి కేవలం 50 ప్రయత్నాలు మాత్రమే జరిగాయి. సక్సెస్ రేటు 25శాతం కన్నా తక్కువ. ఈ ఆపరేషన్ పూర్తి విజయంవంతం కావాలని కోరుకుందాం. ఈ నేపథ్యంలో మన వీణావాణి కష్టాలు కడతేరి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనం కూడా ప్రార్థిద్దాం! -
బుల్లెట్ దిగింది..! 67 రోజులు బతికాడు
పాయింట్ బ్లాంక్ మీద గన్పెడితే అవతలి వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే గురి తప్పదు.. క్షణాల్లో తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది. ఒక్కసారి బుల్లెట్ తలలోకి వెళ్లిందంటే ఆ వ్యక్తి బతికి బట్టకడుతాడని ఎవరూ ఊహించరు. కానీ, ఓ వ్యక్తి తలలోకి బుల్లెట్ దూసెకెళ్లినా అతనికి ఏమీ కాలేదు. తలలో బుల్లెట్ దిగిన రెండునెలల తర్వాత కానీ అతను మరణించలేదు. తలలో బుల్లెట్ ఉన్నప్పటికీ ఆయన తనరోజువారీ కార్యకలాపాలలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదు. అన్ని రోజులు ఎలా బతికి ఉన్నాడో వైద్యులకు సైతం అంతుచిక్కలేదు. మరి ఆ విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందామా.....! ఐర్లాండ్లో పుట్టిన కాన్ స్టాప్లెటన్ 1872లో న్యూయార్క్లో అడుగుపెట్టాడు. 1876లో అక్కడ మార్షల్ ఉద్యోగాన్ని సంపాదించాడు. విధి నిర్వహణలో స్టాప్లెటన్ అంకితభావంతో పనిచేసేవాడు. డేవిడ్ లంట్ స్టాప్లెటన్ ఇద్దరు మంచి స్నేహితులు. లంట్ కూడా చాలా మంచివాడని, నెమ్మదస్తుడని అందరూ అంటుండేవారు. అతిని చుట్టుపక్కలవారు లంట్ను ఎక్కువగా ఇష్టపడుతుండేవారు. ఒకరోజు హత్యకేసులో నిందితుడైన హరీ విలియమ్స్కు కోర్టు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అతన్ని జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. మార్షల్ స్టాప్లెటన్ ఈ విషయాన్ని కెప్టెన్ హర్దిక్కు తెలియజేశాడు. అతని సాయంతో రెండురోజుల తర్వాత ఒక క్యాబిన్లో తలదాచుకుంటున్న విలియమ్స్ను స్టాప్లెటన్ అరెస్టు చేసి జైలుకు తరలించాడు. పెనుగులాట... కొన్ని రోజుల తర్వాత అనగా 14 జనవరి 1877న స్టాప్లెటన్, డెవిడ్ లంట్, మరికొద్ది మంది కలిసి ఒక సెలూన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్నేహితులు అందరూ కలిసి సెలూన్లో కూర్చొని కూల్డ్రింక్లు తాగుతూ సంభాషించుకోవడం వారికి అలవాటే. ఇంతలోనే సెలూన్ డోర్ పగులకొట్టుకుంటూ ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. సెలూన్ లోపలికి వచ్చిన విలియవస్ సహచరుడు టామ్ స్మిత్... ఎవరైనా కదిలితే కాల్చి పడేస్తానని బెదిరించాడు. స్టాప్టెటన్ దగ్గరికి వెళ్లిన స్మిత్ అతని నుదుటిపై రివాల్వర్ను పెట్టాడు. ఇది చూసిన డెవిడ్ లంట్ బిగ్గరగా అరుచుకుంటూ స్మిత్ దగ్గరికి వెళ్లి ఆపేందుకు ప్రయత్నించాడు. స్టాప్లెటన్, స్మిత్, డేవిడ్ లంట్ ముగ్గురి పెనుగులాటలో రివాల్వర్ పేలింది. ఆ రివాల్వర్ నుంచి వెళ్లిన బుల్లెట్ నేరుగా డేవిడ్ లంట్ తలలోకి వెళ్లింది. అయితే అక్కడున్నవారంతా డేవిడ్ చనిపోతాడని భావించారు. ఏకంగా తలలోకే బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడు బతకడం అసాధ్యమని అక్కడున్న వారందరూ భావించారు. కానీ, ఆయన ఎలాంటి స్పృహ తప్పకపోవడంతో బుల్లెట్ ఆయనకు తగలలేదని అనుకున్నారు. బహుశా.. అది డేవిడ్ తలను రాసుకుంటూ ఎటోవెళ్లిపోయి ఉంటుందని, అందుకే డేవిడ్ బతికి బట్టగలిగాడని ఎవరికి వారు సమాధాన పరుచుకున్నారు. అందుకే, స్నేహితులంతా కలిసి డేవిడ్కు ప్రాథమిక చికిత్స చేయించారు. స్మిత్ను... అరెస్టుచేసి కోర్టులో హజరుపరుచారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అతన్ని కోర్టు నిందితుడిని విడుదల చేసింది. 67 రోజుల తర్వాత... నిజానికి సెలూన్లో జరిగిన కాల్పుల్లో డెవిడ్ లంట్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ తగిలినా.. డెవిడ్ కుప్పకూలలేదు. తీవ్ర రక్తస్రావం జరగలేదు. కనీసం స్పృహ కూడా తప్పలేదు. చిన్నగాయం తగిలినంత నొప్పే తప్పా.. ఎలాంటి ఇబ్బంది డేవిడ్కు కలగలేదు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులకు కూడా డేవిడ్ తలలో బుల్లెట్ ఉందన్న అనుమానం రాలేదు. పైగా డేవిడ్ తన రోజువారీ కార్యకలాపాలకు వెళుతుండటంతో డేవిడ్కు కూడా ఎలాంటి సందేహం కలగలేదు. సెలూన్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత డెవిడ్కు తలనొప్పిరావటం మొదలైంది. చిన్నగా మొదలైన నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు తలలో బుల్లెట్ ఉందన్న విషయాన్ని గమనించారు. ఈ తీవ్రమైన తలపోటుకు బుల్లెట్టే కారణమని డాక్టర్లు ధృవీకరించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 1877 మార్చి 22న అంటే.. దాడి జరిగిన 67 రోజుల తర్వాత డేవిడ్ లంట్ ప్రాణాలు విడిచాడు. అర ఇంచు రంధ్రం చేసిన బుల్లెట్ డెవిడ్ మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. దాడి జరిగిన రోజున ఆయన తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ పుర్రెకు అరఇంచుమేర, మెదడుకు సమీపంలో రంధ్రం చేసిందని డాక్టర్లు గుర్తించారు. దానివల్ల ఇన్ఫెక్షన్ మొదలై.. చీము ఏర్పడి ఆ ప్రాంతమంతా కుళ్లిపోయేలా చేసింది. దాంతో డేవిడ్ మరణించినట్లు డాక్టర్ల పరిశోధనలో తేలింది. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిన ఇన్నాళ్లు ఎలా బతికున్నాడని డాక్టర్లుకు సైతం అంతు చిక్కలేదు. ఇలా జరగడం వైద్య చరిత్రలో ఎన్నడూ లేదని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ రోజున కోర్టు విడుదల చేసిన డేవిడ్ను హత్యకేసులో మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ శిక్ష విధించింది.– సాక్షి స్కూల్ ఎడిషన్ -
రక్త కన్నీరు..
