injustice
-
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయానికి బాబు తిలోదకాలు
-
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గుర్తుచేశారు. -
ఆ పోలీసుల పేర్లను రాసి పెట్టండి..అధికారంలోకి రాగానే సంగతి చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని, బీజేపీ నేతలను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గులాబీ కండువాలు కప్పుకున్న కార్యకర్తల మాదిరిగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై కక్ష సాధింపునకు పాల్పడుతున్న పోలీసు అధికారుల పేర్లను బీజేపీ కార్యకర్తలు రాసిపెట్టుకోవాలని కోరారు. ‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అతి చేసిన పోలీసుల రుణం ఏ మాత్రం ఉంచుకోకుండా వారి సంగతి చూద్దాం..వారి లెక్కలు సరిచేద్దాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్కు ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు బీజేపీ భయపడదు. గత ఎన్నికల్లోనూ పోలీసులతోనే గెలిచామని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తామనే అహంకారంతో ఉన్న మిమ్మల్ని భరించే ప్రసక్తే లేదు.. ఖబడ్దార్ కేసీఆర్.. నిన్ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. వెంకటరమణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? కామారెడ్డిలో జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేసి రోజంతా ఎక్కడెక్కడో తిప్పారని, అసలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గజ్వేల్ అభివృద్ధి మాదిరే కామారెడ్డి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో గజ్వేల్ అభివృద్ధిని చూసివద్దామని అనుకున్న వెంకటరమణారెడ్డిని అక్కడకు వెళ్లకుండా అక్రమంగా అడ్డుకున్నారని విమర్శించారు. ‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ను నిజంగా అబివృద్ధి చేస్తే అయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ అభివృద్ధి జరగలేదనే విషయం బయట పడుతుందని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. గజ్వేల్ ఏమీ కేసీఆర్ ఫామ్హౌజ్ కాదు కదా... అని ఆమె నిలదీశారు. వెంటనే వెంకటరమణా రెడ్డిని విడుదల చేసి గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మార్చిన చరిత్ర కేసీఆర్దేనని ఆరోపించారు. -
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్తో పాటు ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
బాబు ప్రాజెక్టుల సందర్శన విడ్డూరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూలేరని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా చంద్రబాబు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాల్లేవన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాలు అందించి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్–2, స్టేజ్–2ని, ఆఫ్షోర్ వంటి పనులను ప్రారంభించింది వైఎస్సార్ అని, వాటిని పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ నిధులు కేటాయించారు. హిరమండలం రిజర్వాయర్లో 19 టీఎంసీల నీరు చేరేలా లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతులిచ్చారు. అలాగే, నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు జగనన్నే స్వయంగా వెళ్లారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని పనులు చేస్తున్నాం. జిల్లాలోని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్లు ఏనాడైనా జిల్లాలో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారా? నిర్వాసితుల పరిహారాలను తెలుగు తమ్ముళ్లు మింగేయలేదా? ఇక వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు శరవేగంగా చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైఎస్సార్ హయాంలో ప్రారంభిస్తే ఇద్దరు సీఎంలు మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా గాలికొదిలేశారు. బాబు, పవన్లకు ఎందుకంత కోపం.. విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తున్నామనే అక్కసుతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్లు రాద్ధాంతం చేస్తున్న తీరుచూస్తే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. విశాఖలో పవన్, శ్రీకాకుళం జిల్లాలో బాబు ఒకేరోజు సందర్శించి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం జగన్ అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రం విభజనకు చంద్రబాబే సహకరించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక విద్యుత్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్నాయా ఒక్క ఏపీలోనే ఉన్నాయా అనేది ప్రజలందరూ గమనించాలి. -
అన్యాయంపై పోరాటానికి ‘ఇన్సాఫ్’
న్యూఢిల్లీ: దేశంలో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించారు. తన ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు సహా ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. దేశంలో పౌరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీని సంస్కరించడమే తప్ప, విమర్శించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం సమకూరాలని రాజ్యాంగం చెబుతున్నా, అన్ని చోట్లా అన్యాయమే జరుగుతోందన్నారు. -
తెలంగాణ భారత్లో భాగం కాదా? కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం
‘పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికి వదిలేసింది. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయాలనే డిమాండ్పై కేంద్రం స్పందించడం లేదు. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్వర్క్లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదు.’ - కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడా కీలకమైన పారిశ్రామిక రంగంలో, న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. నవ జాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావ డం లేదు. ఇలా వివక్ష చూపితే ఎలా.. మేం భారత్లో భాగం కాదా? ఇప్పుడు తెలంగాణ అభి వృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొం తును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది..’’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. నినాదం ఇస్తేనే సరిపోదు.. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అని నినాదం ఇస్తే సరిపోదని, చేతల్లో చూపాలని కేటీఆర్ అన్నారు. ‘‘ఇలా వివక్ష చూపితే తయారీ రంగంలో చైనాతో భారత్ ఎలా పోటీపడగలదు. మేం భారత్లో భాగం కాదా? ప్రాజెక్టులు, నిధుల విష యంలో రాజకీయాలను పక్కన పెట్టండి. మేకిన్ ఇండియా సాధ్యపడాలంటే రాష్ట్రాలు అడిగిన ప్రాజెక్టులు మంజూరు చేయండి. కేంద్రం మద్దతు ఉంటే మరింత మందికి ఉద్యోగావకాశాలు ఇవ్వ గలం. కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సిందే’’ అని స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు పారి శ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. టీఎస్ఐపాస్ వంటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చి.. రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులతో 15 వేల కంపెనీలను రాష్ట్రానికి రప్పించామని, సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ వివరించారు. గత ఆరేండ్లలో వ్యవసాయం మొదలుకుని ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ఎంతో ప్రగతి చూపినా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణకు అణా పైసా సాయం చేయడం లేదని విమర్శించారు. విభజన హామీలు తుంగలో పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని కేటీఆర్ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయాలనే డిమాండ్పై కేంద్రం స్పందించడం లేదని.. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్వర్క్లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకంటే ముందే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేండ్లలో రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు చేరినా.. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైందని.. అదనపు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, హైదరాబాద్ ఫార్మాసిటీలో మౌలిక వసతులకు రూ.3,900 కోట్లు ఇవ్వాలన్న విజ్ఞప్తులపై మౌనం పాటిస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడారు మంజూరు, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్ కోసం డిఫెన్స్ ఇంక్యుబేటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎయిరో ఇంజన్ కారిడార్ మంజూరు వంటి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారని కేటీఆర్ వివరించారు. గతేడాదితో పోలిస్తే ఎగుమతుల్లో 2020–21లో 15.5 శాతం వృద్ధిరేటును నమోదు చేసినా డ్రైపోర్టుపై స్పందన లేదని చెప్పారు. హైదరాబాద్ వెలుపలికి ఐటీని విస్తరిస్తం హైదరాబాద్ వెలుపల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తామరని.. నల్గొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ హబ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ద్వారా కంపెనీలకు వ్యయం తగ్గడంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్లో పలు ఐటీ కంపెనీలు అడుగుపెట్టాయని.. వరంగల్లో టెక్ మహీంద్రా, సైయంట్, మైండ్ట్రీతోపాటు పలు స్టార్టప్స్, ఎస్ఎంఈలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించారు. కాగా సీఐఐ వార్షిక సదస్సులో భాగంగా పరిశ్రమలతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. -
ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ ఉ్యదమం చేస్తున్న రైతులకు మాజీ సివిల్ సర్వెంట్లు మద్దతుగా నిలిచారు. రైతులకు ఘోర అన్యాయం జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోంది అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మాజీ సివిల్ సర్వెంట్ల బృందం తప్పుబట్టింది. ఈ మేరకు 75 మంది మాజీ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. హృదయపూర్వకంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఎప్పటికీ పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. దేశంలో చాలా గందరగోళానికి కారణమైన సమస్యను ఇకనైనా పరిష్కరించాలని తమ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. (‘చక్కా జామ్’ : 50 వేల మందితో భారీ భద్రత) రైతు ఉద్యమంలో పరిణామాలను తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలు, రైతులపై నిందలు వేయడానికి చేసిన ప్రయత్నాలపై మాజీ సివిల్ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించారు. తక్షణమే ఈ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 18 నెలల పాటు చట్టాల అమలును నిలిపివేయడం లాంటి చర్యలను ప్రతిపాదించడానికి బదులుగా, ప్రభుత్వం ఒక స్నేహపూర్వక పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. చట్టాలను ఉపసంహరించు , లేదా ఇతర సాధ్యమైన పరిష్కారాల గురించి ఆలోచించాలన్నారు. వ్యవసాయం రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో ఉందని గుర్తు చేయడం విశేషం. (రైతులకు మద్దతు : గ్రెటా థన్బర్గ్పై కేసు) రైతుల నిరసన పట్ల ప్రభుత్వం మొదటినుంచీ మొండిగానే వ్యవహరిస్తోందని, ఈ వైఖరి ఘర్షణ సృష్టించేదిగానే ఉందని ఆరోపించారు. రైతులను ప్రతిపక్షంగా చూస్తూ, అపహాస్యం చేస్తున్నతీరును ఖండించారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై దేశద్రోహ ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాన్స్టిట్యూషనల్ కండక్ట్ కమిటీ (సీసీజీ)లో భాగమైన మాజీ ఐఏఎస్ ఆధికారులు నజీబ్ జంగ్, జూలియో రిబెరియో, అరుణ రాయ్ లతో పాటు జవహర్ సిర్కార్, అరబిందో బెహెరా, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు కెబి ఫాబియన్, అఫ్తాబ్ సేథ్, మాజీ ఐపిఎస్ అధికారులు జూలియో రిబెరియో, ఎకె సమతా తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. -
బడ్జెట్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తావనేది..!
ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!) ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్జీవన్ మిషన్కు గత ఏడాది బడ్జెట్లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది. పురపాలకం.. ఇదీ వాలకం పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది. పునర్విభజన.. ఏదీ ఆలోచన? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్తో పాటు బయ్యారం స్టీల్ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమలు.. ఆశలు అడియాశలు పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది. పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్కతా, రాయ్బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు రూ.124 కోట్లు, హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు. తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్చౌక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్రెడ్డి తెలంగాణకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది. -
ఈ‘సారీ’ కూత లేదు
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఎదురుచూస్తున్నజిల్లా ప్రజలకు మరోమారు నిరాశే మిగిలింది. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా..ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం కలను కలగానే మిగిల్చింది. తెలంగాణలోని గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నామరోమారు మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లేకపోవడం వల్లనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో నాగర్కర్నూల్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్ల వరకు రైల్వేలైన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. 1980లో రైల్వేలైన్కు బీజం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వేయడం వల్ల కలిగే లాభాలను వివరి స్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో అప్పట్లో రూ.919 కోట్ల బడ్జెట్తో 184.2 కి .మీ. మేర రైల్వేలైన్ కోసం ప్రతిపాదనలు తయారు చేయారు. ఈ రైల్వేలైన్ వనప ర్తి, నాగర్కర్నూల్, మిర్యాలగూడ మీ దుగా మాచర్ల వరకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరుగున పడిపోయిన ఈ అంశంపై 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసి కేంద్రానికి అందించారు. దీంతో 2015లో కేంద్రం కంటి తుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం ఒప్పుకుంటే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ, ఇ తర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాలి. ఫలితంగా రాష్ట్ర ప్ర భుత్వం చొరవ తీసుకుంటే తప్ప కేం ద్రం ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. మొదటి దశ పూర్తి.. రెండో దశ? ప్రజల డిమాండ్కు అనుగుణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్టాలను కలుపుతూ రాయచూర్ నుంచి మాచర్లకు రైల్వేలైన్ కోసం ప్రతిపాదించారు. దీని వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో 2002లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో దత్తాత్రేయ రాయచూర్– గద్వాల రైల్వేలైన్కు శంకుస్థాపన చేశారు. గత రెండేళ్ల క్రితం డెమో కూడా పూర్తి చేసుకుని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశకు సంబంధించి గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం 151 నుంచి 154 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే లైన్ కోసం దాదాపు రూ.1,160 కోట్లు అవుతుందని రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్ర విధించిన నిబంధన మేరకు రాష్ట్రానికి చెందిన నేతలు, ఇక్కడి ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేలైన్కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజకీయ నాయకులు రైల్వే లైన్ కోసం మరో ఉద్యమం చేస్తే తప్ప సాధ్యం కాదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఏదేమైనా గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచి చూడాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న. ముఖ్యమంత్రి లేఖ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదం పొందేలోపు రాష్ట్ర Ðముఖ్యమంతి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం లేఖ ఇవ్వాలి. సప్లిమెంటరీ కింద కేంద్ర నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒప్పించి సమస్యను పరిష్కరించాలి. -సుధాకర్రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్ -
బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ హంబక్
ప్రతిభ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరు పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన బృహత్తర పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకం ఒకటి. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంపశయ్యపైకి చేర్చింది. వైఎస్సార్ హయాంలో సజావుగా సాగిన ఈ పథకం మూడు సంవత్సరాలుగా గాడి తప్పింది. ఈ పథకం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడి తప్పడంతో తల్లిదండ్రులను, విద్యార్థులను మనస్థాపానికి గురిచేస్తోంది. సాక్షి,గూడూరు: జిల్లాలో 478 కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు 83,550 మంది వివిధ రకాల కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరు 2018–19 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో స్కాలర్షిప్ రూ.90.92 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.266 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.495 కోట్లు ఉన్నాయి. గతేడాది బీసీ, ఈబీసీ బకాయిలు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఫీజులను, స్కాలర్ షిప్లను 94 శాతం మంజూరు చేసినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నా.. విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.766.68 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం రూ.271.68 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. పేదలకు వరం ఫీజు రీయింబర్స్మెంట్ పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయిబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఇంజినీరింగ్కు సంబంధించి కళాశాల గ్రేడ్ను బట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రతి ఏడాది ట్యూషన్ ఫీజు కింద రూ.35 వేల నుంచి రూ.90 వేల వరకు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ. 26 వేలకు పైగా ఆయా కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. దీంతో పాటు కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ కింద రూ.13 వేలను అందజేసింది. వీటితో పాటు స్పెషల్ ఫీజు కింద రూ. 5,500 విడుదల చేశారు. కళాశాల ఫీజులతో సంబంధం లేకుండా మెయింటెనెన్స్ కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.680 ఇచ్చారు. ఆ సమయంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. స్పెషల్ ఫీజు కింద ఇచ్చే రూ.5,500లను నిలిపివేశారు. కేవలం ఇంజినీరింగ్కు రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏకు రూ.27 వేలు విడుదల చేస్తున్నారు. దీంతో మిగతా మొత్తాన్ని ఆ పేదింటి తల్లిదండ్రులు కాయకష్టం చేసి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన పేరు కేఆర్రెడ్డి, గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కరస్పాండెంట్. ఈ కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు ఉంది. అయితే ఈ నెల 18న కేవలం రూ.2,875 మాత్రమే కళాశాల అకౌంట్లో జమ చేశారు. కోట్లాది రూపాయలు బకాయి ఉంటే.. కేవలం నామమాత్రంగా ఇలా చిన్న మొత్తాన్ని జమ చేయడంతో ఆయన ఖంగుతిన్నారు. కళాశాలకు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించినట్లు భ్రమ కల్పించే విధంగా ఉంది. ఈ కళాశాల నుంచి రూ.45 లక్షలు ట్రెజరీకి బిల్లు పెట్టి నెలలు గడుస్తున్నా, వాటిని ఇప్పటి వరకు క్లియర్ చేయడం లేదని కేఆర్ రెడ్డి వాపోతున్నారు. కళాశాలలో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులకు జీతాలెక్కడి నుంచి ఇవ్వగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కళాశాలను ఎన్నాళ్లు నెట్టుకురాగలమని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక కేఆర్ రెడ్డిది మాత్రమే కాదు.. జిల్లాలో వందలాది కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ఇలాగే ఉంది. జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు రాకపోవడంతో యాజమాన్యాలు అప్పులు చేసి కొన్నాళ్లు ఇచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఇవ్వలేమని, కొంత మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. నెలంతా కష్టపడినా.. నెల ఆఖరులో జీతాలు రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. – జీ శ్రీనివాసులు, అధ్యాపకులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు చెల్లించకపోవడంతో పరీక్షలు రాయనిస్తారో లేదోనని ఆందోళనగా ఉంది. దీంతో చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నాం. ఎలాగోలా పరీక్షలు రాయనిస్తున్నారు. లేదంటే మా పరిస్థితి ఎలా?. – బీ మునిరాజా, ఎంబీఏ తీవ్ర ఒత్తిడికి గురయ్యాం పరీక్షలు రాయనిస్తారో లేదో అని ప్రతి రోజు మేమంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాము. ఈ ప్రభుత్వానికి మాలాంటి పేద విద్యార్థులపై ఎంత విద్యార్థులపై ఎందుకింత చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. – జే వంశీ, ఎంబీఏ -
