kolagatla veerabhadra swamy
-
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
-
కోలగట్ల ఎన్నికల ప్రచారం
-
మేము వేసిన రోడ్లమీదే మేము మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది
-
ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పాలన: డిప్యూటీ స్పీకర్
-
బాలయ్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
-
అసెంబ్లీలో టీడీపీ నేతల వ్యవహారశైలిపై డిప్యూటీ స్పీకర్ ఫైర్
-
గంటపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్ పూల్లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు. చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..! -
64 ఏళ్ల వయసులో... డిప్యూటీ స్పీకర్ సాహసం! గంట పాటు నీటిపై తేలియాడుతూ..
సాక్షి, విజయనగరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వయసును సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. జాతీయ స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని స్విమ్మింగ్ పూల్లో డిప్యూటీ స్పీకర్ జలాసన ప్రక్రియ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భావితర క్రీడాకారుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని.. చైతన్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక చైతన్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఇలాంటి ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ చేపట్టిన సాహసాన్ని ఈ సందర్భంగా అభినందించారు. అట్టహాసంగా కార్యక్రమం కాగా వందలాది మంది ప్రజలు, ఆయన అభిమానులు విచ్చేసి వీక్షించారు. కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు, అభిమానుల సౌకర్యార్థం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో, నగరంలో పలు చోట్ల ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం జలాసనం వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అందుకే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాన్ని చేశానని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, టీవీల మోజులో పడి యువత క్రీడలకు దూరం అవుతున్నారని వాటి ఆవశ్యకతను తెలుసుకొని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వంతుగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యం క్రీడా సాధన చేయాలని డిప్యూటీ స్పీకర్ హితవు పలికారు. వయసుతో సంబంధం లేని క్రీడ.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధనం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్నదొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎం. దీపికా, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ‘జీరో’అవర్ సుదీర్ఘంగా సాగింది. రెండున్నర గంటలకు పైగా 46 మంది శాసన సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు. జీరో అవర్ను ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నడిపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన భూకబ్జాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ వారి పర్యటనల్లో అధికార పక్ష నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. టీడీపీ హయాం నుంచి ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో సమగ్ర విచారణ చేయించాలి కోరారు. దీనిపై ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ.. ‘నేను ఇప్పు డు చైర్లో కూర్చున్నా. లేకుంటే శాసన సభ్యుడినే కదా. రెండు నెలల కిందట చంద్రబాబు విజయనగరంలో నాపైనా ఆరోపణలు చేశారు. ఏ భూములైతే ఆక్రమించానని ఆరోపిస్తున్నారో.. ఆ భూముల్లో చంద్రబాబు కూర్చుని ఆందోళన చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పాను. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోపణలపై విచారణకు ఆదేశించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి వి డిపించి అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను త్వరితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లోకేశ్ కబ్జా ఆరోపణలపై విచారణ చేయించాలి: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో టీడీపీ నేత లోకేశ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి ఆక్రమించుకున్నామని లోకేశ్ ఆరోపించారన్నారు. గతంలో తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, 2014–19 మధ్య ఎంత భూమి మింగేశారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎంత కబ్జాకు గురైందో సీఐడీ, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. తాను ఏనాడూ ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. పేజ్కు భూ కేటాయింపులపై వాస్తవాలు నిగ్గు తేల్చాలి టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా పేజ్ ఇండస్ట్రీకి 28 ఎకరాలు కారు చౌకగా ఎకరం రూ.10 లక్షలకు కేటాయించడంపై విచారణ జరపాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.2.80 కోట్లకే రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల తర్వాత భూమిని విక్రయించుకోవచ్చని జీవో కూడా ఇచ్చారన్నారు. 2016లో భూమి ఇస్తే 2019 వరకు ఆసంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ హయాంలో రామగిరిలో రూ.1000 కోట్ల విలువైన గ్రానైట్ను ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా తరలించారని అన్నారు. ఆన్లైన్ విధానంలో భూ యాజమాన్య మార్పులు చేసే వెసులుబాటుతో అనంతపురం రూరల్, రాప్తాడు నియోజకవర్గంలో వందల కోట్లు విలువ చేసే భూముల్లో బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, ఇలాంటి దోపిడీల్లో ప్రభుత్వం వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టాలి సరైన గుర్తింపు లేని బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టి ప్రభుత్వ పథకాలు అందించాలని కొందరు సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని.. కేంద్ర కేబినెట్ ఆమోదంతో పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. బుడగ జంగాలు ఏ వర్గంలోకి వెళ్లాలనుకుంటున్నారో సంబంధిత కమిషన్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. -
Vizianagaram: అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఫుడ్బ్యాంకులు
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెడితే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది. విజయనగరం పట్టణంలో ఏడాదిన్నరగా వేలాదిమంది పేదల ఆకలితీర్చే బృహత్క్రతువు నిరాటంకంగా కొనసాగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, హోటళ్ల నిర్వాహకులు ఇలా.. మనసున్న ప్రతి ఒక్కరూ ఫుడ్బ్యాంకుల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నిర్భాగ్యులకు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. వృథాగా పారబోసే ప్రతి మెతుకుతో మరొకరి ఆకలి తీర్చాలన్న ప్రధాన ఆశయంతో ముందుకు సాగుతున్నారు. – పైడి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం డెస్క్ ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరం పట్టణానికి వచ్చిన పేదలు... స్థానికంగా ఉంటున్న అభాగ్యులు, అనాథల ఆకలి తీర్చాలన్న ఆశయం నుంచి ఏర్పడినవే ఫుడ్ బ్యాంకులు. జిల్లా కేంద్రానికి ఏ దారిలో వచ్చిన వారికైనా ఫుడ్బ్యాంకులు తారసపడతాయి. ప్రస్తుతం నలువైపులా నాలుగు ఫుడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు... ఇక్కడ భోజనాల వడ్డింపు కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. వివిధ పనులపై వచ్చేవారు, కూలీలు, ఆటోడ్రైవర్లు, యాచకులు, అనాథలు, వృద్ధులు ఇలా.. అన్నం కోసం ఎదురుచూసేవారందరికీ ఫుడ్బ్యాంకులు అన్నంకుండలా మారుతున్నాయి. వారి ఆకలి తీర్చుతున్నాయి. ఒక్కో ఫుడ్బ్యాంకులో రోజుకు 100 నుంచి 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని, లేవలేని కొందరు వృద్ధులకు క్యారేజీలతో అందిస్తున్నారు. వీటి నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, హోటళ్ల నిర్వాహకులు, నాయకులు, యువత, కార్పొరేషన్ ఉద్యోగులు భాగస్వాములయ్యారు. ఏ శుభ, అశుభ కార్యమైనా... ఇంటిలో ఎలాంటి శుభ, అశుభ కార్యం జరిగినా పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారి స్థాయిని బట్టి అన్నదానం చేస్తున్నారు. కొందరు నాలుగు ఫుడ్బ్యాంకులలో ఒక రోజు వడ్డించేందుకు సరిపడా ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండగా, మరికొందరు ఒక ఫుడ్బ్యాంకుకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పేదలకు స్వయంగా వడ్డించి, వారి ఆకలితీర్చి ఆత్మ సంతృప్తిపొందుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పరిసర గ్రామాల్లో పుట్టినరోజులు, జయంతి, వివాహాది శుభకార్యాలు, పండగల సమయంలో ముందుగా ఫుడ్ బ్యాంకులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అందుకే... అన్నదాన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతల సాయంబట్టి రాత్రి పూట కూడా భోజనం వడ్డిస్తున్నామని పేర్కొంటున్నారు. ఫుడ్ బ్యాంకుల నిర్వహణ ఇలా... ► ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫుడ్బ్యాంకు దాతలతో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయం సహకారంతో కొనసాగుతోంది. ► కోటకూడలిలోని ఫుడ్బ్యాంకు హోటళ్ల నిర్వాహకులు, దాతలు సాయంతో సాగుతోంది. ► ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్నదాన కేంద్రం దాతలు, కార్పొరేషన్, గౌరీ సేవాసంఘం సహకారంతో నడుస్తోంది. ► పోలీస్ బ్యారెక్స్ వద్ద ఉన్న కేంద్రం దాతలు, కార్పొరేషన్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వడ్డించే పదార్థాలు అన్నం, సాంబారు, ఒక కూర, పులిహోర, చక్రపొంగలి (దాతలు సమకూర్చితే అరటిపండు, స్వీటు, ఇతర పదార్థాలు) ఫుడ్బ్యాంకులలో అన్నదానం ఇలా... ► ప్రతిరోజు ఒక ఫుడ్బ్యాంకులో 100 నుంచి 150 మంది చొప్పున నాలుగు ఫుడ్బ్యాంకులలో 400 నుంచి 600 మందికి భోజనం వడ్డిస్తున్నారు. ► ఈ ప్రక్రియ ఆగస్టు 13, 2021 నుంచి నిరంతరాయంగా సాగుతోంది. నెలకు 12,000 నుంచి 18,000 మంది ఆకలిని ఫుడ్బ్యాంకులు తీర్చుతున్నాయి. కోట వద్ద ఉన్న ఫుడ్ బ్యాంకులో రాత్రి సమయంలో కూడా అన్నదానం చేస్తుండగా, మిగిలిన చోట్ల దాతల సాయం బట్టి రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు. పేదవాని ఆకలి తీర్చడమే ధ్యేయం పేదవాడి ఆకలి తీర్చాలని, సామాన్యులకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో ప్రారంభించినవే ఫుడ్ బ్యాంకులు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 4 ఫుడ్బ్యాంక్లు పేదలు, అనాథల ఆకలి తీర్చుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్ల పేరుతో రూ.5కే భోజనం పెట్టించామని గొప్పలు చెప్పుకునేవారు. తప్పుడు లెక్కలతో ఖజానా ఖాళీచేసేవారు. ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఫుడ్బ్యాంకులకు దాతలే సహకరిస్తూ వేలాదిమంది కడుపునింపుతున్నారు. త్వరలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద మరో ఫుడ్బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్బ్యాంకు సూపర్వైజర్ మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా... వివాహాలు, వేడుకలు, విందుల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫుడ్ బ్యాంకులకు చేర్చుతున్నారు. వీటిని ఫుడ్బ్యాంకులలో ఉన్న ఫ్రిజ్లలో నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫుడ్ బ్యాంక్లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం. ఈ ప్రక్రియంలో దాతల భాగస్వామ్యం శుభపరిణామం. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు వేలాది మంది వచ్చిపోతుంటారు. అందులో చాలా మంది ఆర్థిక స్థోమత లేక ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. అటువంటి వారికి ఫుడ్బ్యాంక్ల సేవలు ఉపయుక్తంగా మారాయి. ప్రతి రోజు రుచి, శుచితో కూడిన భోజానాన్ని అందించగలుగుతున్నాం. – రెడ్డి శ్రీరాములనాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ ఆనందంగా ఉంది ఫుడ్బ్యాంకుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోంది. ఉద్యోగిగా ఫుడ్బ్యాంకు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా... ఆకలితో వచ్చే పేదలకు వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు. అన్నదానం చేసిన దాతలకు చేతులెత్తిదండం పెట్టాలి. వారి దయవల్లే పేదల ఆకలి తీరుతోంది. ఫుడ్బ్యాంకుల నిర్వహణ ఆలోచన గొప్పది. – జె.రవితేజ, ఫుడ్బ్యాంకు సూపర్వైజర్ క్యారేజీ అవసరంలేదు.. విజయనగరం పట్టణానికి చెట్లు కొట్టేందుకు వస్తాను. పట్టణ పరిధిలో ఎక్కడ పని ఉన్నా క్యారేజీ తెచ్చుకోను. ఫుడ్ బ్యాంకు వద్దకు వచ్చి భోజనం చేస్తాను. మా లాంటి కూలిపనివారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – రీసు పైడితల్లి, గొట్లాం ఆకలితీర్చుతోందయ్యా.. నేను కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుతూ జీవిస్తున్నాను. ఎక్కడ ఉన్నా పోలీస్ బ్యారెక్ వద్ద ఉన్న ఫుడ్బ్యాంకు వద్దకు సమయానికి చేరుకుంటాను. కడుపునిండా భోజనం చేస్తున్నారు. మాలాంటి పేదలకు అన్నంపెడుతున్న దాతలు నూరేళ్లపాటు చల్లగా ఉండాలి. – రాముపైడమ్మ, గాజులరేగ, విజయనగరం మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్బ్యాంకు సూపర్వైజర్ -
