Inner Ring Road
-
మూడు నెలల్లో బాబు అవినీతి కేసులు ముగించేలా కుట్రలు
-
‘రింగ్’లో మింగారు!
సాక్షి, అమరావతి: రాజధాని.. ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ పెద్దలు చెలరేగిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేసి తమ భూముల విలువ భారీగా పెంచుకున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు, వైస్ చైర్మన్గా ఉన్న పొంగూరు నారాయణ బరితెగించి వ్యవహరించారు.లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. సీఐడీ దర్యాప్తులో ఈ కుంభకోణం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు కానుక..లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా కరకట్ట మీద ఉన్న తన అక్రమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ ఇంటిని ఉచితంగా ఇచ్చినట్లు ఆయన చెబుతుండగా నాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు.తమ భూముల విలువ పెరిగేలా..ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించగా మార్కెట్ ధర రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. తద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ అమరావతి పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ రూ.24 కోట్లకు చేరుతుంది. సీఆర్డీఏ తొలి అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్పించారు. పవన్ కళ్యాణ్కు 2.40 ఎకరాలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిలో వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలో ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్కు ఇవ్వడం గమనార్హం. ఏ1 చంద్రబాబు.. ఏ2 నారాయణ.. ఏ14 లోకేశ్ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీదిఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు తొలుత 94 కి.మీ. పొడవుతో ఓ అలైన్మెంట్ను రూపొందించారు. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని గుర్తించిన టీడీపీ పెద్దలు అలైన్మెంట్ను మార్చేశారు. 3 కి.మీ. దక్షిణం వైపు జరిపేసి తాడికొండ, కంతేరు, కాజాలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని వెళ్లేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్ను ఆమోదించుకున్నారు.ఐఆర్ఆర్ కేసులో నిందితులుఏ–1: చంద్రబాబుఏ–2: నారాయణఏ–3: లింగమనేని రమేశ్ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్)ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ఏ–14: నారా లోకేశ్ -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్
సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీఐడీ ఖండించింది. ఛార్జ్షీట్కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సిద్ధమవుతుంది. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేశ్ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్షీట్లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: 'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ -
దొరికారు దొంగలు..ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ ఛార్జ్ షీట్
-
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. -
విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరండి: సుప్రీంకోర్టు
ఢిల్లీ: ఐఆర్ఆర్(ఇన్నర్ రింగ్ రోడ్) భూకుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై నేడు(సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై.. జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దశలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కాగా, ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్లో ముఖ్యమైన అంశాలు జి టు జి పేరుతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అక్రమంగా మార్పులు చేశారు తమ భూములకు అనుకూలంగా రోడ్డు మార్పులు చేశారు దీనికి ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారు ఈ కుంభకోణానికి ముఖ్య సూత్రధారి చంద్రబాబు, నాటి మున్సిపల్ మంత్రి నారాయణ తమకు ముడుపులు ఇచ్చిన వారిని దుబాయ్, అమెరికాకు పారిపోయేలా సహకరించారు. ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నారు. నోటీసులు అందుకున్న నిందితులు ఇప్పటికే కొంతమంది పరారయ్యారు. -
అడ్డంగా దొరికిన ‘రింగ్’ మాస్టర్
సాక్షి, అమరావతి: కట్టని రాజధాని.. నిర్మించని ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు చెలరేగిపోయారు. రాజధాని అమరావతి ముసుగులో యథేచ్ఛగా భూ దందా సాగించారు. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తనకే సాధ్యమని నిరూపించారు. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు కూడా వాటా ఇవ్వడం కొసమెరుపు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా వెలికి తీసి కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్లో పొందు పరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు భూములు ► ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. పవన్ కల్యాణ్కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ► దీంతో ఈ అలైన్మెంట్పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఐఆర్ఆర్ కేసులో నిందితులు ఏ–1: చంద్రబాబు ఏ–2: నారాయణ ఏ–3: లింగమనేని రమేశ్ ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్) ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ ఏ–14: లోకేశ్ బాబు, నారాయణ ఆస్తుల అటాచ్మెంట్ క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు
సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైనదని తేల్చి చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే.. నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు, అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే, అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయ సూత్రం. ముందస్తు బెయిల్ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. 65 ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వరకట్న వేధింపుల కేసులో.. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్తోపాటు అతని తండ్రి రామయ్య (65), మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్కు కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా.. బెయిల్పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్, అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ చంద్రశేఖర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ బెయిల్ రద్దు చేయాలంటూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్ బెయిల్ను రద్దు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అంతకు ముందే నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్ పోలీసులు చంద్రశేఖర్, రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్ సతీమణి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రశేఖర్, అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే.. కింది కోర్టు చంద్రశేఖర్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకోగా.. అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత చంద్రశేఖర్ భార్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ప్రధాన నిందితునిగా ఉన్న చంద్రశేఖర్కు కింది కోర్టు ఇప్పటికే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిందని, అందువల్ల అతని తండ్రి రామయ్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాక.. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో వరకట్న వేధింపు కేసులో రామయ్య జైలులో ఉన్నారని, అందువల్ల ఆయన నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ల సమర్పణకు అతన్ని బాధ్యుడిగా చేయడం తగదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అటు పోలీసులు, ఇటు చంద్రశేఖర్ భార్య కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పిటిషనర్ రామయ్య వాదనను తోసిపుచ్చారు. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ.. ముందస్తు బెయిల్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలో న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. -
లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను లోకేశ్ ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేసింది. రెడ్బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరిస్తూ.. భయపెట్టేందుకు ప్రయత్నించారని వివరించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేశ్ ఆరోపణలు చేశారని పేర్కొంది. సీఐడీ స్పెషల్ పీపీ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్దేశపూర్వకంగానే బెదిరించారు.. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ 14వ నిందితునిగా ఉన్నారు. విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని లోకేశ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద గతంలో నోటీసు ఇచ్చాం. అందులో పలు షరతులు విధించాం. ఈ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాం. ఆ తర్వాత ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అతన్ని 2 రోజుల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఈనెల 19న ఏబీఎన్, ఈటీవీ తదితర చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను, అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరించారు. సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు. కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా చేశారు. 53 రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్కు పంపడమన్నది రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవస్థలను మేనేజ్ చేయడం’ ద్వారానే జరిగిందని లోకేశ్ అన్నారు. నిందితులను రిమాండ్కు పంపడం న్యాయ ప్రక్రియలో భాగం. కానీ న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని లోకేశ్ మాట్లాడారు. ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఓ రెడ్ బుక్ను సిద్ధం చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమంటూ లోకేశ్ బెదిరించారు. చంద్రబాబు, లోకేశ్లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇంటర్వ్యూలను, అందుకు సంబంధించిన వివరాలను సీడీలో కోర్టు ముందుంచాం. వాటిని పరిగణనలోకి తీసుకుని లోకేశ్ అరెస్ట్కు ఆదేశాలివ్వండి’ అని దుష్యంత్రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. నేరుగా అరెస్టు చేయవచ్చు కదా? ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ.. 41ఏ కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తే, మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేశ్ ఇంటర్వ్యూలను చూసి, ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేశ్కు నోటీసులు జారీ చేసి.. వారి వివరణ కూడా తెలుసుకుంటామన్నారు. అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబూ ఉల్లంఘించారు.. పోలీసులను, సాక్షులను పలు ఇంటర్వ్యూల్లో లోకేశ్ బెదిరించిన విషయాన్ని సీఐడీ హైకోర్టు దృష్టికి కూడా తెచ్చింది. ఆయన ఇంటర్వ్యూలను పెన్ డ్రైవ్లో ఉంచి వాటిని ఓ మెమో రూపంలో సీఐడీ స్పెషల్ పీపీ దుష్యంత్ శుక్రవారం హైకోర్టు జడ్జి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు ముందుంచారు. చంద్రబాబు, లోకేశ్లు ఎంతో పరపతి కలిగిన వ్యక్తులని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులను విధించిందని గుర్తు చేశారు. కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందన్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు వెలువరించే ముందు చంద్రబాబు, లోకేశ్లు మాట్లాడిన మాటలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని దుష్యంత్ కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. ఈ దశలో ఈ కేసుతో సంబంధం లేని వివరాలతో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ మెమోపై అభ్యంతరాలుంటే వాటిని తమ ముందుంచాలని ప్రణతిని ఆదేశించారు. వాటిని పరిశీలించాక చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేశారు. -
Dec 15th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 7:00 PM, Dec 15, 2023 ఏమైనా చేయండి.. యువగళం ముగింపు సక్సెస్ చేయండి టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు విజయోత్సవ సభకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న చంద్రబాబు సభ సక్సెస్ కాకపోతే లోకేష్ ఊరుకోడని చెబుతోన్న చంద్రబాబు ఎంత ఖర్చయినా సరే.. నాది బాధ్యత, జనాలను తీసుకురావాలని పిలుపు ఇప్పటికే రంగంలోకి దిగిన లోకేష్ కోటరీ ప్రతీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టార్గెట్లు జనం తగ్గితే ఎమ్మెల్యే టికెట్లు కష్టమని హెచ్చరిస్తోన్న లోకేష్ కోటరీ లోకేష్ సభ సక్సెసయితేనే పార్టీకి మనుగడ ఉంటుందని హెచ్చరికలు 6:55 PM, Dec 15, 2023 మరి.. మీరెందుకు కుప్పం వచ్చారు బాబు.? : పేర్ని నాని రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ ఫర్ అయ్యారు మేం వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారు వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టవు జగన్ ను ఓడించాలి, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజుకు ఇచ్చారు : పేర్ని నాని 5:05 PM, Dec 15, 2023 జనసేనకు రాంరాం.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ : బీజేపీ పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు మా టార్గెట్ లోకసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపు డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు : స్పష్టం చేసిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమాన పోరాటాలుంటాయి లోకసభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్దం కావాలి సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయి కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది 5:02 PM, Dec 15, 2023 చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కోవర్ట్ : RGV జనసేన స్థాపనకు కారణమే చంద్రబాబు : రాంగోపాల్ వర్మ మరోమాటలో జనసేనలో పవన్, చంద్రబాబుకు కోవర్టు వారిద్దరి మధ్య పొత్తు అనే దానికి అర్థమే లేదు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగోలేదు తెలంగాణాలో కేసీఆర్ కు ఉన్నంత బలమైన అపొజిషన్ ఏపీలో లేదు రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ అపొజిషన్ గా వచ్చి సీఎం అయ్యారు : ఆర్జీవీ 4:23 PM, Dec 15, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా ACB కోర్టులో IRR అలైన్మెంట్ కేసు విచారణ వాయిదా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పైనా విచారణ వాయిదా తదుపరి విచారణలు జనవరి 30కి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరిగిందంటే? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ఏం జరిగిందంటే? ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 3:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు : సజ్జల ఆస్తుల కోసమే చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నాడు మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చంద్రబాబుకు ఎందుకు..? చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు వెళ్లాడు..? మంగళగిరికి లోకేష్కు సంబంధం ఏంటీ..? ఏపీకి చంద్రబాబు గెస్ట్లా మాత్రమే వస్తాడు 1:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు సచివాలయంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తారో చెబుతారని అనుకున్నాం..! మా ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు? తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా? తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా? ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి? హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు.! చంద్రబాబు కి ప్రజామోదం లేదు .2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టో చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక భోగస్ ఫోరమ్ ను పెట్టారు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా? నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా? సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్ ను దించుతుంది మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం...బలంగా ఉన్నాం ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి 11:31 AM, Dec 15, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 8:13 AM, Dec 15, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 7:23 AM, Dec 15, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 7:10 AM, Dec 15, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:56 AM, Dec 15, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ -
Dec 14th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:54 PM, డిసెంబర్ 14, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:24 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు భ్రమలు ఇంకా తొలగలేదు : మంత్రి కాకాని చంద్రబాబుకీ పూర్తిగా పిచ్చి పట్టిందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.. పోలవరాన్ని తానే డిజైన్ చేసానని చెప్పుకోవడం సిగ్గుచేటు.. పోలవరం ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది వైస్సార్ ఐతే.. దాన్ని పూర్తి చేసేది సీఎం YS జగన్ మిగ్చామ్ తుఫాన్ లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. చంద్రబాబు హయాంలోనే రైతులు నష్టపోయారనే విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.. వ్యవసాయమే దండగ అని మాట్లాడిన చంద్రబాబు.. రైతులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం.. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. రుణమాఫీ చేస్తానని చెప్పి.. రైతులను బాబు మోసం చెయ్యలేదా..? తుఫాన్ సమయంలో కష్టపడి పని చేసిన అధికారులను తక్కువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆత్మ స్తుతి.. పర నిందతో చంద్రబాబు బతుకుతున్నారు.. 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఐతే.. అప్పటి నుంచి ఒక్క సాగునిటీ ప్రాజెక్ట్ ను అయినా చేపట్టారా..?? చంద్రబాబు సిగ్గు లేకుండా.. తుఫాన్, వరదలు విషయంలో మాట్లాడుతున్నారు.. మోసాలు చెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. అయన జైలుకు వెళ్తే జనాలు ఆత్మహత్య లు చేసుకున్నారని చెప్పడం సిగ్గుచేటు.. అలిపిరిలో చంద్రబాబు మీద బాంబ్ దాడి జరిగితే రాష్టంలో ఒక్కరూ కూడా పట్టించుకోలేదు.. రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీని నీ హయాంలో ఎప్పుడైనా ఇచ్చావా..?? 2015 లో జాతీయ రహదారి తెగిపోతే ఐదేళ్లు పట్టించుకోలేదు.. వైసీపీ హయాంలో ఆ హైవే పనులు పూర్తి చేసాం.. NDA లో భాగస్వామిగా ఉన్నప్పుడు.. నిధులు తీసుకురాగలిగావా..? రైతులను, ప్రజలను ఆదుకున్న చరిత్ర చంద్రబాబు కీ లేదు.. పని చేసే వ్యక్తి జగన్.. ఫోటోలకు పోజులు ఇచ్చేది చంద్రబాబు.. ఆస్తి, ప్రాణ నష్టాలు జరక్కుండా జిల్లా యంత్రాంగం తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. ఒక్క రైతు కూడా కనిపించలేదు.. వైసీపీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉన్నట్టుంది 5:42 PM, డిసెంబర్ 14, 2023 మా తలుపులు తెరిచే ఉన్నాయి.. రండి బాబు రండి అభ్యర్థుల కోసం ఆశగా ఎదురుచూస్తోన్న చంద్రబాబు వైసీపీలో మంచివాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచిస్తాం : చంద్రబాబు జనసేనతో పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం అయినా YSRCP నుంచి అసంతృప్తితో ఎవరైనా మంచి అభ్యర్థి వస్తే పార్టీలోకి తీసుకుంటాం ఈసారి త్వరగానే అభ్యర్ధులను ప్రకటిస్తాం : చంద్రబాబు YSRCP నుంచి ఎవరైనా అసమ్మతిదారులు బయటకు వస్తారేమో.. 5:12 PM, డిసెంబర్ 14, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 4:10 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 4:05 PM, డిసెంబర్ 14, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ బాబు ముందస్తు బెయిల్పై వాదనలు సీఐడీ తరపున పూర్తయిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు 4:02 PM, డిసెంబర్ 14, 2023 దొంగ ఓట్లు కేరాఫ్ తెలుగుదేశం ఢిల్లీలో మీడియాతో ఎంపీ విజయసాయిరెడ్డి దొంగ ఓట్లు చేర్పిస్తున్న టీడీపీ నేతలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు టీడీపీ నేతల నిర్వాకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం టీడీపీ నేతల దొంగ ఓట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని కోరాం టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం అమెరికా సర్వర్ లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు తండ్రి పేరు, ఇంటి పేరు మార్చి ఒకే ఓటర్ ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం మా విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించింది : ఎంపీ విజయసాయిరెడ్డి 3:52 PM, డిసెంబర్ 14, 2023 ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ విడుదల చేసే లోకేష్ ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.! హెరిటేజ్ లో రూ.20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... మార్కెట్లో దాని విలువ రూ.70 వేల కోట్లు .! మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్లో ఉన్న ఆస్తుల విలువెంత.? మదీనాగూడలో 14 ఎకరాల ఫాంహౌజ్ విలువెంత? జూబ్లీహిల్స్లో కట్టిన ఇంద్రభవనం విలువెంత? లోకేష్.. ప్లీజ్ తొందరగా ప్రెస్ మీట్ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.? 2:52 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు అంటే నమ్మక ద్రోహం చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్ కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీని నాశనం చేశాడు ఎస్సీ బీసీ ఎస్టీలను మోసం చేసి దగాచేశాడు ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు పోలవరంను నాశనం చేసింది చంద్రబాబే అధికారం కోసం జగనన్న సంక్షేమ పాలనపై యెల్లో మీడియాతో విషపు రాతలు సీఎం జగన్ చేతల మనిషి.. ఆయనపై బాబు కుట్రలు పని చేయవు ఏపీ ప్రజలు చంద్రబాబును గమనిస్తున్నారు చంద్రబాబు పాలనలో సామజిక న్యాయం అందని ద్రాక్ష జగన్ పాలనలో సామాజిక న్యాయం విప్లవాత్మకంగా అమలైంది యువగళంకు ప్రజాబలం లేదు...లోకేష్ కి మెదడు లేదు లోకేష్. మాతో చర్చలకు సిద్దామా? మీ ఆఫీస్కే వస్తాం 2:00 PM, డిసెంబర్ 14, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 1:30 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య.. 17ఏ కాపాడలేదు : న్యాయనిపుణులు రేపో, మాపో 17aపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు తప్పు చేయలేదని ఇప్పటివరకు ఏ కోర్టుముందు కూడా చెప్పని చంద్రబాబు అరెస్ట్కు ముందస్తు అనుమతి లేదని మాత్రం సాంకేతికంగా డొంక తిరుగుడు వాదనలు వినిపిస్తోన్న చంద్రబాబు లాయర్లు చంద్రబాబు పిటిషన్కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి(అక్టోబర్, నవంబర్లలో జరిగిన విచారణ సందర్భంగా) స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే 17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్కమ్ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్కు గురవుతారు రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్ను బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:44 PM, Dec 14, 2023 తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే ►పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే.. ► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి ► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది ► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి ► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95% ► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే ► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1 ► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.! ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా? ► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరి పొలిటికల్ కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్ మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి గాజువాకలో పవన్ కళ్యాణ్ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి 12:15 PM, Dec 14, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 11:15 AM, Dec 14, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 10:12 AM, Dec 14, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 8:19 AM, Dec 14, 2023 ఐఆర్ఆర్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ చంద్రబాబు ముందస్తుబెయిల్ పై విచారించనున్న హైకోర్టు రుషికొండలో నిర్మాణాలపై నేడు ఏపీ హైకోర్టు విచారణ జనసేన నేత మూర్తి పిటిషన్ పై విచారించనున్న హైకోర్టు 7:33 AM, Dec 14, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకి సలహాలు, సూచనలు చెప్పే స్వేచ్ఛ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు లేదు. జనసేన పార్టీలో ఎవ్వరైనా టీడీపీ పార్టీని విమర్శిస్తే వైయస్ఆర్సీపీ పార్టీ కోవర్టులుగా చిత్రీకరిస్తాడు. జనసైనికులు కోవర్టులు కాదు.. చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్టు - ఆకుల… pic.twitter.com/BO1LwpuGIe — YSR Congress Party (@YSRCParty) December 13, 2023 7:28 AM, Dec 14, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:53 AM, Dec 14, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 6:51 AM, Dec 14, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నేటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ నేటికి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు -
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో విచారణ రేపటికి వాయిదా
-
Dec 13th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:24 PM, Dec 13, 2023 చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అంటే ఇష్టం లేదు : మంత్రి అమర్నాథ్ విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదు టీడీపీ, జనసేనలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు పవన్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి 6:04 PM, Dec 13, 2023 దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబే : ధర్మాన శ్రీకాకుళం : చంద్రబాబు ఏ రోజైనా దళితులను పట్టించుకున్నారా? : మంత్రి ధర్మాన అవినీతికి తావులేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కట్టడం కాదు ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదు : మంత్రి ధర్మాన 5:33 PM, Dec 13, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 4:22 PM, Dec 13, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరినీ ఎవరూ నమ్మరు : సజ్జల మీడియాతో YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదు పవన్ ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారు 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు కరోనాలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదు ఎల్లోమీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతన్నారు పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి టీడీపీ అనే శిధిలపార్టీని చంద్రబాబు ఏలుకుంటున్నారు ఎల్లోమీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది వారు పగటికలలు కంటున్నారు అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అసలు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి 3:45 PM, Dec 13, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 3:03 PM, Dec 13, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు 2:44 PM, Dec 13, 2023 ఐఆర్ఆర్ పిటిషన్ రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఇవాళ కూడా జరిగిన విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 1:14 PM, Dec 13, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 12:44 PM, Dec 13, 2023 నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు IRR కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు 12:25 PM, Dec 13, 2023 స్కిల్ స్కాం కేసు CBI అప్పగించాల్సిందే ఏపీ హైకోర్టులో స్కిల్ కేసు వ్యవహారం స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ కొందరు ప్రతివాదులకు నోటీసులు అందలేదని, మరికొందరు నోటీసులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారన్న పిటిషనర్ పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం ఉండవల్లి పిటిషన్ విచారణ 2 వారాలు వాయిదా 12:05 PM, Dec 13, 2023 బాబు కేరాఫ్ తమిళనాడు తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో చంద్రబాబు పర్యటన శ్రీరామానుజార్ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు సమానత్వం కోసం శ్రీ రామానుజులు పాటు పడ్డారు : చంద్రబాబు 11:55 AM, Dec 13, 2023 పార్టీ ఆఫీసుకు దారేది.? మూడు నెలల విరామం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న చంద్రబాబు మ.2 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు సమక్షంలో కుప్పం కార్యకర్తలతో భేటీ సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభపై చంద్రబాబు మంతనాలు ఇప్పటికే యువగళం గురించి పార్టీ సీనియర్ల ఫిర్యాదు కీలకమైన ఉత్తరాంధ్రను విస్మరించామంటోన్న సీనియర్లు 200 కిలోమీటర్ల (భోగాపురం-ఇచ్ఛాపురం) విస్మరించడంపై తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందంటున్న సీనియర్లు లోకేష్ను ఒప్పించలేం.. ఇక్కడితో ముగించాలన్న యోచనలో చంద్రబాబు 11:15 AM, Dec 13, 2023 చంద్రబాబు మిత్రుడికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనపై అవమానకరమైన వార్తలు ప్రచురించినందుకు కేసు కోర్టులో కేసు వేసిన నమస్తే దినపత్రిక ఎడిటర్ ముత్యాల సైదేశ్వరరావు కోర్టుకు హాజరు కాకపోవటంతో ఎండి రాధాకృష్ణ ,మరో నలుగురికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ 10:45 AM, Dec 13, 2023 రాష్ట్రానికి చంద్రబాబు చేసింది సున్నా : ధర్మాన చోడవరంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు మంత్రి టిడిపి హయాంలో వ్యవసాయం మైనస్ గ్రోత్ లోకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం గ్రోత్ పెరిగింది.. టిడిపి హయాంలో GDP 16 వ స్థానంలో ఉంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 4 స్థానంలో ఉంది.. రైతులకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అయిపోతారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎప్పుడూ కట్టుబడి ఉండరు.. 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల పేదల ఖాతాల్లో సీఎం జగన్ వేశారు.. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నారు.. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు.. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు.. ప్రైవేట్ స్కూల్స్ కంటే అద్భుతంగా ప్రభుత్వం స్కూల్స్ ను తయారు చేశారు.. ఓట్లు కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తేలేదు.. పిల్లల భవిష్యత్ కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తెచ్చారు.. రానున్న రోజుల్లో విద్య వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది.. పసుపు కుంకుమ పేరుతో మహిళను చంద్రబాబు మోసం చేశారు.. రైతు రుణ మాఫీ చేస్తామని మోసం చేశారు.. అర్హత ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వస్త్తే జన్మ భూమి బ్రోకర్లను తెస్తారు.. 10:05 AM, Dec 13, 2023 జనసేను టిడిపికి అద్దెకిచ్చారు : నందిగం సురేష్ చోడవరం : నందిగామ సురేష్ కామెంట్స్ చంద్రబాబు బడుగు,బలహీన వర్గాలను అవమానించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. ఆకలి తీర్చే నాయకుడు కావాలో.. మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది? రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువలనే టిడీపిని ప్రజలు పక్కన పెట్టారు. టిడిపికి- జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అవసరం అయినపప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో డిపాజిట్లు రాలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. జగన్ మోహన్ రెడ్డిపై సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను కాల్చి చంపినది చంద్రబాబు కాదా! 7:50 AM, Dec 13, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:50 AM, Dec 13, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (నిన్న), డిసెంబర్ 13(నేడు) విచారణ. చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ ఈరోజుకి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 6:30 AM, Dec 13, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు. -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు ఊహించని షాక్
-
500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
-
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
-
చంద్రబాబుపై తొందరపాటు చర్యలుండవు
సాక్షి, అమరావతి: అస్మదీయుల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ ఇచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులోనూ ఇలాంటి హామీనే ఇచ్చానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు సైతం అదే హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటిశస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముందుకెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ రకంగానూ ముందుకెళ్లొద్దంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ గతంలో తానిచ్చిన ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక కుంభకోణం.. ముందస్తు బెయిల్పై నేడు విచారణ ఉచిత ఇసుక విధానం పేరుతో ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించినందుకు సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరపనున్నారు. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసుల మీద కేసులు పెడుతోందన్నారు. వేధింపులకు గురి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏ అంశంపై ప్రశ్నిస్తే ఆ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పకుండా చేసేందుకే ప్రభుత్వం తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
Nov 6th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Naidu Cases Updates 05:17 PM, Nov 6, 2023 తెలంగాణలో టీడీపీ.. మరొకరు అవుట్ ►తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా ►గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని కోల్పోయిన మాకు కనీసం ఎవరు వస్తున్నారన్న సమాచారం కూడా తెలవడం లేదు ►హైదరాబాదుకు లోకేష్ బాబు అయినా గాని బాలకృష్ణ గాని ఎవరు వచ్చినా కనీసం సమాచారం తెలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసుకున్న బిల్డర్ ప్రవీణ్ ►తన రాజీనామాని ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు నాయుడుకు పంపుతున్నట్టు తెలిపిన బిల్డర్ ప్రవీణ్ 04:20 PM, Nov 6, 2023 బాలకృష్ణకు అర్థం కావడానికి ఆలస్యమవుతోందా? ► కుటుంబసభ్యులపైనే చాణక్య నీతిని ప్రదర్శిస్తోన్న చంద్రబాబు ► అరెస్టయినపుడు రెండు రోజులు బాలకృష్ణ హడావిడి చూసి అర్జంటుగా ప్లాన్ మార్చిన బాబు ► ఇప్పటికిప్పుడు తెలంగాణకు వెళ్లి పార్టీని గెలిపించాలని బాలకృష్ణకు అసైన్మెంట్ ► బావ ఆదేశాలు అర్థం కాక.. తలపట్టుకుని హైదరాబాద్ వచ్చిన బాలకృష్ణ ► ఆ వెంటనే భీకర ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని ప్రకటించిన బాలకృష్ణ ► నెల గడవకముందే బాలకృష్ణ స్టేట్మెంట్ను చెత్తబుట్టలో వేసేసిన బాబు ► అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీనే చేయబోవడం లేదని పార్టీ ప్రకటన ► బాబుకు ముందే ఇవన్నీ తెలిసి మరీ బాలకృష్ణను తెలంగాణకు పంపారని పార్టీలో చర్చ ► లోకేష్కు ఎలాంటి కష్టం రాకుండా అన్ని అడ్డంకులు తొలగించే పనుల్లో చంద్రబాబు 04:05 PM, Nov 6, 2023 అచ్చెన్నకు వెన్నుపోటేనా? ► తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై అనుమానపు చూపులు ► అచ్చెన్నను తప్పిస్తారని పార్టీలో విస్తృత ప్రచారం ► ఇప్పటికే పార్టీ లేదు.. xx లేదు అంటూ ప్రకటనలు చేసి కెమెరాలకు చిక్కిన అచ్చెన్న ► పైకి చేస్తున్న ప్రకటనలు వేరు, అంకిత భావం వేరంటున్న చంద్రబాబు కోటరీ ► అర్జంటుగా అచ్చెన్నను పక్కనబెట్టి లోకేష్కు ఆ బాధ్యతలు ఇవ్వాలంటున్న కోటరీ ► లోకేష్ అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి బెటర్ అంటోన్న కోటరీ ► ఎలాగూ తెలంగాణలో పోటీ చేయడం లేదు, పార్టీకి తెలంగాణలో చోటు కూడా లేదు ► జాతీయ హోదా ఉండదు కాబట్టి, ఏపీలోనే మార్పులు చేసుకోవాలంటున్న బాబు వర్గీయులు 03:45 PM, Nov 6, 2023 మ్యానిఫెస్టోపై టిడిపి, జనసేన మల్లగుల్లాలు ► మ్యానిఫెస్టోపై మొన్న పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు ► ఏం చేద్దాం? మన దగ్గర ఉన్న వాగ్దానాలేంటీ? ► ఇన్నాళ్లు సర్కారు చేస్తోన్న సంక్షేమాన్ని తప్పుబట్టాం కదా? ఇప్పుడేం చెబుదాం? ► సంక్షేమం వల్ల శ్రీలంక అయిపోతుందన్నాం కదా.. ఇప్పుడు మనం మాటెలా మార్చుదాం? ► ఇప్పటికే మాట నిలబెట్టుకోలేమన్న పేరుంది, అదెలా పోగోడదాం? ► ఏమని చెబితే జనం నమ్ముతారు? ఎలా చెప్పి వారిని నమ్మించాలి? ► ఇప్పుడు అమలవుతున్న పథకాలను ఎలా తప్పుబడదాం? ► అసలు మ్యానిఫెస్టో ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి? ► అనవసరంగా మ్యానిఫెస్టో ప్రస్తావన తెచ్చి ఇబ్బంది పడుతున్నామా? ► కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న పథకాలు మన దగ్గర పని చేస్తాయా? ► తెలంగాణలో జనం కాంగ్రెస్ పథకాల మీద ఆసక్తి చూపిస్తున్నారా? 03:30 PM, Nov 6, 2023 లూథ్రా గారు మీరే చెప్పండి? ► సమన్వయ సమావేశాలకు హాజరయితే కోర్టు షరతులను ఉల్లంఘించినట్టవుతుందా? ► కోర్టు షరతులను ఎలా ఉల్లంఘించాలి? సాంకేతికంగా ఎంతవరకు ముందుకెళ్లొచ్చు ► సమన్వయ కమిటీ సమావేశాలకు నేరుగా వెళ్తే కోర్టు తప్పుపడుతుందా? ► ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ మోడ్లో హాజరు కావొచ్చా? ► రాజకీయ చర్చలు జరిపితే ఆంక్షలు ఉల్లంఘించినట్టా? ► సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాతో చంద్రబాబు సుదీర్ఘ చర్చలు (ఫైల్ ఫోటో : లూథ్రాతో చంద్రబాబు, లోకేష్) 03:20 PM, Nov 6, 2023 సమన్వయానికి హాజరు కావొచ్చా? లేదా? ► మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు తహతహ ► సమన్వయ కమిటీ సమావేశాలకు అర్జంటుగా వెళ్లాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు ► తాను వెళ్లకపోతే.. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో చంద్రబాబు ► తెలుగుదేశం పార్టీ తరపున లోకేష్ మాట అంతగా వెళ్లట్లేదన్న భావనలో పార్టీ సీనియర్లు ► ఇలాగే ఉంటే.. జనసేనకు 50 సీట్లు ఇవ్వాల్సి వస్తోందన్న ఆందోళనలో చంద్రబాబు ► తాను వెళితేనే పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ► జనసేనను ఎంత వరకు పరిమితం చేయాలి? తమకు అవకాశం లేని సీట్లను ఎలా అప్పగించాలి? ► జనసేన తరపున కూడా టిడిపి లీడర్లనే ఎలా పోటికి దింపాలి? ► తమ వాదనకు అనుకూలంగా ఎలాంటి సర్వేలను తెర మీదికి తీసుకురావాలి? ► 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవాన్ని రాజకీయం కోసం ఎలా వాడాలి? 03:15 PM, Nov 6, 2023 మళ్లీ సమన్వయ సమావేశం ► టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశానికి వేదిక ఖరారు ► ఈ నెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమన్వయ కమిటీ రెండో భేటీ ► ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై చర్చ 03:05 PM, Nov 6, 2023 కోవర్టు కాదు : పురందేశ్వరీ ► నేను చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి కోవర్టును కాను ► విధానపరమైన లోపాలను ఎత్తి చూపితే టీడీపీ కోవర్టు అంటారా? ► ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి : పురందేశ్వరీ 02:45 PM, Nov 6, 2023పవన్ ఎప్పటికీ CM కాలేరు : నారాయణ స్వామి ► పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ ► పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేరు ► టీడీపీ, జనసేన కు డిపాజిట్ రాదు ► పవన్ కళ్యాణ్ కులాలను రెచ్చగొడుతున్నారు ► బాబు అవినీతి పురంధేశ్వరి కి కనిపించదా ? : డిప్యూటీ సీఎం నారాయణస్వామి 02:30 PM, Nov 6, 2023 ఇంటికి బాబు, రేపు ఆపరేషన్ ► AIG ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చంద్రబాబు ► వైద్య పరీక్షలు చేయించుకుని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు ► రేపు LV ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ 02:00 PM, Nov 6, 2023 అటాచ్మెంట్ కోసం పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కోసం CID పిటిషన్ ► ACB కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ► చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోరుతూ ACB కోర్టులో ఏపీ CID పిటిషన్ ► చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ ప్రతిపాదన ► CID ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు ► ACB కోర్టు అనుమతిస్తే అటాచ్ మెంట్ ప్రక్రియ మొదలుపెట్టనున్న CID 01:30 PM, Nov 6, 2023 పార్టీ సీనియర్ల తీరుపై చంద్రబాబు గుర్రు ► జైల్లో 52 రోజులుంటే పార్టీని ఎవరూ పట్టించుకోలేదని బాబు ఆవేదన ► దిక్కు, దివానం లేకుండా పార్టీని వదిలేశారని ఆవేదన ► కలవడానికి వచ్చిన సీనియర్లపై తీవ్ర ఆగ్రహం ► తాను జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందన్న సీను ఎలా వచ్చిందని ప్రశ్నలు ► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ నామమాత్రం ఆందోళనలతో సరిపెట్టారని ఆగ్రహం ► విడుదలైన తర్వాత అప్పటికప్పుడు జనసమీకరణ చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన 12:30 PM, Nov 6, 2023 ఎవరి పథకం? తెలుగుదేశం ఒక్కరిదేనా? జనసేనకు కూడా పొత్తుందా? ► హఠాత్తుగా 3 సిలిండర్ల పథకం ప్రకటించిన తెలుగుదేశం ► మాటమాత్రంగా చెప్పకుండా ప్రకటించారంటున్న జనసేన నేతలు ► మూడు సిలిండర్లు ఇస్తామన్న వాగ్దానాన్ని జనమెలా నమ్ముతారంటున్న జనసేన ► పైగా అందులో అంతగా ఆకట్టుకునే అంశమేముందని ప్రశ్న ► జైలు ముందు పొత్తు ప్రకటించిన పవన్ను కనీసం బ్యానర్లలోనైనా పెట్టుకోరా అంటోన్న జనసేన నేతలు 12:00 PM, Nov 6, 2023 పురంధేశ్వరికి స్ట్రాంగ్ కౌంటర్ ►పురంధేశ్వరి.. మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. ►రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ►బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు. ►దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే.. ►మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ►పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కాలమే సమాధానం చెబుతుంది. 1/2: చూడు చిన్నమ్మా...పున్నమ్మా...పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి...అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 11: 47AM, Nov 6, 2023 ►ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ పై నేడు సీఐడీ పిటిషన్ ►ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న ఏపీ సీఐడీ ►చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్కు సీఐడీ ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు 11:45AM, Nov 6, 2023 ►గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు, మళ్లీ వైద్య పరీక్షలు ►రెండు రోజుల కింద సమగ్ర వైద్య పరీక్షలు, ఆ పరీక్షలకు కొనసాగింపుగా ఇవ్వాళ మరోసారి పరీక్షలు 11:40AM, Nov 6, 2023 ►ఈ నెల 9న జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ►ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయం ►ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మేనిఫెస్టో క్షేత్రస్థాయి నుంచి సమన్వయం వంటి మూడు అంశాలపై ప్రధానంగా చర్చ ► చంద్రబాబుపై వరుస కేసులు వంటి అంశాలపై భేటీలో చర్చ 11:30AM, Nov 6, 2023 ►టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీకానున్న టీడీపీ-జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ ►రెండు పార్టీల నుంచి హాజరుకానున్న ఆరుగురు సభ్యులు 10:50 AM, Nov 6, 2023 చంద్రబాబు, పవన్లపై మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజం ►పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు తోడు దొంగలు ►2014లో పవన్ మద్దతు ఇచ్చి చంద్రబాబు ని నెగ్గింఛానని చెప్పాడు. తరువాత టీడీపీ నాయకులు అతని వల్ల మేము గెలవడం ఏంటని నానా మాటలు అన్న సంగతి మరచిపోయావ్. ►ఏ మొహం పెట్టుకొని ఉమ్మడి మ్యానిఫెస్టో పెడుతున్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ►చంద్రబాబుని దొంగగా కోర్టు నిర్దారిస్తే జైలుకు వెళ్లి పవన్ కాళ్ళు పట్టుకున్నాడని సామాజిక వర్గం మొత్తం సిగ్గు పడ్డ పరిస్థితి. ►పవన్ ని నమ్మి ప్రజలు ఎలా ఓటు వెయ్యాలి? ►చంద్రబాబు ఇంతవరకు ఎవరినైనా వాడుకుని వదిలేయకుండా ఉన్నాడా? అందరిని వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు. ►మోసానికి, ద్రోహానికి పేటెంట్ తీసుకున్న చంద్రబాబుతో పవన్ ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేస్తున్నాడు అనడం ఎంత దారుణం. ►చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని విజయోత్సవం చేస్తున్నామనడం వారి అవివేకానికి నిదర్శనం. ►పవన్, చంద్రబాబు ఇద్దరికీ నీతి, నియమాలు లేవు. 9:40 AM, Nov 6, 2023 ఎన్టీఆర్కు వెన్నుపోటు కుట్రలో పురంధేశ్వరిదే కీలక పాత్ర: విజయసాయి ►ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ►ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే.. ►ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురంధేశ్వరిది. ►సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. ►"అన్న టీడీపీ" అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు. ►ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు పురంధేశ్వరి 1/3 :ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 8:30 AM, Nov 6, 2023 పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి కౌంటర్ ►నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. ►తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. ►కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారిన పురంధేశ్వరి. ►పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తున్న పురంధేశ్వరి ►ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 6:55 AM, Nov 6, 2023 చంద్రబాబు కన్నింగ్ ప్లాన్స్.. ►రాజమండ్రి జైలులో అనారోగ్యం అంటూ డ్రామాలు ►మధ్యంతర బెయిల్ వచ్చాక వైద్యం తప్ప అన్ని పనుల్లో బిజీ ►ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న బాబు చూసే చెప్పరేమో! ‘‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ ఈ సామెత బహుశా చంద్రబాబు లాంటి వ్యక్తిని చూశాకే పుట్టిందేమో. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు డ్రామాలాడిన @ncbn.. మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత వైద్యం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాల్ని… pic.twitter.com/uFDMirCdc1 — YSR Congress Party (@YSRCParty) November 5, 2023 6:50 AM, Nov 6, 2023 అనారోగ్యమంటూ ఎల్లో బ్యాచ్ కలరింగ్.. మరి ఇదేంటీ? ►వైద్యం కోసం మధ్యంతర బెయిల్ ►రాజకీయం చక్కదిద్దే పనిలో బాబు ఫుల్ బిజీ ►అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏకం 14 గంటలు కారులో జర్నీ ►పవన్తో గంటల పాటు భేటీ.. ►హెల్త్ బాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేయగలడు? ►జైలు నుంచి బయటకు రావాలన్న డ్రామాలే తప్ప.. అనారోగ్యం కాదు! వైద్యం కోసం మధ్యంతర బెయిల్ను తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు.. రాజకీయ కార్యకలాపాల్ని చక్కబెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. జైల్లో తీవ్ర అనారోగ్యంతో @ncbn బాధపడుతున్నట్లు @JaiTDP అండ్ కో కలరింగ్ ఇచ్చింది. కానీ.. రాజమండ్రి టు కరకట్టకి 14 గంటలు కారులో… pic.twitter.com/YX8tlcqaXN — YSR Congress Party (@YSRCParty) November 5, 2023 6:50 AM, Nov 6, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP -
నారా లోకేష్ తల్లిని కూడా రింగ్ రోడ్ కేసులో ఇరికిస్తున్నాడు...