బాబు హయాంలో పింఛన్.. వంచన
సాక్షి, అనంతపురం: అర్హులైన సామాజిక పింఛన్దారులను కాదంటూ అనర్హులకు అధికారపార్టీ నేతలు న్యాయం చేశారు. ఈ ఐదేళ్ల వ్యవధిలో తమకు అనుకూలంగా ఉన్న వారికి ఏ అర్హత లేకున్నా పింఛన్ ఇప్పించేశారు. సామాన్యులను ఇబ్బందుల పాలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందజేస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పథకం ప్రకారం పింఛన్దారులను జాబితా నుంచి తొలగిస్తూ వచ్చారు. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారిని ఎందుకమ్మా తిరగడం అర్హత ఉన్నా.. మీకు పింఛన్ రాదు అంటూ అధికారులే తెగేసి చెబుతూ వచ్చారు. అన్ని అర్హతలు ఉన్న వారు ఎన్ని దఫాలు దరఖాస్తు చేసుకున్నా.. బుట్ట దాఖలు చేస్తూ వచ్చారు. ఆరు దఫాలుగా జిల్లాలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో తీసుకున్న అర్జీల్లో 8,500 అపరిష్కృతంగానే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. పించన్ ఇవ్వడం లేదు నాకు గతంలో పింఛన్ వచ్చేది. కొన్ని నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. నాకు వయసు మీదపడడంతోపాటు కళ్లు పూర్తిగా కనిపించవు. వినికిడి సమస్య కూడా ఉంది. ఇతరుల సహాయం లేనిదే నేను ఏ పనీ చేసుకోలేను. పింఛన్ ఇవ్వాలని జన్మభూమి గ్రామసభలో దరఖాస్తు చేశా. అధికారులు ఇదిగో అదిగో అంటున్నారే తప్ప పింఛన్ ఇవ్వడం లేదు. – బి.అక్కులప్ప, గాడ్రాళ్లపల్లి పింఛన్ రాకుండా అడ్డుకున్నారు ఐదేళ్లుగా వితంతు పింఛన్ కోసం అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జన్మభూమి, మీ కోసం కార్యక్రమాల్లో దరఖాస్తులు అందజేస్తున్నా ప్రయాజనం లేకుండా పోయింది. జన్మభూమి కమిటీ సభ్యులు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. ఈప్రభుత్వంలో పేదోళ్లకు న్యాయం జరగడం లేదు. డబ్బిచ్చినోళ్లకే పథకాలు అందుతున్నాయి. –ఓబులమ్మ చండ్రాయనిపల్లి -
భార్యాబిడ్డలు
థామస్ చెరియన్, కృష్ణ భగవాన్ ఇద్దరే ఉన్నారు ఆ గదిలో. అది భగవాన్ ఇల్లు. ఇంట్లో భగవాన్ గది. గది మధ్యలో ఖరీదైన పెద్ద సోఫా ఉంటుంది. ఆ సోఫా ఎదురుగా అంతే ఖరీదైన నాలుౖVð దు కుషన్ ఛైర్లు ఉంటాయి. భగవాన్ కోసం వచ్చే ఖరీదైన మనుషుల కోసం ఏర్పాటు చేసినవి అవి.థామస్ చెరియన్ ఖరీదైన వాడేం కాదు. నికార్సైనవాడు. నికార్సైనవాడు కాబట్టే నేరుగా భగవాన్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. భగవాన్ కూర్చోమనలేదు. కానీ చెరియన్ కూర్చున్నాడు! చెరియన్ వచ్చేటప్పటికి భగవాన్ తెల్లటి పంచె, తెల్లటి లాల్చీలో సోఫాపైన వెల్లకిలా పడుకుని రిలాక్స్డ్గా సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ‘‘భగవాన్.. నువ్వు తెలివైనవాడివి కావచ్చు. నీ తెలివితేటలు నీ భార్యాబిడ్డలకు ఉపయోగపడినంత వరకు ఎవరికేం అభ్యంతరం ఉండదు. అయితే నీకొక్కడికే భార్యాబిడ్డలు ఉంటారనుకుంటునట్లు న్నావ్’’ అన్నాడు చెరియన్. మెల్లిగా సోఫాలోంచి లేచి కూర్చుని, కాలు మీద కాలు వేసుకున్నాడు భగవాన్. సోఫాలో తల పక్కనే పెట్టుకుని ఉన్న గన్ని తీసి పంచె కొసతో మృదువుగా తుడిచాడు. తన చేతిలో గన్ని చూశాక, చెరియన్ ఇంకొక్క మాట కూడా మాట్లాడడనే అనుకున్నాడు భగవాన్. కానీ చెరియన్ మాట్లాడాడు!‘‘భగవాన్.. నేనేం అన్యాయంగా అడగడం లేదు. నాకు రావలసింది నాకు ఇచ్చెయ్. ‘ఇంకో డీల్ చెయ్యి, రెండూ కలిపి ఇస్తాం’ అంటున్నారు మీ వాళ్లు. రోజు కూలీ లాంటి వాణ్ణి నేను. ఎప్పటిదప్పుడే ఇవ్వకపోతే శాటిస్ఫై కాను’’ అన్నాడు చెరియన్. ‘‘కోటి రూపాయల సెటిల్మెంట్ హైదరాబాద్లో చిల్లర సంగతి చెరియన్. అందులో నీ లక్ష ఇంకా చిల్లర. చిల్లర విషయాలు డీల్ చెయ్యడానికి నా దగ్గర తెలివైనవాళ్లు లక్షల్లో ఉన్నారు. నువ్వు నా వరకు రావడమే వింతగా ఉంది’’ అన్నాడు భగవాన్.‘‘నీ దగ్గరి తెలివైనవాళ్లకు తెలివి ఎక్కువైంది భగవాన్. నెల రోజుల నుంచీ తిరుగుతున్నాను. ముందు ఇస్తామని ఒప్పుకుని, తర్వాత ‘నువ్వు చేసిందేమీ లేదు’ అంటున్నారు.’’ ‘‘నాతోనూ అన్నారు.. ఈ సెటిల్మెంట్లో నువ్వు చేసిందేమీ లేదని. ఎవరిదో ఫోన్ నెంబరు ఇచ్చావట. అంతేగా! ‘దానికి లక్షేమిటి?’ అంటున్నారు’’ అన్నాడు భగవాన్. అతడి పంచె ఇప్పుడు గన్ ట్రిగ్గర్ని తుడుస్తోంది. ‘‘నేను ఎంత చేశాను అని కాదు భగవాన్. నా పేరు నీ దాకా వచ్చిందంటే నేను చెయ్యాల్సిందే చేశాననే కదా..’’ భగవాన్ విసుగ్గా చూశాడు. ‘‘వెళ్లు చెరియన్. నా చేతుల్తో ఇప్పుడు నీకు లక్ష ఇచ్చానంటే.. నా సిస్టమ్ని నేనే దెబ్బతీసినట్లు. నీకు న్యాయం జరిగినా, అన్యాయం జరిగినా.. జరగాల్సిందే జరుగుతుంది. వెళ్లు’’ అన్నాడు. ‘‘వెళ్లడానికి రాలేదు భగవాన్. తీసుకెళ్లడానికే వచ్చాను’’ అన్నాడు చెరియన్. భగవాన్కి తిక్కరేగింది. గన్ని పొజిషన్లోకి తీసుకున్నాడు. టప్.. టప్.. రెండు బులెట్లు దిగాయి. అయితే దిగింది భగవాన్ గుండెల్లోకి. సోఫాలోనే అతడు ఒరిగిపోయాడు. అరుపులు బయటికి వినిపించే గది కాదు అది. పోలీసు కుక్కలు వాసనపట్టే గది కూడా కాదు. తుపాకీని జేబులో పెట్టుకుని పైకి లేచాడు చెరియన్. భగవాన్కి దగ్గరగా వెళ్లి చూశాడు. చచ్చిపోయాడు. భగవాన్ గన్ భగవాన్ చేతిలోనే ఉంది. ఎవర్నో కాల్చబోతే ఎవరో కాల్చేశారు అన్నంత వరకు మొదట అర్థమైపోతుంది పోలీసులకు. ఆ గదిలో డబ్బు కోసం వెదికే అవసరం లేకపోయింది చెరియన్కి. సోఫాల వెనుక వరుసగా బస్తాలు పేర్చి ఉన్నాయి. ఒక బస్తా ఓపన్ చేశాడు. రెండువేల నోట్ల కట్టలు. వాటిని వదిలేశాడు. ఇంకో బస్తా తెరిచాడు. ఐదొందల నోట్ల కట్టలు. వాటిల్లోంచి రెండు కట్టలు తీసుకుని నడుము దగ్గర ప్యాంటు లోపలకి దోపుకున్నాడు. ‘‘ఏంటలా ఉన్నారు?’’ ఇంట్లోకి రాగానే అడిగింది చెరియన్ భార్య.‘‘పని ఎక్కువగా ఉంది’’ అని తన గదిలోకి, అక్కడి నుంచి స్నానానికి వెళ్లిపోయాడు చెరియన్. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రాత్రి పన్నెండు కావస్తోంది. ‘‘భోజనం వడ్డించాను. రండి’’ అంది భార్య. ‘‘ఊరెళ్లాలి అంటున్నావ్ కదా. రేపు వెళ్తారా నువ్వూ, పిల్లలు’’ అన్నాడు భోం చేస్తూ. ‘‘రేపా! ఒక్క రోజులో అన్నీ సర్దుకోలేనండీ ’’ అంది భార్య.‘‘సరే.. ’’ అన్నాడు. ‘‘నిద్రొస్తోంది. వెళ్లి పడుకుంటాను’’ అందామె.. భర్త భోజనం పూర్తయ్యాక. తర్వాత తనూ వెళ్లి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. అతడి కళ్లల్లో భగవాన్ మెదులుతున్నాడు. టక్.. టక్.. టక్.. ఎవరో తలుపు తడుతున్నారు. టైమ్ చూశాడు చెరియన్. ఒంటి గంట దాటుతోంది. టక్ టక్.. టక్ టక్.. టక్.. తలుపు చప్పుడు ఎక్కువైంది. కనీసం ఉదయం వరకైనా పోలీసులు తనకు టైమ్ ఇస్తారనుకున్నాడు!లేదా.. భగవాన్ మనుషులు అయి ఉంటారు.మెల్లిగా పైకి లేచి, రివాల్వర్ తీసుకున్నాడు. తలుపు దగ్గరకు వెళ్లి ఒక్క క్షణం ఆగి, తలుపు తెరిచాడు. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.ఎదురుగా.. భ.. గ.. వా.. న్!!!‘‘ప్ఛ్.. తొందరపడ్డావు చెరియన్’’ అన్నాడు భగవాన్. ‘‘నేను తొందరపడ్డం కాదు భగవాన్. నువ్వే ఆలస్యం చేశావ్.. నా డబ్బు నాకు ఇవ్వకుండా..’’అన్నాడు ధైర్యం తెచ్చుకుని.ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతున్నట్లుగానే ఉంది వాళ్ల సంభాషణ.‘‘దేవుడితో పోరాడుతూ నీ దగ్గరికి వచ్చాను చెరియన్. ఇదిగో, నీ ఉంగరం. నన్ను షూట్ చేస్తున్నప్పుడు పడిపోయింది. ఉంగరం మీద జీసెస్ ఉన్నాడు కదా... పట్టుకోలేకపోయాను. పైన పేరు వేయించుకున్నావ్. ఈజీగా దొరికిపోయేవాడివి. అందుకే ఎవరికీ దొరక్కుండా తెచ్చేశాను’’ అన్నాడు భగవాన్. తన వేళ్ల వైపు చూసుకున్నాడు చెరియన్. నిజమే. ఉంగరం పడిపోయింది! ‘‘ఒకటి కనుక్కున్నాను చెరియన్’’ అన్నాడు భగవాన్.. ఉంగరం ఇచ్చేశాక కూడా అక్కడి నుంచి కదలకుండా! మానవజన్మపై ప్రీతి అతడిని వదులుతున్నట్లు లేదు. ‘‘మనం తొందరపడినా, ఆలస్యం చేసినా.. బతుకును మాత్రం కోల్పోకూడదు.. కనీసం భార్యాబిడ్డల కోసమైనా. ఆ విషయం నాకు చనిపోయాక తెలిసింది’’ అని గాలిలోకి లేచాడు భగవాన్. లోపలికొచ్చాడు చెరియన్. భార్యాబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవతలి వైపు భార్యాబిడ్డలు గుర్తొచ్చారు అతడికి. - మాధవ్ శింగరాజు -
ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు. -
భూమిలేక.. భుక్తి దొరక్క
ఈ చిత్రంలోని రైతు ఎన్పీకుంటకు చెందిన మౌలాసాబ్(68). ఎన్పీకుంట పంచాయతీ పరిధిలో 10 ఎకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేసుకుని వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించే వాడు. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం మౌలాసాబ్ 10 ఎకరబ్ను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంది. మొత్తం భూమికి రూ.లక్ష మాత్రమే ఇస్తామని చెప్పినా.. చివరకు అది కూడా ఇవ్వలేదు. పరిహారం అందక..బతికే మార్గం కనిపించక కుటుంబపోషణకు అప్పులు చేశాడు. రుణదాత ఒత్తిడి పెరగడంతో ఇల్లు విక్రయించి కొన్ని తీర్చాడు. ఇక బతికేదారి లేక ఏడాది క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, కదిరి : ఎన్పీకుంట మండల కేంద్రంలో రూ. 12,500 కోట్లతో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మొత్తం 1,500 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతను ఎన్టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్పీ కుంట పంచాయతీ పరిధిలో 2,079,38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తంగా రెండు విడతల్లో 7,174.25 ఎకరాలను సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల సాగుభూమిని సోలార్ ప్రాజెక్టు కోసం సర్కారు రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది. న్యాయంగా లేని పరిహారం నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు నుంచి రూ. 50 లక్షలు దాకా ఇచ్చారు. కానీ ఎన్పీ కుంట రైతులకు మాత్రం ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ 44.44 కోట్లు చెల్లించింది. ఇంకా అసైన్డ్, పట్టా భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పరిహారం పెండింగ్లో ఉంది. సాగురైతులు చేసుకున్న పాపమేంటి? తరతరాలుగా అక్కడ భూములు సాగుచేసుకుంటూ తెలిసో, తెలియకో వివిధ కారణాల వల్ల పట్టాలు పొందని 1,156 మంది రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారు. అయితే ఆ రైతులకు మాత్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న ప్రతి రైతుకూ రూ.లక్ష మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పారు. చివరకు అది కూడా ఇవ్వలేదు. ఈ జాబితాలో అనర్హులున్నారంటూ నాలుగు రెవెన్యూ బృందాలు విచారించి 1,156 మందిలో 736 మందిని అర్హులుగా తేల్చారు. ఆ తొలగించిన జాబితాలో నిజంగా సాగుచేసుకుంటున్న రైతులు కూడా ఉన్నారన్న కారణంగా నాలుగేళ్లుగా పరిహారం చెల్లించకుండా నిలిపివేశారు. 26న మరోసారి సమావేశం కలెక్టర్ వీరపాండియన్ గత సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గాండ్లపెంటకు విచ్చేయగా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డితో పాటు ఇతర పార్టీల నాయకులు కలెక్టర్ను కలిసి సోలార్ బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్... ఈ నెల 26న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, రైతులంతా సహకరించాలని కోరారు. ఈసారైనా తమకు న్యాయం జరిగేనా అని సాగురైతులు ఎదురు చూస్తున్నారు. 750 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు ఖరాలు రైతులందరికీ పరిహారం చెల్లించకముందే సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. టాటా కంపెనీ 100 మెగావాట్లు, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ, ల్యాంకో, బీహెచ్ఈఎల్ కంపెనీలు 50 మెగావాట్లు చొప్పున మొత్తం 250 మెగావాట్ల విద్యుత్ను ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్బ్యాండ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్, అయాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 250 మెగావాట్లు చొప్పున 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి టెండర్లను దక్కించుకున్నాయి. జూలై 12వ తేదీ నుంచి ఈ రెండో విడత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. -
విభనలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది
-
‘కృష్ణా’లో రాష్ట్రానికి మళ్లీ అన్యాయమే?
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది! కృష్ణా జలాలపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు తెలంగాణలోని పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు పెంచాలన్న వినతిని కేంద్రం తిరస్కరించడం, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల పాత వాటాయే ఈ ఏడాదీ కొనసాగుతుందని పేర్కొనడం రాష్ట్రానికి పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టనుంది. బచావత్ అవార్డుల ప్రకారమైనా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో ఎగువ తెలంగాణకు దక్కే నీటి వాటాలు తేల్చాలని కోరుతున్నా కుదరదన్న ధోరణి ప్రదర్శించడం రాష్ట్రానికి మింగుడు పడని అంశమే. జూన్ వర్షాలకు మరో రెండు నెలల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో కేంద్రంపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది. పరీవాహకం ఎక్కువ ఉన్నా తక్కువ నీటి కేటాయింపు... రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5 శాతం, ఆయకట్టు 62.5 శాతం ఉంది. అయినప్పటికీ మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు. ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీనికితోడు 1978లో గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరుతోంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని అడుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదు. -
‘రిజర్వేషన్లలో ఎంబీసీలకు అన్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, అత్యంత వెనుకబడిన కులాలకు(ఎంబీసీ) అన్యాయం జరుగుతోందని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణిని సంఘ ప్రతినిధులు సూర్యారావు, సత్యం, అంతయ్య తదితరులు బుధవారం ఢిల్లీలో కలసి ఎంబీసీలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో పర్యటించి అత్యంత వెనుకబడిన కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి న్యాయం చేస్తామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. -
‘చదువుకోవాలి’కి అన్యాయం జరిగింది
హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ‘చదువుకోవాలి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సినీవారం కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రూపొందించిన ఎం. వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దేశరాజు లలిత, కో డైరెక్టర్ సాయిశ్వేతను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున సత్కరించి, అభినందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ– ‘‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రం వల్ల సమాజంలో మంచి మార్పులు వస్తాయి. పాత్రికేయునిగా అపార అనుభవం ఉన్న ఎం. వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతగా సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమా తీసి ఐదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట విద్యార్థుల కోసం ఇంకా ప్రదర్శించబడుతోంది. విద్యపై చెతన్యంతో తీసిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మా చిత్రానికి ఏపీ నంది అవార్డుల్లో అన్యాయం చేశారు’’ అన్నారు దర్శక నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు. -
జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి
‘‘జీవితారాజశేఖర్గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్.. తెలుగుదేశం రాకింగ్’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై తన అభిప్రాయాలను చెప్పారు. వర్మగారిని నిందించడం తగదు దర్శకులు రామ్గోపాల్వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్గారు చేసిన ఆరోపణలు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం. నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్గారు, కార్టూనిస్ట్ శ్రీధర్గారు, దర్శకుడు బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నారు. నా వెనక శక్తులేం లేవు! నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు. నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్ 9న రిలీజ్. 7వ తేదీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు. 12న చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంగారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్లో ఉంది. కానీ, హైదరాబాద్ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా. అజయ్ కల్లంగారిచ్చిన నోటీస్ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్ లేదు. దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా. ఆ నిబంధన తీసేయాలి నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది. మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్? అని అప్కమింVŠ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు? మెసేజ్ కనిపించలేదా? ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్గా రాదు. టోటల్ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు. జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్ విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు. మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా? ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్లైన్స్ వేరు.. నంది అవార్డు గైడ్లైన్స్ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసుకుంటున్నారు. కన్వీనెంట్గా లేనివి మనది వేరు కదా అంటున్నారు. ‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు. ‘బాహుబలి’ బెటర్ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్ డామినేషన్. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి. -
ఇష్టమొచ్చినట్లు అవార్డులిస్తే సినిమాలు తీయడమెందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్ వన్సైడ్ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది’’ అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం’ వంటి కుటుంబ కథాచిత్రం, ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమా, ‘రేసుగుర్రం’ లాంటి కమర్షియల్ సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా? ‘సెలక్షన్ కమిటీ మన చేతిలో ఉంది కదా’ అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు. అప్పట్లో నేను చేసిన ‘ప్రేమ’ (2002) సినిమాకి నంది అవార్డు వచ్చిందని కెమెరామేన్ ఎస్. గోపాల్రెడ్డి ఫోన్లో చెప్పారు. కానీ, మరుసటి రోజు ఆ లిస్టులో మా సినిమా లేదు. రికమెండేషన్ ఉందని మరో సినిమాకి ఇచ్చారు. ఇక్కడ వ్యక్తిగత కాంపౌండ్లు ఉండకూడదు. ఉన్నది ఒక్కటే... అదీ సినిమా కాంపౌండ్’’ అన్నారు. -
ఇదేమి గ్రామస్వరాజ్యం ?