అశోక్ బంగ్లా వేదికగా మరో కుట్ర
సాక్షి, విశాఖపట్నం/విజయనగరం: టీడీపీ నేత అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచే 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు వ్యూహాన్ని చంద్రబాబు రచించారని, మళ్లీ ఇప్పుడు ఆ బంగ్లా వేదికగా మరో కుట్రకు తెర లేపారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. త్వరలోనే ఆ కుట్ర బట్టబయలవుతుందని చెప్పారు. ఆదివారం ఆయన విశాఖ సర్క్యూట్ హౌస్లో, విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదన్నారు. అనని మాటలను పట్టుకొని చంద్రబాబు ఏడవడంతోనే ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయారని చెప్పారు. ‘బాదుడే బాదుడు’ అట్టర్ ఫ్లాప్ కావడంతో పేరు మార్చి ‘ఇదేమి ఖర్మ’ అంటూ ప్రజల్లోకి వెళ్లగా.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఖర్మ పట్టుకుందని జనం అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు సభలకు డబ్బులిచ్చి మరీ జనాన్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారని చెప్పారు. ఒక్కసారి కూడా గెలవని, ఒక్క సీటు లేని జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్కు చంద్రబాబు దాసోహమయ్యాడన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి తూట్లు పొడుస్తున్నారన్నారు. బీసీలంటే ఎప్పుడూ చంద్రబాబుకు చులకన భావమేనని, బీసీ మహిళా అధ్యక్షురాలు ఫొటో దిగడానికి వస్తే.. అశోక్ కుమార్తె అడ్డుకుంటే చూస్తూ మిన్నకుండిపోవడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు. కుప్పంలో మీ సంగతి చూసుకోండి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న తాను, మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోతామని చెబుతున్న చంద్రబాబు.. ముందు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలా గెలవాలో చూసుకోవాలని కోలగట్ల హితవు పలికారు. బొబ్బిలి, రాజాం, విజయనగరం నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సైకిల్ పోవాలంటూ ఆయన చెప్పడం ద్వారా నిజాన్ని ఒప్పుకున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు తథ్యమని చెప్పారు. -
‘సైకిల్ పోవాలని చెప్పడమే చంద్రబాబు మానసిక పరిస్థితికి నిదర్శనం’
విశాఖ: చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే సైకిల్ పోవాలని చంద్రబాబు చెప్పడమేనని వీరభద్రస్వామి స్పష్టం చేశారు. చంద్రబాబు డబ్బులిచ్చి సభలకు జనాన్ని రప్పిస్తున్నారని, బాదుడే బాదుడు అట్టర్ ప్లాప్ కావడంతో పేరు మార్చి ఇదేమి ఖర్మ కార్యక్రమం చేపట్టారని,చంద్రబాబు వల్లనే రాష్ట్రానికి కర్మ పట్టుకుందని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు వీరభద్రస్వామి. -
చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆగ్రహం
-
జగనన్న కాలనీలపై జనసేన ఓవర్ యాక్షన్ చేస్తోంది : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
-
విజయవాడలో ఆర్యవైశ్యుల సమ్మేళనం
-
లేనిది ఉన్నట్టు ఎల్లో డప్పులు...
-
ఆస్పత్రికి అశోక్ గజపతిరాజు కుటుంబం గజం భూమి ఇవ్వలేదు : కోలగట్ల
-
Vizianagaram: గంటస్తంభానికి కొత్త సొబగులు
విజయనగరం: చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం గంటస్తంభం కొత్త సొబగులు అద్దుకుంటోంది. సుమారు రెండు శతాబ్దాల కిందట నగరం నడిబొడ్డున నిర్మించిన గంటస్తంభం... ఆధునీకరణ పనులతో మరింత ఆకర్షణీయంగా దర్శనమివ్వనుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకోగా... వచ్చే నెల 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పనుల ప్రగతిని డిప్యూటీ స్పీకర్ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. గంట స్తంభం చరిత ఇది... 25 అడుగుల కైవారం, రూ.4,680 వ్యయంతో 8 కుంభుజాలతో 18వ శతాబ్దంలో గంటస్తంభాన్ని నిర్మించారు. గంటస్తంభానికి నలువైపులా నాలుగు పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12, రాత్రి 8 గంటలకు పెద్ద శబ్దంతో అలారం మోగేది. కాలక్రమేణా గంటస్తంభం చెక్కు చెదరనప్పటికీ దానికి అమర్చిన గడియారాలు పాడైనప్పుడు సాంకేతిక నిపుణులను రప్పించి మరమ్మతు చేయించేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో అధునాతన గడియారాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టడంలో ఉన్న కిటికీలను మార్పు చేశారు. అలనాటి వైభవం దెబ్బతినకుండా కట్టడానికి పుట్టీపెట్టించి నూతనంగా రంగులతో కొత్త సొబగులు అద్దారు. గంటస్తంభం చుట్టూరా విద్యుత్ దీపాలంకరణతో వాటర్ ఫౌంటౌన్ నిర్మించారు. ఈ పనులతో రాత్రి వేళ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించనుంది. మొత్తం ఆధునీకరణ పనులను దాతల సహకారంతో చేపట్టగా.. రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అంచనా. పనులను పరిశీలించిన కోలగట్ల... గంటస్తంభం ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి కోలగ్ల వీరభద్రస్వామి పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. గంటస్తంభం చుట్టూ కలియతిరిగి ఆక్రమణల తొలగింపుపై టౌన్ ప్లానింగ్ అధికారులకు తగుసూచనలిచ్చారు. విజయనగర వైశిష్ట్యం ప్రతిబింబించేలా అలరారుతున్న గంటస్తంభాన్ని ఆధునీకరించి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పూర్తయిన పనులతో మరింత శోభాయమానంగా అలరారబోతోందని చెప్పారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన కూడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కేదారశెట్టి సీతారామమూర్తి, 4వ డివిజన్ కార్పొరేటర్ మరోజు శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సూరిబాబు, ఏసీపీ మధుసూదన్రావు, డీఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
Kolagatla Veerabhadra Swamy: కార్యకర్త నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు...
విజయనగరం: సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోలగట్ల వీరభధ్రస్వామి డిప్యూటీ స్పీకర్ హోదా వరకు వ్యక్తిగతంగా ఎదిగారు. పాలన లో తనదైన ముద్రవేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎమ్మె ల్సీగా ఎన్నికైన ఆయనకు సీఎం జగన్మోహన్రెడ్డి డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొద్ది నెలల కిందట డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల పేరును సీఎం ప్రకటించారు. ప్రస్తు తం జరుగుతున్న శాసనసభా సమావేశాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రివర్గం సమక్షంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పీఠాన్ని సోమవారం అధిరోహించారు. కోలగట్ల 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం 1985లో కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికయ్యారు. 1987లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికకాగా, 1989లో కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 1989, 1994, 1999 సంవత్సరాల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2004 సంవత్సరం ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజుపై విజయం సాధించారు. 2013 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవితోపాటు ఆ పార్టీకి రాజీనామాచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. అదే ఏడాది విజయనగరం శాసనసభా నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందగా... వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ప్రత్యేక గుర్తింపు.. విజయనగరానికి చెందిన పూసపాటి వంశీయులపై రాజకీయంగా పోరాడి విజయం సాధించడంతో ఎమ్మెల్యే కోలగట్లకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సుమారు 7 మార్లు ఎమ్మెల్యేగా, పలు శాఖల రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పదవులు అధిరోహించిన పూసపాటి అశోక్గజపతిరాజుపై స్వతంత్య్ర అభ్యరి్థగా ఒకసారి, వైఎస్సార్సీపీ తరఫున మరో సారి పోటీచేసి తన సత్తాను నిరూపించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా సాగుతున్నారు. అభినందనల జల్లు.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన కోలగట్లవీరభధ్రస్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు,, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, చనమల్లు వెంకటరమణ, రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కుప్పం ప్రసాద్ ద్వారకానాథ్, గుబ్బ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలి్పంచిన సీఎంకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సార్ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కోలగట్ల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి నాకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండొద్దని కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే సభలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని సభా ముఖంగా తెలియజేశారు. అయితే మేము ఈ స్థాయికి వచ్చామంటే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా నిలిచి గెలవడమే కారణం. సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించినా.. బయట మాత్రం రాజకీయవేత్తగా కొనసాగుతానని తెలిపారు. ఇకపోతే మీరు ఎడమవైపు (తెలుగుదేశం సభ్యులు కూర్చున్న వైపు) చూడమంటున్నారు.. అయితే నేనలా చేయాలంటే మీరు సభలో కూర్చోవాలని.. మీ స్థానాల్లో మీరు లేకపోతే నేనెలా చూడగలను అంటూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. చదవండి: (ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో పిటిషన్) -
ఎమ్మెల్యే కోలగట్లకు కరోనా
విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి కరోనా బారిన పడ్డారు. శనివారం ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. రెండు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కూడా పరీక్షించుకోవాలని కోలగట్ల కోరారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్ రికవరీలో ఏపీ బెస్ట్ -
'ఆర్టీవో కార్యాలయాన్ని అమ్ముకుంది ఎవరు?'