ఈ పిల్లాడి పేరు అఖిలేశ్ రఘువంశీ(10). మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో ఉంటాడు. తండ్రి వ్యవసాయదారుడు. చూశారుగా.. సమస్య ఏమిటో.. ఒక్క కంటి నుంచే కాదు.. తల నుంచి.. చెవి నుంచి.. ముక్కు నుంచి.. కాళ్ల నుంచి రక్తం ధారలా కారుతుందట. ఒక్కోసారి రోజుకు 10 సార్లు వస్తే.. ఒక్కోసారి మూడు నెలల వరకూ దాని జాడే కనిపించదట. మూడేళ్ల నుంచి అఖిలేశ్ ఈ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. చాలా మంది డాక్టర్లు చూశారు. ఎయిమ్స్ వైద్యులు సైతం పరీక్షించారు. కారణం ఇదీ.. అని ఎవరూ చెప్పలేకపోయారు. దెబ్బ తగలకున్నా.. రక్తం కారిపోతూ ఉంటుందని.. ఇలా వచ్చినప్పుడు తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అఖిలేశ్ చెబుతున్నాడు. ఇతడు ‘హీమోలక్రియా’ తో బాధపడుతుండొచ్చని చెబుతున్నప్పటికీ.. పూర్తిగా నిర్ధారించడం లేదు. హీమోలక్రియాతో బాధపడుతున్నవారి కంటి నుంచి రక్తం వస్తుంటుంది. వైద్యులు ఏదీ సరిగా చెప్పకపోవడంతో తన కొడుకు ఏమైపోతాడా అన్న ఆందోళన అతడి తండ్రిలో నెలకొంది. ప్రపంచంలో పేరుగాంచిన వైద్యులు అఖిలేశ్కు వచ్చిన వ్యాధికి చికిత్సను సూచించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. -
ఉదరమే ఆధారం...
పొట్ట ఆధారంగా చేసే ఆసనాల సాధన ద్వారా అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ఆసనాల గురించిన వివరణే.... 1. భుజంగాసన (కోబ్రా పోజ్) బోర్లా పడుకుని మకరాసనంలో చేతులు రెండు మడచి కుడిచేయిని ఎడమ చేతిమీద ఉంచాలి. చేతుల మీద గడ్డం ఆనించి తలకొంచెం లిఫ్ట్ చేసేటట్లుగా ఉంచాలి. పాదాల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం, కాలి బొటన వేళ్ళు భూమికి దగ్గరగా ఉంచినట్లయితే పొత్తి కడుపు భాగం, తొడలు పూర్తిగా భూమికి ఆని విశ్రాంతి కలుగుతుంది. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలకు మధ్య మధ్యలో ఇలా మకరాసనంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు పాదాలు రెండు కలిపి (వెన్నెముక లేదా సయాటికా సమస్య ఉన్నట్లయితే కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచవచ్చు) అరచేతులు ఛాతీకిరువైపులా ఉంచి శ్వాసతీసుకుంటూ గడ్డాన్ని తలను పైకి లేపాలి. తరువాత చేతులు బలంగా నేలకు నొక్కుతూ మోచేతులు ఓపెన్ చేస్తూ ఛాతీని వీలైనంత పైకి లేపాలి. బొడ్డు నుంచి కిందకు నేలమీద పూర్తిగా ఆనేటట్లుగాను బొడ్డు నుంచి పై భాగాన్ని వీలైనంత పైకి లేపే ప్రయత్నం చేయాలి. (ఇది పూర్తి భుజంగాసన స్థితి). ఇలా కష్టం అన్పిస్తే మోచేతుల నుండి ముందు భాగం వరకూ పూర్తిగా రెండు చేతులను నేల మీద శరీరం ఇరువైపులా ముందుకు ఉంచి తలను ఛాతీని పైకి లిఫ్ట్ చేసే అర్థ భుజంగాసన ను ఎంచుకోవాలి. 1ఎ) భుజంగాసన: పూర్తి భుజంగాసన స్థితిలో ఉన్నప్పుడు తలను కుడివైపుకు తిప్పి కుడి భుజం మీదుగా వెనుక పాదాలను మళ్ళీ తలను ఎడమవైపుకు తిప్పి ఎడమ భుజం మీదుగా వెనుక పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట ఛాతీభాగాలను తరువాత గడ్డంను నేలమీదకు తీసుకు రావాలి. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపడం, శ్వాస వదులుతూ తిరిగి నేల మీదకు మకరాసనంలో విశ్రాంత స్థితికి రావాలి. ఉపయోగాలు: నడుము కింది భాగంలో నొప్పి (లోయర్ బ్యాక్యేక్)కి ఉత్తమమైన ఆసనం. ఉదరం, చిన్నప్రేవులు, ప్రాంక్రియాస్, లివర్, గాల్బ్లాడర్కు టోనింగ్తో అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ, ఎడ్రినల్ గ్రంథులు సమర్థవంతంగా పనిచేయడానికి, కార్టిసోన్ హార్మోను ఉత్పత్తిని నియంత్రణకి వీలవుతుంది. కీళ్లనొప్పులకు, రెనిమాటిజమ్కు పరిష్కారం. స్త్రీలలో ఓవరీ, యుటరస్కు టోనింగ్ జరిగి రుతు చక్రసమస్యలకు. పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి అవకాశం. జాగ్రత్తలు: గర్భిణీస్త్రీలు, పెప్టిక్ అల్సర్స్, హెర్నియా, ఇంటెస్టియల్ ట్యూబరోక్లోసిస్ ఉన్నవారు సాధన చేయరాదు. 2. సర్పాసన (స్నేక్ పోశ్చర్) మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండి, గడ్డం నేల మీద ఆనించి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండూ నేలకు గట్టిగా నొక్కుతూ, ఇంటర్లాక్ చేసిన చేతుల్ని గట్టిగా పుష్ చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. చేతులు వేరే వాళ్లు గుంజుతూంటే ఎలాంటి అనుభూతి కల్గుతుందో అదేవిధంగా చేయడానికి ప్రయత్నించాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ మళ్ళీ క్రిందకు రావాలి. ఇలా 3/ 5 సార్లు రిపీట్ చేయవచ్చు. ఉపయోగాలు: వెన్నెముక బలపడటానికి, ఊపిరితిత్తులు, ఛాతీ, భుజాలు, పొట్ట భాగాలు స్ట్రెచ్ అవడానికి ఉపయోగపడుతుంది. భుజంగాసనం చేయడం వల్ల కలిగే లాభాలన్నీ సర్పాసనం చేయడం వల్ల కూడా కల్గుతాయి. - సమన్వయం: సత్యబాబు -