► పేరుకే పదవి ... పెత్తనం టీడీపీ నేతదే ► గిరిజన సర్పంచ్కు అన్యాయం ► నేటికీ కొనసాగుతున్న వివక్ష నిమ్నజాతికి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబన కోసం రూపొందించిన చట్టాన్ని కూడా పెత్తందారు చుట్టంగా మార్చుకున్నారు. అతడిని ఎదిరించే సాహసం చేయలేక దీనస్థితిలో ఉన్న ఓ గిరిజన మహిళా ప్రజాప్రతినిధి దయనీయ గాథ అందుకు నిదర్శనమవుతోంది. రేణిగుంట: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంలో ఓ సర్పంచ్ అధికారాన్ని మరో నాయకుడు చెలాయిస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరిలో గెలిచిన గిరిజన మహిళ పేరుకు సర్పంచ్ అయినా పెత్తనం మాత్రం ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత చెలాయిస్తున్నాడు. రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీను భార్య లక్ష్మమ్మ 2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలు పొందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆ నాయకుని కన్నుసన్నల్లోనే రబ్బ రు స్టాంపు పాత్రను పోషిస్తోంది. లక్ష్మమ్మ సర్పంచ్ అయిన ఏడాదికే భర్త శ్రీను మృతి చెందడంతో రాజం పేట సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో, మండల కార్యాలయంలో ఏవైనా సమావేశాలుంటే వచ్చి వెళుతున్నారు. గ్రామంలో పంచాయతీకి నిధులు ఎంత వస్తున్నాయో ఆమెకు సమాచారం ఉండదు... ఏయే అభివృద్ధి పనులు చేస్తున్నారో తెలపరు. సర్పంచ్ గౌరవ వేతనం కూడా ఆ నాయకుడే తీసుకుంటూ ఆమె కుటుం బ అవసరాలకు అన్నట్లు నెలనెలా రూ.5 వేలు ఇస్తున్నా డు. సర్పంచ్ ఎవరని గ్రామంలో ఎవరైనా అడిగితే అత ని వైపు వేలు చూపుతున్న పరిస్థితి. సర్పంచ్ లక్ష్మమ్మ కదా అంటే ... ఆశ్చర్యంగా చూస్తారు. గ్రామంలో నిధులు ఏ మేరకు సద్వినియోగమవుతున్నాయో ఆమెకు తెలియదు. సొంత గూడులేని దౌర్భాగ్యం సొంత ఇల్లు కూడా లేని దయనీయ స్థితి లక్ష్మమ్మది. ఆమె కు కాలనీలో పక్కాగృహం కట్టించేందుకు టీడీపీ నేత హా మీ ఇచ్చినా, అది ఇప్పటికీ పునాదులకే పరిమితమైంది. సొంత ఇల్లు ఉంటే అంత దూరం వెళ్లి బతకాల్సిన ఖర్మ ఏ మిటని ఆమె దీనంగా ప్రశ్నిస్తున్నారు. అనధికారిక సర్పంచ్గా గ్రామపాలన సాగిస్తున్న టీడీపీ నేత నిధులు కాజేసే అ వకాశం ఉంది. ముందుగానే సర్పంచ్ వద్ద చెక్ పుస్తకాలపై సంతకాలు తీసుకుని బిల్లలు మంజూరైనప్పుడు డ్రా చేసుకుంటారనే ఆరోపణ ఉంది. భవిష్యత్తులో ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం సర్పంచ్ లక్ష్మమ్మపైనే చర్యలు తీసుకునే అధికార యంత్రాంగం మాత్రం ప్రస్తుతంఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. -
కంచే చేనును మేస్తే?
న్యాయ నియామకాలలోని, న్యాయ వితరణలోని అన్యాయాల గురించిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా? మన న్యాయవ్యవస్థపైన ఫిర్యాదులను, దాని చర్య లవల్ల కలిగే కష్టాలపైన విన్నపాలను, ఫలానా సౌక ర్యం లేదని చెప్పుకునే మహజర్లను స్వీకరించి, అందుకున్నామని రసీదు ఇచ్చి, ఫలానా కాలపరిమి తిలోగా ఆ విషయాన్ని వింటామని అభయమిచ్చి... అలాగే విని వాటిని తిరస్కరించామనో, పరిష్కరిస్తామనో చెప్పే విధా నంగానీ, ప్రక్రియగానీ, యంత్రాంగంగానీ మనకు లేదు. మన సుపరిపాలనలో ఇదొక అద్భుతం. మన న్యాయమంత్రిత్వ శాఖకు వెల్లువెత్తే ఫిర్యాదులలో కోర్టుల్లో అవినీతి గురించి 15 శాతం, అసమంజ çసమైన తీర్పులని 10 శాతం, తీర్పులు ఇవ్వడంలో ఆలస్యం గురించి 47 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఇతర అన్ని విభాగాల్లో ఉన్నట్టుగా, న్యాయవ్యవ స్థలో కష్టాలు చెప్పుకునే విధానం, ఫిర్యాదులు విని పరిష్కరించే విధానం దాదాపు మృగ్యం కావడం తీవ్ర లోపమని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వం తమకు వచ్చిన ఫిర్యాదులను న్యాయవ్యవస్థకు పంపుతూ ఉంటుంది. కాని వాటికి ప్రతిస్పందన చాలా అరుదు. ఫిర్యాదుదారుల బాధలను పరిష్క రించకపోయినా, వారి ఫిర్యాదులను పరిశీలించి పలానా కారణాల వల్ల మీ దరఖాస్తు చెత్తబుట్టలో వేస్తున్నామని చెప్పే దిక్కు కూడా లేకపోతే ఎట్లా? ఇదేనా న్యాయం? సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి వ్యవస్థ ఉండాలి కదా. జడ్జిల నియామక ప్రక్రియపై తెరలు పూర్తిగా తొలగించడాన్ని జస్టిస్ మదన్ బి లోకుర్ వ్యతిరేకించారు. అంతా బయట పెడితే కొందరు న్యాయ మూర్తులపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలు వారి భవి ష్యత్తును దెబ్బతీస్తాయని, ఆ పదవికి పరిశీలనదాకా వచ్చిన వ్యక్తుల ప్రైవసీని కొంతైనా కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, నియామకాల గురించి బయటకు ఏమీ పొక్క కుండా ఉండే గట్టి తెరలున్నాయనీ, ఇందువల్ల పలుకుబడి ఉన్నవారికే రాజ్యాంగ న్యాయస్థానాల పదవులు దక్కే లాబీయింగ్కు ఆస్కారం ఏర్పడిం దని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. జస్టిస్ కురియన్, కొలీజియం నియంతృత్వంగా వ్యవహరించే వీలుం దన్నారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) కేసు విచారణ జరు గుతుండగా... మాథ్యూ నెడుంపర అనే వ్యక్తి కొలీ జియం ద్వారా జడ్జిల పుత్రరత్నాలకు, పెద్ద న్యాయ వాదుల సుపుత్రులకు అవకాశాలు మెండుగా దక్కి, అర్హులై ఆసక్తి ఉన్నవారికి జడ్జిలుగా దరఖాస్తు పెట్టు కునే అవకాశం కూడా దక్కలేదని వాదించారు. బంధుప్రీతిని పెంచిపోషించే విధానాలను తొలగించేందుకే ఎన్జేఏసీని ప్రభుత్వం ప్రతి పాదించింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వయంగా ప్రమాణ పత్రాలలో తమ వివరాలు ప్రక టించిన రీతిలో జడ్జిలు కూడా ఆర్టికల్ 124(6) కింద తమ వ్యక్తిగత ఆస్తిపాస్తులు తదితర వివ రాలను ప్రమాణ పూర్వకంగా ప్రకటించాలని, అవా స్తవాలు చెబితే మహాభియోగం ద్వారా కాకుండా సులభరీతిలో జడ్జిలను తొలగించే వీలుండాలని పౌరసమాజం నుంచి ఒక సూచన వచ్చింది. వినే వారెవరయినా ఉన్నారా? తెలుసుకునే హక్కులాగే ప్రైవసీ హక్కు కూడా జీవించే హక్కులో భాగమే తప్ప ప్రాథమిక హక్కు కాదని జస్టిస్ లోకుర్ అన్నారు. కనుక పార దర్శకతకు, గోప్యతకు మధ్య సరైన సమతుల్యం ఉండాలన్నారు. ఎన్జేఏసీలో పూర్తి పారదర్శకత ఉంటుందని సమతుల్యం లేనట్టేననీ అన్నారు. అసలు కొలీజియంలో ఏం జరిగిందో ఎవరూ తెలు సుకునే వీల్లేదని, జనానికే కాదు చరిత్రకు కూడా ఆ వివరాలు అందబోవని, జడ్జిలుగా నియమితులైనా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన దురదృష్ట వంతులకు కూడా రికార్డులు దొరకవని చలమేశ్వర్ తమ తీర్పులో వివరించారు. ఇటువంటి వ్యవస్థ ప్రజల్లో విశ్వాసం పెంచడం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. కొలీజి యంలో సర్వసమ్మతి ఉంటే ‘నీకది నాకిది’ అనే ఏర్పాటుకు దారి తీస్తుందనీ, అందువల్ల అన్యాయ మైన నియామకాలు జరిగి, న్యాయార్థుల పట్ల ప్రమాదకరమైన ప్రమాణాలను పాటించడం జరిగి న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళన చెందారు. అంతేకాదు, లాబీయింగ్ వల్ల భజన సంస్కృతి పెరిగిపోయి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిం చారు. అర్హులను వదిలేసి, సొంత కారణాలమీద, సామాజిక జాతీయ వాస్తవాలకు సంబంధం లేకుండా కొందరిని నియమించడం, మరికొందరి నియామకాన్ని కావాలని జాప్యం చేయడం, కొంద రికే ప్రయోజనం చేకూర్చడం, అనుయాయులు కాని వారికి అవకాశాలను దూరం చేయడం, అంతేవాసు లను ఆదరించడం... ప్రతిభలేని వారి నియామకా లకు దారితీస్తున్నాయని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. అయితే నియామకాధికారాలను రాజకీయ నాయకులతో పంచుకోవడం వివేకవంతమైన చర్య అనడంలో ఇబ్బందులున్నాయని ప్రధాన న్యాయ మూర్తి జేఎస్ కేహార్ అన్నారు. భారతదేశంలో పౌర సమాజం తగినంతగా పరిపక్వత చెందలేదని, కనుక న్యాయమూర్తుల నియామకంలో ఏవైనా లోపాలు జరిగితే అవి దేశాన్ని సంక్షోభంలోకి పడదోస్తాయని ఆందోళన చెందారు. అయితే ఇప్పటి నియామక విధానాల్లో జడ్జిలయిన వారు ఏ విధంగా సంక్షోభం సృష్టిస్తున్నారో మనకు దృష్టాంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. న్యాయ నియామకాలలోని అన్యా యాలు, న్యాయ వితరణలోని అన్యాయాల గురిం చిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా? (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయ మంత్రిత్వ శాఖ, ఇఐఇ/VS/A/2014/000989– Sఅ కేసులో 3.5.2017 సీఈసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
ఆ నిధులు అయిన వారికే..!
► నిధుల కేటాయింపులో నియంతృత్వం ► వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు అన్యాయం ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ► మెజార్టీ ఎమ్మెల్యేలకు రెండు విడతలుగా రూ. 4కోట్లు చొప్పున మంజూరు ► తెలుగు తమ్ముళ్లకు ప్రయోజనంగా మారిన పనులు ► ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట ఓడిపోయిన పాలకపక్ష నేతలకు అవకాశం పథకాల అర్థాలు మారిపోతున్నాయి... నిబంధనలు అపహాస్యమవుతున్నాయి... ప్రజాస్వామ్యం పరిహాసమైంది. చట్టాల అమలు మొత్తం ప్రహసనంగా మారుతోంది. రాష్ట్రంలో పాలన అంతా ఏకపక్షంగా సాగుతోంది. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటే పథకాలు రద్దు చేస్తున్నారు. నిబంధనల మేరకు అందరికీ అందాల్సిన నిధులు కొందరికే అందిస్తున్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షంవారైతే... అభివృద్ధి పనులు... నిధులు మంజూరు కావడంలేదు. చట్టాలను సైతం తమ ఇష్టానుసారం మార్చేసి... ఏకపక్ష నిర్ణయాలతో సాగుతున్న పాలన వల్ల జనం అవస్థలపాలవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పథకం కాస్తా రద్దు చేశారు. ప్రత్యేక అభివృద్ధినిధులు పాలకపక్ష ఎమ్మెల్యేలకు మాత్రమే కేటాయించి... ప్రతిపక్షం ప్రాతినిధ్యం ఉన్నచోట వేరేవారికి అందజేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసనసభ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధిపనులకు సాధారణంగా నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) నిధులు మంజూరయ్యేవి. ఎమ్మెల్యేలు తమ కోటా ద్వారా వచ్చే నిధులను అవసరాల మేరకు ఖర్చు పెట్టేవారు. అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటిని అమలు చేసేవి. కానీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధానానికి స్వస్తి పలికారు. అందరికీ నిధులు ఇవ్వడం ఇష్టం లేక సీడీపీకి మంగళం పాడేశారు. దీనివల్ల ఎమ్మెల్యేలకు సొంతంగా రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. వాటి స్థానంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) పేరుతో నిధులు విడుదల చేస్తున్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్పై సీఎంకు పూర్తి విచక్షణాధికారం ఉంది. వాటిని ఎలాగైనా ఖర్చు పెట్టొచ్చు. ఇప్పుడా నిధులను తమ ఎమ్మెల్యేలకు పంచి పెడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఒక్కో ఏడాదికి రూ. రెండేసి కోట్లు చొప్పున తమ ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్నారు. జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి రెండు విడతలుగా రూ. 4కోట్లు వంతున విడుదల చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు మాత్రం రూ. రెండేసి కోట్లు చొప్పున విడుదల చేశారు. వీరికి కూడా రెండో విడతగా రూ. రెండు కోట్లు చొప్పున విడుదల చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చిల్లి గివ్వ కూడా విడుదల చేయకుండా నియంతృత్వ పోకడను చాటుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతలకు పెద్దపీట ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతలకు ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చారు. సంక్షేమ పథకాలన్నీ ప్రజలచే ఎన్నికైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కాకుండా ఓడిపోయిన తమ పార్టీ నేతల చేత మంజూరు చేయిస్తున్నారు. రుణాలు, ఇళ్లు, రేషన్కార్డులు, పింఛన్లు... ఇలా ప్రతీదానికీ వారి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేయిస్తున్నారు. ఇప్పుడీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతల పేరుతో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పనుల ప్రతిపాదిత జాబితాను తీసుకున్నట్టు సమాచారం. ఆ జాబితాల ప్రకారం నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అనుకూలంగా పనుల పందేరం మంజూరైన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో చేపట్టే పనులు ప్రతిపాదనల దగ్గరి నుంచి అంచనాలు రూపొందించేవరకు పాలకపక్ష ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వారు ఏ జాబితాలైతే ఇచ్చారో వాటికే అధికారులు పచ్చజెండా ఊపారు. ఇదే అదనుగా నాయకులు సైతం సొంత లాభం లేనిదే ముందుకెళ్లకూడదనే దోరణికి వెళ్లిపోయారు. ప్రతీదానిలో స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చిందే అవకాశమని స్పెషల్డెవలప్మెంట్ ఫండ్ పనులను టెండర్ల వరకు వెళ్లనీయకుండా తమకు లబ్ధి చేకూరేలా ముక్కలు ముక్కలుగా చేసి చేపడుతున్నారు. అత్యధిక పనుల విలువ సరాసరి రూ. 10లక్షలకు లోబడి ఉండేలా చూసుకుంటున్నారు. నిబంధనల మేరకైతే రూ. 10లక్షలు పైబడి పనులకు టెండర్లు పిలవాలి. వాటి ద్వారా పారదర్శకత పెరగనుంది. అలా చేస్తే తమకు పనులు దక్కవన్న భయంతో రూ. 10లక్షల లోబడి పనుల్నే ఎంపిక చేసి, నామినేటేడ్ పద్ధతిలో కట్టబెడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లబ్ధిపొందుతున్నారు. ప్రతిపాదించిన పనుల్లో దాదాపు సీసీ రోడ్లు, డ్రైనేజీలే ఎక్కువగా ఉన్నాయి. ఇవైతేనే గిట్టుబాటు అవుతాయన్న ఉద్దేశంతో జోరుగా ప్రతిపాదిస్తున్నారు. -
బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం
కర్నూలు(అర్బన్): రాష్ట్ర బడ్జెట్లో బీసీ కుల వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం స్థానిక బీసీ భవన్లో ‘ బీసీలు – బడ్జెట్ ’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర్లకు రూ.25 కోట్లు, విశ్వ బ్రాహ్మణులకు రూ.30 కోట్లు, ఈడిగలకు రూ.35 కోట్లు, సగరులకు రూ.25 కోట్లు, వాల్మీకులకు రూ.25 కోట్లు, మేదరులకు రూ.20 కోట్లు, భట్రాజులకు రూ.15 కోట్లు కేటాయించారన్నారు. తక్కువ జనాభా ఉన్న కాపులకు రూ.1000 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.75 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఓసీలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా ? అని వారు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికే తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయంపై పునః సమీక్షించి రూ.200 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కులానికి జనాభా ప్రకారం బడ్జెట్ను కేటాయించాలన్నారు. నాయకులు జలం శ్రీను, భాస్కరప్ప, కృష్ణోజిరావు, సర్వేశ్వరబాబు, చిన్న రామయ్య, మల్లికార్జున, రంగమునినాయుడు, డీవీ చంద్ర, పట్నం రాజేశ్వరి, గోగుల సుగుణమ్మ, పోతన, చంద్రికమ్మ, రామకృష్ణ, తిమ్మరాజు, వెంకటస్వామి పాల్గొన్నారు. -
'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'
జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జాతీయ రహదారులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో పాలకులు చేయలేనిది తాము రెండున్నరేళ్లలో చేశామని చెప్పారు. మొత్తం 2,776 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులను నిర్మించామన్నారు. 18 జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. హైదరాబాద్ చుట్టూ మరో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. -
'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'
-
టాటా-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం
-
టాటాపై మరోసారి స్వామి సంచలన వ్యాఖ్యలు
రాయపూర్ : టాటా- మిస్త్రీ వివాదంలో ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి టాటా చైర్మన్ పై ధ్వజమెత్తారు. టాటా గ్రూపు చరిత్రలోనే రతన్ టాటా అంత అవినీతి పరుడు లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయపూర్ లో మీడియాతో మాట్లాడిన స్వామి, అసలు రతన్ టాటా టాటానే కాదు, ఆయన తండ్రి ఓ దత్త పుత్రుడంటూ మరింత అగ్గిని రాజేశారు. కేవలం తనను తాను రక్షించుకోవడానికే సైరస్ మిస్త్రీకి ఆయన అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ సందర్భంగారెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటాల బోర్డు ఎంతో మెచ్చుకుందన్న విషయాన్ని స్వామి గుర్తు చేశారు. ఎంటైర్ బోర్డు అతని కృషిని ప్రశంసించిందని పేర్కొన్నారు. దీంతో అసూయతోనే రతన్ టాటా ఈ చర్యలకు దిగారని ఆరోపించారు. 2012 లో టాటా సన్స్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీపై లేనిపోని, దారుణమైన ఆరోపణలు, నిరూపించలేని వాదనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2జీ, ఎయిర్ ఆసియా, విస్తారా భాగస్వామ్య ఒప్పందం, జాగ్వార్ డీల్ వంటి కుంభకోణాల్లో రతన్ టాటాకు పాత్ర ఉందని స్వామి ఆరోపించారు. ఈ స్కాముల్లో ఇరుక్కోకుండా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే మిస్త్రీని తొలగించా రన్నారు. కానీ చట్టం నుంచి రతన్ టాటా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారని చెప్పారు. రతన్ టాటా అవినీతిపై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏయే సెక్షన్లు వర్తిస్తాయో తెలిపానన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని , సిట్ తో విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. -
అక్రమాలు అనంతం
* నిజనిజాలు తేల్చకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ * 'సాక్షి'లో వచ్చిన పేర్లలో కొన్నింటిని తొలగించారు * మిగిలినవి రాలేదు కదా అంటూ బుకాయింపు * కుమిలిపోతున్న అనంతవరం బాధితులు * పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు రాజధాని గ్రామం అనంతవరంలో అక్రమాల నిగ్గుతేల్చకుండానే ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో భూములను మాయం చేసి రాయించుకున్నవారు... భూమి లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సష్టించుకున్నవారు మాత్రం దర్జాగా తిరుగుతుంటే.. భూములు పోగొట్టుకున్న బాధితులు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. మాయమైన తమ భూముల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం దేశానికి అన్నం పెట్టే రైతుల భూములను లాక్కున్న ప్రభుత్వం వారికి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తడం లేదు. అధికార పార్టీ నేతల జేబులు నింపే విషయంలో వారికి పూర్తి మద్దతు ఇస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులకు చెందిన భూములు సెంట్ల రూపంలో మాయమైన బాగోతంపై సాక్షి వరుస కథనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 16న ‘రాజధాని గ్రామాల్లో అవినీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనంలో ప్రచురించిన పేర్లలో కొందరివి మాత్రం సరిచేశారు. పత్రికలో రాని పేర్లకు సంబంధించి ఏ ఒక్కరివీ సరిచేయలేదు. అదేమని అడిగితే.. ‘సాక్షిలో వచ్చినవి అవే కదా’ అంటూ సీఆర్డీఏ అధికారులు సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై వివక్ష.. రాజధాని కోసం భూములు వదులకున్న రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా రుణం తీరదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతూనే ఉన్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. వారికి సీఆర్డీఏ, రెవెన్యూ, పోలీసు శాఖలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రశ్నించిన వారిపై పార్టీ శ్రేణులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఒక్క అనంతవరంలో ఇంతపెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగితే... అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల పేర్లు పత్రికలో వచ్చినా.. లెక్కచేయకుండా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనంతవరం గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల భూములు తారుమారైన విషయాన్ని సాక్షి ఆధారాలతో వెలుగులోకి తెచ్చినా... సీఆర్డీఏ అధికారులు వాటిని సరిచేయకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక మర్మం దాగి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జనచైతన్యయాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తుండడం గమనార్హం. -
గూడు చెదిరె.. గోడు మిగిలె..