సాక్షి, విజయనగరం : చంద్రబాబుకు రాజ్యసభ ఎన్నికల ద్వారా మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరం జెడ్పీ గెస్ట్ హౌస్లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, అప్పల నరసయ్య, కంబాల జోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. ' 23 మంది ఎమ్మెల్యే లు ఉంటే కేవలం17 ఓట్లు మాత్రమే రావడం సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం భోగాపురం ఎయిర్ పోర్ట్కు భూ సేకరణ చేసింది ఎవరు.. ఏం చేద్దామని అవసరానికి మించి భుమిని టీడీపి ప్రభుత్వం సేకరించింది.. వైసీపీ నాయకుల భూములను బలవంతంగా లాక్కుంది మీరు కాదా? భూములు అమ్ముకునే సంస్కృతి మా నాయకులకు లేదు. గతంలో మయూరి సెంటర్లో ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని మీరు అమ్ముకో లేదా.. మాది నీతి గల ప్రభుత్వం... సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో విసృతంగా జరుగుతున్నాయి.. నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో డబ్బులన్ని మంత్రులు, మిగతా నాయకుల జేబుల్లోకి వెళ్లేవి. కాని ఇప్పుడు మాత్రం నేరుగా ప్రజలకు అందుతుంది' అంటూ తెలిపారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఒక్క సాలూరు నియోజకవర్గానికే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ. 110 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ మూడు గిరిజన చట్టంపై న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. -
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కోలగట్ల
-
‘అందుకే బాబును ప్రజలు ఇంటికి పంపారు’
సాక్షి, విజయనగరం: ప్రజా చైతన్యం ఉండబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇక ప్రజా చైతన్య యాత్ర దేని కోసం నిర్వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామీ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ హోం మంత్రి చిన రాజప్ప లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇక సీఎం జగన్ పర్యటన జయప్రదంగా ముగిసిందని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగలేదన్నారు. ఉగాది రోజున ఇల్లు లేని వాళ్లందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, కుల, మతాలు చూడకుండా ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. పాలనలో దేశంలోనే ఆదర్శ సీఎం జగన్ అన్నారు. అర్హత కలిగిన వాళ్లందరికి పెన్షన్లు పునరుద్ధరణ చేశామని ఆయన తెలిపారు. మద్య నిషేధ అమలులో భాగంగా బెల్ట్ షాప్లను లేకుండా చేశామని తెలిపారు. ఆనాడు మద్యం సిండికేట్లో ప్రతికపక్ష నాయకులను అరెస్టు చేయిస్తామని చంద్రబాబు బెదిరించారన్నారు. మూడు రాజధానులు కొత్తేమీ కాదని, ఆనాడు మద్రాస్ నుంచి కర్నూలుకి మర్చలేదా, హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చలేదా అని పేర్కొన్నారు. టీడీపీ హాయంలో పారిశ్రామిక వేత్తల సదస్సును అమరావతిలో కాకుండా.. విశాఖలో ఎందుకు పెట్టారని, అక్కడ అభివృద్ధి ఏమి లేదని అందరికి తెలిసిపోతుందనా? అని ప్రశ్నించారు. టీడీపీ హాయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్లనే బాబుని ప్రజలు ఇంటికి పంపించారని విమర్శించారు. చంద్రబాబు చేపట్టే ప్రజా చైతన్య యాత్రకి ప్రజలు ఎవరూ రారని, మద్దతు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. -
ఇంటింటికీ రైస్కార్డులు
సాక్షి, విజయనగరం: రైస్కార్డులు పంపిణీ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. నియోజకవర్గానికి ఒక సచివాలయంలో ముందుగా పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా వారం పదిరోజుల్లో అన్ని సచివాలయాల్లో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే కొన్ని కుటుంబాలను అర్హులుగా గుర్తించగా మరికొన్ని కుటుంబాలు పరిశీలనలో ఉన్నాయి. అన్ని అర్హత గల కుటుంబాలకు రైస్కార్డులు అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్కార్డే అన్ని పథకాలకు అర్హతగా గుర్తించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనలో ప్రక్షాళన, పారదర్శకత ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏ పథకానికి సంబంధించి వారికి ఆ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేషన్డిపోల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి రైస్కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్ నెలలో జరిపిన సర్వేలో లబి్ధదారులను ఎంపిక చేశారు. ఈ మేరకు అర్హులుగా తేలిన వారికి ఈ నెల 15వ తేదీ నుంచి రైస్కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించి ఆమేరకు పనులు ప్రారంభించారు. ప్రారంభమైన కొత్త రేషన్కార్డులు పంపిణీ ప్రభుత్వం అనుకున్నట్లు శనివారం నుంచి రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నవశకం సర్వేలో గుర్తించిన లబి్ధదారుల పేరున కొత్తగా కార్డులు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. సాంకేతిక కారణాల రీత్యా అన్ని సచివాలయాల్లో అన్ని కుటుంబాలకు కార్డులు ఒకేరోజు పంపిణీ చేయడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా అందజేస్తున్నారు. శనివారం నియోజకవర్గానికి ఒక సచివాలయంలో రేషన్డిపోలో ఈ కార్యక్రమం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలతో ప్రారంభించారు. వారు అందుబాటులో లేని చోట అధికారులు ప్రారంభించారు. కార్డులు కూడా జిల్లాకు వస్తున్నాయి. వాటిని కూడా సచివాలయాలకు పంపించి వలంటీర్ల ద్వారా అందజేసే ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ కిశోర్కుమార్ అధికారికంగా ప్రకటించారు. అర్హత గల ప్రతి కుటుంబానికి కార్డులు జిల్లాలో అర్హతకలిగిన ప్రతి కుటుంబానికి రైస్కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా మార్చి సచివాలయాల ద్వారా ఎప్పుడూ పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. జిల్లాలో ఇంతవరకు 7,10,554 రేషన్కార్డులు ఉన్నాయి. వాస్తవానికి వీరందరికీ రైస్కార్డులు అవసరం లేదు. కోటా బియ్యం తినే కుటుంబాలు ఇందులో చాలా వరకూ లేవు. కానీ విద్య, వైద్యం నిమిత్తం రేషన్కార్డులు పొందారు. ఇప్పుడు రైస్కార్డులు కేవలం సరుకులకు మాత్రమే ఉపయోగ పడనుండడంతో రైస్కార్డుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 6,46,171 కుటుంబాలను సర్వేలో వలంటీర్లు అర్హులుగా గుర్తించారు. ప్రజాసాధికార సర్వేలో కూడా వీరు అర్హులుగా తేలారు. మరో 30,403 కుటుంబాలు అర్హులుగా వలంటీర్లు గుర్తించినా భూమి, విద్యుత్ వినియోగం, నాలుగు చక్రాల వాహనాలు, అధిక ఆదాయం కారణంగా వీరిని పక్కన పెట్టారు. ఇందులో కొందరు నిజమైన అర్హులని అధికారుల పరిశీలనలో తేలడంతో ప్రభుత్వం మళ్లీమళ్లీ విచారణ చేసి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఇలా విచారణ చేయగా 22వేల కుటుంబాలు అర్హులుగా తేలారు. వీరికి ఇవ్వాల్సిన రేషన్కార్డులు కూడా ముద్రిస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోగా వీరందరికీ కార్డులు వచ్చేస్తాయి. అయితే మరో 33,980 వరకు కార్డులున్నా వారి నివాసాలపై స్పష్టత లేదు. కార్డులున్నా కుటుంబాలు ఎక్కడో నివాసం ఉంటున్నాయి. వీరి విషయంలో కూడా విచారణ చేసి అర్హతను గుర్తిస్తారు. ఇందులో అర్హులకు వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ కార్డులు అందజేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
‘వారు సభ సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు’
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు కావల్సినంత సమయాన్ని ఇస్తున్నప్పటికీ వారు వినియోగించుకోలేక పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మండలిలో సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వ బిల్లులను సరైనా రీతిలో ప్రవేశపెట్టడం లేదని.. బిల్లుపై చర్చ పెట్టకుండ సాగదీయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అనేది చంద్రబాబుకు అక్కర్లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్కు రాజధాని రైతుల కృతజ్ఞతలు ఇక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దల సభలో చంద్రబాబు పెద్ద తప్పులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు విధానం మారకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని ఆయన దుయ్యబట్టారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల తల్లులు ఆనందంగా ఉన్నారని, ప్రతి బిడ్డా చదువుకోవాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని ఆయన తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా విజయనగరం అని తెలిపారు. విద్యారంగంలో విజయనగరం ముందుకు వెళ్తుందని తాను ఆశిస్తున్నానట్లు పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాను చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు మెడికల్ కాలేజిని ప్రకటించిన సీఎం జగన్కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానండి..
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా వివిధ హోదాలో పనిచేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానుకోండని హితవు పలికారు. చరిత్రలు చెప్పడం అందరికీ తెలుసని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్పై స్పష్టమైన విధానాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు కారణంగా ఇక్కడ ప్రజలు చాలా ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల కాలం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలు జీవనాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృది జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని బొమ్మలు చూపించి చివరికి రేకుల షెడ్డులో ఉన్నతాధికారులను కూర్చొబెట్టి పాలన సాగించారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో టీడీపీ నాయకులు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని ధ్వజమెత్తారు. -
టీడీపీకి ప్రశ్నించే అర్హత లేదు:ఎమ్మెల్యే కోలగట్ల
సాక్షి, విజయనగరం: టీడీపీని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో ఆ పార్టీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలో మీడియా సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికార పార్టీపై ఆరోపణలు చేయడం ద్వారా తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గుపడాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇసుకను సాకుగా చూపి టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ‘ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుందని.. కానీ టీడీపీకికి ప్రశ్నించే అర్హత లేదని’ దుయ్యబట్టారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని.. జిల్లాలో టీడీపీకి పాలించే అర్హత లేదని ప్రజలు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
‘బాబుకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు’
సాక్షి, విజయనగరం: బాబు వస్తే జాబు అంటూ డాబులు చెప్పాడు.. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పించలేని చంద్రబాబుకు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదన్నారు. పరీక్షల తర్వాత పేపర్ గోప్యత, కీ విడుదల వంటి తదితర అంశాలను పారదర్శకంగా నిర్వహిస్తే.. చంద్రబాబు అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారని కోలగట్ల మండి పడ్డారు. సచివాలయ ఉద్యోగాల నిర్వహణలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయి.. నిరసన, ధర్నాలు చేయాలని పిలుపునిస్తే.. ఒక నిరుద్యోగైనా బాబుకు అండగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. జగన్కు మంచి పేరు వస్తుందనే అసూయతోనే విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు అని డాబులు పలికి చివరకు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసేసిన ఘనత చంద్రబాబుదే అంటూ కోలగట్ల విమర్శించారు. గత పాలకుల వల్లే ఇసుక కొరత.. తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల రూపాయలు ఇసుక దోచుకోవడంతోనే నేడు ఈ దుస్థితి అన్నారు కోలగట్ల. తమ ప్రభుత్వం యూనిట్ ఇసుకను అతి చౌకగా అందిస్తుందని తెలిపారు. గత పాలకుల ఇసుక దోపిడితోనే నేడు ఇసుక కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ ఆటో, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే ఐఆర్ వంటి నిర్ణయాలను తీసుకుంటున్నారని తెలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హరికృష్ణ, కోడెల మరణాలను తన నీచ రాజకీయాలకు వాడుకుంటూ.. చంద్రబాబు శవరాజకీయాలకు దిగారని మండి పడ్డారు. నియోజకవర్గంలో గత నాలుగు నెలలుగా వార్డ్ పర్యటన కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ వంద పనులను పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల అయిదున మంత్రి బొత్స చేతుల మీదుగా పలు పనులకు శంకుస్థాపన మహోత్సవం చేపట్టనున్నట్లు తెలిపారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు వీఎస్ ప్రసాద్ మంత్రి బొత్స ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నట్లు కోలగట్ల ప్రకటించారు. -
‘అభివృద్ధి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
సాక్షి, అమరావతి : గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ.. ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని అన్నారు. ప్రజాపాలనపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఆదాయం తెచ్చే కొత్త మార్గాలను తమ ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురానుండటం జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమని కోలగట్ల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతం : వరప్రసాద్ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్సార్లా వైఎస్ జగన్ కూడా ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు నేరుగా చేరడం అభినందనీయం అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసే అరాచకం ఒక ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణమని విమర్శించారు. -
గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను విస్మరించాయి
-
ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా
సాక్షి, అమరావతి : శాసనమండలి సభ్యత్వానికి వైఎస్సార్సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం శాసనసభ కార్యదర్శి కె సత్య నారాయణ రావుకి తన రాజీనామా లేఖను సమర్పించారు. -
వచ్చే మున్సిపల్ ఎన్నికలూ కీలకమే...