-
మాస్టర్ప్లాన్.. అమలు చేస్తేనే మేలు
హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం వరంగల్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధి కోసం రచించిన ప్రణాళికలు అంతే వేగంగా అమలు కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 10.90 లక్షలకు చేరింది. ఉమ్మడి వరంగల్ అనేక మందికి నివాసయోగ్య నగరంగా మారింది. ఇక్కడి ప్రజల ఎజెండాను అమలు చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్ అల్లంతదూరాన ‘మాస్టర్ప్లాన్’... వరంగల్ మాస్టర్ప్లాన్–2042 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 42 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి ఫైల్ కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద సిటీగా.. 10.90 లక్షలకు మించిన జనాభా ఉన్న గ్రేటర్ వరంగల్లో 50 ఏళ్ల నాటి మాస్టర్ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. వెంటనే మాస్టర్ప్లాన్ – 2042ను అమల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్లో ‘ఇన్నర్ రింగ్రోడ్డు’.... 1972లో ‘కుడా’ఆవిర్భావంలో ఏర్పడిన మాస్టర్ ప్లాన్లో భాగంగా నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు పొందుపర్చారు. భూ సేకరణకు 2013లో రూ.13 కోట్లు ఆర్డీఓ పేరిట జమ చేశారు. తదుపరి మరో రూ.50 కోట్ల నిధులు రెవెన్యూ శాఖకు అప్పగించారు. కానీ ఇంత వరకు భూ సేకరణ పూర్తి కాలేదు. పనులు పూర్తి కాలేదు. కలగా రోప్ వే... ఏపీలోని విశాఖ నగరంలో కైలాసగిరి పైకి ఎలాగైతే రోప్వే (వేలాడే పెట్టె) ఉందో అలాంటిదే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భ«ద్రకాళి గుడికి వచ్చిన వారు భద్రకాళి చెరువు అందాలను వీక్షిస్తూ హనుమకొండ పద్మాక్ష్మి గుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి హంటర్ రోడ్డు జూపార్కు ఎదురుగా ఉన్న రీజినల్ సైన్స్ కేంద్రం గుట్టపై వరకు రోప్వే డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు 2007లో టెండర్లు పిలిచారు. వైజాగ్ రోప్వే ప్రాజెక్టు చేసిన కోల్కతాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత పనులు ముందుకెళ్లలేదు. మామునూరు ఎయిర్పోర్టు... నియో రైలు.. వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్నది ఎన్నో ఏళ్ల కల. ఒకప్పుడు ఇక్కడ విమానాలు ఎగిరాయి. ఇప్పటికీ రన్వే, విమానాశ్రయం ఉన్నాయి. మట్టి నమూనా పరీక్షలను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు ఏడాదిన్నర క్రితం చేపట్టారు. ఇక మిగిలిన స్థలసేకరణ బాధ్యత రాష్ట్రానిది. ఈ ప్రక్రియపై వేగం పెరిగి పూర్తయితే రెండు, మూడేళ్లలో ఈ ప్రాంత ప్రజలకు విమానయానయోగం సులువవుతుంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు ఇంకా కాగితాలపైనే ఉన్నాయి. ‘ఔటర్ రింగ్రోడ్డు’అలాగే... ఔటర్ రింగు రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. మొత్తంగా నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇంకా 40 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ముసురు మొదలయ్యిందంటే ‘ముంపు’భయం.. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు. నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. సుమారు 1,500 పైగా కాలనీలుంటాయి. ఇందులో 40 శాతం కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. భూ కబ్జాలు, ఆక్రమణలతో 40కి పైగా లోతట్టు కాలనీలు ప్రమాదపు అంచులో ఉంటున్నాయి. కాస్త వర్షం కురిస్తేనే కాలనీలు ఏరులై వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. -
నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
సాక్షి, అమరావతి: అడుగడుగునా కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలులో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం ‘నిజం గెలవాలి’ యాత్ర. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటూ, అవినీతి తప్పితే మరే దృష్టీ లేకపోయినప్పటికీ, పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. ఫైబర్నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, పేదల నుంచి అసైన్మెంట్ భూములను కొల్లగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వీటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. టిడ్కో గృహాల నిర్మాణం, అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది. తెలంగాణ సర్కారును దెబ్బతీసేందుకు చేసిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు. అదేమంటే.. దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు? సీబీఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థల పైనే çహూంకరించేవారు. అవినీతిలో బాబు ‘స్కిల్’ ఇది 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఈ కార్యక్రమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఇది తప్పని ఆరి్థక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు. ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేసి, కొందరిని అరెస్టు కూడా చేసింది. ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు. 18 నోట్ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్లు గుర్తించారు. అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆధారాలు బలంగా ఉండటంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడంలేదు. ఎంతసేపూ అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడంలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూదోపిడీ కథ ఇదీ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు. అదే అలైన్మెంట్ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేశ్ కరకట్ట నివాసాన్ని, హెరిటేజ్ ఫుడ్స్కు, నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు. పార్టీలోనే అనుమానాలు ఇప్పటివరకు 155 మందికిపైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, వీరంతా బాబు అరెస్టయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానీకమూ చెబుతున్నారు. అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయటపెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరిని పరామర్శించాలి, యాత్ర ఎక్కడి వరకు, ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు. సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి, ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడీ అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పారీ్టలో ఆందోళన నెలకొంది. ఫైబర్నెట్లో బాబు ‘సెట్టింగ్’ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది. రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పటివరకూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారు. ఎల్1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్కు టెండరు కట్టబెట్టారు. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు. 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారు. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించారు. అసైన్మెంట్ పేరుతో పేదలను దోచిన బాబు బ్యాచ్ అమరావతి ప్రాంతంలో అసైన్మెంట్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి, వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది. అమారావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది. దాంతో ఆందోళన చెందిన అసైన్డ్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపింది. అతి తక్కువ ధరకు దాదాపు 617 ఎకరాల అసైన్డ్ భూములు హస్తగతం చేసుకుంది. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఈ బ్యాచ్ రూ.3,737 కోట్లు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు. బాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అసలు వాస్తవమేంటంటే.. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు. కానీ, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే, ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు. దీంతో బాబు సతీమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది. భవనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే, ఈ ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో అన్నీ దాపరికాలే. యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం, రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకే తెలియవు. ఇప్పటివరకు షెడ్యూలే విడుదల చేయలేదు. మొదటిరోజు పాకాల మండలం నేండ్రగుంటలో ఒక పరామర్శ, ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఒక దళితవాడలో సహపంక్తి భోజనం, సాయంత్రం చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు చూచాయగా కార్యక్రమాలు గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు. -
500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ..పిన్ టు పిన్ ఆధారాలు
-
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే పెద్ద స్కాం..!
-
నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు
-
‘రింగ్’ మాస్టర్ అష్ట వంకర్లు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఎన్ని వంకర్లు తిప్పారో.. ఆ కేసులో నిందితుడు నారా లోకేశ్ సీఐడీ విచారణలో ప్రశ్నలకు అన్ని వంకర్లు తిరిగారు. చంద్రబాబు కుటుంబం, ఆయన అస్మదీయుల భూముల విలువ అమాంతంగా పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చిన తీరుపై సీఐడీ అధికారులు అడిగిన సూటి ప్రశ్నలకు లోకేశ్ నేల చూపులు చూశారు. తాను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గ ఉప సంఘం ద్వారానే అక్రమాల కథ నడిపిన తీరును సీఐడీ ఆధారాలతో సహా ముందు పెట్టడంతో బిత్తరపోయారు. హెరిటేజ్ భూముల కొనుగోలు, లింగమనేని కుటుంబం నుంచి క్విడ్ప్రోకో కింద పొందిన కరకట్ట నివాసంపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. విచారణకు సహకరించకుండా దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఈ కేసులో ఏ–14గా ఉన్న లోకేశ్ను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ దర్యాప్తునకు సహకరించకుండా ఉండేందుకు లోకేశ్ అనేక ప్రయత్నాలు చేశారు. అయినా సిట్ బృందం తమదైన శైలిలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన న్యాయవాది సమీప దూరంలో ఉండగా ఆడియో, వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ అధికారులు లోకేశ్ను విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దర్యాప్తునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అలైన్మెంట్ మార్చాలని ఎందుకు ఒత్తిడి చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి కోర్ కేపిటల్పై టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ ఉప సంఘం ద్వారా అక్రమాల కథ నడిపిన తీరుపై సీఐడీ లోకేశ్పై ప్రశ్నల వర్షం కురిపించింది. జూనియర్ మంత్రి అయినప్పటికీ లోకేశ్కు ఉప సంఘంలో స్థానం కల్పించడంపై మొదటగా ప్రశ్నించింది. పేరుకు మంత్రివర్గ ఉప సంఘం అయిన్పటికీ ఇతర సభ్యులకంటే అందులో లోకేశ్, నారాయణదే హవా అని, భూ సమీకరణ, ఇన్నర్రింగ్ రోడ్డుకు భూసేకరణపై వారే కీలకంగా వ్యవహరించినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. వాటిని లోకేశ్కు చూపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చాలని సీఆర్డీఏ అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారని ప్రశ్నించింది. తామేమీ ఒత్తిడి చేయలేదని లోకేశ్ బుకాయించారు. మంత్రివర్గ ఉపసంఘం, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అలైన్మెంట్ను మార్చినట్లు అప్పటి సీఆర్డీఏ అధికారులు వాంగ్మూలం ఇచ్చిన అంశాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించడంతో లోకేశ్ షాక్ తిన్నారు. దాంతో ఆయన నోట మాట రాలేదని సమాచారం. వెంటనే తన న్యాయవాదితో సంప్రదించి చెబుతానని చెప్పారు. న్యాయవాదితో మాట్లాడిన తరువాత కూడా ఆయన ఈ అంశంపై సమాధానం దాట వేసేందుకే ప్రయత్నించారు. ముందుగానే సీఆర్డీఏ అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖారారు చేయించి, దానినే మాస్టర్ప్లాన్లో చేర్పించి సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీ ద్వారా ఆమోదింపజేయడం అంటే అక్రమమే కదా.. అని అధికారులు ప్రశ్నించడంతో లోకేశ్ మౌనంగా ఉండిపోయారు. మంత్రివర్గ ఉప సంఘం వ్యవహారం అంతా బూటకమని, ఆ ముసుగులో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతంగా పెంచుకున్నారని సీఐడీ కీలక ఆధారాలు చూపించడంతో లోకేశ్ నిశ్చేష్టుడయ్యారు. హెరిటేజ్ భూముల అంశంపై అసహనం ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ భూములు కొన్న అంశంపై సీఐడీ సూటి ప్రశ్నలకు లోకేశ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రాంతంలో భూములు కొనాలని హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు వేసిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం తాను హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా లేనని, ఆ విషయాలు తనకు తెలియవని అన్నారు. భూములు కొనాలని తీర్మానించిన సమయంలో మీరే డైరెక్టర్గా ఉన్నారు కదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేయడం గమనార్హం. కరకట్ట నివాసం అంశంపై కస్సుబుస్సు లింగమనేని కుటుంబం నుంచి క్విడ్ప్రోకో కింద పొందిన కరకట్ట బంగ్లాపై సీఐడీ ప్రశ్నించడంతో లోకేశ్ తత్తరపాటుకు గురై అధికారులపై కస్సుబుస్సులాడారు. ఆ ఇంటికి తాము అద్దె చెల్లించామన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆదాయ పన్ను రిటర్న్లను అధికారులు చూపిస్తూ ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా ఏ పత్రాలనైనా సంబంధిత శాఖలను సంప్రదించి తీసుకునే వెసులుబాటు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఉందనే అవగాహన ఆయనకు లేకపోవడం విడ్డూరం. లింగమనేని రమేశ్ ఆ కరకట్ట నివాసాన్ని ఉచితంగా ఇచ్చానని ఓసారి, కాదు దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని మరోసారి చెప్పిన విషయాలను అధికారులు ప్రస్తావించారు. దాంతో అసలు తనకు ఆ కరకట్ట నివాసం గురించి తెలియదని లోకేశ్ బుకాయించారు. మంత్రి హోదాలో మీరు నివసించిన ఇంటి గురించి తెలియదా... అని అధికారులు రెట్టించి అడిగేసరికి సమాధానం దాటవేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణానికి సంబందించి మరికొన్ని కీలక వ్యవహారాలపై లోకేశ్ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. వీలైనంతవరకు దర్యాప్తునకు సహకరించకుండా విషయాన్ని పక్కదారి పట్టించేందుకే యత్నించారు. పలువురు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని ప్రశ్నించాలని సీఐడీకి సూచించడం హాస్యాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన నిందితుడే ఇతరులను ప్రశ్నించాలని చెబుతుండటం విడ్డూరంగా ఉందని సీఐడీవర్గాలు వ్యాఖ్యానించాయి. అవసరమైతే మరోసారి విచారణకు రావల్సి ఉంటుందని సీఐడీ అధికారులు లోకేశ్కు చెప్పి బుధవారం విచారణ ప్రక్రియను ముగించారు. సంబంధం లేని ప్రశ్నలు వేశారు: లోకేశ్ సీఐడీ అధికారులు తనకు ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు వేశారని లోకేశ్ చెప్పారు. రెండో రోజు విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని ఈ విచారణ ద్వారా తనకు తెలిసిందన్నారు. కరకట్ట నివాసానికి తన తల్లి అద్దె చెల్లించారన్నారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్లను అధికారులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. సాక్షి పత్రికలో షేర్లను కొందరు కొన్నట్లుగా తమ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను లింగమనేని కొనలేదని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రశ్నలకు తత్తరపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ పాత్రపై ‘సాక్షి’ ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. సాక్షి పత్రికపై అసత్య ఆరోపణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. కానీ సాక్షి ప్రతినిధులు సూటి ప్రశ్నలు సంధించడంతో తత్తరపాటుకు గురయ్యారు. ఇతర మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోకేశ్తో సాక్షి, ఇతర మీడియా ప్రతినిధుల సంభాషణ ఇలా సాగింది.. సాక్షి: మీరు మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడయ్యాకే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చారని, హెరిటేజ్ ఫుడ్స్కు భూములు కొన్నారన్న అభియోగంపై మీ స్పందన ఏమిటి? లోకేశ్: మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడిగా నేను ఒత్తిడి చేసి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశానని సీఐడీ అంటోంది. కానీ అది నా శాఖకు ప్రమేయం లేని అంశం. అదే చెప్పా. సాక్షి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉన్న కంతేరు వైపు ఎందుకు మళ్లింది? లోకేశ్: సీఐడీ అధికారులు నాకు బాహుబలి సినిమా చూపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గూగుల్ మ్యాప్ చూపించి ప్రశ్నించారు. ఆ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని నాకు అర్థమైంది. సాక్షి: క్విడ్ప్రోకో కిందే లింగమనేని మీకు కరకట్ట బంగ్లా ఇచ్చారని సీఐడీ అభియోగం మోపింది కదా? లోకేశ్: మాకు క్విడ్ ప్రోకో అలవాటు లేదు. అలా మా హెరిటేజ్ ఫుడ్స్లో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. సాక్షి: మరి మీకు మాత్రమే లింగమనేని ఆ కరకట్ట బంగ్లాను ఎందుకు ఇచ్చారు? లోకేశ్: ఆ ఇంటికి మేము అద్దె చెల్లిస్తున్నాం. ప్రభుత్వానికి ఆ మేరకు లేఖ కూడా రాశాం. సాక్షి: అదే నిజమైతే 2019కు ముందు ఎందుకు అద్దె చెల్లించలేదు? లోకేశ్: (వెంటనే సమాధానం చెప్పలేక మౌనం వహించారు. కాసేపటికి తేరుకుని..) ఆ విషయం నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు అద్దె చెల్లిస్తున్నాం. మా అమ్మ ఐటీ రిటర్న్ రికార్డులు సీఐడీకి ఎలా వచ్చాయి? దీనిపై న్యాయపోరాటం చేస్తాం. సాక్షి: మీ సన్నిహితుడు కిలారు రాజేశ్ ఎందుకు పరారయ్యారు? లోకేశ్: ఆయన గురించి నాకేం తెలుస్తుంది? ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు ఇతర మీడియా ప్రతినిధులు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలుకు పంపారు అని మీరు అంటున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించేది కోర్టులు కదా? లోకేశ్: ఈ కేసులో ఎఫ్ఐఆర్ వేసింది జగన్ ప్రభుత్వమే. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. మీడియా ప్రతినిధులు: మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారా? లోకేశ్: నేను ఎక్కడికి వెళ్తానో మీకు చెప్పాలా? అది మీకు అనవసరం. నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఎక్కడికి వెళ్లినా షెడ్యూల్ ఇస్తా. -
ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు. అప్పటివరకు రక్షణ కల్పించండి.. అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు.. తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ నేటికి వాయిదా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది. -
సాక్షి మీడియాపై నారా లోకేష్ అక్కసు
-
సాక్షి మీడియాపై నారా లోకేష్ అక్కసు
గుంటూరు: ఎప్పుడూ సాక్షి మీడియాపై నోరు పారేసుకునే నారా లోకేష్..మరోసారి తన దురుసు ప్రవర్తనను ప్రదర్శించారు. పదే పదే సాక్షి మీడియాపై తప్పుడు ఆరోపణలు చేయడం పరిపాటిగా మార్చుకున్న నారా లోకేష్.. మళ్లీ అక్కసును ప్రదర్శించాడు. రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేష్.. విచారణ అనంతరం సాక్షి మీడియాపై అసహనం ప్రదర్శించాడు. సాక్షి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రెచ్చిపోయాడు లోకేష్. అరుపులు, కేకలతో సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి దిగాడు. ప్రశ్నలు అడిగితే సాక్షి మీడియా పెట్టుబడులు అంటూ అక్కర్లేని అసంబద్ధ ప్రేలాపనలు చేశాడు లోకేష్. వాలంటీర్లను సాక్షి పేపర్ కొనాలంటూ జీవో ఇచ్చారని తప్పుడు ఆరోపణలకు దిగాడు లోకేష్,. చదవండి: రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్ -
రేపు మళ్లీ విచారణకు రావాలని పునీత్ కు సీఐడీ నోటీసులు
-
రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ సిఐడి విచారణ
-
IRR, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు
-
IRR కేసులో నారాయణ అల్లుడు పునీత్ ను విచారిస్తున్న సీఐడీ
-
2వ రోజు లోకేష్ కు సీఐడీ ప్రశ్నలు
-
లోకేష్ రెండో రోజు విచారణ...డోస్ పెంచిన సీఐడీ
-
రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్
సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో రెండో రోజు నారా లోకేష్ను ఏపీ సీఐడీ విచారిస్తోంది. మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు సంధించింది. లోకేష్కు సీఐడీ ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా?. మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..?. హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు?. ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా?. భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు’’ అంటూ లోకేష్ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 5 గంటల పాటు పునీత్ను విచారించిన సీఐడీ అధికారులు ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లడు పునీత్ను సీఐడీ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా సీఐడీ ఎదుట హాజరైన పునీత్ను అధికారులు ప్రశ్నించారు. రేపు(గురువారం) మళ్లీ విచారణకు రావాలని పునీత్ను అధికారులు ఆదేశించారు. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న లోకేశ్.. తొలిరోజు పొంతనలేని సమాధానాలు చెప్పారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. లోకేష్కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించారు. అయితే, సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధాన్యమిచ్చారు. లోకేశ్ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు. చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! -
నారా లోకేశ్ రెండో రోజు CID విచారణ
-
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సీఐడీ విచారణలో లోకేశ్ తడబాటు
-
Live: చంద్రబాబు కేసు లైవ్ అప్డేట్స్.. Click & Refresh