శిరస్నానం..పవిత్రత ప్రధానం
కృష్ణా పుష్కరాల్లో నదీస్నానమాచరించండానికి చాలా మంది ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. స్నానమెలా ఆచరించాలో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు.. – పవిత్రమైన హృదయంతో నది దగ్గరకు చేరుకోవాలి. – తీరం నుంచి నదికి నమస్కరించాలి – నదిని, తీరాన్ని పవిత్రంగా ఉంచాలి.. – మొదటగా పవిత్ర నదీ జలాలను శిరస్సుపై చల్లుకొని స్నానానికి ఉపక్రమించాలి. – వీలైతే సమంత్ర పూర్వకంగా సంకల్పం చెప్పుకొని (చెప్పించుకొని) స్నానం చేయాలి. – లేదంటే తమ గోత్రనామాలను చెప్పుకుని ‘‘కృష్ణా కృష్ణా కృష్ణా’’ అని మూడుసార్లు నదిని స్మరించి స్నానం చేయాలి. –ఖచ్చితంగా శిరస్నానం చేయాలి. – నదిలో సూర్యుడికి మూడు అర్ఘ్యములనివ్వాలి. – స్నానమైన తర్వాత శుభ్రమైన పొడిబట్టలను కట్టుకొని కుంకుమ ధరించాలి. – కృష్ణానదీమ తల్లిని పూజించి వాయనం సమర్పించాలి. – ఒడ్డున ఉన్న లేదా దగ్గరలో ఉన్న దేవాలయాలను తప్పక దర్శించాలి. – యథాశక్తి ధానధర్మాలను ఆరచించాలి. – పుష్కర సమయంలో పెద్దలకు పిండప్రదానము ఆచరించాలి. – పిండ ప్రదానినికి ఆకులతో తయారు చేసిన విస్తరాకులనే ఉపయోగించాలి. – శ్రాద్ధమైన తదుపరి తప్పక పిండములను నదిలో నిమజ్జనం చేయాలి. – నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. – పవిత్ర కృష్ణాపుష్కర జలాలను ఇంటికి తీసుకెళ్లి పూజా మందిరంలో ఉంచి నిత్యం పూజించాలి. – కర్నూలు(న్యూసిటీ) -
ఆచూకీ తెలపండి
పోలీసులకు సహకరించండి డీఎస్పీ రామాంజనేయులు తాడేపల్లి (తాడేపల్లిరూరల్) : ‘నిందితుల ఆచూకీ తెలపండి.. పోలీసులకు సహకరించండి’.. అంటూ మంగళగిరి రూరల్ డీఎస్పీ రామాంజనేయులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని అతి కిరాతకంగా మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. చనిపోయిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొండెం నుంచి తల వేరైన వ్యక్తి ముఖ చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వారు 94407 96216, లేదా 94407 96392 నంబర్లకు వివరాలు ఇవ్వాలన్నారు. -
తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
మోత్కూరు : కుమారులు లేకపోవడంతో కూతురే తల్లికి తలకొరివి పెట్టిన సంఘటన మోత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆరెగూడేనికి చెందిన కొణతం ఎల్లమ్మ(70) మృతి చెందడంలో తన చిన్న కూతురు అరుణ తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. మృతురాలికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే భర్త లేకపోవడంతో కూతుర్ల వద్ద ఉంటోంది. వర్ధమాన్కోటలో చిన్న కూతురు వద్ద ఉంటూ అనారోగ్యంతో మృతి చెందిందని మృతురాలు బంధువులు తెలిపారు. కాగా మృతదేహాన్ని ఆరెగూడెం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆలివ్ ఆయిల్ మసాజ్
బ్యూటిప్స్ పొడిబారి, జీవం లేనట్టుగా ఉండే జుట్టుకు గోరువెచ్చని ఆలివ్ నూనె ఎంతో మేలుచేస్తుంది. అర కప్పు ఆలివ్ ఆయిల్ (లేదా మీ జుట్టుకు తగినంత) వేడి చేయాలి. చల్లారాక వేళ్లతో అద్దుకొని, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దువ్వెనతో కుదుళ్ల దగ్గర నుంచి కిందవరకు దువ్వాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ లేదా టవల్ను తలకు చుట్టాలి. అలా రాత్రి మొత్తం ఉంచవచ్చు. మరుసటి రోజు ఉదయం రసాయనాల గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు జీవకళ వస్తుంది. కొబ్బరి నూనెతోనూ ఇలాగే చేయవచ్చు. పొడిబారిన మాడు దురద కూడా పెడుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా అర కప్పు ఆలివ్ ఆయిల్లో 2 టీ స్పూన్ల తేనె కలిపి మాడుకు పట్టించాలి. వేడి నీళ్లలో ముంచిన టవల్ని గట్టిగా పిండి, దానిని తలకు చుట్టాలి. (భరించగలిగేంటతటి వేడి మాత్రమే ఉండాలి) 15 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. అర కప్పు వేడి చేసిన ఆలివ్ను తలకు పట్టించి, 2-3 గంటల తర్వాత తలస్నానం చేయాలి. చివర్లో 3-4 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మగ్గు నీళ్లతో తలంతా తడపాలి. పది నిమిషాల తర్వాత మంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కురులు, మాడుపై చర్మం మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. -
బస్సులోనుంచి తల బయటకు పెట్టి..