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల కాకుండా.. రానున్న మున్సిపల్ ఎన్నికలూ వైఎస్సార్ సీపీకి కీలకమేనని, రెండింట విజయం సాధించినపుడే విజయనగరం నియోజకవర్గం రానున్న ఐదేళ్లకాలంలో గణనీయ అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దీనికోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఎన్నికల తరహా కష్టించి పని చేయాలని పిలుపునిచ్చారు. డక్కిన వీధిలోని పార్టీ కార్యాలయంలో 9 వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన ప్రజలు చూశారని, అధికారం లేకపోయినా ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజల తరఫున పోరాటం చేసిన జగన్మోహన్రెడ్డి పోరాట పటిమను గుర్తించారని, వీరిద్దరిని బేరీజు వేసుకుని ప్రజలు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. రాష్ట్రం యవాత్తు జగన్మోహన్రెడ్డి నాయకత్వం కావాలని, రావాలని కోరుకుంటోందన్నారు. మే 23న జరిగే ఎన్నికల కౌంటింగ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హమీని అమలు చేసేలా సమర్ధవంతమైన పాలమైన సాగిస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగేందుకు కొన్ని రోజులు ముందు నియోజకవర్గంలో ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటు వేయాలంటూ రాజకీయ వ్యభిచారానికి తెరలేపిన వారికి తగిన బుద్ధిచెప్పాలని కోలగట్ల అన్నారు. పార్టీ నమ్ముకుని పని చేసిన ప్రతీ ఒక్కరికి రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, రాజకీయ అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కంటుభక్తు తవిట రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కేధారశెట్టి సీతారామమూర్తి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి కనకల ప్రసాదరావు, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, అవనాపు రాజు, 9 వార్డుల బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ వార్డు ఇన్చార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబూ... అలా ఎలా చెప్పారు?
సాక్షి, విజయనగరం: ఎన్నికల ముందు నుంచే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై బెదిరింపులకు పాల్పడిన బాబు.. అవేవీ ఫలితం ఇవ్వకపోవడంతో ఎన్నికల అనంతరం ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తూ ప్రజలకు ఈసీపై తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, వాటిని హుందాగా స్వీకరించాల్సింది పోయి ఎన్నికల వ్యవస్థను తప్పుపట్టడం సరికాదన్నారు. ‘సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకే పోతుందన్న మీరు.. నిన్నా ఇవాళ టీడీపీకి 130 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. మీ ఓటమి నిశ్చయమై జైలుకు పోవాల్సి వస్తే కాపాడుకునేందుకే కేంద్రంలో వివిధ పార్టీలతో ఇప్పుడు కలుస్తున్నారా? మీరిచ్చిన హామీలను గుర్తు చేసుకునే ప్రజలు ఓటేశారు. మీరు చేసిన నమ్మకద్రోహాన్ని గుర్తుంచుకుని మరీ ఓటేశార’ని వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ మొదట్లోనే విజయనగరం పట్టణంలో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తిందని, ఇలాగే కొనసాగితే రానున్న మే, జూన్ నెలల్లో తలెత్తబోయే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. (చదవండి: ఎండల్లో తిరిగి మైండ్ పోయిందా?) -
దోచుకో...దాచుకో...
విజయనగరం మున్సిపాలిటీ: ఐదేళ్ల చంద్రబాబు పాలన పూర్తిగా లంచమయంగా సాగిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మంగళవారం 7వ వార్డు ఆయన హుకుంపేట, 13వ వార్డు అశోక్నగర్, 9వ వార్డు మేధరవీది, 16వ వార్డు జమ్ము ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కోలగట్లకు అడుగడుగునా ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు నుదుట విజయ తిలకం దిద్ది విజయీభవ అంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే... ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నుంచి గల్లీ వరకు ఒకే ఒక్క పథకం అమలైందని అది దోచుకో.. దాచుకో పథకమని వాఖ్యానించారు. చంద్రబాబు పోలవరం, అమరావతి ప్రాజెక్టులలో లంచాలు తీసుకుంటే... కింద స్థాయి నాయకులు ఇళ్లిస్తే లంచం, పింఛను ఇస్తే లంచం అంటూ దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజుకు తెలియదా.. అని ప్రశ్నించారు. కర్ఫ్యూలో అశోక్ ఎక్కడ ఉన్నారో తాను అక్కడే ఉన్నానని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనను ప్రస్తావించి ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్న అశోక్గజపతిరాజు ఐదేళ్లలో తాను చేసిందేమి లేకనే మళ్లీ కర్ఫ్యూ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవటం సిగ్గు చేటన్నారు. ఐదేళ్ల కాలంలో మీరేం చేశారో చెప్పాలన్నారు. తాను ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 8 వేలు ఇళ్లు కట్టామని, పట్టణంలోని ప్రధాన రహదారులు విస్తరించామన్నారు. మరల అధికారమిస్తే అటువంటి కాలనీలు మరో నాలుగు కట్టించి ఇస్తామన్నారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రచారంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబు స్వార్థ రాజకీయాలకు ముగింపు
విజయనగరం మున్సిపాలిటీ: చంద్రబాబు స్వార్థ పూరిత రాజకీయాలకు ప్రజలు ముగింపు పలకాలని వైఎస్సార్ సీపీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. అయ్యన్నపేట, వసంతవిహార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోలగట్ల 11న జరిగే పోలింగ్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి సంక్షేమ పాలనకు నాంది పలకాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గంపెడు హామీలిచ్చి అమలు చేయలేకపోయారన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిపై మనకు హక్కున్నా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్కు ధారాదత్తం చేశారన్నారు. సొంత కేసుల కోసం భయపడిన వ్యక్తి మనకేం చేస్తారో ఆలోచించాలన్నారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు సహా అన్నింటా అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో దోచుకో.. దాచుకో పాలన సాగుతోందన్నారు. ఇళ్లు, పింఛన్ ఇవ్వాలంటే లంచం చెల్లించే పాలన సాగిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి పాలన అయితే మాట తప్పని.. మడమ తిప్పని నాయకునిగా నవరత్నాల ద్వారా సంక్షేమ పాలన అందిస్తారన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయం అవినీతి రహిత పాలన ధ్యేయమని వైఎస్సార్ సీపీ విజయనగరం నియోజవర్గ శాసనసభ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద మార్కెట్ పరిసరాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూరగాయల వర్తకులను అభ్యర్థించారు. నూకాలమ్మ తల్లికి పూజలు నూకాలమ్మ తల్లి ఆశీస్సులు విజయనగరం ప్రజలపై సదా ఉండాలని కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. తన ప్రచారంలో భాగంగా శుక్రవారం మంగలివీధి మార్కెట్లో శ్రీ నూకాలమ్మ వారిని కోలగట్ల దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు గురాన అయ్యలు, ఎడ్ల రాజేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రచారంలో భాగంగా మంగలివీధిలోని ప్రముఖ వ్యాపారి, సీనియర్ రాజకీయవేత్త దివంగత గురాన సాధురావు గృహానికి చేరుకోగానే ఆయన సతీమణి కోలగట్లకు దీవెనలు అందించారు. కార్యక్రమంలో పార్టీ వాణిజ్య విభాగం నాయకులు రవ్వ శ్రీనివాస్, కొత్త నరసింహం (ఊటీ), పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు శఠగోపం
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ/రూరల్: జాబు కావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో ప్రచారం చేసుకుని అధికారం వచ్చాక.. తన కొడుక్కి మంత్రి ఉద్యోగం ఇప్పించుకుని నిరుద్యోగ యువతను నడిరోడ్డున పడేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తారో? సంక్షేమ రాజ్యం అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. వార్డు ఇన్చార్జి ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 18వ వార్డు లంకవీధి, 19వ వార్డు జొన్నగుడ్డి ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా జొన్నగుడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు అయిదేళ్ల పాటు దోచుకున్న డబ్బుతో ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నిస్తారని, వాటికి లొంగకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంక్షేమ పాలనను గెలిపించుకోవాలని కోరారు. బాబును నమ్మి మోసపోవద్దు బాబు మోసపూరిత హామీ రుణమాఫీ పథకం వట్టి మాయేనని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ఘనుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మండల పరిధిలోని కోరుకొండపాలెం గ్రామంలో తన తండ్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్కు మద్దతుగా శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ 2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు వాటిని విస్మరించి మహిళలు, రైతులను మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు హామిని గాలికొదిలేశారన్నారు. జగన్మోహన్రెడ్డి వృద్ధులకు పింఛను రూ.2 వేలు చేస్తానంటే.. కాపీ కొట్టి రెండు నెలలుగా అందిస్తున్నాడన్నారు. మహిళలకు ఇస్తున్న పసుపు–కుంకుమ పచ్చి దగా అని మండిపడ్డారు. అయిదేళ్లుగా వడ్డీలేని రుణం ఇవ్వకుండా, వారు కట్టిన వడ్డీ డబ్బులే పసుపు– కుంకుమ కింద అందిస్తున్నాడన్నారు. చంద్రబాబు 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మరోసారి మోసపూరిత హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్నా మహిళలు ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 2004లో నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎంతో అభివద్ధి చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి, రాజన్న రాజ్యం వచ్చేందుకు మహిళలంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మహిళా నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించండి విజయనగరం నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే కోలగట్ల వీరభద్రస్వామికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన భార్య, మున్సిపల్ కౌన్సిలర్ కోలగట్ల వెంకటరమణి అభ్యర్థించారు. కోలగట్లకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం 2వ వార్డులోని కొత్తపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలన్నారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. -
అవినీతి రహిత పాలన
విజయనగరం రూరల్/మున్సిపాలిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని ఉత్తరాంధ్ర కన్వీనర్, పార్టీ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గొల్లలపేట పంచాయతీ పరిధిలోని చాకలిపేట, కోరాడపేట, కొత్తకాపుపేట గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నాలుగేళ్ల 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతో కాలక్షేపం చేసి ప్రజల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి వాటిని విస్మరించి ప్రజలను మోసగించారన్నారు. నలభయ్యేళ్ల అనుభవం ఉందని.. గద్దెనెక్కితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని.. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తానన్న హామీతో ప్రజలు గద్దెనెక్కిస్తే ప్రజలను, రాష్ట్రాన్ని చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారన్నారు. ఓటుకు నోటు కేసులో భయపడి 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమానికి తెర తీస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా చాకలిపేట, కోరాడపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సారిక ఈశ్వరరావు, సారిక శ్రీను, సారిక మహేష్, బుతల సంతోష్, సురేష్, సారిక కుమార్, సారిక బొబ్బి, కొండపల్లి సురేష్కుమార్, బోనిల హరిప్రసాద్, శ్రీకాంత్, వీర్రాజు, సాయి, మురళి తదితరులు కోలగట్ల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ నాయకత్వం కోసం నిరీక్షణ అయిదేళ్ల టీడీపీ హయాంలో గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం అయ్యన్నపేట ప్రాంతంలో పర్యటించారు. దివంగత వైఎస్సార్సీపీ నేత యడ్ల రమణమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విసుగు చెందిన ప్రజలు తమ జీవితాలకు ఒక భరోసాను, ఒక భద్రతను కల్పించే జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల రాజేష్, లంక సత్యం, మహంతి ప్రసాద్, నడుపూరు రమణ, జామి సూరిబాబు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఓటమి భయం