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 7:01PM, అక్టోబర్ 11, 2023 ►మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్ ►గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్ 6:25 PM, అక్టోబర్ 11, 2023 మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► విజయవాడ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ ► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్ 6:20 PM, అక్టోబర్ 11, 2023 మొన్న దోమలు, నిన్న వేడినీళ్లు, నేడు ఉక్కపోత ► పెరిగిపోతున్న చంద్రబాబు డిమాండ్లు ► చంద్రబాబు రాజమండ్రి జైలులో ఇబ్బందిపడుతున్నారు : లోకేష్ ► ఉష్ణోగ్రతలు పెరిగాయి..రాజమండ్రిలో ఉక్కపోత ఎక్కువ ఉంది : లోకేష్ ► వేడి వల్ల చంద్రబాబు డీ హైడ్రేషన్ అవుతోంది : : లోకేష్ ► మాజీ సిఎంగా చంద్రబాబుకు జైల్లో క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి ► చంద్రబాబుకు అందాల్సిన క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి : లోకేష్ 6:15 PM, అక్టోబర్ 11, 2023 రింగ్ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్ 17న విచారణ ► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ 6:15 PM, అక్టోబర్ 11, 2023 PT వారంటుపై రేపు విచారణ ► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి ► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు ► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు ► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది ► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి : 6:05 PM, అక్టోబర్ 11, 2023 లోకేషా, జవాబులు చెప్పలేక సాక్షిపై రంకెలా? ► రెండోరోజు ముగిసిన లోకేష్ సిఐడి విచారణ ► ఆరు గంటలపాటు సిఐడి అధికారులు విచారించారు ► ఇవాళ నా ముందు ఒక డాక్యుమెంట్ పెట్టారు ► భువనేశ్వరి ఐటీ రిటర్న్లకు సంబంధించి డాక్యుమెంట్ పెట్టారు ► లింగమనేని రమేష్ కు రెంటల్ అడ్వాన్స్ రూ.27 లక్షలు కట్టారని చెప్పారు ► రెంటల్ అడ్వాన్స్ కు సంబంధించి ఐటీ రిటర్న్ల్లో లేదని చెప్పారు ► ఐటీ రిటర్న్లకు సంబంధించి ఆడిటర్ ను అడగాలని చెప్పా ► ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్ప్రోకో ఎలా అవుతుంది ► ఐఆర్ఆర్కు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారు ► నా శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు పదేపదే అడిగారు ► ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా ► హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్ ఎర్త్లో చూపించారు ► ఐఆర్ఆర్ లో నాకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు ► పదేళ్లుగా కుటుంబసభ్యుల ఆస్తుల ప్రజల ముందుంచుతున్నా ► ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు కంపెనీ నిర్ణయాలపై నన్ను ప్రశ్నించారు ► నాకు టిసీఎస్ సహా అనేక కంపెనీల్లో షేర్లు ఉన్నాయి ► సాక్షి మీడియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు లోకేష్ ప్రయత్నం ► సాక్షి మీడియా : లింగమనేని ఇల్లు మీకెందుకు ఇచ్చారు? ► లోకేష్ : 2019 తర్వాత మేం రూ.27 లక్షల అద్దె చెల్లించాం ► సాక్షి మీడియా : మరి 2014-19 మధ్య కాలంలో అద్దె ఎందుకు చెల్లించలేదు? ► సమాధానం చెప్పకుండా సబ్జెక్ట్ మార్చిన లోకేష్ (ఈ ఇంటిని లింగమనేని ప్రభుత్వానికి ఇచ్చారని గతంలో ప్రకటించిన చంద్రబాబు) ► సాక్షి మీడియా : మీ పాదయాత్రలో అత్యంత క్లోజ్గా కనిపించిన కిలారు రాజేష్ నోటీసులు ఇవ్వగానే అమెరికా ఎందుకు పారిపోయారు? ► లోకేష్ : నాకు తెలియని ప్రశ్నలు నన్నెలా అడుగుతారు? చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారు ► సాక్షి మీడియా : రిమాండ్ ఇచ్చింది కోర్టులు అయితే.. ప్రభుత్వం జైల్లో పెట్టిందని ఎలా చెబుతారు? ► సమాధానం చెప్పలేక సాక్షి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ 5:05 PM, అక్టోబర్ 11, 2023 ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది: స్పెషల్ పిపి వివేకానంద ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటి వారెంట్ పై వాదనలు వినిపించిన స్పెషల్ పిపి వివేకానంద ► ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 115 కోట్ల నిధులగోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది ► సిట్ దర్యాప్తులో చంద్రబాబు పాత్ర బయటపడడంతో ఆయనపైనా కేసు నమోదు ► ఎ-1 ముద్దాయిగా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు ఏ-2గా, చంద్రబాబు ఏ-25గా ఎఫ్ఐఆర్ నమోదు అయింది ► ఫైబర్నెట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రని గుర్తించిన తర్వాతే ఎఫ్ఐఆర్లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకి పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకి విరుద్దంగా టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు ► బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్కి టెండర్ దక్కేలా అక్రమాలకి పాల్పడ్డారు ► ఫైబర్ నెట్ లో ఫేజు-1 లో 320 కోట్లకి టెండర్లు పిలిస్తే 115 కోట్ల అవినీతి జరిగింది ► టెర్రా సాప్ట్ కి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు పక్కన పెట్టారు ► సివిల్ సప్లైస్ శాఖకి నాసిరకం ఇ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ► బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రా సాఫ్ట్ ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు ► నిబంధనలకి విరుద్దంగా అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు ► టెర్రా సాఫ్ట్ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు ► టెర్రా సాఫ్ట్కి టెండర్లు కట్టబెట్టేందుకు పలు అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్తో కన్సార్టియంలో భాగమైన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత టెర్రా సాఫ్ట్ నుంచి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపించారు ► తమని మోసం చేసి నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ. 115 కోట్ల నాసిరకం మెటీరియల్ని టెర్రా సాఫ్ట్ కొనుగోలు చేసి ఫైబర్ నెట్ కి సరఫరా చేసినట్లు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీఐడీ ► ఈ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది ► చంద్రబాబు సీఎం హోదాని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడినట్లు ఆధారాలున్నాయి ► ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ అనుమతించండి 4:10 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు లాయర్లు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ డిస్మిస్ ► రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న పీటీ వారెంట్ల పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ► హైకోర్టు ఆదేశాలు, జరిగిన పరిణామాలను జడ్జికి వివరించిన ఇరుపక్షాల లాయర్లు ► కేసు వివరాలు, ఎంత మందిని అరెస్ట్ చేశామన్న విషయాన్నీ జడ్జికి వివరించిన సీఐడీ లాయర్ వివేకా 3:10 PM, అక్టోబర్ 11, 2023 తప్పు చేయలేదని కాకుండా అరెస్ట్ గురించి వాదిస్తారా? : చంద్రబాబు తీరుపై సజ్జల విమర్శలు ► చంద్రబాబు అరెస్టు అయి నెల దాటింది ► రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత స్కాం ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ వేసింది ► చంద్రబాబును ప్రోటోకాల్ ప్రకారం అరెస్టు చేయలేదనే ఆయన లాయర్లు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ► అంతేతప్ప నేరం జరగలేదని ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారు ► రూ.3,300 కోట్ల ప్రాజెక్టు అని క్యాబినెట్ ఆమోదం పొంది, జీవోలలో మొత్తం మార్చేశారు ► అసలు రూ.3వేల కోట్ల ప్రాజెక్టు వస్తే రూల్స్ ప్రకారం ఏందుకు వ్యవహరించలేదు? ► ఫైనాన్స్ విభాగం కూడా ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు ► దీనిపై ఎలాంటి స్టడీ చేయకుండా డబ్బు ఎలా రిలీజ్ చేశారు? ► ఆ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ కూడా చెప్పారు? ► ఈ ప్రాజెక్టు మొత్తం కుట్రపూరితంగా జరిగిందనేందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి ► ఇవన్నీ చూశాకనే చంద్రబాబును అరెస్టు చేశారు ► సుదీర్ఘ విచారణ జరిగాకనే ఈడీ కూడా కొందరిని అరెస్టులు చేసింది ► అన్ని వేళ్లూ చంద్రబాబు పైనే చూపిస్తున్నాయి ► కోర్టుకు సీఐడీ ఆధారాలు చూపించటం వలనే రిమాండ్ కు పంపింది ► విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ► పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్ ల ద్వారా చంద్రబాబుకు డబ్బు ఎలా చేరిందో ఆధారాలు దొరికాయి ► అందుకే కొందరిని దేశం దాటించారు ► ఈ కుట్రలో పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే ► ఈ విషయాల గురించి మాట్లాడకుండా 17A గురించి కోర్టులో వాదిస్తున్నారు ► రెండు ఎకరాల నుండి లక్షల కోట్లకు ఎలా ఎదిగిందీ అందరికీ తెలుసు ► కానీ టెక్నికల్ ఆధారాలు చూపించి కేసుల నుండి జారుకునేవారు ► ఐతే స్కిల్ స్కాం కేసులో పక్కా ఆధారాలు దొరికాయి ► ప్రజాకోర్టులో కూడా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి ► ప్రజలు కూడా చంద్రబాబు మోసాలపై నిలదీయాలి ► టీడీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గు పడుతున్నారు ► లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లి కూర్చుంటారు ► రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను కూడా అలాగే కొట్టేశారు ► రైతులను, ప్రజలను నిలువునా మోసం చేశారు ► ఆయన మనమడికి కూడా లక్షల కోట్ల ఆస్తిని సిద్ధం చేయాలని ప్లాన్ వేశారు ► రింగ్ రోడ్డు స్కాంలో కూడా ఇలాంటి కుట్రే చేశారు ► వ్యవస్థలను మేనేజ్ చేయగలమనే ధీమాతో ఢిల్లీ నుండి కిందివరకు వ్యవహరిస్తున్నారు ► జైల్లో ఉండి కూడా బాబు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనటం పెద్ద జోక్ ► టిడిపి లీడర్లు ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇచ్చి జుగుప్స కలిగిస్తున్నారు ► లోకేష్ ఢిల్లీలో ఉంటే ఒక్క జాతీయ పార్టీ ఐనా సానుభూతి చూపిందా? ► అడ్డంగా దొరికిన దొంగకి ఎవరు సపోర్టు చేస్తారు? ► రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు మంచి భద్రత ఉంది 3:02 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ► ఇన్నర్ రింగ్రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని చెప్పిన బాబు లాయర్లు ► చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి ► సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు ► ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ► అంగళ్లు కేసుల్లో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు 3:00 PM, అక్టోబర్ 11, 2023 మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. బాబును వెంటాడుతున్న పాపాలు ► సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ► చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని 2017లో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ ► ఓటుకు నోటు కేసు సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ ► తమ లాయర్ లూథ్రా అందుబాటులో లేరని చెప్పిన చంద్రబాబు లాయర్ ► విచారణ 4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు లాయర్ ► అభ్యంతరం వ్యక్తం చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది ► త్వరలోనే విచారణ తేదీని ఖరారు చేస్తామన్న సుప్రీంకోర్టు 2:55 PM, అక్టోబర్ 11, 2023 తప్పు చేసి.. రాజకీయ కక్ష అంటారా? : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ► స్కిల్ స్కామ్ లో చంద్రబాబు సాక్ష్యాధారాలతోనే అరెస్టు అయ్యారు ► చంద్రబాబు అరెస్టు లో కక్ష సాధింపు ఎక్కడ ఉంది ? ► నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా ? ► రూ. 300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ► ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారు ► సీమెన్స్ సైతం మాకు సంబంధం లేదని చెప్పింది ► ఫేక్ ఇన్వాయిస్ లతో నిధులు పక్కదారి పట్టించారు ► నిందితుల్లో ఇద్దరు విదేశాలకు పారిపోయారు ► ఈ స్కామ్ కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే : సజ్జల 2:50 PM, అక్టోబర్ 11, 2023 ఏపి హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకం ► ఏపి హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించిన సుప్రీంకోర్టు ► జడ్జిలుగా సీనియర్ న్యాయవాదులు హరినాథ్ , కిరణ్మయి, సుమిత్, విజయ్లు ► ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 2:40 PM, అక్టోబర్ 11, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ► ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వాదనలు ► ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందన్న ఏజీ శ్రీరామ్ ► ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్ ► ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చూపించే అవకాశం ఉందన్న బాబు తరపు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన దమ్మాలపాటి శ్రీనివాస్ 2:10 PM, అక్టోబర్ 11, 2023 ఢిల్లీ: చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా ►సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేరు ►4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు తరపు న్యాయవాది ►విచారణ తేదీని ఖరారు చేస్తామన్న ధర్మాసనం 2:01 PM, అక్టోబర్ 11, 2023 కాసేపట్లో చంద్రబాబు పిటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు 1:49 PM, అక్టోబర్ 11, 2023 ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై తీర్పు పెండింగ్లో ఉంది: ఏజీ ►కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవొద్దు ►మధ్యాహ్నం 2.15కి వాదనలు వింటానన్న ధర్మాసనం 12:35 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►రింగ్రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి ►సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు ►పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపడతామన్న హైకోర్టు 12:33 PM, అక్టోబర్ 11, 2023 సెలవులో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ►రేపటి నుంచి 4 రోజులు సెలవు తీసుకోనున్న రాహుల్ ►ఇంఛార్జ్ సూపరింటెండెంట్గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్కుమార్కు బాధ్యతలు 11:45 AM, అక్టోబర్ 11, 2023 లోకేష్కు సీఐడీ ప్రశ్నలు ►రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ సీఐడీ విచారణ ►మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా? ►మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు? ►మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..? ►హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ►ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా? ►భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు? ►లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు ►లింగమనేనికి మేలు చేసినందుకే మీకు ఇంటిని క్విడ్ ప్రోకోలో ఇచ్చారు కదా? ►ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫార్స్ చేశారా? 11:45 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్రోడ్డు, అంగళ్లు కేసులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు 11:19 AM, అక్టోబర్ 11, 2023 ఐఆర్ఆర్ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు పునీత్ ►ఐఆర్ఆర్లో నారా లోకేష్, పునీత్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీఐడీ గుర్తింపు ►ఐఆర్ఆర్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నెల 6న సీఐడీ నోటీసులు 10:10 AM, అక్టోబర్ 11, 2023 రెండో రోజు విచారణకు లోకేశ్ ►నారా లోకేశ్ను రెండో రోజు విచారిస్తున్న ఏపీ సీఐడీ ►సిట్ కార్యాలయంలో నారా లోకేశ్. ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్. ►తొలిరోజు నారా లోకేశ్ పొంతనలేని సమాధానాలు. ►సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ 09:58 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పై సీఐడీ పీటీ వారెంట్ల పై నేడు విచారణ ►నేడు విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు ►విచారణ అనంతరం ఆర్డర్ ఇవ్వనున్న న్యాయమూర్తి ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు 09:56 AM, అక్టోబర్ 11, 2023 మాజీమంత్రి నారాయణ బంధువు ముందస్తు బెయిల్ పిటిషన్ ►మునీశంకర్ బెయిల్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►IRR కేసులో నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ 09:50 AM, అక్టోబర్ 11, 2023 సిట్ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్ ►రెండో రోజు లోకేష్ను ప్రశ్నించనున్న సీఐడీ ►ఐఆర్ఆర్ కేసులో లోకేష్ను విచారించనున్న అధికారులు ►నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు విచారించిన సీఐడీ ►నిన్న లోకేష్కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు ►హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించిన సీఐడీ ►నేడు లోకేష్తో పాటు విచారణకు మాజీమంత్రి నారాయణ అల్లుడు, లోకేష్, పునీత్ను వేర్వేరుగా విచారించనున్న సీఐడీ 09:14 AM, అక్టోబర్ 11, 2023 జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 32వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబు పూర్తిస్థాయిలో జైల్లో భద్రత ►చంద్రబాబు స్వల్ప అస్వస్థత గురయ్యారని డీహైడ్రైజేషన్ లోనయ్యారని పచ్చ మీడియా హడావిడి ►ఎండ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని వైద్యాధికారికి చెప్పిన చంద్రబాబు ►దాంతో చంద్రబాబుకు మూడుసార్లు వైద్య పరీక్షలు జరిపిన జైలు అధికారులు ►ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు 08:13 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పిటి వారెంట్లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు ►నిన్న ఏసీబీ న్యాయమూర్తి సెలవు కావడంతో విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా ►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ ప్రకారం తమ వాదనలు వినాలని పట్టుబట్టిన చంద్రబాబు న్యాయవాదులు ►పిటి వారెంట్లలో రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తించదంటున్న సీఐడీ తరపు న్యాయవాదులు ►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తిస్తుందా లేదా అనేది నిర్ణయించనున్న కోర్టు ►నేటి మధ్యాహ్నం 2.30 గంటల ప్రారంభం కానున్న వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన సీఐడి న్యాయవాదులు ►చంద్రబాబు సాక్షులని ప్రభావితం చేస్తున్నారని వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు ►సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు 07:31 AM, అక్టోబర్ 11, 2023 అత్యవసర విచారణ కుదరదు ►సాధారణ పద్ధతిలోనే ఆ పిటిషన్లను విచారణ చేస్తాం ►ఐఆర్ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు.. నేడు విచారణ ►నారాయణ, ఆయన బావ మరిది పిటిషన్లపై నేడు విచారణ 07:13 AM, అక్టోబర్ 11, 2023 సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలి: మంత్రి తానేటి వనిత ►అప్పుడే నిజాలు బయటకు వస్తాయి ►కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే బెయిల్ రావడం లేదు ►కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు ►చంద్రబాబును మోయడం తప్ప పవన్ కళ్యాణ్కు మరే ఎజెండా లేదు 07:04 AM, అక్టోబర్ 11, 2023 అన్నిటా బాబు బాటలోనే.. ►అవినీతికి పాల్పడటంలోనే కాదు.. సీఐడీ దర్యాప్తునకు సహకరించని లోకేష్ ►మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే అనుసరించిన లోకేశ్ ►విచారణను తప్పించుకునేందుకు బెడిసికొట్టిన యత్నాలు ►అనివార్యంగా లోకేశ్ సీఐడీ ఎదుట హాజరు ►సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే సమాధానం 06:57 AM, అక్టోబర్ 11, 2023 తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం ►సీఐడీ సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం ►అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం ►ఏడుగురిని పోలీస్స్టేషన్కు తరలించిన పోలీసులు 06:47 AM, అక్టోబర్ 11, 2023 తత్తరపాటు.. బిత్తర చూపులు! ►ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సీఐడీ ►విచారణలో లోకేశ్ తడబాటు.. అసహనం ►అబ్బే నాకేం తెలీదు... మరి ఈ సంతకాలు మీవే కదా? ►ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై ప్రశ్నించిన అధికారులు ►హెరిటేజ్ భూముల కొనుగోలు దందాపై ప్రశ్నల వర్షం ►సంతకాలతో సహా ఆధారాలను చూపిస్తూ సూటిగా ప్రశ్నలు ►కలవరపాటుతో న్యాయవాదులతో చినబాబు మంతనాలు ►ఆరు గంటల పాటు విచారణ.. నేడు మరోసారి విచారణ చంద్రబాబు అవినీతి చేశాడా లేదా ? సీమెన్స్ వాళ్ళు ఇస్తామన్న రూ.3,000 కోట్లు ఇచ్చారా ? ఇస్తే ఏమయ్యాయి. వీటికి రామోజీ, టీడీపీ సమాధానం చెప్పాలి.#BanYellowMediaSaveAP#GajadongaChandrababu#SkilledCriminalCBNInJail #CorruptionKingCBN pic.twitter.com/yzjhFzOVbq — YSR Congress Party (@YSRCParty) October 10, 2023 -
తత్తరపాటు.. బిత్తర చూపులు!
‘ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి నాకేం తెలీదు.. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనడం గురించి నాకేం తెలియదు’ – నారా లోకేశ్ ‘భూముల కొనుగోలుకు తీర్మానిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో చేసిన తీర్మానం ఇదిగో. ఆ మీటింగ్లో మీరూ పాల్గొన్నారు. మినిట్స్ రికార్డుల్లో సంతకం కూడా చేశారు. అయినా కూడా మీకు భూముల కొనుగోలు గురించి తెలీదంటారా?’ – సీఐడీ అధికారుల సూటి ప్రశ్న సాక్షి, అమరావతి: సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఏ–14గా ఉన్న నారా లోకేశ్ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు మంగళవారం హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన్ను సిట్ అధికారులు విచారించారు. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధాన్యమిచ్చారు. లోకేశ్ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని లోకేశ్కు నోటీసులిచ్చారు. ఇవిగో ఆధారాలు.. మరేమంటారు? విచారణకు సహకరించకుండా కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు లోకేశ్ యత్నిస్తుండటంతో ఒక దశలో సీఐడీ అధికారులు ఇక లాభం లేదని గేర్ మార్చారు. అంతవరకు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని చెబుతూ వచ్చిన వాటికి సంబంధించి ఆధారాలను ఒక్కొక్కటిగా చూపుతూ ఆరా తీయడంతో లోకేశ్ కంగుతిన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ భూములను కొనుగోలు చేసిన విషయం తనకు తెలియదని లోకేశ్ మొదట బుకాయించారు. అయి తే ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగులో పాల్గొన్నట్టు నిరూపించే రికార్డులను చూపించడంతో పాటు భూముల కొనుగోలుకు ఆమోదించిన తీర్మా నం కాపీని అధికారులు ప్రదర్శించడంతో తత్తరపాటుకు గురయ్యారు. వాటిపై సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో తన న్యాయవాదితో మా ట్లాడి చెబుతానన్నారు. అందుకు సీఐడీ అధికారులు అనుమతించడంతో సమీపంలోనే ఉన్న న్యాయవాదితో మంతనాలు జరిపారు. అనంతరం తిరిగి వచ్చి ఆ సమావేశంలో చాలా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారని, అయితే అవేవీ తనకు గుర్తు లేదని సమాధానమిచ్చారు. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల విషయంపై తనకు తెలియదని బుకాయించేందుకు లోకేశ్ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఆనుకుని ఉన్న భూములనే కొనుగోలు చేయాలని హెరిటేజ్ ఫుడ్స్ నిర్ణయించింది. అక్కడ భూములను కొనుగోలు చేయడం వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో పేర్కొన్నారు. రాజధాని కోసం భూసమీకరణకు ప్రభుత్వం భూములను తీసుకుంటున్న ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం వ్యాపార విస్తరణకు ఎలా దోహదపడుతుందని భావించారని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించారు. అంటే ఆ ప్రాంతంలోని భూములు భూసమీకరణకు కిందకు రావని మీకు ముందే తెలుసా? అని సూటిగా నిలదీసేసరికి లోకేశ్ నీళ్లు నమిలారు. హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించిన భూములను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన భూములున్న విషయం మీకు తెలుసా అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మీ తండ్రి చంద్రబాబుతో కలసి మీరు నివసిస్తున్న కరకట్ట బంగ్లా లింగమనేని కుటుంబం ఇచ్చిందనే విషయంపై మీకు అవగాహన ఉందా? అని ప్రశ్నించగా ఆయన చాలాసేపు మౌనం వహించారు. క్విడ్ప్రోకో కిందే ఆ కరకట్ట నివాసం మీకు వచ్చిందన్న అభియోగంపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించినా సరే లోకేశ్ సూటిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం. వెళ్లండి... రేపు రండి లోకేశ్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని సీఐడీ అధి కారులు నిర్ణయించారు. ఈమేరకు బుధవారం విచారణకు హాజరు కావాలంటూ సెక్షన్ 41 ఏ కింద లోకేష్కు నోటీసులు ఇచ్చారు. గూగుల్లో వెతికితే చాలు: లోకేశ్ తన గురించి గూగుల్లో వెతికినా లభించే సాధారణ సమాచారాన్నే సీఐడీ అధికారులు విచారణలో ప్రశ్నించారని విచారణ అనంతరం లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కక్ష సాధింపు కోసమే తమపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అన్నిటా బాబు బాటలోనే.. అవినీతికి పాల్పడటంలోనే కాదు సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే లోకేశ్ అనుసరించారు. విచారణను తప్పించుకునేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టడంతో అనివార్యంగా లోకేశ్ సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించి సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే చెబుతూ వచ్చారు. అలైన్మెంట్ను మూడు సార్లు మార్చిన విషయంపై ప్రశ్నిస్తే అసలు తనకు ఆ విషయమే తెలియదని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నలకు తనకు తెలీయదని..గుర్తు లేదని చెప్పడం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్ హోదాలో మీరు ఎలాంటి విధులు నిర్వహించారు..? ఎలాంటి నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారనే ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. సీఐడీ అధికారులు విచారణ నియమావళి ప్రకారం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయని లోకేశ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
నారా లోకేష్కు మళ్లీ సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు కూడా విచారణకు రావాలంటూ ఆయన్ని అధికారులు నోటీసుల్లో కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ నారా లోకేష్ను ఏపీ సీఐడీ అధికారులు 50 దాకా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంటరాగేషన్లో లోకేష్ కీలక అంశాలకు సమాధానం ఇవ్వలేదు. చాలా ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో.. చాలా ప్రశ్నలకు లోకేష్ తెలియదనే సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. చాలా ప్రశ్నలకు ఆయన పదే పదే లాయర్ల దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణలో.. హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్ను అధికారులు ప్రశ్నించగా.. తనకు తెలియదనే ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో.. లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు సీఐడీ అధికారులు చూపించడంతో ఆయన ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారని, కీలక అంశాలపై దాటవేత ధోరణిని ప్రదర్శించారు కాబట్టే.. మరోసారి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్చారన్నది నారా లోకేష్పై ఉన్న ప్రధాన అభియోగం. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, హెరిటేజ్ సంస్థ ఏ6గా, నారా లోకేష్ను ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు తెలిపింది. దీంతో.. ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్ను నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నుంచి స్వల్ప ఊరట పొందిన లోకేష్ను ఇవాళ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. -
హెరిటేజ్ నిర్ణయాలు తనకు తెలియదన్న లోకేశ్
-
సీఐడీ విచారణలో నీళ్లు నములుతున్న నారా లోకేష్
-
సాయంత్రం ఐదు గంటల వరకు సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్
-
నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీస్ క్వాష్ చేయాలన్న పునీత్ పిటిషన్ను కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్ను హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. కొత్త కోణాలు వెలుగులోకి టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్మెంట్లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్మెంట్నే మాస్టర్ప్లాన్లో పొందుపరచాలని షరతు విధించారు. అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు. చదవండి: తోడు దొంగల ‘రింగ్’! -
CID విచారణకు లోకేష్.. అరెస్ట్ చేస్తారా?