చెన్నై: బస్సులో నుంచి తల బయటకు పెట్టిన ఓ వ్యక్తి లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన దారుణ సంఘటన కాంచీపురం జిల్లాలోని మమందూర్ కు దగ్గరలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడలూరుకు చెందిన సొక్రటీస్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుట్టానికి అనారోగ్యంగా ఉండటంతో సొక్రటిస్, అతని అన్నయ్య, ఓ స్నేహితుడు కలిసి చూడటానికి బయలుదేరారు. సొక్రటిస్ బస్సులో చివరి నుంచి రెండో వరుసలో ఎడమ వైపు కిటికీ సీటులో కూర్చున్నాడు. మొత్తం 40మందికి పైగా ప్రయాణిస్తున్నబస్సులో తెల్లవారుజామున నిద్రపట్టకపోవడంతో సొక్రటిస్ బయటకు తలపెట్టి చూస్తున్నాడు. ఇంతలో బస్సు వెనుకే వచ్చిన లారీ బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించి సొక్రటిస్ తలను బలంగా ఢీ కొట్టింది. దీంతో అతను ఒక్కసారిగా పెద్ద అరుస్తూ బాధతో విలవిల్లాడిపోయాడు. దీంతో గాఢ నిద్రలో ఉన్న బస్సులోని ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతని పక్కనే ఉన్న ప్రయాణీకులు లేచి వెళ్లి డ్రైవర్ కు విషయం చెప్పడంతో అతను బస్సును ఆపినట్లు తెలిపారు. యాక్సిడెంట్ కు కారణమైన బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. Man, die, dangle, head, bus, window, బస్సు, కిటికి, వ్యక్తి, మృతి -
నూనె ఎలా పెడుతున్నారు?!
బ్యూటిప్స్ తలకు నూనె పెట్టామా.. షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు. ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టుకుదుళ్లు బలంగా ఉండి, మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.. ఈ ఏడు స్టెప్పులు పాటించాలి. 1. కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. 2. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి. 3. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి. 4. పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి. 5. కనీసం 30 నిమిషాలు వదిలేయాలి. 6. షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. 7. జుట్టు చివర్లకు కొన్నిచుక్కల నూనె రాయాలి. తలస్నానం చేసే ప్రతీసారీ ఈ విధంగా చేస్తుంటే మాడు పొడిబారదు, వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టురాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు. -
నూనె ఎలా పెడుతున్నారు?!
బ్యూటిప్స్ తలకు నూనె పెట్టామా.. షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టుకుదుళ్లు బలంగా ఉండి, మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.... 1. కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. 2. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి. 3. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి. 4. పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి. 5. కనీసం 30 నిమిషాలు వదిలేయాలి. 6. షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. 7. జుట్టు చివర్లకు కొన్నిచుక్కల నూనె రాయాలి. తలస్నానం చేసే ప్రతీసారీ ఈ విధంగా చేస్తుంటే మాడు పొడిబారదు, వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టురాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు. -
అల్ ఖైదా అగ్రనేత హతం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అల్ ఖైదా అగ్రనేతను మట్టుబెట్టింది. దేశంలోని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కు చెందిన ముఖ్యనేత నవాజ్ అలియాస్ హఫీజ్ అబ్దుల్ మతీన్ ను సైనిక బలాలు కాల్చి చంపాయి. మరో ఏడుగురు అనుచరులు కూడా ఈ పోరులో హతమయ్యారు. దేశం యొక్క తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని ఒక ప్రధాన జిల్లాలోని నది ఒడ్డున అనుమానిత తీవ్రవాదులు తలదాచుకున్న శిబిరంపై భద్రతాబలగాలు గురువారం అర్ధరాత్రి దాడి చేశాయి. దీంతో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ పోరు నెలకొంది.దీంతో మతీన్ , మరో ఏడుగురు ఉగ్రవాదులను సైన్యం ఖతం చేసింది. ప్రముఖ యూనివర్శిటీపై దాడిచేసేందుకు పథక రచనలో భాగంగా ఉగ్రవాదులు సమావేశమయ్యారని జిన్హువా వెల్లడించింది. నిఘావర్గాల సమాచారంతో , వీరి శిబిరంపై దాడిచేసి ఉగ్రవాదులను కాల్చి చంపాయి. టెర్రరిస్టుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మతీన్ మృతిని ధృవీకరించినట్టు తెలిపింది. వీరిలో 2009లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని పరేడ్ లేన్ బాంబుదాడి ఘటనలో 36 మంది మరణించిన కేసులో, సీనియర్ సైనిక అధికారిని హత్య చేసిన కేసులో నిందితుడైన అల్ ఖైదా కమాండర్ డేరా ఇస్మాయల్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ పరిణామంతో అల్ ఖైదా ప్రతీకార దాడులకు దిగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థలను టార్గెట్ గా ఎంచుకోవచ్చనే అంచనా లతో హై అలర్ట్ జారీ చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. -
గిరగిరా తిరిగితే ఎందుకు పడిపోతాం?