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం పట్టణంలోని ఆరవ వార్డులో సీనియర్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. కొత్తపేట శుద్ధ వీధి ప్రాంతానికి వారు చేరుకోగానే ప్రజలు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా జై జగన్, జై బెల్లాన, జై కోలగట్ల నినాదాలతో వీధులన్నీ హోరెత్తాయి. ఆరో వార్డు పరిధిలో సుద్ద వీధి, పులిగడ్డ వారి వీధి, పద్మశాలి వీధి, కొత్తపేట, కుమ్మరి వీధి, కూరెళ్ళ వారి వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని, ఐదేళ్ల పాలనపై విసిగి వేసారి పోయారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తమ ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఓటు వేసే ప్రజలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. తెలుగుదేశం పాలనలో లంచగొండితనం పేరుకుపోయిన ప్రస్తుత తరుణంలో రాజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డి రూపంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రచార కార్యక్రమంలో బెల్లాన, కోలగట్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
రాజరికమా.. జనహితమా.!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తరతరాల రాజరిక వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఒకవైపు.. గెలుపోటములతో ప్రమేయం లేకుండా ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరో వైపు ఈ ఎన్నికల్లో విజయనగరం నుంచి తలపడుతున్నారు. కేంద్రమంత్రిగా, ఎంపీగా ఉంటూ నియోజకవర్గ ప్రజలను, జిల్లా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని అశోక్గజపతిరాజు తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా తీసుకురావడం కోసం జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారు. చెమట విలువేంటో, పేదవాళ్ల బాధలెలా ఉంటాయో కూడా కనీస అవగాహన లేని తన కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేయించి నియోజకవర్గ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు. ఆది నుంచీ రాజరికమే.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 1953లో విజయనగరం నియోజకవర్గం రూపాంతరం చెందింది. మొదటి సారిగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడేళ్ల వ్యవధిలో 1955లో నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పీవీజీ రాజు, పి.అశోక్గజపతిరాజులు ఎక్కువసార్లు గెలుపొందినప్పటికీ.. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపించలేదు. దాని ఫలితమే ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పేరును ప్రతి ఎన్నికలకు ముందుగానే ఖరారు చేస్తుండగా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని నిన్నటి వరకూ ప్రకటించలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని తన కుమార్తె అధితి గజపతికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునేందుకు ఎంపీ అశోక్గజపతిరాజు ప్రయత్నించడం వల్ల ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోయారు. ఎట్టకేలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీకూతుళ్లే టికెట్లు సాధించుకున్నారు. అధితికీ అన్నీ ప్రతికూలతలే.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న అశోక్ గజపతిరాజు విజయనగరం నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్ మిల్లులు మూతపడి సుమారు 12 వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలున్నా విజయనగరంలో మాత్రం ఏర్పాటు కాలేదు. ఎన్నికలొస్తునాయని ఇటీవలే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 3 లక్షలకు పైగా జనాభా కలిగిన విజయనగరం పట్టణ వాసులకు తాగు నీటి సమస్య వేధిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం పట్టణ వాసులుకు 36 ఎంఎల్డీ నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తుండగా.. ఆ స్థాయిలో వనరులను పెంపొందించుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. 2015 జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... స్థానిక పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ అధితికి ప్రతికూలతలుగా మారనుండగా... ప్రత్యర్థి పార్టీకి ప్రచారాస్త్రాలు కానున్నాయి. కేవలం టీడీపీకి, తన తండ్రి అశోక్కు ఉన్న సంప్రదాయ ఓటింగ్పైనే అధితి ఆధారపడాల్సి వస్తోంది. చరిత్రను తిరగరాయగల కోలగట్ల.. పాదయాత్ర సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ అయిన కోలగట్ల వీరభద్రస్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నిజానికి పూసపాటి వంశీకుల కంచుకోటగా పేరొందిన విజయనగరం నియోజకవర్గంలో ఆ వంశానికి చెందిన వారే అత్యధిక సార్లు ఎన్నికల్లో గెలిచారు. అయితే రాజ వంశీకులపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2004లో చారిత్రాత్మక విజయాన్ని చేజిక్కించుకుని చరిత్రను తిరగరాశారు. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం అవుతుందనే ధీమాతో కోలగట్ల ఉన్నారు. అంతేకాకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా కోలగట్ల నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా అని పిలిస్తే పలుకుతున్నారు. ఆపదలో ఉన్నవారికి అత్యవసర వైద్యం, రక్తం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇవన్నీ ఆయనకు అనుకూలతలుగా మారనున్నాయి. మొత్తం ఓటర్లు 2,10,695 పురుషులు 1,03,669 స్త్రీలు 1,07,026 ఇతరులు 27 -
రేపు కోలగట్ల నామినేషన్
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయనగరం శాసనసభా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈ నెల 20న నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయంలో కోలగట్లతో పాటు మరో ఐదుగురు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎటువంటి ఆడంబర కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మాట తప్పని నాయకునికి మద్దతు పలకండి రాష్ట్రంలో ఐదేళ్లపాటు జరిగిన నయవంచనకు పాలనకు స్వస్తిపలికి... తప్పని, మడమ తిప్పని నాయకునిగా గుర్తింపు సాధించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బలపర్చిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి నియోజకవర్గ ప్రజలు మద్దతు పలకాలని తమన్నశెట్టి కోరారు. జగనన్న తోనే రాజన్న రాజ్యం సాధ్యమనీ, అటువంటి సంక్షేమ రాజ్యం కోసం అందరూ తమ ఓటును కోలగట్ల వీరభద్రస్వామికి వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే
విజయనగరం మున్సిపాలిటీ: మహిళలను అన్ని విధాలా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, రానున్న ఎన్నికల్లో మహిళలంతా తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె, మహిళా యువనేత కోలగట్ల శ్రావణి అన్నారు. ఆదివారం పట్టణంలోని 28 వార్డులో జరిగిన మహిళా సమావేశంలో ఆమె మాట్లాడారు. మోసపూరిత హామీలతో నయవంచనకు గురిచేసిన చంద్రబాబును ప్రతి మహిళా ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తానని 2014 ఎన్నికల్లో మహిళల చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన చంద్రదాబు తర్వాత రుణ మాఫీ చేయకపోవడంతో వడ్డీలు కట్టలేక మహిళలు ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో మళ్లీ మహిళలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ చేసి ఇప్పుడు అమలు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. 2019లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునే ఎందుకు చంద్రబాబు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మహిళలు చంద్రబాబు వలలో పడి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో బోనాల ధనలక్ష్మి, డెంకాడ పద్మావతి, రామలక్ష్మి, నాగమణి, బొట్ట శ్రావ్య, మారం జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఖజానాలో డబ్బు లేదంటూనే..
సాక్షి, విజయనగరం : ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ కేవలం ఎన్నికల బడ్జెట్టేనని, విజయనగరం జిల్లాకు వైద్య కళాశాల ఇస్తామన్న ప్రభుత్వం... ఈసారి కూడా మొండిచేయి చూపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులేదు అంటున్న చంద్రబాబు.. సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆర్థికాభివృద్ధి చెందామంటూనే బడ్జెట్లో లోటు ఎలా చూపిస్తారని నిలదీశారు. ఓట్లు దండుకోడానికే ఊహాజనిత నిధులు వస్తాయని బడ్జెట్లో ప్రకటించారని, బాబు హయాంలో సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని విమర్శించారు. వడ్డీరూపంలో వేలాది రూపాయిలు నష్టపోయిన డ్వాక్రా మహిళలు ఇప్పుడు ఇస్తున్న పదివేలతో సంతృప్తిగా లేరని అన్నారు. ఏ అధికార హోదా లేని, ప్రజాప్రతినిధులు కాని అధికార పార్టీ నాయకులు చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి చంద్రబాబు ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమల్లో ప్రజాప్రతినిధులే పాల్గొనేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘బాబును ఎవరూ నమ్మరు’
సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా విషయంలో దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన చందంగా అధికార పార్టీ తీరు ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్నటి దాకా హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలు ఎన్నటికీ మరువరని వ్యాఖ్యానించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా అని వైఎస్ జగన్ అసెంబ్లీలో నిలదీస్తే... మైకు కట్ చేయడం, ప్రత్యేక హోదాపై ప్రశ్నించినా పట్టించుకోకపోవడం వంటి విషయాలు అందరికీ గుర్తున్నాయన్నారు. ఎంపీల రాజీనామాలకు కలిసి రాకుండా ఇప్పుడు హోదా కోసమంటూ చంద్రబాబు తెగ బిల్డప్ ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన సీఎం అఖిల పక్షంలో ఏకాకిగా మిగిలిపోయారన్నారు. ఆయన కొనసాగిస్తూ... ‘రాజధాని కోసం ప్రజల సొమ్ముతో మూడు భవనాలు కట్టించి.. ప్రజలను బస్సులో తీసుకువెళ్లి చూపించి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఆర్ధిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నిరుద్యోగ భృతి పేరిట మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమన్నారు.. కానీ ఊరుకొకటి కూడా ఇవ్వలేదు. మూడు దపాలుగా మహిళలకు ఇచ్చిన ఎన్నికల తాయిలం రెండు వేల పెన్షన్ వైఎస్ జగన్ గతంలోనే ప్రకటించారు, దానిని బాబు అమలు చేసినా జగన్ సీఎం అయ్యాక మూడు వేలు చేస్తారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. మద్యపాన నిషేధం వంటి నవరత్నాలు అమలు చేస్తాం. ఎన్ని మిఠాయిలు ఇచ్చినా టీడీపీకి ప్రజలు ఓట్లేయరు. పిడికెడు మట్టి... చెంబుడు నీళ్లు కళ్లకు అద్దుకొని తీసుకున్నది మీరు కాదా బాబూ. నిజాలు రాస్తే సాక్షి ప్రతులను కాలుస్తున్నారు.... మీకు కూడా పత్రికలున్నాయని తెలుసుకోండి.. అవసరమైతే వాటిని తగలెడతాం’ అని హెచ్చరించారు. లోతైన విచారణ ఎన్ఐఏతోనే సాధ్యం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నం కుట్రలో అసలు సూత్రధారులు త్వరలోనే బయటకు వస్తారని వీర భద్రస్వామి అన్నారు. ఈ కేసులో లోతైన విచారణ ఎన్ఐఏతోనే సాధ్యమన్నారు. ఎన్ఐఎకు కేసు అప్పగిస్తే భుజాలు తడుముకోవడం, సీసీ కెమెరాలు కూడా నిలుపుదల చేయడం ప్రభుత్వ పెద్దల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు వైఎస్ జగన్ ఎటువంటి సంఘటనలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. -
‘బాబు యూటర్న్ తీసుకుని జగన్ బాటలోకి’
సాక్షి, విజయనగరం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని విజయవంతం చేసినవారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధన్యవాదాలు తెలిపారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు జగన్ పాదయాత్ర భరోసాని, ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు భయపడి దిక్కులేని పరిస్థితిలో చంద్రబాబు ఫించన్లను పెంచారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాకముందే విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందనీ, చంద్రబాబు యూటర్న్ తీసుకుని జగన్ బాటలోకి వచ్చారని తెలిపారు. బీజేపీ, టీడీపీలకు దోస్తీ చెడితే అది రాష్ట్రానికి ఆపాదించడం ఎంతవరకు సరిఅని ఆయన ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికీ, రాజకీయ అండకోసం చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. జగన్పై జరిగిన దాడి కేసును ఎన్ఐఏ నుంచి పక్కదారి పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఐఏ దర్యాప్తులో పూర్తి నిజనిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. -
ఏపీ అవినీతిలో కొట్టుమిట్టాడుతోంది: కోలగట్ల
-
మోదీ ఒడిలో కూర్చుని దీక్ష చేసి...