-
లోకేష్ కు సీఐడీ ప్రశ్నలు
-
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు...సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్
-
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు లోకేష్
-
నారా లోకేష్కు సీఐడీ ప్రశ్నలు.. IRR అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు?
-
విచారణలో లోకేష్ సీఐడీ 3వ ప్రశ్న
-
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో విచారణకు లోకేష్
-
సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను సీఐడీ ప్రశ్నిస్తోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్ను సీఐడీ విచారించనుంది. ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై లోకేష్ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా నిన్న(సోమవారం) మంగళగిరికి చేరుకున్నారు లోకేష్. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఉదయం 10గంటలకు సీఐడీ ఎదుట నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. కాగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి నారా లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్కు ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఇన్నర్రింగ్ రోడ్ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేష్ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్ను హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లోకేష్ను విచారించవచ్చన్న హైకోర్టు.. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్కు స్పష్టం చేసింది. -
Oct 10th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 07:31PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబు పాపాలు పండాయి ►కేసు క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు ►టెక్నికల్ అంశాలతో చంద్రబాబుకి రిలీఫ్ రాదు ►మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే చంద్రబాబును జైల్లో పెట్టలేదు ►చంద్రబాబు ఏరకమైన దోపిడీకి శ్రీకారం చుట్టాడో అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం ►చంద్రబాబు ప్రమేయం ఉందని తేలాకే అరెస్టు చేశారు ►చంద్రబాబు దోపిడీని కూడా కోర్టులు నమ్మాయి ►ముందస్తు బెయిల్స్ , క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టులు కొట్టేశాయి ►అవినీతి , తప్పు చేయలేదని చంద్రబాబు ఎక్కడా చెప్పడం లేదు ►17ఏ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలనే అంటున్నాడు ►కోట్లు తీసుకునే చంద్రబాబు ఢిల్లీ లాయర్లు కూడా అదే చెబుతున్నారు ►చంద్రబాబు తన జీవితంలో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు ►కేవలం టెక్నికల్ అంశాలను బేస్ చేసుకుని స్టేలు తెచ్చుకుంటాడు ►2016లోనే స్కిల్ స్కామ్ మీద సీఐడీ వాళ్లు ఎఫ్ఐఆర్ వేశారు ►ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆపుకుంటూ వచ్చాడు ►చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించాడు ►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారు ►హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లని భువనేశ్వరి స్వయంగా ప్రజలకు చెప్పారు ►ఒక్క హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్లు బ్లాక్ మార్కెట్ ఉంటుంది ►చంద్రబాబుకు కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్ లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ► వినేవాడుంటే చంద్రబాబు హరికథ ఇంగ్లీష్ లో చెబుతాడు ►ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు ►రెండెకరాల పొలం నుంచి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు ►చంద్రబాబు పాపాలు పండాయి.. ఇప్పుడు బయట పడ్డాయి ►తన 14 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా ►నేను మంచి చేశానని నమ్మితేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి :::మాజీ మంత్రి,కొడాలి నాని కామెంట్స్ 07:03PM, అక్టోబర్ 10, 2023 సీఎం జగన్ ప్రకటించినా.. ఏడుపే: YSRCP ►చంద్రబాబుపై తనకి ఎలాంటి కక్ష లేదన్న సీఎం వైఎస్ జగన్ ►బహిరంగంగా ప్రకటించినా టీడీపీ ఏడుపు ►2019లో చిత్తుగా ఓడిన తర్వాత టీడీపీ, బాబు అంపశయ్యపైకి ► ఎల్లో మీడియా కష్టపడి జాకీలేసి లేపే ప్రయత్నం చేసినా.. అవినీతి బయటపడి మరింత పాతాళంలోకి ►నిజంగా బాబుపై కక్ష సాధించాలనుకుంటే..? అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు ఎదురుచూడాలా..? ► మీ బాబు నిప్పు.. తుప్పు అని ఎగిరెగిరి పడుతున్నారు కదా..? ► మరి.. క్వాష్ పిటీషన్లు వేసి పరువు తీసుకోవడం ఎందుకు? ► నిజాయతీగా విచారణ ఎదుర్కోవచ్చు కదా 06:45PM, అక్టోబర్ 10, 2023 రేపు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును లంచ్మోషన్లో స్వీకరించాలని కోరిన బాబు లాయర్లు ► బాబు బెయిల్ పై వాదనలు వినాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► రేపు రెగ్యులర్ కోర్టులో విచారిస్తామన్న హైకోర్టు ► ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ రేపటికి వాయిదా ► సీఐడీ విచారణలో తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ పిటిషన్ (చదవండి : బాబు సృష్టించిన మాయా ప్రపంచం, కరకట్ట రీఅలైన్మెంట్ పేరిట ఏం జరిగింది?) 06:15PM, అక్టోబర్ 10, 2023 నారాయణ అల్లుడికి హైకోర్టులో దక్కని ఊరట ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్ ► సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని కోరిన పునీత్ ► పునీత్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ► సీఐడీ విచారణకు సహకరించాలన్న హైకోర్టు ► న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశం ► ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునీత్ను ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు 06:25PM, అక్టోబర్ 10, 2023 తప్పు చేయలేదన్న వాదన కాదు, అరెస్ట్ గురించి బాబు బాధ : అంబటి ► చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి అంబటి ► చంద్రబాబు స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారు ► దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయింది ► టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు ► వాదనలు వినిపిస్తున్నారు తప్పు....నేరం చేయలేదని చెప్పడం లేదు ► చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాట ► గతంలో అనేకసార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు ► సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేసింది ► దొంగ అన్ని సార్లు తప్పించుకోలేడని బాబు విషయంలో రుజువైంది ► ఇన్ని రోజులు లోకేష్ ఢిల్లీ ఓపెన్ జైలులో ఉన్నారు ► పురంధేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారు ► పురంధేశ్వరి తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ► చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు ► మంత్రి రోజా బండారు వ్యాఖ్యలను పురంధేశ్వరి ఖండించలేదు ► చంద్రబాబును పార్టీని కాపాడేందుకే పవన్ రాజకీయాలు ► కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ పార్టీ పెట్టారు ► అది జనసేన కాదు బాబు సేన అని ప్రజలు గమనించారు 06:05PM, అక్టోబర్ 10, 2023 జైల్లో ముగిసిన ములాఖత్ ► రాజమండ్రి సెంట్రల్ జైలు :చంద్రబాబుతో ముగిసిన ములాఖత్ ► చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ ► ముందు కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు ► అనంతరం పయ్యావుల కేశవ్తో చంద్రబాబు మంతనాలు ► ఇవ్వాళ సుప్రీంకోర్టులో జరిగిన కేసు పరిణామాలపై చర్చించినట్టు సమాచారం ► జనసేనతో పొత్తు పెట్టుకుంటే పర్యవసనాలపై చర్చ ► ఇటీవల బహిరంగ సభలో తెలుగుదేశం బలహీనపడిందని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ 06:00 PM, అక్టోబర్ 10, 2023 లోకేష్కు ఎందుకంత ఉలుకు : మంత్రి ఆదిమూలపు ► అన్ని ఆధారాలతోనే చంద్రబాబు పై సీఐడీ కేసు పెట్టింది ► కేసులకు భయపడుతున్న లోకేష్ ఇప్పటివరకు ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు ► 20 మంది లాయర్లను పక్కనపెట్టుకుని బెయిల్ కోసం ప్రార్థనలు చేస్తున్నాడు ► IRR, ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ పాత్ర స్పష్టం : మంత్రి ఆదిమూలపు 05:55PM, అక్టోబర్ 10, 2023 పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్ ► జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు జ్వరం ► రేపు జరగాల్సిన జనసేన విస్తృతస్థాయి సమావేశం వాయిదా ► పవన్ కు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ భేటీ వాయిదా వేసిన జనసేన ► రేపటి ఎజెండాలో క్షేత్ర స్థాయిలో టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై జరగాల్సిన చర్చ ► పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయాల్సిన పవన్ కళ్యాణ్ ► త్వరలో మరో తేదీ ప్రకటిస్తామన్న జనసేన నేతలు 05:35PM, అక్టోబర్ 10, 2023 మళ్లీ రేపు రమ్మన్నారు : లోకేష్ ► సీఐడీ అధికారులు నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు : లోకేష్ ► నన్ను 50 ప్రశ్నలు అడిగారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రశ్నించారు ► నాకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధం లేదు ► గూగుల్లో దొరికే సమాచారంపై నన్ను ప్రశ్నించారు ► మళ్లీ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పారు ► సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపించకుండా విచారించారు ► వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా 04:15PM, అక్టోబర్ 10, 2023 నాకేం తెలియదు: నారా లోకేష్ ►సీఐడీ విచారణలో నీళ్లు నములుతున్న నారా లోకేష్ ►అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలియదనే సమాధానం ►హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్ను ప్రశ్నించిన సీఐడీ ►హేరిటేజ్ నిర్ణయాలు తనకు తెలియదని లోకేష్ సమాధానం ►లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు చూపించిన సీఐడీ ►ఖంగుతిని తన లాయర్ల లాయర్ల వద్దకు వెళ్లి ఏం చెప్పాలో తెలుసుకున్న లోకేష్ ►హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్న ►పొంతన లేని సమాధానం చెప్పిన లోకేష్ ►విచారణలో మాటిమాటికి లాయర్ల దగ్గరికి వెళ్లి వస్తున్న లోకేష్ 03:53PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబుతో ములాఖత్ కోసం.. ►చంద్రబాబుతో మలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కుటుంబ సభ్యులు ►భువనేశ్వరి, బ్రాహ్మణిలతో పాటు సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ► 45 నిమిషాల పాటు కొనసాగనున్న ములాఖత్ 02:40PM, అక్టోబర్ 10, 2023 నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కు సీఐడీ నోటీసులు ►హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పునీత్ ►సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ ►పునీత్ పిటిషన్ను డిస్పోజ్ చేసి.. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు 02:29PM, అక్టోబర్ 10, 2023 లంచ్ తర్వాత ప్రారంభమైన లోకేష్ విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ను ప్రశ్నిస్తున్న సీఐడీ ►ఏ14గా నారా లోకేష్ పేరును చేర్చిన సీఐడీ ►ఉదయం మూడు గంటలపాటు విచారించిన సీఐడీ ►ఆన్లైన్మెంట్ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్కు ప్రశ్నలు ►హెరిటేజ్ భూముల కొనుగోలుపైనా ప్రశ్నలు ►భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన విచారణ 02:08PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టు : శుక్రవారం మిగతా వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా ►చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సాల్వే మరో గంట వాదనలు ►అనంతరం కౌంటర్ వాదనలు వినిపించిన CID లాయర్ ముకుల్ రోహత్గీ 1:30 PM, అక్టోబర్ 10, 2023 జైల్లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు ► రాజమండ్రి సెంట్రల్ జైల్కు కుటుంబ సభ్యులు ► మధ్యాహ్నం మూడున్నరకు చంద్రబాబుతో ములాఖత్ ► బాబును కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ► కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ 1:15 PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబు కేసులో ఏం జరగవచ్చు? : నిపుణులు ఏమంటున్నారు? ► ఇరు వర్గాల వాదన భిన్నంగా ఉన్నాయి ► FIR కొట్టేయడానికి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆస్కారం లేదు ► అయితే అవినీతి నిరోధక చట్టంపై విస్తృతంగా పరిశీలన జరపాల్సి రావొచ్చు ► అవసరమయితే ఈ ఒక్క విషయంలో (17a) కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చు.! #CBN challenge to Sec 17A in Supreme Court is likely to be transferred to Constitution Bench which is to hear from Nov 20. Though FIR is unlikely to be quashed, any relief would be for PC Act provisions only. IPC provisions, 409, 468, 471 will continue to stay in FIR. 🙏🙏🙏 — PVS Sarma (@pvssarma) October 10, 2023 1:15 PM, అక్టోబర్ 10, 2023 విజయవాడ : ACB కోర్టులో బాబు కేసులు వాయిదా ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులలో పిటి వారెంట్లపై విచారణ ► రేపటికి వాయిదా వేసిన ACB కోర్టు 1:10 PM, అక్టోబర్ 10, 2023 గుంటూరు జిల్లా : CID కార్యాలయంలో లోకేష్ విచారణ ► సీఐడీ కార్యాలయంలో లోకేష్ను ప్రశ్నించిన అధికారులు ► మధ్యాహ్నం ఒంటిగంటకు నారా లోకేష్కు లంచ్ బ్రేక్ ► గంట పాటు లంచ్ బ్రేక్ ► లోకేష్కు ఇంటి నుంచి భోజనం తెచ్చిన వ్యక్తిగత సిబ్బంది 1:06 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అసలు ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఇలాంటి కేసుల్లో ఎలాంటి రక్షణ లేదని సెక్షన్లు చెబుతున్నాయి ► జస్టిస్ బోస్ : వాదనలకు ఇంకా ఎంత సేపు కావాలి? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక గంట సరిపోతుంది ► జస్టిస్ బోస్ : అయితే మిగతా వాదనలు శుక్రవారం 2గంటలకు వింటాం ► బాబు లాయర్ లూథ్రా : దయచేసి ఈ కేసులో వాదనలను ఇవ్వాళ ముగించండి ► జస్టిస్ బోస్ : ముందే చెప్పాం కదా. మిగతా చాలా కేసులున్నాయి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒకవేళ ఇవ్వాళ సాధ్యం కాదు అనుకుంటే శుక్రవారం వాదనలు వినిపిస్తాం. ► బాబు లాయర్ లూథ్రా : గురువారానికి కేసు వాయిదా వేయండి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : శుక్రవారం లేదా సోమవారం ► బాబు లాయర్ లూథ్రా : మా లాయర్ సాల్వే మరో కేసులో వాదనలు వినిపించేందుకు వెళ్లాడు. ఆయన్ను అడిగి మీకు మధ్యాహ్నం 2గంటలకు చెబుతాను. ► జస్టిస్ బోస్ : సరే కోర్టుకు లంచ్ బ్రేక్ 1:05 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సెక్షన్ 6 ఏం చెబుతుందంటే.. ► జస్టిస్ త్రివేదీ : విచారణ అవసరం లేదంటుంది కదా.! ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అది నిజం లార్డ్షిప్. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశమేమంటే FIR నమోదు అయిందా అన్నది.! 1:02 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : CrPC సెక్షన్ 468 ఏం చెబుతుందంటే.. ఒక వేళ ఒక కేసులో అభియోగాలు మూడేళ్ల జైలు శిక్ష కంటే మించినది అయితే అలాంటి కేసుల్లో దర్యాప్తుకు ఎలాంటి పరిధి ఉండదని స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జరపవచ్చని, ఛార్జ్షీట్ నమోదు చేయవచ్చని చెబుతోంది. 1:00 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సెక్షన్ 13(1)(c) మరియు సెక్షన్ 13(1)(d)లు 2018 సవరణలో తొలగించారు కదా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కళ్ల ముందు కనిపిస్తున్న ఏ నేరంలోనయినా FIR నమోదు చేయకుండా ఏ చట్టం అడ్డంకులు చెప్పలేదు. ఆ సెక్షన్ తొలగించామన్నది దానికి హేతువు కాలేదు. ► జస్టిస్ త్రివేదీ : ఈ విషయంలో మరింత విస్తృతంగా వాదనలు చెప్పండి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ఏం చెప్పిందంటే.. ఒక వ్యక్తి నేరం చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందనుకోండి. చట్టం ఏం చెబుతుందంటే.. కేసు నమోదు చేయమని.! కొన్ని పరిధులు ఉండొచ్చేమో కానీ అడ్డంకులు మాత్రం లేవు. ' (CID లాయర్ రోహత్గీ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్) 12:55 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అసలు చంద్రబాబు కేసులో మెరిట్స్లోకి క్వాష్ పిటిషన్ సమయంలో వెళ్లవచ్చా? అలా వెళ్లకూడదని కోర్టును కోరుతున్నాను. ► ఒక దర్యాప్తు అధికారి అధికారిక విధులేంటీ? ► దర్యాప్తు సంస్థ ముందు ఎలాంటి మార్గదర్శకాలున్నాయి? ► దర్యాప్తు అధికారి ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ► ఈ ప్రశ్నలన్నింటికీ నిర్ణయించాల్సింది తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే. ఇది మౌఖికంగా జరిగే వాదనలను బట్టి కాదు. దర్యాప్తు అధికారి దగ్గర ఏ ఏ సాక్ష్యాధారాలున్నాయన్న బట్టి మాత్రమే కోర్టు నిర్ణయం తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : ఒక వేళ చట్ట సవరణ జరిగిన తర్వాత అసలు ఆ సెక్షన్ను సవరణలో తొలగించిన తర్వాత.. అదే సెక్షన్ కింద FIR నమోదు చేయవచ్చా? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కచ్చితంగా. దానికి వెసులుబాటు ఉంది. దానికొక పరిధి ఉంది. నేరం ఎప్పుడు జరిగిందన్న సమయం పక్కనబెడితే... FIR నమోదు చేయవచ్చు. 12:45 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కేవలం 17a సవరణను అడ్డుపెట్టుకుని ఏమైనా చేయవచ్చా? తప్పు చేసిన ప్రతీ ఒక్కరు 17aను బూచిగా చూపించి ముందస్తు అనుమతి తీసుకురమ్మంటే ఎలా? అసలు ఇదే విధానం అన్ని కేసుల్లో అమలయితే అవినీతి కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఏ అధికారి అయినా ముందుకొస్తాడా? అసలు మన దేశ పార్లమెంట్ విధానమే అవినీతి రహిత దేశం కదా. ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి కదా.! ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17a అండగా ఉండరాదు, ఉండకూడదు. ► జస్టిస్ బోస్ : 17a సవరణలో తెచ్చిన ముందస్తు అనుమతి అన్నది పాత తేదీల్లో జరిగే నేరాలకు వర్తిస్తుందా? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. 17a ఉంది కదా అని పారాచ్యూట్తో గతంలోకి ప్రయాణం చేయగలమా? 12:35 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక చట్ట సవరణను ఎప్పుడు చేయాలి? అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది పార్లమెంట్కు ఉన్న అధికారం. కానీ ఈ కేసులో ముందునుంచే వర్తిస్తుందని పార్లమెంట్ తెచ్చిన సవరణలో లేదు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ అంశానికి సంబంధించి ఒక కీలక విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని సెక్షన్లను 2018లో తొలగించారు. అయితే నేరం 2018కి ముందే జరిగి ఉంటే మాత్రం.. తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. అందువల్ల 2018 కంటే ముందు జరిగిన ఈ నేరంలో సెక్షన్ 17a వర్తించడానికి అవకాశమే లేదు. చంద్రబాబుపై ఈ కేసులో సెక్షన్ 13(1), (c), (d) కింద అభియోగాలున్నాయి ► జస్టిస్ త్రివేదీ : ఆ సెక్షన్లను తొలగించారు కదా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సరిగ్గా ఆ పాయింట్నే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సెక్షన్ 482 ఈ సవాళ్లను నిర్ణయించలేదు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అంతులేని నష్టం వాటిల్లింది. జరిగిన అక్రమాల వల్ల ఖజానా నష్టపోయింది. ► జస్టిస్ త్రివేదీ : ఏ సమయంలో దర్యాప్తు సంస్థ ఈ విషయాలను కనుగొంది? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినపుడు.. ఈ కేసును ఆదిలోనే కొట్టేయాలన్న ఆలోచనే సరికాదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a ఏం చెబుతుందంటే.. ముందస్తు అనుమతి లేకుండా కూడా దర్యాప్తు చేపట్టేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. (సుప్రీంకోర్టు బెంచ్ ముందు CID లాయర్ రోహత్గీ ఉంచిన డాక్యుమెంట్) 12:25 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. 17a అనేది ఇందులో కేవలం ఒక భాగం మాత్రమే. 2018కు ముందు జరిగిన నేరాలన్నింటిలో 2018 కంటే ముందున్న చట్టానికి లోబడి (17a సవరణకు ముందు) దర్యాప్తు జరుగుతాయి. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : 2018 తర్వాత జరిగిన నేరాల్లో మాత్రమే 17a సవరణకు లోబడి దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసును పరిశీలిస్తే.. నేరం 2018కు ముందు జరిగింది, అంటే పాత చట్టం ప్రకారమే దర్యాప్తు జరగాలి, అలాగే జరిగింది కూడా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : మీకు స్పష్టత ఇవ్వడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి మరొకరిని కొట్టాడనుకుందాం. కొట్టిన వ్యక్తిపై సెక్షన్ 323 కింద కేసు నమోదవుతుంది. ఒక వేళ ఏదైనా కారణంతో సెక్షన్ 323 కొట్టేసినంత మాత్రాన.. అ వ్యక్తి మీద ఉన్న అభియోగాలు ఎటూ పోవు. ఆ వ్యక్తి చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందే. కొత్తగా సెక్షన్లలో వచ్చిన సవరణ ఎలాంటి మార్పు తెచ్చిందన్నది కేవలం ప్రయోజనం దృష్ట్యా పరిశీలించాలి కానీ.. సవరణ వచ్చింది కదా అని కేసు పూర్తిగా కొట్టేయాలంటే ఎలా? (చదవండి : చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ను తిరస్కరిస్తూ హైకోర్టు ఏం చెప్పిందంటే..) (సుప్రీంకోర్టు ముందు CID తరపు లాయర్ రోహత్గీ వాదనలు (Right window)) 12:15 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగిస్తే.. మిగతా అభియోగాలన్నీ కేవలం IPC కిందకు వస్తే ఏమవుతుందన్న దానిపై ఇదే కోర్టు నేరుగా ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మీ ముందుంచుతున్నాను. ► A శ్రీనివాసరెడ్డి (2023) కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే : ప్రత్యేక కోర్టుకు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక అధికారాలుంటాయి. అవినీతి నిరోధక చట్టం లేకున్నా.. ప్రత్యేక కోర్టులు IPC కింద నమోదయిన అభియోగాలపై కేసు విచారణ చేపట్టవచ్చు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ కేసులో ఒక వేళ అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగించినా.. మిగతా అభియోగాలపై దర్యాప్తు జరపవచ్చు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో బాబు లాయర్ సాల్వే ఏం చెబుతున్నారంటే.. కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను తొలగిస్తే.. సెక్షన్ 4(3) కింద నమోదు చేసిన అభియోగాలకు అర్హత లేదంటున్నారు? అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి ఏంటీ? ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటీ? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో సెక్షన్ 420 కింద అభియోగాలుంటే.. వాటిని తొలగించలేం. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం PC act ను తొలగించలేం. ► జస్టిస్ త్రివేదీ : అది కేవలం ఒక పరిశీలన మాత్రమే 12:08 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC act తో పాటు ఇండియన్ పెనల్ కోడ్,IPC సెక్షన్లు ఉంటే ఏం చేయాలి? చేసిన నేరం, మోపబడిన అభియోగాలు రెండు సెక్షన్లకు వర్తిస్తే ఏం చేయాలి? ప్రత్యేక కోర్టులో (ACB కోర్టు) ఉన్న న్యాయమూర్తికి ఈ రెండు కేసులను విచారించే పరిధి ఉంటుంది. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక వేళ బాబు లాయర్ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే ఏమవుతుంది? CPC 1973 (2 of 1974) ఏం చెబుతుందంటే, ఒక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏ కేసులోనయినా.. సెక్షన్ 3లో పేర్కొన్న నేరంతో పాటు ఇతర అభియోగాలుంటే వాటిని కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చని చెబుతోంది. ► జస్టిస్ త్రివేదీ : ఒక వేళ బాబు లాయర్ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే సెక్షన్ 4(3) కూడా వర్తించదు కదా ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎప్పుడయితే వేర్వేరు అభియోగాలు ఒకే కేసులో ఉన్నాయో.. అప్పుడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కచ్చితంగా ఆ కేసును పరిశీలించవచ్చు. అలాంటి కేసుల్లో అది అవినీతి నిరోధక చట్టం సెక్షన్ లేకున్నా.. ఆ కేసును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చు. 12:00 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు CID తరపు వాదనలు ప్రారంభం ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అవినీతి నిరోధక చట్టానికి లోబడి ఈ కేసు నమోదయింది. పైగా ఈ కేసులో ఎలాంటి రాజకీయ కక్ష లేదు, 2021లో FIR నమోదయింది. 2023లో లభించిన సాక్ష్యాధారాల మేరకు చంద్రబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : చంద్రబాబు నాయుడు ఎంత బలమైన వ్యక్తి అంటే.. అలా అరెస్ట్ అయ్యారో లేదో.. ఇలా వెంటనే క్వాష్ పిటిషన్ను (కేసునే పూర్తిగా కొట్టేయాలన్న సెక్షన్ 482 కింద స్పెషల్ లీవ్ పిటిషన్)ను ముందుకు తెచ్చారు. కేవలం రెండే రెండు రోజుల్లో క్వాష్ పిటిషన్ హైకోర్టు ముందుకొచ్చింది. అంటే ఈ కేసులో నిందితుడి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకోవాలి. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో న్యాయస్థానం ఏం చెప్పిందంటే.. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నమోదయిన కేసుకు సెక్షన్ 17a లోబడి ఉండదని స్పష్టం చేసింది. 