స్కూల్ ఎడ్యుకేషన్ నేలపై నిలబడి మన కాళ్లమీద వృత్తాకారంలో గిరగిరా తిరిగినప్పుడు, లేదా మన తలను వృత్తాకారంలో తిప్పినప్పుడు ఆ పని చేస్తున్నంతసేపూ మనకు ఏమీ అనిపించనప్పటికీ, ఆపిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయినట్లుగా ఉంటుంది. మనం సరిగ్గా నిలబడలేక వెంటనే కూర్చుండిపోతాం. ఒక్కోసారి కిందపడిపోతాం కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మన చెవుల లోపలి భాగంలో ఒక రకమైన సంచుల్లాంటి నిర్మాణాలు (కాక్లియా) కొన్ని ఉంటాయి. వీటిలో ఒక ద్రవం, ఆ ద్రవంలో కొన్ని స్ఫటికాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి మన సమతుల్యతను నియంత్రిస్తాయి. మన తలని గిరగిరా తిప్పినప్పుడు ఆ ద్రవంలోని స్ఫటికాలు కూడా అందుకు అనుగుణంగా తిరిగి, సంచుల గోడలను తాకి వాటిపై ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో వీటిని అంటిపెట్టుకుని ఉండే నాడులు ఆ సంకేతాలను మెదడుకి అందిస్తాయి. మెదడు అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. మనం గిరగిరా తిరిగినప్పుడు మన చెవుల్లోని ద్రవపు సంచుల్లోని స్ఫటికాలు కూడా తిరుగుతాయి. అయితే మనం ఆగిపోయిన వెంటనే అవి మళ్లీ తమ పూర్వ స్థితికి చేరుకోలేవు. దాంతో కొంతసేపటిదాకా అసలేం జరుగుతుందో మన శరీర వ్యవస్థకు అర్థంకాదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం సంతులతను కోల్పోయి కిందపడతాం. -
చాలెంజ్కు పోతే జుట్టూడిపోయింది!
బీజింగ్: సోషల్ మీడియాలో పాపులర్ అయిన వీడియోను అనుకరించబోయిన చైనా మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పవర్ డ్రిల్ మెషిన్ సహాయంతో మొక్కజోన్న కంకిని వేగంగా తినడానికి ప్రయత్నించి జుట్టును పోగొట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో ఎక్కువమంది వీక్షిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల చైనా సోషల్ మీడియాలో 'కార్న్ డ్రిల్ చాలెంజ్' పేరుతో ఓ వీడియో బాగా పాపులర్ అయింది. డ్రిల్ మిషన్కు మొక్కజోన్న కంకిని జోడించి అది వేగంగా తిరుగుతున్న సమయంలో కేవలం 10 సెకన్లలో ఆ కంకిని తినేయడం ఆ వీడియోలో కనిపించింది. ఐస్ బకెట్ చాలెంజ్, నాజుకు నడుము అని తెలిపేందుకు ఏ4 పేపర్ చాలెంజ్ లాగే దీనిని కూడా యువత వెర్రిగా అనుకరిస్తున్నారక్కడ. దీనిలో భాగంగా ఓ గుర్తుతెలియని మహిళ అనుకరించే సమయంలో ప్రమాదవశాత్తు డ్రిల్ మిషన్లో జుట్టు ఇరుక్కుపోయింది. క్షణకాలంలో జరిగిన ఈ ఘటనలో మహిళ తల ముందుభాగంలోని జుట్టు ఊడిపోయింది. దీంతో బట్టతల మాదిరిగా కనిపిస్తున్న ఆ మహిళకు డాక్టర్లు చికిత్స అందించారు. త్వరలోనే మళ్లీ జుట్టు వస్తుందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర చాలెంజ్లు అనుకరించొద్దని కొందరంటుంటే.. అది పూర్తిగా ఆ మహిళ తప్పిదమే అని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా చాలెంజ్తో ఇంత పాపులర్ అయ్యేదో కాదో తెలియదు కానీ.. ప్రమాదంతో మాత్రం సదరు మహిళ ఫుల్ పాపులర్ అయింది అంటున్నారు ఇంకొందరు. -
తల ఊగిపోయేలా చేసే నాడింగ్ డిసీజ్!
మెడి క్షనరీ ఏదైనా చల్లటి లేదా పుల్లటి పదార్థాన్ని నోట్లో పెట్టుకుంటే మన తల ఎలా వణుకుతుందో అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. కానీ మామూలు పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నా తలను అలాగే కదిలించేలా చేస్తుంది ఈ ‘నాడింగ్ డిసీజ్’. తలను వేగంగా అలా కదిలిపోయేలా చేస్తుంది కాబట్టే దానికి ఆ పేరు. పిల్లలు ఏదైనా తినే సమయంలో తల అలా కదిలిపోవడమే కాదు... ఆ పిల్లల్లో మానసిక వికాసం లోపిస్తుంది. శారీరకంగా ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఇది దక్షిణ సూడాన్, టాంజానియా, ఉత్తర ఉగాండా ప్రాంతాల్లో 5 - 15 ఏళ్లలోపు చిన్న పిల్లలకు వచ్చే ఒక వ్యాధి. టాంజానియాలో వైద్యచికిత్సలు అందిస్తున్న డాక్టర్ లోజీ జిలెక్ ఆల్ అనే నార్వేజియన్ సైకియాట్రిస్ట్ 1960 ప్రాంతాల్లో ఈ వ్యాధిని మొట్టమొదటిసారి రిపోర్టు చేశారు. ఆంకోసెరా ఓల్వులస్ అనే రకం నులిపురుగు వల్ల ఈ వ్యాధి వస్తుందని ఊహిస్తున్నారు. బ్లాక్ఫ్లై అని పిలిచే ఒక రకం కీటకం ద్వారా ఈ నులిపురుగుల వ్యాప్తి జరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా ఈ వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) అబ్నార్మల్గా ఉంటుందిగానీ మెదడు ద్రవం (సెరిబ్రోస్పైనల్ ఫ్లుయిడ్) నార్మల్గా ఉంటుంది. -
కాణిపాకం హుండీలో తలనీలాలు చోరీ
-
130 ఏళ్ళకు తలను శరీరాన్ని కలిపారు!