సాక్షి, విజయనగరం: ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడలేక వైఎస్ జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీతో తమకు సంబంధాలు అంటగట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఒడిలో కూర్చుని నవనిర్మాణ దీక్ష చేసి, కాంగ్రెస్ పార్టీతో కలిశాక చేస్తున్న ధర్మపోరాట దీక్ష చూసి ప్రజలు తలదించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోడానికి రాష్ట్ర ప్రజలందరినీ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాల పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రికి ఎన్నికల హామీలు, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీలు మారిన వారిని చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు ఏపీలో ఆ పిలుపు ఇవ్వగలరా అని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు హామీలపై ప్రజలు విసిగిపోయారు
-
జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతోంది
-
వైఎస్సార్సీపీ అధినేతను కలిసిన జిల్లా నాయకులు
విజయనగరం మున్సిపాలిటీ : వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో ప్రజా సంకల్ప పాదయాత్రను ముగించుకున్న జగన్మోహన్రెడ్డితో కాసేపే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులతో పాటు విజయనగరం నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, బూత్ కమిటీల పనితీరు, తదితర అంశాలపై చర్చిం చారు. రానున్న ఎన్నికలు పార్టీకి కీలకమని కష్టించి పని చేయాలని ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి సూచిం చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, నాయకులు మజ్జి అప్పారావు, కంది గణపతి, బోడసింగి నారాయణరావు, నారంశెట్టి సత్తిరాజు, బూర రామునాయుడు, ఒమ్మి రాము, బంటుపల్లి నారాయణప్పడు, బోద అప్పలకృష్ణ, కోరాడ వేణుబాబు, లెంక జగ్గునాయుడు, డాక్టర్ సత్యనారాయణ, భోగి అప్పలనాయుడు, కోరాడ నరసింగరావు, గోపాలరావు తదితరులు ఉన్నారు. -
ఈ నెల 11న యువగర్జన నిరసన ర్యాలీ
సాక్షి, విజయనగరం : నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 11న విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువగర్జన నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు ఆ పార్టీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో 600కి పైగా హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అవేమీ నెరవేర్చలేదని విమర్శించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. యువత ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భృతి కోసం ఇంతకాలం వేచిచూస్తే.. మంత్రి వర్గం 1000 రూపాయలు ఇవ్వాలని, వయోపరిమితి విధించాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇవ్వడంతో పాటు.. హామీ ఇచ్చిన నాటి నుంచే వర్తించేలా నిర్ణయం తీసకోవాలని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం కూడా టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తించేలా కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. మారిపోయారని నమ్మి ఓట్లేసిన ప్రజలను, ఉద్యోగులను తిరిగి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శించారు. ప్రత్యేక హోదా తేవాల్సిన టీడీపీ నాలుగేళ్లు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని.. ఇప్పుడు ఎన్నికల సమయం రావడంతో ధర్మ పోరాటం అనడం దారుణమన్నారు. -
‘చంద్రబాబు దోచేస్తారు.. లోకేష్ దాచేస్తారు’
సాక్షి, నెల్లూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకో-దాచుకో పథకం సాగుతోందని వైఎస్సార్సీసీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తండ్రి చంద్రబాబు దోచేస్తుంటే.. ఆయన తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ దాచేస్తున్నారని కోలగట్ల ఆరోపించారు. శనివారం నెల్లూరులో వైఎస్సార్సీసీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు గొప్ప నటుడని ఆయనతో మహా నటుడు సినిమా తీయాలన్నారు. రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బాత్రూం నుంచి రాహూల్ బెడ్రూంలోకి.. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాత్రూం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయధ్యక్షుడు రాహుల్ల్ గాంధీ బెడ్రూంలోకి వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు ఏపీ ప్రజలను మోసం చేసిన అనంతరం ఇప్పుడు హోదా రాగం అందుకుని బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
జగన్తోనే స్వర్ణయుగం
విజయనగరం మున్సిపాలిటీ : నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభధ్రస్వామి పేర్కొన్నారు. గురువారం విజయనగరం నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు కోలగట్లను కలిసి కృజ్ఞతలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా ముదినేపల్లి వద్ద నాయీ బ్రాహ్మణులు కలిసి తమ సమస్యలు జగన్మోహన్రెడ్డికి వివరిచగా స్పందించిన ప్రతిపక్ష నేత వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అభినందనీయమన్నారు. నాయీ బ్రాహ్మణులంతా వైఎస్ జగన్కు అండగా ఉంటారని కోలగట్లకు తెలిపారు. ఈ సందర్బంగా కోలగట్ల వారితో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని, అధికారంలోకి వచ్చిన వెంటనే నాయీ బ్రాహ్మణుల ఫెడరేషన్కి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారని తెలిపారు. ప్రతీ నెలా 250 యూనిట్ల వరకు సెలూన్ షాపునకు ఉచిత విద్యుత్ అందిస్తామని వివరించారు. కోలగట్లను కలిసిన వారిలో జిల్లా నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు రామేశరపు రామారావు, పట్టణ, మండల అధ్యక్షులు ఉప్పడి సత్యనారాయణ, దిమిలి పైడిరాజు, జిల్లా గౌరవాధ్యక్షుడు పండూరి సత్యం, జిల్లా కోశాధికారి రామేశ్వరపు అప్పారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణుక్య, రైతు విభాగం అధ్యక్షుడు రెడ్డి గురుమూర్తి తదితరులున్నారు. -
టీడీపీది అధర్మ దీక్ష
విజయనగరం మున్సిపాలిటీ : ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం చేపట్టినవి అధర్మ దీక్షలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరబద్రస్వామి విమర్శించారు. తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగలు పడిన ఆరు మాసాలకు కుక్కలు అరిచిన చందంగా... నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి హోదా కోసం మాట్లాడని బాబు.. నేడు దీక్షలు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని, హోదా కోసం జరిగే సభలకు వెళ్లేవారిని అరెస్టు చేసి జైల్లో పెడతామన్న చంద్రబాబు... ఇప్పుడు దీక్షల పేరుతో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మొసలి కన్నీరు కారుస్తూ చేస్తున్న కొంగ జపాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నాలుగేళ్లుగా బా«ధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హోదా ఆవశ్యకతను తెలియజెప్పేందుకు చేపట్టిన నిరసనలు, దీక్షలు, బంద్లను అణిచి వేతకు పాల్పడిన వ్యక్తి నేడు హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చార ఆంధ్రుల హక్కులు తాకట్టుపెట్టిన ఘనత బాబుదే... నేడు దీక్షలు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని, హోదా కోసం జరిగే సభలకు వెళ్లేవారిని అరెస్టు చేసి జైల్లో పెడతామన్న చంద్రబాబు... ఇప్పుడు దీక్షల పేరుతో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మొసలి కన్నీరు కారుస్తూ చేస్తున్న కొంగ జపాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నాలుగేళ్లుగా బా«ధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హోదా ఆవశ్యకతను తెలియజెప్పేందుకు చేపట్టిన నిరసనలు, దీక్షలు, బంద్లను అణిచి వేతకు పాల్పడిన వ్యక్తి నేడు హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్పై 10 ఏళ్ల పాటు హక్కులున్నా కేవలం ఓటుకు నోటు కేసుకు భయపడి హక్కులను తాకట్టుపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కోలగట్ల విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హమీని తన స్వార్వప్రయోజనాల కోసం విస్మరించారన్నారు. సమావేశంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీలంటూ ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ హోదా కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అధికార యంత్రాంగంతో ఏర్పాట్లు, దీక్షలకు అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులను తరలించుకునే దుస్థితికి దిగజారిపోయారన్నారు. జిల్లాలోని చీపురుపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా దీక్షలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ హోదా కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దీక్షలు, బంద్లు చేపడితే ఢిల్లీవెళ్లి చేయాలంటూ నీతిలు చెప్పిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో ఎలా దీక్షలు చేపడతారని ప్రశ్నించారు. ముందు పదవులకు రాజీనామా చేసి హోదా పోరులో పాల్గొనాలని డిమాండ్ చేశారు. హోదా కోసం మాట్లాడే హక్కు అశోక్కు లేదు.. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ పూసపాటి అశోక్గజపతిరాజుకు ప్రత్యేక హోదా కోసం మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సీటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో ఎటువంటి ప్రాభవం చూపలేకపోయరని విమర్శించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన మంత్రి సుజయ్కృష్ణరంగారావులు హోదా కోసం మాట్లాడం హాస్యాస్పందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సా«ధించి తీరుతామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కేవీ సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మారంబాల బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, షకీల్, తట్రాజు కృష్ణ, పట్నాన పైడిరాజు, సత్తరపు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏదీ చిత్తశుద్ధి?