* సజ్జవారిపాలెంలో రహదారి పక్కన 40 ఇళ్ల కూల్చివేత * పోలీసుల సాయంతో ఆర్అండ్బీ అధికారుల జులుం * నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని నిర్వాసితుల ఆవేదన * మగ పోలీసులే మహిళలను ఈడ్చేచిన వైనం * రోడ్డున పడిన కుటుంబాలు వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేదలు.. కూలి పనులకు వెళ్లి కడపు నింపుకొనే అభాగ్యులు.. దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా వారి జీవనం.. ఉండేందుకు కొంత చోటే వారికి ఆధారం.. నలభై ఏళ్ల నుంచి అక్కడ గూడు నిర్మించుకొని బతకుడీస్తున్న దీనులపై ‘ఖాకీ’ క్రౌర్యం ప్రదర్శించింది.. ‘అధికారం’ అరాచకం సృష్టించింది.. ఉన్నపళ్లంగా గూళ్లు వీడి పోవాలని హుకుం జారీ చేసింది.. అన్నంత పనీ చేసింది. దిక్కు మొక్కులేని జనాలగోడు కన్నీటి సంద్రమైంది. – సజ్జావారిపాలెం(నగరం) నగరం మండలంలోని సజ్జావారిపాలెనికి నలభై ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చాయి. ఉండేందుకు రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నాయి. అక్కడే జీవనం సాగిస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత రహదారి అభివృద్ధి పేరుతో ఆర్అండ్బీ అధికారులు వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆదివారం పోలీస్ బలగాలతో వచ్చి 40 ఇళ్లు కూల్చివేయించారు. దీంతో నిర్వాసితులు ఆవేదనతో అడ్డుపడ్డారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసితులకు సీపీఎం నాయకులు మద్దతు ఇచ్చి వెంట నిలబడ్డారు. సుమారు గంటకుపైగా నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జులం.. రహదారి పక్కన నివసిస్తున్న పేదలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇళ్లు కూల్చివేతను అడ్డుకున్న మహిళలను సైతం మగ పోలీస్లే పక్కకు నెట్టి ఈడ్చుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా కర్రలతో కోట్టారని నిర్వాసితులు వాపోయారు. నలభై ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న తమకు కనీసం నోటీసులు జారీ చేయలేదన్నారు. పోలీస్ బలగాలతో పొక్లెయిన్లతో వచ్చిన అధికారులు ఇళ్లు కూల్చివేశారన్నారు. నిన్నా మొన్నా రాస్తారోకో చే శామని, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మాట తప్పి ఇలాంటి పనులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నివేశన స్థలాలు చూపించిన తర్వాతే ఇళ్లు తొలగిస్తామని హమీ ఇచ్చి ఇప్పుడు పోలీస్లతో వచ్చి ఇళ్లు కూల్చడం సబబు కాదన్నారు. నిర్వాసితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న నిర్వాసితులు షేక్ గుల్జార్, సిమ్లా, మౌలాలి, జాన్బీ, కె నాంచారమ్మతో పాటు సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి చిక్కాల మణిలాల్, కె.శరత్బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని నగరం పోలీస్ స్టేషన్కు తరలించారు. నగరం, చెరుకుపల్లి, చోడాయిపాలెం ఎస్.ఐలు బి.అశోక్కుమార్, భాస్కర్, శివాజీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా జులుం.. నలభై ఏళ్లు ఇళ్లగా ఇక్కడే నివసిస్తున్నాం. ఇళ్లు తొలగించాలని నోటీస్లు కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. కూలి పనులకు వెళితేనే పూట గడుస్తుంది. ఉన్నపళంగా ఇళ్లు కూల్చితే ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి. పోలీసులను అడ్డంపెట్టుకుని ఇళ్లు తొలగించడం సమంజసం కాదు. - సుజాత, సజ్జావారిపాలెం -
దశబ్దాలుగా వాల్మీకులకు అన్యాయం
కర్నూలు(అర్బన్): దశబ్దాలుగా వాల్మీకులు అన్యాయానికి గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్లోని బీసీ భవన్లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వాల్మీకి కులానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్యపాల్ కమిటీని నియమించిందన్నారు. వాల్మీకులకు న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం ఉన్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య మాట్లాడుతు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే పోరాట కమిటీ అధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో వాల్మీకి సంఘం నాయకులు సుబ్రమణ్యం, పాలెగార్ సత్యనారాయణ రాజు, రామకృష్ణ, యాపలయ్య, కృష్ణ, అనుమంతు, బీసీవీఎస్ జిల్లా అధ్యక్షుడు రంగమునినాయుడు, ఏవీ నాయుడు, రమణ, చిత్రసేనుడు తదితరులు పాల్గొన్నారు. -
కౌలుపై కుట్ర
* రాజధానిలో పాలకుల వ్యూహం * భూ మార్పిడి తరువాత రైతులకు పరిహారం * ఇవ్వకుండా ఉండేందుకు ప్రణాళికలు * కూలీల పెన్షన్లకూ ఫుల్స్టాప్ పెట్టాలని యోచన సాక్షి, అమరావతి బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి పరిధిలోని 29 గ్రామాల రైతుల నుంచి సుమారు 34వేల ఎకరాల భూములను సమీకరించిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. భూములు ఊరికే తీసుకోలేదని, పదేళ్ల వరకు పరిహారం కింద కౌలు చెల్లిస్తామని అప్పట్లో ప్రకటించారు.అదే విధంగా రైతు కూలీలకు ప్రతినెలా పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. జరీబు భూములు కలిగిన రైతులకు ఏడాదికి రూ.50వేలు, మెట్ట రైతులకు ఎకరానికి రూ.30వేల చొప్పున చెల్లిస్తున్నారు. మొదటి ఏడాది కౌలు మాత్రం చెల్లించారు. రెండో ఏడాదికి సంబంధించి కొందరికి ఇంకా చెక్కులు అందలేదు. ఇదిలా ఉంటే 31,634 మంది రైతు కూలీలకు ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి నెల చెల్లించాక.. రెండోనెల నుంచి రకరకాల నిబంధనలతో కూలీల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 10వేల మంది కూలీలకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. పూర్తిగా కౌలు ఎగ్గొట్టాలనే ... రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు పరిహారాన్ని కుదించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు వ్యవసాయ భూమిగా ఉన్న ఆ ప్రాంతాన్ని వాణిజ్య, నివాస ప్రాంతాలుగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి ఇది అనివార్యమైనప్పటికి దీన్నే సాకుగా చూపించి పరిహారం నిలిపివేతకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల పాటు పరిహారం ఇస్తామని చెప్పినప్పటికి భూ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) అనంతరం దీన్ని అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ భూమిగా ఉన్న నేపథ్యంలో రైతుకు కౌలు చెల్లిస్తున్నారు. భూ మార్పిడి తరువాత వ్యవసాయ భూములు నివాస, వాణిజ్య ప్లాట్లుగా మార్చనున్నారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో లే అవుట్లు వేయాలన్నా... రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నా, వ్యవసాయ భూమి స్థితిని మార్చాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతమంతా వ్యవసాయ భూములుగా ఉన్నవన్నీ పూర్వ స్థితిని కోల్పోతాయి. వ్యవసాయేతర భూములుగా మార్చిన తరువాత కౌలు పరిహారం ఇవ్వవచ్చు.. ఇవ్వకపోవచ్చు అని సీఆర్డీఏ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ల్యాండ్ కన్వర్షన్ చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రైతుల్లో చర్చ మొదలైంది. రైతులకు ప్లాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులను వివరణ అడిగితే ‘మీకెవరు చెప్పారు? అంటూ మాట దాటవేశారు. కూలీల విషయంలోనూ ఇంతే.. ఇక కూలీలకు ఇచ్చే పెన్షన్ల విషయంలోనూ ఇదే తరహాలో వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. తొలి సంవత్సరం అందరికీ ఇచ్చినప్పటికి ఆ తరువాత రకరకాల పేచీలు పెట్టి తొలగించింది. మొత్తంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారాన్ని భవిష్యత్లో చెల్లించే పనిలేకుండా ఉండేందుకు పాలకులు, అధికారులు పావులు కదుపుతుండడం గమనార్హం. -
‘ప్రతిభా’శీలురకు అన్యాయం
* ప్రతిభా పురస్కారాల ఎంపికలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అన్యాయం * 76 శాతం ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఎంపిక ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల నడుమ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉత్తీర్ణత సాధిం చిన పేద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ఎంపికలో అన్యాయం చేసింది. గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 342 మంది విద్యార్థులను ప్రభుత్వం ఇటీవల ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో చదివి అత్యధిక జీఏపీ సాధించిన విద్యార్థులున్నారు. ప్రతిభా పురస్కారం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 వేలు చొప్పున నగదు, ప్రసంశాపత్రం అందించనుంది. ప్రతి యేటా ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులనే అధిక సంఖ్యలో ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేస్తున్న సంప్రదాయానికి విద్యాశాఖ ఈ ఏడాది తిలోదకాలిచ్చింది. ఫలితంగా జిల్లాలో ఎంపిక చేసిన 342 మందిలో 260 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. జిల్లాలోని 57 మండలాల వారీగా మం డలానికి ఆరుగురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో ఇద్దరు జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలికా విభాగాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మెరిట్, రోస్టర్ ఆధారంగా ఎంపిక చేశారు. జిల్లాలో 94.76 శాతం ఉత్తీర్ణత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాల జాబితాలో పేద కుటుంబాల ప్రతిభావంతులకు చోటు దక్కలేదు. గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 30,786 మంది విద్యార్థులు హాజరు కాగా, వారి లో 28,561 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 94.76 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కృషి దాగి ఉంది. 41 మందికి 10 జీపీఏ.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన 41 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఆయా యాజమాన్యాల్లోని 123 స్కూళ్లు నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు గట్టి పోటీ ఇచ్చాయి. అయితే జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పదిలంగా ఉంచడంలో కృషి చేసిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. -
సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా దేవేగౌడ దీక్ష
-
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
-
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
బెంగళూరు: కావేరి జలాల విషయంలో తమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు ఆరు రోజుల పాటు కావేరి జలాలను విడుదల చేశామని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించడం ఇబ్బందికరమైనా, తాము ఇప్పటికీ తీర్పుకు కట్టుబడిఉన్నామని తెలిపారు. కర్ణాటకలో తాగునీటికి సమస్య ఏర్పడినా, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేశామని చెప్పారు. కావేరి జలాల వివాదంతో కర్ణాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సిద్ధరామయ్య మంగళవారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సిద్ధరామయ్య చెప్పారు. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. 'కావేరి వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ప్రధానిని కలిసేందుకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరాను. రేపు నేను ఆయనతో కలిసే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా పిలిచి చర్చించాల్సిందిగా మోదీనికి విజ్ఞప్తి చేశా. ఏ సమస్యకైనా హింసే పరిష్కారం కాదు. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది' అని సిద్ధరామయ్య అన్నారు. కావేరి వివాదం కారణంగా తమిళనాడులో కన్నడిగులపై, కర్ణాటకలో తమిళులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మైసూర్, మండ్యా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగళూరులో తమిళనాడుకు చెందిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆందోళనకారులు దహనం చేశారు. బస్సు డిపోలో ఆపిన 40 ఓల్వో బస్సులకు నిప్పంటించారు. సరిహద్దుల్లో తమిళనాడుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తమిళుల ఆస్తులపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసుల కాల్పుల్లో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించాడు. -
రూరల్ పోలీస్కు మళ్లీ అన్యాయం !
ఉన్నతాధికారులను కలిసేందుకు కార్యాచరణ వరంగల్ : జిల్లాల విభజన సందర్భంగా వరంగల్ జిల్లా రూరల్ సిబ్బందికి మళ్లీ అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని రూరల్ ఏఆర్, సివిల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరలో వరంగల్ను మూడు జిల్లాలుగా విభజించే నేపథ్యంలో రూరల్ సిబ్బందిని మాత్రమే మూడు జిల్లాలకు పంచడం అన్యాయమని పేర్కొంటున్నారు. కమిషనరేట్ సిబ్బందిని మాత్రం ఇక్కడే ఉంచి కేవలం రూరల్ సిబ్బందిని మూడు జిల్లాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. గతంలో జిల్లాను అర్బన్, రూరల్గా విభజించిన సందర్భంలో రూరల్ సిబ్బంది నష్టపోయిన విషయం విధితమే. మళ్లీ ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. అలా కాకుండా జిల్లా పోలీస్ విభాగాన్ని మొత్తం యూనిట్గా తీసుకుని కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. స్థానికత ఆధారంగా ఇతర జిల్లాల్లో పోలీసు సిబ్బంది విభజన జరుగుతున్న తరుణంలో అదే అంశం ప్రాతిపదికగా వరంగల్ జిల్లాలో విభజన చేపట్టాలని కోరుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిబ్బంది వరంగల్ డీఐజీ ప్రభాకర్రావు, డీజీపీ అనురాగ్శర్మను కలిసి విన్నవిస్తామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రూరల్ సిబ్బందిపై దృష్టి సారించి తాము మరో మారు అన్యాయానికి గురికాకుండా చూడాలని కోరుతున్నారు. -
మెుదటి నుంచి అన్యాయమే..