11:45 AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : మేం CID దాఖలు చేసిన FIRను సవాలు చేస్తున్నాం. ► జస్టిస్ త్రివేదీ : అసలు FIR ప్రకారం ఏ ఏ నేరాలున్నాయి? ► బాబు లాయర్ సాల్వే : ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడి ప్రయోజనం పొందాడన్నది ప్రధాన అభియోగం. ► బాబు లాయర్ సాల్వే : చంద్రబాబుపై ఏ ఏ అభియోగాలు ఉన్నాయంటే.. ► IPC S 120B (criminal conspiracy) ► Sec 420 (cheating and dishonestly inducing delivery of property), ► Sec 465 (forgery) ► PC Act Sec12 (punishment for abetment of offences) ► Sec 13 (criminal misconduct by a public servant) ► సాల్వే : ఇందులో అవినీతి నిరోధక చట్టాన్ని తీసేసి చూడలేం. కేసును పూర్తిగా దాని ఆధారంగానే నిర్మించారు PC చట్టాన్ని తీసేస్తే ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఏం చేయలేదు. ఒక వేళ PC చట్టాన్ని తొలగిస్తే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి ఉంటుంది ► జస్టిస్ బోస్ : ఇవన్నీ మేజిస్ట్రేట్ ముందు విచారణ జరగాల్సిన అభియోగాలనే.? ► బాబు లాయర్ సాల్వే : నా మిత్రుడు లూథ్రా చెప్పేదాని బట్టి ఇవన్నీ మేజిస్ట్రేట్ పరిధిలోని కేసులే ► బాబు లాయర్ లూథ్రా : మధ్యప్రదేశ్లో కొందరు సెషన్స్ కోర్టుకు వెళ్తారు, కానీ ► జస్టిస్ త్రివేదీ : దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటుంది, మేజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుంది ► బాబు లాయర్ సాల్వే : ఇంతటితో మా వాదనలు ముగిస్తున్నాం 11:35AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : 2011లో వచ్చి దవీందర్ పాల్ సింగ్ భుల్లర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. అసలు అరెస్ట్ విషయంలోనే సరైన విధానం అనుసరించనప్పుడు, కేసు దర్యాప్తు ఆరంభ సమయంలోనే సరైన పద్ధతి అనుసరించకుండా ఉన్నప్పుడు.. ఆ కేసును మూలాల్లోంచి తొలగించాలని తీర్పు ఇచ్చింది. అంటే కేసును కొట్టేయాలన్న మూల సిద్ధాంతాన్ని ఈ కేసుకు కూడా అమలు చేయాలన్నది నేను బలంగా చెబుతున్న పాయింట్ ► బాబు లాయర్ సాల్వే : ఒకే వ్యక్తి మీద వేర్వేరు అభియోగాలు మోపడం, దాని ప్రభావం ఏంటన్న దానిపై నా దగ్గర మూడు కేసులున్నాయి. ఒక కేసును మీ ముందుంచుతున్నాను. 2019లో వచ్చిన ఎభా అర్జున్ జడేజా కేసు. ► ఎభా అర్జున్ జడేజా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ? : సరైన అనుమతి లేకుండా ప్రారంభించే దర్యాప్తులో FIR నమోదు చేయకూడదని TADA కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. హత్య, అత్యాచారం, స్మగ్లింగ్, నార్కోటిక్స్, పోక్సో యాక్ట్ వంటి సీరియస్ అభియోగాలున్న కేసులను TADA కేసు కారణంగా దర్యాప్తు వాయిదా వేయకూడదు 11:25AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : ఇటీవల రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1)కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూడండి. క్రిమినల్ కేసుల విచారణలో ప్రొసీజిరల్ మార్పులకు సంబంధించి (పాత తేదీల) గతం నుంచే అమలును ఆర్టికల్ 20(1) అడ్డుకోలేదని అయిదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులు ఏం చెబుతున్నాయో చెబుతాను. ► జస్టిస్ బోస్ : ఒకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన విషయంలోనే.. మళ్లీ హైకోర్టు కేసును ఉదహరించనవసరం లేదు. ► బాబు లాయర్ సాల్వే : అయితే రిమాండ్ విషయంలో ముందస్తు అనుమతి అంటే గవర్నర్ అనుమతి కావాల్సిందే అన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. చంద్రబాబు ప్రజా ప్రతినిధి కాబట్టి, CID ముందుగా గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాల్సింది. ఇది స్పష్టం చేయడమే నా ఉద్దేశ్యం. 11:15AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : 1988లో రూపొందిన అవినీతి నిరోధక చట్టాన్ని పరిశీలిస్తే.. దర్యాప్తు అధికారికి ఎలాంటి హక్కులు లేవని చెబుతుంది. దర్యాప్తు అనేది కేవలం ఒక విధి మాత్రమే తప్ప హక్కు కాదని చట్టం చెబుతుంది. 11:10AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు ► జస్టిస్ బోస్ : ఈ కేసులో లంచ్కు ముందే వాదనలు ముగిస్తాం. తర్వాత రెగ్యులర్ కేసులను పరిశీలిస్తాం ► బాబు లాయర్ సాల్వే : 2019లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో యశ్వంత్ సిన్హాపై దాఖలైన కేసులో జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పును చూడండి. (జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే.. రఫేల్ యుద్ధ విమానాల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దర్యాప్తు సంస్థ అయిన CBIని ఆపలేదు. అయితే 17a ప్రకారం దర్యాప్తు సంస్థ ముందస్తు అనుమతులు తీసుకోవాలి) (సుప్రీంకోర్టు ముందు సాల్వే ఉంచిన రఫేల్ కేసు డాక్యుమెంట్) 11:00AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు అధికారి చర్యలకు దిగరాదని చట్టం చెబుతోంది. CID ముందు అనుమతి తీసుకున్న తర్వాతే దర్యాప్తు చేయాల్సింది. ►నిన్న కూడా కోర్టు ముందు సెక్షన్ 17a సవరణ గురించి వాదనల్లో తెలిపాను. ఇది దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే సవరణ తీసుకొచ్చారు. దీని వల్ల అవినీతి నిరోధక చట్టం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నాం ►నేరాలు బయటపడ్డాయని కాదు. CID ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకుని ఆపై విచారణను పునఃప్రారంభించాలి. (కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు, కింది విండోలో వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే) 10:45AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు - విచారణ పద్ధతిపై వేర్వేరు వాదనలు ► జస్టిస్ బోస్ : ఇంకా ఎంత సేపు తీసుకుంటారు సాల్వే ► బాబు లాయర్ సాల్వే : ఇంకా గంట సేపు కావాలి ► CID లాయర్ రోహత్గీ : మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంత సేపు జస్టిస్? ఇది పూర్తిగా బేస్ లేని కేసు, అసలు ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు, నోటీసులు లేకుండా ఎలా అవకాశమిస్తారు? మీరు గంట అవకాశం ఇవ్వాలనుకుంటే గంట తర్వాతే వస్తా. ► జస్టిస్ బోస్ : సెక్షన్ 136A కింద నోటీసులు ఇవ్వలేదు, - హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగా వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం లేదు ► బాబు లాయర్ సాల్వే : ఇదొక క్రిమినల్ కేసు, ఇందులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనవసరం లేదు, రికార్డులు అన్నీ ఉన్నాయి ► CID లాయర్ రోహత్గీ : ఇప్పటివరకు కోర్టు అనుసరిస్తున్న పద్ధతిని ఫాలో అయ్యేలా చూడండి. మొత్తం న్యాయశాస్త్రాన్నే తిరిగి రాస్తానంటే.. మళ్లీ మేం మొదటి నుంచి రావాలి ► జస్టిస్ త్రివేదీ (సాల్వేను ఉద్దేశించి) : ఇదొక ప్రొసీజర్ అయిప్పుడు దీని కింద ఏవైనా హక్కులుంటాయా? ► బాబు లాయర్ సాల్వే : మీరు అవకాశం ఇవ్వండి, నేను రిఫరెన్స్ తీర్పులు మీ ముందుంచుతాను. నిందితుడికి రక్షణ కల్పించిన కేసులు ఉదహరిస్తాను 10:35AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు ► సుప్రీంకోర్టులో మొదలయిన విచారణ ► కేసులో వాదనలు వింటున్న జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ అనిరుధ్ బోస్ ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై బెంచ్ ముందుకు ఇరుపక్షాల లాయర్లు ► నిన్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనలు ► ఇవ్వాళ బెంచ్ ముందు వాదనలు వినిపించనున్న CID లాయర్ ముకుల్ రోహత్గీ 10:15AM, అక్టోబర్ 10, 2023 ►సిట్ కార్యాలయంలో నారా లోకేష్ ► ఐఆర్ఆర్ కేసులో లోకేష్ను విచారిస్తున్న సీఐడీ ►లోకేష్ను ప్రశ్నిస్తున్న విచారణాధికారి జయరామ్రాజు బృందం 10:00AM, అక్టోబర్ 10, 2023 ►కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీ 9:58AM, అక్టోబర్ 10, 2023 ►సిట్ కార్యాలయానికి చేరుకున్న నారా లోకేష్ ►కాసేపట్లో లోకేష్ను ప్రశ్నించనున్న సీఐడీ 9:40AM, అక్టోబర్ 10, 2023 ►సీఐడీ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు లోకేష్ ►సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్ను విచారించనున్న సీఐడీ ►తాడేపల్లి సిట్ కార్యాలయంలో విచారణ 8:50 AM, అక్టోబర్ 10, 2023 జైలులో 31వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 31వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు. ►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. ►చంద్రబాబు ఆరోగ్య రీత్యా జైలు ఆవరణలో నిరంతరం అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య నిపుణుల బృందం. ►హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేతతో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం. ►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ►లోకేశ్ నేడు సీఐడీ ఎదుట హాజరు కానుండటంపై ఎల్లో శ్రేణుల్లో టెన్షన్ 08:06AM, అక్టోబర్ 10, 2023 ►న్యాయ నిపుణులు: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు చాలా సీరియస్. ఈ కేసులో బాబుకి శిక్ష పడే అవకాశం ఉంది. ►అవును.. అక్కడ పుర చేత్తో తండ్రీ కొడుకులు ఇచ్చి, అవతల అత్తా, కోడళ్ళు కుడి చేత్తో తీసుకున్నారు. ►ఇక్కడ తమ ఇంటి కంపెనీకి లాభం వచ్చేట్టు కేబినేట్ నిర్ణయాలు తీసుకున్నారు. ►ఇది ఖచ్చితంగా తండ్రీ కొడుకులకి మాత్రమే కాదు, భువనేశ్వరి, బ్రహ్మణి కూడా ఇరుక్కున్నట్టే. 07:58AM, అక్టోబర్ 10, 2023 ►ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్) కేసులో పునీత్ అనే వ్యక్తికీ ఏపీ సీఐడీ నోటీసులు ►ఈ నెల 11 న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ►సీఐడీ నోటీసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ ►నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు 07:57AM, అక్టోబర్ 10, 2023 టీడీపీ నేత నారాయణకు మరో షాక్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయన భార్య, బావమరదులు ►ఏ - 15గా పొంగూరి రమాదేవి ►ఏ -16గా రావూరి సాంబశివరావు ►ఏ - 17 గా ఆవుల మునిశంకర్ ►ఏసీబీ కోర్టులో సీఐడీ ప్రత్యేక మెమో ముందు ముందు దీపావలీ, దసరా పండుగలన్నీ వీళ్లకే.. 😄😄#YSRCPITWING#KhaidiNo7691 pic.twitter.com/046QDCP2nu — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 10, 2023 7:00 AM, అక్టోబర్ 10, 2023 నేడు చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. ►చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ►నేడు వాదనలు వినిపించనున్న సీఐడీ. ► చంద్రబాబు కేసుపై నిన్న సుదీర్ఘ వాదనలు ► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ► నేడు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ 6:50 AM, అక్టోబర్ 10, 2023 నేడు సిట్ విచారణకు నారా లోకేశ్.. ►ఢిల్లీ నుంచి ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. ఈరోజు ఉదయం సీఐడీ సిట్ విచారణకు హాజరు ►తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ ►మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ ►మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►సీఐడీ నోటీసుల్లోని పలు అంశాలపై ఈనెల 4న కోర్టును ఆశ్రయించిన లోకేష్ ►సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన హైకోర్టు ►విచారణ సమయంలో లోకేష్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశం ►ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ను ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇన్నర్ రింగ్రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ ►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు ► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు. చంద్రబాబు అరెస్ట్పై తొలిసారి స్పందించిన సీఎం జగన్ ► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు ► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే. ► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు ► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ► కేంద్రంలోని ఇన్కంటాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది ► చంద్రబాబుకు నేరుగా ఇన్కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు. ► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు. ► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్కూడా విత్డ్రా చేశాడు. ► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట ► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు వివరాలు.. ► హరీష్ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి ► జస్టిస్ బోస్ : మీ వాదన ప్రకారం ఈ సెక్షన్ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి ► హరీష్ సాల్వే :: అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి.. ► జస్టిస్ బోస్ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్ నిధులను ముందే విడుదల చేశారు ► హరీష్ సాల్వే :నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని. 3:45 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా. ► సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే. 3:25 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ►హరీష్ సాల్వే :ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా? ► జస్టిస్ బోస్ : 17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా. ► హరీష్ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. 3:25 PM, అక్టోబర్ 9, 2023 విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం ► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు ► CID వేసిన కస్టడీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం 3:15 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి. ► జస్టిస్ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు? ► హరీష్ సాల్వే: మా స్నేహితుడు రాజీవ్ ధావన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు. 2:50 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్ విధించిన ఆర్డర్లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు. 2:35 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే: ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్, డిజైన్టెక్, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ► హరీష్ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు ► హరీష్ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్నే పరిగణనలోకి తీసుకోలేదు 2:20 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా? ► CID తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్లోనే ఈ విషయం అంతా ఉంది ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: సెప్టెంబర్ 7, 2021 ► జస్టిస్ బోస్ : దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: డిజైన్ టెక్ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) డిపార్ట్మెంట్ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్కు సంబంధం లేదు. ► జస్టిస్ త్రివేదీ : డిజైన్ టెక్ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2:14 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి ► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది ► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం ► సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం ► పంకజ్ బన్సల్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్ సక్రమం కానప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే ► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్ సమర్పించారు -
బాబుకు నో బెయిల్
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం తీవ్ర నిరాశ మిగిల్చింది. వివిధ కేసుల్లో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఏపీ ఫైబర్గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అంగళ్లు విధ్వంసం కేసులకు సంబంధించి ఆయనకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైబర్గ్రిడ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను.. ఇన్నర్ రింగ్రోడ్డు, అంగళ్లు కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి సోమవారం వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సైతం ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ముందస్తు బెయిల్కు బాబు పిటిషన్.. ఏపీ ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టును టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థకు ప్రాజెక్టు దక్కడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు.. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్తో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేష్రెడ్డి సుదీర్ఘ విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని ఈ నెల 5న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయంతెలిసిందే. ఈ కేసులో సోమవారం ఉదయం జస్టిస్ సురేష్రెడ్డి తన తీర్పును వెలువరించారు. ఆయన ఏమన్నారంటే.. అంతిమంగా నిధులెక్కడికి వెళ్లాయన్నది దర్యాప్తు చేయాలి.. ‘టెరాసాఫ్ట్తో చంద్రబాబుకున్న సంబంధం, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చూపిన శ్రద్ధ తదితర అంశాలకు సంబంధించి సీఐడీ పలు లిఖితపూర్వక ఆధారాలను కోర్టు ముందుంచింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పటి అధికారులను ప్రభావితం చేశారు. ఎలాంటి విధి విధానాలను పాటించకుండా, ఎలాంటి పరిశీలన చేయకుండానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేశారు. అలాగే, టెరాసాఫ్ట్కు అనుకూలంగా వ్యవహరించని అధికారులను మార్చడానికి సంబంధించిన ఆధారాలను.. టెరాసాఫ్ట్ను బ్లాక్లిస్ట్ నుంచి తొలగించడం, టెండర్ గడువు తేదీని పొడిగించడం వంటి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించింది. రూ.330 కోట్ల విలువ చేసే ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన నోట్ఫైళ్లలో ఎలాంటి అభ్యంతరాలను, ప్రతికూల అభిప్రాయాలను రాయవద్దని చంద్రబాబు తనకు సూచించారంటూ అప్పటి ఎనర్జీ డిపార్ట్మెంట్ కార్యదర్శి నుంచి వాంగ్మూలాన్ని కూడా సీఐడీ సేకరించింది. అలాగే, టెరాసాఫ్ట్ను బ్లాక్లిస్ట్ నుంచి తొలగించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తనకు చెప్పారంటూ అప్పటి పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్నీ సీఐడీ ఈ కోర్టు ముందుంచింది. అంతేకాక.. వేమూరి హరికృష్ణ ప్రసాద్, అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (ఇన్క్యాప్) మాజీ ఎండీ కె. సాంబశివరావులతో కలిసి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. సాంబశివరావు చేసిన ప్రతిపాదన మేరకు హరికృష్ణ ప్రసాద్ను టెండర్ కమిటీ సభ్యునిగా నియమించారు. నిబంధనలకు, చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ఆమోదించారు. కానీ కేసు నమోదు చేసిన రెండేళ్లకు చంద్రబాబును నిందితునిగా చేర్చారని.. ఇప్పుడు నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయని సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు సాధ్యం కాదు.. ఇలాంటి కేసుల్లో దర్యాప్తునకు పట్టే సమయాన్ని, సీఐడీ సేకరించిన ప్రాథమిక ఆధారాలను, ఈ కేసుతో ముడిపడి ఉన్న పలువురు సాక్షులను గత నెల 14న విచారించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయన్న వాదనలో ఎలాంటి బలం ఈ కోర్టుకు కనిపించడంలేదు. విస్తత ప్రజా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కేసులో నేర తీవ్రతను, టెరాసాఫ్ట్కు చంద్రబాబు రూ.114.53 కోట్ల మేర ఆయాచిత లబ్ధిచేకూర్చారన్న ఆరోపణలను, తద్వారా ఖజానాకు నష్టం కలిగించిన విషయాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అందువల్ల ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదు. అంతిమంగా నిధులు ఎక్కడికి వెళ్లాయన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ దశలో దర్యాప్తునకు ఎలాంటి భంగం కలగరాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు పిటిషన్ను కొట్టేస్తున్నా’.. అని జస్టిస్ సురేష్రెడ్డి తన తీర్పు చెప్పారు. -
‘ఇన్నర్’లోనూ చుక్కెదురు
సాక్షి, అమరావతి :ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రో కోకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏ–1 నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా తాను కస్టడీలోనే ఉన్నట్లు (డీమ్డ్ కస్టడీ) భావించాలన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు రెండూ వేర్వేరు కేసులని, రెండూ కూడా వేర్వేరు లావాదేవీలకు సంబంధించినవని, రెండు కేసుల్లో దర్యాప్తు అధికారులూ వేర్వేరని, విచారించిన సాక్షులు, సేకరించిన సాక్ష్యాలు కూడా వేర్వేరని హైకోర్టు స్పష్టంచేసింది. అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీలో ఉన్నట్లు (డీమ్డ్) భావించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంగానీ, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయడంగానీ జరగలేదని, అందువల్ల ఆయన బెయిల్కు అర్హులుకాదని స్పష్టంచేసింది. చంద్రబాబు వాదనలో బలంలేదు 2022లో నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు తనను అరెస్టుచేయకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, తనను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఇలా చేస్తున్నారంటూ చంద్రబాబు వాదనలో ఎలాంటి బలంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని, ఇదే కేసులో ఏ–2 నుంచి ఏ–5 వరకు నిందితులు ముందస్తు బెయిళ్లు కూడా పొందారని న్యాయస్థానం గుర్తుచేసింది. ముందస్తు బెయిల్ విషయంలో చంద్రబాబు ఇన్నేళ్లు నిద్రపోయి, ఇప్పుడు పోలీసులను నిందిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. స్కిల్ కేసులో అరెస్టుచేసిన మరుసటిరోజే చంద్రబాబును ఇన్నర్ కేసులో కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ సీఐడీ సీఆర్పీసీ సెక్షన్–267 కింద సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని గుర్తుచేసింది. అలాగే, ఈ బెయిల్ పిటిషన్ను తన సరెండర్ పిటిషన్గా భావించి, తనకు బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు అభ్యర్థనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అలాగే, ఇన్నర్ కేసులో హైకోర్టు ముందు చంద్రబాబు భౌతిక హాజరుగానీ, వాస్తవిక లొంగుబాటు గానీ సాధ్యంకాదని, తన పిటిషన్లో చంద్రబాబు ఎక్కడా కూడా తాను హైకోర్టు ముందు లొంగిపోయేందుకు అనుమతినివ్వాలని కూడా కోరలేదని తెలిపింది. అలాంటి అభ్యర్థన ఏదీ లేనప్పుడు, ఈ పిటిషన్ను సరెండర్ పిటిషన్గా భావించలేమని తేల్చిచెప్పింది. అలాగే, బెయిల్ విషయంలో ఆ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోలేమని కూడా స్పష్టంచేసింది. అంతేకాక.. ఒకవేళ కోర్టు స్కిల్ కేసులో తన కస్టడీని ఇన్నర్ కేసులో డీమ్డ్ కస్టడీగా భావించని పక్షంలో, తాను దాఖలు చేసిన ఈ పిటిషన్ను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పరిగణించి, ముందస్తు బెయిల్ మంజూరు విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి ఏ మాత్రం వెళ్లడంలేదని, కేవలం డీమ్డ్ కస్టడీ అంశానికే పరిమితం అవుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి సోమవారం 24 పేజీల తీర్పును వెలువరించారు. క్విడ్ ప్రో కో పై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అలాగే క్విడ్ ప్రో కో కూడా జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. లింగమనేని రమేష్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ సంస్థలకు లబ్ధిచేకూర్చారని ఆరోపించింది. ఈ లబ్ధికి ప్రతిఫలంగా కరకట్ట వద్ద ఉన్న ఇంటిని లింగమనేని రమేష్ చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇక ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ప్రమోద్కుమార్ దూబే, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. మరో నలుగురి పేర్లను చేర్చిన ఏసీబీ
-
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితులుగా చేర్చింది దర్యాప్తు సంస్థ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(AP CID). సోమవారం నలుగురి పేర్లను చేరుస్తూ.. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య), ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు), వరుణ్ కుమార్ కొత్తాపు పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసింది సీఐడీ. క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ.. సెక్షన్ 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ పీసీ యాక్ట్ గా కేసు నమోదు చేసింది కూడా. ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఏ14గా ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా ఆవుల మణిశంకర్, ఏ-18గా ప్రమీల, వరుణ్కుమార్ కొత్తాపును ఏ19గా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్కు, నారాయణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏ1 చంద్రబాబు పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: నారా-నారాయణ దోపిడీ.. ఇలా.. -
ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్లు కేసుల్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ
-
Chandrababu: చంద్రబాబుకు మరో బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు దాడుల కేసు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు దాడులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు దాడుల కేసులో బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఫైబర్ నెట్ కేసు ఇదే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా.. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్మెంట్ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇది కూడా చదవండి: బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు ఇది కూడా చదవండి: తోడు దొంగల ‘రింగ్’! అంగళ్లు కేసు ఇదే.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: ‘అంగళ్లు’ దాడుల కేసులో ఎ1గా చంద్రబాబు -
తండ్రి కొడుకుల కొత్త బాగోతం..వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు..