విజయనగరం మున్సిపాలిటీ: వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కు హోదా సాధించడంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ఉత్తరాం ధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. మనస్ఫూర్తిగా వారు హోదా కోరుకుంటే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి... ఇంకా మిత్ర పక్షంగా కొనసాగడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మౌనం దాల్చి... జనంలో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. అసలు నాలుగేళ్లుగా హోదా తేలేని కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ నినాదంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక మూడులాంతర్ల జంక్షన్ వద్ద గల పైడితల్లమ్మవారి చదురుగుడి నుంచి మెయిన్రోడ్, గంటస్తంభం జంక్షన్, కోళ్లబజార్ మీదుగా కన్యకాపరమేశ్వరి ఆల యం వరకు సాగింది. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హోదా కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో పాటు హోదాకోసం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద గల జాతిపిత మహాత్మాగాంధీ, ఆంధ్రరాష్ట్ర సాధకులు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి పోరాటం చేయాలన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చటంలో విఫలమైన వారు ప్రజలను ఇంకా మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన అశోక్గజపతిరాజు ప్రజలిచ్చిన పదవికి రాజీనామా చేస్తే అదేదో త్యాగం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ, స్వాగత ఏర్పాట్లు చేస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన ఘనత మోదీ, బాబుకే దక్కుతుందన్నారు. నాలుగేళ్లు పదవులు అనుభవించి న వారు చివరి సంవత్సరంలో రాజీనామాలు చేయడం రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు వేసే ఎత్తుగడేనని, ప్రజలు విజ్ఞతతో గమనించాలని కోరారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని, మరల రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావడం తథ్యమని చెప్పారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానిది ప్రత్యేక హోదాపై మోసపూరిత పోరాటం కాగా... వైఎస్సార్సీపీది చిత్తశుద్ధిగల పోరాటమని అన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో పదవులు, అధికారాలు అనుభవించటమే గాకుండా వాటిని అడ్డుబెట్టుకుని అవినీతి అక్రమాలతో ప్రజధానాన్ని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటూ వాటిని కుటిల రాజకీయాలతో వాటిని అడ్డుకున్నారనీ, ఇప్పుడు నాటకాలాడుతున్నారని పేర్కొన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో... నేడు హోదా సాధనలోనూ టీడీపీది ద్వంద్వ వైఖరేనని వ్యాఖ్యానించారు. పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు పోలీసులతో రాయబేరాలు నడిపే దుస్థితికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అసమర్థులని తెలుసుకున్న చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ పోలీసులతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యా«ధారాలనూ త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు. ఈవిషయంలో పోలీసులు దూరంగా ఉండాలని హితవుపలికారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, అది జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలక మండలిసభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్బాబు, డీసీసీబీ అధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, జిల్లా పార్టీ కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయు డు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్.వి.వి.రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తి, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, బొద్దాన అప్పారావు, కనకల ప్రసాద్, కంటుభుక్త తవిటిరాజు, పిళ్లా విజయ్కుమార్, జి.వి.రంగారావు, అల్లు చాణక్య, బోడసింగి ఈశ్వరరావు, తాట్రాజు కృష్ణ్ణ, పట్నాన పైడిరాజు, సత్తరపు శంకరరావు, రెడ్డి గురుమూర్తి, బాలబ్రహ్మరెడ్డి, గాదం మురళి తదితరులు పాల్గొన్నారు. హోదాకోసం ఎందాకైనా: బెల్లాన పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్యాకేజీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటమే వైఎస్సార్సీపీ ధ్యేయమని... అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమనీ స్పష్టం చేశారు. -
చంద్రబాబువి రాజకీయ డ్రామాలు
విజయనగరం మున్సిపాలిటీ: విభజనతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద రాజకీయ డ్రామాకు తెరలేపారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజలు చైతన్యవంతులై టీడీపీని ఛీ కొడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రులతో రాజీనామా డ్రామా మొదలుపెట్టారన్నారు. గురువారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుని ప్యాకేజీల పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేసిన చంద్రబాబునాయుడు నేడు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తీసుకువచ్చిన సమయంలో హోదా కోసం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్లో ఉన్న జిల్లాకు చెందిన పూసపాటి అశోక్గజపతిరాజు హోదా కోసం నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, విభజనతో అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అన్నారు. హోదావస్తే రాయితీలు వర్తించి పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధిచెందుతుందని చెప్పారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యువభేరిల పేరిట 13 జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తే..ఆ కార్యక్రమాలకు హాజరైన విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడ్డ ముఖ్యమంత్రి నేడు హోదా కావాలంటూ మాట్లాడటం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తన వద్ద ఆఖరి బంతి ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచితే.... హోదా సాధన విషయంలో చంద్రబాబు అదే «ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములునాయుడు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. బంగారునాయు డు, మండల పార్టీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, పతివాడ అప్పలనాయుడు, కె. తవిటిరాజు, కనకల ప్రసాద్, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్, పట్నాన పైడిరాజు భోగి రమణ, దాట్ల భాస్కరరాజు, అల్లు చాణుక్య, జీవీ రంగారావు, రెడ్డి గురుమూర్తి, తాట్రాజు కృష్ణ, సత్తరపు శంకరరావు, బోడసింగి ఈశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
'భుజాలు తడుముకున్న చంద్రబాబు'
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించగానే సీఎం చంద్రబాబు భుజాలు తడుముకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులను చిన్న చూపు చూసింది చంద్రబాబేనని విమర్శించారు. నంద్యాలలో అభివృద్ధి పేరుతో వ్యాపారుల షాపులను అంత్యంత దయనీయంగా ధ్వంసం చేశారని.. కాకినాడలో కూడా 45 దుఖాణాలు ధ్వంసం చేసి కేవలం 24 షాపులకు టీడీఎస్ ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మూడున్నర ఏళ్లుగా కాకినాడకు ఏమీ చేయలేని చంద్రబాబు.. రానున్న ఏడాదిన్నరలో ఏమి చేస్తారో ఓటర్లు ఆలోచించాలన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ధనబలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. బాబు పతనం కాకినాడ నుంచే ప్రారంభం టీడీపీ, చంద్రబాబు నాయుడు పతనం కాకినాడ నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలందరూ వైఎస్ జగన్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కాకినాడలో తిష్ట వేశారని చెప్పారు. సీఎం రెండు రోజులు కాకినాడలో ఉండటానికి వస్తున్నారంటే టీడీపీ ఎంత అభద్రతాభావంతో ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. -
'భుజాలు తడుముకున్న చంద్రబాబు'
-
'జగన్ పర్యటనతో సంతోషంగా ఉన్నారు'
నంద్యాల: వైఎస్ జగన్ పర్యటనతో ఆర్యవైశ్యులు సంతోషంగా ఉన్నారని, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పడం హర్షనీయమని వైఎస్సార్ సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నంద్యాల పట్టణంలో రోడ్ల వెడల్పు కారణంగా ఆస్తులు కోల్పోయిన వారికి జగన్ న్యాయం చేస్తారని హామీయిచ్చారు. కేశవరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులన ఆదుకుంటారని హామీయిచ్చారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడే కాబట్టి కేశవరెడ్డి జోలికి సీఎం చంద్రబాబు పోవడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో జగన్ అందరికీ న్యాయం చేస్తారన్నారు. శిల్పామోహన్ రెడ్డిని గెలిపిస్తే నంద్యాల జిల్లా కేంద్రం అవుతుందని, మోడల్ టౌన్గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యనిషేధం అమలు తీసుకువస్తామని జగన్ ప్రకటించగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తామంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నోటి వెంట మాట వస్తేనే చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు జిమ్మిక్కులు పనిచేయవన్నారు. చంద్రబాబు తన మూడేళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. నవరత్నాల హామీలు ప్రకటించగానే జగన్పై టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
'వారిని అనాగరికంగా మంత్రులను చేశారు'
నంద్యాల: చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చిరువ్యాపారుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులతో వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ఇప్పుడే నంద్యాల అభివృద్ధి గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఇంతకాలం నంద్యాల అభివృద్ధి ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. వర్తకులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య నేత విజయ్కుమార్పై భూమా నాగిరెడ్డి దాడి చేసినా చంద్రబాబు కనీసం స్పందించలేదని గుర్తుచేశారు. అన్నికులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఆర్యవైశ్యులకు మాత్రం మొండిచేయి చూపారని ఆరోపించారు. ఆర్యవైశ్యులకు న్యాయం జరగాలన్నా, రౌడీయిజానికి అడ్డుకట్ట పడాలన్నా నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్రెడ్డిని గెలిపించాలని కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. వైఎస్సార్ సీపీ నుంచి అన్యాయంగా 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని, వారిలో నలుగురిని అనాగరికంగా మంత్రులను చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. -
'వారిని అనాగరికంగా మంత్రులను చేశారు'
-
రాష్ట్రంలో ‘420’ పాలన
మెరకముడిదాం: రాష్ట్రంలో ‘420’ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. మండలంలోని చినబంటుపల్లిలో 24 పంచాయతీలకు సంబంధించి బూత్ లెవెల్ కమిటీ సభ్యులకు బుధవారం శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు దోచుకో.. దాచుకో.. అన్నరీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ప్లీనరీలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారన్నారు. ఈ పథకాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ కమిటీ సభ్యులపై ఉందన్నారు. పార్టీ విజయనగరం జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అటువంటి పాలన మళ్లీ రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడుతున్న నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డేనని స్పష్టం చేశారు. బూత్ లెవిల్ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సూచనల మేర కు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కార్యకర్తలందరూ టీడీపీ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు( చిన్నశ్రీను) మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతను కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసినప్పుడే 2019లో విజయం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రివర్యులు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, అంబల్ల శ్రీరాములునాయుడు, నారాయణమూర్తిరాజు, తాడ్డె వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, కోట్ల మోతీలాల్నాయుడు, బూర్లె నరేష్కుమార్, కర్రోతు నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కేఎస్ఆర్కే ప్రసాద్, సర్పంచ్లు బాలి బంగారునాయుడు, మండల సత్యనారాయణ, పిన్నింటి సుగుణాకరరావు, ఎంపీటీసీ సభ్యులు పప్పల కృష్ణమూర్తి, శివాజీరాజు, తాడేల ఉమామహేశ్వరరావు, చీపురుపల్లి నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
మాపై సుజయకృష్ణా రంగారావు విమర్శలా?