పారిస్ గైమెట్ మ్యూజియంలో ఏడవ శతాబ్దం నాటి హిందూ దేవతా విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటోంది. పదమూడు దశాబ్దాల తర్వాత ఆ శిల్పంలో విడిపోయిన తల భాగాన్ని తెచ్చి, ఇప్పటికే మ్యూజియంలో ఉన్నశరీర భాగానికి అతికించి ప్రదర్శనకు ఉంచారు. ఫ్రెంచ్.. వలస రాజ్యంగా ఉన్న సమయంలో హరిహరుల విగ్రహంలోని శిరస్సు భాగం అప్పటి ఫ్రెంచ్ కాలనీగా ఉండే కంబోడియాలో ఇటీవల బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడా శిరస్సును ఫ్రాన్స్ కు తెచ్చి శరీరంతో జోడించారు. దశాబ్దాల తర్వాత హరి హరుల శిల్పం సంపూర్ణ రూపం దాల్చింది. 130 ఏళ్ళుగా శరీర భాగంమాత్రమే మ్యూజియంలో ప్రదర్శనకు ఉండగా... ఇటీవల కంబోడియాలో బయటపడ్డ శిరస్సు భాగం.. ఫ్రాన్స్ మ్యూజియంలోని శరీరానికి సంబంధించినదిగా గుర్తించారు. దీంతో కంబోడియానుంచీ ఆ 47 కిలోల బరువున్నహరి హరుల శిరస్సును.. ఎట్టకేలకు మాతృదేశానికి చేర్చి శరీర భాగంతో కలిపారు. ఇప్పుడా శివ, విష్ణువుల అద్భుత కళా ప్రతిమ... పారిస్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాస్తవానికి టకియో ప్రావిన్స్లోని నామ్ డా ఆలయం నుంచి అప్పటి కలోనియల్ అడ్మినిస్ట్రేటర్ ఈటియెన్ అయమోనియర్ 1889 లో ఈ హరిహరుల శరీర భాగాన్ని ప్రదర్శన కోసం ఫ్రాన్స్ మ్యూజియం కు తెచ్చినట్లు మ్యూజియం జారీ చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తోంది. అయితే ఈ శిల్పంలోని ఎక్కువ భాగం ఫ్రాన్స్లో ఉండిపోవడంతో నామ్ పెన్ లో ఇటీవల బయటపడ్డ శిరస్సు భాగం నిజానికి దీనిదా కాదా... ఫ్రాన్స్ మ్యూజియంలోని శరీర భాగానికి ఇది సరిగా అతుక్కుంటుందా లేదా అనుకున్నారు. అయితే ఎట్టకేలకు శరీర భాగానికి శిరస్సు సరిగ్గా సరిపోయిందని, కంబోడియా నేషనల్ మ్యూజియమ్ డిప్యూటీ డైరెక్టర్ సియా సోఛీట్ స్థానిక వార్తా పత్రికకు తెలిపారు. -
పేలనాశిని
తలకు పేలు పట్టాయంటే ఆ బాధ వర్ణనాతీతం. ఎక్కువగా చిన్నపిల్లలకు తరచు తలలో పేలు పెరుగుతుంటాయి. అక్కడక్కడా పెద్దలకూ ఈ సమస్య ఉంటుంది. పేలను వదలగొట్టడానికి ఘాటైన రసాయనాలతో కూడిన షాంపూలను వాడాల్సి వస్తుంది. అయితే, పేలను సమూలంగా నాశనం చేసి పారేసే హైటెక్ దువ్వెనను జర్మన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సర్ఫేస్ ఇంజనీరింగ్ అండ్ థిన్ ఫిల్మ్స్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దువ్వెన తయారీలో శీతలీకరించిన ప్లాస్మాను ఉపయోగించారు. ఈ దువ్వెనలోని పళ్లను ఎలక్ట్రోడ్లుగా ఉపయోగపడేలా తయారు చేశారు. దీంతో ఈ దువ్వెనతో దువ్వినప్పుడు దాని పళ్ల మధ్య ఖాళీ జాగాలోని గాలి ఆ పళ్లను అయొనైజ్ చేసి, స్వల్పంగా విద్యుత్తు పుట్టేలా చేస్తుంది. ఫలితంగా దువ్వగానే ఇందులోని ప్లాస్మా విడుదలై, దాని ద్వారా వెలువడే షాక్ ప్రభావానికి తలలోని పేలు, ఈపులు వంటివన్నీ చచ్చి ఊరుకుంటాయి. అయితే, ఈ దువ్వెన ద్వారా వెలువడే షాక్ అత్యంత స్వల్పం కావడంతో దీని ప్రభావం మనుషులపై ఏమాత్రం ఉండదని దీని రూపకర్తలు చెబుతున్నారు. జర్మనీలోని కొన్ని పిల్లల ఆస్పత్రిలో ఈ దువ్వెనను ఇప్పటికే వాడుతున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి విడుదల కానుందని చెబుతున్నారు. -
తలలకు రక్ష
ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా చలాన్లు గీకేస్తుంటే, వారి బారి నుంచి తప్పించుకోవడానికి బజారులో దొరికే ఏవో హెల్మెట్ను కొనుక్కొచ్చి, తప్పనిసరిగా తలలకు తగిలించుకుంటాం. వాటి నాణ్యతను పెద్దగా పట్టించుకోం. అవి మన తలలకు ఏమాత్రం రక్షణ ఇస్తాయోనని ఆలోచించనే ఆలోచించం. యాక్సిడెంట్ల నుంచి హెల్మెట్లు ఎంతో కొంత రక్షణనిస్తాయనేది కాదనలేం గానీ, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి తలలకు పూర్తి రక్షణ ఇస్తాయనే భరోసా ఏమీ లేదు. అయితే, ఇక్కడ కనిపిస్తున్న 6డీ హెల్మెట్ మాత్రం సాధారణ హెల్మెట్లకు పూర్తిగా భిన్నమైనది. నిక్షేపంగా దీనిని ధరించే వారి తలలు పదిలంగా ఉంటాయి. ఈ హెల్మెట్ లోపల రెండు పొరలుగా ఫోమ్ లేయర్ ఉంటుంది. రెండు పొరలను విభజిస్తూ, వాటి మధ్య గాలి చొరబడేందుకు వీలుగా ఉండే చిన్న చిన్న రబ్బర్ సక్షన్ కప్పుల మాదిరి ఐసోలేషన్ డ్యాంపర్స్ బయటి నుంచి ఎదురైన ఎలాంటి తాకిడినైనా తట్టుకుని, తలకు పూర్తి రక్షణ కల్పించగలవని కాలిఫోర్నియాలోని ‘6డీ హెల్మెట్స్’ కో-ఫౌండర్ బాబ్ వెబర్ చెబుతున్నారు. -
టెంకాయ మీది పీచు... తలకాయ మీది కుచ్చు!
హ్యూమర్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ -
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..