ఓసీల పెత్తనంతోనే బీసీల వెనుకబాటు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య భూపాలపల్లి: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల పెత్తనంతోనే బీసీలు వెనుకబడిపోతున్నారని, బీసీలు పుట్టిన నాటి నుంచి పొట్టకూటి కోసం తండ్లాడటమేసరిపోతుందన్నారు. భూపాలపల్లి పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన బీసీ చైతన్య సదస్సుకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ రచన సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే న్యాయం జరిగిందని, బీసీలకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించైనా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో కేంద్రానికి తమ తడాఖా చూపుతామన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామినేటెడ్ కోటాలో ఆంగ్లో ఇండియన్కు సైతం పదవులు అప్పగించి చట్టసభల్లో కూర్చోబెడుతున్న ప్రభుత్వాలు బీసీలకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అగ్రకులాలు ప్రభుత్వం నుంచి వందలు, వేల కోట్ల రుణాలు తీసుకొని ఎలా ఎగ్గొట్టాలో ఆలోచిస్తే, బీసీలు రూ. లక్ష రుణం తీసుకుంటే వడ్డీ ఎంత..? తాను చెల్లించగలనా లేదా అని రోజుల తరబడి ఆలోచించేంత అమాయకులన్నారు. ఓసీలు కులాల ను చూసి ఓట్లు వేస్తుంటే బీసీలు పార్టీలను చూ సి ఓట్లు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతిని మానుకొని సర్పంచ్ నుంచి ఎంపీ స్థా యి వరకు కులాలు, పార్టీలు చూడకుండా బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచిం చారు. తోడేళ్ళను మేకల మందకు కాపలా పెడితే రోజుకో మేకను తింటుందని, ఓసీలు తోడేళ్ళ వంటి వారని, అభివృద్ధి కాగితాలకే పరి మితం అవుతుందన్నారు. తన 40 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ప్రభుత్వాలు, పార్టీలు తనను తీవ్ర ఇబ్బందులు, అవమానాలకు గురిచేశాయని, ఈ విషయాన్ని బయటకు చెప్తే అందరూ అధైర్యపడుతారనే చెప్పలేదని, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నానని కృష్ణయ్య అన్నారు. బీసీలు వ్యాపార, వాణిజ్య, విద్యా, రాజకీయ రంగాల్లో ఎదగాలని సూచించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీౖయెన సిరికొండ మధుసూదనాచారిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ సిరి కొండ ప్రదీప్, రాష్ట్ర నాయకుడు సాంబారి సమ్మారావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, నాయకులు ముంజాల రవీందర్, బుర్ర కుమారస్వామి, ఎరుకల గణపతి, పైడిపెల్లి రమేష్, కొడపాక కుమారస్వామి, దాడి మల్లయ్య, దొడ్డపెల్లి రఘుపతి, కంకటి రాజవీరు, తాటి వెంకన్న, వేముల మహేందర్, ఏరుకొండ రాజేంద్రప్రసాద్, పిల్లలమర్రి నారాయణ పాల్గొన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు అన్యాయం
30 ఏళ్లలో కేవలం 134 మాత్రమే ఏడాదిలోనే 160 బాలికల గురుకులాలు ఏర్పాటు తాజాగా జిల్లాకు మూడు డిగ్రీ గురుకులాలు మంజూరు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బాలికల విద్య కోసం 1985 నుంచి 2015 వరకు 30 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 134 పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోనే 160 బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలు మంజూరు చేసి, వారి విద్యాభివృద్ధికి దోహదపడుతున్నట్టు చెప్పారు. ఆదివారం మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డార్మిటరీ హాల్, తల్లిదండ్రులకు విశ్రాంతి భవనం, డిజిటల్ ల్యాబ్, క్లాస్ రూంలను ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో మూడు కళాశాలలు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు మం జూరైనట్టు చెప్పారు. అంతకు ముందు మండలంలోని పుల్లూర్ బండ శ్రీ లకీ‡్ష్మనరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డిలు మొక్కలు నాటారు. -
లస్కర్ పోస్టుల రెగ్యులర్ నియామకాల్లో అక్రమాలు
– సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం – న్యాయం చేయాలంటున్న బాధితులు కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన లస్కర్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్వాసితులకు 1986లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జీఓ 98ను అమలుకు 25 ఏళ్ల తర్వాత కదలిక వచ్చింది. రెగ్యులర్ నియమాకాలు లేకపోవడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల్లో దాదాపు 962 మంది ముంపు బాధితుల్లో 80 శాతం మందిని తాత్కాలిక లస్కర్లుగా నియమించారు. వీరిలో సీనియారిటీ ఉన్న వారికి విద్యా అర్హతతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీల్లో కొంత మందిని ప్రస్తుతం రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల 30వ తేదీన 15 మంది తాత్కాలిక లస్కర్లను రెగ్యులర్ చేస్తూ చీఫ్ ఇంజనీర్ చిట్టి్టబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో టెక్నికల్ అసిస్టెంట్ నియామకాల్లో ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ చేసిన వారితో భర్తీ చేయాలి. అయితే ఇక్కడ నిబంధనలను ఉల్లఘించి జూనియర్లను రెగ్యులర్ చేశారనే విమర్శల ఉన్నాయి. – టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానిక్ అర్హత ఉన్న వారితో భర్తీ చేశారు. దీంతో బీటెక్ చేసిన శ్రీనివాసులు, ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ చేసిన శేషన్నకు అన్యాయం జరిగిందని అధికారుల దృష్టికి తెచ్చారు. – ఆఫీస్ సబార్డినేట్ కింద ఎంపికైన ఓ మహిళకు ఇంటిగ్రేటేడ్ సీనియార్టీ జాబితాలో నంబర్ 797. సినియార్టీ జాబితాలో గుంపుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ముందున్నా అతనికి అన్యాయం జరిగింది. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం: శ్రీశైలం ముంపు బాధితుల్లో తాత్కాలిక లస్కర్లుగా పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తూ ఇచ్చిన జాబితాలో అక్రమాలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లను కాదని, జూనియర్లను రెగ్యులర్ చేయడంపై కొందరు బాధితులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ నియామకాలపై కొందరు తాత్కాలిక లస్కర్లు జిల్లా కలెక్టర్, డిప్యూటీ సీఈలను కలిసి విన్నవించారు. ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం: తాత్కాలిక లస్కర్లుగా పని చేస్తున్న వారిలో 15 మందికి రెగ్యులర్ చేశాం, ఇందులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఒక వేళ తప్పులు జరిగాయని ఫిర్యాదులు వస్తే పరిశీలించి సరి చేసేందుకే నోటీసు బోర్డులో వివరాలు ఉంచాం. రెగ్యులర్ చేసేందుకు సీనియారీటికి ప్రాధాన్యత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాం. జూనియర్లలో ఉన్నత విద్య చదివిన వారు ఉన్నా సీనియర్లకు అన్యాయం చేయకూడదు. – చిట్టిబాబు, సీఈ, జల వనరుల శాఖ ప్రాజెక్టు -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
♦ సానియామీర్జాకు రూ. కోటి ఇచ్చారు.. ♦ దళిత యువతికి అన్యాయం జరిగితే ఇవ్వరా ♦ మాజీ మంత్రులు గీతారెడ్డి, సబిత, సునీత వీణవంక : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, స్వేచ్ఛ గా ఉండలేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి గీతారెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఇటీవల గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలిని మాజీ మంత్రులు సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి బుధవారం పరామర్శించారు. ఎస్ఐని, కానిస్టేబుల్ను మాత్రమే సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నాన్నారు. విచారణ పేరుతో బాధితురాలిని వేధించిన సీఐని, డీఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. జిల్లాకు మహిళా కలెక్టర్ ఉండి కూడా ఇంతవరకు బాధితురాలిని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం యువతికి పోలీసు ఉద్యోగం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు, కోటి రూపాయల ఎక్స్గ్రేషియూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సబితారెడ్డి మాట్లాడుతూ సానియామీర్జాను పిలిచి కోటి రూపాయలు ఇచ్చిన సీఎం... దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇవ్వలేరా అని అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుం బానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. -
రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం: చాడ
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం రాజకీయ అవసరాలకు అనువుగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కొత్త రైళ్లు, లైన్లు, బోగీలకు నిధులు కేటాయించకుండా కేంద్రం వివక్ష చూపిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. -
మహాత్మాగాంధీకి జరిగిన అన్యాయమే రోహిత్కు జరిగింది
* హెచ్సీయూ దీక్షలో రాహుల్ గాంధీ * ఆర్థిక, సామాజికాభివృద్ధిని వివక్ష అడ్డుకుంటోంది సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న వివక్షకు రోహిత్ ఒక ఉదాహరణ అని.. వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహాత్మాగాంధీకి జరిగిన అన్యాయమే నేడు రోహిత్కు జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ వివక్ష వల్లే దేశం అభివృద్ధి చెందలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షకు వ్యతిరేకంగా తాను తల ఎత్తానని, ఉద్యమం చేపట్టిన విద్యార్థులకు అండగా నిలుస్తానని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ, సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హెచ్సీయూలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకున్న ఆయన.. నేరుగా హెచ్సీయూకు వెళ్లి, రోహిత్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రోహిత్ తల్లి రాధిక, విద్యార్థులు విజయ్, విశాల్, సుంకన్నలతో కలసి ‘వెలివాడ’ శిబిరంలో దీక్ష చేపట్టారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక్కటేనని... వారు విద్యార్థుల మీద బలవంతంగా తమ భావజాలాన్ని రుద్దుతున్నారని రాహుల్ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఒక చట్టం తేవాలని, లేదంటే ఆ విషయాన్ని విద్యార్థులే చూసుకుంటారని ప్రధాని మోదీని హెచ్చరించారు. దేశంలో నివసించే వారంతా భారతీయులేనని, వారు జాతి విద్రోహులు కారని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతీయ, లింగ వివక్షల వల్ల దేశం ముందడుగు వేయలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజికాభివృద్ధిని వివక్ష అడ్డుకుంటోందని... రోహిత్లాంటి ఆలోచనాపరులు వివక్షకు బలైపోతున్నారని చెప్పారు. ఇదే వివక్ష రేపు ప్రతి ఒక్కరికీ ఎదురుకావచ్చని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారికి కూడా జరగవచ్చని వ్యాఖ్యానించారు. కుల, మత, వర్గ విభేదాలకు తావులేని సమాజం కోసం రోహిత్ మరణించాడని... రోహిత్ గ్రహించిన వాస్తవాలను వెల్లడించడమే ఇక్కడ సమస్య అయిందని పేర్కొన్నారు. విద్యార్థులే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఇక్కడి కులవ్యవస్థే కారణమని తనతో ఓసారి ప్రయాణించిన జపాన్ పౌరుడు అభిప్రాయపడ్డాడని రాహుల్ తెలిపారు. కులవివక్షను ఇంక అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘నేను హింసను బోధించను, అలాగే నేను తలవంచను..’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని గుర్తు చేశారు. ఇప్పుడు తాను వివక్షకు వ్యతిరేకంగా తల ఎత్తానని... విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ ప్రసంగం అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాహుల్ గాంధీకి ప్రొఫెసర్ కంచ ఐలయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాహుల్ గాంధీకి అందజేశారు. శనివారం దీక్షలో కాకి మాధవరావు, కంచ ఐలయ్య, జస్టిస్ చంద్రకుమార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. రోహిత్కు హెచ్సీయూ నుంచి రావాల్సిన స్టైఫండ్ రూ.లక్షా 70 వేలను వర్సిటీ చెల్లించలేదని.. దాంతో అదే మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం తరఫున కాకి మాధవరావు, గెడ్డం ఝాన్సీ, సూరేపల్లి సుజాతలు రోహిత్ తల్లికి అందజేశారని విద్యార్థులు తెలిపారు. ప్రధాన గేటు వద్ద గలాటా హెచ్సీయూలో ఉద్యమానికి సంఘీభావం గా రాహుల్గాంధీ దీక్ష చేపట్టిన నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా రావడం.. రాహుల్ రాకకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేయడం.. తదితర పరిణామాలతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీక్షలో ఉన్న రాహుల్ను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్అలీ, ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి, పలువురు స్థానిక నేతలు శనివారం హెచ్సీయూ వద్దకు వచ్చారు. వారిని హెచ్సీయూ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో అక్కడే ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా... పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు రాహుల్ హెచ్సీయూకు రావడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వర్సిటీ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం దీక్షాస్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. చివరికి పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ అన్యాయం మరెవరికీ జరగకూడదు: రోహిత్ తల్లి తన కుమారుడిని 27 ఏళ్లు పెంచి ఈ వర్సిటీకి అప్పజెప్పానని, త్వరలోనే ఉద్యోగం వస్తుందని రోహిత్ తనకు చెప్పాడని... కానీ విశ్వవిద్యాలయం తన బిడ్డ శవాన్ని అప్పగించిందని రోహిత్ తల్లి రాధిక కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకెవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఇక వర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ముగ్గురు విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. రాజకీయం చేస్తున్నారు : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో రోహిత్ తన లేఖలో రాశాడని, దానిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి పెట్టకుండా రాజకీయం చేసి ప్రభుత్వంపై వ్యతిరేక ఉద్యమం చేయాలనుకోవడం సరికాదన్నారు. గతంలో వేర్వేరు వర్సిటీల్లో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రధానిపై వ్యతిరేక ప్రచారంతో రాజకీయం చేయడం సరికాదని, బాధ్యతతో వ్యవహరించాలని కాంగ్రెస్, వామపక్షాలు, బీఎస్పీలకు వెంకయ్య నాయుడు సూచించారు. -
ఇంత దురన్యాయమా!
దళితులపై అఘాయిత్యాలు సాగించడంలో అపకీర్తి గడించిన హరియాణాలో మూడు రోజులక్రితం అర్ధరాత్రి వేళ ఓ ఇంటికి నిప్పుపెట్టి ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకున్న వైనం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ముక్కుపచ్చలారని ఆ పిల్లలిద్దరూ లోకమంటే ఏమిటో తెలియనివారు. ఇక్కడ కుల వివక్ష ఉన్నదని, అది ప్రాణాలు తోడేసేంత ప్రమాదకరమైనదని వారికి అసలే తెలియదు. ఫరీదాబాద్ జిల్లా సంపేడ్ అనే గ్రామంలో వారిద్దరూ అమ్మానాన్నలతో కలిసి ఆదమరిచి నిద్రపోతున్న వేళ దుండగులు కొందరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. క్షణాల్లోనే వారిద్దరూ మంటలంటుకుని ఆనవాళ్లు మిగలకుండా బూడిదైపోయారు. అక్కడకు దగ్గర్లో ఉన్న పౌరులు ఆ ఇంట చెలరేగుతున్న మంటల్ని గమనించి పరుగున వెళ్లి తలుపుల్ని బద్దలకొట్టకపోయి ఉంటే వారి అమ్మానాన్నలు కూడా దహనమైపోయేవారు. వారిప్పుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఒక కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టడానికి జరిగిన ఈ ప్రయత్నం వెనకున్న కారణమేమిటి? ఆ కుటుంబ పెద్ద జితేందర్ గూండానో, రౌడీనో కాదు. ఆయనపై ఎలాంటి నేరారోపణలూ కూడా లేవు. కనుక ఎవరికైనా ఆయనపై కక్ష ఉండటానికి వీల్లేదు. ఆర్ఎంపీగా పనిచేస్తూ జబ్బు పడిన నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్నాడాయన. ఆ గ్రామంలో కొన్ని రోజులక్రితం జరిగిన రెండు హత్యలకు సంబంధించిన కేసులో అతని సోదరుడు ముద్దాయి. ఆ ఒక్క కారణాన్నీ ఆసరా చేసుకుని జితేందర్ కుటుంబంపై దుండగులు దాడి చేశారు. సంబంధం లేని వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడమే కాదు...అతని కుటుంబాన్ని మొత్తం అంతమొందించడానికి వారు తెగించారు. దళితులపై ఆధిపత్యం చలాయించాలని చూడటం, ఆ పోకడల్ని ప్రశ్నిస్తే దాడులు చేయడం సంపేడ్ గ్రామంలో ఎప్పటినుంచో సాగుతున్నదే. కొన్ని రోజులనాడు ఠాకూర్ కులానికి చెందిన ఒకరు మురికి కాల్వలో సెల్ఫోన్ జారవిడ్చుకుని దాన్ని తీసివ్వమని దళితుల్ని కోరడంతో వివాదం మొదలైంది. ఆ పని తాము చేయబోమని వారన్నందుకు ఠాకూర్ కులస్తులు ఆగ్రహించి అవమానించడం...అందుకు దళితులు కూడా దీటుగా జవాబివ్వడంతో రాజుకున్న వివాదం చివరకు ఇద్దరు ఠాకూర్ కులస్తుల హత్యకు దారితీసిందంటున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు పోలీసులు అత్యంత జాగురూకతతో వ్యవహరించి ఉండాలి. ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఠాకూర్లు దళితులపై దాడి చేస్తారన్న స్పృహ ఉండాలి. కానీ అది కొరవడటం మూలంగా వివాదంతో సంబంధమే లేని కుటుంబం దుండగుల దాడిలో అన్యాయమైపోయింది. సంపేడ్లో దళితులు ఆగ్రహించి, జాతీయ రహదారి దిగ్బంధించాక హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు అంగీకరించింది. బాధిత కుటుంబానికి అన్నివిధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. నిందితుల్లో దాదాపు అందరినీ అరెస్టు చేశారు కూడా. బిహార్ ఎన్నికల అవసరం తెచ్చిన ఒత్తిడి ఉండకపోతే ఇంత వేగంగా స్పందన ఉండేదా అన్నది అనుమానమే. ఎందుకంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లాగే హరియాణాలో కూడా దళితులు దారుణమైన కుల వివక్షనూ, దానిని అనుసరించి ఉండే హింసనూ ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర జనాభాలో 20 శాతంగా...అంకెల్లో చెప్పుకోవాలంటే రెండున్నర కోట్లుగా ఉన్న దళిత జనాభా ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితులున్నాయి. అక్కడ గత పదిహేనేళ్లలో దళితులపై అఘాయిత్యాలు ఏడు రెట్లు పెరిగాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2000 సంవత్సరంలో దళితులపై 117 దాడులు జరిగినట్టు నమోదైతే నిరుడు వాటి సంఖ్య 830. ఇవన్నీ...దళితులకు ఎంతో కొంత ఆసరా దొరికి ఫిర్యాదు చేయడంవల్లా, ఆ కేసుల్ని కప్పెట్టడం పెత్తందార్లకు సాధ్యం కాకపోవడంవల్లా బయటపడినవి మాత్రమే. ఫిర్యాదు చేయడం సాధ్యం కానివీ, చేసినా పోలీసులు పట్టించుకోనివీ ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవాల్సిందే. పోనీ నమోదైన కేసుల్లో కూడా దర్యాప్తులు సక్రమంగా సాగటం లేదు. నిందితులుగా ఉంటున్నవారు నిర్దోషులుగా బయటపడుతున్నారు. కేవలం 12 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మిగిలిన 88 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటికొస్తున్నారు. దళితులపై పదే పదే దాడులెందుకు జరుగుతున్నాయో, అలా దాడులకు పాల్పడేవారికుండే ధీమా ఏమిటో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ఒక్క హరియాణా మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నిరుడు వివిధ రాష్ట్రాల్లో దళితులపై నేరాలకు సంబంధించి నమోదైన కేసులు 47,064. దళితులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులూ, నాయకులు చేసే వ్యాఖ్యానాలూ ఆ దాడుల్ని మరింత ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. సంపేడ్ ఉదంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఇది అసలు కుల వివక్షకు సంబంధించిన కేసే కాదని తర్కించారు. మురికి కాల్వలో పడేసుకున్న ఫోన్ను దళితులను తీయమనడం, అందుకు నిరాకరించారన్న కోపంతో దాడి చేయడం ఆయనకు కుల వివక్షగా కనబడకపోవడం ఆశ్చర్యకరం. ఆయన తీరే అలా ఉందనుకుంటే కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందన మరింత దారుణం. కుక్కను ఎవరో రాళ్లతో కొడితే అందుకు కూడా ప్రభుత్వానిదే బాధ్యతా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వం వెంటనే మేల్కొని ఆయనతో సారీ చెప్పించింది. సమస్య అది కాదు. దళితులపై దాడులకు సంబంధించి మన నేతల ఆలోచనా విధానం ఇంత నేలబారుగా ఉండటంవల్లే ఈ బాపతు దాడులు పదే పదే చోటు చేసుకుంటున్నాయి. ఎంతో పరిమిత స్థాయిలోనైనా దళితులు తమ హక్కుల గురించి చైతన్యం తెచ్చుకోవడం, సంఘటితం కావడానికి ప్రయత్నించడం, సవాళ్లు ఎదురైనప్పుడు నిలదీయడానికి ధైర్యం చేయడం వంటివి పెత్తందారీ కులాలకు కంటగింపుగా ఉంటున్నాయన్నది వాస్తవం. దళితులకు ఉద్యోగాల్లో, అధికార పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం వంటివి కొంతమేరకు ఉపయోగపడుతున్నా...అవి మాత్రమే ఆ వర్గాలవారి ఉన్నతికి దోహదపడలేవు. సామాజికంగా ఎదుర్కొనే వివక్ష అంతం కావాలంటే ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోతున్న అలసత్వం వదలగొట్టాలి. పెత్తందారీ కులాలకు అండదండలందించే పోకడలను పాలకులు వదులుకోవాలి. అవి జరగనంతవరకూ సంపేడ్ ఉదంతాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. -