-
Oct 9th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 08:34 PM, అక్టోబర్ 9, 2023 గన్నవరం బయల్దేరిన నారా లోకేష్ ►ఢిల్లీ నుంచి మళ్లీ ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ► ఢిల్లీ విమానాశ్రయం నుండి గన్నవరం పయనం ►లోకేష్కి వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు ►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. రేపు ఉదయం సిట్ విచారణకు హాజరు ► మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇన్నర్ రింగ్రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ ►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు ► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు 5:35 PM, అక్టోబర్ 9, 2023 చంద్రబాబు అరెస్ట్పై తొలిసారి స్పందించిన సీఎం జగన్ ► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు ► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే. ► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు ► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ► కేంద్రంలోని ఇన్కంటాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది ► చంద్రబాబుకు నేరుగా ఇన్కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు. ► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు. ► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్కూడా విత్డ్రా చేశాడు. ► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట ► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం. ప్రజామోదం లేని చంద్రబాబు జనంలో ఉన్నా జైల్లో ఉన్నా ఒక్కటే. ఆయన రాజకీయ జీవితం మొత్తం మోసం, వెన్నుపోటు, అబద్ధాలే ఉంటాయి. - సీఎం వైయస్ జగన్#GajaDongaChandrababu#SkilledCriminalCBNInJail #KhaidiNo7691 #CorruptBabuNaidu pic.twitter.com/TqkEIaLJSe — YSR Congress Party (@YSRCParty) October 9, 2023 5:25 PM, అక్టోబర్ 9, 2023 దోచుకోవడం, పంచుకోవడం.. ఇవే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం : సీఎం జగన్ ► ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి ► వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే. ► ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే. ► ఒకరైతే రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. చంద్రబాబును మోయడమే ఆయన పని. ► ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేరు ► చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఈయన పార్టనర్. మోసాలు చేయడంలో పార్టనర్. ► బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం.. ► ఇంత ఈనాడుకు, ఇంత టీవీ5 కు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత దత్తపుత్రుడికి ► దోచుకోవడం.. పంచుకోవడం.. ఇదే వీరికి తెలిసింది ► చంద్రబాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందకుండా వ్యతికేకించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టే. ► ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమే. బాబుని సమర్ధించడం అంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయడమే.. పేదలకు ఇళ్ల స్థలాలను వ్యతిరేకించడమే... ఇటువంటి పచ్చముఠా దుర్మార్గాలను ప్రజలకు మనం వివరించాలి. - సీఎం వైయస్ జగన్#JaganannaOnceMore pic.twitter.com/cUOCGMWYiz — YSR Congress Party (@YSRCParty) October 9, 2023 4:45 PM, అక్టోబర్ 9, 2023 బాబు కస్టడీ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న CID ► విజయవాడలో మాట్లాడిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► హైకోర్టులో చంద్రబాబు వేసిన 3 బెయిల్ పిటీషన్ లు కొట్టేశారు ► ACB కోర్టు బెయిల్, కస్టడీ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులపై వాదనలు జరుగుతున్నాయి ► రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ చంద్రబాబు తరపున వేశారు ► కోర్టులో న్యాయమూర్తి కూడా వారి వాదనలు విన్నారు ► రేపు మధ్యాహ్నం న్యాయమూర్తి దీనిపై ఆదేశాలు జారీ చేస్తారు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నాం 4:35 PM, అక్టోబర్ 9, 2023 ACB కోర్టులో PT వారెంట్లపై రేపు వాదనలు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా ► రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టిన బాబు తరపు లాయర్లు ► ఫైబర్ నెట్, IRR కేసుల్లో చంద్రబాబు పై పెండింగులో ఉన్న పీటీ వారెంట్లు ► పీటీ వారెంట్ల పై వాదనలు అవసరం లేదని కోర్టును కోరిన CID న్యాయవాది వివేకా ► కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని తెలిపిన CID న్యాయవాది వివేకా ► పీటీ వారెంట్లపై వాదనలు వినిపిస్తామన్న చంద్రబాబు లాయర్లు పోసాని, గింజుపల్లి ► పీటీ వారెంట్లు, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 4:05 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు రేపటికి వాయిదా ► చంద్రబాబు కేసుపై ఇవ్వాళ సుదీర్ఘ వాదనలు ► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ► రేపు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ 3:55 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి ► జస్టిస్ బోస్ : మీ వాదన ప్రకారం ఈ సెక్షన్ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి ► హరీష్ సాల్వే : అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి.. ► జస్టిస్ బోస్ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్ నిధులను ముందే విడుదల చేశారు ► హరీష్ సాల్వే : నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని. 3:45 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా. ► సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే. 3:25 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా? ► జస్టిస్ బోసు : 17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా. ► హరీష్ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. 3:25 PM, అక్టోబర్ 9, 2023 విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం ► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు ► CID వేసిన కస్టడీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం 3:15 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి. ► జస్టిస్ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు? ► హరీష్ సాల్వే : మా స్నేహితుడు రాజీవ్ ధావన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు. 2:50 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్ విధించిన ఆర్డర్లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు. 2:35 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్, డిజైన్టెక్, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. ► జస్టిస్ బోసు : ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ► హరీష్ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు ► హరీష్ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్నే పరిగణనలోకి తీసుకోలేదు 2:20 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా? ► CID తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్లోనే ఈ విషయం అంతా ఉంది ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: సెప్టెంబర్ 7, 2021 ► జస్టిస్ బోస్ : దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: డిజైన్ టెక్ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) డిపార్ట్మెంట్ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్కు సంబంధం లేదు. ► జస్టిస్ త్రివేదీ : డిజైన్ టెక్ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2:14 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి ► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది ► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం ► సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం ► పంకజ్ బన్సల్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్ సక్రమం కానప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే ► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్ సమర్పించారు 2:10 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► ప్రారంభం అయిన విచారణ ► బెంచ్ మీదకు న్యాయమూర్తులు ► వాదనలు ప్రారంభించిన హరీష్ సాల్వే 1:45 PM, అక్టోబర్ 9, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డులో కీలక పరిణామం ► ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో నిందితులుగా మరో నలుగురి పేర్లు చేరుస్తూ ACB కోర్టులో మెమో దాఖలు చేసిన సిఐడి ► క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే FIR నమోదు ► సెక్షన్లు 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ PC యాక్ట్ గా కేసు నమోదు ► ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య) ► రమాదేవి( మాజీ మంత్రి నారాయణ) ► ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు) ► రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు) ► పై పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసిన CID 12:54 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు మ.2గంటలకు వాయిదా ► బాబు లాయర్ సాల్వే : కానీ 2018కు ముందు దర్యాప్తు జరిగిందన్న డాక్యుమెంట్ ప్రభుత్వం సమర్పించలేదు. రిమాండ్ విధించిన ACB కోర్టు ముందు కూడా సమర్పించలేదు ► జస్టిస్ త్రివేదీ : మీరు ACB కోర్టు విధించిన రిమాండ్ను సవాలు చేస్తున్నారా? ► బాబు లాయర్ సాల్వే : అవును, ACB కోర్టు రిమాండ్ను సవాలు చేస్తున్నాం. CID సమర్పించిన డాక్యుమెంట్ ద్వారానే దర్యాప్తు మొదలయిందని చెప్పి ఉంటే, లేదా దాని ద్వారానే FIR నమోదయిందని ఉంటే ఈ డాక్యుమెంట్ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక SOP (Standarad operating procedure) విడుదల చేసింది. కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఆ SOP చెబుతోంది. ► జస్టిస్ త్రివేదీ & జస్టిస్ బోస్ : సరే ఆ విషయం లంచ్ తర్వాత పరిశీలిస్తాం, కేసు మధ్యాహ్నం 2గంటలకు పరిశీలిస్తాం 12:44 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు ► బాబు లాయర్ సాల్వే : సెప్టెంబర్ 19న పిటిషన్ దాఖలు చేశాం, 2021లో FIR నమోదయిందని పేర్కొన్నాం ► ఈ కేసులో సెక్షన్ 17a సవరణ వర్తిస్తుందని చెప్పాం, 1959 SCR 191 ప్రకారం ఈ కేసుకు ఇది వర్తిస్తుంది ► జస్టిస్ త్రివేదీ : కానీ ఈ కేసులో దర్యాప్తు 2018కి ముందే (అంటే 17A సవరణకు ముందే) మొదలయిందని రోహత్గీ చెప్పారు కదా (సుప్రీంకోర్టు : బెంచ్ జస్టిస్ త్రివేదీ, జస్టిస్ బోస్ బెంచ్ ముందు CID తరపున రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, మనుషేక్ సింగ్ సింఘ్వీ) 12:39 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో పునః ప్రారంభమైన వాదనలు ► CID తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ ► చంద్రబాబు తరపున హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థలూథ్రా ► జస్టిస్ త్రివేదీ : గత విచారణ సందర్భంగా సాల్వే వర్చువల్గా హజరయ్యారు. హఠాత్తుగా కేసు విచారణకు సంబంధించిన వర్చువల్ లింకు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తప్పుకున్నారు ► బాబు లాయర్ సాల్వే : దానికి నా క్షమాపణలు, మిగతా లాయర్లు ఉన్నారు కదా అని నేను తప్పుకున్నాను ► జస్టిస్ త్రివేదీ : అదెలా కుదురుతుంది? జస్టిస్ బోసు కూడా అదే అనుకున్నారు 12:36 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఏం జరిగింది? చంద్రబాబు తరపున ఏం విజ్ఞప్తి చేశారు? కోర్టు ఏమని చెప్పింది? ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై అక్టోబర్ 3, 2023న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ► బాబు నేరం చేశారా? లేదా? అనే వాదనల జోలికెళ్లని ఆయన లాయర్లు ► గవర్నరు అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదని వాదన ► అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం అనుమతి తప్పనిసరి ► కాబట్టి ఈ అరెస్టు చెల్లదు.. కేసును క్వాష్ చేయండంటూ బాబు లాయర్ల వాదనలు ► బాబు తరఫున వాదించిన హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ ► ఎంతమంది సీనియర్లు బాబు తరఫున వాదిస్తారని అడిగిన ధర్మాసనం ► 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)కు సవరణ ► ఆ తర్వాత జరిగిన నేరాలకే 17ఏ వర్తిస్తుందన్న సీఐడీ న్యాయవాది రోహత్గీ ► స్కిల్ కుంభకోణం 2015–16 మధ్య జరిగిందని వెల్లడి ► విచారణ కూడా 2018కి ముందే ప్రారంభమయిందని వివరణ ► మరి 17ఏ ఎలా వర్తిస్తుందని బాబు లాయర్లను ప్రశ్నించిన కోర్టు ► దీనికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని సీఐడీకి ఆదేశం (చదవండి : అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ఏం చెప్పింది.. పూర్తి కథనం) 12:35 PM, అక్టోబర్ 9, 2023 కాసేపట్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు కీలక విచారణ ► స్కిల్ స్కామ్ కేసులో తనపై దాఖలైన FIRను కొట్టివేయాలని పిటిషన్ ► విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ► అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A సవరణ తనకు వర్తిస్తుందని బాబు పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని వాదనలు ► అవినీతి నిరోధక చట్ట 17A సవరణ రాకముందే, స్కిల్ స్కాంలో దర్యాప్తు ప్రారంభమైందని ప్రభుత్వ వాదన ► చంద్రబాబు కేసుకు 17A వర్తించదని ప్రభుత్వ వాదన 11:55AM, అక్టోబర్ 9, 2023 విజయవాడ ACB కోర్టులో కీలక అంశాలు ► లంచ్ తర్వాత చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై తీర్పు ► లంచ్ తర్వాత రెండు PT వారెంట్లపై విచారణ ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపై లంచ్ అనంతరం ఇరుపక్షాల వాదనలు విననున్న ACB కోర్టు ► PT వారంట్ అంటే Prisoner in Transit ► అంటే ఇప్పటికే ఒక కేసులో అరెస్టయి జైల్లో ఉన్న నిందితుడిని మరో కేసులోనూ విచారణ చేపట్టేందుకు వీలుగా వేసే వారంట్ 11:25AM, అక్టోబర్ 9, 2023 ఏ కేసులో చంద్రబాబు పరిస్థితి ఏంటీ? ► స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాల కేసు : ►కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్న చంద్రబాబు ►నేడు సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ►విజయవాడ ACB కోర్టులో CID వేసిన కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు ►విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు ►ఈ మధ్యాహ్నం కస్టడీ, బెయిల్పై ACB కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ► అంగళ్లు అల్లర్లు కేసు : ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట అక్రమాలకు పాల్పడిన కేసు : ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు ► ఫైబర్గ్రిడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసు : ►అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు ► చంద్రబాబును కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ 11:05AM, అక్టోబర్ 9, 2023 కిం కర్తవ్యం.? ► కాసేపట్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ ► విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ► సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో లాయర్లతో లోకేష్ సమావేశం ► చంద్రబాబు తరఫున మరోసారి నేరుగా రంగంలోకి హేమాహేమీలు ► ఇవ్వాళ కోర్టుకు నేరుగా హరీష్ సాల్వే వస్తాడని టిడిపి వర్గాల ప్రచారం ► ఇప్పటివరకు వర్చువల్గా మాత్రమే విచారణకు హాజరయిన సాల్వే ► హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థలూథ్రా 10:55AM, అక్టోబర్ 9, 2023 పార్టీని తాకట్టు పెట్టేందుకు రెడీ.! ►ఢిల్లీలో పార్టీతో వ్యాపారం చేస్తోన్న చినబాబు : ఎంపీ విజయసాయిరెడ్డి ►పార్టీని విలీనం చేస్తా, కాపాడాలంటూ ఆఫర్లు మరో పదేళ్ల దాకా విముక్తి దొరకని డజనుకు పైగా స్కాముల నుంచి బయట పడేస్తే తమ పార్టీని బిజెపిలో విలీనం చేస్తానని ఎల్లో మీడియా ముఖ్యుల ద్వారా కాళ్ల బేరానికి వెళ్లినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 6 లక్షల కోట్లు పోగేశాడు. అనుభవించింది లేదు. బయటికొస్తే చాలు, బలుసాకు… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2023 10:43AM, అక్టోబర్ 9, 2023 బాబు బెయిల్ పిటిషన్ తిరస్కృతి ►చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ ►చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు ►ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ►ఇన్నర్రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేత (చదవండి : అంగళ్లు అల్లర్ల కేసు పూర్వపరాలేంటీ?) (చదవండి : ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట బాబు సృష్టించిన మాయా ప్రపంచమేంటీ?)9:43 AM, అక్టోబర్ 9, 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు ప్రచారం ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు ►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్ ►ఎన్టీఆర్ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్ 9:30 AM, అక్టోబర్ 9, 2023 జైలు వద్ద నిరంతర భద్రత.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 30వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►విస్తృతమైన భద్రత ఏర్పాట్ల మధ్య జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►జైలు బయట 300 మంది పోలీసులతో నిరంతర భద్రత ►ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ►చంద్రబాబు కోసం జైలు ఆవరణలో నిరంతరం సన్నద్ధంగా ప్రత్యేక వైద్య బృందం 9:15 AM, అక్టోబర్ 9, 2023 చంద్రబాబుకు విజయసాయి కౌంటర్.. చంద్రబాబు కోసం దేశంలోని టాప్ 10 లాయర్లు, వారిలో నలుగురు బ్యాటరీ ఆఫ్ అడ్వొకేట్స్తో మూడు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడుపుతున్నారు. చట్టం అందరికీ ఒకటి కాదా? చంద్రబాబు గారి కోసం దేశంలోని టాప్ 10 లాయర్లలో నలుగురు, వారి బ్యాటరీ ఆఫ్ అడ్వొకేట్స్ తో మూడు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడుపుతున్నారు. అన్యాయంగా ఎలా అరెస్టు చేశారు? చిన్నపాటి స్కాంకు ప్రపంచస్థాయి నాయకుడిని లోపల వేస్తారా? అంటూ సామాజికవర్గ ప్రముఖులు ఆర్తనాదాలు చేస్తున్నారు. చట్టం… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2023 9:00 AM, అక్టోబర్ 9, 2023 వాడకమంటే చంద్రబాబుదే.. ►సినిమా వాళ్లనే వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట ►అవసరం తీరాక కరివేపాకులా తీసిపడేస్తాడు. మీరే చూడండి @ncbn సినిమా వాళ్ళని ఎలా వాడుకుంటాడు తరవాత కరివేపాకు లా పాడేస్తాడు అనే దానికి @PawanKalyan మినహాయింపు కాదు చిరంజీవి సభలకు ఎక్కువ జనం వస్తున్నారు అని విలేకరి అడిగితే మా బావమరిది కొడుకు @tarak9999 కి అంతకంటే 3రెట్లు జనాలు వస్తున్నారు అన్నాడు..తర్వాత కరివేపాకులా!😔 pic.twitter.com/FCSpT2KU8D — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 8, 2023 7:30 AM, అక్టోబర్ 9, 2023 జైలులో నేటికి నెల.. ►చంద్రబాబు జైలుకి వెళ్లి నేటికి 30 రోజులు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ ►ఇంటి నుంచే చంద్రబాబు మందులు, భోజనం 7:10 AM, అక్టోబర్ 9, 2023 5 కేసుల్లో నేడు తీర్పు వచ్చే అవకాశం, క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ ►1. బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ►2. సీఐడీ కస్టడీ పిటిషన్-ఏసీబీ కోర్టు తీర్పు ►3. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు ►4.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు ►5. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు ►టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్కు నెల రోజులు - గత నెల 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ 7:00 AM, అక్టోబర్ 9, 2023 అందరి దృష్టి కోర్టుల వైపే ►టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించిన కేసుల్లో సోమవారం కీలకం కానుంది. ►దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు వెలువడనున్నాయి. ►స్కిల్ స్కాంకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరుగనుంది. ►ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ►పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పై సైతం ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ►రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. 6:55AM, అక్టోబర్ 9, 2023 ఐటమ్ 59గా చంద్రబాబు పిటిషన్.. ►జస్టిస్ అనిరుద్దాబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ ►ఆరవ నంబర్ కోర్టులో ఐటమ్ 59గా ఈ పిటిషన్ను జాబితాలో చేర్చారు. ►గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 6:50 AM, అక్టోబర్ 9, 2023 హైకోర్టులో కూడా నేడు తీర్పులు.. ►హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై నేడు తీర్పులు వెల్లడికానున్నాయి. ►రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరు పిటిషన్లు దాఖు ►ఈ కేసులో వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పులను రిజర్వు చేసింది. ►ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు. 6:30 AM, అక్టోబర్ 9, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 6:20 AM, అక్టోబర్ 9, 2023 పత్తా లేని చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల’ ► పక్కా ప్లాన్ తో పరారీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల ►శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఈమెయిల్ ద్వారా నోటీసు పంపిన ప్రభుత్వం ►చంద్రబాబు చేసిన అక్రమ దందాల లెక్కలన్నీ పెండ్యాల హ్యండిల్ చేసినట్టు ఆధారాలు ►ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది పెండ్యాలకే ►పెండ్యాల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి చంద్రబాబు సృష్టించిన బ్లాక్ మనీ రూ.2వేల కోట్లు ►లెక్కలు లేని రూ.2వేల కోట్లకు సంబంధించిన వివరాలివ్వాలని చంద్రబాబును అడిగిన ఐటీ -
10న సీఐడీ ముందుకు నారా లోకేశ్..