జైపూర్: దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ చిరుతపులి తల ఓ బిందెలో ఇరుక్కుపోయింది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయి సుమారు రెండు గంటల పాటు నానా తిప్పలు పడ్డ చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు, పోలీసుల చొరవతో బయటపడింది. రాజస్థాన్ లోని రాజ్సమండ్ లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత ఘటనపై సమాచారమందుకున్న అధికారులు... వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని ఆపరేషన్ టైగర్ను మొదలుపెట్టారు. చిరుతకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. జాగ్రత్తగా బంధించారు. ఆ తర్వాత నిదానంగా బిందెలో చిక్కుకున్న పులి తలను బయటకు తీశారు. అయితే బిందె తీసేందుకు ముందు.. చిరుత చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ముఖానికి బిందెతో చిక్కకుండా... అధికారులందర్నీ పరుగులు పెట్టించింది. చివరకు మత్తు ఇంజెక్షన్ ప్రభావంతో చిరుత స్పృహ కోల్పోయిన తర్వాత అధికారులు తమ పని కానిచ్చారు. అనంతరం చిరుతను అధికారులు అక్కడ నుంచి తరలించారు. -
తలకు మించిన పాగా
తిక్క లెక్క సాధారణంగా ఎవరైనా తలకు మించిన భారాన్ని స్వచ్ఛందంగా తలకెత్తుకోరు. అయితే, సిక్కువీరుడు అవతార్సింగ్ మౌని మాత్రం ఇందుకు మినహాయింపు. తలకు మించిన పాగాను ఈ పెద్దమనిషి పదహారేళ్లుగా మోస్తూనే ఉన్నాడు. పాగాకు తగిలించిన వెండి అలంకరణల వల్ల దీని బరువు మరింత పెరిగినా, ఈయన మాత్రం ఏనాడూ ఈ పాగా లేకుండా బయట కనిపించడు. ఎందుకంటే, ఆయనకు అదో తుత్తి. ఈ పాగాకు వాడిన వస్త్రం పొడవు 645 మీటర్లు. పాగా బరువు 45 కిలోల పైమాటే! ఈయన కీర్తి ఈనోటా ఆనోటా... గిన్నిస్బుక్ వరకు వ్యాపించింది. ఈయనగారి పాగా ప్రపంచంలోనే అతిపెద్ద పాగాగా గిన్నిస్ బుక్ గత ఏడాది గుర్తించింది. -
వెన్నెల కురిపించిన ‘మండే సూర్యుడు’
‘అందమైన పొయెం అంటే/ దానికొక గుండె ఉండాలి/ అది కన్నీ ళ్లు కార్చాలి/ కాలపు బరువుల్ని మోయాలి/ బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కావాలి/ పద్యం మనిషి విజయానికి ఒక జెండా అయి ఎగరాలి.’ కవిత్వమంటే ఇది గుంటూరు శేషేంద్రశర్మ దృష్టి. భార తీయ సాహిత్యంలోనే శేషేంద్ర స్థానం ప్రత్యేకమైనది. కాలతత్వం గ్రహించి, అక్షరాలలో ‘కాలరేఖ’ను చిత్రించిన ద్రష్ట ఆయన. శేషేం ద్ర నినాద కవి కాదు. విధివిధాన కవి. శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తిన కవితా శివుడు. భారతీయ అలంకార శాస్త్రాల మీద అపారమైన అధికా రంతో, తనదైన ముద్రను సృష్టించుకుని, ఆ ముద్రతోనే కవితా జైత్రయాత్రను సాగించిన కవి ఆయన. ‘ఆధునిక మహాభారతం’, ‘జనవంశమ్’,(కవిత్వం) ‘ఈ నగరం జాబిల్లి’ (గజల్ను పరిచయం చేసే అద్భుత వ్యాసం), ‘మబ్బుల్లో దర్బారు’ (నాటిక), ‘కవిసేన మేనిఫెస్టో’, ‘షోడశి’ (రామాయణ రహస్యాలు), ‘కాలరేఖ’ (విమర్శ) వంటి అద్భుత రచనలు ఆయన తెలుగువారికి అందిం చారు. శేషేంద్ర లేఖలు మరో రమణీయ సృష్టి. ‘ఉత్తరం విప్పాను.. వెన్నెల జల జల రాలింది’ అంటూ ఆరంభమయ్యే ఈ లేఖా సాహిత్యం తెలుగు సాహి త్యంలోనే అపురూపం. ‘నేనెప్పుడు గొంతెత్తినా నా కోసం కాదు, ఐదు కోట్ల మంది కోసం, యాభై కోట్ల మంది కోసం గొంతెత్తాను. నేను పడుతున్న బాధలే నా దేశం పడుతోంది. కనుకనే నా జ్వాలిక, నా దేశపు నాలుక’ అన్నారాయన. తనకున్న అశాంతిని సముద్రపరంగా చెప్పిన ప్రజ్ఞ ఆయన సొంతం. ‘సముద్రాన్ని అడు గు, నీకెందుకింత అశాంతి ఆవేశం అని! ఝంఝామారుతాన్ని అడు గు నీకెందు కంత ఆవేశం అని!’ అంటూ వ్యథను ఝరీవేగంతో కవి త్వీకరించారు. అనలం కురింపించినా అమృతం కురిపించినా ఆనం దం, సందేశం, రసోదయం కవిత ల ఉద్దేశంగా ఉండేటట్టు జాగ్రత్త పడిన కవివరేణ్యుడు శేషేంద్రుడు. కలాన్ని గ్రీష్మంలో ముంచి రాయ గలిగిన ఈ కవే, ‘లిల్లీలు పెదవులు విప్పాయి, నీ కథలు చెప్పడానికి, ఆకులు గుసగుసలాడుతున్నాయి నా చెవుల్లో, నీ గుండె వ్యథలు చెప్పడానికి’ అన్నారు. కవిగా, విమర్శకునిగా, లాక్షిణికునిగా ఆయన అధిరోహించిన ఎత్తు లు అసాధారణమైనవి. కవిత్వంలో భావం, భాష పూలవనంలో ఒక దానిని ఒకటి తరుముకుంటున్న సీతాకోక చిలుకల మాదిరిగా ఉండాలంటారాయన. ‘నా కన్నుల మీద వాలిన సీతాకోకచిలుకలే కవితలు, కవిత్వం ఒక మెస్మరిజం, కవి కన్ను ఒక ప్రిజం. కవిత్వం అంటే స్వప్నవిద్య’ అన్నారు శేషేంద్ర. ఒక పరి శీలన ప్రకారం శేషేంద్ర సాహిత్యం ప్రాచ్యపాశ్చాత్య సంస్కృతుల కల్హారమాల. ‘హలమూ కలమూ దున్నని ధరిత్రి ధరిత్రి కాదు, మట్టి మట్టి’ అన్న శేషేంద్ర తెలుగు సాహితీ సేద్యంలో విశేష ఫలం. (మే 29న త్యాగరాయ గానసభ, హైదరాబాద్లో శేషేంద్ర 8వ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా) వీఎస్ఆర్ఎస్ సోమయాజులు, 94411 48158 -
బ్రిక్స్ అధ్యక్షుడుగా కె.వి.కామత్
న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్యాభివృద్ధికి ఉద్దేశించిన బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడుగా కే వీ కామత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కామత్ ఈ పదవిలో ఐదేళ్ళు కొనసాగుతారు . ఐదు దేశాల కూటమికి 2001లో బ్రిక్స్ గా నామకరణం చేశారు. ఈ బ్యాంకుకు అధ్యక్షుడిని నామినేట్ చేసే అవకాశం భారత్కు లభించింది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ బ్యాంకును భవిష్యత్తు ప్రపంచ బ్యాంకుగా గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ గోల్డ్మన్ సాచే అసెట్ మేనేజ్మెంట్ గతంలో అభివర్ణించింది. ఆర్థిక విశ్లేషకులు కూడా బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు
న్యూయార్క్: ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు ఓ పోలీస్ ఆఫీసర్పై కాల్పులు జరిగిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీస్ అధికారి తలపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్ సిటీలో బ్రియాన్ మోర్ (25) అనే పోలీసు అధికారి శనివారం విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఆయన తన గస్తీ వాహనాన్ని నిలిపేసి అతడిని ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తి తుపాకీ తీసి బ్రియాన్ తలపై గురిపెట్టి కాల్చాడు. ప్రస్తుతం బ్రియాన్కు జమైకా ఆస్పత్రిలో ఓ శస్త్ర చికిత్స పూర్తి చేశారు. అయితే, పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. -
వెలలేని తల!