ఇన్పుట్ సబ్సిడీకోసం రాస్తారోకో
విడపనకల్లు: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ డొనేకల్లు గ్రామ మెట్ట భూమి రైతులందరూ బుధవారం సాయంత్రం రాస్తారోకోకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి. దీంతో ప్రయాణికులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం మొదలైంది. కొంతమంది ప్రయాణికులు, పోలీసులకు, తహశీల్దార్కు స్వయంగా ఫోన్ చేసి పిలిపించారు. రైతులు మాట్లాడుతూ 2014లో ఇన్పుట్ సబ్సిడీలో మొత్తం అధికార పార్టీ నాయకులు మాగాణీ భూములకే మంజూరు చేశారని, మెట్ట భూమి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయమై సోమవారం జిల్లాలోని కలెక్టర్కు వివరిస్తే గ్రామంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఆర్డీఓను మంగళవారం పంపిస్తామని చె ప్పారు. అయితే బుధవారం స్వయంగా రెవెన్యూ అధికారులే వచ్చి ఆర్డీఓ విచారణ కోసం వస్తున్నారని, రైతులంతా గ్రామ పంచాయతీ వద్దకు రావాలని చెప్పారు. దీంతో అని పనులు వదులుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశామన్నారు. చివరికి ఉరవకొండ వరకు వచ్చి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్డీఓ ఉన్న ఫళంగా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళన విర మించాలని కోరినా, తహశీల్దార్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు భీష్మించుకున్నారు. దీంతో తహశీల్దార్ శంకరయ్య, డిప్యూటీ తహశీల్దార్ రమేష్బాబు, ఆర్ఐ నాగరాజు ఆందోళనకారుల వద్దకు చేరుకొని స్వ యంగా తానే గురువారం విచారణ చేసి అర్హులైన వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డొనేకల్లు క్రిష్ణమూర్తి, సత్యమయ్య, సింపరన్న, మల్లికార్జున, ఎర్రిస్వామి, సురేష్, శేఖర్ పాల్గొన్నారు. -
అవయవ దాతల పిల్లలకు ఉచిత విద్య
-
అవయవ దాతల పిల్లలకు ఉచిత విద్య
ఎంపీగా నాపై ఎలాంటి మచ్చలేదు సినీ నటుడు మోహన్బాబు సిటీబ్యూరో: ‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేయాలనిపిస్తుంది. కానీ ఇంట్లో వారు, బంధువులు ఎవరికీ లేని బాధ మీకెందుకు? అంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక ఓ పిరికిపందలా ఒంటరిగా జీవిస్తున్నా’ అని సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.మోహన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దాతల పిల్లలకు తన విద్యా సంస్థలో ఉచిత విద్యనందిస్తానని ప్రకటించారు. వ ందేళ్లు కూడా బతుకుతామో లేదో తెలియదు. కానీ కొంతమంది వెయ్యేళ్లకు సరిపడినంత సంపాదిస్తున్నారు. దీని కోసం అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతూ పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ప్రపంచ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతల కుటుంబ సభ్యులను గురువారం కిమ్స్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలు, అన్యాయాలపై ఎప్పటికప్పుడు నిలదీయాలని ఉన్నా.. కొంతమంది ఒత్తిడితో వాటికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన కాలంలో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. భూతద్దం పెట్టి వెతికినా లోపాలు కన్పించవన్నారు. ఎంపీగా క్లీన్చిట్ పొందినట్లు చెప్పారు. జీవితంలో ఇప్పటి వరకు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడలేదని, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేయాలని భావనతోనే విద్యాలయాలు స్థాపించి... 25 శాతం మంది ప్రతిభగల పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అవ యవ దాతల పిల్లలకు తన విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తానని ప్రకటించారు. అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత, కిమ్స్ వైద్యులు డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ సహారియా, తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమకు తీరని అన్యాయం
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల ఆవేదన తిరుపతి కల్చరల్: ఉమ్మడి రాష్ట్రంలోను, విభజన తర్వాత రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన సీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీసేలా తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై రాజకీయ పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనాథగా మారిన రాయలసీమ సమస్యలపై తిరుపతి విశ్వం పాఠశాలలో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుందన్నారు. కృష్ణ జలాల్లో రాయలసీమకు హక్కులేదని తెలంగాణ సీఎం బహిరంగంగా మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గానీ, రాజకీయ పార్టీలు గానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కారణంగా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లేకుండా పోయే ప్రమాదముందన్నారు. అనంతరం సామాజిక కార్యకర్త ఎం.పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ మాట్లాడుతూ ఒక ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక వికాసం నీటితోనే ముడిపడి ఉందన్నారు. అనంతరం రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్ కె.శ్రీనివాసులురెడ్డి తదితరులు ప్రసంగించారు. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ నాయకుడు జయచంద్రారెడ్డి, సామాజిక కార్యకర్త లక్ష్మయ్య, జర్నలిస్టు పి.లోకేశ్వర్రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. -
సీమకు అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తేవాలి
మైదుకూరు టౌన్ : అభివృద్ధి విషయంలో రాయలసీమకు జరిగిన అన్యాయంపై కుందూ సాహితీ ఆధ్వర్యంలో సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లెక్కల వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీహైస్కూల్ ఆవరణలో కుందూ సాహితీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రరాష్టం ఏర్పడిన సమయంలో రాయలసీమ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను నాయకులు అమలు చేయలేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్లు, పరిశ్రమల ఏర్పాటులో మొండి చెయ్యి మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభన అనంతరం కూడా రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ సమన్వయకర్త తవ్వా ఓబుల్రెడ్డి, ప్రధాన కార్యదర్శితోట రామమోహన్, పొదిలినాగరాజు, ఓబులం క్రిష్టమూర్తి, క్రిష్టమూర్తి యాదవ్, దాదం ఆంజనేయులు, పోలుకొండారెడ్డి, డిఎన్నారాయణ, సాదక్, కొండపేట నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అన్యాయం చేసిన వాళ్లే అసూయపడేలా అభివృద్ధి చేద్దాం
* నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేయండి * మారథాన్ టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: అన్యాయం చేసిన వాళ్లే అసూయపడేలా ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం తన నివాసం నుంచి 13జిల్లాలకు చెందిన 15 వేల మంది ప్రజా ప్రతినిధులతో 3 దశలుగా సీఎం భారీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మారథాన్ టెలీ కాన్ఫరెన్స్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల పరిషత్తు అధ్యక్షులు, జేడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. విభజన వల్ల తలెత్తిన సంక్షోభం, ఏడాది పాలనపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమం తన ప్రభుత్వానికి రెండు కళ్లుగా అభివర్ణించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. పేదరికం మీద విజయం సాధించటమే నవనిర్మాణ దీక్ష లక్ష్యమని, మంగళవారం నుంచి నిర్వహించనున్న ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీక్ష అంటే నిరాహార దీక్ష కాదని, ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదని, పేదరికానికి వ్యతిరేకంగా, అందరూ సమష్టిగా విజయం సాధించటానికి సంకల్పం తీసుకునే దీక్ష అని చెప్పారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ‘పేదరికంపై గెలుపు’ అనే అంశాన్ని ఫోకస్ చేస్తామన్నారు. నీరు-మీరు, బడి పిలుస్తోంది కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. టెలీకాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, వ్యవసాయశాఖ కార్యదర్శి విజయకుమార్, సాల్మన్ ఎ.రాజ్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేమి న్యాయం..!
పులివెందుల/లింగాల : అరటి కాయల ధరల విషయంలో రైతులకు అన్యాయం చేయడం తగదని, సోమవారంలోగా నిర్ధిష్టమైన ధరలు నిర్ణయించాలని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. గత వారంలో టన్ను అరటి కాయలు రూ. 14వేలు ఉంటే.. మూడు రోజులనుంచి రూ.7వేలనుంచి రూ. 8వేల వరకు మాత్రమే ధరలు నిర్ణయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. లింగాల, పులివెందుల, వేముల మండలాల రైతులు ఈ విషయాన్ని వైఎస్ వివేకా దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఢిల్లీ వ్యాపారుల మధ్యవర్తులతో ఆదివారం సాయంత్రం స్థానిక కదిరి రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న పెట్రోలు బంకు వద్ద చర్చలు నిర్వహించారు. రోడ్డుపై బైటాయించి టన్ను అరటి కాయలకు రూ.11,500నుంచి రూ. 15వేల వరకు వెచ్చించి కొనుగోలు చేయాలన్నారు. కోతకు వచ్చిన అరటి కాయలకు ఒక్కసారిగా ధరలు తగ్గించడం దారుణమన్నారు. మధ్యవర్తులనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఓ దశలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడు లారీల టైర్ల గాలి తీసేందుకు యత్నించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి రైతులను సముదాయించి అలాంటివి చేయరాదని.. రోడ్డుపైనే బైటాయించి నిర్దిష్టమైన ధరలు నిర్ణయించేవరకు లారీలను వెళ్లనీయద్దని రైతులకు పిలుపునిచ్చారు. దీంతో రైతులు రోడ్డుపై వెళ్లే లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, పులివెందుల మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, లింగాల మండలంలోని అంబకపల్లె, ఇప్పట్ల, పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, వేముల మండలాల అరటి రైతులు పాల్గొన్నారు. -
ముంబైకర్లకు అన్యాయం జరిగే ప్రతిపాదనలను ఒప్పుకోం
శివసేన అధినేత ఉద్ధవ్ సాక్షి, ముంబై: ముంబైకర్లకు అన్యాయం జరిగే ఎలాంటి ప్రతిపాదనలైనా వ్యతిరేకిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తే ముంబైలో పేదలకు ఇళ్లు కరవైతాయి. ఇళ్ల ధరలు పెరిగి ప్రజలు శివారు ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు’ అని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ రూపొందించిన ప్రణాళికను అధ్యయనం చేసేందుకు శివసేన కార్పొరేటర్లు, నిపుణులతో మంగళవారం ఉద్ధవ్ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అసలు ప్రణాళిక ఏంటి? దాన్ని ఏ పద్ధతిలో రూపొందించారు? ఎలా అభివృద్ధి చేస్తారు? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పేదలకు అన్యాయం జరిగే ప్రతిపాదనలను తిరస్కరిస్తామని అన్నారు. అభివృద్ధిని వ్యతిరేకించడం లేదని, అభివృద్ధి వల్ల ఎవరికి, ఎంతమేర నష్టం జరుగుతుంది, దీనికి పరిష్కార మార్గమేంటనే దానిపై దృష్టి సారించాలని సూచించారు. -
ఇంత అన్యాయమా?
బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ విస్మయం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు నిధులు కేటాయించిన తీరు చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అవాక్కయ్యారు. ‘ఇదేం దేశం.. ఇదేం ప్రభుత్వం.. ఇంత అన్యాయం ఉంటుందా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు నిరుటితో పోలిస్తే సగానికి సగం నిధుల కోత వేసిన విషయం తెలియగానే... అసలు ఇది నిజమేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏటేటా సంక్షేమానికి ఎంతో కొంత నిధులు పెరగాలి గానీ.. కోత వేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో ఐసీడీఎస్, అంగన్వాడీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి బాహాటంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్పై పెదవి విరిచారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు, వేతనాల పెంపునకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది. \అప్పటికే అంగన్వాడీ సమస్యలపై కేసీఆర్ సీఎంవో అధికారులతో పాటు ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చర్చలు జరిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలను రెండింతలు చేయాలనే తన ఆలోచనపై సాధ్యాసాధ్యాలను సమీక్షించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ విభాగం నిధులు కేటాయిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్లు నిధులు వచ్చాయని.. ఈసారి మరో రూ.4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లు అదనంగా వస్తాయనే అంచనాతో జీతాలు పెంచేందుకు సీఎం మొగ్గుచూపినట్లు తెలిసింది. శనివారం అంగన్వాడీ ప్రతినిధుల సమావేశం జరుగుతుండగానే... జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటికే అంగన్వాడీ కార్యకర్తల జీతాలను పెంచేందుకు భరోసా ఇచ్చిన సీఎం... ఎంత పెంచుతామనే స్పష్టమైన హామీ ఇచ్చే ఆలోచనతో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేంద్రం ఈసారి ఎన్ని నిధులు కేటాయించిందో కనుక్కోవాలని అధికారులకు సూచించారు. ఈసారి రూ.8,000 కోట్లు కేటాయించారని అధికారులు బదులిచ్చారు. కంగుతిన్న సీఎం.. ఇదేం ప్రభుత్వమంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమావేశం నుంచి ఢిల్లీలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. బడ్జెట్పై జరిగే చర్చలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. -
అన్యాయాన్ని సహించేది లేదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అన్యాయాల్ని సహించేది లేదు.. లంచాన్ని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు.. ప్రజలకు సేవలందించేప్పుడే మంచి అధికారిగా గుర్తింపు ఉంటుంది. మాటలు మాని చేతలు చూపాలి’అని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. జిల్లాకు కలెక్టర్గా వచ్చి నెలన్నరవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నానని.. భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. జిల్లాను కరప్షన్ ఫ్రీగా చూడాలన్నది లక్ష్యమన్నారు. పేదలకు సాయం చేసేందుకు ఉద్యోగాన్ని దేవుడిచ్చిన వరంగా భావించాలని వ్యాఖ్యానించారు. లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని అంతా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై దృష్టిసారించాలన్నారు. రూ.15 వేలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అడుగు వేసిందని, గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. వంద రోజుల్లో లక్ష మరుగుదొడ్లు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఇప్పుడు లక్ష్యం కేవలం మూడు నెలలే ఉందన్నారు. దీనిపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షించామన్నారు. 2,300 గ్రామాల్లో ఇసుక, రేకులు, మరుగుదొడ్ల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాల్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ కూడా సిబ్బందికి పలు అంశాల్ని సూచించారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే వెళ్తాయని, వర్క్స్ కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయన్నారు. గుడిసెలున్న ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో మరుగుదొడ్లు కని పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఒకే ప్రాంతంలో పది మరుగుదొడ్లు కట్టించి తాళాలు కూడా లబ్ధిదారుడి చేతికే అందేలా చూస్తున్నామన్నారు. స్పందిస్తా కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన లబ్ధిని ఎవరైనా దిగమింగితే ఊరుకునేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఎవరైనా -
ఈ కాలమ్ మీదే : చర్చావేదిక