సాక్షి, అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్ను హైకోర్టు ఆదేశించింది. సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్కు స్పష్టం చేసింది. ఇదే కేసులో బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, లేదంటే ఇంటివద్దే తనను విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది. కనిపించేంత దూరంలో న్యాయవాది ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో నారా లోకేశ్ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, దీన్ని అడ్డం పెట్టుకుని సాగించిన భూ దోపిడీ కేసులో నారా లోకేష్ను 14 నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 4న తమ ముందు హాజరు కావాలంటూ ఇటీవల సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు వచ్చే సమయంలో హెరిటేజ్ భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను తేవాలని పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ మంగళవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ తరఫున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ హెరిటేజ్లో లోకేష్ ఓ వాటాదారు మాత్రమేనన్నారు. హెరిటేజ్కు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు తెలిసే అవకాశం లేదన్నారు. ఆ డాక్యుమెంట్లను ఇవ్వలేదన్న కారణంతో లోకేష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.దుష్యంత్రెడ్డి, స్పెషల్ పీపీ శివ కల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ నిర్దిష్టంగా ఫలానా డాక్యుమెంట్లు తేవాలని ఒత్తిడి చేయబోమన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇతర నిందితులతో కలిపి లోకేశ్ను కూడా విచారించాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 10న సీఐడీ ముందు హాజరు కావాలని లోకేశ్ను ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రింగ్ రోడ్డు కేసులో బాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, తదనుగుణంగా సాగిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వివరాలన్నీ ఆయా ఫైళ్లలో భద్రంగా ఉన్నాయన్నారు. అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగనప్పుడు అవకతవకలకు ఆస్కారం ఎక్కడ ఉందన్నారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు మరో కేసులో అరెస్టై జుడీషయల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఆయన అరెస్టయినట్లు (డీమ్డ్) భావించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదన సరికాదన్నారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే ముందు సరెంట్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ పని చేయకుండా డీమ్డ్ అరెస్ట్ పేరుతో నేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాజ్యానికి అసలు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు పిటిషన్ను కొట్టి వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 41 ఏ నోటీసును రద్దు చేయండి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందితుడైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ తన వాంగ్మూలాలను నమోదు చేయడం తప్పనిసరి అని దర్యాప్తు అధికారి భావిస్తే తన ఇంటి వద్దనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విచారణ సమయంలో న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, పలు మేజర్ సర్జరీలు కూడా జరిగాయని పిటిషన్లో నారాయణ పేర్కొన్నారు. డాక్టర్లు తనను ఇంటి వద్దే ఉండాలని సలహా ఇచ్చారన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
తోడు దొంగల ‘రింగ్’!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది. తమ భూముల ధరలు భారీగా పెరిగేలా.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్మెంట్లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్మెంట్నే మాస్టర్ప్లాన్లో పొందుపరచాలని షరతు విధించారు. అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు. నారాయణ హెచ్చరికలతో.. వాస్తవానికి సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లాలోని పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప నుంచి ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్రింగ్ రోడ్డు కొనసాగాలి. అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్మెంట్పై సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్మెంట్ మార్చాలని ఆదేశించారు. దీంతో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దాని ప్రకారం గుంటూరు జిల్లాలోని రామచంద్రాపురం – కృష్ణా జిల్లాలోని చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని వెళ్లేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఏడాది ముందుగానే లే అవుట్లకు ‘నో’ అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను అధికారికంగా ప్రకటించటానికి ఏడాది ముందు నుంచే ఆ ప్రాంతంలో లే అవుట్లకు సీఆర్డీఏ అనుమతులను తిరస్కరించడం గమనార్హం. అంటే అలైన్మెంట్ మార్పుపై పక్కా సమాచారంతోనే ఈ వ్యవహారం సాగినట్లు స్పష్టమవుతోంది. అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుందని తెలియని సాధారణ వ్యక్తులు, పలువురు ప్రైవేట్ రియల్టర్లు లే అవుట్ల కోసం సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రధాన కార్యాలయాల భవనాలను నిర్మించేందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆ లే అవుట్లు, భవన నిర్మాణాల దరఖాస్తులను సీఆర్డీఏ తిరస్కరించింది. అప్పటికి ఆ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా అమరావతి మాస్టర్ప్లాన్ కూడా ఖరారు లేదు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అనుమతులను టీడీపీ సర్కారు తిరస్కరించింది. వ్యవసాయ భూముల వినియోగ మార్పిడి ద్వారా లే అవుట్ల కోసం అందిన 29 దరఖాస్తులతోపాటు ప్రతిపాదిత రింగు రోడ్డుకు చేరువలోని 70 లే అవుట్లకు అనుమతులను తిరస్కరించినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భవన నిర్మాణ అనుమతులను సైతం తిరస్కరించారు. అంటే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అలైన్మెంట్పై ముందుగానే కచ్చితమైన సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ‘రింగు’ కోసం బైపాస్కు బైబై.. తమ భూముల ధరలు పెరిగితే చాలు.. ప్రజా ప్రయోజనాలు తమకు ఏమాత్రం పట్టవని చంద్రబాబు, నారాయణ ద్వయం నిరూపించింది. విజయవాడ నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ చెన్నై–కోల్కత్తా జాతీయ రహదారిపై ప్రయాణాన్ని మరింత సరళతరం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ ప్రణాళికను ఖరారు చేశారు. గుండుగొలను నుంచి విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి కృష్ణా నది మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్ను నిర్మించాలని నిర్ణయించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మించే ఈ రహదారి కోసం భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత ఎన్హెచ్ఏఐ పనులు ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం అందుకు ఏమాత్రం సహకరించ లేదు. విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం పూర్తయితే ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాల్సిన అవసరమే ఉండదు. అదే జరిగితే తమ భూముల ధరలు అడ్డగోలుగా పెంచుకునేందుకు అవకాశం ఉండదని చంద్రబాబు, నారాయణ ఆందోళన చెందారు. దీంతో విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులకు అడ్డు పడ్డారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆ పనులు ఏమాత్రం ముందుకు సాగకపోవడమే ఇందుకు నిదర్శనం. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పశ్చిమ బైపాస్ పనులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు పనులకు అవరోధాలు తొలగిపోయేలా చర్యలు తీసుకున్నారు. భూసేకరణ, ఇతర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పరిష్కరించడంతో రూ.3,200 కోట్ల విలువైన విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 90 శాతం పనులు పూర్తి కావడం విశేషం. సుమారు 50 కి.మీ పొడవైన ఈ ఆరు లేన్ల బైపాస్ను త్వరలోనే ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రజా ప్రయోజనకరమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు సర్కారు అడ్డుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం శర వేగంగా పూర్తి చేస్తుండటం గమనార్హం. -
మాజీమంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు
-
IRR Case: నారాయణకు సీఐడీ నోటీసులు
సాక్షి, కృష్ణా: ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ కేసులో.. మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు ఝలక్ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా యానకు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ. అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు స్కామ్లో ఏ2గా ఉన్న నారాయణ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచడంతో.. ఆయన అరెస్టుకి భయపడి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈలోపే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు ఈ స్కామ్లో కీలక పాత్ర ఉందని నిర్ధారించుకుంది ఏపీ సీఐడీ. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది. అక్టోబర్ 4వ తేదీన నారా లోకేష్ను తమ ఎదుట హాజరు కావాలని స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఇప్పుడు అదే తేదీన నారాయణను సైతం విచారణ చేపడుతుండడం గమనార్హం. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలోఅమరావతి మాస్టర్ ప్లాన్లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది ఏపీ సీఐడీ. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. -
ఆంధ్రప్రదేశ్లో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ స్కాంలో నారా లోకేశ్కు సీఐడీ నోటీసులుడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నారా లోకేశ్కు సీఐడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ముసుగులో జరిగిన భూదోపిడీ కుంభకోణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు సీఐడీ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేశారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేశ్కు అధికారులు వీటిని అందజేశారు. అక్టోబరు 4న తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ వచ్చిన అధికారులు శనివారం ఉదయం నుంచి లోకేశ్ ఎక్కడున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఓ హోటల్లో ఉన్నారని, ఎంపీ ఇంట్లో ఉన్నారని ఇలా ఊహాగానాలు రావడంతో పూర్తి సమాచారం వచ్చే వరకూ వేచి చూశారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో లోకేశ్ ఎంపీ గల్లా జయదేవ్ అధికారిక నివాసానికి వచ్చారు. దీంతో అధికారులు ఎంపీ జయదేవ్తో మాట్లాడారు. అశోకారోడ్–50లోని తన నివాసంలో లోకేశ్ ఉన్నారని జయదేవ్ వారికి తెలిపారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఐడీ అధికారులు ఎంపీ జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. వారిని తొలుత లోపలికి రానీయకుండా గేటు వద్దే అడ్డుకొన్నారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం సమంజసం కాదని అధికారులు తెలిపారు. లోకేశ్ బయటకు వస్తే నోటీసులు అందజేసి వెళ్లిపోతామని చెప్పారు. కొద్దిసేపటకి లోకేశ్ బయటకు రారని గేటు వద్ద ఉన్న సిబ్బంది అధికారులకు తెలిపారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపడ సత్యనారాయణ బయటకు వచ్చి అధికారులతో మాట్లాడారు. వారిని లోపలికి తీసుకెళ్లారు. 20 నిమిషాల అనంతరం బయటకి వచ్చిన అధికారులు లోకేశ్కు నోటీసులు ఇచ్చినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై తాము మాట్లాడబోమని మీడియాకు తెలిపారు. ఎందుకొచ్చారు? నోటీసులెందుకు? నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను ఎందుకొచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. నోటీసులు ఎందుకు? ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని అడిగినట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం లోకేశ్కు నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా నోటీసులు అందుకున్నట్లు లోకేశ్ ధృవీకరించినట్లు తెలిసింది. అంతకు ముందు సీఐడీ అధికారులను ఎంపీ జయదేవ్ నివాసంలోకి రానివ్వకపోవడంతో వారు లోకేశ్కు వాట్సాప్లో నోటీసులు పంపినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని అధికారులతోనూ లోకేశ్ ప్రస్తావించినట్లు సమాచారం. నోటీసును చదువుకుంటానని, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడతారని లోకేశ్ వారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఆయా సెక్షన్లు గురించి లోకేశ్కు వివరించినట్లు సమాచారం. నోటీసుల్లో ఉన్న వివరాలివీ..! ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో నారా లోకేశ్కు సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో.. ‘ క్రైమ్ నం. 16/2022 ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఐపీసీ సెక్షన్లు 120 (బి), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్విత్ 13(1) (సి) (డి)లో దర్యాప్తు మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ సబ్ సెక్షన్ (1) ప్రకారం నోటీసులు ఇస్తున్నాం. ప్రస్తుత విచారణకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి తగిన కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 4న ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలి’ అని నోటీసుల్లో పేర్కొంది. వీటలో 10 అంశాలను సీఐడీ స్పష్టంగా పేర్కొంది. ఆ అంశాలివీ.. 1. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు 2. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు చేయకూడదు 3. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులెవరినీ బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం చేయకూడదు 4. ఎప్పుడు పిలిచినా /ఆదేశించినా కోర్టుకు హాజరుకావాలి 5. విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చి అధికారులకు సహకరించాలి 6. కేసుకు సంబంధించి వాస్తవాలు వెల్లడించాలి 7. హెరిటేజ్ ఫుడ్స్ బ్యాంకు ఖాతా వివరాలు అధికారులకు అందజేయాలి 8. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి 9. అమరావతి భూ కొనుగోలు లావాదేవీలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురావాలి 10. నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు రాకపోయినా, నిబంధనలు పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ (3), (4) ప్రకారం అరెస్టు తప్పదు లవ్ లెటర్ అందింది : లోకేశ్ సీఐడీ వైఎస్సార్సీపీ అనుబంధ విభాగమని ఆరోపణ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసును నారా లోకేశ్ లవ్ లెటర్గా అభివర్ణించారు. ఢిల్లీలో సీఐడీ అధికారులు వచ్చి వెళ్లిన రెండు గంటల తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు. సీఐడీ అధికారులు వస్తున్న విషయం తెలసుకొని జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు సాయంత్రం ఎంపీ జయదేశ్ నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే, వారిని లోపలికి అనుమతించలేదు. సీఐడీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత లోకేశ్ వెంటనే మీడియా ముందుకు రాలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 7 గంటలకు గంటలు మోగించారు. ఆ తర్వాత లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తనపై మోపినవి దొంగ కేసులని, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. తాము ఎక్కడికీ పారిపోబోమన్నారు. సీఐడీ వాళ్లు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారని తెలిపారు. సీఐడీని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగమని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని, అందులో భాగంగానే జుడిషియల్ రిమాండుకు పంపారని అన్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు దర్యాప్తు అధికారి, డీజీపీపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని అన్నారు. 4న సీఐడీ ముందు హాజరవుతానని, వాయిదాలు అడిగే అలవాటు లేదని చెప్పారు. -
నోటీసుల్లో లోకేష్కు సీఐడీ ఏం చెప్పిందంటే..?
సాక్షి, ఢిల్లీ: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇవాళ నారా లోకేష్కు నోటీసులు జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సీఐడీ ఆదేశించింది. అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచించిన సీఐడీ.. హెరిటేజ్ బోర్డు సమావేశాల మినిట్స్తో కూడిన బుక్ సమర్పించాలంది. మినిట్స్ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ?. చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసుల్లో 10 అంశాలు.. ►భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు ►ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు ►పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి ►విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి ►వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి ►హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి ►భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి ►అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి ►నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు కాగా, రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్నారు. లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్హౌజ్ను చంద్రబాబు కుటుంబం తీసుకుంది. రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానని భువనేశ్వరీ చెబుతున్నారు. హెరిటేజ్తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా సీఐడీ పరిశీలన చేసింది. చదవండి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం: నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం: నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాం కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సీఐడీ పేర్కొంది. ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేష్ను కలిసి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్ని ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నోటీసులు ఇచ్చిన అధికారుల బృందంలో మధుసూదన్రావు, బై జోహన్ సైదా, జగత్ సింగ్ ఉన్నారు. తనకు ముందుగానే వాట్సాప్లో నోటీసులు అందాయని లోకేష్ చెప్పగా, అయితే తాము ప్రత్యక్షంగా ఇచ్చేందుకు వచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు. 41ఏ నోటీస్ ఫార్మాట్పై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అది రెగ్యులర్గా ఇచ్చే ఫార్మాట్ అని సీఐడీ స్పష్టం చేసింది. నారా లోకేష్పై 120బీ, 409, 420, 34, 35, 36, 37,166,167,217 ఐపీసీ 13(1),13(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. నోటీసుల్లో 10 అంశాలు.. నోటీసుల్లో 10 అంశాలను సీఐడీ పేర్కొంది. హెరిటేజ్ సంస్థ బ్యాంక్ వివరాలు తీసుకురావాలన్న సీఐడీ.. హెరిటేజ్ బోర్డు మినిట్స్ కూడా సమర్పించాలని పేర్కొంది. హెరిటేజ్ కొనుగోలు చేసిన భూములకు చెల్లింపు లావాదేవీల వివరాలను సీఐడీ అడిగింది. కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులను నిందితులుగా చేర్చింది.చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్ను సైతం 14వ నిందితునిగా చేర్చింది. క్విడ్ప్రోకో ద్వారా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెబుతోంది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. సొంత కంపెనీకి భూములు టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే తనయుడు లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. ఆపై అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు. చదవండి: వామ్మో చినబాబు.. రింగ్రోడ్డులో ఎన్ని మలుపులో! -
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా లోకేష్
-
బిల్డ్ అప్ బాబాయ్..
-
లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను మూసివేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మాటున సాగించిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో 14వ నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు మూసివేసింది. లోకేశ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు జారీ చేసి, అవసరమైనప్పుడు విచారణకు రావాలని కోరతామని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. ఈరోజు వరకు ఆయన అరెస్టు విషయంలో భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా లోకేశ్ విచారణ విషయంలో హైకోర్టు ఏ షరతులైనా విధించవచ్చని తెలిపారు. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, వాటిని రికార్డ్ చేసింది. తప్పనిసరిగా సీఆర్పీసీ సెక్షన్ 41ఏను అనుసరించే ముందుకు వెళతామని ఏజీ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో, లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. అందువల్ల పిటిషన్ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులను నిందితులుగా చేర్చింది. చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్ను సైతం 14వ నిందితునిగా చేర్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. లోకేశ్పై కేసులో సెక్షన్లను సవరించామని తెలిపారు. అవినీతి నిరో«దక చట్టం కింద మరిన్ని సెక్షన్లు చేర్చామని వివరించారు. దర్యాప్తు అధికారి చట్ట ప్రకారం నడుచుకుంటారని తెలిపారు. లోకేశ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని దర్యాప్తు అధికారి నిర్ణయించారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. అరెస్టు గురించి ఆందోళన చెందుతున్నారా అని లోకేశ్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ను ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తారని అనుకుంటే ఎప్పుడైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. దర్యాప్తు నకు సహకరించాలని స్పష్టం చేశారు. దీనికి దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఏజీ చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని కోరారు. అరెస్టు విషయంలో కనిపించని ఆందోళన ఉందన్నారు. వరుసగా సెలవులు వస్తున్నాయని తెలిపారు. సీఐడీ అనుసరించే విధానం (మోడస్ ఆపరెండీ) వేరుగా ఉంటుందని, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చిన తరువాత కూడా అరెస్ట్ చేసేందుకు వెనుకాడబోదని తెలిపారు. పాలనాపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు మోడస్ ఆపరెండీ అన్న పదం ఉపయోగించడంపై ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. ఈ పదం నిందితులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. లోకేశ్పై నమోదు చేసిన సెక్షన్లన్నింటినీ ఏజీ చదివి వినిపించారు. ఈ సెక్షన్లన్నీ వర్తిస్తాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాలనాపరంగా లోకేశ్తో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందువల్ల ఆ సెక్షన్లన్నీ ఆయనకు వర్తిస్తాయని తెలిపారు. దర్యాప్తునకు సహకరించాలని లోకేశ్ను ఆదేశించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ.. దర్యాప్తు అధికారి పిటిషనర్ను విచారణకు పిలవాలనుకుంటే ముందే ఆ విషయాన్ని తెలిపి సహేతుక సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ముందు రోజు నోటీసు ఇచ్చి, మరుసటి రోజు హాజరు కావాలంటే కష్టమని చెప్పారు. -
బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్మెంట్ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్ఆర్ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలైన్మెంట్ మార్పు వల్ల రమేశ్ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు. రమేశ్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్మెంట్ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ను సైతం అలాగే రూపొందించారని వివరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఐఆర్ఆర్ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు. -
రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు: ఏజీ
-
అమరావతిలో అతితెలివితో ఇరుక్కున్నారా?