అశోకుడు గొప్ప చక్రవర్తి. కళింగయుద్ధం తర్వాత బౌద్ధాన్ని స్వీకరించి యుద్ధాలు మానేశాడు. ఒక రోజున ఒక బౌద్ధభిక్షువు ఆయనకు ఎదురయ్యాడు. అశోకుడు మోకాళ్లమీద కూర్చుని, శిరస్సు వంచి, ఆ భిక్షువుకు నమస్కరించాడు. ఇది ఆయన పక్కనే ఉన్న మంత్రికి నచ్చలేదు. తన అభిప్రాయాన్ని ‘‘మహారాజా! తమరు భరతఖండంలో మహోన్నత చక్రవర్తులు. మీ శిరస్సు, కిరీటం వొంగడం సమంజసం కాదు’’ అని చెప్పాడు. అశోకుడు చిరునవ్వు నవ్వి అప్పటికి ఊరుకున్నాడు. రెండురోజుల తర్వాత ఒక మేక తల, ఒక జింక తల తెప్పించి పళ్లెంలో పెట్టి అమ్ముకు రమ్మని సేవకుణ్ణి పంపాడు. వాడు చాలా తక్కువ సమయంలోనే వాటిని అమ్మి వచ్చాడు. ఆ మరునాడు అప్పుడే మరణించిన ఒక మనిషి తలను కూడా ఒక పళ్లెంలో పెట్టి అమ్ముకు రమ్మన్నాడు. వాడు మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగినా ఎవరూ కొనలేదు. మనిషి తలను అమ్మకుండా తిరిగొచ్చి ‘‘ప్రభూ! దీన్ని ఎవరూ కొనలేదు’’అన్నాడు. ‘‘సరే! మరలా వెళ్లు. ఈ సారి ఉచితంగా ఇస్తాను అని చెప్పు’’ అని అతన్ని పంపాడు. ఆ సేవకుడు సాయంత్రానికి తలతో తిరిగి వచ్చాడు. ‘‘ప్రభూ! ఉచితంగా ఇస్తానన్నా ఎవ్వరూ తీసుకోలేదు’’అని చెప్పాడు. అప్పుడు అశోకుడు తన మంత్రితో మంత్రి మహాశయా! ఇది ఒక దొంగవాడి తల. అందుకే కొనలేదు. మరి, దీని స్థానంలో నా తలను ఉంచితే కొంటారా?’’ అని అశోకుడు మంత్రిని అడిగాడు. ఆ మాటతో మంత్రికి జ్ఞానోదయం అయింది. అశోకునికి వినమ్రంగా నమస్కరించాడు. - బొర్రా గోవర్ధన్ -
చిన్నారి చెవి తినేసిన కుక్క...
హైదరాబాద్ : నిద్రపోతున్న చిన్నారిపై కుక్క దాడి చేసి...చెవి, తల భాగాలను కొరికి తినేసింది. వివరాల్లోకి వెళితే బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్లో ఉండే మంజుల తన ఏడాదిన్నర పాప ప్రసన్నను నిద్ర పుచ్చి బయటకు వెళ్లింది. ఇంతలో ఇంట్లోకి చొరబడ్డ ఓ కుక్క చిన్నారి చెవిని 90 శాతం తినేసింది. తర్వాత తల కొరికింది. పీక పట్టుకునేందుకు యత్నిస్తుండగా పాప ఏడుపు విని తల్లి పరిగెత్తుకొచ్చింది. దీంతో కుక్క పారిపోయింది. పాపను చికిత్స నిమిత్తం సమీపంలోని పేస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా...వైద్యులు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ చేశారు. తల భాగంలో కుక్క కరవడంతో రాబిస్ త్వరగా శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉందని, 48 గంటల తర్వాత మాత్రమే పాప ఆరోగ్య పరిస్థితిపై ఒక అవగాహన వస్తుందని చెప్పారు. -
గుండుపై గోరింట
-
మోడీ వ్యాఖ్యలపై చర్చ
-
ప్రేమించాలన్నాడు..పెళ్లి చేసుకుంటానని వేధింపులు
-
ది ప్రైమ్ టైమ్ షో 26th Oct 2013
-
ది హెడ్లైన్ షో 27th Oct 2013
-
ది హెడ్లైన్ షో 14th Oct 2013
-
ది హెడ్లైన్ షో 13th Oct 2013
-
ఈ వారం హెడ్లైన్స్ 15th sept 2013
-
The Primetime Show 9th Sep 2013
-
The Head Line Show 9th Sept 2013
-
సాక్షి ది హెడ్ లైన్ షో 13th July 2013
-
సాక్షి ది హెడ్ లైన్ షో 8th July 2013