విజయనగరం: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జిల్లాలో తోటపల్లి, పెద్దగెడ్డ సహా ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బొబ్బిలిలో మూతపడ్డ పరిశ్రమలనే సుజయకృష్ణ రంగారావు తెరిపించలేకపోయారన్నారు. పైగా వైఎస్ఆర్ సీపీపై విమర్శలు చేస్తున్నారని కోలగట్ల ధ్వజమెత్తారు. అంతేకాకుండా విజయనగరంలో జూనియర్ కాలేజీని తీసుకు వచ్చింది కూడా తామేనని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన భూములను కాపాడుకునేందుకే సుజయకృష్ణా రంగారావు పార్టీ మారారని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు ఇవ్వలేక కోట నుంచి పారిపోయిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు. తమపై విమర్శలు చేసే అర్హత సుజయకృష్ణా రంగారావుకు లేదని అన్నారు. -
టీడీపీ అవినీతిని ఎండగడతాం
విజయనగరం : ప్రజాబలంతో అధికార టీడీపీ అవినీతి, అనైతిక చర్యలు ఎండగట్టాలని పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, శాసన మండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పూల్బాగ్లోని జగన్నాథ కల్యాణ మండపంలో పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్లతో కలిసి మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనంతో అధికార టీడీపీ విజయవాడలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తే, కార్యకర్తల బలంతో అందుకు ధీటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర ఫ్లీనరీకి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలందరమూ కలిసి తరలి వెళ్దామన్నారు. ఈ నెల 24న భారీ స్థాయిలో నిర్వహించనున్న జిల్లా ప్లీనరీ సమావేశానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ప్రతిపనికి రేటును నిర్ణయించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరుకాలేదన్నారు. పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ నేతలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, నీరు–చెట్టు కార్యక్రమం నిధులు దోచుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ప్లీనరీకి సంబంధించి స్థల పరిశీలన, పార్టీ బలోపేతం చేసే అంశంపై చర్చించామన్నారు. బూత్ కమిటీలు, మండల స్థాయి కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. జిల్లా ప్లీనరీలో ప్రధాన సమస్యలపై పలు తీర్మానాలు చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో 9 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలలో పార్టీ విజయఢంకా మోగించేలా పార్టీ శ్రేణులను మరింత ఉత్తేజపరుస్తామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్.కోట నియోజకవర్గసమన్వయకర్త నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం
♦ సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నాయకుల సవాల్ ♦ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య ♦ అవినీతి సొమ్ముతో దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శ గజపతినగరం రూరల్ : అవినీతి, అక్రమాలతో ప్రజల పొట్ట కొట్టి కూడబెట్టుకున్న డబ్బుతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తూ సంబరాలు చేసుకోవడం ఇక ఎంతో కాలం కొనసాగదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని భూ స్థాపితం చేస్తారని సాలూరు ఎమ్మెల్యే పీడీక రాజన్నదొర వ్యాఖ్యానించారు. సోమవారం గజపతినగరంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ప్లీనరీలో చేసిన తీర్మానాలను, పార్టీ చేయబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో దొరికి పోయి, అక్రమంగా డబ్బులు సంపాదించి, కొడుకును దొడ్డిదారిన మంత్రిని చేసిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. బాబు తాను చేసిన అభివృద్ధిపై నమ్మకముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. టీడీపీ వారు నారా లోకేష్కు, వైఎస్ జగన్కు పోలిక పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబుకు వెన్ను పోటు రాజకీయాలు తెలిసినందునే పార్టీ ఫిరాయింపులకు ప్రా ధాన్యమిచ్చి ఇతర పార్టీలోనుంచి వచ్చిన వారిని మంత్రిని చేశారని విమర్శించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన మాట్లాడుతూ తోటపల్లి కెనాల్కు రూ.700 కోట్లు విడుదల చేసి వైఎస్ రాజశేఖరెడ్డి రైతులకు ఆసరాగా నిలిస్తే టీడీపీ పది శాతం నిధులు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి ఇళ్లు, ఆరోగ్య శ్రీ లాంటి సంక్షేమ పథకాలు భరోసా నిస్తే ఇప్పుడు ఆ పథకాలు ఎక్కడ కనిపించడం లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ రాజధాని పేరుతో విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా విచారణలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష నేత పరామర్శకు వెళ్తే కేసులు పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. -
వైఎస్ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
-
వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వినర్గా కోలగట్ల
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులయిన కోలగట్ల వీరభద్రస్వామిని ఉత్తర ఆంధ్రా జిల్లాల(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు) కన్వినర్గా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామయం జరిగినట్లు హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఊహాజనిత వార్తలతో తప్పుడు సంకేతాలు
-
ఊహాజనిత వార్తలతో తప్పుడు సంకేతాలు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టీకరణ విజయనగరం మున్సిపాలిటీ: తాను వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజుతోపాటు కలసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా వార్తలపై ఎటువంటి నిర్ధారణ లేకుండా మీడియా కథనాలు ప్రచురించటం బాధాకరమన్నారు. తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేయట్లేదని, అదే సమయంలో టీడీపీలో చేరేదీ లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి వార్తలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటూ.. ఊహాజనిత వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ విపక్ష నేతలను, ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిజం తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. -
'దాచుకోవడం...దోచుకోవడమే బాబు లక్ష్యం'
విజయనగరం: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దాచుకోవడం దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. పార్టీ నేత ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ... నేడు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేత బొత్స సత్యనారాయణతో కలిసి త్వరలో విజయనగరంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. -
రెండేళ్ల బాబు పాలన ఘోరం
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టినప్పటినుంచి రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతోందని, రెండేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వాఖ్యానిం చారు. ఇవేమీ తాము చెప్పడంలేదని, తాము గడచిన పది రోజులుగా చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో జనమే చెబుతున్నారని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా, ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా కేవలం ప్రజల కష్టాలు తెలుసుకునేం దుకు బాధ్యతగల ప్రతిపక్షనేతగా జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తలపెట్టారని చెప్పారు. జిల్లాలో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న తమ వద్దకు వచ్చి సమస్యలు మొరపెట్టుకోవటం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్నరాజ్యంకోసం జగన్ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గమని తెలిపారు. నిరంతర ప్రజాహిత కార్యక్రమాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే గాకుండా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాజన్నరాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో నెలకొందన్నారు. పార్టీ జెండా తో గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నట్లు కోలగట్ల తెలిపారు. తాము చేసిన తప్పుకు భవిష్యత్తు ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవన్న భయంతో ఉన్నారని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారినా అక్కడ గడపగడపకు వైఎస్సార్ విజయవంతంగా జరుగుతోందని, రానున్న రెండునెలల్లో ఆ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామనీ తెలిపా రు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ టీడీపీ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన గడప గడపకు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. పార్టీ నాయకులు 100 ప్రశ్నల ప్రజాబ్యాలెట్తో ప్రజల్లోకి వెళుతుంటే వారు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి బెల్లాన చంద్రశేఖర్మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు ఇటుకలు.. రెం డు ఇసుక బస్తాలతో శంకుస్థాపన చేసి పదవి కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం అనంతర ప్రభుత్వాలు పనులు పూర్తి చేస్తే అదేదో తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. సమావేశంలో ఎస్కోట నియోజకవర్గ ఇన్ఛార్జి నెక్కల నాయుడుబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్లు పాల్గొన్నారు. -
8 నుంచి ‘గడపగడపకూ వైఎస్ఆర్సీపీ’
విజయనగరం: వచ్చే నెల 8వ తేదీ నుంచి చేపట్టబోయే ‘గడపగడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమానికి నియోజకవర్గం ఇన్చార్జీలు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. బుధవారం ఆయన విజయనగరంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. ప్రజల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందని వీరభద్రస్వామి ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. -
'అక్కడ ఉపయోగం లేదంటారు... ఇక్కడ కావాలంటారు'
విజయనగరం: ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభ్రదస్వామి ఆరోపించారు. ఆదివారం విజయనగరంలో కోలగట్ల వీరభ్రదస్వామి మాట్లాడుతూ.... ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదంటారని... అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రత్యేక హోదా కావాలంటారని గుర్తు చేశారు. ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తారని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. హోదాపై ఇంత కాలంల కాంగ్రెస్ పార్టీని నిందించి కాలం వెళ్లదీసారని మండిపడ్డారు. బీజేపీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని చంద్రబాబును కోలగట్ల ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే... బాబు విదేశీ పర్యటనలా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'ఎమ్మెల్యేలను కొనగలరేమోగానీ.. ప్రజలను కాదు'
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లోని జరుగుతున్న రాజకీయ కుయుక్తులను రాష్ట్రపతికి వివరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలసి ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి తెలియజేస్తామన్నారు. గురువారం విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 23న సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసనలతోపాటు జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలను కోలగట్ల ప్రశ్నించారు.తాను, తన కొడుకు శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న దురద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దోచుకున్న నగదుతో ఎమ్మెల్యేలను కొనగలరేమోగాని...ప్రజలను మాత్రం కొనలేరన్నారు. తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు పార్టీని వీడితే గగ్గోలు పెడుతున్న మీరు... ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబును కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. -
'తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయి'
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఆదివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ.... సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో చేసిన తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో బెల్టుషాపులు బాగా పెరిగాయని విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమైందని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే యత్నం చేశారన్నారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. -
'రాష్ట్రంలో దోచుకో.... దాచుకో పాలన సాగుతోంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో దోచుకో... దాచుకో పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఆదివారం హైదరాబాద్లో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... అమరావతి భూములు అమ్ముకోవడానికి విదేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నాయకులుపై మండిపడ్డారు. ఆ అక్రమ ఆస్తులు దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై ఎమ్మెల్సీ కొల్లగట్ల నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబుతోపాటు ఆపార్టీ ఎమ్మెల్యేలపై కోలగట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు. -
'దోచుకో-దాచుకో పథకం అమలు చేస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దోచుకో- దాచుకో పథకాన్ని అమలుచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... పెదబాబు దోస్తుంటే..చినబాబు దాస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు టీడీపీ పెద్దలే ఇసుకను దోచుకున్నారని...ఇక ఉచిత ఇసుకతో కార్యకర్తలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఏపీకి బడ్జెట్లో అన్యాయం జరిగినా టీడీపీ నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని కోలగట్ల అన్నారు. -
'ఎన్నికలను ఎదుర్కొనే సత్తా టీడీపీకు లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ... దోచుకో, దాచుకోమన్న రీతిలో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను ఎదుర్కునే సత్తా టీడీపీకి లేదని కోలగట్ల ఎద్దేవా చేశారు. న్యాయపరమైన ఇబ్బందులను తొలగించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
వైఎస్ఆర్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
విజయనగరం మున్సిపాలిటీ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరపాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు సర్వం సిద్ధం చేశారు. ఇందులోభాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు ఆధ్వర్యంలో విజయనగరం లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన సామూహిక రక్తదాన శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల ప్రారంభించనున్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం ఎదుట గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. బొబ్బిలిలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు, బేబీనాయనలు గొల్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటుతారు. రంగరాయపురంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తారు. విజయనగరం పార్లమెంటరీ నియెజకవర్గ ఇన్చార్జి బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చీపురుపల్లి టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో మెగా వైద్యశిబిరం, రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. నెల్లిమర్ల మండల పార్టీ అధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ నేతృత్వంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చే.యనున్నారు. జరజాపుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నారు. పార్వతీపురంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి వెంకటేష్ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లర్యాలీ నిర్వహించిన అనంతరం ఏరియా ఆస్పత్రిలో 200 మంది రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నారు. -
వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసిన ప్రభుత్వం
విజయనగరం మున్సిపాలిటీ: ఏడాదిగా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చటమే ధ్యేయంగా పనిచేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపుతున్నందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు. తన కోసం ఎదురుచూస్తున్న కుమార్తెను పోలీసులు చిన్నబుచ్చుతూ బయటికి పంపించటంపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్కు తరలించారన్నారు. అభివృద్ధి, పెట్టుబడుల పేరిట ప్రతిసారి సింగపూర్, జపాన్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.5వేల 500 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ చెప్పుకొంటున్న టీడీపీ ప్రభుత్వం బాధ్యలపై చర్యకు ఎందుకు తాత్సారం చేస్తోందన్నారు. నీరు చెట్టు కార్యక్రమంతో సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన అయిదు హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.