ఏకాలంలో జరిగినా అన్యాయం అన్యాయమే! - రంగనాయకమ్మ ‘ఆనాటి విషయాన్ని ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా?’ అని వి.ఎ.కె. రంగారావుగారు వేసిన ప్రశ్న, కొన్ని సందర్భాలకే గానీ, అన్ని సందర్భాలకూ వర్తించదు. వేల సంవత్సరాల నాటి ఒక పండితుడు ‘వర్గ భేదాల’ గురించి చెప్పకపోతే, దాన్ని నేరంగా పరిగణించడం సాధ్యం కాదు. కానీ, ఆ పండితుడే సతీసహగమనాన్ని సమర్థిస్తూ చెప్తే, దాన్ని ‘ఆనాటి విషయం’గా జమకట్టనక్కరలేదు. ఆ వ్యక్తికి ఆ విషయం మీద ఆనాడైనా ‘కరుణ’ ఉండాలి. అది చాలు! అది లేకపోతే, అది నేరమే. ‘స్వర్గ సీమ’లో భార్యాభర్తల విషయాన్ని ‘ఆనాటి విషయం’గా తీసివెయ్యవలసింది కాదు. భర్త ప్రవర్తన, ఆనాడు కూడా నీచమైనదే. ఆ భర్తకి పశ్చాత్తాపం కలిగితే, అది స్వంత ఆత్మవేదనతో జరగాలి. ఆ నటి వదిలేసింది కాబట్టి బైటికి రావడం, పశ్చాత్తాపం అవదు. అప్పటికే పత్రిక పని పోగొట్టుకుని, నటి వదిలేశాక, బికారిగా వీధుల్లో తిరుగుతూ ఇంటికి చేరినట్టు చూపిస్తే, అదా పశ్చాత్తాపం? నీచమైన మాటలు మాట్లాడి వెళ్ళినవాడు, పశ్చాత్తాపంతో దగ్దమవుతూ తిరిగి వచ్చిన వాడైతే, అతడే భార్య కాళ్ళ మీద ఎందుకు పడకూడదు? డెరైక్టర్కి ఆ భావం లేకపోతే, ఆ భర్త తల వాల్చి కన్నీళ్ళు కారుస్తూ భార్య ముందు నించోవచ్చు. ఏ తప్పూ చెయ్యని ఆ భార్యనే అతడి కాళ్ళ మీద ఎందుకు పడెయ్యాలి? ఆ ముగింపులో, ఆ భార్యకి ఏమైనా న్యాయం జరిగిందా? ఆ న్యాయం, ఆనాడైనా అసాధ్యమా? ఆ భార్యకి న్యాయం జరగదేదని ఆనాడు కాకపోతే, ఈనాటికైనా తెలుసుకోవద్దా? ‘ఆనాటి విషయం అది’ అని ప్రతీ వెనకటిదాన్నీ సరిపెట్టుకుంటూ ఉంటే, ఇక వెనకటి తప్పుల్ని తెలుసుకునేది ఎలాగ? దిద్దుకునేది ఎలాగ? ఆ భార్య, బిడ్డల భవిష్యత్తుని పటిష్టం చేసుకోవడం కోసం భర్తని ఆహ్వానించిందని ఈ పండితుడి వాదం! ఆ తండ్రి వల్ల బిడ్డలకేదో క్షేమం అవుతుందని ఆ భార్య నమ్మితే అది ఆమె అమాయకత్వమే. సైగల్ పాటలో నేను రాసిందే సరైనది. ఆ పాటలో పదాలు, ‘స్వర్గసీమ’లో ఇలా ఉంటాయి - ‘దుఃఖ్ కే హై దునియా బాబా! ఆంఖ్ ఖోల్ కే దేఖో బాబా!’ - ఇది పూర్తిగా సైగల్ కంఠమే. ‘స్వర్గసీమ’ మీద నా విమర్శ, ‘మగవారిని దుమ్మెత్తి పొయ్యడానికే జరిగిందనీ, కథలో ఆ భర్తని పాడు చేసింది ఇంకో స్త్రీయేననీ’ కె.ఎన్.టి శాస్త్రిగారి వాదం! పురుషుల కోసం గృహాల్లో పతివ్రతల్నీ, గృహాల బైట జారిణుల్నీ, సమాజం ఏనాడో ఏర్పాటుచేసి ఉంచింది కదా? ఇక్కడ ఆ జారిణి సంగతి అనవసరం. సమస్య అంతా భార్యాభర్తలదే. తప్పు చేసిన వాణ్ణి అందలం ఎక్కించి, ఏ తప్పూ ఎరగని భార్యనే అతడి బానిసని చెయ్యడమా భార్యకి చేసిన న్యాయం? ఈ పెద్దలు ఆ తప్పుని తెలుసుకోకపోతే, ఇక తెలుసుకోగలిగేది ఏముంటుంది? నేను ‘స్వర్గసీమ’లో, ‘చెడ్డనే కాదు, ఎన్నో ‘మంచి’ విషయాలు కూడా చూశాను, చెప్పాను. మీకు మాత్రం మంచిచెడ్డల విభజన లేదు. ఏ చెడ్డని అయినా, ఒకనాటి మంచిగానే జమ కట్టగలరు మీరు. ‘చెడ్డల’ వైపు వీపులు తిప్పి, ప్రతీ చెడ్డనీ ‘మంచి’గానే స్వీకరించగలరు మీరు. ఏది ఎలా జరిగినా అది మీకు స్వర్గమే. కానీ, ఈ స్వర్గ వాదాలతో కూడా మంచిచెడ్డలు బైట పడకుండా దాగిపోవు. ‘అన్యాయం’ అనేది ఏకాలంలో జరిగినా, అది అన్యాయమే. అన్యాయం అనేది. న్యాయం ఎప్పుడూ అవదు. సినిమా వాళ్లకే కాదు, మనకూ ఈ జబ్బు! - డా. నాగసూరి వేణుగోపాల్ సినిమా వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది- అనే శీర్షికలో రంగనాయకమ్మ రాసిన వ్యాసం ప్రచురించి చాలా మంచి పని చేశారు. అరశతాబ్దం నుంచి ఈ ‘స్వర్గసీమ’ సినిమా గురించి చాలా సందర్భాలలో, చాలా మంది చర్చించడం మనకు తెలుసు! బిఎన్రెడ్డి దర్శకత్వ ప్రతిభ, భానుమతి గానం, నటన; నాగయ్య సామర్థ్యం, రజనిగారి సంగీత వరుసలు... ఇలా చాలా చోట్ల ‘స్వర్గ సీమ’ గురించి ప్రస్తుతిస్తారు. కానీ కథా వస్తువు ఇలా ఉందనే చర్చ ఈ పాతిక, ముప్పయ్యేళ్ళతో జరిగినట్టు కనబడలేదు. అంతకు ముందు జరిగిందేమో నాకు తెలియదు. ‘స్వర్గసీమ’ అనబడే గొప్ప సినిమాలో కథావస్తువు ఇంత అర్థరహితంగా ఉందా? అనే సందేహం భయంకరంగా ఆందోళన కలిగిస్తున్నది! అందరూ గొప్పది అంటున్నారు - మనం కూడా అందాం. అందరూ ఆలోచించకుండా చూస్తున్నారు - మనం కూడా అలాగే చూద్దాం... అనే రీతిలో ఐదారు దశాబ్దాలు అప్రతిహతంగా సాగిపోవడం చాలా విచిత్రంగా ఉంది. దేన్ని అయినా దాని అసలు విలువతోనే చూడాలి. అలా చూడకపోవడం, చూడలేకపోవడం గురించి మనం చర్చించుకోవాలి. ఇలాంటి దృష్టి లేకుండా ఎందుకు మనం సాగిపోతున్నామో కూడా తర్చించుకోవాలి. కొత్త పుస్తకాలు పక్కనపెట్టి ఈ పాత సినిమా చూశానని రంగనాయకమ్మ తన వ్యాసంలో పేర్కొన్నారు. నిజంగా మంచి పని చేశారు. పుస్తకాలు మేధావులకు, సినిమాలు మామూలు జనాలకు అనే అభిప్రాయం ఉంది. నిజానికి ప్రభావం విషయంలో సినిమాలతో పుస్తకాలను పోల్చలేం. సకల కళల సమాహారమైన సినిమా సాంకేతిక సౌలభ్యంతో విచ్చుకుపోతోంది. వస్తువు తుక్కుగా ఉన్నా ఇతర దినుసులతో - ఇంకా మాట్లాడితే స్వర్గసీమలాగానే విజయవంతమవుతోంది. కనుక పుస్తకాలతో సినిమాలను అసలు పోల్చలేం. పుస్తకం కూడా సాంకేతిక విజ్ఞానం తోడ్పాటుతో నేడు మరిన్ని సౌలభ్యాలతో సాగుతోంది. అయినా కూడా సినిమా సాధించుకున్న తీరుతో పోల్చలేం. కనుక సినిమా ప్రభావం చాలా చాలా ఎక్కువ! రచయితలు, మేధావులు అనుకుంటే పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలు సైతం చర్చ అవుతాయి. ఇప్పుడు కరపత్రం వేసి, అదనంగా ఖర్చు పెట్టనక్కరలేదు. ఈ మెయిళ్ళు, ఫేస్బుక్, బ్లాగులు వగైరా టెక్నాలజి కూడా పత్రికల ఉత్తరాల శీర్షికతో పాటు అందుబాటులో ఉంది. ఈ విషయాలను స్థూలంగా మాట్లాడినప్పుడు కనీసం పుస్తకాలనైనా కూలంకషంగా మనం తర్కిస్తున్నామా? అనే ఆలోచన వస్తుంది. ‘స్వర్గసీమ’ గురించి మనందరి కళ్ళు తెరిపించిన రంగనాయకమ్మ కొంతకాలం క్రితం అచ్చంగా ఇలాంటిపనే మరొకటి చేశారు. కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన ‘సైన్స్ వ్యాసాలు’లో అర్థరహితమైన విషయాలు గురించి ఇలాంటి వ్యాసం ద్వారా బట్టబయలు చేశారు. ఆ పుస్తకం వెలువడి దశాబ్దం దాటినా - కొ.కు.లోని హేతురాహిత్యాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. రంగనాయకమ్మ ఆ పుస్తకం దుమ్ము దులిపారు. కానీ తర్వాత జరిగిన చర్చ సమగ్రమైంది కాదు. కొత్తదయినా, పాతదయినా సినిమా అయినా, పుస్తకమైనా నిరంతరం పరిశీలించబడాల్సిందే! సమాజంలో ఎక్కువ మందికి దోహదపడే విషయాలుంటే వాటి గురించి ప్రస్తావించి ప్రాచుర్యంలోకి తేవాలి. అలాగే సమాజానికి పనికిరాని, హాని కల్గించే విషయాలను ఎక్కడున్నా పట్టుకొని, తప్పక బట్టబయలు చేయాలి, తూర్పారబట్టాలి! పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
అన్యాయాన్ని సహించం
కార్యకర్తలను కాపాడుకుంటాం.. నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో తమ కార్యకర్తల్లో ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగితే సహించేది లేదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో శనివారం సమావేశం నిర్వహించారు. సర్వేపల్లి, సిటీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, పి.అనిల్కుమార్యాదవ్ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెల్లూరులోనే మొట్టమొదట కమిటీలు వేసి అధ్యక్షులను నియమించామన్నారు. వివిధ సంఘాలకు నియమితులైన అధ్యక్షులు కూడా కమిటీలు వేసుకోవాలని సూచించారు. త్వరలో గ్రామస్థాయిలో అన్ని కమిటీ నియామకాలను పూర్తిచేసి జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛమైన నాయకులు, కార్యకర్తలతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇటీవల ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టిన ధర్నాలే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసంతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటపై నిలబడే వ్యక్తి కాదని ప్రజలందరికీ అర్థమైందన్నారు. వృద్ధులని కూడా చూడకుండా పింఛన్లు తొలగిస్తున్నారని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనుబంధ సంఘాల అధ్యక్షులకు చాలా బాధ్యత ఉందని కాకాణి అన్నారు. అందరూ ఒకే తాటిపై పనిచేస్తూ భవిష్యత్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు జగన్తో పాటు పార్టీపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీని ఒక్కరు కూడా విడిచిపెట్టి పోరన్నారు. రాబోవు రోజుల్లో జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి 13 స్థానాలు ఏర్పడితే అన్ని చోట్ల వైఎస్సార్సీపీ గెలుస్తుందన్నారు. జగన్మోహన్రెడ్డితో ఒక సారి స్నేహం చేసిన వాళ్లు జీవితంలో అతన్ని వదులుకోరన్నారు. కొందరు అధికారులు కూడా ఏకపక్షంగా పని చేస్తున్నారని కాకాణి విమర్శించారు. జిల్లాలో ఏ కార్యకర్తలకు కష్టమొచ్చినా అందరం వెళ్లి భరోసా ఇద్దామన్నారు. సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబంపై అభిమానం ఎక్కువగా ఉన్నది నెల్లూరు జిల్లా వారికే అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో తమకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తామన్నారు. ఇప్పటి నుంచే అందరం కలిసి ఒకే ఆలోచనతో పార్టీని ముందుకు తీసుకెళదామన్నారు. రాబోవు ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని పిలుపునిచ్చారు. అధికార టీడీపీలో వాళ్లలో వాళ్లకే పడకుండా ఎవరికివారుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. -
అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకోను
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(హరనాథపురం): ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా ఊరుకోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు. పడారుపల్లిలోని మున్సిపల్ స్కూల్లో 24వ డివిజన్, కల్లూరుపల్లిలో 25వ డివిజన్లకు సంబంధించిన జన్మభూమి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పింఛన్లు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. బాలింతలను దీవించి ప్రత్యేక సారెను అందజేశారు. స్థానికులు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పింఛన్ల మంజూరులో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హులకు మంజూరు చేయాలని కోరారు. జన్మభూమి అనంతరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.12 వేలను ప్రభుత్వం మంజూరు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగునకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమని, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అర్జీ తీసుకొని అధికారుల దగ్గరకు వచ్చిన ప్రజలను ఆదరించాలని, సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు. పరిష్కారం లభించని సమస్యలకు కారణాలను తెలియజేయాలన్నారు. 24, 25వ డివిజన్ల కార్పొరేటర్లు పాతపాటి శ్రీలక్ష్మి, బిరదవోలు పద్మజ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతపాటి పుల్లారెడ్డి, మస్తాన్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, నన్నం శ్రీనివాసులు, అన్నపురెడ్డి శేఖర్, వేల్పుల అజయ్, అరవ శ్రీను, శ్రీధర్రెడ్డి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్కు *50 వేల విరాళం కల్లూరుపల్లిలో జరిగిన జన్మభూమిలో స్థానిక కార్పొరేటర్ బిరదవోలు పద్మజ మాట్లాడారు. అల్లూరు ఆదినారాయణరెడ్డి సహకారంతో తమ డివిజన్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తమ వంతుగా రూ. 50 వేల సొం త నిధులను ఇస్తున్నట్లు ప్రకటించారు. -
తెలంగాణకు కుట్రపూరిత అన్యాయం: కేసీఆర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీలో తెలంగాణకు కుట్రపూరిత అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రాజెక్టుల ఆపరేషన్ రూల్స్ ను తయారు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల గేట్లు, కాలువ నీటి విడుదలను బోర్డులే నిర్వహించాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 50 టీఎంసీలు కేటాయించాలని సీఎం తెలిపారు. నదుల పర్యవేక్షణకు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం హెలికాఫ్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ కు మంచి నీరు అందించే ఆలోచన ఉందన్నారు. కృష్ణా గోదావరి బోర్డులకు తక్షణం 5 కోట్ల సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఎస్ కే పండిట్, ఎమ్మెస్ అగర్వాల్ లు పాల్గొన్నారు. -
టీడీపీలో కురుబలకు అన్యాయం
కళ్యాణదుర్గం : టీడీపీలో కురుబలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఆ కుల నాయకులను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో కురుబలకు సముచిత స్థానమే ఉంటే పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ఆయన నిలదీశారు. ఆదివారం స్థానిక కనకదాసు కల్యాణ మండపంలో నిర్వహించిన కురుబ విద్యార్థులకు కనకదాసు ప్రతిభ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేష్ అధ్యక్షత వహించారు. జగదీష్ ప్రసంగిస్తూ జిల్లాలో 5 లక్షల మంది, రాష్ట్రంలో 50 లక్షల మంది కురుబలు ఉన్నారన్నారు. టీడీపీలో గెలుపొందిన ఏకైక కురుబ కులస్తుడైన పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వక పోవడం ఆ పార్టీలో వారికున్న ప్రాధాన్యత అర్థమవుతుందని విమర్శించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుబలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కురుబలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తున్నాయని ఆయన మండిపడ్డాడు. రాయలసీమలోని 40 నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను శాసించే స్థాయిలో కురుబలు ఉన్నా, రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి : కురుబలు అన్ని రంగాల్లోను రాణించాలని, కురుబ విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరుశురాం పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేష్, ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమలివరం ఈశ్వరయ్యలు ప్రసంగించారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా, సంఖ్యా బలం కురుబలకు ఉన్నా ఆ దిశగా రాజకీయంగా రాణించలేక పోతున్నారని వాపోయారు. కనకదాసు ప్రతిభ అవార్డుల ద్వారా విద్యా రంగంలో కురుబ విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గొర్రెల పెంపకందారులకు షెడ్ నిర్మాణానికి, కాపర్లు మరణిస్తే అందే పరిహారం పై వివరించారు. అనంతరం 24 మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు. కురుబ సంఘం తాలూకా అధ్యక్షుడు దొణస్వామి, మండలాధ్యక్షుడు ఎర్రిస్వామి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రజలను జాగృతపరిచేవి కళలే
ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం డిప్యూటీ సీఎం రాజయ్య రవీంద్రభారతిలో అక్కినేని మీడియా అవార్డ్స్ ప్రదానం సాక్షి మీడియా ప్రతినిధులకు రెండు అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: కళలు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలను జాగృతం చేస్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత సినీ దిగ్గజం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేని మీడియా అవార్డ్స్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు వివక్షతకు గురయ్యారన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి మాట్లాడుతూ మీడియా అవార్డ్సు ప్రదానం మంచిని ప్రభావితం చేసే కార్యక్రమమన్నారు. అనంతరం శృతిలయ, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని మీడియా అవార్డులను సాక్షి టీవీకి చెందిన బి.కల్పనకు, సాక్షి ఫిలిమ్ రిపోర్టర్ ఎస్.నాగేశ్వరరావు, ఎక్స్ప్రెస్ టీవీ నుంచి భవన, ఈటీవీ2 నుంచి సతీష్తోపాటు పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, శృతిలయ నిర్వాహకులు ఆర్ఎన్ సింగ్, ఆమని, దళిత సేవా అధ్యక్షులు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
హామీలెక్కువ.. ఇచ్చింది తక్కువ
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు అంతంతమాత్రమే సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రెవెన్యూ లోటు పూడ్చేందుకు నిధులు.. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు.. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్, వివిధ యూనివర్సిటీలు.. విశాఖలో మెట్రో.. విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో.. ఇలా ఎన్నో ఆశలు పెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామన్నారు. ఈ మాటలన్నీ విన్న ఏపీ ప్రజానీకం కేంద్ర బడ్జెట్ కోసం ఆత్రంగా ఎదురు చూసింది. కానీ ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమీ లేదు. ఏవో కొన్ని తాయిలాలు తప్ప.. చాలావరకు హామీలను నెరవేర్చలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి.. ప్రత్యేకించి కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు రూ. 15,691 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. దీనిని భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ, ఈ బడ్జెట్లో కేంద్రం రూ.1,180 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంకా రూ.14,511 కోట్ల లోటు ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 250 కోట్లు కేటాయించింది. తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం, సీమాంధ్రకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్లాన్ ఔట్ లే కింద రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ వర్శిటీలకు నిధులు ఒకే ఏడాది కేటాయిస్తారా? లేక విడతలవారీగా కేటాయిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ప్రాథమికంగా ఒక్కో కోటి చొప్పున కేటాయించారు. బీజేపే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా దేశంలో 100 స్మార్ట్ సిటీలను రూ. 7,060 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా ప్రకటించినా.., ఆంధ్రప్రదేశ్కు అత్యావశ్యకమైన రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తినీ పట్టించుకోలేదు. ఏపీలో మెగాసిటీలు, స్మార్ట్ సిటీల నిర్మాణం గురించి బీజేపీ నేత వెంకయ్యనాయుడు పలుమార్లు చెప్పడమే తప్ప, బడ్జెట్లో వాటిని చేర్చడంలో కృతకృత్యులు కాలేకపోయారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ప్రకటన కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో ఆల్ట్రా మెగా సోలార్పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం పోర్టును పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రకటించారు. కాకినాడ పోర్టు అభివృద్ధికి నిధులిస్తామన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మాత్రం ఇతరత్రా ఏమీ లేవు. ఆర్థికంగా చేయూత అనుమానమే! బడ్జెట్లో ఏపీని ఆర్థికంగా ఆదుకొనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఆర్థిక లోటు, రాజధానికి కలిపి కొంచెం నిధులే కేంద్రం విదిలించింది. దీంతో కేంద్రం నుంచి నిధులు దక్కడంపై అధికారవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా కష్టమే ఏపీ కొత్త రాజధాని, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని పునర్వ్యవవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ బడ్జెట్లో ఈ ఊసే ఎత్త లేదు. -
తెలంగాణకు రిక్తహస్తమే..!
ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదాపై ప్రకటన కరువు హామీలు గాలి కొదిలేశారు...! విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ... గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్తో ఎన్టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్లో రాలేదు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తాన్నే చూపింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో కేవలం ఒక్క ఉద్యానవన యూనివర్సిటీ మినహా ఏ ఇతర హామీని కేంద్రం తన బడ్జెట్లో ప్రకటించలేదు. గిరిజన యూనివర్సిటీపై నామమాత్రపు ప్రస్తావన కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఎలాంటి హామీ దక్కలేదు. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే ప్రకటన మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ను హైదరాబాద్కు మంజూరు చేసినా దానివల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు. ప్రాణహిత-చేవెళ్లకు ఏదీ జాతీయ హోదా! ప్రాణహిత- చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించారని కూడా వారు ప్రకటించారు. అయితే, బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించలేదు. అంతేకాకుండా రాష్ట్రానికో ఎయిమ్స్ అని హామీ ఇచ్చినా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఎయిమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ లేదు. హామీలు గాలి కొదిలేశారు...! విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ... గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్తో ఎన్టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్లో రాలేదు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు. నిరాశ కలిగించింది: సీఎం కేసీఆర్ బడ్జెట్లో రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ మినహా మరేది కొత్తగా కేటాయించకపోవడం సరికాదు. అది కూడా రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందే. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంతో కోరాం. అయినా న్యాయం చేయలేదు. పునర్విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా నిరాశ కలిగించింది. -
పోలవరంపై తెచ్చే బిల్లును అడ్డుకోండి..
-
అన్యాయంపై గళమెత్తండి...
పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయండి.. గవర్నర్కు ప్రత్యేకాధికారాలను వ్యతిరేకించండి పోలవరంపై తెచ్చే బిల్లును అడ్డుకోండి.. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్నీ వదులుకునేది లేదు టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఉపదేశం రాష్ట్రం పరిధిలోకి వచ్చే శాంతిభద్రతలు వంటి వాటిని గవర్నర్కు అప్పగిస్తూ కేంద్రం తెలంగాణను తన చెప్పుచేతల్లోకి తీసుకునేలా వ్యవహరిస్తోంది. దీన్ని పార్లమెంటులో లేవనె త్తండి. - ఎంపీలతో కేసీఆర్ పోలవరం ఆర్డినెన్స్పై తీసుకొచ్చే బిల్లును పార్లమెంట్లో గట్టిగా అడ్డుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. నీళ్లు, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలతోపాటు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని, ఉభయ సభల్లోనూ కేంద్రాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనలను కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ కసరత్తు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు పార్టీ ఎంపీలను మధ్యాహ్న విందుకు ఆహ్వానించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ విందు సమావేశానికి ఎంపీలు కె.కేశవరావు, జితేందర్రెడ్డి, బి.వినోద్కుమార్, కడియం శ్రీహరి, కవిత, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, కె.విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్, జి.నగేష్, బాల్క సుమన్తో పాటు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన పలు అంశాలు, వాటి విషయంలో పాటించాల్సిన విధానంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఎంపీలకు కేసీఆర్ చేసిన సూచనలివే... - సాక్షి, హైదరాబాద్ పోలవరం ముంపు పేరిట ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని మీరంతా ముక్తకంఠంతో వ్యతిరేకించండి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లు సహా తెలంగాణలోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా ఏపీలో కలపడానికి ఒప్పుకొనే ప్రసక్తే లేదు. ఈ విషయంలో మీరు ఎందాకైనా వెళ్లండి. ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టడానికి సంబంధించి రాష్ట్ర విభజన బిల్లులోని సెక్షన్-8లో మార్పులు చేస్తూ కేంద్రం పంపిన ముసాయిదాను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. పార్లమెంట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్రం తీరును ఎండగట్టండి. శాంతిభద్రతలు, అధికారుల బదిలీ వంటి అంశాలన్నీ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా వాటిని గవర్నర్కు అప్పగిస్తూ తెలంగాణను తన చెప్పుచేతల్లోకి తీసుకునే విధంగా వ్యవహరిస్తోంది. వాయిదా తీర్మానం రూపంలో ఈ అంశాన్ని సభలో లేవనె త్తండి. నీళ్లు, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలతోపాటు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లండి. అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేను మూడు వారాల కిందట లేఖ రాసినా ఇంతవరకు స్పందన లేదు. అసలు ఎందుకు అపాయిట్మెంట్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఇట్లయితే కేంద్ర-రాష్ట్రాల మధ్య సఖ్యత ఎలా సాధ్యమో పార్లమెంట్లో ప్రధానిని కలిసి ప్రశ్నించండి. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో కేంద్రానికి 14 ప్రతిపాదనలు సమర్పించాం. వాటిపై ఎలాంటి పురోగతి లేదు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయండి. తెలంగాణలో మారుమూల గ్రామం నుంచి రాజధాని వరకు ఎక్కడెక్కడ ఏయే సమస్యలున్నాయి? వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఆయా గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలేమిటి? అనే అంశంపై పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందిస్తున్నాం. మరో రెండు వారాల్లో దీనికి సంబంధించి బ్లూప్రింట్ సిద్ధమవుతుంది. తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల నేతలకు వాటిని అందజేస్తాం. వారి సలహాలు కూడా స్వీకరించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. రాష్ర్టంలో సామాజిక ఆర్థిక సర్వే కూడా చేపట్టాం. ఇది మరో పక్షం రోజుల్లో పూర్తవుతుంది. సర్వేలో వెల్లడైన అంశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ణయించి ఆ ప్రకారమే వాటిని అమలు చేస్తాం. అలాగే ఒక్కో గ్రామంలోనూ 30 వేల మొక్కలు నాటడంతోపాటు ప్రతి మూడు గ్రామాలకు ఓ నర్సరీని ఏర్పాటు చేస్తాం. అంతిమంగా మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించేలా ప్రణాళికను రూపొందించాం. కాగా, సోమవారం సభ ఆరంభానికి ముందే వాయిదా తీర్మానం నోటీస్ను ఉభయ సభాధిపతులకు అందజేయాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించారు. సమావేశానంతరం కేకే, నర్సయ్యగౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘బంగారు తెలంగాణ’ చేతిలో పెట్టినా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందిస్తామని జితేందర్రెడ్డి పేర్కొన్నారు. ‘పోలవరం పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటున్నారు. తాగునీటి పేరుతో తెలంగాణకు రావాల్సిన నీటిని మళ్లించుకుంటున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ. నిజంగా బీజేపీ నేతలకు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే తెలంగాణ వ్యతిరేక విధానాలను ఆపాలి’ అని వ్యాఖ్యానించారు. అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తాం: రాపోలు పోలవరం ఆర్డినెన్స్, నీళ్లు, ఉద్యోగుల కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీరును ఎండగడతామన్నారు. గవర్నర్కు ప్రత్యేకాధికారాల బదలాయింపుపై చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కేంద్రం రూపొందించిన ఆ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట పంపారని, ఎన్డీయే ప్రభుత్వానికి కనీస అవగాహన లేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. -
తెలంగాణకు చంద్రబాబు అన్యాయం
భువనగిరి :తెలంగాణ ద్రోహి చంద్రబాబు జెండాలను మోస్తున్న వారంతా సోయి తెచ్చుకుని ఆ పార్టీ జెండాను వదిలిరావాలని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి పట్టణంలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టిన ఆర్ఆండ్బీ రోడ్డు విస్తరణ పనులకు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజ ల పట్ల చంద్రబాబు కుట్రలు ఇంకా సాగుతున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్లో కలిపే ఆర్డినెన్స్ తెప్పించారన్నారు. తన హయంలోనే విద్యుత్శాఖలో తెచ్చిన పీపీఏల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తెలంగాణ ప్రజలకు కరెంటు లేకుండా చేయడమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించాలని చూస్తే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యను తీర్చడానికి సీఎం కేసీఆర్ చత్తీస్ఘడ్ నుంచి 3500 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆక్కడినుంచి ఇక్కడికి విద్యుత్ మార్గం ఏర్పాటు చేయడానికి ఏడాది సమ యం పడుతుందని, అంతవరకు కొంత ఇబ్బంది తప్పదన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి బలైన బీబీనగర్ నిమ్స్ను పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రి జగదీష్రెడ్డిని కోరారు. బునాదిగాని, పిలాయి పల్లి, ధర్మారెడ్డి కాల్వలను యద్ధప్రాతి పదికన పూర్తిచేయడానికి అధికా రులతో సమన్వయం సమావేశం నిర్వహించాలని, యాదగిరిగుట్ట దేవస్థానం, భువనగిరి కోట వంటి ప్రదేశాలను అభివృద్ధి చేయాలని కోరారు. సభకు అధ్యక్షతన వహించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ భువనగరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి సహకారం అందించాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్.మధుసూదన్, ఆర్ఆండ్బీ ఎస్ఈ లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు అమరేందర్, నాగారం అంజయ్య, చందుపట్ల వెంకటేశ్వర్రావు, అతికం లక్ష్మినారాయణ, జనగాం పాండు, రాముగౌడ్ బీరుమల్ల య్య, మిర్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇళ్ల కేటాయింపులపై... దద్ధరిల్లిన అసెంబ్లీ
ఫలించని స్పీకర్ రాజీ యత్నాలు బీజేపీకి జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు రేపటికి సభ వాయిదా వారం లోగా చెరుకు రైతులకు బకాయిలు బెంగళూరు : రాష్ట్రంలో వాజ్పేయి గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ తాము చేసిన ఆరోపణలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ స్పందించిన తీరుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు మంగళవారం శాసన సభలో ధర్నాకు దిగారు. దీనిపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాజీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీరో అవర్లో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో మంత్రి పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన అంబరీశ్ ‘ఎనిమిదేళ్ల పాటు కాంగ్రెస్ అజ్ఞాతంలో ఉండిందని, మీరు చేసిన పనే మేమూ చేశాం’ అని చెప్పారు. సీనియారిటీ ఆధారంగా ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులతో పాటు జేడీఎస్ సభ్యులు శెట్టర్కు మద్దతుగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ కేటాయించలేదని ఆరోపించారు. ఇకమీదట ఇలాంటి పక్షపాతం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ దశలో మంత్ర మళ్లీ మాట్లాడుతూ మూడు లక్షల ఇళ్లను కేటాయించాలనేది లక్ష్యమని చెప్పారు. తొలుత అర్జీలు సమర్పించిన వారికి ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. 142 నియోజక వర్గాలకు ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం ఎదుట ధర్నాకు దిగారు. ఈ దశలో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేసి, పాలక, ప్రతిపక్షాల మధ్య తన ఛాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడా ప్రతిష్టంభన తొలగిపోలేదు. అన్ని నియోజక వర్గాలకు సమానంగా ఇళ్లను కేటాయిస్తామంటూ సభలో హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రతిపక్షాలు తిరస్కరించాయి. నిర్దిష్టంగా ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం సమ్మతించక పోవడంతో సభ తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్షాలు ధర్నాను కొనసాగించాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. వారంలోగా చెరకు రైతులకు బకాయిలు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ధర్నాను కొనసాగించాయి. రాష్ర్టంలోని చెరకు రైతులకు రావాల్సిన బకాయిలను చక్కెర కర్మాగారాలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ సోమవారం సాయంత్రం విపక్షాలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేస్తూ వారంలోగా రైతులకు బకాయిల చెల్లింపులు ప్రారంభమవుతాయని తెలపడంతో విపక్షాల సభ్యులు ధర్నాను విరమించారు. -
ఆ సీరియల్కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో! స్టార్ ప్లస్లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్కి పెద్ద ప్లస్! రవీందర్ కిచెన్లో మన వంటలు! వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్. రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది! పేదపిల్ల ప్రేమ పోరాటం! ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది? హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి! -
ఆ సీరియల్కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో! స్టార్ ప్లస్లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్కి పెద్ద ప్లస్! రవీందర్ కిచెన్లో మన వంటలు! వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్. రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది! పేదపిల్ల ప్రేమ పోరాటం! ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది? హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి! -
అంతా నిరాశ
ఆశ కార్యకర్తలకు అన్ని విధాలా అన్యాయం అతి తక్కువ వేతనాలతో బతుకు కష్టాల మయం నెలల తరబడి బకాయిలతో సతమతం అనారోగ్యం తీవ్రతరమై అవస్థలు పడుతున్న వేళ.. వారు కారు చీకట్లో కాంతి రేఖలా ఆదుకుంటారు. వేదన తగ్గించడానికి చేతనైన రీతిలో సాయపడతారు. విభిన్న బాధ్యతలను సహనంతో నిర్వహి స్తూ మన్యంలో రోగులకు భరోసా ఇస్తారు. నిరాశామయ వాతావరణంలో పని చేస్తున్న అశ కార్యకర్తలు కష్టాలను భరిస్తూనే సేవాభావానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించకపోగా, ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని సైతం నెలల తరబడి ఎగవేస్తూ ఉండడంతో ఉసూరని కాలం గడుపుతున్నారు. పాడేరు, న్యూస్లైన్ : వైద్యం అరుదైన చోట వారు ఆశా కిరణాలుగా నిలుస్తున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్య సేవలు చేస్తూ బాధితులకు స్వాంతన కలిగిస్తున్నారు. సాటి గిరిజనులకు నిత్యం ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ గిరిజన గూడేల్లో గుండె దిటవు కల్పిస్తున్నారు. వివిధ రీతుల్లో అండగా నిలుస్తున్న ఆశ కార్యకర్తలు మాత్రం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్నా కనీస వేతనాలు కూడా అందక అలమటిస్తున్నారు. ఆ గౌరవ వేతనం సైతం నెలనెలా అందని దుస్థితిలో దుర్భర జీవనం గడుపుతున్నారు. రోజు కూలీ కూడా కిట్టుబాటు కాకపోయినా గ్రామం దాటకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో 3200 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. అలాగే సబ్ప్లాన్ మండలాలైన గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లిలలోని గిరిజన గ్రామాల్లో 2595 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరికి ఐటీడీఏ నెలకు రూ. 400, ప్రోత్సాహకంగా వైద్య ఆరోగ్యశాఖ రూ. 400 అందజేస్తున్నాయి. నెలకు రూ. 800 గౌరవ వేతనంతోనే వీరు పని చేస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.1500కు పెంచుతామని గతంలో అధికారులు ప్రకటించినా ఇప్పటికీ అది ఆచరణ సాధ్యం కాలేదు. తక్కువ వేతనాలే సమస్య అనుకుంటే.. అవి కూడా సకాలంలో రాక ఆశ కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాడేరు ఐటీడీఏ గత ఏడాది జూలై నెల నుంచి గౌరవ వేతనాలను పంపిణీ చేయలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే వేతనాలు కూడా నాలుగు నెలలుగా చెల్లించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలని ఎన్ని సార్లు ఆందోళన చేపట్టినా ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు లేక సంక్రాంతికి కూడా సతమతమయ్యామని బాధ పడుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆశ కార్యకర్తలకు న్యాయం చేయాల్సి ఉంది. -
మేమున్నాం
కర్నూలు, న్యూస్లైన్: జిల్లాలో శాంతిభద్రతలను గాడిలో పెడుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లాకు చెందిన మంత్రి పట్టుబట్టి ముఖ్యమంత్రి వద్ద పంచాయితీ పెట్టి బదిలీ చేయించడం వివాదాస్పదమవుతోంది. రెండో రోజు మంగళవారం కూడా ఆయన పక్షాన వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతలు చేపట్టి నాలుగు మాసాలు గడవక మునుపే హైదరాబాద్ సౌత్ జోన్(దక్షిణ మండలం) డీసీపీగా రఘురామిరెడ్డిని బదిలీ చేయడం తెలిసిందే. అయితే ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్ల లోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో ఆయన క్యాట్ను ఆశ్రయించారు. సరైన కారణం లేకుండా తనను బదిలీ చేశారంటూ ఎస్పీ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్పీ బదిలీ అంశం ఓ కొలిక్కి రానుంది. ఇదిలాఉండగా జిల్లాలో నేర ఘటనల తీరుతెన్నులను అతి తక్కువ సమయంలో అధ్యయనం చేసి అక్రమార్కులకు ఎస్పీ రఘురామిరెడ్డి అడ్డుకట్ట వేయగలిగారు. ఆయన బదిలీని నిలుపుదల చేయకపోతే జిల్లాలో మట్కా, పేకాట, చీకటి వ్యాపారాలు, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు పేట్రేగి ప్రజా జీవనానికి ఆటంకమవుతాయని సాధారణ జనం మొదలుకొని ఇంజినీర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, మహిళలు, విద్యా సంస్థల అధినేతలు డీజీపికి రాష్ట్ర గవర్నర్కు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేశారు. పోలీసు యంత్రాంగంపై రాాజకీయ నాయకుల పెత్తనం లేకుండా నిబంధనలు విధిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, రాజకీయ దురుద్దేశంతో చేసిన రఘురామిరెడ్డి బదిలీని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీజేవైఎం నగర అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, రాష్ట్ర పోలీస్ బాస్కు వీటిని పంపారు. ప్రజా చైతన్యయువజన సంఘం ఆధ్వర్యంలో కల్లూరు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, యువజనులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఎస్పీ బదిలీని ముక్తకంఠంతో ఖండించారు. నిజాయితీకి బహుమానం బదిలీనా అంటూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ సుదర్శన్రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణలకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ, ఎమ్మార్పీఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు వేర్వేరుగా ఎస్పీ బదిలీకి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మంత్రి టీజీ స్వార్థ ప్రయోజనాలకు ఎస్పీని బలి చేయడం దుర్మార్గమైన చర్యగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి రాంభూపాల్ చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మట్కా మాఫియాపై ఎస్పీ ఉక్కుపాదం మోపడాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ నాయకులు ఆయనను బదిలీ చేయించారని ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ, ఆవాజ్ కమిటీలు పేర్కొన్నాయి. నిజాయితీ గల అధికారిని రాజకీయాలకు బలి చేయడం తగదంటూ ఆలూరులో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఎస్పీ బదిలీ నిలుపుదల కోరుతూ లోక్సత్తా ఆదోని డివిజన్ కార్యదర్శి సుబ్రమణ్యం శర్మ రాష్ట్ర డీజీపీకి పంపిన ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలో భాగమే ఎస్పీ బదిలీ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ పేర్కొన్నారు.